wishes
-
ముస్లిం సోదరులకు వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: ముస్లిం సోదరులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ ఆయన శుభాకాంక్షలు చెప్పారు. ‘‘ఉపవాస దీక్షలు చేస్తున్న అందరికీ అల్లా దీవెనలు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు. ఉపవాస దీక్షలు చేస్తున్న అందరికీ అల్లా దీవెనలు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను.— YS Jagan Mohan Reddy (@ysjagan) March 1, 2025 -
అనుపమ బర్త్ డే.. పరదా టీమ్ స్పెషల్ విషెస్
అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) నటిస్తోన్న తాజా చిత్రం పరదా. ఈ చిత్రానికి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఆనంద మీడియా బ్యానర్లో విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.(ఇది చదవండి: నా పదేళ్ల కెరీర్లో సుబ్బు నా ఫేవరెట్ : అనుపమా పరమేశ్వరన్)ఇవాళ అనుపమ బర్త్ డే కావడంతో ఓ వీడియోను విడుదల చేశారు. దాదాపు 20 సెకన్లపాటు ఉన్న మూవీ క్లిప్ను షేర్ చేస్తూ అనుపమకు పుట్టినరోజ శుభాకాంక్షలు తెలిపారు. భిన్నమైన సోషియో ఫాంటసీ కథగా రానున్న ఈ చిత్రంలో అనుపమ సుబ్బు అనే పాత్రలో అభిమానులను అలరించనున్నారు. ఈ చిత్రంలో దర్శన రాజేంద్రన్, సంగీత కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
ప్రియుడికి బర్త్ డే విషెస్ చెప్పిన మంగళవారం బ్యూటీ పాయల్ రాజ్పుత్.. ఫోటోలు
-
'ఆమె జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం'.. ఉపాసన స్పెషల్ విషెస్
మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవికి మెగా కోడలు శుభాకాంక్షలు తెలిపింది. ఇవాళ ఆమె పుట్టినరోజు కావడంతో స్పెషల్ విషెస్ చెప్పింది. అంజనా దేవితో ఉన్న ఫోటోను ఉపాసన తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఇది కాస్తా వైరల్ కావడంతో మెగా అభిమానులు సైతం అంజనమ్మకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.ఉపాసన తన ఇన్స్టాలో రాస్తూ..'అత్యంత శ్రద్ధ, క్రమశిక్షణ కలిగిన నాయనమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీతో పాటు కలిసి జీవించడం నాకు చాలా ఇష్టం. మా యోగా క్లాస్ పూర్తయ్యాక మా ఫేస్లో ఆనందం చూడండి. ఆమె ఒక్క క్లాస్ కూడా ఎప్పటికీ మిస్సవదు. నిజంగా మీరు అందరికీ స్ఫూర్తిదాయకం.' అంటూ పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ పోస్టులు పెడుతున్నారు.(ఇది చదవండి: అలా జరగకపోతే నా పరువు పోతుంది: నాగచైతన్య కామెంట్స్ వైరల్)ఇక ఉపాసన విషయానికొస్తే వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. మరోవైపు రామ్ చరణ్ ఇటీవలే సంక్రాంతికి గేమ ఛేంజర్ మూవీతో ప్రేక్షకులను పలకరించారు. శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించినంత స్థాయిలో రాణించలేకపోయింది. ప్రస్తుతం రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్, దేవరభామ జాన్వీ కపూర్ చెర్రీ సరసన కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ ఆర్సీ16 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
దేశ ప్రజలకు ప్రధాని మోదీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ జాతీయ వేడుక రాజ్యాంగ విలువలను కాపాడుతుందని, బలమైన, సంపన్నమైన భారతదేశాన్ని నిర్మించడానికి జరుగుతున్న ప్రయత్నాలను ఇది మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశం నేడు 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నాయకత్వంలో న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్లో ప్రధాన గణతంత్ర దినోత్సవ కార్యక్రమం ప్రారంభమయ్యింది.సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ఎక్స్' లో ప్రధానమంత్రి ఒక పోస్ట్లో ‘అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మనం మన అద్భుతమైన గణతంత్ర వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం. రాజ్యాంగాన్ని రూపొందించడం ద్వారా మన అభివృద్ధి ప్రయాణం ప్రజాస్వామ్యం, గౌరవం, ఐక్యతపై ఆధారపడి ఉండేలా మార్గాన్ని రూపొందించిన మహనీయులందరికీ మనం నివాళులు అర్పిస్తున్నాం’ అని అన్నారు. Happy Republic Day. Today, we celebrate 75 glorious years of being a Republic. We bow to all the great women and men who made our Constitution and ensured that our journey is rooted in democracy, dignity and unity. May this occasion strengthen our efforts towards preserving the…— Narendra Modi (@narendramodi) January 26, 2025నేటి గణతంత్ర దినోత్సవంలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. గణతంత్ర దినోత్సవ కవాతు దేశ సైనిక శక్తిని, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది. భారతదేశం 1947 ఆగస్టు 15న బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యం పొందింది. అయితే 1950 జనవరి 26న భారతదేశం సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది. సరిగ్గా 75 సంవత్సరాల క్రితం ఇదే రోజున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.ఇది కూడా చదవండి: Republic Day-2025: అందంగా ముస్తాబు.. అణువణువునా గాలింపు -
గారెలు, పులిహోరతో కడుపు నిండిపోయిందన్న హీరోయిన్ (ఫోటోలు)
-
టాలీవుడ్ హీరోయిన్స్ సంక్రాంతి స్పెషల్ విషెస్ (ఫోటోలు)
-
స్వామి వివేకానంద జయంతి.. వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. "లేవండి.. మేల్కొండి.. గమ్యం చేరే వరకు విశ్రమించకండి" అన్న స్వామి వివేకానంద ప్రేరణాత్మక పిలుపు నేటికీ యువతకు స్ఫూర్తిదాయకం. నేడు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ యువతీ యువకులందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు’’ అంటూ ట్వీట్ చేశారు. "లేవండి.. మేల్కొండి.. గమ్యం చేరే వరకు విశ్రమించకండి" అన్న స్వామి వివేకానంద గారి ప్రేరణాత్మక పిలుపు నేటికీ యువతకు స్ఫూర్తిదాయకం. నేడు స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ యువతీ యువకులందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు.— YS Jagan Mohan Reddy (@ysjagan) January 12, 2025లేవండి.. మేల్కోండి.. గమ్యం చేరేవరకూ ఆగకండి..’ ప్రపంచంలోని యువతకు స్వామి వివేకానంద ఇచ్చిన మహోన్నతమైన సందేశం ఇది. అనేక రకాల వైఫల్యాలు, వైకల్యాల నడుమ బందీ అయిన జీవితాన్ని సమున్నతమైన లక్ష్యం, ఆశయం దిశగా ముందుకు నడిపించేందుకు యువతకు ఆయన ఒకే ఒక ఆయుధాన్ని అందజేశాడు. అదే ధైర్యం.. సాహసం.. నిస్వార్థంగా.. నిర్భయంగా జీవించడం. భయపడకుండా బతకడమే దైవత్వమని చెప్పారు. వివేకానంద చెప్పిన మాటలను నేడు ఆయన జయంతి సందర్భంగా గుర్తుచేసుకుంటూ.. మరిన్ని విశేషాలకు క్లిక్ చేయండి.. గమ్యం.. చేరే వరకూ..! -
మావారి తరఫున మీకు హ్యాపీ న్యూ ఇయర్.. (ఫొటోలు)
-
అందరికీ ఆనందం పంచాలని ఆశిస్తున్నా ప్రజలకు ప్రధాని
న్యూఢిల్లీ: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ కొత్త ఆశలు, ఆశయాలకు నెలవైన నూతన సంవత్సరానికి అందరూ ఆనందంగా స్వాగతం పలికారు. కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో నూతన సంతోషాలు, అవకాశాలు, విజయాలు, అంతులేని ఆనందాలను తీసుకు రావాలని ఆశిస్తున్నా. ఆయురారోగ్యాలతో ఉండేలా కొత్త సంవత్సరం అందర్నీ దీవించనుంది’’ అని మోదీ అన్నారు. ‘‘ సమష్టిగా ప్రయత్నించి గత సంవత్సరం మనందరం అనేక అద్భుత విజయాలు అందుకున్నాం. 2025 సంవత్సరంలోనూ మరింతగా కష్టపడి పనిచేసి వికసిత్ భారత్ దిశగా వడివడిగా అడుగులు వేద్దాం’’ అని అన్నారు. గత ఏడాది కాలంలో భారతదేశం సాధించిన పురోగతి, ఐక్యత, అభివృద్ధి ప్రస్థానం వైపు వేసిన అడుగులను వివరిస్తూ మోదీ ఈ సందర్భంగా ఓ వీడియోను ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్చేశారు. Wishing everyone a very Happy New Year! May the year 2025 bring joy, harmony and prosperity to all! On this occasion, let us renew our commitment to work together for creating a brighter, more inclusive and sustainable future for India and the world.— President of India (@rashtrapatibhvn) January 1, 2025గ్రీటింగ్స్ చెప్పిన రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిమరింత సమ్మిళితమైన, సుస్థిరమైన భారత్తో పాటు ప్రపంచ శాంతి కోసం దేశ ప్రజలంతా ఉమ్మడిగా కష్టపడి పనిచేయాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం తన నూతన ఏడాది సందేశంలో పిలుపునిచ్చారు. ‘‘ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షులు. 2025 ఏడాది మీ జీవితాల్లో కొత్త వెలుగులు తేవాలని, నూతనోత్సాహం, సా మరస్యం, సంతోషం వెల్లివిరియాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని ఆమె అన్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ సైతం ప్రజలకు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పారు. లోక్సభ స్వీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ సైతం ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. Happy 2025! May this year bring everyone new opportunities, success and endless joy. May everybody be blessed with wonderful health and prosperity.— Narendra Modi (@narendramodi) January 1, 2025 -
సిస్టర్కు విషెస్ తెలిపిన గ్లోబల్ స్టార్.. సోషల్ మీడియాలో పోస్ట్!
మెగా హీరో రామ్ చరణ్ తన చెల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ మెగా డాటర్ నిహారిక కొణిదెల బర్త్ డే కావడంతో ప్రత్యేకంగా విష్ చేశారు. హ్యాపీ బర్త్ డే నిహారిక.. వచ్చే ఏడాదిలో నువ్వు మరింత సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా అంటూ చెర్రీ ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు. తనతో దిగిన ఓ ఫోటోను షేర్ చేశారు.కాగా.. మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్లో పని చేయనున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రానికి ఇప్పటికే పూజా కార్యక్రమం కూడా నిర్వహించారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ పట్టాలెక్కనుంది. మరోవైపు రామ్ చరణ్ నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. కోలీవుడ్ స్టార్ ఎస్జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో అభిమానుల్లో గేమ్ ఛేంజర్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల యూఎస్ ప్రీమియర్స్కు సంబంధించి టికెట్ బుకింగ్ ఓపెన్ అయ్యాయి. ఈ చిత్రం జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. Happy birthday to dearest Niharika. Wishing you more success in the coming year.!! pic.twitter.com/IxfMfmf1kr— Ram Charan (@AlwaysRamCharan) December 18, 2024 -
అనుష్క.. నీ ఇంటిపేరును అలాగే ఉంచు: విరుష్క జోడీకి నాడు రోహిత్ శర్మ విషెస్(ఫొటోలు)
-
నేవీ సిబ్బందికి శుభాకాంక్షలు: వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి:భారత నౌకాదళ దినోత్సవం సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం(డిసెంబర్ 4) ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశారు.‘నేవీలో అంకితభావం,నిస్వార్థ సేవతో పని చేస్తున్న మహిళలు,పురుషులు అందరికీ వందనం. సముద్ర సరిహద్దులను కాపాడటంలో వారు చూపుతున్న ధైర్యం అందరిలోనూ గర్వాన్ని నింపుతోంది. వారి త్యాగాలను గౌరవిస్తున్నాం. నేవీ సిబ్బంది శౌర్యాన్ని గుర్తు చేసుకుంటూ నేవీడేను ఘనంగా జరుపుకుందాం’అని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.On Indian Navy Day, we salute the unwavering dedication and selfless service of the valiant men and women of the Indian Navy. Their courage in safeguarding our maritime frontiers fills us with immense pride.Today, we honor their sacrifices and the steadfast support of their…— YS Jagan Mohan Reddy (@ysjagan) December 4, 2024 -
దివ్యాంగులు ఎవరికీ తీసిపోరు: వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: వైకల్యం అనేది శరీరానికే కానీ..సంకల్పానికి కాదని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మంగళవారం(డిసెంబర్ 3) వైఎస్ జగన్ ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు.‘తాము ఎవరికీ తీసిపోమని నిరూపిస్తూ అన్ని రంగాల్లో ముందుకు పోతున్న దివ్యాంగులందరికీ ప్రపంచ దివ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు’అని వైఎస్ జగన్ తన పోస్టులో తెలిపారు.వైకల్యం అనేది శరీరానికే కానీ.. సంకల్పానికి కాదు. ఆత్మస్థైర్యంతో తాము ఎవరికీ తీసిపోమని నిరూపిస్తూ అన్ని రంగాల్లో ముందుకు పోతున్న దివ్యాంగులందరికీ ప్రపంచ దివ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు.— YS Jagan Mohan Reddy (@ysjagan) December 3, 2024 ఇదీ చదవండి: రైతులను రోడ్డున పడేశావ్: వైఎస్ జగన్ -
అల్లు అర్హ బర్త్ డే.. ముద్దుల కూతురికి ఐకాన్ స్టార్ స్పెషల్ విషెస్!
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్, ఆయన సతీమణి స్నేహరెడ్డి గారాలపట్టి అల్లు అర్హ ఇటీవల రియాలిటీ షోలో కనిపించింది. తండ్రితో కలిసి పాల్గొన్న అర్హ అచ్చ తెలుగులో పద్యం చెప్పి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇవాళ బన్నీ ముద్దుల కూతురు అర్హ తన ఎనిమిదో పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ సందర్భంగా టాలీవుడ్ ఫ్యాన్స్ అభిమాన హీరో కూతురికి బర్త్ డే విషెస్ చెబుతున్నారు.అయితే అల్లు అర్జున్ తన కూతురి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఇన్స్టా వేదికగా ఓ వీడియోను షేర్ చేస్తూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. 8 సంవత్సరాల స్వచ్ఛమైన ఆనందం.. నా లిటిల్ అర్హ నా జీవితాన్ని మధురంగా మార్చింది.. నీపై అనంతమైన ప్రేమతో మీ నాన్న అంటూ బన్నీ పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.అల్లు స్నేహరెడ్డి తన గారాలపట్టికి బర్త్ డే విషెస్ తెలిపింది. అర్హకు సంబంధించిన అరుదైన ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది. హ్యాపీ బర్త్ డే మై క్యూటెస్ట్, స్వీటెస్ట్ బేబీ..మేము నిన్ను చాలా ప్రేమిస్తున్నాం అర్హ' అంటూ పోస్ట్ చేసింది. మా జీవితంలో ఇది చాలా ప్రత్యేకమైన రోజు అంటూ తమ ముద్దుల కూతురికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) -
కోహ్లికి స్పెషల్ విషెస్: అక్క, అన్న పిల్లలతో విరాట్ రేర్ ఫొటోలు
-
మై క్రేజీ బేబీ: భార్యకు కేఎల్ రాహుల్ బర్త్డే విషెస్ (ఫొటోలు)
-
అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరించుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, టీజేఆర్ సుధాకర్ బాబు, వైసీపీ నేతలు పాల్గొన్నారు.తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, వైఎస్సార్ నేతలు హాజరయ్యారు. ఆ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ, పొట్టి శ్రీరాములుతో పాటు ఎందరో త్యాగాలు చేస్తే ఆంధ్రరాష్ట్రం అవతరించిందన్నారు. 2019-24 మధ్య పొట్టిశ్రీ రాములు ఆశయాలకు వైఎస్ జగన్ జీవం పోశారన్నారు. ప్రజలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలను వైఎస్ జగన్ చేసి చూపించారన్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలకు ఉపయోగపడే ఏ కార్యక్రమాలు జరగకపోవడం బాధాకరమని దేవినేని అవినాష్ అన్నారు. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని స్మరించుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు— YS Jagan Mohan Reddy (@ysjagan) November 1, 2024 -
ప్రధాని మోదీ దీపావళి శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ సోషల్ మీడియా సైట్ ఎక్స్లో.. ‘ఈ దివ్యమైన దీపాల పండుగ వేళ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, సంతోషంగా, అదృష్టవంతులుగా జీవించాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ లక్ష్మీ దేవి, శ్రీ గణేషుని అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నానని అన్నారు. देशवासियों को दीपावली की अनेकानेक शुभकामनाएं। रोशनी के इस दिव्य उत्सव पर मैं हर किसी के स्वस्थ, सुखमय और सौभाग्यपूर्ण जीवन की कामना करता हूं। मां लक्ष्मी और भगवान श्री गणेश की कृपा से सबका कल्याण हो।— Narendra Modi (@narendramodi) October 31, 2024 దీనికిముందు ప్రధాని మోదీ.. ఒక పోస్టులో అయోధ్యలోని నూతన ఆలయంలో రామ్ లల్లాను ప్రతిష్టించిన తర్వాత ఇది మొదటి దీపావళి అని, 500 సంవత్సరాలుగా రామభక్తులు చేసిన లెక్కలేనన్ని త్యాగాలు, తపస్సు తర్వాత ఈ శుభ ఘట్టం వచ్చిందని పేర్కొన్నారు. अलौकिक अयोध्या!मर्यादा पुरुषोत्तम भगवान श्री राम के अपने भव्य मंदिर में विराजने के बाद यह पहली दीपावली है। अयोध्या में श्री राम लला के मंदिर की यह अनुपम छटा हर किसी को अभिभूत करने वाली है। 500 वर्षों के पश्चात यह पावन घड़ी रामभक्तों के अनगिनत बलिदान और अनवरत त्याग-तपस्या के बाद… https://t.co/e0BwDRUnV6— Narendra Modi (@narendramodi) October 30, 2024ఇది కూడా చదవండి: సైనికుల మధ్య రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దీపావళి వేడుకలు -
అతనితో హీరోయిన్ డేటింగ్.. మొత్తానికి తెలిసిపోయింది!
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తెలుగువారికి సుపరిచితమే. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైంది. ఈ సినిమాకు పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది.అయితే ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది అనన్య పాండే. ఇవాళ తన 26 పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ విషయం తెలుసుకున్న సినీతారలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇటీవల సీటీఆర్ఎల్ మూవీతో అలరించిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం కాల్ మీ బే సీజన్-2లో నటిస్తోంది.అంబానీ పెళ్లిలో సందడి..ఇదిలా ఉండగా.. గతంలో అంబానీ పెళ్లిలో అనన్య పాండే సందడి చేసింది. ఆ సమయంలో మోడల్ వాకర్ బ్లాంకోతో కలిసి హాజరైంది. దీంతో వీరిద్దరిపై అప్పుడే డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. ఈ జంట పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ పోస్టులు పెట్టారు. అయితే డేటింగ్పై అనన్య ఇప్పటివరకు స్పందించలేదు.ఐ లవ్ యూ అంటూ పోస్ట్అయితే ఇవాళ అనన్య పాండే బర్త్ డే కావడంతో వాకర్ బ్లాంకో విషెస్ తెలిపారు. ఇన్స్టా స్టోరీస్లో అనన్య ఫోటోను పోస్ట్ చేస్తూ క్యాప్షన్ రాసుకొచ్చారు. 'హ్యాపీ బర్త్ డే బ్యూటీ.. యూ ఆర్ సో స్పెషల్.. ఐ లవ్ యూ అనీ' అంటూ రొమాంటిక్గా విష్ చేశారు. ఇది చూసిన నెటిజన్స్ వీరిద్దరు డేటింగ్ రూమర్స్ నిజమేనంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ తాజా పోస్ట్తో ఈ జంట ప్రేమలో ఉన్నారని క్లారిటీ వచ్చేసింది.తొలిసారిగా ఆ పెళ్లిలోనేకాగా.. అనన్య, వాకర్లు మొదటిసారిగా జూలైలో జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల వివాహంలో జంటగా కనిపించారు. ఈ పెళ్లిలో వాకర్ని తన భాగస్వామిగా పరిచయం చేసింది. ఈ వేడుకల్లో ఓ సాంగ్కు ఇద్దరు కలిసి డ్యాన్స్ చేశారు. అంతకుముందు బాలీవుడ్ నటుడు ఆదిత్య రాయ్ కపూర్తో డేటింగ్ చేసింది. ఈ ఏడాది మార్చిలో ఈ జంట ఇద్దరూ విడిపోయారు. అయితే తమ రిలేషన్ షిప్ గురించి ఎక్కడా కూడా స్పందించలేదు. -
ప్రభాస్కు బర్త్ డే విషెస్ చెప్పిన బెస్ట్ ఫ్రెండ్.. ఎవరో తెలుసా?
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవలే కల్కి మూవీతో ప్రేక్షకులను అలరించారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. అయితే ప్రస్తుతం ది రాజాసాబ్ మూవీతో బిజీగా ఉన్నారు డార్లింగ్ ప్రభాస్. మారుతి డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఇవాళ రెబల్ స్టార్ బర్త్ డే కావడంతో మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. తాజాగా విడుదలైన పోస్టర్లో ప్రభాస్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.అయితే ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో మెగాస్టార్తో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. తాజాగా ప్రభాస్కు బెస్ట్ ఫ్రెండ్ బర్త్ డే విషెస్ అంటూ ట్వీట్ చేశారు. ఆ బెస్ట్ ఫ్రెండ్ మరెవరో కాదు.. కల్కి మూవీలో బుజ్జిగా అలరించిన కారు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. బుజ్జి పేరుతో ఉన్న ట్విటర్లో హ్యాండిల్లో వీడియోను పోస్ట్ చేసింది కల్కి టీమ్.కాగా.. ప్రభాస్ నటించిన కల్కి చిత్రంలో బుజ్జి పేరుతో ఉన్న కారుకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. రిలీజ్కు ముందు పలు నగరాల్లో బుజ్జి సందడి చేసింది. ఈ సినిమాలో బుజ్జి పాత్రకు ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది. కాగా.. బుజ్జికి హీరోయిన్ కీర్తి సురేశ్ వాయిస్తో డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే.Happy Birthday BHAIRAVA - from your best friend #Bujji ❤️#Prabhas #Kalki2898AD pic.twitter.com/szhxo0xLqH— Bujji (@BelikeBujji) October 23, 2024 -
'అతను ఒక పవర్హౌస్'.. మంచువిష్ణు స్పెషల్ విషెస్!
రెబల్ స్టార్ ప్రభాస్కు మా అధ్యక్షుడు మంచు విష్ణు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ ఆయన బర్త్ డే కావడంతో ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు. భారతీయ సినిమాకు ప్రభాస్ ఒక పవర్హౌస్ లాంటివాడని ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానుల మనసులు గెలుచుకున్నాడని కొనియాడారు. నా సోదరుడు ప్రభాస్కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని మంచు విష్ణు ట్విటర్లో రాసుకొచ్చారు.కాగా.. ఇవాళ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా టాలీవుడ్ సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. మెగాస్టార్ సైతం కటౌట్ చూసి అన్ని నమ్మేయాలి డ్యూడ్ అంటూ డిఫరెంట్ స్టైల్లో విషెస్ తెలిపారు.(ఇది చదవండి: ‘ది రాజాసాబ్’ అప్డేట్ .. ప్రభాస్ కొత్త లుక్ అదిరింది!)ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్నారు. మారుతి డైరెక్షన్లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇవాళ రెబల్ స్టార్ బర్త్ డే కావడంతో ఫ్యాన్స్కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ప్రభాస్ మోషన్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. దాదాపు 2 నిమిషాల పాటు ఉన్న వీడియో ఈ పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో ప్రభాస్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. Wishing the powerhouse of Indian cinema, my brother #Prabhas, a very happy birthday! #Prabhas continues to conquer hearts and screens worldwide with his unmatched talent and dedication. Here’s to many more years of greatness! 🏆 #HappyBirthdayPrabhas pic.twitter.com/xX3Z26pApw— Vishnu Manchu (@iVishnuManchu) October 23, 2024 -
అంతిమ విజయం మంచినే వరిస్తుంది: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘లోక కంఠకుడైన మహిషాసురుడిని జగన్మాత సంహరించినందుకు చెడుపై మంచి, దుష్ట శక్తులపై దైవ శక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండగే విజయదశమి. చెడు ఎంత దుర్మార్గమైనదైనా, ఎంత శక్తిమంతమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుంది’’ అని వైఎస్ జగన్ అన్నారు.ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలి. రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు సిద్ధించాలి. ఆ కనకదుర్గమ్మవారి దీవెనలు, ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలి’’ అని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.ఇదీ చదవండి: పగ ప్రతీకారాల ‘రెడ్ బుక్’ బదులుగా ప్రేమ, ఆప్యాయతల ‘గుడ్ బుక్’ -
టీమిండియా స్టార్ క్రికెటర్ బర్త్డే.. లవ్ యూ అంటూ అక్క విషెస్! (ఫొటోలు)
-
రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు
-
వైఎస్ జగన్ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు
గుంటూరు, సాక్షి: మిలాద్-ఉన్-నబీని నేడు దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. వైస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రతి ఒక్కరూ ఎదుటివారిపట్ల ప్రేమ, కరుణ కలిగి ఉండాలన్న మహ్మద్ ప్రవక్త బోధనలు మానవాళికి సదా అనుసరణీయం. నేడు ఆయన జన్మదిన సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు అని ఎక్స్ ఖాతాలో సందేశం ఉంచారాయన.ప్రతి ఒక్కరూ ఎదుటివారిపట్ల ప్రేమ, కరుణ కలిగి ఉండాలన్న మహ్మద్ ప్రవక్త బోధనలు మానవాళికి సదా అనుసరణీయం. నేడు ఆయన జన్మదినం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు.— YS Jagan Mohan Reddy (@ysjagan) September 16, 2024 -
ఇంజనీర్స్ డే.. వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, గుంటూరు: ఇంజనీర్స్ డే సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్యగారి దార్శనికత, అంకితభావం, నైపుణ్యం మన దేశ సుస్థిర అభివృద్ధికి బాటలు వేశాయి. ఎంతోమంది ఇంజనీర్లకు స్ఫూర్తిగా నిలిచిన విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా మీ అందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్యగారి దార్శనికత, అంకితభావం, నైపుణ్యం మన దేశ సుస్థిర అభివృద్ధికి బాటలు వేశాయి. ఎంతోమంది ఇంజనీర్లకు స్ఫూర్తిగా నిలిచిన విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా మీ అందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు .— YS Jagan Mohan Reddy (@ysjagan) September 15, 2024 -
వైఎస్ జగన్ వినాయకచవితి శుభాకాంక్షలు
తాడేపల్లి, సాక్షి: వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.‘‘ తొలి పూజలందుకునే వినాయకుడు విఘ్న నివారకుడే కాదు.. సకల కళలకు, విజ్ఞానానికి మూల స్వరూపుడు. అలాంటి వినాయకుడిని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో పూజించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు’’అంటూ ట్వీట్ చేశారు.తొలి పూజలందుకునే వినాయకుడు విఘ్న నివారకుడే కాదు.. సకల కళలకు, విజ్ఞానానికి మూల స్వరూపుడు. అలాంటి వినాయకుడిని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో పూజించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.#HappyVinayakaChavithi— YS Jagan Mohan Reddy (@ysjagan) September 7, 2024 -
ప్రజలందరికీ సకల శుభాలూ కలగాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోయి, ప్రజలందరికీ సకల శుభాలూ కలగాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు గణనాథుని ఆశీస్సులు ఉండాలని.. క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు, సకల సంపదలు సిద్ధించాలని, సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోయి.. విజయాలు సిద్ధించాలని.. గణనాథుని కరుణా కటాక్షాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబమూ సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని వైఎస్ జగన్ అభిలషించారు. -
పుట్టినరోజు విషెస్.. 'సీతారామం' హీరో భార్యని చూశారా? (ఫొటోలు)
-
పవన్ కల్యాణ్కు బర్త్ డే విషెస్ చెప్పిన బన్నీ!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఏపీ డిప్యూటీ సీఎం, హీరో పవన్ కల్యాణ్కు బర్త్ డే విషెస్ తెలిపారు. ఇవాళ ఆయన పుట్టిన రోజు సందర్భంగా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే ఇటీవల చిరంజీవి బర్త్ డేను పురస్కరించుకుని బన్నీ విషెస్ తెలిపిన సంగతి తెలిసిందే.అయితే కొద్ది రోజులుగా బన్నీ, మెగా ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల మారుతీనగర్ సుబ్రమణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్లో బన్నీ చేసిన కామెంట్స్తో మరోసారి హాట్టాపిక్గా మారాయి. తనకు నచ్చితే, తాను ఇష్టపడితే, అండగా నిల్చోవడానికి, ఎక్కడికైనా వెళ్లడానికి తాను వెనుకాడను అని చెప్పాడు. ఎప్పుడైతే 'చెప్పను బ్రదర్' అంటూ బన్నీ స్టేట్ మెంట్ ఇచ్చాడో అప్పట్నుంచి పవన్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తూనే ఉంది. తాజాగా బన్నీ.. పవన్ కల్యాణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతోనైనా ఈ ఫ్యాన్స్ వార్కు తెరపడుతుందేమో వేచి చూడాల్సిందే. బన్నీపై నోరు పారేసుకున్న జనసేన నేతలు..బన్నీ చేసిన కామెంట్స్పై ఏపీకి చెందిన కొందరు జనసేన నేతలు నోరు పారేసుకున్నారు. నీ సినిమాలు ఏపీలో ఎలా ఆడతాయో చూస్తామంటూ బహిరంగంగా వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో అది కాస్తా బన్నీ, మెగా ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్కు దారితీసింది. దీంతో తనను నమ్మినవారి కోసం ఎక్కడి వరకైనా వస్తానంటూ అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ కాస్తా పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. ఫుష్ప-2 మూవీతో బిజీ..ఇకపోతే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 సినిమాతో బిజీగా ఉన్నారు. సుకుమార్ డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీ షూటింగ్ దాదాపు చివరిదశలో ఉంది. ఆగస్టులోనే రిలీజ్ కావాల్సిన చిత్రం.. నెల రోజుల షూటింగ్ పెండింగ్లో ఉండడంతో డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేశారు. 2021లో వచ్చిన పుష్పకు సీక్వెల్గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.Many happy returns of the day to Power Star & DCM @PawanKalyan garu— Allu Arjun (@alluarjun) September 2, 2024 -
సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్.. బన్నీ ట్వీట్కు స్పందించిన మెగాస్టార్!
ప్రస్తుతం టాలీవుడ్ అల్లు, మెగా ఫ్యాన్స్ మధ్యన వార్ నడుస్తోంది. ఇటీవల మారుతీనగర్ సుబ్రమణ్యం ఈవెంట్లో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ వైరల్ కావడంతో మళ్లీ ఫ్యాన్స్ రచ్చ నడుస్తోంది. గతంలో జరిగిన రాజకీయ పరిణామాలను ఉద్దేశించే బన్నీ అలా మాట్లాడారంటూ మెగా ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు. మరోవైపు ఈ విషయంలో అల్లు అర్జున్ అభిమానులు సైతం మెగా ఫ్యాన్స్పై మండిపడుతున్నారు. దీంతో అది కాస్తా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్గా మారిపోయింది.అయితే ఈనెల 22న మెగాస్టార్ బర్త్ డేను పురస్కరించుకుని అల్లు అర్జున్ విషెస్ తెలిపారు. మీరు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలంటూ ఆయన ట్వీట్ చేశారు. తాజాగా బన్నీ చేసిన పోస్ట్కు మెగాస్టార్ చిరంజీవి సైతం రిప్లై ఇచ్చారు. థ్యాంక్యూ డియర్ బన్నీ అంటూ చిరు పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఇక్కడితోనైనా ఫ్యాన్స్ మధ్య నెట్టింట వార్కు ఫుల్స్టాప్ పడుతుందేమో చూడాలి. అసలు బన్నీ ఏమన్నారంటే...హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన ఆసక్తికర కామెంట్స్ చేశారు. అభిమానుల వల్లే తాను హీరో అయ్యానని ఎమోషనల్ అయ్యారు. అంతే కాకుండా నా అనుకున్న వాళ్ల కోసం ఎంతవరకైనా వెళ్తానంటూ బన్నీ మాట్లాడారు. అది ఫ్రెండైనా, బంధువైనా, నా అభిమానులైనా అంటూ హాట్ కామెంట్స్ చేశారు. అది కాస్తా బన్నీ, మెగా ఫ్యాన్స్కు మధ్య వార్కు దారితీసింది. గతంలో అల్లు అర్జున్ నంద్యాలలో వైకాపా అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లగా.. మెగా ఫ్యాన్స్ విమర్శలు చేశారు. అందుకు కౌంటర్గానే ఇప్పుడు బన్నీ మాట్లాడారంటూ సోషల్ మీడియా వేదికగా రచ్చ మొదలైంది. ఇక సినిమాల విషయానికొస్తే మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బింబిసారం ఫేమ్ వశిష్టి దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు బన్నీ పుష్ప-2 తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సుకుమార్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం డిసెంబర్ 6న థియేటర్లలో సందడి చేయనుంది. Thank you dear Bunny.— Chiranjeevi Konidela (@KChiruTweets) August 23, 2024 -
ప్రతి భారతీయుడి గుండె గర్వంతో నిండే రోజు..: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో నిండే రోజు.. బానిస సంకెళ్లను తెంచుకున్న రోజు.. మనందరికీ స్వేచ్ఛా వాయువులు పంచిన రోజు ఈ రోజు. రాష్ట్ర ప్రజలందరికీ 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులందరికీ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను.’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో నిండే రోజు.. బానిస సంకెళ్లను తెంచుకున్న రోజు.. మనందరికీ స్వేచ్ఛా వాయువులు పంచిన రోజు ఈ రోజు. రాష్ట్ర ప్రజలందరికీ 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులందరికీ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను.— YS Jagan Mohan Reddy (@ysjagan) August 15, 2024తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కాసేపట్లో స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు పాల్గొంటారు. -
నేతన్నలకు కేటీఆర్ హ్యాండ్లూమ్ డే విషెస్
సాక్షి,హైదరాబాద్: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం(ఆగస్టు7) ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశారు. దశాబ్దాలపాటు దగాపడ్డ చేనేతరంగానికి బీఆర్ఎస్ పదేళ్ల ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ స్వర్ణయుగమని తెలిపారు. నేత కార్మికుల కష్టాలు తెలిసిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. సమైక్యరాష్ట్రంలో చేనేత రంగానికి ఆరేళ్ల బడ్జెట్ రూ.600 కోట్లు కాగా బీఆర్ఎస్ పాలనలో చేనేత రంగానికి ఏడాదికి రూ.1200 కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. -
ఒలింపిక్స్ కాంస్య పతక విజేత స్వప్నిల్కు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, గుంటూరు: ఒలింపిక్స్ కాంస్య పతక విజేత స్వప్నిల్ కుసాల్కి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ విభాగంలో పతకం సాధించిన స్వప్నిల్కు అభినందనలు తెలుపుతూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.My best wishes and congratulations to Swapnil Kusale on bringing home yet another medal at the Olympics. Kudos to Swapnil on being the first Indian to win a medal in the Men’s 50m Rifle 3 Positions category. You have filled the entire nation with great pride! #2024Olympics pic.twitter.com/rN3ereS7B9— YS Jagan Mohan Reddy (@ysjagan) August 1, 2024 ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత్కు మరో పతకం లభించింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్లో భారత్ తరఫున స్వప్నిల్ కుసాలే కాంస్యం గెలిచాడు. దీంతో ఈ విశ్వ క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య మూడుకు చేరింది. మహారాష్ట్రకు చెందిన స్వప్నిల్ కుసాలే.. గురువారం జరిగిన ఫైనల్లో 451.4 పాయింట్లు స్కోరు చేసి.. మూడో స్థానంలో నిలిచాడు. తద్వారా కాంస్యం ఖరారు చేసుకున్నాడు.పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్లో భారత్కు తొలి పతకం అందించిన అథ్లెట్గా చరిత్ర సృష్టించాడు. కాగా ఇప్పటికే మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో మనూ భాకర్... 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మనూ భాకర్–సరబ్జోత్ కాంస్య పతకాలు గెలిచిన విషయం తెలిసిందే. అంచనాలు లేకుండా తొలిసారి ఒలింపిక్స్ క్రీడల్లో బరిలోకి దిగిన ఈ షూటింగ్ స్టార్.. ఆద్యంతం నిలకడగా పాయింట్లు స్కోరు చేసి ఈ ఘనత సాధించాడు. -
సోనూ సూద్ బర్త్ డే.. ఏపీ విద్యార్థుల స్పెషల్ విషెస్!
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఇవాళ 51వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆయన బర్త్ డే సందర్భంగా సినీతారలు, టాలీవుడ్ ప్రముఖులు సైతం ఆయనకు విషెస్ తెలిపారు. అరుంధతి మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సోనూసూద్.. బాలీవుడ్లో బిజీగా ఉన్నారు. అయితే సినిమాలతో పాటు సమాజ సేవలోనూ ఆయన ముందున్నారు. సోనూసూద్ ఫౌండేషన్ స్థాపించిన నిరుపేదలకు అండగా నిలుస్తున్నారు.తాజాగా ఇవాళ సోనూ పుట్టిన రోజు కావడంతో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. కుప్పంలోని హాకింగ్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు ఆయన రూపంలో నిలబడి విషెస్ చెప్పారు. దాదాపు 1200 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హ్యాపీ బర్త్ డే రియల్ హీరో అంటూ తమ అభిమానం చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ విధంగా కార్యక్రమంలో విద్యార్థుల సృజనాత్మకత, ఉత్సాహాన్ని పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. కాగా.. ఇటీవలే సోనూసూద్ ఏపీకి చెందిన విద్యార్థికి చదువుకు సాయమందించిన సంగతి తెలిసిందే. నటుడు @SonuSood పుట్టినరోజు సందర్భంగా అద్భుత రీతిలో శుభాకాంక్షలు తెలిపిన కుప్పం విద్యార్థులుసోను సూద్ ముఖ చిత్రాన్ని ప్రతిబింబించేలా విద్యార్థుల అద్భుత ప్రదర్శనహాకింగ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం#sonusoodbirthday #Kuppam pic.twitter.com/tGLKlhF7ym— Telugu Galaxy (@Telugu_Galaxy) July 30, 2024 -
నేడు సీఆర్పీఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం.. ప్రధాని మోదీ శుభాకాంక్షలు
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) 86వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రతా బలగాలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దేశ భద్రతలో సీఆర్పీఎఫ్ పాత్ర అత్యంత కీలకమని అభివర్ణించారు. సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్లో.. దేశం పట్ల సీఆర్పీఎఫ్ జవాన్ల అంకితభావం, అవిశ్రాంత సేవ నిజంగా అభినందనీయమన్నారు. వారు ఎల్లప్పుడూ ధైర్యం, నిబద్ధతలతో దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి పాటుపడుతున్నారన్నారు.ఇదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా సీఆర్పీఎఫ్ జవాన్లకు, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సీఆర్పీఎఫ్ ప్రారంభమైనప్పటి నుంచి జాతీయ భద్రతను తన మిషన్గా తీసుకుంది. దళంలోని వీర సైనికులు తమ ప్రాణాలను లెక్కచేయక దేశరక్షణకు తమ శక్తిమేరకు కృషి చేసి, విజేతలుగా నిలుస్తున్నారన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన సీఆర్పీఎఫ్ అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నానని అమిత్ షా పేర్కొన్నారు.1939లో బ్రిటిష్ వారు సీఆర్పీఎఫ్ను స్థాపించారు. నాడు ఈ దళం పేరు క్రౌన్ రిప్రజెంటేటివ్ పోలీస్. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఈ దళం పేరును సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్గా మార్చారు. జునాగఢ్, హైదరాబాద్, కతియావార్, కశ్మీర్ రాచరిక రాష్ట్రాలను భారతదేశంలోకి చేర్చడంలో సీఆర్పీఎఫ్ కీలక పాత్ర పోషించింది. అలాగే రాజస్థాన్, కచ్, సింధ్ సరిహద్దుల్లో చొరబాట్లను అరికట్టడంలోనూ సీఆర్పీఎఫ్ ముఖ్యపాత్ర పోషించింది. Greetings to CRPF personnel and their family members on their Raising Day.Since its inception, the @crpfindia has taken national security as its mission. The brave soldiers of the force have exerted all their might to accomplish this goal without ever caring for their lives and… pic.twitter.com/NhbmeRZvi3— Amit Shah (@AmitShah) July 27, 2024 -
తొలి ఏకాదశి.. ప్రజలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: తొలి ఏకాదశి సందర్భంగా ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘పవిత్రమైన తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగువారందరికీ శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.పవిత్రమైన తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగువారందరికీ శుభాకాంక్షలు.— YS Jagan Mohan Reddy (@ysjagan) July 17, 2024 -
గుజరాత్ సీఎంకు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు
ప్రధాని నరేంద్ర మోదీ నేడు (సోమవారం) గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం పటేల్ ఎనలేని కృషి చేస్తున్నారని ప్రధాని మోదీ కొనియాడారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ప్రధాని మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.‘గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్కు జన్మదిన శుభాకాంక్షలు. గుజరాత్ అభివృద్ధిని ప్రోత్సహించడానికి, రాష్ట్ర యువతకు సాధికారత కల్పించేందుకు ఆయన ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన సుదీర్ఘమైన, ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా సీఎం భూపేంద్ర పటేల్ దాదా భగవాన్ ఆలయాన్ని సందర్శించారు. దీంతో పాటు శివాలయంలో జలాభిషేకం నిర్వహించారు. భూపేంద్ర పటేల్ 1962 జూలై 15న అహ్మదాబాద్లో జన్మించారు. 2022 డిసెంబర్ 12న గుజరాత్ 18వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. Best wishes to Gujarat CM Shri Bhupendrabhai Patel on his birthday. He’s making commendable efforts to boost Gujarat’s development and empower the state’s youth. Wishing him a long and healthy life in service of the people. @Bhupendrapbjp— Narendra Modi (@narendramodi) July 15, 2024 -
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: ఈరోజు(జూలై 1) భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్ ఫారం ‘ఎక్స్’లో మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన జీవితంలో పాటించిన నిబద్దతను కొనియాడారు.‘వెంకయ్య నాయుడు గారు 75వ జన్మదినోత్సవం జరుపుకుంటున్న తరుణంలో ఆయనకు దీర్ఘాయువు, ఆరోగ్యం కలగాలని ప్రార్ధిస్తున్నాను’ అని మోదీ పేర్కొన్నారు. బీజేపీ నేత వెంకయ్య నాయుడు 1949, జూలై 1న జన్మించారు. విద్యార్థి నేతగా రాజకీయాల్లోకి అడుగిడారు. తన రాజకీయ జీవితంలో వెంకయ్య నాయుడు పలు పదవులు చేపట్టారు. Greetings to Shri @MVenkaiahNaidu Garu on his 75th birthday. Praying for his long and healthy life. On this special occasion, have penned a few thoughts on his life, service and commitment to nation building.https://t.co/rY3WzwQlKI— Narendra Modi (@narendramodi) July 1, 2024 -
వరల్డ్ కప్ విక్టరీ.. టీమిండియాకు టాలీవుడ్ తారల విషెస్!
టీ20 వరల్డ్ కప్లో టీమిండియా ఘనవిజయం సాధించింది. 2007 తర్వాత పొట్టి ఫార్మాట్లో మరోసారి జగజ్జేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో సౌతాఫ్రికాను ఓడించి ప్రపంచకప్ను ముద్దాడింది. దీంతో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. వరల్డ్ కప్ గెలిచిన వేళ టాలీవుడ్ సినీతారలు సైతం మన జట్టుకు అభినందనలు తెలిపారు.దర్శకధీరుడు రాజమౌళి విన్నింగ్ మూమెంట్ ఫోటోను ట్విటర్లో పంచుకున్నారు. కోచ్ రాహుల్ ద్రావిడ్ను హత్తుకున్న ఫోటోను పోస్ట్ చేశారు. ఈ అద్భుతమైన విజయాన్ని గుర్తుండిపోయేలా చేసిన టీమిండియాకు, రోహిత్ శర్మకు నా ప్రత్యేక అభినందనలు అంటూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా అభినందలు తెలిపారు.🥹🥹🥹 pic.twitter.com/UMojgkRs2U— rajamouli ss (@ssrajamouli) June 29, 2024 Incredible win for Team India! 🇮🇳 Well done, team! Hurrah for @Jaspritbumrah93 👍🏼 and outstanding performances by @imVkohli and @hardikpandya7 ! Kudos to our captain @ImRo45 and all the people behind the scenes for making this win so memorable.#TeamIndia #T20WorldCup #INDvSA…— Ram Charan (@AlwaysRamCharan) June 29, 2024పొట్టి ప్రపంచకప్ గెలిచిన వేళ సూపర్ స్టార్ మహేశ్బాబు టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు. 'ఈ రోజు మనదే.. హీరోస్-ఇన్-బ్లూ.. కొత్త ప్రపంచ ఛాంపియన్స్.. సూర్యకుమార్ క్యాచ్ చరిత్రలో నిలిచిపోతుంది. ఈ చారిత్రాత్మక విజయం పట్ల చాలా గర్వంగా ఉంది. జై హింద్' అంటూ పోస్ట్ చేశారు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు నా అభినందనలు అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. Congratulations to the Indian Cricket team on winning the T20 World Cup 🇮🇳— Allu Arjun (@alluarjun) June 29, 2024 It's ours!! 🏆 The Heroes-in-Blue are the new 'World Champions'! Take a bow #TeamIndia for your relentless efforts on the field today! @surya_14kumar, your catch will be etched in history… what a stunner 😍😍😍 Super proud of this historic win. Jai Hind! 🇮🇳 #T20WorldCup… pic.twitter.com/7EI1oQ2ngw— Mahesh Babu (@urstrulyMahesh) June 29, 2024 -
Fathers Day 2024: ఓ నాన్నా... నీ మనసే వెన్న...
కనపడే కష్టం అమ్మ చేస్తుంది. కనపడనివ్వని శ్రమ నాన్న చేస్తాడు. చూపులకు చిక్కే ప్రేమ అమ్మది. గుండెల్లో దాగి ఉండే మమకారం నాన్నది. నాన్న ఉద్యోగం చేస్తాడు. షాపులో కూచుంటాడు. పనిముట్లు పట్టి శ్రమ చేస్తాడు. పంటచేలో మంచె ఎరగని ఎండ కాస్తాడు. తింటాడో లేదో. ఖర్చెంతో జమ ఎంతో.కాని పిల్లలు అడిగింది అందించాలనే ఆర్తితో ఉంటాడు. ఎప్పుడూ చిర్నవ్వు... అప్పుడప్పుడూ కోపం ఆలోచనల పరధ్యానం. ఏమీ చెప్పుకోని నాన్నకుమనసారా కృతజ్ఞతలు చెప్పాల్సిన రోజు ఇది.ఒక తండ్రి తన కొడుకును తీసుకొని పొరుగూరి నుంచి తన ఊరికి నడుస్తున్నాడు. ఐదారు మైళ్ల దూరం. తండ్రి వయసు 40 ఉంటుంది. కొడుకు వయసు 15 ఉంటుంది. దారిలో వాన మొదలైంది. క్షణాల్లో పెరిగింది. వడగండ్లుగా మారింది. పెద్ద వడగండ్లు. రాళ్ల వంటి వడగండ్లు. గుండ్ల వంటి వడగండ్లు. దారిలో ఎక్కడా చెట్టు లేదు. తల దాచుకోవడానికి చిన్నపాటి నీడ లేదు. పరిగెత్తి ఎక్కడికీ పారిపోవడానికి లేదు. కేవలం పొలాలు ఉన్నాయి. వడగండ్ల దెబ్బకు పిల్లాడు అల్లాడి పోతున్నాడు. తండ్రి నెత్తి చిట్లిపోయేలా ఉంది. అయినా ఆ తండ్రి భయపడలేదు. కొడుకును పొట్ట కిందకు తీసుకున్నాడు. చటుక్కున బోర్లా పడుకున్నాడు. తండ్రి శరీరం కింద పిల్లాడు సురక్షితం అయ్యాడు. తండ్రి తన దేహాన్ని ఉక్కుఛత్రంలా మార్చి కొడుక్కు అడ్డుపెట్టాడు. వడగండ్లు కురిసి కురిసి అలసిపోయాయి. తండ్రి కొడుకును సుక్షితంగా ఇల్లు చేర్చి ఆ గాయాలతో మరికొన్నాళ్లకు చనిపోయాడు. నాన్న శౌర్యమంటే అది. కుటుంబం కోసం నాన్న చేయగలిగే అంతిమ త్యాగం అది. ఈ కథలోని తండ్రి అమితాబ్ బచ్చన్ ముత్తాత. ఈ ఉదంతాన్ని అమితాబ్ తండ్రి హరివంశరాయ్ బచ్చన్ తన ఆత్మకథలో రాశాడు.మరో ఉదంతంలో ... తండ్రికి గవర్నమెంట్ ఉద్యోగం లేదు. అసలు ఏ ఉద్యోగమూ లేదు. బాధ్యతలు ఎక్కువున్నాయి. బరువులు మోయలేనన్ని. చదువుకున్నది అంతంత మాత్రమే. ట్యూషన్లు మొదలెట్టాడు. అతడు జీనియస్. ఏ సబ్జెక్ట్ అయినా ఇట్టే నేర్చుకుని చెప్పగలడు. లెక్కలు, ఇంగ్లిషు, సైన్సు, ఎకనమిక్సు, కామర్సు.... నేర్చుకోవడం... పిల్లలకు చెప్పడం... ఆ వచ్చే జీతం ఇంటికి... తనపై ఆధారపడ్డ బంధువులకు... ఖర్చులు పెరిగే కొద్ది క్లాసులు పెరిగాయి. ఉదయం ఐదు నుంచి రాత్రి పది వరకు... చెప్పి చెప్పి చెప్పి... సరైన తిండి లేదు.. విశ్రాంతి లేదు... విహారం లేదు... వినోదం లేదు.... బాధ్యత... బాధ్యత బాధ్యత.... పిల్లలు ఎదిగొస్తుంటే చూడటం ఒక్కటే ఊరడింపు... కాని చేయాల్సింది చాలా ఉంది. ఈలోపు ఆ శ్రమకు దేహం అలసిపోయింది. మధ్య వయసులోనే ఓడిపోయింది. ఆ తండ్రి దూరమైనా ఆ త్యాగం పిల్లలు ఏనాడూ మర్చిపోలేదు. ఇది సిరివెన్నెల సీతారామశాస్త్రి తన తండ్రి గురించి చెప్పిన కథ.కుటుంబానికి ఆపద వస్తే నాన్న పులి. తిండి సమకూర్చే వేళ ఎద్దు. రక్షణకు కాపు కాచే గద్ద. నాలుగు గింజల కోసం ఎంతదూరమైనా వెళ్లే వలస పక్షి.నాన్న అతి నిరాడంబరుడు. రెండు జతల బట్టలు, రోజూ ఉదయం చదవడానికి న్యూస్ పేపర్, వినేందుకు రేడియో, అడిగినప్పుడు దొరికే కాఫీ. ఇవి ఉంటే చాలు. కొందరు నాన్నలు వీలైతే పడక్కుర్చీ పొందేవారు. అదే సింహాసనంలా భావించేవారు. మంత్రులు, ముఖ్యమంత్రులు ఉదయం పూట ప్రజా దర్బార్ నడుపుతారు. కాని నాన్న దర్బార్ ఎప్పుడూ రాత్రి భోజనాలయ్యాకే. విన్నపాలన్నీ అమ్మ నుంచే వచ్చేవి. ఇంటికి కావలసినవి, పిల్లలకు కావలసినవి, అత్తమామలకు కావలసినవి, ఆడపడుచులకు అమర్చవలసినవి అన్నీ ఏకరువు పెట్టేది. రూపాయి రాక, రూపాయి పోకలో నాన్న వాట ఏమీ ఉండేది కాదు. అమ్మ కూడా పెద్దగా అడిగేది కాదు. అమ్మను మంత్రిగా పెట్టుకుని నాన్న మధ్యతరగతి రాజ్యాన్ని నెట్టుకొచ్చేవాడు.దేశంలో డబ్బు లేని రోజులవి. నిస్సహాయ రోజులు. నాన్న ఎంత కష్టపడేవాడో. ఒకోసారి ఎంత కోప్పడేవాడో. ఆ పైన ఎంత బాధ పడేవాడో. పుస్తకాలు కొనిస్తానని, బూట్లు కొనిస్తానని, కొత్త బట్టలు కొనిస్తానని తీర్చలేని హామీలు ఇవ్వడానికి నాన్న ఎంత బాధ పడేవాడో. అరడజను అరటి పండ్లు తెచ్చి ఏడుగురు సభ్యుల ఇంటిలో ఎవరూ గొడవ పడకుండా పంచే గొప్ప మేథమెటీషియన్ నాన్నే. కొత్త సినిమా ఊళ్లోకొస్తే దాని ఊసు ఇంట్లో రాకుండా జాగ్రత్త పడేవాడు. ‘సినిమాకెళ్తాం నాన్నా’ అనంటే కేకలేసేవాడు. కాని ఏదో ఒక వీలు దొరికి కాసిన్ని డబ్బులు చేతికొస్తే తనే అందరినీ వెంటబెట్టుకొని తీసుకెళ్లి సంతోషపడేవాడు.లోకం చెడ్డది. జీతం ఇచ్చే చోట, పని చేసే చోట ఎన్నో అవస్థలు. ఎందరో శత్రువులు. నాన్న ఆ పోరాటం అంతా చేసి ఇంటికి ఏమీ ఎరగనట్టుగా వచ్చేవాడు. మరుసటి రోజు అవమానం ఎదురుకానుందని తెలిసినా పిల్లల కోసం తప్పక వెళ్లేవాడు. తాను అవమానపడి పిల్లలకు అన్నం పెట్టేవాడే కదా నాన్న.ఆరోగ్యం పట్టించుకోడు. అప్పుకు వెరవడు. కుటుంబానికి మాట రాకుండా తనను తాను నిలబెట్టుకుంటూ పరువు కోసం పాకులాడతాడు. తన జ్ఞానం, కామన్సెన్స్ పిల్లలకు అందిస్తాడు. ఇలా వెళ్లు గమ్యం వస్తుందని సద్బుద్ధిని, సన్మార్గాన్ని చూపిస్తాడు. తన కోసం ఏదీ వెనకేసుకోడు. సంపాదించిందంతా పిల్లలకే ఇవ్వాలని తాపత్రయ పడతాడు.తన యవ్వనాన్ని పిల్లలకు ధారబోసిన నాన్నకు వయసైపోయాక పిల్లలు ఏం చేస్తున్నారు? ఎప్పుడో ఒకసారి మాట్లాడుతున్నారు. ఎప్పుడో ఒకసారి కనపడుతున్నారు. ఏది అడిగినా నీదంతా చాదస్తం అంటున్నారు. తమకు పుట్టిన సంతానాన్ని వారి ఒడిలో కూచోబెట్టలేనంత దూరం ఉంటున్నారు. అన్నీ ఉన్నా నాన్నకు తలనొప్పులు తెచ్చి పెట్టే పిల్లలను ఏమనాలి? కొత్త టెన్షన్స్ తెచ్చి పెడుతూ ఏడిపించే పిల్లలు పిల్లలేనా? నాన్న కన్నీరు భూమి మీద రాలితే అది ఆ పిల్లలకు శుభం చేస్తుందా?భర్తలుగా, కోడళ్లుగా మారిన పిల్లలూ... మీ నాన్న గురించి ఆలోచించండి. ఆయన సంతోషంగా ఉన్నాడా లేదా గుర్తించండి. మీ బాల్యంలో యవ్వనంలో మీ కోసం ఏమేమి చేశాడో గుర్తు చేసుకోండి. ఈ ఫాదర్స్ డేకి మీ నాన్నతో గడుపుతూ ఆయన మనసు మాట వినండి.ఒకనాడు పులిలా ఉండే నాన్న ఇవాళ తన గాంభీర్యం తగ్గించుకున్నాడు. నేటి నాన్న ఇంటి పని చేస్తాడు. అమ్మను అదిలించకుండా స్నేహంగా ఉంటాడు. పిల్లలను ఎత్తుకుంటాడు. ఆడిస్తాడు. వారితో సరదా కబుర్లు చెబుతాడు. కొట్టని, తిట్టని నాన్నలే ఇప్పుడు ఎక్కడ చూసినా. అంత మాత్రాన పిల్లలు తేలిగ్గా తీసుకుంటే తన సత్తా చూపే శక్తి నాన్నకు ఉంటుంది. -
ప్రధాని మోదీకి వైఎస్ జగన్ అభినందనలు
తాడేపల్లి: దేశ ప్రధానిగా వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోదీకి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్’లో వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. My heartfelt congratulations to Sri @narendramodi garu on taking oath as the Prime Minister of India for the third consecutive term.— YS Jagan Mohan Reddy (@ysjagan) June 9, 2024 ఆదివారం(జూన్9) ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో దేశ ప్రధానిగా నరేంద్రమోదీ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారంతో మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని పదవి చేపట్టిన రెండో వ్యక్తిగా మోదీ కొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఓత్ ఆఫ్ ఆఫీస్తో పాటు ఓత్ ఆఫ్ సీక్రెసీ ప్రమాణాన్ని మోదీతో రాష్ట్రపతి చేయించారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్,శ్రీలంక,మాల్దీవులు,మారిషస్ ప్రధానులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారంమోదీ 3.0లో .. 30 మంది కేబినెట్ మంత్రులు వీరే -
సీఎం యోగికి పీఎం మోదీ జన్మదిన శుభాకాంక్షలు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పుట్టినరోజు నేడు(జూన్ 5). ఈ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ప్రధాని మోదీ సీఎం యోగికి శుభాకాంక్షలు తెలియజేశారు.‘ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఉత్తరప్రదేశ్ ప్రగతికి, పేదలు, అణగారిన వర్గాల సాధికారతకు విశేష కృషి చేస్తున్నారు. రాబోయే కాలంలో దీర్ఘాయుష్షుతో ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను’ అని మోదీ ఆ ట్వీట్లో పేర్కొన్నారు.ప్రధాని మోదీ అభినందనలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ‘మీ హృదయపూర్వక శుభాకాంక్షలు నాకు అపారమైన స్ఫూర్తినిచ్చాయి. మీ విజయవంతమైన మార్గదర్శకత్వంలో ‘స్వయం-ఆధారిత ఉత్తరప్రదేశ్-అభివృద్ధి దిశగా ఉత్తరప్రదేశ్’ అనే భావనతో ముందుకు నడుస్తున్నాం. మీరు శుభాకాంక్షలు తెలిపినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు’ అని యోగి పేర్కొన్నారు. యోగి ఆదిత్యనాథ్ 1972, జూన్ 5న ఉత్తరాఖండ్లోని పౌరీ గర్వాల్ జిల్లాలో జన్మించారు. Birthday wishes to Uttar Pradesh CM, @myogiadityanath Ji on his birthday. He is working for UP’s progress and for empowering the poor and downtrodden. I wish him a long and healthy life in the times to come.— Narendra Modi (@narendramodi) June 5, 2024 -
దాక్షాయణి బర్త్ డే.. పుష్ప మేకర్స్ స్పెషల్ అప్డేట్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవేటేడ్ చిత్రం పుష్ప-2. ఈ చిత్రం కోసం బన్నీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, ఫస్ట్ సింగిల్ పుష్ప-2పై అంచనాలు మరింత పెంచేశాయి. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటిస్తోంది.అయితే ఇవాళ టాలీవుడ్ నటి, యాంకర్ అనసూయ బర్త్ డే కావడంతో మేకర్స్ ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. పుష్ప-2లో దాక్షాయణి ఫస్ట్ లుక్ను మేకర్స్ రివీల్ చేశారు. అనసూయ పోస్టర్ను చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తన అభిమాన నటికి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా.. ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.Wishing the talented @anusuyakhasba a very Happy Birthday ❤🔥She will be back with #Pushpa2TheRule as the wily 'Dakshayani' 💥Grand release worldwide on 15th AUG 2024.Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @SukumarWritings @MythriOfficial… pic.twitter.com/AzWpp9fzUT— Pushpa (@PushpaMovie) May 15, 2024 -
Celebrities With Their Mom's: మామ్స్తో సెలబ్రిటీలు, రెండు కళ్లూ చాలవు (ఫోటోలు)
-
టీమిండియా కెప్టెన్కు టాలీవుడ్ స్టార్ హీరో విషెస్..!
టాలీవుడ్ హీరో వెంకటేశ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బర్త్ డే సందర్భంగా స్పెషల్ విషెస్ తెలిపారు. ఆయనతో దిగిన ఫోటోను ట్విటర్లో పంచుకున్నారు. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా హీరో వెంకటేశ్కు క్రికెట్ అంటే విపరీతమైన అభిమానం. టీమిండియా మ్యాచ్ ఉందంటే చాలు స్టేడియంలో అలా వాలిపోతారు. ఐపీఎల్లోనూ సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్కు మద్దతుగా ఉంటారు. కాగా.. వెంకటేశ్ కొత్త ఏడాదిలో సైంధవ్ మూవీతో ప్రేక్షకులను పలకరించారు. సంక్రాంతికి రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. గుంటూరు కారం, హనుమాన్, నా సామిరంగ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడింది. Happy Birthday Hitman @ImRo45! Have an amazing one 🤗 pic.twitter.com/TF7Kv2qfwR— Venkatesh Daggubati (@VenkyMama) April 30, 2024 -
తన లవర్బోయ్కి అదితి లవ్లీ విషెస్
టాలెంటెడ్ హీరో సిద్ధార్థ పుట్టిన రోజు ఈ రోజు (ఏప్రిల్17) . ఈ సందర్భంగా సిద్ధార్థ్ ప్రేయసి, అందాల తార అదితి రావు హైదరీ స్పెషల్ విషెస్ తెలిపింది. ఈ సందర్బంగా తన కాబోయే భర్తతో లవ్లీ ఫోటోలను షేర్ చేసింది. "హ్యాపీయెస్ట్ బర్త్డే నా మేనికార్న్’’ కాబోయే భర్త కోసం పుట్టినరోజుకి విషెస అందించింది. ఎంగేజ్మెంట్ తరువాత ఇది ఫస్ట్ బర్త్డే కావడంతో అదితి ఆనందంలో మునిగితేలుతోంది. మురిపెంగా ప్రియుడిని లాటర్, చీర్ లీడర్ అంటూ పొగిడేసింది. కాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్న సిద్ధార్థ్ ప్రస్తుతం హీరోయిన్ అదితితో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు. 2021లో 'మహా సముద్రం' తర్వాత నుంచి వీరిద్దరూ డేటింగ్ ప్రారంభించారు.అయితే తెలంగాణలోని వనపర్తిలోని శ్రీరంగనాయక ఆలయంలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే వార్తలు హల్చల్ చేశాయి.అయితే పెళ్లి వార్తలను ఖండించిన సిద్ధార్థ్ తాము రహస్యంగా పెళ్లి చేసుకోలేదనీ, కుటుంబంతో ప్రైవేట్గా నిర్వహించిన ఒక పార్టీలో ఇద్దరికీ నిశ్చితార్థం జరిగిందని వెల్లడించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) -
ప్రధాని మోదీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు!
దేశంలో ఈరోజు శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. ప్రధాని మోదీ దేశ ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజల్లో అణువణువునా శ్రీరాముడు కొలువైవున్నాడని అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా శ్రీ రామ నవమి సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామ నవమి సందర్భంగా ప్రధాని మోదీ.. సోషల్ సైట్ ఎక్స్లో.. 'దేశవ్యాప్తంగా ఉన్న నా కుటుంబ సభ్యులకు శ్రీ రాముని జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఈ శుభ సమయంలో నా హృదయం భావోద్వేగంతో, కృతజ్ఞతతో నిండిపోయింది. ఈ సంవత్సరం లక్షలాది దేశప్రజల ఆకాంక్ష నెరవేరడాన్ని చూశాను. ఐదు శతాబ్దాల నిరీక్షణ తర్వాత ఈరోజు అయోధ్యలో శ్రీరామనవమిని ఘనంగా జరుపుకునే భాగ్యం మనకు లభించింది’ అని పేర్కొన్నారు. राम भारत की आस्था है, राम भारत का आधार है... pic.twitter.com/iyZm0ponNm — Narendra Modi (@narendramodi) April 17, 2024 అమిత్ షా కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు ‘జై శ్రీరామ్.. అందరికీ పవిత్రమైన శ్రీరామ నవమి పండుగ శుభాకాంక్షలు. మర్యాద పురుషోత్తముదైన శ్రీరాముడు తన జీవితంతో సత్యం, త్యాగం తదితర విలువలతో అత్యున్నత ఆదర్శాన్ని స్థాపించాడు. యావత్ ప్రపంచానికి మార్గనిర్దేశం చేసేందుకు కృషి చేశాడు. 500 ఏళ్ల తర్వాత ఈ ఏడాది స్వామి జన్మదినోత్సవాన్ని ఆయన జన్మస్థలంలో జరుపుకోవడం రామభక్తులందరికీ గర్వకారణం. అందరి క్షేమం కోరుతూ శ్రీరాముణ్ణి ప్రార్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు. The first Ram Navami after the Pran Pratishtha in Ayodhya is a generational milestone, weaving together centuries of devotion with a new era of hope and progress. This is a day crores of Indians waited for. Innumerable people devoted their lives to this sacred cause. May the… pic.twitter.com/2aJMLn1hhI — Narendra Modi (@narendramodi) April 17, 2024 -
రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీరామ నవమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలిపారు శ్రీ సీతారాముల ఆశీస్సులతో, రాష్ట్రానికి, ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. అలాగే, రామ నవమి సందర్భంగా సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్రకు నేడు విరామం ఇచ్చారు. తిరిగి రేపు(గురువారం) బస్సుయాత్ర షెడ్యూల్ ప్రకారం ప్రారంభమవుతుంది. ట్విట్టర్ వేదికగా సీఎం జగన్..‘తెలుగువారి తొలి పండుగ ఉగాది తరువాత వచ్చే మరో విశిష్టమైన పండుగ శ్రీరామ నవమి. శ్రీమహావిష్ణువు ఏడో అవతారమైన శ్రీరాముని జన్మదినాన్ని రామ నవమిగా జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా కూడా శ్రీరామ నవమి వేడుకను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. భక్తి శ్రద్ధలతో రాముణ్ని పూజిస్తారు. సీతారాముల కళ్యాణం, పట్టాభిషేకాన్ని వైభవంగా జరిపిస్తారు. రాముడు ధర్మ స్వరూపుడు.. సత్యనిష్ఠకూ ధర్మనిరతికీ ప్రతీక. శ్రీరామ జయం.. సకల ప్రజల విజయం. అందుకే అన్ని కాలాల్లోనూ ఆదర్శం రామరాజ్యం. ధర్మం పక్షాన నిలబడి, ప్రజలను మరింత బలసంపన్నులను చేయాలని శ్రీ రామచంద్ర ప్రభువును వేడుకుందాం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు’ తెలిపారు. రాముడు ధర్మ స్వరూపుడు.. సత్యనిష్ఠకూ ధర్మనిరతికీ ప్రతీక. శ్రీరామ జయం.. సకల ప్రజల విజయం. అందుకే అన్ని కాలాల్లోనూ ఆదర్శం రామరాజ్యం. ధర్మం పక్షాన నిలబడి, ప్రజలను మరింత బలసంపన్నులను చేయాలని శ్రీ రామచంద్ర ప్రభువును వేడుకుందాం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ శ్రీరామనవమి… — YS Jagan Mohan Reddy (@ysjagan) April 17, 2024 -
Eid 2024 : ఈద్ ముబారక్ అంటున్న ఈ సెలబ్రిటీలను గుర్తు పట్టారా (ఫోటోలు)
-
అందరికీ మంచి జరగాలి.. సీఎం జగన్ ఉగాది శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ క్రోధి నామ సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు, విజయాలు సిద్ధించాలని సీఎం ఆకాంక్షించారు. ఈ ఏడాది సమృద్ధిగా వానలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులకు మేలు కలగాలని, సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలని అన్నారు. కొత్త సంవత్సరంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో నా అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వాతాతలు, విద్యార్థులు అందరికీ మంచి జరిగి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. — YS Jagan Mohan Reddy (@ysjagan) April 9, 2024 -
అక్కినేని హీరోకు సమంత విషెస్.. పోస్ట్ వైరల్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్లో అగ్ర హీరోలందరితో సినిమాలు చేసింది. గతేడాది శాకుంతలం, ఖుషి సినిమాలతో అలరించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఇండియన్ వర్షన్ సిటాడెల్ వెబ్ సిరీస్లో నటిస్తోంది. వరుణ్ ధావన్తో కలిసి ఇందులో కనిపించనుంది. తాజాగా సమంత చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ బర్త్ డే విషెస్ తెలిపింది సామ్. ఈ మేరకు తన ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేసింది. క్యూట్ పప్పీతో అఖిల్ ఉన్న ఫోటోను పంచుకుంది. హ్యాపీ బర్త్ డే అఖిల్ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. అయితే అక్కినేని హీరో నాగచైతన్యను పెళ్లాడిన సమంత.. విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. గతేడాది అఖిల్ ఏజెంట్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపర్చింది. ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించారు. -
అడ్వాన్స్డ్ ఈద్ ముబారక్.. ఇఫ్తార్ విందులో సీఎం వైఎస్ జగన్
సాక్షి, పుట్టపర్తి/కదిరి అర్బన్/బత్తలపల్లి: అందరికీ మేలు జరగాలని, ముస్లిం సోదరులందరికీ ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు (అడ్వాన్స్డ్ ఈద్ ముబారక్) తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. సోమవారం సాయంత్రం శ్రీసత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని పీవీఆర్ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆయన హాజరయ్యారు. ముస్లిం సోదరులతో ఆప్యాయంగా మాట్లాడారు. విందులో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రి ఉషశ్రీచరణ్, ఎమ్మెల్సీలు కల్పలతారెడ్డి, జఖియాఖానమ్, పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి, మాజీ మంత్రి షాకీర్, మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్బాషా, కదిరి వైఎస్సార్సీపీ అభ్యర్థి బీఎస్ మక్బుల్, సీనియర్ నేతలు వజ్రభాస్కర్రెడ్డి, పూల శ్రీనివాసరెడ్డి, పెద్దసంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ హోలీ శుభాకాంక్షలు
సాక్షి, గుంటూరు: హోలీ పండుగ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘మన జీవితాల్లో సంతోషాన్ని వికసించే వసంత రుతువుకు స్వాగతం పలుకుతూ.. రంగుల హోలీ అందరికీ ఆనందాన్ని పంచాలని కోరుకుంటున్నా’ అని తన సందేశంలో పేర్కొన్నారాయన. అదే సమయంలో.. ‘చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక హోలీ. ప్రజల జీవితాల్లో ఈ పండుగ సుఖసంతోషాలను నింపాలని కోరుకుంటున్నాను. అందరికీ హోలీ శుభాకాంక్షలు’ అంటూ ఎక్స్ ఖాతాలోనూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక హోలీ. ప్రజల జీవితాల్లో ఈ పండుగ సుఖసంతోషాలను నింపాలని కోరుకుంటున్నాను. అందరికీ హోలీ శుభాకాంక్షలు. — YS Jagan Mohan Reddy (@ysjagan) March 25, 2024 -
ముస్లింలకు సీఎం జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభం కానున్న సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘నెల రోజులపాటు అత్యంత నియమ నిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే ఈ పుణ్య రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనది. మహనీయుడైన మహ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించినది. రంజాన్ మాసంలోనే కావడంతో ముస్లింలు ఈ నెలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తారు. మనిషిలోని చెడు భావాల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపుతూ మానవాళికి హితాన్ని బోధించే గొప్ప పండుగ రంజాన్. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే జీవితమని రంజాన్ మాసం గొప్ప సందేశం ఇస్తుంది. కఠిన ఉపవాస దీక్ష ఆచరిస్తూ, దైవ చింతనతో గడిపే ఈ మాసంలో ముస్లింలు తమ సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు దానధర్మాల ద్వారా ఖర్చు చేస్తారు. ముస్లింలకు అల్లాహ్ దీవెనలు లభించాలని కోరుతున్నా. రంజాన్ మాసం ప్రారంభం కానున్న సందర్భంగా ముస్లింలు అందరికీ శుభాక్షాంక్షలు’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు సీఎంఓ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. -
మెగా డాటర్కు స్పెషల్ విషెస్.. లావణ్య త్రిపాఠి, ఉపాసన పోస్ట్ వైరల్!
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురిగా సుస్మిత కొణిదెల అభిమానులకు తెలుసు. టాలీవుడ్లో కాస్ట్యూమ్స్ డిజైనర్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. చిరంజీవి ఖైదీ నంబర్ 150, రంగస్థలం, సైరా నరసింహ రెడ్డి మూవీకి ఆమె కాస్ట్యూమ్ డిజైనర్గా వ్యవహరించింది. తక్కువ సినిమాలకే పని చేసినా టాలీవుడ్లో మంచి కాస్ట్యూమ్ డిజైనర్గా పేరు గడించింది. తాజాగా ఇవాళ చిరంజీవి పెద్దకూతురు, మెగా డాటర్ సుస్మిత కొణిదెల బర్త్ డే కావడంతో పలువురు ఇండస్ట్రీ తారలు విషెస్ చెబుతున్నారు. మెగా కోడళ్లు ఉపాసన, లావణ్య త్రిపాఠి సోషల్ మీడియా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. బర్త్ డే విషెస్ చెబుతూ తమ ఇన్స్టా స్టోరీస్లో ఫోటోలు షేర్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు మెగా డాటర్కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. -
అనంత్-రాధిక పెళ్లి : తల్లిగా నీతా అంబానీ రెండు కోరికలు
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి సందడి జోషే వేరుగా ఉంది. రోజుకో విశేషం వార్తల్లో నిలిచింది. ఈఏడాది జూన్లో జరగనున్న అనంత్- రాధికా పెళ్లికి సంబంధించి ప్రతీ వేడుక ముచ్చటగా నిలుస్తోంది. వివాహ వేడుకు కంటే ముందు ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఆకర్షణీయంగా నిలుస్తున్నాయి. వ్యాపారవేత్త అనంత్ అంబానీ , పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ వెడ్డింగ్ బెల్స్కు ముహూర్తం ఖరారైన ఈ నేపథ్యంలో ప్రీ వెడ్డింగ్ వేడుకలు షురూ అయ్యాయి. జామ్నగర్లోని రిలయన్స్ గ్రీన్స్ కాంప్లెక్స్లో జరిగే మూడు రోజుల ఈ వేడుకలకు ఇప్పటికే అంబానీ ఫ్యామిలీ జామ్నగర్ చేరుకుంది. బుధవారం వేలాదిమందికి అన్నసేవతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అటు అతిథులు సైతం ఒక్కొక్కరుగా జామ్నగర్ చేరుకుంటున్నారు. మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, బాలీవుడ్ సూపర్ స్టార్లు షారుక్ ఖాన్, దీపికా పదుకొనే, రణబీర్ కపూర్, అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ సహా క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ సహా దాదాపు 2వేల మంది అతిథులు హాజరుకానున్నారు. ఆ రెండు ఆకాంక్షలతోనే జామ్నగర్లో.. ఇవన్నీ ఒక ఎత్తయితే అనంత్ అంబానీ తల్లి, నీతా అంబానీ విడుదల చేసిన స్పెషల్ వీడియో సందేశం ఇంటర్నెట్లో వైరల వుతోంది. జామ్నగర్లోనే ధీరూభాయ్ అంబానీ, ముఖేష్ రిలయన్స్ సామ్రాజాన్ని నిర్మించారు. తన కరియర్ కూడా అక్కడే మొదలైందనీ, అందుకే ఈ వారసత్వాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నామని తెలిపారు. అలాగే ఎడారి లాంటి ప్రదేశాన్ని పచ్చని ప్రకృతితో అలరారేలా రిలయన్స్ గ్రీన్స్ను తీర్చిదిద్దామని పేర్కొన్నారు. అలాగే కళలు, సంస్కృతీ సంప్రదాయాలంటే ఇష్టపడే నీతా అంబానీ ఈ వారసత్వాన్ని ప్రతిబింబించేలా తన తనయుడి పెళ్లి ముచ్చట ఉండాలని కోరు కుంటున్నారట. తమ మూలాల్ని గుర్తించుకునేలా కూడా వేడుకలు ఘనంగా ఉండాలని భావిస్తున్నామన్నారు. అందుకే గుజరాత్లోని రిలయన్స్ గ్రీన్స్ను వేదికగా ఎంచుకున్నామని ఆమె ప్రకటించారు. #WATCH | Jamnagar, Gujarat | Founder and chairperson of Reliance Foundation Nita Ambani speaks on the pre-wedding function of her son Anant Ambani with Radhika Merchant. "...When it came to my youngest son Anant's wedding with Radhika, I had two important wishes - first, I… pic.twitter.com/udOVozqbWP — ANI (@ANI) March 1, 2024 -
రకుల్-భగ్నానీ జంటకు ప్రధాని మోదీ స్పెషల్ విషెస్ వైరల్
PM Modi Wishes to Rakul-Jackky: మూడుమూళ్లు బంధంతో ఒక్కటైన నూతన జంట రకుల్ ప్రీత్ సింగ్-జాకీభగ్నానీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు అందించారు. దీనికి సంబంధించిన ఒక నోట్ను స్వయంగా రకుల్ ట్విటర్ వేదికగా షేర్ చేసింది. ‘‘మా సరికొత్త జర్నీలో మీ ఆశీర్వాదాలు, మా హృదయాలను తాకాయి. ఇవి మాకెంతో విలువైనవి.. ధన్యవాదాలు’’ అంటూ రకుల్, జాకీ ఇద్దరూ మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. దీంతో ఇది వైరల్గా మారింది. Your blessings touch our hearts deeply, Prime Minister @narendramodi ji. Thank you for your kind wishes as we begin this meaningful new chapter.@Rakulpreet pic.twitter.com/6VOfWhzl68 — Jackky Bhagnani (@jackkybhagnani) February 22, 2024 ఫిబ్రవరి 21న గోవాలో ఘనంగా వివాహం చేసుకున్నారు రకుల్-జాకీ జంట. దీంతో కొత్తగా పెళ్లయిన ఈ జంటకు అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ జాబితాలో దేశ ప్రధాని మోదీ చేరడం విశేషంగా నిలిచింది. తన బిజీ షెడ్యూల్ కారణంగా మోదీ రకుల్-జాకీ పెళ్లికి హజరుకాలేక పోయానని తెలిపిన మోదీ నూతన దంపతులకు స్పెషల్ ఆశీర్వాదాలు అందించారు. తనకు ఆహ్వానం పంపినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాగా ధనికవర్గాలు విదేశాల్లో కాకుండా భారతదేశంలోనే డెస్టినేషన్ పెళ్లిళ్లు చేసుకోవాలని, తద్వారా, పర్యాటక రంగానికి, ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాలన్న భారత ప్రధాని మోదీ విజ్ఞప్తి మేరకు విదేశాల్లో చేసుకోవాలనుకున్న వీరి పెళ్లి తొలి ప్లాన్ను గోవాకు మార్చుకున్నారనే వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. -
Medaram Jathara: తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
సాక్షి,హైదరాబాద్: మేడారం జాతర ప్రారంభమైన సందర్భంగా తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ (ట్విటర్)లో బుధవారం ఆయన ఒక పోస్ట్ చేశారు. ‘గిరిజనుల అతిపెద్ద పండుగలలో ఒకటి..మేడారం జాతర. భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక ఈ జాతర. సమ్మక్క-సారక్కలకు ప్రణమిల్లుదాం. వారు ప్రదర్శించిన గొప్ప ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తుచేసుకుందాం’అని ట్వీట్లో ప్రధాని పేర్కొన్నారు. తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం మహా జాతర బుధవారం(ఫిబ్రవరి 21) నుంచి ప్రారంభం కానుంది. సమ్మక్క, సారలమ్మలు వనం వీడి జనారణ్యంలోకి వచ్చి గద్దెలపై కొలువుదీరనున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మేడారంలో మహా జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. మొక్కులు, దర్శనం కోసం భారీగా తరలి వచ్చే వారితో మేడారం పరిసరాలు పూర్తి జనసంద్రంగా మారనున్నాయి. 24 వరకు ఈ జాతర జరగనుంది. గిరిజనుల అతిపెద్ద పండుగలలో ఒకటైన,మన సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే చైతన్యవంతమైన వ్యక్తీకరణ అయిన ఈ సమ్మక్క-సారక్క మేడారం జాతర ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు. ఈ జాతర భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక. మనం సమ్మక్క-సారక్కలకు ప్రణమిల్లుదాం, వారు… — Narendra Modi (@narendramodi) February 21, 2024 ఇదీ చదవండి.. నేటి నుంచి మేడారం జాతర -
ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా: రామ్ చరణ్ స్పెషల్ పోస్ట్!
మెగా హీరో, మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంతో బిజీగా ఉన్నారు. శంకర్ డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలే హైదరాబాద్లో షూటింగ్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాను ఈ ఏడాది సమ్మర్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే 'గేమ్ ఛేంజర్' తర్వాత చెర్రీ మరో చిత్రానికి ఓకే చెప్పారు. ఉప్పెన్ ఫేమ్, డైరెక్టర్ బుచ్చిబాబుతో జతకట్టనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు ఆర్సీ16 అనే వర్కింగ్ టైటిల్ ఖరారు చేశారు. ఈ మూవీ రామ్ చరణ్ కెరీర్లో 16వ సినిమాగా నిలవనుంది. ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇవాళ డైరెక్టర్ బుచ్చిబాబు సనా బర్త్డే కావడంతో పలువురు సినీ ప్రముఖులు విషెస్ తెలిపారు. తాజాగా రామ్ చరణ్ బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. డైరెక్టర్ బుచ్చిబాబుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. ఈ ఏడాదిలో మీరు మరింత ప్రేరణ, ఆవిష్కరణలతో ముందుకు సాగాలని కోరుకుంటున్నా అంటూ పోస్ట్ చేశారు. ఆర్సీ16 కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని.. సరికొత్త ఉత్సాహంతో పనిచేద్దామని ట్విటర్లో రాసుకొచ్చారు. అంతకుముందే ఈ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం రామ్ చరణ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Warmest birthday wishes to @BuchiBabuSana 🎉 Here's to a year brimming with inspiration and innovation. Let's stir up some excitement with our next film #RC16 ✨ — Ram Charan (@AlwaysRamCharan) February 15, 2024 -
స్టార్ జంటపై విడాకుల రూమర్స్.. భర్తలాగే సింపుల్గా చెప్పేసింది!
బాలీవుడ్ మోస్ట్ ఫేమస్ జంటల్లో ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్ ఒకరు. ఈ మాజీ ప్రపంచసుందరి బాలీవుడ్ హీరోను పెళ్లాడింది. వీరిద్దరికీ ఆరాధ్య అనే కూతురు ఉంది. 2007లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జోడీపై ఇటీవల పెద్దఎత్తున రూమర్స్ వస్తున్నాయి. ఈ జంట విడాకులు తీసుకోబోతోందంటూ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఎందుకంటే గతంలో ఐశ్వర్యరాయ్ తన కూతురితో కలిసి 50వ పుట్టినరోజు వేడుకను జరుపుకుంది. ఆ సమయంలో కేవలం ఆమె తన తల్లి, కుమార్తెతో మాత్రమే ఉన్నారు. అంతేకాకుండా ఆరోజు అత్తమామలు ఎవరూ కూడా శుభాకాంక్షలు తెలుపలేదు. అభిషేక్ కూడా చాలా సింపుల్గా రెండు ముక్కల్లో ఒక పోస్ట్ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతే కాకుండా ఎంతో ఇష్టంగా ఐశ్వర్య ఇచ్చిన ఉంగరాన్ని కూడా ప్రస్తుతం అభిషేక్ ధరించడం లేదని తెలిసింది. దీంతో ఈ జంట విడాకులు తీసుకుంటోందన్న వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే వీటిపై ఇంతవరకు ఎవరూ స్పందించలేదు. ఈ వార్తలను ఖండించలేదు కూడా. అయినప్పటికీ సోషల్ మీడియాలో రూమర్స్ ఏమాత్రం ఆగడం లేదు. అయితే తాజాగా ఐశ్వర్యరాయ్ పెట్టిన పోస్ట్తో అలాంటి వాటికి చెక్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే బాలీవుడ్ హీరో, ఐశ్వర్యారాయ్ భర్త తన 48వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్, సినీతారలు పలువురు ఆయనకు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు. తమ అభిమాన హీరో బర్త్డే కావడంతో ఉదయం నుంచి బాలీవుడ్ ఫ్యాన్స్ నెట్టింట సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఐశ్వర్యరాయ్ తన భర్తకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపింది. తన కూతురు, భర్తతో కలిసి ఉన్న ఫోటోను ఇన్స్టాలో పంచుకుంది. అంతే కాకుండా అభిషేక్ బచ్చన్ చిన్నప్పటి ఫోటోను షేర్ చేసింది. ఐశ్వర్యరాయ్ తన ఇన్స్టాలో రాస్తూ.. 'ఇదిగో మీకివే నా జన్మదిన శుభాకాంక్షలు. మీరు చాలా సంతోషం, ప్రేమ, ప్రశాంతత, శాంతి, ఆరోగ్యంతో ఉండాలని.. ఆ దేవుడు ఆశీర్వాదంతో ఎల్లప్పుడు మీరు ప్రకాశిస్తూ ఉండాలని కోరుకుంటున్నా' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అయితే గతంలో ఐశ్వర్యరాయ్ బర్త్ డే సందర్భంగా అభిషేక్ ఇలానే సింపుల్గా విషెస్ చెప్పారు. ఐశ్వర్య కూడా కాస్తా లేటైనా భర్తకు అదే తరహాలో విషెస్ చెబుతూ పోస్ట్ పెట్టింది. ఇది చూసిన అభిమానులు తమ అభిమాన హీరోకు హ్యాపీ బర్త్ డే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో ఈ ఒక్క పోస్ట్తో విడాకుల రూమర్స్కు చెక్ పెట్టిందంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక సినిమాల విషయాకొస్తే గతేడాది పొన్నియిన్ సెల్వన్ చిత్రాలతో ఐశ్వర్యరాయ్ మెప్పించింది. అభిషేక్ సైతం గతేడాది గూమర్ చిత్రంతో అలరించాడు. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) -
భార్యకు స్పెషల్గా విష్ చేసిన స్టార్ హీరో.. ఫోటో వైరల్!
బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ గతేడాది బవాల్ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ అతనికి జోడీగా నటించింది. ఈ ఏడాది సిటాడెల్-2తో పాటు కోలీవుడ్లో మరో యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. కాగా.. తన చిన్ననాటి స్నేహితురాలు, ఫ్యాషన్ డిజైనర్ అయిన నటాషా దలాల్ను పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్లపాటు డేటింగ్లో ఉన్న వరుణ్, నటాషా దలాల్ జనవరి 24, 2021న అలీబాగ్లో జరిగిన వివాహా వేడుకలకు బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. తాజాగా ఈ జంట వార్షికోత్సవం సందర్భంగా తన భార్యకు స్పెషల్ విషెస్ చెప్పారు బాలీవుడ్ హీరో. పెళ్లికి ముందు తనకు ప్రపోజ్ చేసిన అరుదైన ఫోటోను పంచుకున్నారు. హ్యాపీ త్రీ బేబీ అంటూ.. ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. మూడున్నర ఏళ్ల క్రితం మార్క్ ఆంథోనీ పాట ప్లే అయినప్పుడు ప్రపోజ్ చేసిన ఫోటో అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇది చూసిన అభిమానులు తమ హీరోకు విషెస్ చెబుతున్నారు. కాగా.. గతేడాది వరుణ్ నటించిన బవాల్ నేరుగా అమెజాన్ ప్రైమ్లో విడుదలైన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by VarunDhawan (@varundvn) -
నమ్రతకు మహేశ్ బాబు స్పెషల్ విషెస్!
టాలీవుడ్లో మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్లో ప్రిన్స్ మహేశ్ బాబు- నమ్రత శిరోద్కర్ జంట ఒకరు. ఇవాళ నమ్రత శిరోద్కర్ 53వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా మహేశ్ బాబు తన భార్యకు స్పెషల్ విషెస్ తెలిపారు. హ్యాపీ బర్త్ డే ఎన్ఎస్జీ అంటూ.. లవ్ సింబల్ జత చేస్తూ ట్వీట్ చేశారు. నా జీవితంలో ప్రతి రోజును అద్భుతంగా తీర్చిదిద్దుతున్న నువ్వు ఈ ఏడాదిలో మరింత ప్రేమ, ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన అభిమానులు సైతం నమ్రతకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా.. టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్బాబు, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన 'గుంటూరు కారం' సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అభిమానుల భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. సందడి చేయనుంది. సినిమా రిలీజ్కు ముందు గుంటూరులో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో అభిమానులనుద్దేశించి మాట్లాడుతూ మహేశ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మీరే నాకు అమ్మా, నాన్న అంటూ ఫుల్ ఎమోషనల్ అయ్యారు. ఇప్పటి నుంచి నాకు మీరే అన్నీ అంటూ మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్స్టాలో నమ్రత పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. Happy birthday NSG…♥️♥️♥️ Grateful for another year filled with love and togetherness. Thank you for making my every day better 😍😍😍 Have a rocking 2024!! pic.twitter.com/uy6gK8AiWs — Mahesh Babu (@urstrulyMahesh) January 22, 2024 -
అభిమానులకు దేవర స్పెషల్ విషెస్!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు, అభిమానులకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ విష్ చేశారు. పండుగ సందర్భంగా ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. ఇది చూసిన అభిమానులు సైతం యంగ్ టైగర్కు విషెస్ చెబుతున్నారు. కాగా.. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం ద్వారానే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది శ్రీదేవి ముద్దుల కూతురు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ సైతం కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే దేవరకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ కాగా.. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్లింప్స్లో సముద్రంలో ఫైట్ సీన్ను చూసిన ఫ్యాన్స్ దేవర కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. Wishing everyone a very Happy Pongal. — Jr NTR (@tarak9999) January 14, 2024 -
ఏపీ ప్రజలకు సీఎం జగన్ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు
-
ఇది ఆరంభం మాత్రమే.. కేశినేని నాని ట్వీట్
సాక్షి, విజయవాడ: ఇది ఆరంభం మాత్రమేనంటూ టీడీపీకి చురకలు అంటించారు కేశినేని నాని. వైఎస్సార్సీపీలో చేరిన తిరువూరు మాజీ ఎమ్మెల్యే స్వామిదాసుకు ఆయన ఎక్స్(ట్విట్టర్) ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. మనల్ని అవమానించిన వాళ్లకు గుణపాఠం చెబుదాం అంటూ స్వామిదాసును ఉద్దేశించి కేశినేని ట్వీట్ చేశారు. కాగా, ఎన్టీఆర్ జిల్లాలో తెలుగు దేశం పార్టీకి పెద్ద దెబ్బ పడింది. తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ టీడీపీని వీడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారాయన. గురువారం సాయంత్రం సీఎం క్యాంప్ కార్యాలయంలో స్వామిదాస్కు కండువా కప్పి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. స్వామిదాస్తో పాటు ఆయన సతీమణి సుధారాణి కూడా వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు. చంద్రబాబులో మానవత్వం మచ్చుకైనా లేదని.. ఎవరితోనూ మానవీయతతో వ్యవహరించరని తిరువూరు నల్లగట్ల స్వామిదాస్ అన్నారు. గురువారం సాయంత్రం సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీ పార్టీలో చేరిన ఆయన సాక్షి టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘‘అవసరం లేకపోతే చంద్రబాబు ఎవర్నీ పట్టించుకోరు. ఆయన ఎవరితోనూ మానవీయతతో వ్యవహరించరు. దాదాపుగా 30 ఏళ్లుగా టీడీపీలో పని చేసినా కనీసం ఇంట్లోకి కూడా రానివ్వలేదు. భార్యాభర్తలం పది రోజులపాటు చంద్రబాబు ఇంటి ముందు ఎదురుచూసినా ఫలితం లేదు. టీడీపీ నేతలే మాకు వెన్నుపోటు పొడిచారు. Congratulations my dear Swamy Das and Sudha Rani. This is just a beginning we shall teach a lesson to everyone who has humiliated us. pic.twitter.com/i4aQt3nH46 — Kesineni Nani (@kesineni_nani) January 11, 2024 -
ఫ్యాన్స్కు కల్యాణ్ దేవ్ స్పెషల్ విషెస్.. పోస్ట్ వైరల్!
టాలీవుడ్ హీరో కల్యాణ్ దేవ్ టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. విజేత సినిమాతో టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత సూపర్ మచ్చి, కిన్నెరసాని చిత్రాలతో మెప్పించారు. మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజను.. కల్యాణ్ దేవ్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి నవిష్క అనే కూతురు కూడా ఉంది. అయితే ప్రస్తుతం శ్రీజ, కల్యాణ్ దేవ్ దూరంగా ఉంటున్నారు. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా కల్యాణ్ దేవ్ తన ఫ్యాన్స్కు విషెస్ తెలిపారు. తన కూతురు నవిష్కతో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ పోస్ట్ చేశారు. మమ్మల్ని అదరిస్తున్న ప్రతి ఒక్కరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటూ తన ఇన్స్టాలో రాసుకొచ్చారు. మాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఇది చూసిన అభిమానులు సైతం హీరోకు విషెస్ చెబుతున్నారు. కాగా.. ఇటీవలే నవిష్క ఐదేళ్లు పూర్తి చేసుకుని ఆరో వసంతంలోకి అడుగుపెట్టింది. నవిష్క బర్త్ డే వేడుకను సెలబ్రేట్ చేసుకున్నారు. View this post on Instagram A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev) View this post on Instagram A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev) -
దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు!
నూతన సంవత్సరం-2024 సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు అందరికీ శ్రేయస్సు, శాంతి, మంచి ఆరోగ్యం సమకూరాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. మైక్రో-బ్లాగింగ్ సైట్ ‘ఎక్స్’(గతంలో ట్విట్టర్)లో ‘ప్రతి ఒక్కరికీ 2024 అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం అందరికీ శ్రేయస్సు, శాంతి, మెరుగైన ఆరోగ్యం సమకూరాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ‘అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 అందరికీ సంతోషాన్ని, శాంతిని, శ్రేయస్సును అందించాలని కోరుకుంటున్నాను. సమ్మిళిత, స్థిరమైన, అభివృద్ధికి దోహదపడే కొత్త నిబద్ధతతో నూతన సంవత్సరాన్ని స్వాగతిద్దాం’ అని ఆమె ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ ఇలా రాశారు ‘ప్రతి భారతీయునికి 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరం అందరికీ శాంతి, శ్రేయస్సు, ఆనందాన్ని అందించాలని కోరుకుంటున్నాను. భారతదేశ పురోగతి, శ్రేయస్సుకు దోహదపడే దృఢ నిబద్ధతతో నూతన సంవత్సరాన్ని ప్రారంభిద్దాం’ అని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దేశప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘2024 నూతన సంవత్సరం సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు' అని రాశారు. భారతదేశంతో పాటు ప్రపంచమంతా 2024కు ఘనంగా స్వాగతం పలికింది. ఇది కూడా చదవండి: 2024.. దునియాలో ఏం జరగనుంది? "Wishing everyone a splendid 2024": PM Modi extends New Year wishes to people Read @ANI Story | https://t.co/mlu0Wa1zb2#PMModi #NewYear #NewYears2024 pic.twitter.com/k4j6q3NyPn — ANI Digital (@ani_digital) January 1, 2024 -
తెలంగాణ ప్రజలకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్
-
రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ న్యూ ఇయర్ విషెస్
-
తారకరత్న కూతురు బర్త్ డే.. అలేఖ్య ఎమోషనల్ పోస్ట్!
నందమూరి కుటుంబం నుంచి 'ఒకటో నంబర్ కుర్రాడు'తో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు తారకరత్న. హీరోగానే కాకుండా విలన్గానూ ప్రేక్షకుల్ని తారక్ అలరించారు. ఆపై రాజకీయాల్లో రావాలనే ఆశయంతో తొలి అడుగు కూడా వేశారు. కానీ ఊహించని పరిణామాలతో చిన్నవయుసులోనే గుండెపోటుతో తారకరత్న మరణించిన విషయం తెలిసిందే. (ఇది చదవండి: ఈ ఆనంద సమయంలో మీరు లేరు.. తారకరత్నను గుర్తుచేసుకున్న ఆలేఖ్య) తారకరత్నకు అలేఖ్యరెడ్డితో పెళ్లి కాగా.. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. ఇవాళ తారకరత్న పెద్ద కూతురు నిష్క బర్త్ డే కావడంలో ఆయన భార్య ఇన్స్టాలో పోస్ట్ చేశారు. నువ్వు ఈ లోకంలోకి వచ్చిన నిముషం నుంచి మాకెంతో గర్వంగా ఉందంటూ రాసుకొచ్చింది. నీ నువ్వు, ప్రేమ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా అంటూ కూతురికి బర్త్ డే విషెస్ తెలిపారు. మీ ప్రతి అడుగులో మిమ్మల్ని ప్రేమించడానికి, మద్దతు ఇవ్వడానికి మీ మమ్ము(అమ్మ) ఎల్లప్పుడూ మీతోనే ఉంటుందని ఎమోషనలైంది. అలేఖ్య తన కూతురికి విషెస్ చెబుతూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నిష్కతో పాటు తారకరత్న, అలేఖ్య రెడ్డికి కవల పిల్లలు తాన్యారామ్, రేయాలు కూడా ఉన్నారు. పిల్లల పేర్లలో ఎన్టీఆర్ మొదట పుట్టిన పాపకు నిష్క అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఒక పాప, బాబు కవలలుగా పుట్టారు. వీరికి తాన్యారామ్, రేయా అని పేర్లు పెట్టారు. ఈ ముగ్గురి మొదటి అక్షరాలను కలిపితే తారకరత్న తాతగారు అయిన ఎన్టీఆర్ పేరు వస్తుంది. ఈ ముగ్గురి మొదటి అక్షరాలను కలిపితే ఎన్టీఆర్ పేరు వస్తుంది. ఇంగ్లీష్ అక్షరాలు నిష్క లో మొదటి అక్షరం N, తాన్యారామ్లో T, రేయాలో R.. ఇలా ఎన్టీఆర్ పేరు వచ్చేలా ముగ్గురు పిల్లలకు పేర్లు పెట్టారు తారకరత్న. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Nandamuri Alekhya (@alekhyatarakratna) -
ప్రియుడికి స్పెషల్ విషెస్ చెప్పిన 'సరైనోడు' భామ.. పోస్ట్ వైరల్!
రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో స్టార్ హీరోలందరితో సినిమాల్లో నటించింది. కెరటం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన భామ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత లౌక్యం, సరైనోడు, నాన్నకు ప్రేమతో, ధృవ, కిక్-2 లాంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఇండియన్-2, అయాలన్ చిత్రాల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఆమె ప్రియుడితో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఆమె బాయ్ఫ్రెండ్, బాలీవుడ్ హీరో జాకీ భగ్నానీ స్పెషల్ విషెస్ చేసింది ముద్దుగుమ్మ. ఇవాళ అతని బర్త్ డే కావడంతో ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మీ జీవితంలో ప్రతిరోజు అనుకునవన్నీ జరగాలని కోరుకుంటున్నానంటూ పోస్ట్ చేసింది. నీలాంటి అమాయకత్వం, దయ, నవ్వించే గుణంతో ఎవరూ ఉండరేమో అంటూ కొనియాడారు. ఇలాగే జీవితంలో మరింత ముందుకు సాగాలని ఆశిస్తున్నట్లు రకుల్ రాసుకొచ్చింది. కాగా.. రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ డేటింగ్లో ఉన్నట్లు గతేడాది ప్రకటించిన సంగతి తెలిసిందే. జాకీ భగ్నానీ హీరో, నిర్మాత, వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. ఆయన 2009లో కల్ కిస్నే దేఖా సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) -
సీఎం జగన్కు మహేశ్ బాబు స్పెషల్ విషెస్!
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి సూపర్ స్టార్ మహేశ్ బాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్ ద్వారా విషెస్ చెప్పారు. ఈ ఏడాది మీరు మరిన్ని విజయాలు సాధించాలని.. నిండు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నట్లు ట్వీట్లో రాసుకొచ్చారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున సీఎం జగన్కు విషెస్ తెలిపారు. కాగా..సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్నారు. త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్ ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. Happy birthday to the honourable CM, @ysjagan. Wishing you a year filled with happiness, success, and good health! — Mahesh Babu (@urstrulyMahesh) December 21, 2023 -
అడవిబిడ్డకు అపూర్వ స్వాగతం.. మల్లంపల్లిలో మాట్లాడుతున్న సీతక్క!
వరంగల్: రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆదివారం తొలిసారిగా నియోజకవర్గంలో అడుగు పెట్టిన ఆమెకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో శ్రేణులు బ్రహ్మరథం పట్టారు. అనంతరం ములుగు జిల్లా ప్రారంభమయ్యే తొలి గ్రామం మహ్మద్గౌస్పల్లి నుంచి విజయోత్సవ ర్యాలీ మొదలైంది. ఇక్కడ కార్యకర్తలు మంత్రిని గజమాలతో సన్మానించారు. ర్యాలీ మల్లంపల్లి, జాకారం, ములుగు, జంగాలపల్లి, జవహర్నగర్, మచ్చాపూర్, చల్వాయి, గోవిందరావుపేట, పస్రా మీదుగా మేడారం వరకు కొనసాగింది. మహ్మద్గౌస్పల్లిలో గజమాలతో స్వాగతం గట్టమ్మకు చీర సారె.. గట్టమ్మ ఆలయం వద్ద మంత్రికి మహిళలు కోలాటాలు, బంజార, ఆదివాసీ నృత్యాలతో స్వాగతం పలికారు. అనంతరం ఆమె గట్టమ్మ తల్లికి చీరసారె, పసుపు–కుంకుమలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అక్కడి నుంచి ప్రచార రథంలో ములుగు వరకు ర్యాలీగా వచ్చారు. మంత్రి పర్యటనకు ఎస్పీ గాష్ఆలం ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి కూచన రవళిరెడ్డి, కిసాన్ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్గౌడ్, బానోత్ రవిచందర్, వంగ రవియాదవ్తోపాటు అధికార ప్రతినిధి అహ్మద్పాషా, సీనియర్ నాయకుడు బాధం ప్రవీణ్ కుమార్, ఒజ్జల కుమార్, ఇమ్మడి రాజుయాదవ్, పట్టణ అధ్యక్షుడు చింతనిప్పుల భిక్షపతి, రేవంత్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలే నా కుటుంబ సభ్యులు.. ర్యాలీ సందర్భంగా మల్లంపల్లి, ములుగులో సీతక్క మాట్లాడుతూ.. ములుగు నియోజకవర్గం నా ఇల్లు.. ప్రజలే నా కుటుంబ సభ్యులు.. భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. 20 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ప్రజలకు దూరంగా ఉండలేదని, అధికారం ఉందనే భావనను మరిచి ప్రజల మధ్యలో ఉండి వారికి సేవ చేస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్నా ములుగు ఆడబిడ్డగా, ఆత్మీయ సోదరిగానే ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూ ముందుకుసాగుతానన్నారు. సమ్మక్కకు మొక్కుతున్న మంత్రి సీతక్క నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతోపాటు ప్రజా సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు. రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీ, జెడ్పీటీసీ, సింగిల్ విండో ఎన్నికల్లో ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలని పార్టీ ప్రజా ప్రతినిధులను కోరారు. అనంతరం జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ, ఆర్టీసీ బస్టాండ్ సమీపాన ఉన్న అంబేడ్కర్ విగ్రహాలకు సీతక్క పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సమక్క–సారలమ్మలను దర్శించుకున్న తర్వాత ఐటీడీఏ అతిథి గృహంలో మేడారం జాతరపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇవి కూడా చదవండి: పాలనలో మార్పు చూపిస్తాం! : దుద్దిళ్ల శ్రీధర్బాబు -
శరద్ పవార్కు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ 83వ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో శుభాకాంక్షలు చెప్పిన మోదీ.. ‘శరద్ పవార్కు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షు పొందాలని కోరుకుంటున్నాను’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. కాగా దేశంలోనే అత్యంత అనుభవం కలిగిన రాజకీయ నేతలలో శరద్ పవార్ ఒకరు. శరద్ పవార్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆయనకు రాజకీయ ప్రత్యర్థులు ఉన్నప్పటికీ పార్టీలకు అతీతంగా ఆయన పలువురు నేతలలో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తుంటారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ 1999లో ఈ పార్టీని స్థాపించారు. 27 ఏళ్ల పిన్నవయసులోనే తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. నాలుగు సార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, రక్షణ మంత్రిగా కూడా పనిచేశారు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగానూ వ్యవహరించారు. సోనియా గాంధీ విదేశీయురాలంటూ శరద్పవార్ వ్యాఖ్యలు చేసిన దరమిలా పార్టీలో చీలికలు రావడంతో ఆయన ఎన్సీపీని స్థాపించారు. ఈ పార్టీ అనతి కాలంలోనే జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది. అయితే ఇటీవలే ఈ ట్యాగ్ను కోల్పోయింది. శరద్ పవార్ మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతానికి చెందిన నేత. రాజకీయ వర్గాల్లో ఆయనను చాణక్యుడు అని కూడా పిలుస్తుంటారు. కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీల మధ్య కూటమి ఏర్పాటులో శరద్పవార్ కీలక పాత్ర పోషించారు. ఇది కూడా చదవండి: శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠకు 60 గంటలపాటు పూజలు My best wishes to Shri Sharad Pawar Ji on his birthday. May he be blessed with a long and healthy life. @PawarSpeaks — Narendra Modi (@narendramodi) December 12, 2023 -
పొరుగు రాష్ట్రాలతో స్నేహభావం.. సీఎం జగన్కు ధన్యవాదాలు: రేవంత్
సాక్షి, హైదరాబాద్: సాటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్తోపాటు తెలంగాణ ఇరుగుపొరుగు రాష్ట్రాలన్నింటితో స్నేహభావాన్ని, అభివృద్ధిలో పరస్పర సహకారాన్ని కాంక్షిస్తున్నట్లు తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం పదవి చేపట్టిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలపై రేవంత్ రెడ్డి ప్రతిస్పందించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన రేవంత్..‘శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. సాటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్తో పాటు, పొరుగు రాష్ట్రాలతో స్నేహభావం.. అభివృద్ధిలో పరస్పర సహకారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది’ అంటూ వ్యాఖ్యానించారు. శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. సాటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తో పాటు, పొరుగు రాష్ట్రాలతో స్నేహభావం… అభివృద్ధిలో పరస్పర సహకారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. https://t.co/UsR4GyPqDR — Revanth Reddy (@revanth_anumula) December 8, 2023 అంతకుముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేవంత్కు శుభాకాంక్షలు చెబతూ..‘తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు. ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులకు శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని వ్యాఖ్యనించిన విషయం తెలిసిందే. తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు. ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి, మంత్రులకు శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. — YS Jagan Mohan Reddy (@ysjagan) December 7, 2023 -
కూతురి కోసం బన్నీ స్పెషల్ పోస్ట్.. సోషల్ మీడియాలో వైరల్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిపోయారు. ప్రస్తుతం పుష్ప సీక్వెల్గా తెరకెక్కుతోన్న పుష్ప-2 చిత్రంతో బిజీగా ఉన్నారు. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. అయితే సాధారణంగా సెలబ్రిటీల పిల్లల తల్లిదండ్రుల వారసత్వాన్ని అందిపుచ్చుకుంటారు. ఈ విషయంలో సినిమా ఇండస్ట్రీ ఒక అడుగు ముందే ఎప్పుడు ఉంటుంది. అలాగే బన్నీకి అయాన్, అర్హ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే వీరిద్దరిలో అల్లు అర్హ ఇప్పటికే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. సమంత నటించిన శాకుంతలం చిత్రంలో మెరిసింది. భరతుడిగా నటించి సిల్వర్ స్క్రీన్పై రాజసాన్ని పండించి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఇవాళ తన పుట్టినరోజు కావడంతో అల్లు అర్జున్ స్పెషల్ విషెస్ తెలిపారు. తన ఇన్స్టాలో అల్లు అర్హతో ఉన్న ఫోటోను పంచుకున్నారు. బన్నీ తన ఇన్స్టాలో రాస్తూ..' హ్యాపీ బర్త్ డే మై లిటిల్ ప్రిన్సెస్' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు అర్హకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ పోస్ట్ చూసిన కల్యాణ్ దేవ్, గీతూ రాయల్, పీవీ సింధు బర్త్ డే విషెస్ తెలిపారు. కాగా.. అల్లు అర్హ.. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ చిన్ననాటి పాత్రలో అర్హ కనిపించనున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) -
ప్రియుడికి బర్త్ డే విషెస్ చెప్పిన లైగర్ భామ.. పోస్ట్ వైరల్!
బాలీవుడ్ భామ అనన్య పాండే తెలుగువారికి పరిచయం చేయాల్సిన పనిలేదు. లైగర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. అయితే కొద్ది రోజులుగా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ నటుడు ఆదిత్య రాయ్ కపూర్తో డేటింగ్లో ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇటీవలే కాపీ విత్ కరణ్ షోలో పాల్గొన్న తమ రిలేషన్పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. తామిద్దరం మంచి స్నేహితులమని వెల్లడించింది. తాజాగా ఇవాళ తన ప్రియుడు ఆదిత్య రాయ్ కపూర్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ విష్ చేశారు. తన ఇన్స్టా స్టోరీస్లో అతని ఫోటోను షేర్ చేశారు. ఆదిత్య ఫోటోను షేర్ చేస్తూ "హ్యాపీ బర్త్డే ఏడీ" అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. కాగా.. ఇటీవలే అనన్య బర్త్ డే సెలబ్రేట్ చేసుకునేందుకు ఇద్దరు కలిసి మాల్దీవులకు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలను అనన్య సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ ఏడాది డ్రీమ్ గర్ల్-2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన అనన్య.. ప్రస్తుతం కో గయే హమ్ కహాన్ చిత్రంలో నటిస్తోంది. అర్జున్ సింగ్ డైరెక్షన్లో గౌరవ్ ఆదర్శ్ నటిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఆనంద్ మహీంద్ర: వారందరికీ సలాం..! హార్ట్ టచింగ్ వీడియో వైరల్
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. మహీంద్ర అండ్ మహీంద్ర అధిపతిగా కేవలం కార్లు గురించి మాత్రమే మాట్లాడుతారనుకుంటే పొరపాటే ఆధునిక టెక్నాలజీనుంచి, క్రీడలు, మోటివేషనల్ వీడియోల దాకా ప్రతీ అంశాన్నీ ఆయన తన ఫాలోవర్లతో పంచుకుంటారు. అంతేకాదు అవసరం అనుకున్న వారికి తన వంతు సాయం చేయడంలో ఎపుడూ ముందే ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ఎమోషనల్ వీడియోను ఎక్స్ ( ట్విటర్) లో షేర్ చేశారు. సానుకూల మార్పు వైపు పయనం అంటూ ఒక వీడియోను షేర్ చేశారు. అలాగే ముందుగానే అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఇపుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. షేర్ చేసిన గంటలోనే ఇది 72వేలకు పైగా వ్యూస్ని సాధించింది. భర్తకు యాక్సిడెంట్ కారణంగా కుటుంబాన్ని నడపటం భారమైన క్షణంలో భార్య తీసుకున్న నిర్ణయం విశేషంగా నిలిచింది. ఫీజుకు డబ్బులు కట్టాలి అడగడంతో ఈ వీడియో మొదలవుతుంది. నడవడం కష్టంగా ఉన్న తాను, ఇక ట్రక్ ఎలా నడుపుతాను, ఇప్పటికే వైద్యానికి చాలా ఖర్చయింది.. ఇక కుటుంబాన్ని ఎలా నడిపిస్తాను.. ఫీజులకు డబ్బు ఎక్కడ నుంచి తేవాలి అంటూ భర్త ఆవేదన చెందుతూ వుంటాడు. భర్తను ఆ స్థితిలో చూసిన భార్య కుటుంబానికి నడిపించేందుకు డ్రైవర్గా ముందుకు వస్తుంది. భరోసాతోనే ఇంటికి సంబంధించిన అన్ని బాధ్యతలు నాకు అప్పగించావు కదా. అదే భరోసాతో ట్రక్ నడుపుతాను అంటుంది. దీంతో అదే కొండంత భరోసాతో భార్యకు అండగా నిలుస్తాడు. చివరికి కాస్త ఒడ్డున పడతారు. భర్త మెల్లిగా నడవడం కూడా మొదలు పెడతాడు. ఇంతలో దీపావళి పండుగ. దీపావళికి ఇంటికి వస్తున్నావుగా అన్నీ చూస్తావు కదా అని కూతురు దీపతో చెబుతుంది. ఈ సందర్భంగా లక్ష్మీ కళతో ఉట్టిపడుతున్న తన గృహ లక్ష్మిని చూసి మురిసిపోతాడు భర్త. ప్రతీ గృహలక్ష్మికి మహీంద్ర ట్రక్ అండ్ బస్ సలాం అంటూ దివాలీ శుభాకాంక్షలతో ఈ వీడియో ముగుస్తుంది. ఇది చూసిన నెటిజనులు సూపర్ సార్ అంటూ ప్రశంసలందిస్తున్నారు. పాజిటివ్ మెసేజ్ సార్.. హ్యాపీ దివాలీ అంటూ మరికొందరు యూజర్లు స్పందించారు. ముఖ్యంగా మహీంద్ర ట్రక్ అండ్ బస్ ప్రమోషనల్ వీడియోలాగా ఇది అనిపించినా, మహిళలు ఏదైనా సాధించగలరనే సానుకూల వైఖరి, అవసరమైతే వారు డ్రైవింగ్ ఫోర్స్గా ఉంటారనే సందేశంతోపాటు, భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అనుబంధాన్ని కూడా ఇది హైలైట్ చేస్తుంది. మరి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి! DRIVING positive change. Literally. Diwali greetings in advance from @MahindraTrukBus When every family member Rises to the occasion. pic.twitter.com/yYJcvKOwtP — anand mahindra (@anandmahindra) November 8, 2023 -
ఏపీ ప్రజలది అసాధారణమైన ప్రతిభ: ప్రధాని మోదీ
సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం సోషల్ మీడియాలో ట్వీట్ చేశారాయన. ఏపీ ప్రజలు చైతన్యవంతులంటూ ట్వీట్ చేశారాయన. అంతేకాదు అసాధారణమైన ప్రతిభ, అచంచలమైన సంకల్పం, దృఢమైన పట్టుదల ఇక్కడి ప్రజల సొంతమంటూ ప్రధాని తన సందేశంలో కొనియాడారు. ఏపీ ప్రజల శ్రేయస్సు కోసం, విజయం కోసం నిరంతరం తాను ప్రార్థిస్తానంటూ ప్రధాని మోదీ ట్వీట్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభసందర్భంగా, ఈ చైతన్యవంతమైన రాష్ట్ర ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. వారి అసాధారణమైన ప్రతిభ, అచంచలమైన సంకల్పం మరియు దృఢమైన పట్టుదలతో, ఆంధ్రప్రదేశ్ ప్రజలు విభిన్న రంగాలలో తమదైన ముద్ర వేశారు. వారి నిరంతర శ్రేయస్సు మరియు విజయం కోసం నేను… — Narendra Modi (@narendramodi) November 1, 2023 ఇదీ చదవండి: రాష్ట్ర అవతరణ దినోత్సవం.. వైఎస్సార్ అవార్డుల ప్రదానం నేడు -
ప్రధాని మోదీ విజయదశమి శుభాకాంక్షలు
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా. ఈ సందర్భంగా దేశప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్రమైన ఈ పండుగ ప్రతికూల శక్తులను అంతం చేయడంతో పాటు మనం జీవితంలో మంచిని అలవరచుకోవాలనే సందేశాన్ని అందిస్తుందని ప్రధాని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దసరా సందర్భంగా దేశప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ శ్రేయస్సుతో పాటు సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం, ముఖ్యంగా అణగారిన వర్గాల సంక్షేమం కోసం కలిసి పనిచేస్తామని అందరూ ప్రతిజ్ఞ చేయాలని కోరారు. దేశంలోని తూర్పు, దక్షిణాది రాష్ట్రాల్లో మహిషాసురునిపై దుర్గాదేవి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా జరుపుకుంటారన్నారు. దేశంలోని ఉత్తర, పశ్చిమ రాష్ట్రాల్లో ఈ పండుగను రావణుడిపై శ్రీరాముడు సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటారన్నారు. ఇది కూడా చదవండి: ఆర్ఎస్ఎస్ విజయదశమి వేడుకలు देशभर के मेरे परिवारजनों को विजयादशमी की हार्दिक शुभकामनाएं। यह पावन पर्व नकारात्मक शक्तियों के अंत के साथ ही जीवन में अच्छाई को अपनाने का संदेश लेकर आता है। Wishing you all a Happy Vijaya Dashami! — Narendra Modi (@narendramodi) October 24, 2023 -
ప్రభాస్ పుట్టినరోజు.. కన్నప్ప చిత్రబృందం స్పెషల్ పోస్టర్!
యంగ్ రెబల్ స్టార్కు కన్నప్ప చిత్రబృందం స్పెషల్ విషెస్ తెలిపింది. ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకుని స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. పోస్టర్తో పాటు ప్రభాస్కు ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. పోస్టర్లో ప్రభాస్ గురించి రాస్తూ.. 'ప్రభంజనమై ప్రేక్షక హృదయాలను మనసుతో, వ్యక్తిత్వంతో, నటనతో గెలుచుకుని.. ప్రపంచమంతా శభాష్ అనిపించుకుంటున్న మా ప్రభాస్కి జన్మదిన శుభాకాంక్షలు.. శతమానం భవతి శత శత మానం భవతి' అంటూ కన్నప్ప టీం స్పెషల్ పోస్టర్ను విడుదల చేసింది. (ఇది చదవండి: నువ్వసలు ఆడటానికే వచ్చావా? అన్న గీతూ.. దండం పెట్టేసిన పూజా) టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో ప్రతీ ఇండస్ట్రీలోని స్టార్ హీరో భాగస్వామి అవుతున్నారు. టాలీవుడ్ నుంచి ప్రభాస్, కన్నడ నుంచి శివ రాజ్ కుమార్, కేరళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ముఖ్య పాత్రలు పోషించనున్నారు. బుల్లితెరపై మహాభారతం సీరియల్ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శివ భక్తుడైన కన్నప్ప జీవితం ఆధారంగా తీసుకుని చేస్తున్న ఈ మూవీలో కన్నప్పగా మంచు విష్ణు కనిపించబోతోన్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ రచనా సహకారం అందించారు. (ఇది చదవండి: రీఎంట్రీకి సిద్ధమైన స్టార్ హీరో మేనల్లుడు.. దాదాపు 8 ఏళ్ల తర్వాత!) Team #𝕂𝕒𝕟𝕟𝕒𝕡𝕡𝕒🏹 wishes RebelStar our Darling #Prabhas a Very Happy Birthday.❤️ @iVishnuManchu @24FramesFactory @AvAEntOfficial @KannappaMovie #HappyBirthdayPrabhas #HBDRebelstarPrabhas #HBDPrabhas #ATrueIndianEpicTale #HarHarMahadevॐ pic.twitter.com/LIwYoWV5CO — Kannappa The Movie (@kannappamovie) October 23, 2023 -
'హ్యాపీ బర్త్ డే గురూజీ'.. మెగాస్టార్ స్పెషల్ విషెస్!
బాలీవుడ్ స్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ బర్త్ డే సందర్భంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి విషెస్ తెలిపారు. ఈ మేరకు చిరంజీవి ట్వీట్ చేశారు. అంతే కాకుండా సైరా నరసింహారెడ్డి చిత్రంలోని ఫోటోలను పంచుకున్నారు. 1942 అక్టోబర్ 11న జన్మించిన అమితాబ్ బచ్చన్ ఇవాళ 81వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే పలువురు సినీ తారలు, బాలీవుడ్ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ముంబయిలోని ఆయన నివాసం వద్దకు వచ్చిన అభిమానుల కోసం బయటకు వచ్చి అభివాదం చేశారు బిగ్ బీ. మెగాస్టార్ తన ట్వీట్లో రాస్తూ..' గురూజీ.. మీకు 81వ జన్మదిన శుభాకాంక్షలు. మీరు సంతోషం, మంచి ఆరోగ్యంతో నిండిన దీర్ఘాయువుతో ఆశీర్వదించబడాలి. మీ నటనా ప్రతిభా పాటవాలతో, అనేక సంవత్సరాల పాటు మీరు లక్షలాది మందిని ఆకట్టుకుని స్ఫూర్తినిస్తూనే ఉండండి. ఈ మీ పుట్టినరోజు కూడా నాకు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే మీ కౌన్ బనేగా కరోడ్పతి షోలో ఈ రోజు రాత్రి వర్చువల్గా నా ఆరాధ్యదైవమైన మిమ్మల్ని కలిసేందుకు నేను ఎదురు చూస్తున్నాను.' అంటూ పోస్ట్ చేస్తున్నారు. కాగా.. అమితాబ్ ఈ ఏడాది ప్రభాస్ కల్కి 2298 ఏడీ మూవీతో పాటు గణపత్ చిత్రంలో నటిస్తున్నారు. మెగాస్టార్ ప్రస్తుతం బింబిసార డైరెక్టర్ వశిష్ట డైరెక్షన్లో సినిమా చేయనున్నారు. A Very HAPPY 81st BIRTHDAY 🙏 Guru Ji @SrBachchan ! 💐💐 May you be blessed with a long life, filled with happiness & good health! May you keep enthralling & inspiring millions of us for many many years to come, with your acting genius!! 🙏🙏 This Birthday of yours is also… pic.twitter.com/bLQY3OjwkU — Chiranjeevi Konidela (@KChiruTweets) October 11, 2023 -
రకుల్ భామకు బాయ్ఫ్రెండ్ స్పెషల్ విషెస్.. ఇన్స్టా పోస్ట్ వైరల్!
రకుల్ ప్రీత్ సింగ్ దక్షిణాదిలో పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్లో స్టార్ హీరోలందరితో సినిమాలు చేసింది. కెరటం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చిత్రంలో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత లౌక్యం, సరైనోడు, నాన్నకు ప్రేమతో, ధృవ, కిక్-2 లాంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఇండియన్-2, అయాలన్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనెల 10న 32వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆమె బాయ్ఫ్రెండ్, బాలీవుడ్ హీరో జాకీ భగ్నానీ స్పెషళ్ విషెస్ చెప్పాడు. ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలతో ఓ వీడియోను రిలీజ్ చేసి సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇన్స్టాలో జాకీ రాస్తూ..'మీ ఈ ప్రత్యేకమైన రోజున.. నన్ను ఎప్పుడూ ఆశ్చర్యానికి గురిచేసే వ్యక్తి పట్ల నా అభిమానాన్ని తెలియజేయాలనుకుంటున్నా. మీతో ఉంటే ప్రతి రోజు ఒక అద్భుతమైన ప్రయాణంలా అనిపిస్తుంది. ఎప్పుడూ కూడా అలసిపోయినట్లు అనిపించదు. మీరు నా సహచరుడి కంటే ఎక్కువ. నువ్వే నా ధైర్యం.. ప్రతి అడుగులో నువ్వే నా భాగస్వామి. నా జీవితాన్ని ప్రేమ, సంతోషంతో నింపే వ్యక్తి నువ్వే. ఈ గొప్ప రోజున, మీరు కలలుగన్నవన్నీ నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. మీ కలలన్నీ నిజమవుతాయి.. ఎందుకంటే మీరు మాత్రమే జీవితంలో ఉత్తమమైన వాటిని సాధించడానికి అర్హులు. ప్రతి రోజును ఎక్స్ట్రార్డినరీగా మార్చే వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు! ' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ డేటింగ్లో ఉన్నట్లు గతేడాది ప్రకటించిన సంగతి తెలిసిందే. జాకీ భగ్నానీ హీరో, నిర్మాత, వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. ఆయన 2009లో కల్ కిస్నే దేఖా సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. View this post on Instagram A post shared by JACKKY BHAGNANI (@jackkybhagnani) -
'హ్యాపీ బర్త్ డే క్యూటీ'.. బన్నీ ఎమోషనల్ పోస్ట్!
టాలీవుడ్లో మోస్ట్ బ్యూటీఫుల్ జంటల్లో అల్లు అర్జున్- స్నేహారెడ్డి ఒకరు. సినిమాలతో బిజీగా ఉన్నా ఎప్పుడు ఫ్యామిలీకి సమయం కేటాయిస్తూ ఉంటారు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే సెప్టెంబర్ 29న తన భార్య స్నేహారెడ్డి బర్త్ డే సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ వీడియో షేర్ చేశారు. 'హ్యాపీ బర్త్ డే క్యూటీ.. సన్సైన్ ఆఫ్ మై లైఫ్' అంటూ భార్యపై బన్నీ ప్రేమను చాటుకున్నారు. కాగా.. అల్లు అర్జున్, స్నేహా రెడ్డి 2011లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు అయాన్, అర్హ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమంత నటించిన శాకుంతలం చిత్రంలో కీలక పాత్రతో నటించిన అర్హ తొలిసారిగా స్క్రీన్పై నటిస్తోంది. కాగా.. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న పుష్ప-2 సినిమాతో బిజీగా ఉన్నారు. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. వీరి కాంబో వచ్చిన పుష్ప పార్ట్-1 ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) -
మిత్రమా అందుకో శుభాకాంక్షలు: బిల్గేట్స్ అద్భుతమైన వీడియో
Happy Birthday Warren Buffett ప్రపంచంలోనే గొప్ప పెట్టుబడిదారుడి, అపరకుబేరుడు బెర్క్షైర్ హాత్వే , ఛైర్మన్,సీఈవో వారెన్ బఫ్ఫెట్ పుట్టిన రోజు ఆగస్టు 30. ఈ సందర్బంగా మైక్రోసాప్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన స్నేహితుడికి శుభాకాంక్షలందించారు.దీనికి సంబంధించిన ఒక అద్భుతమైన వీడియోను షేర్ చూస్తూ వినూత్నంగా విషెస్ తెలిపారు. దీంతో ఇది నె టిజనులను బాగా ఆకట్టుకుంటోంది 1920లో నెబ్రాస్కాలోని ఒమాహాలో ఆగస్టు 30న జన్మించారు వారెన్ బఫ్ఫెట్. 93ఏళ్ల ఇన్వెస్టింగ్ లెజెండ్ వారెన్ బఫ్ఫెట్ ప్రపంచంలో అత్యంత విజయ వంతమైన పెట్టుబడిదారులలో ఒకరిగా పేరు గడించారు. ఇన్వెస్టింగ్ తీరు మాంద్యాన్ని ఎలా ఎదుర్కోవాలి, పెట్టుబడులపై లాభాలు ఎలా సాధించాలి లాంటి సలహాలు ఇన్వెస్టర్లకు పెద్ద సక్సెస్మంత్రాలా పని చేస్తాయి. వ్యాపారవేత్త, తండ్రి హోవార్డ్ గ్రాహం బఫ్ఫెట్ ప్రేరణతో 60కి పైగా కంపెనీలను కలిగి ఉన్న బెర్క్షైర్ హాత్వే సీఈవోగా కంపెనీని విజయవంతంగా నడిపిస్తున్నారు. మీ మీద మీ పెట్టుబడే పెద్ద సక్సెస్ అంటారు ఒరాకిల్ ఆఫ్ ఒమాహాగా పాపులర్ అయిన వారెన్ బఫ్ఫెట్. Happy 93rd birthday to my friend Warren! pic.twitter.com/WxeVO1vOut — Bill Gates (@BillGates) August 30, 2023 -
చంద్రయాన్-3 అద్భుత విజయం! ప్రముఖుల ప్రశంసలు
చంద్రయాన్-3 ల్యాండింగ్ మిషన్ సక్సెస్ కావడంపై అంతర్జాతీయ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. భారతదేశానికి చెందిన చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయింది. ఈ చారిత్రక క్షణాల తరువాత చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారత్ అవతరించింది. ఈ అద్భుతమైన క్షణాల కోసం యావత్ ప్రపంచంగా ఉత్కంఠగా ఎదురు చూసింది. భారత్ ప్రయత్నాన్ని, కృషిని కొనియాడింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో అమెరికా, చైనా, సోవియట్ యూనియన్ తర్వాత చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది. నీటిని కనుగొనే అవకాశం ఉన్నందున దీనిపై మరింత ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. ముఖ్యంగా జెఫ్ బెజోస్, ట్విటర్ అధినేత ఎలాన్మస్క్ తోపాటు, నటుడు, ఆర్ మాధవన్ సహా ప్రముఖులు చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండింగ్ కావాలంటూ ముందే సోషల్ మీడియా ద్వారా ఆకాంక్షించారు. "రూట్ ఫర్ ఇండియా! గుడ్ లక్, చంద్రయాన్-3," బెజోస్ ఇస్రోపోస్ట్ను రీషేర్ చేస్తూ థ్రెడ్స్ యాప్లో పేర్కొన్నారు. అలాగే ఏరోస్పేస్ ఇంజనీర్ నంబి నారాయణన్ బయోపిక్ 'రాకెట్రీ: దినంబి ఎఫెక్ట్' లో కీలక పాత్ర పోషించిన మాధవన్ "చంద్రయాన్-3 సంపూర్ణ విజయం సాధిస్తుంది.. మార్క్ మై వర్డ్స్ అంటూ ట్విటర్ ద్వారా ముందుగానే అభినందలు తెలిపారు. Chandrayaan-3 WILL BE ABSOLUTE SUCCESS —- MARK MY WORDS . Congratulations @isro .. IN ADVANCE .. on this spectacular success .. I AM SO SO HAPPY AND PROUD … congratulations to @NambiNOfficial too .. Vikas engine delivers yet once again during the launch.… — Ranganathan Madhavan (@ActorMadhavan) August 23, 2023 సౌత్ సూపర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, "చంద్రయాన్ ఈరోజు సాయంత్రం 6:04 గంటలకు చంద్రునిపై ల్యాండ్ అవుతుంది" అని పేర్కొన్నారు. టెస్లా , స్పేస్ఎక్స్ చీఫ్ ఎలాన్ మస్క్ కూడా చంద్రయాన్-3 మూన్ మిషన్పై స్పందించారు. 'ఇంటర్స్టెల్లార్' సినిమా బడ్జెట్ కంటే చంద్రయాన్-3 ఖర్చు తక్కువగా ఉందని ఎక్స్లో చేసిన పోస్ట్పై మస్క్ స్పందిస్తూ, మిషన్ "భారతదేశానికి మంచిది" అని వ్యాఖ్యానించారు. #WATCH | On Chandrayaan 3 landing, actor Kareena Kapoor Khan says, "It's a great moment for India and a proud moment for every Indian. All of us are waiting to watch it. I'm going to do that with my boys." pic.twitter.com/MLJKJjoPsS — ANI (@ANI) August 21, 2023 ఇంకా బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ తదితరులు ఈ మిషన్ను అభినందించిన వారిలో ఉన్నారు.కాగా ఇస్రో వెబ్సైట్తోపాటు, పలు చానెళ్లు ఈ ల్యాండింగ్ ఈవెంట్ను ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ఈ అద్భుత విజయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. -
చంద్రయాన్ 3 ల్యాండింగ్ కోసం..ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఉత్కంఠ!
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఈ నెల 17న చంద్రయాన్ -3 ప్రొపల్షన్ మాడ్యూల్ ల్యాండర్ మాడ్యూల్ను చంద్రుడికి దగ్గరగా విజయవంతంగా వదిలిపెట్టింది. చంద్రయాన్ 3లో ఇప్పటి వరకు ప్రతి ఆపరేషన్ విజయవంతమయ్యింది. ఇక ప్రతిష్టాత్మక చంద్రయాన్–3 మిషన్లో భాగమైన ల్యాండర్ మాడ్యూల్ తన తుది గమ్యాన్నినేడు చేరుకోనుంది. ఈ ప్రయోగంలో అత్యంత కీలకమైన తుదిఘట్టం బుధవారం జరగనుంది. చంద్రుడి దక్షిణధ్రువ ఉపరితలంపై ల్యాండర్ మాడ్యూల్ అడుగు పెట్టనుంది. బుధవారం సాయంత్రం 5.27 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సరిగ్గా 6.04 గంటలకు జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్ను సురక్షితంగా ల్యాండ్ చేయడానికి ఇస్రో సైంటిస్టులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ అపూర్య ఘట్టాన్ని సాయంత్రం 5.20 నుంచే ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించొచ్చు. ల్యాండర్ మాడ్యుల్ చంద్రుని వీక్షించే క్షణం కోసం దేశంలోని ప్రజలు తోపాటు ప్రపంచ దేశాలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి. దాయాది దేశం పాక్తో సహా ప్రపంచ దేశాలు భారత్ ఉక్కు సంకల్పానికి నివ్వెరపోయాయి. ప్రపంచ అగ్ర దేశాలకు కూడా సాధ్యం కాని అరుదైన ఘనతను భారత్ సాధిస్తుండటంతో అందరీ దృష్టి ఇండియాలోని ఈ మిషన్ ఘట్టంపైనే ఉండటం విశేషం. సర్వత్రా ఈ విషయం ఓ హాట్టాపిక్గా మారింది. ప్రజలైతే చంద్రయాన్-3 మిషన్ విజయవంతం కావాలంటూ పూజలు చేస్తున్నారు. ఈ మిషన్ విజయవంతమైతే చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న దేశంగా చంద్రుడిపై అడుగుపెట్టిన దేశాలైన యునైటెడ్ స్టేట్స్, రష్యా, చైనా వంటి దేశాల సరసన ఇండియా నిలుస్తుంది. భారత్ వెలుపల ఉన్న ప్రజలే గాక సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు సైతం "జయహో భారత్ జయహో ఇస్రో" అంటూ ఈ చంద్రయాన్-3 మిషన్ విజయవంతం కావాలంటూ పూజలు, హోమాలు చేస్తున్నారు. పెద్ద చిన్న తేడా లేకుండా భారత ఇస్రోకి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కుల మత పర భేదాలు పక్కన పెట్టి అందరూ ఒకేతాటిపై భారత ఇస్రో దిగ్విజయంగా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ రకరకాలుగా వీడియోలు ట్వీట్ చేశారు. మీరు కూడా ఓ లుక్కేయండి. @chandrayaan_3 #AllTheBestChandrayaan3 ♥️♥️♥️All the very best Chandrayaan 3♥️♥️♥️ 🚀🇮🇳Jai Hind🇮🇳🚀🌛 pic.twitter.com/YXM76uHOoo — Aakash (@Aakash13294124) August 22, 2023 Let's join in prayer for the safe landing of chandrayaan-3. 🙏 Jai Shree Ram ❤️🔥#chandrayaan3 pic.twitter.com/ubq4iKZdLw — Bhagavad Gita 🪷 (@Geetashloks) August 23, 2023 #AllTheBestChandrayaan3 We love you, @isro All the best @chandrayaan_3 Nived, Svara, Punit, Vinee#NarendraModi @mygovindia @PMOIndia pic.twitter.com/6CKtXUnAsf — Vineetha Punit (@vineepun) August 21, 2023 Here's another set of greetings from people across India. We appreciate and extend our thanks to them. #AllTheBestChandrayaan3 #Chandrayaan_3 #Sivoham pic.twitter.com/CwRAWNaCUi — Chandan Yadav (@Chandan_YadavSP) August 22, 2023 #WATCH | Uttar Pradesh | People offer namaz at the Islamic Center of India in Lucknow for the successful landing of Chandrayaan-3, on August 23. pic.twitter.com/xpm98iQM9O — ANI (@ANI) August 22, 2023 (చదవండి: ఇవాళే 'నేషనల్ హ్యాండ్ సర్జరీ డే'!వర్క్ప్లేస్లో చేతులకు వచ్చే సమస్యలు!) -
అల్లాహ్ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ముస్లింలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఈ పండుగ జరుపుకుంటారు. త్యాగనిరతికి బక్రీద్ పండుగ నిదర్శనం’’ అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘ధనిక, పేద అనే తారతమ్యం లేకుండా రాగ ద్వేషాలకు అతీతంగా ముస్లింలందరూ ఈ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటారు. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా’’ అని సీఎం జగన్ అన్నారు. చదవండి: ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్న్యూస్.. -
12 ఏళ్ల నుంచి నా బెస్ట్ ఫ్రెండ్.. చాలా థ్రిల్లింగ్గా ఉంది: విఘ్నేశ్ శివన్
సౌత్ ఇండియా బ్యూటీఫుల్ కపుల్స్లో నయన్-విక్కీ జంట ఒకరు. దాదాపు కొన్నేళ్లపాటు డేటింగ్లో ఉన్న ఈ జంట గతేడాది జూన్ 9న వివాహాబంధంతో ఒక్కటయ్యారు. మొదటి వివాహా వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ జంటకు పలువురు తారలు, ఫ్యాన్స్, సన్నిహితులు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే ఈ జంటకు సరోగసీ ద్వారా ఉయిర్, ఉలగం అనే కవల పిల్లలు జన్మించారు. అయితే వీరి వివాహా వార్షికోత్సవం సందర్భంగా ఈ జంటకు విఘ్నేశ్ శివన్ చిన్ననాటి స్నేహితుడు సర్ప్రైజ్ ఇచ్చారు. (ఇది చదవండి: అలా ప్రేమలో.. వరుణ్, లావణ్య త్రిపాఠి లవ్స్టోరీకి ఐదేళ్లు) చెన్నైలోని వీరి నివాసంలో జరిగిన వార్షికోత్సవంలో ఫ్లూట్ వాయించి మరీ ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. బాల్య స్నేహితుడు ఇచ్చిన సర్ప్రైజ్కు నయన్- విఘ్నేశ్ ఎమోషనలయ్యారు. ఈ విషయాన్ని విక్కీ తన ఇన్స్టాలో పంచుకున్నారు. వీడియోనూ షేర్ చేస్తూ స్నేహితునిపై ప్రశంసలు కురిపించారు. విఘ్నేశ్ ఇన్స్టాలో షేర్ చేస్తూ..'మాకు ఇవీ ప్రత్యేకమైన క్షణాలు. మా మొదటి వివాహా వార్షికోత్సవ వేడుక. నా 12 ఏళ్ల వయస్సు నుంచి నవీన్ బెస్ట్ ఫ్రెండ్. నీతో కలిసి ఒకే వేదికపై డ్రమ్స్ వాయించడం.. చాలాసార్లు నీతో వేదికను పంచుకున్నా. నా జీవితంలో నిన్ను చూస్తూనే ఎదిగా. కానీ ఈరోజు మర్చిపోలేనిది. అలాగే చాలా ప్రత్యేకమైనది కూడా. ఈ రోడు మమ్మల్ని ఆశీర్వదించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. నువ్వు నా స్నేహితుడిగా ఉండటం నాకు గర్వంగా ఉంది.' అంటూ పోస్ట్ చేశారు. (ఇది చదవండి: నయన్- విఘ్నేశ్ మ్యారేజ్ యానివర్సరీ.. బుడ్డోళ్ల సర్ప్రైజ్ అదిరిపోయిందిగా !) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
ముస్లిం సోదరులకు సీఎం జగన్ రంజాన్ శుభాకాంక్షలు
సాక్షి, గుంటూరు: ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముస్లిం సోదరసోదరీమణులకు శుభాకాంక్షలు (ఈద్ ముబారక్) తెలియజేశారు. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని పేర్కొన్నారాయన. మానవాళికి హితాన్ని బోధించే రంజాన్ పండుగ. సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని సీఎం జగన్ అన్నారు. కఠోర ఉపవాస దీక్షలతో క్రమశిక్షణ, దానధర్మాలతో దాతృత్వం, సామూహిక ప్రార్థనలతో ధార్మిక చింతన, ఐకమత్యం.. ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశమని ఆయన పేర్కొన్నారు. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అని సీఎం జగన్ పేర్కొన్నారు. ముస్లిం సోదరులు చేసే ప్రార్థనలు సఫలం కావాలని, అల్లాహ్ దీవెనలతో ఏపీ ప్రజలకు అంతా మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. ముస్లింలకు ఈద్ ముబారక్ తెలుపుతూ సీఎం జగన్ ట్వీట్ కూడా చేశారు. ‘‘సామరస్యానికి, సుహృద్భావానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక రంజాన్ పండుగ. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ ఇది. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదర,సోదరీమణులందరికీ ఈద్ ముబారక్’’ అంటూ సీఎం ట్వీట్ చేశారు. సామరస్యానికి, సుహృద్భావానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక రంజాన్ పండుగ. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ ఇది. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదర, సోదరీమణులందరికీ ఈద్ ముబారక్.#EidMubarak — YS Jagan Mohan Reddy (@ysjagan) April 22, 2023 -
'యూ ఆర్ వెరీ స్పెషల్'.. నిహారిక పోస్ట్ వైరల్
గత కొంతకాలంగా మెగాడాటర్ నిహారిక కొణిదెల తరచుగా వార్తల్లో నిలుస్తోంది. భర్త చైతన్య జొన్నలగడ్డతో మనస్పర్థల కారణంగా వీరి విడాకులు తీసుకోనున్నారంటూ రూమర్స్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇంతవరకు మెగా ఫ్యామిలీలో ఎవరూ స్పందించలేదు. ఇప్పటికే చైతన్య.. నిహారికను అన్ఫాలో చేయడమే కాకుండా పెళ్లి ఫోటోలన్నింటినీ డిలీట్ చేశాడు. అయితే తాజాగా నిహారిక తన ఇన్స్టాలో స్టోరీస్లో చేసిన పోస్ట్ తెగ వైరలవుతోంది. తాజాగా నిహారిక బర్త్ డే విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. యూ ఆర్ వెరీ స్పెషల్ అంటూ విషెస్ చెప్పింది నిహారిక. ప్రముఖ ఫోటోగ్రాఫర్ అరిఫ్ పుట్టినరోజు సందర్భంగా అతనితో దిగిన పిక్స్ షేర్ చేసింది. కాగా.. ఇప్పటికే నటనకు గుడ్బై చెప్పి నిర్మాతగా మారిన నిహారిక సొంతంగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ను నెలకొల్పిన సంగతి తెలిసిందే. తాజాగా నిహారిక మరో ముందడుగు వేసింది. తన ప్రొడక్షన్ బ్యానర్కు ఒక ఆఫీస్ను ఏర్పాటు చేసుకుంది. ఎప్పటి నుంచో సొంతంగా ఆఫీస్ నెలకొల్పాలని కలలు కన్న నిహారిక ఇటీవలే ఆ పని పూర్తిచేసింది. (ఇది చదవండి: అనుకున్న పని చేసేసిన నిహారిక.. కంగ్రాట్స్ అంటూ కామెంట్స్) -
సమంతకు హార్ట్ ఎమోజీతో రిప్లై ఇచ్చిన అఖిల్.. పోస్ట్ వైరల్
అక్కినేని కుటుంబంతో సమంతకు ఇప్పటికీ సాన్నిహిత్యం ఉందని చాలాసార్లు రుజువైన సంగతి తెలిసిందే. రానా, మిహికా, అఖిల్ సహా పలువురు అక్కినేని ఫ్యామిలీలో సమంత ఇప్పటికీ టచ్లో ఉంటుంది. ఇక తాజాగా నిన్న(ఏప్రిల్8)న అఖిల్ బర్త్డే సందర్భంగా బెస్ట్ విషెస్ను అందించింది సమంత. గతేడాది కూడా అఖిల్ పుట్టినరోజున సామ్ స్పెషల్ పోస్ట్ చేస్తూ విషెస్ చెప్పినా ఎందుకో అఖిల్ మాత్రం స్పందించలేదు. దీంతో ఈసారైనా అఖిల్ సమంతకు రిప్లై ఇస్తాడా అని చాలామంది నెటిజన్లు ఎదురుచూశారు. గతేడాది లాగే ఇప్పుడు కూడా సామ్ పోస్టును పట్టించుకోడు అంటూ కొందరు కామెంట్స్ చేశారు. కానీ వాళ్లందరికీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు అఖిల్. సమంతకు థ్యాంక్స్ చెబుతూ ఇన్స్టాలో షేర్ చేసుకున్నాడు. 'థ్యాంక్యూ సో మచ్ సామ్.. నీ అంచనాలను అందుకుంటానని అనుకుంటున్నా' అంటూ హార్ట్ ఎమోజీని జతచేశాడు. దీంతో అఖిల్ షేర్చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. -
'హ్యాపీ బర్త్ డే పుష్ప'.. అబ్బో ఎంత క్యూట్గా విష్ చేసిందో!
ఇవాళ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే కావడంతో అభిమానులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఉదయాన్నే అల్లు అర్జున్ ఇంటిముందు హల్చల్ చేశారు. బన్నీకి బర్త్ డే విషెస్ చెబుతూ ఫ్యాన్స్ కేక్ కూడా కట్ చేశారు. బన్నీ బర్త్డేకు పుష్ప-2 చిత్రబృందం అదిరిపోయే అప్డేట్స్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక అల్లు అర్జున్ సినిమాలకు మనదేశంలోనే కాదు.. విదేశాల్లోనూ వీరాభిమానులు ఉన్నారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటారు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్. పుష్ప డైలాగ్స్, సాంగ్స్కు ఫిదా అయినా డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలోనూ రీల్స్ పోస్ట్ చేస్తుంటారు. ఏప్రిల్ 08న బన్నీ బర్త్ డేకు తనదైన స్టైల్లో గ్రాండ్ విషెస్ చెప్పారు డేవిడ్ వార్నర్. ఇన్స్టాలో తన కూతురితో కలిసి విష్ చేస్తున్న ఓ వీడియోను పోస్ట్ చేశారు. పుష్పకు హ్యాపీ బర్త్ డే అంటూ వార్నర్ కూతురు చాలా క్యూట్గా చెప్పడం చేస్తుంటే బన్నీ అంటే ఎంత అభిమానమో అర్థమవుతోంది. వార్నర్ తన ఫ్యామిలీతో కలిసి పుష్ప సాంగ్స్కు డ్యాన్స్ చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తూ అలరిస్తుంటారు. తాజాగా బన్నీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. View this post on Instagram A post shared by David Warner (@davidwarner31) -
రామరాజ్యమే స్ఫూర్తిదాయకం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకోసం పనిచేసే ఏ ప్రభుత్వానికైనా రామరాజ్యమే స్ఫూర్తిదాయకం. ప్రతి ఇంటా సంతోషాలు నింపేలా సాగిన రాముడి పాలనే ఉత్తమ మార్గం. మాట ఇస్తే తప్పని నైజం, దానికోసం ఎన్నికష్టాలైనా ఓర్చుకునే తత్వం ఆ శ్రీరాముడి గుణం అని ట్వీట్లో పేర్కొన్నారాయన. అంతకు ముందు ఒక ప్రకటనలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే. ‘‘నైతిక, సంఘప్రవర్తనలో ఎన్నటికీ ఆదర్శం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సీతారాముల దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. భద్రాద్రి, ఒంటిమిట్ట ఆలయాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటింటా శ్రీరామనవమి పర్వదినాన్ని వేడుకగా జరుపుకోవాలన్నారు. ప్రజలందరికీ సీతారాముల అనుగ్రహం లభించాలని కోరుకుంటున్నానని సీఎం జగన్ అన్నారు. -
ముస్లింలకు సీఎం జగన్ రంజాన్ మాసం శుభాకాంక్షలు
-
నా జీవితంలో అత్యంత ప్రభావవంతులు వీరిద్దరే: మెగాస్టార్
అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోని మహిళలందరికీ మహిళ దినోత్సవం శుభాకాంక్షలు చెబుతూ ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా భార్య సురేఖ, అమ్మ అంజనా దేవితో దిగిన ఫోటోను షేర్ చేశారు. ట్విటర్లో మెగాస్టార్ రాస్తూ..' ప్రపంచంలోని మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచంలో తమ సరైన స్థానాన్ని పొందేందుకు పోరాడిన, పోరాడుతున్న స్ఫూర్తిదాయకమైన మహిళలందరికీ వందనం. భవిష్యత్ తరాలకు మీరే ఆదర్శం. నా జీవితంలో అత్యంత ప్రభావవంతమైన మహిళలు వీరిద్దరే.' అంటూ పోస్ట్ చేశారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన మెగాస్టార్ ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేస్తున్నారు. #HappyWomensDay to ALL the Women of the world! Saluting all the inspirational women who have fought & are fighting to claim their rightful space & place in the world. You are the Wind beneath the Wings of future generations! Here are the Two most influential women of My life 💐🙏 pic.twitter.com/JZhKHHAY1b — Chiranjeevi Konidela (@KChiruTweets) March 8, 2023 -
మహిళల అభ్యున్నతే ఏ సమాజం ప్రగతికైనా కొలమానం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మానవాళిలో సగభాగం మాత్రమే కాక, అభివృద్ధిలోనూ అంతకు మించిన పాత్రను మహిళలు పోషిస్తున్నారని సీఎం కొనియాడారు. ‘‘మహిళల అభ్యున్నతే ఏ సమాజం ప్రగతికైనా కీలకమైన కొలమానం. 2019లో అధికారం చేపట్టిన నాటి నుంచి మన ప్రభుత్వం మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉద్యోగ సాధికారతలపై దేశంలోని మరే ప్రభుత్వమూ పెట్టనంతగా దృష్టి పెట్టింది’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘‘జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, 30 లక్షల ఇళ్ల పట్టాలు-22 లక్షల ఇళ్ల నిర్మాణం, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్సార్ సంపూర్ణ పోషణ వంటి పథకాలతో గర్భస్త శిశువు నుంచి పండు ముదుసలి వరకు ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ చూపిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే. వారి రక్షణ, భద్రతను దృష్టిలో ఉంచుకుని దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లతో ఆడబిడ్డల రక్షణలో అందరికన్నా మిన్నగా అడుగులు ముందుకు వేశాం’’ అని సీఎం అన్నారు. చదవండి: ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్ ‘‘21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ ఆంధ్రప్రదేశ్లోనే అవతరించేలా నిర్ణయాలు తీసుకున్నాం. రాజకీయ పదవుల్లో కూడా చట్టాలు చేసి మరీ సగభాగం ఇచ్చింది మన ప్రభుత్వమే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క కుటుంబం, మొత్తం సమాజం ఆడబిడ్డల పట్ల మరింత గౌరవం, శ్రద్ధ కనబర్చేలా నిర్ణయాలు తీసుకోవాలి’’ అని సీఎం జగన్ పిలుపునిచ్చారు. -
హోలీ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రంగుల పండుగను ఆనందోత్సహాలతో జరుపుకోవాలని సీఎం ఆకాంక్షించారు. కాగా, దేశవ్యాప్తంగా రంగుల కేళి హోలీ సంబరాలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి నిలయమైన భారత్లో ప్రతి ఏటా అనేక పండుగలను జరుపుకొంటారు. అయితే రంగుల పండుగ హోలీకి వీటిలో ప్రత్యేక స్థానం ఉంది. అందర్నీ కలిపే పండుగగా చెప్పుకునే హోలీని దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఘనంగా జరుపుకొంటారు. ఒకరిపై ఒకరు రంగులు జల్లుకొని ఉత్సాహంగా సంబరాలు చేసుకుంటున్నారు. చదవండి: మార్చి, ఏప్రిల్ నెలల్లో ఏపీ ప్రభుత్వ కార్యక్రమాల షెడ్యూల్ ఇదే.. -
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
సాక్షి, విజయవాడ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘దేశ నిర్మాణంలో మహిళల పాత్ర చాలా గొప్పది. అనేక రంగాల్లో మహిళలు తిరుగులేని నాయకత్వాన్ని పోషిస్తున్నారు. మహిళలు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు’’ అని గవర్నర్ అన్నారు. విజయవాడలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు విజయవాడలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాల్లో రాణించిన మహిళలను సన్మానించారు. ఏపీలో సంక్షేమ పథకాలతో ప్రతిరోజూ మహిళా దినోత్సవమేనని, మహిళల కోసం సీఎం జగన్ ఒక యజ్ఞం చేస్తున్నారని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఏపీలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. మహిళల రక్షణ కోసం విప్లవాత్మక మార్పులు తెచ్చారని వాసిరెడ్డి పద్మ అన్నారు. చదవండి: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్: మంత్రులు, అధికారులను అభినందించిన సీఎం జగన్ -
వదినగా మీరున్నందుకు చాలా సంతోషం: బండ్ల గణేశ్
టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ గురించి పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించారు. మెగా ఫ్యామిలీ పట్ల ఆయనకు ప్రత్యేక అభిమానం ఉంది. తాజాగా ఇవాళ చిరంజీవి సతీమణి సురేఖ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు బండ్ల గణేశ్. ఈ మేరకు తన ట్విటర్లో చిరంజీవి దంపతుల ఫోటోను షేర్ చేశారు. బండ్ల గణేశ్ తన ట్విటర్లో రాస్తూ..'సీతాదేవి అంత ఓర్పు. భూదేవంత గొప్పతనం. లక్ష్మీదేవి లాంటి నవ్వు. రాముడి లాంటి భర్తకు అర్ధాంగిగా.. వజ్రం లాంటి బిడ్డకు తల్లిగా.. ఎందరో లక్ష్మణులకు వదినగా మీరుండటం మాకెంతో సంతోషం. ఇలాంటి జన్మదినాలు మీరు ఎన్నో జరుపుకోవాలని ఆ పరమేశ్వరున్ని మనసారా కోరుకుంటూ.. జన్మదిన శుభాకాంక్షలు' అంటూ సురేఖ , చిరంజీవి దంపతులు ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. సీతాదేవి అంత ఓర్పు భూదేవంత గొప్పతనం లక్ష్మీదేవి లాంటి నవ్వు రాముడి లాంటి భర్తకు అర్ధాంగిగా, వజ్రంలాంటి బిడ్డకు తల్లిగా, ఎందరో లక్ష్మణులకు వదినగా మీరుండటం మాకెంతో సంతోషం.. ఇలాంటి జన్మదినాలు మీరు ఎన్నో జరుపుకోవాలని ఆ పరమేశ్వరున్ని మనసారా కోరుకుంటూ.. @KChiruTweets pic.twitter.com/OWf6Gw69KY — BANDLA GANESH. (@ganeshbandla) February 18, 2023 -
సీఎం జగన్ మహాశివరాత్రి శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాలు శివ నామస్మరణతో మార్మోగుతున్నాయి. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్దఎత్తున శివాలయాలకు పోటెత్తారు. జగాలను ఏలే జంగమ దేవుడు, తినేత్రుడు, లింగాకార రూపుడైన శివునికి ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఓం నమఃశివాయ, హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సర్వ సృష్టికీ సంకేతంగా, స్థావర జంగమ సంగమ స్వరూపంగా, లింగమయ్యగా జంగమయ్యగా, శివునిగా భవునిగా సాంబశివునిగా, అనునిత్యం కొలుచుకుంటున్న పరమ శివుని పర్వదినం శ్రీకరం శుభకరం సకల మంగళకరం. పార్వతీ పరమేశ్వరుల శుభాశీస్సులు మనందరికీ అందాలని కోరుకుంటున్నాను’’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. చదవండి: శివ నామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సర్వ సృష్టికీ సంకేతంగా, స్థావర జంగమ సంగమ స్వరూపంగా, లింగమయ్యగా జంగమయ్యగా, శివునిగా భవునిగా సాంబశివునిగా, అనునిత్యం కొలుచు కుంటున్న పరమ శివుని పర్వదినం శ్రీకరం శుభకరం సకల మంగళకరం. పార్వతీ పరమేశ్వరుల శుభాశీస్సులు మనందరికీ అందాలని కోరుకుంటున్నాను. — YS Jagan Mohan Reddy (@ysjagan) February 18, 2023 -
సీఎం కేసీఆర్ కు వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు
-
హీరోయిన్కు మెగాస్టార్ బర్త్ డే విషెస్.. ట్వీట్ వైరల్
వాల్తేరు వీరయ్య హీరోయిన్కు మెగాస్టార్ చిరంజీవి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హీరోయిన్ శృతిహాసన్ పుట్టిన రోజు సందర్భంగా చిరు విష్ చేశారు. ఈ మేరకు తన ట్విటర్లో పోస్ట్ చేశారు. వాల్తేరు వీరయ్య సినిమాలో 'నువ్వు శ్రీదేవి అయితే.. నేను చిరంజీవినవుతా అంటూ సాగే' పాటలోని ఫోటోను జత చేశారు. దీంతో మెగా అభిమానులు సైతం శృతిహాసన్కు విషెస్ చెబుతున్నారు. మెగాస్టార్ ట్విటర్లోరాస్తూ..' ప్రియమైన శ్రుతిహాసన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఏడాదిలో మీ కెరీర్ అద్భుతంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నా. వృత్తి పట్ల మీ అంకితభావం, మీకున్న బహుముఖ ప్రజ్ఞతో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశిస్తున్నా.' అంటూ మెగాస్టార్ పోస్ట్ చేశారు. కాగా చిరంజీవి, శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. Happy Birthday Dear @shrutihaasan Have a Wonderful year ahead and May you scale greater heights with your passion & multi talents!!! 💐💐 pic.twitter.com/YV0sCb8Yzf — Chiranjeevi Konidela (@KChiruTweets) January 28, 2023 -
రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు
-
మోదీజీ.. నా ప్రేమ, మద్దతు మీకు ఉంటాయి: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ అస్వస్థతకు గురై మంగళవారం రాత్రి అహ్మదాబాద్లోని యూఎన్ మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్లో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుపుతూ హెల్త్ బులిటిన్ విడుదల చేశారు వైద్యులు. ఈ క్రమంలో హీరాబెన్ ఆరోగ్య పరిస్థితిపై ట్విట్టర్లో స్పందించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ‘తల్లీకొడుకుల మధ్య ప్రేమ వెలకట్టలేనిది. మోదీ జీ, ఈ కఠిన సమయంలో నా ప్రేమ, మద్ధతు మీకు ఉంటాయి. మీ మాతృమూర్తి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా.’అని ట్విట్టర్లో రాసుకొచ్చారు రాహుల్ గాంధీ. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సైతం స్పందించారు. హీరాబెన్ త్వరగా కోలుకుని ఆరోగ్యంగా ఉండాలి ప్రార్థించారు. एक मां और बेटे के बीच का प्यार अनन्त और अनमोल होता है। मोदी जी, इस कठिन समय में मेरा प्यार और समर्थन आपके साथ है। मैं आशा करता हूं आपकी माताजी जल्द से जल्द स्वस्थ हो जाएं। — Rahul Gandhi (@RahulGandhi) December 28, 2022 ఇదీ చదవండి: నిలకడగా ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ ఆరోగ్యం -
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్
-
సీఎం జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన విద్యార్థులు
-
తలరాతలు మారాలంటే చదువు ఒక్కటే మార్గం : సీఎం వైఎస్ జగన్
-
World Fisheries Day: మత్స్యకారులకు సీఎం జగన్ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకార సోదరులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సంక్షేమ పథకాలతో మత్స్యకార కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాం. వారి సంక్షేమమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం. నరసాపురంలో నేడు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం’’ అని సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. చదవండి: ఏసీ.. మేడిన్ ఆంధ్రా ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా కడలి పుత్రులందరికీ శుభాకాంక్షలు. సంక్షేమ పథకాలతో మత్స్యకార కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాం. వారి సంక్షేమమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం. నేడు నరసాపురంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. — YS Jagan Mohan Reddy (@ysjagan) November 21, 2022 -
ఈ నాలుగు కోరికలు తీరకుండానే కన్నుమూసిన సూపర్ స్టార్
సూపర్ స్టార్ కృష్ణ మృతితో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఆయన అకాల మరణంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. వెండితెరపై 350 వందలకు పైగా చిత్రాలు చేసి వైవిధ్య పాత్రలతో అలరించిన ఆయన తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్నారు. హీరోగా వందల సినిమాలు చేసిన ఘనత ఒక్క ఆయనకే దక్కింది. హీరో, నిర్మాత, దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో హిట్స్ అందించి చరిత్ర సృష్టించారాయన. అయితే తన జీవితంలో ఎన్నో విజయాలను, రికార్డులను సొంతం చేసుకున్న కృష్ణ చివరికి ఈ నాలుగు కోరికలు తీరకుండానే కన్నుమూశారు. అవేంటంటే.. మనవడితో కలిసి తెరపై సందడి చేయాలనుకున్నారు… ‘వన్ నేనొక్కడినే’ మూవీతో ఆయన మనవడు, మహేశ్ కుమారుడు గౌతమ్ కృష్ణ వెండితెరకు పరిచయం అయ్యాడు. దాంతో మనవడితో నటించాలని ఉందని ఈ మూవీ ప్రమోషన్స్ సమయంలో, మూవీ విడుదల తర్వాత కూడా పలు సందర్భాల్లో వెల్లడించారు. కానీ అది కుదరలేదు. మంచి కథ వస్తే మహేశ్తో కలిసి మరో సినిమాలో నటించాలనుకున్నారు. కానీ ఆ కోరిక కూడా తీరలేదు. అయితే కృష్ణ తన కుమారులు మహేశ్, రమేశ్ బాబులతో కలిసి చిత్రాలు చేసిన సంగతి తెలిసిందే. తండ్రి నటించిన పలు చిత్రాల్లో మహేశ్ బాలనటుడిగా కనిపించారు. ఆయనను జేమ్స్ బాండ్గా చూడాలనుకున్నారు.. తెలుగు తెరకు జెమ్స్బాండ్ తరహా పాత్రని పరిచయం చేసింది కృష్ణే. గూఢఛారి 116, రహస్య గూఢచారి వంటి చిత్రాల్లో నటించి టాలీవుడ్ జేమ్స్ బాండ్గా గుర్తింపు పొందారు. తనలానే కుమారుడు మహేశ్ను కూడా జేమ్స్ బాండ్ పాత్రలో చూడాలనుకున్నారాయన. ఇదే విషయాన్ని పలు ఇంటర్య్వూలో ఆయన పేర్కొన్నారు. మహేశ్ను ఎలాంటి పాత్రలో చూడాలనుకుంటున్నారంటూ జెమ్స్బాండ్గా అని ఆయన సమాధానం ఇచ్చారు. దాంతో మహేశ్ను జేమ్స్బాండ్గా చూడాలనే కృష్ణ కోరిక తీరకుండానే మిగిలిపోయింది. కాగా మహేశ్-రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కబోయే చిత్రంలో మహేశ్ జేమ్స్బాండ్ తరహా పాత్రలో చేయనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అదే నిజమైతే కృష్ణ కోరిక తీరినట్టే.. కానీ తెరపై మహేశ్ను జెమ్స్బాండ్గా చూసి మురిసిపోవాలనుకున్న ఆయన ఆశ మాత్రం అలాగే ఉండిపోతుంది. ఆయన మనసు పడ్డ పాత్రలో నటించకుండానే.. తెరపై విభిన్న పాత్రలతో ప్రయోగాలు చేసిన కృష్ణకు చత్రపది శివాజీగా చేయాలనేది ఆయన కోరిక. అల్లూరి సీతారామరాజుగా వెండితెరపై చెరగని ముద్ర వేసుకున్న ఆయన ఆ తర్వాత మనసు పడ్డ మరో పాత్ర.. ఛత్రపతి వీర శివాజీ. చంద్రహాస సినిమాలో కృష్ణ శివాజీ పాత్రలో నటించారు. అయితే.. అది పూర్తిస్థాయి పాత్ర కాదు. కాసేపు మాత్రమే. దానికి తృప్తి చెందని కృష్ణ పూర్తి స్థాయిలో చత్రపతి శివాజీ సినిమా చేయాలనుకున్నారట. ‘అల్లూరి సీతారామరాజు’ తర్వాత మహారథితో శివాజీ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారట కృష్ణ. ఆ ప్రాజెక్ట్ మీద కొంత వర్క్ కూడా చేశారు. అయితే.. ఆ సినిమా వలన మత ఘర్షణలు చెలరెగే అవకాశం ఉందనే సందేహం వచ్చింది. దీంతో ఈ సినిమా చేయాలనే ఆలోచనను ఆయన వెనక్కి తీసుకున్నారట. దాంతో తనకు ఇష్టమైన శివాజీ పాత్రలో కనిపించాలనే కోరిక తీరకుండానే పోయింది. ఆ తర్వాత ఆ అవకాశం కూడా ఆయనకు రాలేదు. ఓ రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా చేయాలని.. బాలీవుడ్ బిగ్బి అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహస్తున్న రియాలిటీ షో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’. దేశవ్యాప్తంగా ఈ షో ఎంతో క్రేజ్ను సంపాదించుకుంది. తెలుగులోనూ ఈ షో నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది. అయితే అప్పట్లోనే ఇలాంటి ఓ రియాలిటీ షో చేయాలన్నది కృష్ణ కోరిక అట. కౌన్ బనేగా కరోడ్ పతి చూసి ఇక్కడ కూడా అలాంటి ఓ షో చేయాలని ఆయన కోరుకున్నారట. అమితాబ్ వ్యాఖ్యాతగా వ్యవహరించే కేబీసీ షో చూసిన కృష్ణ.. తనకు కూడా అటువంటి షో చేయాలని ఉందని ఓ సందర్భంలో తన మనసులో మాట బయటపెట్టారు. అటువంటి కొత్త కాన్సెప్ట్తో ఎవరైనా టీవీ షో ఆఫర్తో తన దగ్గరకు వస్తే చేస్తానన్నారు. బుల్లితెరపై షోలు చేయడానికి తనకు అభ్యంతరం లేదని కృష్ణ గతంలో తెలిపారు. చదవండి రికార్డుల గని... అందుకే ఆయనను నిర్మాతల హీరో అన్నారు తండ్రి మరణాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతమైన మహేశ్ -
దసరా విషెస్ చెప్పిన షమీ ..దారుణంగా ట్రోల్స్ చేసిన నెటిజన్స్
-
సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక భూమిక: మంత్రి బొత్స
సాక్షి, విజయవాడ: ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా రాష్ట్రంలోని టీచర్లకు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శుభాకాంక్షలు తెలిపారు. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు ఎంతో కీలక భూమిక వహిస్తారని అటువంటి వారిని గురుపూజోత్సవం నాడు సన్మానించుకోవడం చాలా ముదావహమని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చదవండి: పవన్ కల్యాణ్ని తిట్టిస్తున్నారని చంద్రబాబు చెప్పడం దేనికి సంకేతం? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ అనేక సంస్కరణలు అమలు చేస్తున్నారని, వాటి ద్వారా విద్యార్ధులకు మెరుగైన ప్రమాణాలతో విద్య అందేలా ఉపాధ్యాయులందరూ పునరంకితం కావాలన్నారు. ఉపాధ్యాయులంటే కేవలం తరగతి గదులకే పరిమితం కాదని, తల్లి దండ్రుల తరువాత పిల్లలు ఎక్కువగా గడిపేది టీచర్లతోనే అని, పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసేది వారేనని ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా సాంకేతికతను అందిపుచ్చుకుని విద్యా రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలని మంత్రి ఆకాంక్షించారు. -
మంచి పనులకు విఘ్నాలు తొలగిపోవాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోయి.. ప్రజలందరికీ శుభాలు కలగాలని, విజయాలు సిద్ధించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. అలాగే గణనాథుని కరుణాకటాక్షాలతో ప్రతి కుటుంబం.. సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: చవితి పండుగపై ఏపీలో ఏ ఆంక్షలూ లేవు -
త్యాగానికి, ధర్మ పరిరక్షణకు ప్రతీక మొహర్రం : సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు ప్రతీక అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మొహర్రం సందర్భంగా సీఎం జగన్ సందేశం విడుదల చేశారు. మహ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ బలిదానానికి మొహర్రం ప్రతీకగా పేర్కొన్నారు. ఇస్లామిక్ క్యాలెండర్లో మొదటి నెల కూడా మొహర్రం అని చెప్పారు. ఈ పవిత్ర సంతాప దినాలు రాష్ట్రంలో మత సమైక్యతకు ప్రతిబింబంలా నిలుస్తాయని ముఖ్యమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. చదవండి: (100 శాతం ‘మద్దతు’) త్యాగానికి ప్రతీక మొహర్రం. నమ్మిన సిద్ధాంతం కోసం కష్టనష్టాలను భరించి, ఆత్మ బలిదానానికి కూడా సిద్ధపడిన మహ్మద్ ప్రవక్త మనవడు ఇమామ్ హుస్సేన్ జీవితం అందరికీ ఆదర్శం. పవిత్రమైన ఈ మొహర్రం సంతాప దినాలు రాష్ట్రంలో మత సమైక్యతకు ప్రతీకగా నిలుస్తాయి. — YS Jagan Mohan Reddy (@ysjagan) August 9, 2022 -
President Election 2022: ద్రౌపది ముర్ముకు సీఎం జగన్ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ద్రౌపది ముర్ముకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ద్రౌపది ముర్ము విజయం.. వైఎస్సార్సీపీ అనుసరిస్తున్న సామాజిక న్యాయాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. మహిళా, బలహీన వర్గాల సాధికారతలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని, ప్రజా జీవితంలో ముర్ముకు ఉన్న గొప్ప అనుభవం, ఆమె ఎన్నికైన అత్యున్నత పదవిని అలంకరించిందని ముఖ్యమంత్రి అన్నారు. చదవండి: కొత్త రాష్ట్రపతిగా గిరిజన బిడ్డ.. ద్రౌపది ముర్ము ప్రస్థానమిదే -
సీఎం జగన్ గురుపూర్ణిమ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: గురుపూర్ణిమ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘విజ్ఞాన, వికాసాలను అందించే పూజ్య గురువులందరికీ ఆ గురుపరంపరకు హృదయపూర్వక నమస్కారాలు’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. చదవండి: గురుపూర్ణిమ స్పెషల్: ఒక గురువు... వేలాది మంది శిష్యులు రాష్ట్ర ప్రజలందరికీ గురుపూర్ణిమ శుభాకాంక్షలు. విజ్ఞాన, వికాసాలను అందించే పూజ్య గురువులందరికీ ఆ గురుపరంపరకు హృదయపూర్వక నమస్కారాలు.#GuruPurnima2022 — YS Jagan Mohan Reddy (@ysjagan) July 13, 2022 -
సీఎం వైఎస్ జగన్ బక్రీద్ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: పవిత్రమైన బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదర సోదరీమణులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘త్యాగం, ప్రేమ, సహనం వంటి సద్గుణాల సందేశమే బక్రీద్’ అని ట్వీట్ చేశారు. నమ్మిన సిద్ధాంతం కోసం చివరికి ప్రాణ త్యాగానికి సిద్ధపడిన ఇబ్రహీమ్ జీవితం మనందరికీ ఆదర్శం. మంచి కోసం, ధర్మ సంస్థాపన కోసం ఈరోజు త్యాగోత్సవం జరుపుకొంటున్న ముస్లిం సోదర సోదరీమణులందరికీ బక్రీద్ శుభాకాంక్షలంటూ ఆయన ట్వీటర్లో పేర్కొన్నారు. చదవండి: మీ మద్దతుకు.. మరోసారి సెల్యూట్: సీఎం జగన్ త్యాగం, ప్రేమ, సహనం వంటి సద్గుణాల సందేశమే బక్రీద్. నమ్మిన సిద్ధాంతం కోసం చివరికి ప్రాణత్యాగానికి సిద్ధపడిన ఇబ్రహీమ్ జీవితం మనందరికీ ఆదర్శం. మంచి కోసం, ధర్మ సంస్థాపన కోసం ఈరోజు త్యాగోత్సవం జరుపుకొంటున్న ముస్లిం సోదర సోదరీమణులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. — YS Jagan Mohan Reddy (@ysjagan) July 10, 2022 -
ఉక్కు సంకల్పం కలిగిన అమ్మాయిలకు అభినందనలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో విజయం సాధించిన అమ్మాయిలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సాయంత్రం ట్విటర్ ద్వారా అభినందనలు తెలియజేశారు. ‘‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో అద్భుత విజయాలు సాధించినందుకు ఛాంపియన్లు రజిత, పల్లవి, శిరీషలకు అభినందనలు. ఉక్కు సంకల్పం కలిగిన ఈ అమ్మాయిలు ఏపీకి గర్వకారణంగా నిలిచారు. వీళ్ల విజయం.. అన్ని అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన పటిమ, కలలను సాధనకు చేసిన కృషి.. ఎంతో మంది ఔత్సాహికులకు ప్రేరణ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. Congratulating champions Rajitha, Pallavi & Sireesha for their spectacular victories in the Khelo India Youth Games. The iron-willed girls have made AP proud. Their fighting spirit to succeed against all odds is an inspiration for countless aspirants to achieve their dreams. — YS Jagan Mohan Reddy (@ysjagan) June 8, 2022 -
తెలంగాణ ప్రజానీకానికి రాష్ట్రపతి, ప్రధాని, రాహుల్ శుభాకాంక్షలు
సాక్షి,న్యూఢిల్లీ: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుభాకాంక్షలు తెలిపారు.‘సుసంపన్నమైన సంస్కృతి, వారసత్వంతో తెలంగాణ అభివృద్ధి సూచికల్లో ప్రశంసనీయమైన పురోగతిని సాధించింది. పరిశ్రమలకు కేంద్రంగా ఉద్భవించింది. ఇది నిరంతరం అభివృద్ధి చెందాలి. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని కోరుకుంటున్నాను’అని ట్వీట్ చేశారు. తెలుగులోనే రాష్ట్రావతరణ శుభాకాంక్షలు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా /ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వరకు అందరూ తెలుగులోనే శుభాకాంక్షలు ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ప్రతీ రాజకీయ పార్టీ తెలంగాణ ప్రజలకు తెలుగులోనే శుభాకాంక్షలు చెప్తూ చేసిన ట్వీట్లకు ఆయా పార్టీ కార్యకర్తలు భారీగా ప్రతిస్పందించారు. ‘రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, నా తెలంగాణ సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు. కష్టపడి పనిచేయడంలో, దేశాభివృద్ధికి పాటుపడటంలో పేరుపొందిన వా రు తెలంగాణ ప్రజలు. ప్రపంచ ప్రఖ్యా తి పొందినది తెలంగాణ సంస్కృతి. తెలంగా ణ ప్రజల శ్రేయస్సుకై నేను ప్రారి్థస్తున్నాను.’ –నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా, నా తెలంగాణా సోదర, సోదరీ మణులకు శుభాకాంక్షలు. కష్టపడి పని చేయడంలో, దేశాభివృద్ధికి పాటుపడడంలో పేరు పొందినవారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ప్రపంచ ప్రఖ్యాతి పొందినది తెలంగాణా రాష్ట్ర సంస్కృతి. తెలంగాణా ప్రజల శ్రేయస్సుకై నేను ప్రార్ధిస్తున్నాను.— Narendra Modi (@narendramodi) June 2, 2022 ‘గత ఎనిమిదేళ్లలో తెలంగాణ దారుణమైన టీఆర్ఎస్ పాలనను చూసింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన రైతులు, కార్మికులు,పేదలు, సామాన్య ప్రజలకు శ్రేయస్సును అందించడంపై దృష్టి సారించిన ఒక మోడల్ రాష్ట్రంగా నిర్మించాలనే కాంగ్రెస్ నిబద్ధతను మరోమారు పునరుద్ఘాటిస్తున్నాను. మంచి భవిష్యత్తు కోసం ప్రజల ఆకాంక్షల నుంచి తెలంగాణ పుట్టింది. ప్రజల మనోభావాల మేరకు తెలంగాణ కలను సాకారం చేసేందుకు కాంగ్రెస్, సోనియాగాంధీ నిస్వార్ధంగా పనిచేయడం పట్ల గర్వంగా ఉంది. రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు, ఈ చరిత్రాత్మకమైన రోజున అమరవీరులు, వారి కుటుంబ సభ్యుల త్యాగాలను స్మరించుకుందాం’ –రాహుల్ గాందీ, కాంగ్రెస్ నేత తమ పోరాట స్ఫూర్తితో యావత్ దేశానికి స్ఫూర్తిదాయకమైన నా తెలంగాణ సోదరసొదరీమణులందరికీ #TelanganaFormationDay శుభాకాంక్షలుఈ చారిత్రాత్మక రోజున అమరవీరుల, వారి కుటుంబసభ్యుల త్యాగాలను స్మరించుకుందాం.— Rahul Gandhi (@RahulGandhi) June 2, 2022 ‘సోనియాగాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను, పోరాటా న్ని గుర్తిస్తూ వారి చిరకాల స్వప్నం నిజం చేసిన రోజు ఇది. అమరవీరులను తలచుకుంటూ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు. జై తెలంగాణ! జై కాంగ్రెస్!’ –ప్రియాంకా గాందీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ‘తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు. అమర వీరులకు జోహార్ జోహార్... జై తెలంగాణ జై జై తెలం గాణ.’ –అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం ఇది కూడా చదవండి: దేశం ప్రమాదకర పరిస్థితిలో ఉంది.. కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్ -
ప్రాణాలను సైతం లెక్కచేయని సేవామూర్తులు: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ఇవాళ(మే 12న) అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. అత్యవసర సమయాల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలు అందించే సేవామూర్తులు నర్సులు అని, ‘ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న’ అన్నట్లుగా ఎంతోమందికి జీవం పోసే ప్రాణదాతలు వార’ని సీఎం జగన్ కొనియాడారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా.. నర్సులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఆయన. అత్యవసర సమయాల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలు అందించే సేవామూర్తులు నర్సులు. `ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న` అన్నట్లుగా ఎంతోమందికి జీవం పోసేప్రాణదాతలు వారు. #InternationalNursesDay సందర్భంగా నర్సులందరికీ శుభాకాంక్షలు. — YS Jagan Mohan Reddy (@ysjagan) May 12, 2022 చదవండి: కోనసీమలో సీఎం వైఎస్ జగన్ పర్యటన -
నేను మంచి కొడుకును కాదమ్మా.. అంటూ ఆర్జీవీ పోస్ట్
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా అది వెరైటీగానే ఉంటుంది. ఈ మధ్య కాలంలో బర్త్డే సహా ప్రతీ వేడుకను సెలబ్రేట్ చేసుకుంటున్న వర్మ తాజాగా మదర్స్ డే రోజున అపురూమైన ఫోటోను షేర్ చేశారు. 'హ్యాపీ మదర్స్ డే అమ్మ. నేను మంచి కొడుకును కాదు కానీ తల్లిగా నువ్వు చాలా మంచిదానివి'.. అంటూ తల్లితో కలిసి దిగిన ఫోటోను ట్విటర్లో పంచుకున్నాడు. ఇందులో ఆర్జీవీ చేతిలో గ్లాస్ పట్టుకొని కనిపించడం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన నెటిజన్లు.. మీరు కూడా విషెస్ చెబుతున్నారా.. అంతే ఆర్జీవీ ఎప్పటికీ అర్థం కాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. Happy Mother’s Day Mom, I am not as good as a son but u are more than good as a mother 💐💐🙏 pic.twitter.com/uZ7E9ngeMy — Ram Gopal Varma (@RGVzoomin) May 8, 2022 -
మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: నేడు(మే8వ తేదీ) మదర్స్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘తల్లి ప్రేమ శాశ్వతమైనది మరియు దైవ సంబంధమైంది. ఏపీలోని తల్లులందరి సాధికారత కోసం కృషి చేయడం కంటే నాకు ఈ జీవితాన్ని బహుమతిగా ఇచ్చిన మా అమ్మకు గొప్ప బహుమతి మరొకటి ఉండదు’’ అంటూ ట్విట్టర్ వేదికగా తల్లులకు సీఎం జగన్ శుభాకాంక్షలు చెప్పారు. A mother’s love is eternal and divine. There can be no greater gift for my mother who has given me the gift of life, than to work towards the empowerment of all the mothers in AP.#MothersDay — YS Jagan Mohan Reddy (@ysjagan) May 8, 2022 -
సీతారాముల అనుగ్రహంతో అందరికీ శుభాలు కలగాలి
సాక్షి, అమరావతి: శ్రీరామ నవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి జనరంజక పాలన సాగించిన గొప్ప ప్రజాపాలకుడు శ్రీరాముడు. ధర్మ సంస్థాపన, లోక కల్యాణం కోసం ఎన్నో కష్టాలకోర్చిన శ్రీ సీతారాములు మనందరికీ ఆదర్శం. ఆ ఆదర్శ మూర్తుల చల్లని దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం జగన్. అటు భద్రాద్రి, ఇటు ఒంటిమిట్టలో తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటింటా ఈ పర్వదినాన్ని, రాములవారి కళ్యాణాన్ని వైభవంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ అన్ని శుభాలు కలిగేలా శ్రీ సీతారాముల అనుగ్రహం లభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభిలషించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి జనరంజక పాలన సాగించిన గొప్ప ప్రజాపాలకుడు శ్రీరాముడు. ధర్మ సంస్థాపన, లోకకల్యాణం కోసం ఎన్నో కష్టాలకోర్చిన శ్రీ సీతారాములు మనందరికీ ఆదర్శం. ఆ ఆదర్శమూర్తుల చల్లని దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. — YS Jagan Mohan Reddy (@ysjagan) April 10, 2022 చదవండి: (తుడా ఛైర్మన్గా చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కొనసాగింపు) -
సినీ తారల శుభాకాంక్షలు.. నెట్టింట ఉగాది సందడి
Cine Celebrities Wishes On Ugadi 2022: ఏప్రిల్ 2 శనివారం.. అంటే తెలుగువారికి కొత్త సంవత్సరం. ఈరోజు నుంచి 'శ్రీ శుభకృత్ నామ' తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు సాంప్రదాయకంగా భావించే ఈ ఉగాది పర్వదినాన్ని దక్షిణ భారతదేశంలో ఎక్కువగా జరుపుకుంటారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలలో న్యూ తెలుగు ఇయర్ ప్రారంభంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా సినీ తారలు సోషల్ మీడియా వేదికగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఉగాది శుభాకాంక్షలతో సోషల్ మీడియాలో పండుగ హడావిడి కనిపిస్తూ సందడిగా మారింది. 'శ్రీ శుభకృత్ నామ' సంవత్సరంలో ప్రతి ఒక్కరికీ అన్ని శుభాలే జరగాలని మెగాస్టార్ చిరంజీవి కోరుకున్నారు. సోషల్ మీడియా వేదికగా శనివారం ఉదయం అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవితోపాటు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మహేశ్ బాబు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మహానటి కీర్తి సురేష్, డైరెక్టర్ శ్రీనువైట్ల, యంగ్ హీరో సుధీర్ బాబు, బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ సహా పలువురు సినీ ప్రముఖులు నెట్టింట తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ శ్రీ శుభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలు ! ఈ ఉగాది అందరికీ అన్ని శుభాలు కలిగించాలని, అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు వెల్లి విరియాలని కోరుకుంటున్నాను! 💐 pic.twitter.com/oFmh1H8IWQ — Chiranjeevi Konidela (@KChiruTweets) April 2, 2022 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, అంటే ఉగాది. ఈ ఉగాది నుంచైనా మనందరికీ మంచి జరగాలని భగవంతుడ్ని కోరుకుంటున్నాను. "శ్రీ శుభకృత్" నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!! మీ మోహన్ బాబు#HappyUgadi #ఉగాది pic.twitter.com/3deIDbWYns — Mohan Babu M (@themohanbabu) April 2, 2022 Wishing you all a very happy Ugadi! May this day usher in love, harmony and prosperity! 🙏 — Mahesh Babu (@urstrulyMahesh) April 2, 2022 మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. Wishing everyone a Happy Ugadi, Gudi Padwa and Chaitra Sukhladi. — Jr NTR (@tarak9999) April 2, 2022 I wish you all a very Happy Ugadi ♥️ May God bless us all with peace and positivity ♥️ — Sai Pallavi (@Sai_Pallavi92) April 2, 2022 శుభకృత నామ సంవత్సరం మన అందరికీ సకల శుభాలను చేకూర్చాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు 🪴🥭🌺🍃 May the New Year bring happiness , wisdom, health and prosperity!! pic.twitter.com/ks7NopD9fv — Sreenu Vaitla (@SreenuVaitla) April 2, 2022 ఈ కొత్త ఏడాది మీకు ఆనందాన్ని , ఆరోగ్యాన్ని అందించాలని కోరుకుంటున్నాను. అందరికి శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. — Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) April 2, 2022 అందరికి ఉగాది శుభాకాంక్షలు 😊🥭🌾 pic.twitter.com/uxjaFSbDnR — Ritu Varma (@riturv) April 2, 2022 వికారి, శార్వరి , దాటి ఆశలు మొలకెత్తించే ప్లవ నామంలోకి వచ్చి , ఇప్పుడు శుభాలు అందించే శుభకృత్ నామ వసంతంలోకి అడుగుపెట్టాము 😃ఈ శుభకృత్ మీకు మీ కుటుంబ సభ్యులకు సకల శుభాలు చెయ్యాలని కోరుకుంటూ , నూతన తెలుగు వత్సర శుభాకాంక్షలు 🌹 pic.twitter.com/7nnTO69XJL — Paruchuri GK (@GkParuchuri) April 2, 2022 Looking forward to another year of happiness, love and prosperity for all! Gudi Padwa aur Ugadi ki sabhi ko shubhkaamnayein ✨#happygudipadwa — Ajay Devgn (@ajaydevgn) April 2, 2022 -
సీఎం వైఎస్ జగన్ మహా శివరాత్రి శుభాకాంక్షలు
Maha Shivaratri 2022: మహా శివరాత్రి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘పరమేశ్వరుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే అతిపెద్ద పండుగ మహాశివరాత్రి. ఈ పరమ పవిత్రమైన రోజున ముక్కంటి కరుణాకటాక్షాలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు’ అని ట్వీటర్లో సీఎం జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు. పరమేశ్వరుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే అతిపెద్ద పండుగ మహాశివరాత్రి. ఈ పరమ పవిత్రమైన రోజున ముక్కంటి కరుణాకటాక్షాలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. — YS Jagan Mohan Reddy (@ysjagan) March 1, 2022 -
అమితాబ్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు.. 3 రంగుల గడ్డంతో ఫొటో వైరల్
Amitabh Bachchan Republic Day Wishes With Tricolour Beard: బుధవారం (జనవరి 26) గణతంత్ర దినోత్సవ సందర్భంగా సామాన్యులు, రాజకీయ నాయకులతోపాటు సినీ సెలబ్రిటీలు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా సోషల్ మీడియా వేదికగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే అందరిలా కాకుండా కాస్త వినూత్నంగా విష్ చేశారు బిగ్బీ. గణతంత్ర దినోత్సవం రోజున ముచ్చట గొలిపే మూడు రంగుల మువ్వన్నల జెండాను ఎగరవేసి జెండా వందనం చేస్తాం. అయితే అమితాబ్ జాతీయ పతాకంలోని మూడు రంగుల గడ్డంతో విభిన్నంగా శుభాకాంక్షలు చెప్పారు. మూడు రంగులతో ఉన్న గడ్డం ఫొటోను తన ఇన్స్టా వేదికగా పోస్ట్ చేశారు అమితాబ్ బచ్చన్. అంతేకాకుండా ఇలాంటి గణతంత్ర దినోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని క్యాప్షన్ ఇచ్చారు బిగ్బీ. ఈ పోస్ట్పై నెటిజన్లతోపాటు సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. 'శుభాకాంక్షలు ఎంతో గొప్పగా చెప్పారు' అని పులువురు కామెంట్ చేస్తే మరికొందరు నవ్వుతున్న ఎమోజీస్ను పెడుతున్నారు. అలాగే ఈ పోస్ట్కు కొన్ని గంటల్లోనే 1.9 లక్షల మందికిపైగా లైక్ చేశారు. View this post on Instagram A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) -
ప్రధాని మోదీ నుంచి పర్సనల్ మెసేజ్: క్రిస్ గేల్
విండీస్ హార్డ్ హిట్టర్.. యునివర్సల్ బాస్ క్రిస్ గేల్కు ఇండియా అంటే ప్రత్యేకమైన అభిమానం.ఈ విషయాన్ని ఇంతకముందు చాలా సందర్బాల్లో చెప్పుకొచ్చాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ద్వారా గేల్ భారత క్రికెట్ అభిమానులకు మరింత చేరువయ్యాడు. తాజాగా జనవరి 26న భారత్ 73వ గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా క్రిస్ గేల్ భారతీయులకు తన స్టైల్లో శుభాకాంక్షలు తెలిపాడు. చదవండి: Kohli Vs BCCI: కోహ్లి,గంగూలీ ఒకసారి ఫోన్లో మాట్లాడుకోండి: కపిల్ దేవ్ ''భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ పంపిన పర్సనల్ మెసేజ్తో ఈరోజు నిద్ర లేచా. 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న భారతీయులకు ఇవే నా శుభాకాంక్షలు. మోదీతో పాటు దేశ ప్రజలతో నాకు విడదీయరాని అనుబంధం ఉంది. మీరంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. మీ దేశ క్రికెటర్లతో కలిసి ఐపీఎల్ సహా ఇతర క్లబ్ క్రికెట్లో కలిసి ఆడడం గౌరవంగా భావిస్తుంటా. కంగ్రాట్స్ ఫ్రమ్ యునివర్సల్ బాస్'' అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్కు ఆడాడు. దీనిలో ఆర్సీబీ తరపున 91 మ్యాచ్ల్లో 3420 పరుగులు సాధించాడు. కోహ్లి, డివిలియర్స్ తర్వాత ఆ జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా గేల్ నిలిచాడు. అయితే ఈసారి ఐపీఎల్లో మాత్రం గేల్ మెరుపులు మిస్ కానున్నాయి. ఐపీఎల్ మెగావేలానికి సంబంధించి ప్లేయర్ల వేలం జాబితాలో గేల్ రిజిస్టర్ చేసుకోలేదు. ఈ కారణంగా గేల్ వేలానికి దూరమయ్యాడు. ఇక క్రిస్ గేల్ అంతర్జాతీయ క్రికెట్లో వెస్టిండీస్ తరపున 103 టెస్టులు, 301 వన్డేలు, 79 టి20లు ఆడాడు. చదవండి: Neeraj Chopra: నీరజ్ చోప్రాకు విశిష్ట పురస్కారం I would like to congratulate India on their 73rd Republic Day. I woke up to a personal message from Prime Minister Modi @narendramodi reaffirming my close personal ties with him and to the people of India. Congratulations from the Universe Boss and nuff love 🇮🇳🇯🇲❤️🙏🏿 — Chris Gayle (@henrygayle) January 26, 2022 -
దీపికా పదుకొణె బర్త్డే.. ప్రభాస్, సమంతల స్వీటెస్ట్ విషెస్
Deepika Padukone Birthday Prabhas And Samantha Wishes: దీపికా పదుకొణె పేరుకే బాలీవుడ్ హీరోయన్ అయనా తెలుగు ప్రేక్షకుల్లో కూడా క్రేజ్ ఉన్న హీరోయిన్. 2006లో ఐశ్వర్య అనే కన్నడ చిత్రంతో సినీ రంగంలోకి ప్రవేశించింది ఈ అమ్మడు. తర్వాత బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సరసన 'ఓం శాంతి ఓం' సినిమాతో బీటౌన్లో అడుగుపెట్టి 'బెస్ట్ ఫీమేల్ డెబ్యూ' అవార్డు అందుకుంది. తండ్రి ప్రకాశ్ పదుకొణె మాజీ బ్యాడ్మింటన్ కాగా తన నటనతో అనేక అభిమానులను సొంతం చేసుకుంది స్మైల్ బ్యూటీ. కళ్లతోనే హావాభావాలు పలికించడం దీపికాకు ఉన్న ప్రధాన ఆకర్షణ. 2017లో 'ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్' సినిమాతో హాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇచ్చి వావ్ అనిపించింది. 1986 జనవరి 5న డెన్మార్క్లో జన్మించిన దీపికా 36వ పుట్టిన రోజు సందర్భంగా పలువురు తారలు బర్త్డే విషెస్ చెప్పారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. దీపికాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. 'ప్రకాశవంతమైన నవ్వుతో ఉండే అమ్మాయి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఎనర్జీ, టాలెంట్తో 'ప్రాజెక్ట్ కే' సెట్లో వెలుగులు నింపే నీకు ఎప్పుడూ ఆల్ ది బెస్ట్' అంటూ ఇన్ స్టా స్టోరీ షేర్ చేశాడు మిస్టర్ పర్ఫెక్ట్. వీరిద్దరి కాంబినేషన్లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ కే' సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల వీరిద్దరిపై కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. ఇందులో ప్రభాస్.. దీపికాకు చెయ్యి అందిస్తున్న సీన్ను చూడవచ్చు. View this post on Instagram A post shared by Vyjayanthi Movies (@vyjayanthimovies) ప్రభాస్తోపాటు స్టార్ హీరోయిన్ సమంత కూడా దీపికాకు విష్ చేసింది. తన ఇన్ స్టా స్టోరీలో 'మీకు ఇది చాలా ప్రత్యేకమైన పుట్టినరోజు కావాలని, ప్రతీరోజు ప్రేమతో ప్రారంభమై ప్రశాంతంగా పూర్తి కావాలని కోరుకుంటున్నా. లోపల బయట అత్యంత అందంగా ప్రకాశించే దీపికా పదుకొణెకు హ్యాపీ బర్త్డే' అని రాసుకొచ్చింది. వీరితోపాటు అనుష్క శర్మ, సారా అలీ ఖాన్, అనన్య పాండే, జాన్వీ కపూర్లు కూడా దీపికాకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విష్ చేశారు. ఇదీ చదవండి: ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపా.. పాపులర్ నటి -
తారల నూతన సంవత్సర శుభాకాంక్షలు.. వెల్లివిరిసిన సోషల్ మీడియా
Celebrities New Year Wishes Posts In Social Media: 2021 సంవత్సరం వెళ్లిపోయింది. సంతోషంగా, బాధగా, కష్టంగా గడిచిన ఈ సంవత్సరం అనుభవాలు, అనుభూతులను పంచుకున్నారు సెలబ్రిటీలు. ఈ ఏడాది కూడా సంతోషంగా, అనుకున్నవి అనుకున్నట్లు జరగాలనే ఆశతో న్యూ ఇయర్కు వెల్కమ్ చెబుతున్నారు. కొత్త ఆశలతో కొత్త సంవత్సరం వచ్చింది. ప్రతి ఒక్కరూ న్యూ ఇయర్ను సంతోషంగా ప్రారంభించాలని కోరుకుంటున్నట్లు శుభాకాంక్షలు తెలియజేయండని తారలు అభిమానులకు చెబుతున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీల శుభాకాంక్షల పోస్టులతో సోషల్ మీడియా వెల్లివిరిస్తోంది. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ శనివారం (జనవరి 1) ప్రముఖ పుణ్య క్షేత్రమైన తిరుమలను దర్శించుకుంది. ఆమె స్నేహితుడితో కలిసి అజయ్ ధర్మతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా స్వామి వారిని దర్శించుకుంది. తిరుపతి బాలాజీ ఆశీస్సులతో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఏడాది చిరస్మరణీయంగా ఉండాలని కోరుకుంటున్నాను. అని తన ఇన్స్టా గ్రామ్ అకౌంట్లో పోస్ట్ షేర్ చేసింది కంగనా. బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ఒక వీడియో షేర్ చేస్తూ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపాడు. ఈ క్లిప్లో దీపిక పదుకొణె ఆహారం తింటూ 83 మూవీలోని ఒక డైలాగ్ను స్ఫూఫ్ చేసి చెప్పడం బాగుంది. View this post on Instagram A post shared by Kangana Thalaivii (@kanganaranaut) View this post on Instagram A post shared by Ranveer Singh (@ranveersingh) బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ 'నా ప్రియమైన వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు' అని పోస్ట్ చేశారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు కుటుంబం న్యూ ఇయర్ను దుబాయ్లో సెలబ్రేట్ చేసుకుంటుంది. 'కొత్త ప్రారంభం మ్యాజిక్పై విశ్వాసం ఉంచండి. హ్యాపీగా, దయతో, కృతజ్ఞతను కలిగి ఉండండి. హ్యాపీ న్యూయర్ 2022. సురక్షితంగా ఉండండి. లవ్ యూ ఆల్' అని తన కుటుంబతో దిగిన ఫొటోను షేర్ చేస్తూ విష్ చేశారు మహేశ్ బాబు. నెషనల్ క్రష్ రష్మిక మందన్నా కూడా న్యూ ఇయర్ విషెస్ తెలిపింది. 'హ్యాపీ 2022 మై లవ్స్' అని ఒక అందమైన ఫొటోను షేర్ చేసింది రష్మిక. చందమామ కాజల్ తన భర్త ఫొటోను పంచుకుంటూ అభిమానులకు శుభాకాంక్షలు చెప్పింది. గతేడాది జ్ఞాపకాలు, ఆనందాలను ప్రస్తావిస్తూ పోస్ట్ చేసింది. వీరితోపాటు అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ, అర్జున్ కపూర్, హృతిక్ రోషన్, సమంత, నయన తార-విఘ్నేశ్ శివన్ తదితర పాపులర్ స్టార్ నూతన సంవత్సర శుభాకాంక్షలను అభిమానులకు తెలియజేశారు. View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) Trust the magic of new beginnings! Be happy, be kind, be grateful! Happy New Year 2022! Stay safe everyone. Love you all ❤️🤗 pic.twitter.com/imt6vXH0yW — Mahesh Babu (@urstrulyMahesh) December 31, 2021 View this post on Instagram A post shared by Hrithik Roshan (@hrithikroshan) View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma) View this post on Instagram A post shared by Arjun Kapoor (@arjunkapoor) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
రెక్కలు కట్టుకుని ఎగిరిపోదాం.. ఆనంద్ మహీంద్రా వెరైటీ విషెస్
సంతోషం, బాధ, పండగలు, ప్రతిభలు ఇలా అంశం ఏదైనా సోషల్ మీడియా వేదికగా స్పందించడంలో ముందుంటారు మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా. న్యూ ఇయర్ని పురస్కరించుకుని ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టేలా.. భవిష్యత్తు పట్ల భరోసా కలిగించేలా ఓ వీడియోను షేర్ చేస్తూ న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఓ ఆండియన్ కండోర్ పక్షికి రోజుల తరబడి చికిత్స అందించారు చిలీ వైద్యులు. ఆ తర్వాత ఆ పక్షిని జాగ్రత్తగా పర్వత ప్రాంతాలకు వద్దకు తీసుకువచ్చి వదిలారు. కాసేపు ఎగిరేందుకు ఇబ్బంది పడ్డ ఆ పక్షి.. ఆ తర్వాత స్వేచ్ఛగా గాలిలో ఎగురుతూ ప్రకృతిలో మమేకమైంది. Just one video captures all my hopes for the New Year.Sinchi, an Andean condor, was released in the Peruvian mountains after recovering from severe poisoning. Covid poisoned the world. May we find our collective wings in ‘22. Happy New Year to you all. pic.twitter.com/g7OEIfFDId — anand mahindra (@anandmahindra) December 31, 2021 ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేసిన వీడియో పాతదే అయితే ఆ వీడియోను ప్రస్తుత కరోనా పరిస్థితులకు ముడిపెట్టారు ఆనంద్ మహీంద్రా. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా మన జీవితాలు అతలాకుతలం అయ్యాయని, రాబోయే ఏడాదిలో ఈ కష్టాలను జయించి హాయిగా స్వేచ్ఛగా జీవిద్దాం అనే అర్థం వచ్చేలా ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. -
క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రోజా
-
ప్రేమను నేర్పింది నువ్వేగా...మాటలే దొరకడం లేదు : నటి
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి నేహా ధూపియా, అంగద్ బేడీల మెహర్ కూతురు ఈ రోజుతో మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నేహా ధూపియా తన కుమార్తె మెహర్కోసం ఒక అద్భుతమైన పోస్ట్ పెట్టింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నేహా మెహర్కు స్పెషల్గా శుభాకాంక్షలు తెలిపింది. (Nayanthara Birthday Special: డేరింగ్ అండ్ డాషింగ్ నయన్ ‘తార’) రెండవ బిడ్డ కడుపులో ఉండగా నేహా ధూపియా మెహర్తో కలిసివున్న తన ప్రసూతి ఫోటోషూట్ ఫోటోను పోస్ట్ చేస్తూ ఇలా తెలిపింది, " మూడేళ్ల క్రితం ఇదే రోజు ఉదయం 11.25 గంటలకు... నా శరీరానికి ఆవల నా గుండె కొట్టుకోవడం ప్రారంభించింది. నా బంగారు తల్లీ నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ప్రేమ అంటే ఏమిటో నువ్వేగా మాకు నేర్పించావు. నువ్వొక అద్భుతానికి.. ఎప్పుడూ లేనిది, మాటలు రావడం లేదు అమ్మకు’’ . కాగా నేహా ధూపియా, అంగద్ బేడీ దంపతులకు 2018లో నవంబర్ 18న మెహర్ పుట్టింది. అలాగే ఈ ఏడాది అక్టోబర్ 3న తమ రెండవ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. నేహూ భర్త అంగద్ బేడి , పిల్లల చిత్రాలను సోషల్ మీడియాలో తరచుగా పోస్ట్ చేస్తూనే ఉంటుంది. తన కంటే 2 సంవత్సరాలు చిన్నవాడు, నటుడు అంగద్ బేడిని నేహా 2018లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Neha Dhupia (@nehadhupia) -
సీఎం జగన్ మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజైన మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మహమ్మద్ ప్రవక్త బోధనలైన దాతృత్వం, కరుణ, ధార్మిక చింతన, సర్వ మానవ సమానత్వం, ఐకమత్యం మానవాళికి సదా అనుసరణీయమని పేర్కొన్నారు. భక్తి, శ్రద్ధలతో ఈ పండుగ జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. చదవండి: సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం -
వివాహ వేడుకకు అనుకొని అతిథి..
-
పిలవకుండానే పెళ్లికి వెళ్లి వధూవరులను ఆశీర్వదించిన సీఎం
చండీగఢ్: సాధారణంగా ముఖ్యమంత్రి అంటే.. కట్టుదిట్టమైన భద్రత.. ఆయన చుట్టుపక్కల ఒక పెద్ద హడావిడితో కూడిన వాతావరణం ఉంటుంది. సీఎం చుట్టు ఉండే భద్రత సిబ్బంది.. ఆయన అపాయింట్ మెంట్ లేకుండా ఆయన దరిదాపుల్లోకి కూడా వెళ్లనివ్వరనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. ఒక్కొసారి ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా సీఎం భద్రత దృష్ట్యా.. సెక్యురిటీ సిబ్బంది నుంచి చేదు అనుభవం ఎదుర్కోవడం మనం చూస్తునే ఉంటాం. కొంత మంది ముఖ్యమంత్రులు మాత్రం దీనికి భిన్నంగా అవకాశం చిక్కినప్పుడల్లా ప్రజలతో మమేకమవ్వటానికి ప్రయత్నిస్తుంటారు. ప్రజలు జరుపుకునే పండుగలకు, శుభకార్యాలకు హజరవుతుంటారు. ఆ కోవకు చెందిన వారే ఇటీవల పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చరణ్ జీత్ సింగ్ ఛన్నీ. ఆయన తాజాగా ఒక వివాహ వేడుకలో వధువరులను ఆశీర్వదించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇటీవల పంజాబ్ 16 వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చరణ్జీత్ సింగ్ చన్నీ బటిండా జిల్లా పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో ఆయన.. తన కాన్వాయ్ రోడ్డు మండి కలాన్ అనే గ్రామంనుంచి వెళ్తుండగా.. ఒక వివాహ వేడుక జరుగుతోంది. వెంటనే సీఎం తన కాన్వాయ్ని ఆపించారు. ఆ తర్వాత కిందకు దిగి .. నూతన దంపతులను పలకరించారు. పెళ్లికుమారుడిని హత్తుకొని మరీ శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా ఆ వేడుకలో పెళ్లివారు ఇచ్చిన స్వీట్(పారట్) స్వీకరించి వారిని ఆనందపర్చారు. కాగా, సాక్ష్యాత్తూ.. ఒక సీఎం పిలవకుండా ఆగి.. తమకు శుభాకాంక్షలు తెలిపినందుకు వధువరులు ఆనందంతో ఉప్పోంగిపోయారు. వారితో సీఎం కొద్దిసేపు మాట్లాడారు. వధువరులను సీఎం చరణ్ జీత్ సింగ్ మనసారా ఆశీర్వదించారు. కాగా, దీన్ని పంజాబ్ ముఖ్యమంత్రి అధికారిక ట్విటర్ ఖాతాలో ఈ వీడియో షేర్ చేశారు. దీంతో ఇది వైరల్గా మారింది. అయితే, గతంలో చరణ్ జీత్ సింగ్ విద్యార్థులతో కలిసి కపూర్తలాలో చేసిన భాంగ్రా ఫోక్ డ్యాన్స్ వైరల్గా మారిన విషయం తెలిసిందే. చదవండి: Charanjit Singh Channi: భాంగ్రా డ్యాన్స్తో హల్చల్ -
ఇదీ ఇంగ్లండ్ ఆటగాళ్ల పరిస్థితి.. అంతేగా.. అంతేగా!
లండన్: ఓవల్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్లో ఇంగ్లండ్ పై ఘనవిజయం సాధించిన టీమిండియా పై ట్విటర్లో ప్రశంసల వర్షం కురుస్తోంది. పలువురు మాజీ ఆటగాళ్లు, ప్రముఖులు, కోహ్లి సేనను అభినందిస్తున్నారు. అభిమానులు చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారత మాజీ ఆటగాడు వెంకటేశ్ ప్రసాద్.. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన బౌలర్లును కొనియాడతూ ట్వీట్ చేశారు. మరో భారత మాజీ బ్యాట్స్మన్ వీవీఎస్ లక్ష్మణ్ .. భారత్కు ఈ విజయం చిరస్మరణీయంగా నిలిచిపోతుందని హర్షం వ్యక్తం చేశాడు. This is a very special Test Match win. After being 127/7 on the first day, not many teams can make a comeback and win a away test the way Team India have done. That is why this is a very special Indian Team. Congratulations to everyone for playing their part in a memorable win. pic.twitter.com/9XDJCCrAwC— VVS Laxman (@VVSLaxman281) September 6, 2021 భయం లేదు.. బెరుకు లేదు.. కలిసికట్టుగా ఏదైనా సాధిస్తుంది.. అదే టీమిండియా అని స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ట్వీట్ చేశాడు. Individual commitments to a group effort. That’s the definition of this Team. This is Team India. Absolute Fearless. 🇮🇳💪 pic.twitter.com/9iRxyAvAfF— Yuzvendra Chahal (@yuzi_chahal) September 6, 2021 ఇక ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ మరోసారి తనదైన శైలిలో ట్వీటాడు. నాలుగు టెస్టుల్లో ఇంగ్లండ్ ఆటగాళ్ల పరిస్థితి ఇదీ అన్నట్లుగా.. ఓ మీమ్ను పంచుకున్నాడు. The Angrez this series😁 #ENGvIND pic.twitter.com/xFRejslJlw — Wasim Jaffer (@WasimJaffer14) September 6, 2021 What an incredible comeback by India after the first day. Shardul Thakur and Rohit Sharma were the standout performers and the bowlers were terrific especially in the second innings. A win to remember #ENGvIND pic.twitter.com/gOcUJa6fT8 — Venkatesh Prasad (@venkateshprasad) September 6, 2021 -
శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచానికి గీతను బోధించి, ప్రేమ తత్వాన్ని పంచిన శ్రీకృష్ణుని కృపా కటాక్షాలు మనందరిపై సదా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ కృష్ణాష్టమి పర్వదిన శుభాకాంక్షలు. ప్రపంచానికి గీతను బోధించి, ప్రేమ తత్వాన్ని పంచిన శ్రీకృష్ణుని కృపా కటాక్షాలు మనందరిపై సదా ఉండాలని కోరుకుంటున్నాను. #KrishnaJanmashtami — YS Jagan Mohan Reddy (@ysjagan) August 30, 2021 ఇవీ చదవండి: బడికి వెళ్లకుంటే.. ఇంటికి వలంటీర్ వస్తారు! పంచాయతీ పటిష్టం! -
తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు: లోక్సభ స్పీకర్ ఓం బిర్లా
సాక్షి, ఢిల్లీ: తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్న రెండు రాష్ట్రాల సోదరీ సోదరులకు శుభాకాంక్షలు అంటూ లోకసభ స్పీకర్ ఓం బిర్లా ట్వీట్ చేశారు. ‘తెలుగు మహా కవి, రచయిత గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా సుమాంజలి. భాషలు మన సమృద్ధికి.. సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు దోహదపడతాయని’ ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు తెలిసిన ఏపీ గవర్నర్ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మహా కవి, రచయిత గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా జరుపుకుంటున్న ఈ వేడుక తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడుకునేందుకు దోహదపడుతుంది. ఎన్నో యుగాలుగా ఇక్కడి ప్రజల సంస్కృతి, వారసత్వాన్ని కాపాడుతున్న తెలుగుభాషా గొప్పదనాన్ని చాటేందుకు తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉందని’’ గవర్నర్ ట్వీట్ చేశారు. తెలుగు మహా కవి, రచయిత శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతి సందర్బంగా సుమాంజలి. ఈ రోజు తెలుగు భాష దినోత్సవం కూడా జరుపుకుంటున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల సోదర,సోదరిమణులకు నా శుభాకాంక్షలు. భాషలు మన సమృద్ధికి, సంస్కృతి మరియు సంప్రదాయాలను పరిరక్షించేందుకు దోహదపడతాయి. — Om Birla (@ombirlakota) August 29, 2021 This #TeluguLanguageDay is observed to cherish pride of Telugu language that preserved the culture and heritage of this state from ages. The #Telugu Language Day is celebrated to mark the birth anniversary of eminent Telugu poet Gidugu Venkata Ramamurthy. pic.twitter.com/uZA2zUvE8S — Biswa Bhusan Harichandan (@BiswabhusanHC) August 29, 2021 -
జాతి నిర్మాణానికి అంకితమవుదాం: గవర్నర్ బిశ్వభూషణ్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శనివారం గవర్నర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ గా జరుపుకుంటున్న తరుణంలో రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలపడం ఆనందంగా ఉందని గవర్నర్ పేర్కొన్నారు. స్వాతంత్య్ర ఫలాలను ఆస్వాదించడానికి మనకు మార్గం సుగమం చేసిన గొప్ప స్వాతంత్య్ర సమరయోధులందరినీ స్మరించుకునేది ఈ రోజు అన్నారు. సత్యం, అహింస, శాంతి, సంఘీభావం, సోదరభావం వంటి గొప్ప ఆదర్శాలను ప్రతిష్టించిన రోజు ఇదేనని తెలిపారు. ఈ రోజున జాతి నిర్మాణానికి అంకితమవుదామని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోవాలని కోరారు. -
National Doctors Day: వైద్యులకు సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, డాక్టర్లకు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్య విపత్తుల సమయంలో ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా పని చేస్తున్న వైద్యులు దైవంతో సమానమని, వారి సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. కోవిడ్పై పోరాటంలో వైద్యుల సేవలు త్యాగపూరితమైనవని, మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి రోగులకు సేవలందించిన ప్రతి డాక్టర్ సేవలు అసమానమని ప్రశంసించారు. కోవిడ్పై పోరాటంలో వైద్యుల కుటుంబ సభ్యుల సహకారం అభినందనీయమన్నారు. తల్లిదండ్రులు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మను ఇస్తారని, బాధలనుంచి శరీరాన్ని, విపత్తుల నుంచి ప్రాణాన్ని కాపాడే ప్రత్యక్ష దైవాలే డాక్టర్లని కొనియాడారు. On this #DoctorsDay, Hon’ble CM @ysjagan has expressed his deepest gratitude to the medical fraternity for their dedicated and unparalleled service to the humanity, especially during the trying times of #covid19. — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) July 1, 2021 -
State Bank Day: హ్యపీ, ఇన్క్రెడిబుల్ జర్నీ
సాక్షి ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేడు (జూలై 1) తన వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా తన అద్భుతమైన జర్నీపై ట్విటర్ ద్వారా ఒక వీడియోను షేర్చేసింది. పురోగతి దిశగా దేశంతో కలిసి పయనించడం గర్వంగా ఉందంటూ ట్విట్ చేసింది.అధునిక అవసరాలకు ధీటుగా సరికొత్త డిజిటల్ బ్యాంకింగ్ సేవలతో దేశ ప్రజలకు సేవ చేయడం సంతోషంగానూ, వినియోగదారుల ఆశలు, అంచనాలకనుగుణంగా ఇండియాతో పాటు దేశవిదేశాల్లో దూరప్రాంతాల్లో కూడా సేవలందించడం ఆనందంగా ఉందని వెల్లడించింది. 24x7 సేవలు, కస్టమర్ల అచంచలమైన మద్దతుతో, #TheBankerToEveryIndian గా నిలవడం గర్వంగా ఉందని తెలిపింది ఈ సందర్భంగా వినియోగదారులను తనకు స్టేట్ బ్యాంక్ డే శుభాకాంక్షలు! అంటూ ట్విట్ చేసింది. ప్రపంచంలోనే 43వ అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ. అంతేకాదు ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో 221 వ స్థానంలో ఉంది, ఈ జాబితాలో ఉన్న ఏకైక భారతీయ బ్యాంకుఇదే కావడం విశేషం. 19వ శతాబ్దంలో 1806లో కోలకతాలో బ్యాంక్ ఆఫ్ కలకత్తాగా, ఆ తరువాత బ్యాంక్ ఆఫ్ బెంగాల్గా అవతరించింది. పిదప మూడు ప్రెసిడెన్సీ బ్యాంకుల విలీనంతో 1921 జనవరిలో ఇంపీరియల్ బ్యాంక్గా మారింది. ఆ తరువాత జాతీయకరణలో 1955లో ఎస్బీఐగా రూపుదిద్దుకుంది. ఆధునిక సౌకర్యాలతో 1/4 వ మార్కెట్ వాటాతో, అతిపెద్ద ఇండియన్ బ్యాంక్ స్టేట్ బ్యాంకు. 22,000కి పైగా శాఖలు, 58,500 ఏటిఎంలు, 66వేల బీసీ అవులెట్లతో విస్తారమైన నెట్వర్క్ ద్వారా 44 కోట్లకు పైగా వినియోగదారులకు సేవలు అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తన ఉనికిని చాటుతూ 32 దేశాలలో 233 కార్యాలయాల ద్వారా తన సేవలను విస్తరించుకుంది. 2021 మార్చి 31 నాటికి 245,652 మంది ఉద్యోగులతో ప్రపంచంలోనే అతిపెద్ద యజమానులలోఒకటిగా నిలిచింది. ఇందులో మహిళా ఉద్యోగుల ప్రాతినిధ్యం దాదాపు 26 శాతం. 2013, అక్టోబర్ 7న, అరుంధతి భట్టాచార్య బ్యాంకు చైర్పర్సన్గా నియమితులైన తొలి మహిళ కావడం మరో విశేషం. Today, on #StateBankDay, we celebrate the incredible journey undertaken so far. Proud to move together with our nation in its march towards progress. We are happy to serve you with the latest digital banking products and services.#TheBankerToEveryIndian #SBI #StateBankOfIndia pic.twitter.com/dERRV1lZsJ — State Bank of India (@TheOfficialSBI) July 1, 2021 We thank all our customers and stakeholders for helping us get here. Happy State Bank Day to you and us!#StateBankDay #BankDay #SBI #StateBankOfIndia #ProudSBI #TheEvolutionOfSBI #TheBankerToEveryIndian pic.twitter.com/uyS0JY6Oa2 — State Bank of India (@TheOfficialSBI) July 1, 2021 -
KCR: బంగారు తెలంగాణ వచ్చేదాకా విశ్రమించను
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలు తన మీద ఉంచిన విశ్వాసం, అభిమానమే కొండంత ధైర్యమని.. ప్రజలిచ్చిన భరోసాతో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేంత వరకు తాను విశ్రమించేది లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. సమైక్యరాష్ట్రంలో విస్మరించిన రంగాలను ఒక్కొక్కటిగా ఓపిక, దార్శనికతతో అవాంతరాలు ఎదురైనా సరిదిద్దుకుంటూ వస్తున్నామన్నారు.తెలంగాణ రాష్ట్ర ఎనిమిదో అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. "అనేక పోరాటాలు, త్యాగాలు, బలిదానాలతో పార్లమెంటరీ ప్రజాస్వామిక పద్ధతిలో పోరాడి సాధించుకున్న తెలంగాణను దేశం గర్వించే రీతిలో నిలబెట్టుకున్నం. ఏడేండ్లలోనే దృఢమైన పునాదులతో సుస్థిరత చేకూరడం సంతోషంగా ఉంది. ఉద్యమ నినాదాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సాగు, తాగునీరు, విద్యుత్, విద్య, వైద్యం రోడ్లు తదితర మౌలిక వసతులను స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాలతో చేస్తున్నం. దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పాటైనా అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాం. తెలంగాణలో 90శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు చెందినవారే ఉండటంతో వారి కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నం. ప్రజల ఆకాంక్షలకు కార్యరూపమిచ్చి, అభివృద్ధి ద్వారా అమరుల త్యాగాలకు నివాళి అర్పించాలనే స్ఫూర్తి ఉంది. వృద్ధులు, వికలాంగులు, మహిళలు, కళాకారులు, ఇతర కులవృత్తులతో పాటు ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా నిలబడింది. తెలంగాణ రైతాంగాన్ని కాపాడి సాగుకు పునరుజ్జీవం కల్పించి.. దేశానికే రాష్ట్రాన్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దాం. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో వ్యవసాయాన్ని స్థిరీకరించి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేశాం." -
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: పవిత్ర రంజాన్ పర్వ దినం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు సీఎం కె.చంద్రశేఖర్రావు శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షలతో రంజాన్ మాసం శాంతి, ప్రేమ, దయ, సౌభ్రాతృత్వ గుణాలను పెంపొందిస్తుందని.. తెలంగాణలో గంగా, జమునా తహజీబ్కు రంజాన్ పర్వదినం ప్రతీక అన్నారు. మైనారిటీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు ముస్లింల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని, గుణాత్మక ఫలితాలనిస్తున్నాయని సీఎం పేర్కొన్నారు. ప్రేమ, శాంతి గుణాలకు స్ఫూర్తి రంజాన్: గవర్నర్ సాక్షి, హైదరాబాద్: రంజాన్ పర్వదినం సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముస్లిం సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం దయ, దాతృత్వం, సోదరభావం, ప్రేమ, శాంతి గుణాలకు స్ఫూర్తి కలిగిస్తుందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాల్లో ఆరోగ్యం, సౌభాగ్యం, శాంతి రావాలని ఈ శుభసందర్భంగా ఆమె ఆకాంక్షించారు. -
ఈద్ ముబారక్: అనుపమ పరమేశ్వరన్ స్టన్నింగ్ ఫోటోలు
సాక్షి, హైదరాబాద్: పవిత్ర రంజాన్ సందర్భంగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు. ఏ పండుగ వచ్చినా తనదైన శైలిలో సాంప్రదాయ వస్త్రధారణలో ఆకట్టుకునే ముద్దుగుమ్మ సమయానికి తగినట్టుగా ఇపుడు ముస్లిం సాంప్రదాయంలోకి మారిపోయారు. ముస్లిం యువతిలా ఈద్ ముబారక్ తెలుపుతూ ఆకర్షణీయ లుక్లో అలరించారు. అనుపమ తన స్టన్నింగ్ ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. దీనిపై ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) -
తల్లి ప్రేమకు సమానమైనది ఏదీ లేదు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తల్లి ప్రేమకు సమానమైనది ఏదీ లేదని ఆయన ట్వీట్ చేశారు. ‘‘అమ్మ ఇచ్చే ప్రోత్సాహం, ధైర్యం, స్ఫూర్తి వెలకట్టలేనిది. ప్రేమ, త్యాగం మూర్తీభవించిన మాతృమూర్తులందరికీ వందనాలు’’ అని సీఎం జగన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. చదవండి: Mother's Day: అమ్మ కూడా మనిషే డాక్టరమ్మలు మదర్స్ డే సెల్యూట్ -
కార్మికులకు సీఎం జగన్ మేడే శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కార్మికులందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘తమ శ్రమతో సమాజాన్ని నిర్మించి, ప్రపంచ పురోగతికి బాటలు వేసే శ్రామిక సోదర సోదరీమణులకు మేడే శుభాకాంక్షలు’’ అంటూ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. చదవండి: విద్యార్థుల మంచి కోసమే పరీక్షల నిర్వహణ: సీఎం జగన్ ఏపీ: జర్నలిస్టుల వైద్య సేవలకు నోడల్ ఆఫీసర్లు -
ప్రజలందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు: సీఎం జగన్
అమరావతి: శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలందరికి నవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. సీతారాముల కళ్యాణాన్ని ప్రజలు వేడుకగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. సీతారాముల, దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిలషించారు. కరోనా విపత్తును ఎదుర్కొనే శక్తి ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని వైఎస్ జగన్ అన్నారు. -
ప్రధాని మోదీ ఉగాది శుభాకాంక్షలు, తెలుగులో ట్వీట్
సాక్షి, ఢిల్లీ: ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం అద్భుతంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రధాని.. తెలుగులో ట్వీట్ చేశారు. మీరందరూ ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నానని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అద్భుతంగా ఉండాలని ఆశిస్తున్నాను. మీరందరూ ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాను. — Narendra Modi (@narendramodi) April 13, 2021 ఆనందాల హరివిల్లు ఉగాది: గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అమరావతి: శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది పండుగ అన్ని వర్గాలకూ శాంతి, సామరస్యం, ఆనందాన్ని తీసుకురావాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. ఆయన సోమవారం ఓ ప్రకటనలో రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు లోగిళ్లలో ఆనందాల హరివిల్లు అయిన ఉగాది పండుగ ప్రతి ఇంటా శుభం కలుగజేయాలని ఆకాంక్షించారు. ప్రజలంతా కరోనా నిబంధనలను పాటిస్తూ ఉగాది పండుగ జరుపుకోవాలని ఆయన సూచించారు. చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్కి ఉగాది కానుక వచ్చేసింది ఉగాది పండుగను ఇలా జరుపుకోవాలి!