
కల్లెక్టరెట్లో మహిళ రైతు కలకలం
తన భూమిని మరిది, ఆయన కుమారులు కలిసి ఆక్రమించుకున్నారు. ఈ విషయాన్ని ఆ మహిళ తహశీల్దార్, ఎస్ఐకి పలుమార్లు చెప్పినా పట్టించుకోలేదు. అదికారుల చూసి చూడనట్టుగా వ్యవహరించారు. దీంతో ఆమె విసుగు చెంది కల్లెక్టరెట్లో సోమవారం పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడానికి యత్నించింది. చుట్టు పక్కల వారు, సిబ్బంది అందరూ కలిసి ఆ మహిళ రైతును అడ్డుకున్నారు. పోలీసులు, సిబ్బంది కలిసి జయమ్మను ఇన్చార్జి కలెక్టర్ టి.కె.రమామణి వద్దకు తీసుకెళ్లి అర్జీ ఇప్పించారు. సమస్య తెలుసుకున్న ఇన్చార్జి కల్లెక్టర్ ఆమె సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.