
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ పుట్టినరోజు నేడు(అక్టోబరు 4)

ఈ వికెట్ కీపర్ బ్యాటర్ శుక్రవారం 27వ వసంతంలోకి అడుగుపెట్టాడు

ఈ సందర్భంగా రిషభ్ పంత్ సోదరి సాక్షి పంత్ అందమైన ఫొటోలతో తమ్ముడికి బర్త్డే విషెస్ తెలిపింది.

‘‘నా చిట్టి తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నాకంటే చిన్నవాడే అయినా.. నాకో రక్షణ కవచంలా ఉంటాడు. నీ నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.

ఐ లవ్ యూ సో మచ్. స్వేచ్ఛా విహంగంలా విహరించడానికి నాకు బలమైన రెక్కలను ఇచ్చింది నువ్వే. అందుకు ధన్యవాదాలు. హ్యాపీ బర్త్డే భయ్యూ’’ అని సాక్షి తన తమ్ముడు రిషభ్ మీద ప్రేమను కురిపించింది.

కాగా 2022లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన రిషభ్ పంత్ అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు

సుదీర్ఘ విరామం తర్వాత పూర్తి స్థాయిలో కోలుకున్న ఈ ఉత్తరాఖండ్ క్రికెటర్ ఐపీఎల్-2024 ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు

టీ20 ప్రపంచకప్-2024 సందర్భంగా టీమిండియాలో పునరాగమనం చేసిన పంత్.. ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్తో టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చాడు

సెంచరీతో చెలరేగి తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు


