కల్లెక్టరెట్‌లో మహిళ రైతు కలకలం | Woman farmer commits suicide in anantapur collectorate | Sakshi
Sakshi News home page

కల్లెక్టరెట్‌లో మహిళ రైతు కలకలం

Published Mon, May 8 2017 6:57 PM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

కల్లెక్టరెట్‌లో మహిళ రైతు కలకలం - Sakshi

కల్లెక్టరెట్‌లో మహిళ రైతు కలకలం

అనంతపురం అర్భన్‌:  సమస్యను పరిష్కారించాలని ఒక మహిళ అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయింది. ఎంత చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. తన భూవివాదం పరిష్కారం కాలేదని ఆ మహిళ రైతు అనంతపురం కలెక్టరెట్‌లో ఆత్మహత్యకు యత్నించటం కలకలం రేపింది. కైరేపు గ్రామానికి చెందిన జయమ్మకు భూ పంపిణి కింద 339/6 సర్వే నంబరులో 2.90 ఎకరాల భూమికి 2005లోనే అధికారులు పట్టా ఇచ్చారు. భర్త చనిపోయిన తరువాత ఈ భూమికి జయమ్మ పేరు మీద పాసు పుస్తకం ఇచ్చారు.

తన భూమిని మరిది, ఆయన కుమారులు కలిసి  ఆక్రమించుకున్నారు. ఈ విషయాన్ని ఆ మహిళ తహశీల్దార్‌, ఎస్‌ఐకి పలుమార్లు చెప్పినా పట్టించుకోలేదు. అదికారుల చూసి చూడనట్టుగా వ్యవహరించారు. దీంతో ఆమె విసుగు చెంది కల్లెక్టరెట్‌లో సోమవారం పెట్రోల్‌ పోసుకుని   నిప్పంటించుకోవడానికి యత్నించింది. చుట్టు పక్కల వారు, సిబ్బంది అందరూ కలిసి  ఆ మహిళ రైతును అడ్డుకున్నారు.  పోలీసులు, సిబ్బంది కలిసి జయమ్మను ఇన్‌చార్జి కలెక్టర్‌ టి.కె.రమామణి వద్దకు తీసుకెళ్లి అర్జీ ఇప్పించారు. సమస్య తెలుసుకున్న ఇన్‌చార్జి కల్లెక్టర్‌ ఆమె సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement