
వారు క్షేమం!
ఎవరెస్ట్ పర్వతారోహణకు వెళ్లిన పశ్చిమగోదావరి జిల్లా వాసులు క్షేమంగా ఉన్నారు.
ఏలూరు: ఎవరెస్ట్ పర్వతారోహణకు వెళ్లిన పశ్చిమగోదావరి జిల్లా వాసులు క్షేమంగా ఉన్నారు. ఏఓవైఎమ్ స్కూల్ నిర్వాహకుడు టోనీ బ్రెయిన్ శుక్లా (అమెరికా), పదో తరగతి విద్యార్థి జయమంగళ జనార్థన్లు ఈ నెల 13న నేపాల్ పర్యటనకు వెళ్లారు. 8 ఏళ్ల క్రితం టోనీ బ్రెయిన్ యలమంచిలి మండలం కాంభొట్ల గ్రామంలో ఏఓవైఎమ్ సొసైటీని స్థాపించారు. ఈ సొసైటీ నుంచే ఎవరెస్ట్ అధిరోహించేందుకు వారు వెళ్లారు.
ఈ నెల 26 వరకు వాళ్ల ఫోన్లు పనిచేశాయి. ఆ తరువాత ఎలాంటి సమాచారం అందకపోవడంతో సొసైటీ సభ్యులు కంగారుపడ్డారు. తాము క్షేమంగా ఉన్నట్లు టోనీ, జనార్దన్లు స్కూల్ సిబ్బందికి తెలిపారు.