కలకలం రేపిన జంట హత్యలు | Twin murders in chittor | Sakshi
Sakshi News home page

కలకలం రేపిన జంట హత్యలు

Published Fri, Sep 29 2017 1:12 PM | Last Updated on Fri, Sep 29 2017 1:26 PM

 Twin murders in chittor

కురబలకోట: చిత్తూరు జిల్లా కురుబలకోట మండలం మట్లివారిపల్లెలో జరిగిన జంట హత్యలు కలకలం రేపాయి. స్థానికంగా ఉన్న మామిడితోటలో శుక్రవారం ఇద్దరిని గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో అతి దారుణంగా నరికి చంపారు. మృతులు తంబళ్లపల్లె మండలం ఎ‍ర్రమద్దివారిపల్లె గ్రామానికి చెందిన ఎర్రోళ్ల జగదీశ్వర్‌ రెడ్డి(29), మదనపల్లి మండలం జంగాలపల్లికి చెందిన ప్రదీప్‌(28) గా గుర్తించారు.

వీరు సుమారు 8 మంది హత్య కేసులో నిందితులుగా ఉన్నారు. మదనపల్లికి చెందిన పూల చలపతి, దండు రవి, సాంబ శివ, రవి అనే నలుగురి హత్య కేసులో వీరు ప్రధాన నిందితులు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement