కిలిమంజారో.. బాలిక భళామంజారో! | visakha girl jahnavi gets record after kilimanjaro reched | Sakshi
Sakshi News home page

కిలిమంజారో.. బాలిక భళామంజారో!

Published Sun, Oct 5 2014 1:18 AM | Last Updated on Sat, Sep 2 2017 2:20 PM

కిలిమంజారో.. బాలిక భళామంజారో!

కిలిమంజారో.. బాలిక భళామంజారో!

సాక్షి, విశాఖపట్నం: విశాఖ జిల్లా వడ్డాదికి చెందిన బాలిక జాహ్నవి(12) మరో కీర్తి శిఖరం అధిరోహించింది. ఆఫ్రికాలో అత్యంత ఎత్తైన శిఖరమైన కిలిమంజారోపై జాతీయ పతాకాన్ని రెపరెపలాడించింది. సముద్ర మట్టానికి 5,895 మీటర్ల (19,341 అడుగులు) ఎత్తు ఉన్న ఈ శిఖరాన్ని అధిరోహించి రికార్డుకెక్కింది. ప్రపంచంలో మరో పర్వతానికి ఆనుకోకుండా ఉన్న శిఖరాల్లో ఇదే అత్యంత ఎత్తయినది. భారతీయుల్లో ఈ శిఖరం ఎక్కిన అత్యంత పిన్న వయస్కురాలు ఈమేనని చెబుతున్నారు. గాంధీ జయంతి రోజునే ఈ శిఖరాన్ని అధిరోహించి.. అక్కడ మహాత్మా గాంధీ ఫొటోను ప్రదర్శిస్తూ శాంతిసామరస్యాల ఆవశ్యకత సందేశాన్ని ఆమె ప్రపంచానికి చాటింది. అత్యంత ప్రమాదకరమైన మాకెమె మార్గంలోనే కిలిమంజారోను అధిరోహించి స్థానిక అధికారులతో ఔరా అనిపించుకుంది జాహ్నవి.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement