పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు నుంచి ఎవరెస్ట్ శిఖరం అధిరోహించేందుకు ఈ నెల 13న వెళ్లిన ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు.
ఏలూరు(పశ్చిమగోదావరి): పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు నుంచి ఎవరెస్ట్ శిఖరం అధిరోహించేందుకు ఈ నెల 13న వెళ్లిన ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. ఈ విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. గల్లంతైన వారు టోనీ బ్రెయిన్ శుక్లా (అమెరికా), పదో తరగతి విద్యార్థి జయమంగళ జనార్థన్లుగా గుర్తించారు.
8 ఏళ్ల క్రితం టోనీ బ్రెయిన్ యలమంచిలి మండలం కాంభొట్ల గ్రామంలో ఏఓవైఎమ్ సొసైటీని స్థాపించారు. ఈ సొసైటీ నుంచే ఎవరెస్ట్ అధిరోహించేందుకు వెళ్లారు. ఈ నెల 26 వరకు వాళ్ల ఫోన్లు పనిచేశాయి. ఆ తరువాత ఎలాంటి సమాచారం అందకుండా పోయింది. అయితే నేపాల్ భూకంపం తర్వాత ప్రమాదం జరిగి ఉండొచ్చనే సొసైటీ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.