
జక్కంపూడి రాజాకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
రాజమండ్రి : మాజీ మంత్రి, దివంగత నేత జక్కంపూడి రామ్మోహనరావు, పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మిల కుమారుడు, పార్టీ కార్యదర్శి రాజా వివాహ వేడుకకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరిన ఆయన మధురపూడి విమానాశ్రయం చేరుకున్న అక్కడ నుంచి రోడ్డు మార్గంలో రాజమండ్రి చేరుకున్నారు. జక్కంపూడి నివాసంలో నూతన వరుడు రాజను ఆశీర్వదింది శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం వైఎస్ జగన్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బయల్దేరి వెళ్లారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కుమారుడు ప్రవీణ్ రెడ్డి వివాహానికి వైఎస్ జగన్ హాజరు కానున్నారు.