breaking news
Rishabh Pant
-
August 18.. క్రికెట్ దిగ్గజాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన రోజు
ఆగస్ట్ 18.. భారత్ క్రికెట్కు సంబంధించి ఈ రోజుకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ రోజు భారత్ క్రికెట్ దిగ్గజాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. 17 ఏళ్ల కిందట (2008) ఈ రోజున విరాట్ కోహ్లి అనే ఢిల్లీ కుర్రాడు జెంటిల్మెన్ గేమ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. డంబుల్లా వేదికగా శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్తో క్రికెట్ అభిమానులకు పరిచయమయ్యాడు. అనంతరం 2010 జూన్ 12న జింబాబ్వేపై టీ20 అరంగేట్రం.. మరుసటి ఏడాది (2011) జూన్ 20న వెస్టిండీస్పై టెస్ట్ అరంగేట్రం చేశాడు.కెరీర్ ఆరంభంలో కాస్త ఇబ్బంది పడ్డా, ఆతర్వాత విరాట్ ఏం చేశాడో ప్రపంచం మొత్తం చూసింది. ఇంకా చూస్తూనే ఉంది. విరాట్ సెంచరీల మీద సెంచరీలు కొడుతూ, పరుగుల వరద పారిస్తూ ఎన్నో ఆల్టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. మరెన్నో కొత్త రికార్డులను సృష్టించాడు. గతేడాది టీ20 ఫార్మాట్కు.. ఈ ఏడాది టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్, వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు.ఆగస్ట్ 18.. ఈ రోజు భారత్ మరో స్టార్ బ్యాటర్ను ప్రపంచ క్రికెట్కు పరిచయం చేసింది. 2018లో ఈ రోజున చిచ్చరపిడుగు రిషబ్ పంత్ టీమిండియా తరఫున టెస్ట్ అరంగేట్రం చేశాడు. గడిచిన ఏడేళ్లలో పంత్ టెస్ట్ల్లో ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్లు ఆడి భారత్కు అపురూప విజయాలు అందించాడు. తాజాగా ఇంగ్లండ్ పర్యటనలోనూ ఇదే జరిగింది. అయితే ఈ పర్యటనలో పంత్ చివరి టెస్ట్కు ముందు గాయపడి సిరీస్ నుంచి వైదొలిగాడు.టెస్ట్ అరంగేట్రానికి ముందే పంత్ టీ20 ఫార్మాట్ ద్వారా భారత క్రికెట్కు పరిచయమయ్యాడు. 2017 ఫిబ్రవరి 1న పంత్ ఇంగ్లండ్తో టీ20తో పొట్టి ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. టెస్ట్ అరంగేట్రం తర్వాత అదే ఏడాది అక్టోబర్ 21న పంత్ వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. మూడు ఫార్మాట్లలో స్థిరపడిన పంత్ మధ్యలో కారు ప్రమాదం కారణంగా కొద్ది కాలం ఆటకు దూరమైనా, ఆతర్వాత తిరిగి జట్టులోకి వచ్చి అద్భుతాలు చేస్తున్నాడు.ఆగస్ట్ 18 భారత్ క్రికెట్కు మరో చిచ్చరపిడుగును పరిచయం చేసింది. 2023లో ఈ రోజున విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్ మెరుపుల తర్వాత భారత టీ20 జట్టులో చోటు దక్కించుకున్న రింకూ.. ఐర్లాండ్తో మ్యాచ్ ద్వారా టీ20 అరంగేట్రం చేశాడు. అదే ఏడాది డిసెంబర్ 19 రింకూ వన్డేల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. అయితే వన్డేల్లో రింకూ కేవలం 2 మ్యాచ్లకు మాత్రమే పరిమితయ్యాడు. తన ఆటతీరు సుదీర్ఘ ఫార్మాట్కు సరిపోదు కాబట్టి, రింకూ టెస్ట్ అరంగేట్రం చేయలేదు. ఐపీఎల్లో కేకేఆర్కు ఆడుతూ యశ్ దయాల్ బౌలింగ్లో వరుసగా 5 సిక్సర్లు బాదడంతో రింకూ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఆ మ్యాచ్లో రింకూ తన జట్టుకు సంచలన విజయాన్ని అందించడంతో పాటు ప్రపంచం మొత్తాన్ని ఆకర్శించాడు. -
IND vs ENG: 500కు పైగా పరుగులు చేశాడు.. సంకుచిత బుద్ధి!
ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మరోసారి విమర్శల పాలైంది. ‘‘ఇంత సంకుచిత బుద్ధి ఎందుకు?. అసలు మిమ్మల్ని ఎవరు ఆ పోస్టు పెట్టమన్నారు’’ అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. విషయం ఏమిటంటే.. టీమిండియా ఇటీవల ఇంగ్లండ్ (IND vs ENG)తో ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ ఆడిన విషయం తెలిసిందే.ఇంగ్లండ్ గడ్డ మీద జరిగిన ఈ ఐదు టెస్టుల సిరీస్ను భారత జట్టు 2-2తో సమం చేసింది. టీమిండియా టెస్టు కెప్టెన్గా తొలి ప్రయత్నంలోనే బ్యాటర్గా చిరస్మరణీయ రికార్డులు సాధించిన శుబ్మన్ గిల్ (Shubman Gill).. సారథిగానూ మంచి మార్కులే కొట్టేశాడు. మరోవైపు.. వైస్ కెప్టెన్ రిషభ్ పంత్, యశస్వి జైస్వాల్లతో పాటు పేసర్లు మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ కూడా అదరగొట్టారు.నిలకడగా రాణించిన ఏకైక ఆటగాడుఅయితే, ఈ సిరీస్ ఆసాంతం నిలకడగా రాణించిన ఆటగాడు ఎవరైనా ఉన్నారా అంటే.. అది ఓపెనింగ్ బ్యాటర్ కేఎల్ రాహుల్. ఐదు టెస్టుల్లో కలిపి 53.20 సగటుతో ఈ కర్ణాటక ఆటగాడు 532 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు, రెండు అర్ధ శతకాలు ఉన్నాయి.హెడింగ్లీలో తొలి టెస్టులో 137 పరుగులు సాధించిన కేఎల్ రాహుల్.. లార్డ్స్లో 100 పరుగులు చేశాడు. ఇక ఎడ్జ్బాస్టన్లో 55, ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో 90 పరుగులు సాధించాడు. ఓవరాల్గా ఈ సిరీస్లో శుబ్మన్ గిల్ (754), జో రూట్ (537) తర్వాత మూడో టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు.రాహుల్ ఫొటో లేకుండానే..అసలు విషయానికి వస్తే.. లక్నో సూపర్ జెయింట్స్ తమ సోషల్ మీడియా ఖాతాలో శుక్రవారం ఓ పోస్టు పెట్టింది. ‘‘యుగాల పాటు నిలిచిపోయే ఫొటో ఆల్బమ్’’ అంటూ టీమిండియా ఆటగాళ్లతో కూడిన ఫొటోలను షేర్ చేసింది. అయితే, ఇందులో ఎక్కడా కేఎల్ రాహుల్ లేడు.ఒక్కటీ దొరకలేదా?ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, కర్ణాటకకు చెందిన దొడ్డ గణేశ్ లక్నో యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘ఇలా చేయడం అస్సలు బాలేదు. చాలా ఇబ్బందికరంగా అనిపిస్తోంది.ఓపెనర్గా వచ్చి కొత్త బంతిని ఎదుర్కొని 500కు పైగా పరుగులు చేసిన ఆటగాడి ఫొటో మాత్రం మీకు దొరకలేదా?’’ అంటూ దొడ్డ గణేశ్ ప్రశ్నించాడు. నెటిజన్లు ఇందుకు స్పందిస్తూ.. ‘‘అంతే సార్.. వాళ్లకు గొప్పగా ఆడినవాళ్లు కనబడరు. అయినా లక్నోకు ఇలా చేయడం అలవాటే. వాళ్ల ఓనర్ సంజయ్ గోయెంకానే వారికి ఆదర్శం’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.గతేడాది లక్నోను వీడిన రాహుల్కాగా ఐపీఎల్-2022 సందర్భంగా క్యాష్ రిచ్ లీగ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఎల్ఎస్జీకి కేఎల్ రాహుల్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. మూడేళ్లపాటు అదే జట్టుతో కొనసాగిన అతడు రెండుసార్లు జట్టును ప్లే ఆఫ్స్నకు చేర్చాడు. అయితే, గతేడాది లక్నో పేలవ ప్రదర్శన నేపథ్యంలో సంజీవ్ గోయెంకా అందరిముందే కేఎల్ రాహుల్ను తిట్టడం విమర్శలకు దారితీసింది. అనంతరం రాహుల్ జట్టును వీడి.. ఢిల్లీ క్యాపిటల్స్లో చేరాడు.అయితే, టీమిండియా తరఫున అతడు గొప్పగా చాటినా లక్నో తమ సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేసే ఫొటోల్లో అతడిపై వివక్ష చూపించడం.. వారి సంకుచిత బుద్ధికి నిదర్శనం అని కేఎల్ రాహుల్ అభిమానులు మండిపడుతున్నారు.చదవండి: చెవికి అతికించి.. ఛీ!.. ఇలా చేశావేంటి?.. హ్యారీ బ్రూక్ చర్య వైరల్This is getting embarrassing. Couldn’t get a picture of an opener who played the new ball and scored 500+ runs 🤷♂️ https://t.co/fGhFFuOWi3— Dodda Ganesh | ದೊಡ್ಡ ಗಣೇಶ್ (@doddaganesha) August 8, 2025 -
IND vs WI: టీమిండియాకు భారీ షాక్!
ఇంగ్లండ్తో ఆఖరి టెస్టులో సత్తా చాటి.. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- tendulkar Trophy) సిరీస్ను సమం చేసింది టీమిండియా. రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు లేకుండానే విదేశీ గడ్డ మీద సత్తా చాటింది. యువ నాయకుడు శుబ్మన్ గిల్ సారథ్యంలో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 2-2తో డ్రా చేసుకున్న భారత్ తదుపరి ఆసియా కప్-2025 ఆడనుంది.శుభవార్త.. ఓ చేదు వార్త కూడా..ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఈ టోర్నమెంట్కు ఆగష్టు చివరి వారంలో బీసీసీఐ (BCCI) జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఈ ఈవెంట్ తర్వాత సొంతగడ్డపై వెస్టిండీస్తో టెస్టులు ఆడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు ఒకే సమయంలో శుభవార్త.. ఓ చేదు వార్త అందాయి.ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా గాయపడిన వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్కు సర్జరీ అవసరం లేదని వైద్యులు చెప్పినట్లు సమాచారం. అయితే, పూర్తిగా కోలుకోవడానికి ఆరు వారాల పాటు విశ్రాంతి మాత్రం అవసరం అని చెప్పినట్లు తెలుస్తోంది.విండీస్తో రెండు టెస్టులుఈ నేపథ్యంలో రిషభ్ పంత్ ఆసియా కప్-2025తో పాటు వెస్టిండీస్తో టెస్టు సిరీస్కు కూడా దూరం కానున్నాడు. కాగా యూఏఈ వేదికగా ఆసియా కప్ టోర్నీ సెప్టెంబరు 8- 28 వరకు జరుగనుండగా.. స్వదేశంలో విండీస్తో అక్టోబరు 2- 14 వరకు టీమిండియా రెండు టెస్టులు ఆడనుంది. అహ్మదాబాద్, ఢిల్లీ ఇందుకు వేదికలుకాగా ఇటీవల ఇంగ్లండ్తో ముగిసిన ఐదు టెస్టుల సిరీస్లో రిషభ్ పంత్ అదరగొట్టాడు. లీడ్స్లో జరిగిన తొలి మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లోనూ శతకాలు బాదిన ఈ లెఫ్టాండర్.. ఓవరాల్గా 479 పరుగులు సాధించాడు.గాయంతోనే..అయితే, మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ సందర్భంగా క్రిస్ వోక్స్ బౌలింగ్లో రివర్స్ స్కూప్షాట్కు యత్నించిన పంత్.. విఫలమయ్యాడు. ఈ క్రమంలో బంతి కుడికాలికి తగలగా పాదం ఉబ్బింది. అనంతరం బొటనవేలు ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. అయినా సరే.. పంత్ మళ్లీ బ్యాటింగ్కు వచ్చి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని అవుటయ్యాడు. ఈ మ్యాచ్ను టీమిండియా డ్రా చేసుకోవడంలో తన వంతు పాత్ర పోషించాడు.చదవండి: ప్రతోడు సచిన్, కోహ్లి అవుతారా?.. వాళ్ల ఫోన్లు కూడా ఎత్తను: టీమిండియా పేసర్ -
సెల్యూట్ చేసిన రిషభ్ పంత్.. సారీ చెప్పిన ఇంగ్లండ్ ప్లేయర్
భారత్- ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ (IND vs ENG) సందర్భంగా ఇద్దరు ఆటగాళ్లు దేశం కోసం ఆడటం పట్ల తమ నిబద్ధతను మరోసారి నిరూపించుకున్నారు. గాయం తాలుకు బాధ వెంటాడుతున్నా జట్టు ప్రయోజనాల కోసం మైదానంలో దిగి.. అభిమానుల హృదయాలు గెలుచుకున్నారు.వారిద్దరు ఎవరో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. అవును.. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant).. ఇంగ్లండ్ పేస్ బౌలర్ క్రిస్ వోక్స్ (Chris Woakes). మాంచెస్టర్లో జరిగిన నాలుగో టెస్టు సందర్భంగా వోక్స్ బౌలింగ్లోనే పంత్ గాయపడ్డాడు. వోక్స్ వేసిన బంతి పంత్ కుడికాలి పాదానికి బలంగా తాకడంతో ఉబ్బిపోయింది.బొటనవేలు ఫ్రాక్చర్ దీంతో నొప్పితో విలవిల్లాడుతూ మైదానం వీడిన పంత్ స్కానింగ్కు వెళ్లగా.. బొటనవేలు ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. అయితే, సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్ మళ్లీ బరిలో దిగాల్సిన పరిస్థితి. జట్టు ప్రయోజనాలు, దేశం కోసం ఆడటమే పరమావధిగా భావించే పంత్.. కట్టుతోనే బ్యాట్తో బరిలోకి దిగి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.అనంతరం రెండో ఇన్నింగ్స్లో పంత్ ఆడాల్సిన అవసరం రాకపోగా.. ఈ టెస్టు డ్రా అయింది. ఇక ఐదో టెస్టుకు పంత్ దూరమయ్యాడు. ఇదిలా ఉంటే.. ఆఖరిదైన ఐదో టెస్టులో విజయం ఇరుజట్ల మధ్య ఆఖరి రోజు వరకు దోబూచులాడింది. ఐదో రోజు ఇంగ్లండ్ విజయానికి 35 పరుగులు.. టీమిండియా నాలుగు వికెట్ల దూరంలో ఉన్న వేళ భారత పేసర్లు విజృంభించారు.అతడూ జట్టే ముఖ్యం అనుకున్నాడుఈ క్రమంలో తొమ్మిదో వికెట్ పడగానే క్రిస్ వోక్స్ బ్యాట్ పట్టుకుని మైదానంలోకి రావాల్సి వచ్చింది. అంతకుముందే ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కిందపడ్డగా.. అతడి భుజం విరిగింది. అయినప్పటికీ పంత్ మాదిరే అతడూ జట్టే తనకు ముఖ్యం అనుకున్నాడు.అయితే, వోక్స్కు ఇబ్బంది కలుగకుండా మరో ఎండ్లో ఉన్న గస్ అట్కిన్సన్ స్ట్రైక్రొటేట్ చేస్తూ తానే క్రీజులో ఉండేలా చూసుకున్నాడు. అయితే, మహ్మద్ సిరాజ్ అద్భుత బంతితో అట్కిన్సన్ను బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ కథ ముగిసిపోయింది. విజయానికి ఆరు పరుగుల దూరంలో ఆతిథ్య జట్టు నిలిచిపోగా.. టీమిండియా జయభేరి మోగించి సిరీస్ను 2-2తో సమం చేసింది.సెల్యూట్ చేసిన రిషభ్ పంత్.. సారీ చెప్పిన ఇంగ్లండ్ ప్లేయర్ఈ నేపథ్యంలో రిషభ్ పంత్తో జరిగిన సంభాషణ గురించి క్రిస్ వోక్స్ తాజాగా వెల్లడించాడు. ‘‘నా ఫొటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ రిషభ్ సెల్యూట్ ఎమోజీతో అభినందించాడు. అందుకు నేను అతడికి కృతజ్ఞతలు చెప్పాను.నాపై ప్రేమ చూపినందుకు థాంక్యూ.. నీ పాదం నొప్పి ఎలా ఉంది అని అడిగాను. అప్పుడు నాకు రిషభ్ వాయిస్ నోట్ పంపించాడు. ‘మరేం పర్లేదు. త్వరగానే కోలుకుంటానని అనుకుంటున్నాను. తొందర్లోనే మనం మళ్లీ తిరిగి కలవాలని కోరుకుంటున్నా’ అన్నాడు.అయితే, తన పాదం విరగడానికి పరోక్ష కారణం నేనే కాబట్టి.. రిషభ్కు సారీ చెప్పకుండా ఉండలేకపోయాను’’ అని క్రిస్ వోక్స్ మైదానంలో ప్రత్యర్థులుగా ఉన్నా.. ఆటగాళ్లుగా తమ మధ్య ఉండే అనుబంధం గురించి తెలిపాడు.ఇక మ్యాచ్ ముగియగానే టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ కూడా క్రిస్ వోక్స్ను ప్రత్యేకంగా అభినందించాడు. ఈ విషయం గురించి వోక్స్ ది గార్డియన్తో మాట్లాడుతూ.. ‘‘నువ్వు నిజంగా సాహసమే చేశావు’ అని గిల్ నాతో అన్నాడు.అందుకు బదులిస్తూ.. ‘మీరు అసాధారణ రీతిలో సిరీస్ పూర్తి చేసుకున్నారు. అద్భుతంగా ఆడారు. ఇందుకు మీ జట్టుకు క్రెడిట్ ఇవ్వాల్సిందే’ అని నేను అన్నాను’’ అని తెలిపాడు. చదవండి: ప్రతోడు సచిన్, కోహ్లి అవుతారా?.. వాళ్ల ఫోన్లు కూడా ఎత్తను: టీమిండియా పేసర్ -
Rishabh Pant: ఆటలో ధీరుడు.. గుణంలో కర్ణుడు
టీమిండియా స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో, మానవత్వం ప్రదర్శించడంలోనూ అంతే దూకుడుగా ఉంటాడు. ఇటీవల ఇంగ్లండ్ గడ్డపై పాదం ఫ్రాక్చర్ అయినా బరిలోకి దిగి యావత్ క్రికెట్ ప్రపంచంచే జేజేలు పలికించుకున్న పంత్.. తాజాగా ఓ చర్య ద్వారా గొప్ప మానవతావాది అని నిరూపించుకున్నాడు.కర్ణాటక రాష్ట్రం బాగల్కోట్ జిల్లాలోని రబ్కవి గ్రామానికి చెందిన జ్యోతి కనబుర్ మఠ్ అనే విద్యార్థిని చదువుకు ఆర్దిక సాయం చేసి తన గొప్ప మనసును చాటుకున్నాడు. జ్యోతి 12వ తరగతిలో 85 శాతం మార్కులు సాధించింది. BCA చదవాలన్న ఆశతో ఉన్న ఆమెకు రూ. 40,000 ఫీజు కట్టలేని పరిస్థితి ఏర్పడింది. తండ్రి టీ కొట్టు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో, రిషబ్ పంత్ స్పందించి జులై 17న నేరుగా కాలేజీకి ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించాడు. “నీ కలలు నిజమవ్వాలి” అంటూ ఆమెకు భరోసా ఇచ్చాడు.పంత్ చేసిన ఈ పనికి యావత్ మానవాళి జేజేలు కొడుతుంది. ఆటలో ధీరుడు, గుణంలో కర్ణుడు అంటూ ఆకాశానికెత్తుతుంది. రియల్ హీరో అంటూ కొనియాడుతుంది. వాస్తవానికి పంత్కు ఇలాంటి దానాలు కొత్త కాదు. గతంలో చాలా సందర్భాల్లో పేదలకు ఆర్దిక సాయం చేశాడు. రిషబ్ పంత్ ఫౌండేషన్ ద్వారా తనకు వచ్చే ఆదాయంలో 10 శాతం పేదలకు పంచి పెడుతున్నాడు. విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాల్లో అవసరమైన వారికి తగు సాయం చేస్తుంటాడు.గతంలో ఓ సందర్భంలో పంత్ మాట్లాడుతూ.. క్రికెట్ వల్ల నాకు లభించిన ప్రతిదానికి నేను కృతజ్ఞుడిని. ఇప్పుడు సమాజానికి తిరిగి ఇవ్వాలనుకుంటున్నానని అన్నాడు.తన ఆటతీరుతో విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను మెప్పించిన పంత్.. తన మానవతా గుణంతో దేశ ప్రజల మనసులు గెలుచుకుంటున్నాడు. సమాజానికి సేవ చేయాలనే తపనతో ఉన్న పంత్ చర్యలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. కాగా, తాజాగా ముగిసిన టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీలో పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అయితే దురదృష్టవశాత్తు నాలుగో టెస్ట్ సందర్భంగా గాయపడి చివరి మ్యాచ్కు దూరమయ్యాడు. నాలుగో టెస్ట్లో పాదం ఫ్రాక్చర్ అయినా పంత్ బ్యాటింగ్కు దిగి అర్ద సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్లో పంత్ 7 ఇన్నింగ్స్ల్లో 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీల సాయంతో 479 పరుగులు చేసి, ఆరో లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఈ సిరీస్ను భారత్ 2-2తో సమం చేసుకుంది. -
జవాన్లు కూడా ఇలాగే చేస్తే మన పరిస్థితి ఏంటి?: గావస్కర్ ఫైర్
టీమిండియా పేస్దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)ను ఉద్దేశించి భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) కీలక వ్యాఖ్యలు చేశాడు. దేశం కోసం ప్రాణాలర్పించే సైనికుల్లా.. ఆటగాళ్లు జట్టు కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలన్నాడు. విపత్కర పరిస్థితుల్లో జవాన్లు దగ్గు, జ్వరం అని పక్కకు వెళ్లిపోరని.. ప్రాణాలుపణంగా పెట్టి పోరాడేందుకే సిద్ధపడతారని పేర్కొన్నాడు.అలాగే క్రికెటర్లు కూడా ‘పనిభారం’ అనే సాకును పక్కనపెట్టి అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని గావస్కర్ విజ్ఞప్తి చేశాడు. కాగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఇంగ్లండ్ (IND vs ENG Tests)లో పర్యటించిన విషయం తెలిసిందే. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ పేరిట నిర్వహించిన ఈ సిరీస్ను టీమిండియా 2-2తో సమం చేసింది.మూడే టెస్టులు ఆడిన బుమ్రాఇక ఈ సిరీస్ ఆరంభానికి ముందే పనిభారం తగ్గించే క్రమంలో బుమ్రాను కేవలం మూడు టెస్టుల్లోనే ఆడిస్తామని టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ కూడా స్పష్టం చేశాడు. అందుకు తగ్గట్లుగా లీడ్స్, లార్డ్స్, మాంచెస్టర్ టెస్టులు ఆడిన తర్వాత బుమ్రాను జట్టు నుంచి బోర్డు రిలీజ్ చేసింది. అయితే, బుమ్రా మోకాలి గాయంతో బాధపడుతున్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.వారెవ్వా అనిపించిన సిరాజ్ మియామరోవైపు బుమ్రా గైర్హాజరీలో ఆకాశమే హద్దుగా చెలరేగిన హైదరాబాదీ స్టార్ మహ్మద్ సిరాజ్.. అలుపున్నదే లేక వెయ్యి బంతులకు పైగా బౌలింగ్ వేశాడు. విశ్రాంతి ఎరుగని పోరాట యోధుడిలా 185 ఓవర్లకు పైగా బౌలింగ్ చేసి.. ఏకంగా 23 వికెట్లు పడగొట్టి టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు.పంత్ సైతంముఖ్యంగా ఆఖరిదైన ఐదో టెస్టులో నరాలు తెగే ఉత్కంఠ రేపిన పోరులో సిరాజ్ మియా.. ఏకంగా తొమ్మిది వికెట్లు కూల్చి భారత్కు విజయం అందించాడు. ఇదిలా ఉంటే.. రిషభ్ పంత్ సైతం బొటనవేలు ఫ్రాక్చర్ అయినా మాంచెస్టర్ టెస్టులో బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ సాధించాడు.జవాన్లు కూడా ఇలాగే చేస్తే మన పరిస్థితి ఏంటి?ఈ నేపథ్యంలో సిరాజ్, పంత్ల పేర్లు ప్రస్తావిస్తూ సునిల్ గావస్కర్.. పనిభారం పేరిట తప్పుకొనే ఆటగాళ్ల తీరును విమర్శించాడు. ‘‘సరిహద్దులో దేశం కోసం రక్షణగా నిలబడే సైనికుల్లాగే.. దేశానికి ప్రాతినిథ్యం వహించే ఆటగాళ్లు కూడా ఎల్లప్పుడూ తమ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలి.జవాన్లు కూడా మాకు జలుబు చేసింది.. దగ్గు, జ్వరం అని చెప్పి తప్పుకొంటే మన పరిస్థితి ఏంటి? వాళ్లు దేశం కోసం ప్రాణాలే అర్పిస్తారు. ఆటగాళ్లు తమ ప్రాణం పణంగా పెట్టక్కర్లేదు గానీ.. అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలి. ఆ నొప్పి, ఈ బాధా అంటూ పక్కకు తప్పుకోకూడదు.వారిద్దరిని చూసి నేర్చుకోండిరిషభ్ పంత్ ఏం చేశాడో చూశారు కదా?!.. ఫ్రాక్చర్ అయినా జట్టు కోసం బ్యాట్తో బరిలోకి దిగాడు. మిగతా ఆటగాళ్ల నుంచి కూడా ఇలాంటి అంకితభావమే కావాలి. చిన్న చిన్న గాయాలను లెక్కచేయవద్దు.దేశం కోసం ఆడుతుంటే కోట్ల మంది ప్రజలు మిమ్మల్ని గొప్పగా చూస్తారు. ఇండియాకు ప్రాతినిథ్యం వహించడం ఆటగాళ్లుగా మనకు దక్కిన గొప్ప అదృష్టం. దీనిని తేలిక చేయకూడదు.ఐదు టెస్టుల్లోనూ మహ్మద్ సిరాజ్ అలుపున్నదే లేక తన అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. దేశం కోసం ఆడటంలో ఉన్న సంతోషాన్ని మనకు చూపించాడు’’ అని గావస్కర్ ప్రశంసలు కురిపించాడు. వర్క్లోడ్ పేరిట ఆటగాళ్లకు విశ్రాంతిస్తూ పోతే.. బెస్ట్ ప్లేయర్ను బరిలోకి దించలేమంటూ టీమిండియా మేనేజ్మెంట్ను విమర్శించాడు.చదవండి: నేనే గనుక ఆ క్యాచ్ పట్టి ఉంటేనా: సిరాజ్ ఎమోషనల్.. గిల్ రియాక్షన్ వైరల్ -
ఓడినా సంతృప్తిగానే ఉన్నాం.. గొడవలు సహజమే.. అయితే..: స్టోక్స్
ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన భారత్- ఇంగ్లండ్ టెస్టు సిరీస్ (IND vs ENG Tests) అంతే రసవత్తరంగా ముగిసింది. చారిత్రక ఓవల్ మైదానంలో ఆఖరిదైన ఐదో టెస్టులో.. చివరి రోజు వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్లో భారత్ గెలుపొందింది. నువ్వా- నేనా అన్నట్లు హోరాహోరీగా సాగిన పోరులో ఆరు పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా.. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)ని 2-2తో సమం చేసింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) ఐదో టెస్టులో తమ ఓటమిపై స్పందించాడు.ఓడినా.. ఆ విషయంలో సంతృప్తిగా ఉంది‘‘ఇంతటి కీలకమైన మ్యాచ్కు గాయం వల్ల దూరం కావడం కాస్త కఠినంగానే తోచింది. విజయం కోసం ఇరు జట్లూ మరోసారి తీవ్రంగా పోరాడాల్సి వచ్చింది. ఇక్కడ గెలవలేకపోవడం నిరాశ కలిగించినా మా జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నా.సిరీస్ మొత్తం చాలా గొప్పగా సాగింది. ప్రతీ ఒక్కరూ ఎన్నో సందర్భాల్లో తమ భావోద్వేగాలు ప్రదర్శించారు. ఆరంభంలోనే ఒక బౌలర్ తప్పుకొన్నా రెండో ఇన్నింగ్స్లో మిగతా వారు ఎంతో పోరాటపటిమ కనబర్చారు.ఇలా జరిగి ఉంటే బాగుండేదనే క్షణాలు గత ఐదు రోజుల్లో ఎన్నో వచ్చాయి. ఇవన్నీ ఆటను గొప్పగా మార్చాయి. అయితే మీ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వమని మాత్రమే మా ఆటగాళ్లకు చెప్పాం. ఆ విషయంలో సంతృప్తిగా ఉంది.నాలాగే గిల్ కూడా గర్వపడతాడుకానీ సిరీస్ గెలవలేకపోయామనే నిరాశ కూడా ఉంది. క్రిస్ వోక్స్ ఆఖరి రోజు బ్యాటింగ్ చేయడానికి ముందే సిద్ధమయ్యాడు. ఒంటిచేత్తో ఎలా బ్యాటింగ్ చేయాలో సన్నద్ధమయ్యాడు.విరిగిన వేళ్లు, ఫ్రాక్చర్ అయిన పాదాలతో ఆటగాళ్లు బరిలో దిగడం.. దేశానికి ప్రాతినిథ్యం వహించడం పట్ల వారికి ఉన్న నిబద్ధత, అంకితభావాన్ని తెలియజేస్తాయి. వోక్స్ విషయంలో నేను గర్వపడుతున్నాను. నాకు తెలిసి శుబ్మన్ గిల్ కూడా ఇలాగే గర్వపడుతూ ఉంటాడు’’ అని స్టోక్స్ పేర్కొన్నాడు.ఆటలో ఇవి సహజం.. అయితే వాటినే తలచుకుని..అదే విధంగా.. ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య జరిగిన వాగ్యుద్ధాల గురించి మీడియా ప్రశ్నించగా.. ‘‘ఇండియా- ఇంగ్లండ్ సిరీస్ ఇరుజట్లకు ఎంతో కీలకమైనది. భావోద్వేగాలతో ముడిపడిన ఈ సిరీస్లో జరిగిన ఎలాంటి ఘటనలూ వ్యక్తిగతంగా ఆటగాళ్లపై ప్రభావం చూపవు.మైదానంలో జరిగిన వాటి గురించి ఆలోచిస్తూ ఎవరూ నిద్ర పాడుచేసుకోరు. ఇరుజట్ల ఆటగాళ్లు ఇలాగే ఆలోచిస్తారు. ఆటలో ఇవన్నీ భాగం’’ అని బెన్ స్టోక్స్ బదులిచ్చాడు.అపుడు పంత్.. ఇపుడు వోక్స్ఇదిలా ఉంటే.. ఐదో టెస్టులో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ భుజం విరిగింది. అయితే, ఐదో రోజు ఆటలో నిలవాలంటే అతడు బ్యాటింగ్కు దిగాల్సి రాగా.. ఒంటిచేత్తోనే ఆడేందుకు వోక్స్ మైదానంలో దిగాడు. అయితే, అతడు ఒక్క బంతి కూడా ఎదుర్కోవాల్సిన అవసరం రాలేదు. టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ గస్ అట్కిన్సన్ (17)ను బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్కు తెరపడగా.. టీమిండియా విజయం ఖరారైంది.మరోవైపు.. మాంచెస్టర్లో జరిగిన నాలుగో టెస్టులో కుడికాలి బొటనవేలు ఫ్రాక్చర్ అయినా టీమిండియా స్టార్ రిషభ్ పంత్ బ్యాటింగ్కు తిరిగి వచ్చి.. అర్ధ శతకంతో మెరిసిన విషయం తెలిసిందే. ఇక ఈ సిరీస్లో అన్ని మ్యాచ్లు ఐదు రోజులపాటు సాగి టెస్టు క్రికెట్ ప్రేమికులకు అసలైన మజా అందించాయి.చదవండి: కన్నీటిపర్యంతమైన గంభీర్.... గూస్బంప్స్ తెప్పించేశారు భయ్యా! వీడియో వైరల్All heart. All hustle. All 𝘋𝘩𝘢𝘢𝘬𝘢𝘥 💪A fightback that will go down in Indian cricket history ✨#SonySportsNetwork #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings pic.twitter.com/bvXrmN5WAL— Sony Sports Network (@SonySportsNetwk) August 4, 2025 -
దేశమే సర్వస్వం.. దేనికి వెనకాడం.. పంత్ భావోద్వేగ పోస్ట్
క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ టెస్ట్ మ్యాచ్లలో ఇది ఒకటి. ఓవల్ వేదికగా జరిగిన హోరాహోరీ సమరంలో ఇంగ్లండ్పై భారత్ 6 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ క్రికెట్ ప్రపంచం మొత్తాన్ని మునివేళ్లపై నిలబెట్టింది. ఆట చివరి రోజు భారత బౌలర్లు ధీరత్వాన్ని ప్రదర్శించి 35 పరుగుల స్వల్ప లక్ష్నాన్ని విజయవంతంగా కాపాడుకున్నారు. ఇంగ్లండ్ చేతిలో 4 వికెట్లుండగా.. సిరాజ్ 3 వికెట్లు తీసి ప్రత్యర్థి నోటి కాడి గెలుపును లాగేసుకున్నాడు. ప్రసిద్ద్ కృష్ణ తన వంతుగా ఓ వికెట్ తీశాడు.374 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఓ దశలో పటిష్టమైన స్థితిలో (301/3) ఉన్నప్పటికీ.. భారత బౌలర్లు మ్యాచ్పై ఆశలు వదులుకోకుండా వీరోచితంగా పోరాడారు. ముఖ్యంగా సిరాజ్ ఓటమిని ఒప్పుకునే ప్రసక్తే లేదన్నట్లు ముందుకు సాగాడు. ఈ గెలుపులో సిరాజ్ది ప్రధానపాత్ర. ఈ హైదరాబాదీ పేసర్ అసలుసిసలైన పోరాట యోధుడిలా పోరాడి భారత్కు చిరస్మరణీయ విజయాన్నందించాడు. రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు సహా, మ్యాచ్ మొత్తంలో తొమ్మిది వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు.కాగా, ఈ గెలుపు అనంతరం గాయపడిన టీమిండియా హీరో రిషబ్ పంత్ స్పందించాడు. ఇన్స్టా వేదికగా భావోద్వేగమైన పోస్ట్ పెట్టాడు. ఈ సిరీస్లో నాలుగో టెస్ట్ సందర్భంగా గాయపడి, ఐదో టెస్ట్కు దూరంగా ఉన్న పంత్.. టీమిండియా సాధించిన విజయాన్ని పొగడ్తలతో ముంచెత్తాడు. సహచరులను కొనియాడాడు. తన జట్టు పట్ల గర్వంగా ఉన్నానని అన్నాడు. దేశమే సర్వస్వమని తెలిపాడు. దేశానికి ప్రాతినిథ్యం వహించేప్పుడు సర్వ శక్తులు ఒడ్డి పోరాడతామని అన్నాడు. దేనికి వెనుకాడేది లేదని స్పష్టం చేశాడు.పంత్ మాటల్లో.. ఈ ఇంగ్లండ్ పర్యటన మా నుంచి చాలా అడిగింది. అంతకుమించి తిరిగి ఇచ్చింది. ఈ జట్టు పట్ల చాలా గర్వంగా ఉంది. యువ ఆటగాళ్లు పరిస్థితులకు తగ్గట్టుగా పోరాడిన తీరు అమోఘంగా ఉంది. దేశానికి ప్రాతినిథ్యం వహించడం మాకు సర్వస్వం. ఇది మాలోని ప్రతి విషయాన్ని వెలికి తీస్తుంది. దీనికి మేము గర్వపడుతున్నాము.మా అద్భుతమైన సహాయక సిబ్బందికి, సిరీస్ ఆధ్యాంతం మాకు అండగా నిలబడిన అభిమానులకు ధన్యవాదాలు. ఈ జట్టు ఆకలితో ఉంది. ఐక్యంగా ఉంది. సీనియర్ల రిటైర్మెంట్ తర్వాత భారత క్రికెట్ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తుంది.కాగా, ఈ సిరీస్లో రిషబ్ పంత్ టీమిండియాకు వైస్ కెప్టెన్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్లో అతను అరివీర భయంకరమైన ఫామ్లో ఉండగా గాయపడ్డాడు. 7 ఇన్నింగ్స్ల్లో 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీల సాయంతో 479 పరుగులు చేశాడు. నాలుగో టెస్ట్లో క్రిస్ వోక్స్ బౌలింగ్లో రివర్స్ స్వీప్ చేయబోగా పంత్ పాదం ఫ్రాక్చర్కు గురైంది. పాదం ఫ్రాక్చర్ అయినా పంత్ ఆ మ్యాచ్లో బ్యాటింగ్కు దిగి దేశానికి ఆడటమంటే తనకేంటో ప్రపంచం మొత్తానికి నిరూపించాడు. ఆ ఇన్నింగ్స్లో పంత్ కుంటుతూనే హాఫ్ సెంచరీ చేయడం విశేషం. ఓవల్ టెస్ట్లో విజయంతో భారత్ ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 2-2తో సమం చేసుకుంది. -
టీమిండియా సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు సమం
ఇంగ్లండ్తో ఐదో టెస్టు సందర్భంగా టీమిండియా (IND vs ENG 5th Test) సరికొత్త చరిత్ర లిఖించింది. ఒక టెస్టు సిరీస్లో అత్యధిక శతకాలు బాదిన జట్ల జాబితాలో చేరింది. తద్వారా ఆస్ట్రేలియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా జట్ల సరసన నిలిచి ప్రపంచ రికార్డు సమం చేసింది. అయితే, విదేశీ గడ్డ మీద ఈ ఘనత సాధించిన రెండో టీమ్గా మరో అరుదైన ఫీట్ నమోదు చేసింది.కాగా టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)లో భాగంగా ఆతిథ్య జట్టుతో ఐదు టెస్టులు ఆడుతోంది. ఇందులో ఇప్పటికే నాలుగు పూర్తి కాగా.. ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఓవల్ వేదికగా ఆఖరిదైన ఐదో టెస్టు గెలిస్తేనే టీమిండియా సిరీస్ను 2-2తో సమం చేయగలదు.జైసూ సెంచరీఇక ఈ మ్యాచ్లో శనివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) సెంచరీ సాధించాడు. 127 బంతుల్లో శతక మార్కును అందుకున్నాడు. మొత్తంగా 164 బంతులు ఎదుర్కొని 118 పరుగులు సాధించి నిష్క్రమించాడు. కాగా అతడి టెస్టు కెరీర్లో ఇది ఆరో సెంచరీ.. ఈ సిరీస్లో రెండోది.12 సెంచరీలు అదే విధంగా.. జైసూ శతకంతో ఈ సిరీస్లో టీమిండియా తరఫున ఇప్పటికి 12 సెంచరీలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మూడు జట్లకు మాత్రమే ఈ ఘనత సాధ్యంకాగా.. తాజాగా టీమిండియా కూడా చరిత్ర పుటల్లోకెక్కింది. ఇదిలా ఉంటే.. 75/2 ఓవర్నైట్ స్కోరుతో శనివారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టిన టీమిండియా.. టీ బ్రేక్ సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. ధ్రువ్ జురెల్ 25, రవీంద్ర జడేజా 26 పరుగులతో క్రీజులో ఉన్నారు. జైస్వాల్ శతకం (118), ఆకాశ్ దీప్ అర్ధ శతకం (66)తో అదరగొట్టారు. ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్-2025లో ఇప్పటి వరకు శతకాలు బాదింది వీరేయశస్వి జైస్వాల్- 2 సెంచరీలు (హెడింగ్లీ- లీడ్స్, ది ఓవల్- లండన్)శుబ్మన్ గిల్- 4 సెంచరీలు (హెడింగ్లీ- లీడ్స్, ఎడ్జ్బాస్టన్- బర్మింగ్హామ్, ఓల్డ్ ట్రఫోర్డ్- మాంచెస్టర్ )రిషభ్ పంత్- 2 సెంచరీలు (హెడింగ్లీ- లీడ్స్)కేఎల్ రాహుల్- 2 సెంచరీలు (హెడింగ్లీ- లీడ్స్, లార్డ్స్- లండన్)రవీంద్ర జడేజా- 1 సెంచరీలు (ఓల్డ్ ట్రఫోర్డ్- మాంచెస్టర్)వాషింగ్టన్ సుందర్- 1 సెంచరీలు (ఓల్డ్ ట్రఫోర్డ్- మాంచెస్టర్)ఒక టెస్టు సిరీస్లో అత్యధిక సెంచరీలు సాధించిన జట్లుఆస్ట్రేలియా- 1955లో వెస్టిండీస్ వేదికగా ఆతిథ్య జట్టు మీద- ఐదు టెస్టుల్లో- 12 సెంచరీలుపాకిస్తాన్- 1982/83లో సొంతగడ్డపై టీమిండియా మీద ఆరు టెస్టుల్లో- 12 సెంచరీలుసౌతాఫ్రికా- 2003/04లో సొంతగడ్డపై వెస్టిండీస్ మీద నాలుగు టెస్టుల్లో- 12 సెంచరీలుటీమిండియా- 2025లో ఇంగ్లండ్ వేదికగా ఆతిథ్య జట్టు మీద- 12 సెంచరీలుచదవండి: IND vs ENG: నేనైతే ఆకాశ్కు ఒక్కటి ఇచ్చేవాడిని: రిక్కీ పాంటింగ్ 𝘾𝙚𝙣𝙩𝙪𝙧𝙮 𝙖𝙜𝙖𝙞𝙣𝙨𝙩 𝙖𝙡𝙡 𝙤𝙙𝙙𝙨 🥶🗣 #YashasviJaiswal completes a dramatic knock to bring up his 6th International Test century in style! 🔥#ENGvIND 👉 5th TEST, DAY 3 | LIVE NOW on JioHotstar 👉 https://t.co/3V6YCy3sHy pic.twitter.com/ezdwfz3oYi— Star Sports (@StarSportsIndia) August 2, 2025 -
గిల్పై విమర్శలు.. గంభీర్ కౌంటర్!.. పంత్ను ఎంత పొగిడినా తక్కువే!
టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill)కు హెడ్కోచ్ గౌతం గంభీర్ మద్దతుగా నిలిచాడు. గతంలో గిల్పై విమర్శలు చేసినవారిని గంభీర్ తప్పు పట్టాడు. ‘గిల్ ప్రతిభ విషయంలో ఎప్పుడూ ఎలాంటి సందేహాలు లేవు. అతడిని విమర్శిస్తున్నవారికి క్రికెట్ గురించే తెలియకపోవచ్చు. అతడి ప్రదర్శన మాకు ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు. అతడిపై కెప్టెన్సీ ఒత్తిడి కూడా లేదని తేలిపోయింది’ అని గంభీర్ వ్యాఖ్యానించాడు.కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy)లో భాగంగా మాంచెస్టర్లో ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టెస్టును భారత్ డ్రా చేసుకున్న విషయం తెలిసిందే. ఓపెనర్ కేఎల్ రాహుల్, కెప్టెన్ గిల్, ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ పోరాట పటిమ కారణంగా ఇది సాధ్యమైంది. మేము ఇంకా 1–2తో వెనుకబడే ఉన్నాంఈ నేపథ్యంలో గంభీర్ మాట్లాడుతూ.. ‘భారత బ్యాటర్లు కనబర్చిన పోరాటపటిమను కెప్టెన్ గిల్ ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు. అయితే ఈ డ్రాతో ఏదో సాధించామని భావించడం లేదని, తర్వాతి పోరులో గెలిచేందుకు ప్రయత్నిస్తామని అతను అన్నాడు.‘నేను ‘డ్రా’ కంటే మ్యాచ్లో ఫలితం రావడాన్నే ఇష్టపడతా. మేం ఇంకా 1–2తో వెనుకబడి ఉన్నామనే విషయం మర్చిపోలేదు. దీనిని 2–2గా మార్చడం అవసరం. మా ఆటగాళ్లకు తగినంత అనుభవం లేకపోయినా ప్రస్తుతం ఇది మా ఉత్తమ జట్టు. వీరంతా ఎవరో ఒకరిని అనుకరించడం కాకుండా తామే కొత్త చరిత్ర సృష్టించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు’ అని పేర్కొన్నాడు. మరో వైపు.. ఓవల్ మైదానంలో జరిగే చివరి టెస్టులో శార్దుల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్ స్థానాల్లో కుల్దీప్ యాదవ్, ఆకాశ్దీప్ వచ్చే అవకాశాలున్నాయి.పంత్పై ప్రశంసలుగాయం తాలుకు నొప్పి వేధిస్తున్నా మాంచెస్టర్ టెస్టులో బ్యాటింగ్కు దిగిన వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్పై గంభీర్ ప్రశంసలు కురిపించాడు. ‘‘అతడు సిరీస్లో మిగిలిని ఆఖరి మ్యాచ్కు దూరమయ్యాడని అందరికీ తెలుసు.అయితే, జట్టు నిర్మాణంలో పంత్ వంటి పట్టుదల కలిగిన ఆటగాళ్ల పాత్ర ఎంతో కీలకమైనది. దేశం కోసం, జట్టు కోసం రిషభ్ ఏం చేశాడో అందరమూ చూశాం కదా! అతడిని ఎంత పొగిడినా తక్కువే. వేలు విరిగినా అతడు బ్యాటింగ్ చేశాడు.పంత్లా అందరికీ ఇలాంటివి సాధ్యం కావు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవేళ నేనున్నానంటూ తను ముందుకు వచ్చాడు. టెస్టు జట్టులో పంత్ అత్యంత ముఖ్యమైన సభ్యుడు. అతడు త్వరలోనే కోలుకుని మళ్లీ మైదానంలో అడుగుపెట్టాలని కోరుకుంటున్నా’’ అని గంభీర్ పేర్కొన్నాడు.చదవండి: ఖలీల్ అహ్మద్ కీలక నిర్ణయం -
గాయంపై అప్డేట్.. ఫొటోలు షేర్ చేసిన పంత్.. పోస్ట్ వైరల్
టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) తన గాయంపై అప్డేట్ అందించాడు. ప్రస్తుతం తాను కోలుకుంటున్నానని.. తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా.. తన కాలి గాయం తాలూకు ఫొటోలు షేర్ చేసిన పంత్.. కష్టకాలంలో తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు.2022లో జరిగిన కారు ప్రమాదంలో అదృష్టవశాత్తూ.. ప్రాణాపాయం నుంచి బయటపడిన పంత్ దాదాపు ఏడాది పాటు ఆటకు దూరమయ్యాడు. గతేడాది ఐపీఎల్తో రీఎంట్రీ ఇచ్చిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. టీమిండియా తరఫున పునరాగమనంలోనూ అదరగొడుతున్నాడు.479 పరుగులుతాజాగా ఇంగ్లండ్తో టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy) టెస్టు సిరీస్లోనూ పంత్ సత్తా చాటాడు. నాలుగు టెస్టుల్లో కలిపి 479 పరుగులు సాధించాడు. లీడ్స్లో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్లోనూ శతకాలు (134, 118)బాదిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ఎడ్జ్బాస్టన్ టెస్టులో రెండో ఇన్నింగ్స్లో అర్ధ శతకం (65)తో సత్తా చాటాడు.బొటనవేలు ఫ్రాక్చర్ఇక లార్డ్స్ మైదానంలోనూ హాఫ్ సెంచరీ(74) బాదిన పంత్.. మాంచెస్టర్ టెస్టు సందర్భంగా గాయపడినప్పటికీ వీరోచిత అర్ధ శతకం (54)తో మెరిశాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్లో రివర్స్ స్వీప్ షాట్ ఆడబోయిన పంత్.. కుడికాలి బొటనవేలికి బంతి బలంగా తాకింది. దీంతో కాలు ఉబ్బిపోవడంతో పాటు.. బొటనవేలు ఫ్రాక్చర్ అయింది.ఈ క్రమంలో 37 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన పంత్.. జట్టు అవసరాల దృష్ట్యా తిరిగి బ్యాటింగ్ దిగాడు. మరో 17 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. పంత్ పోరాట పటిమ కారణంగానే తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులు చేయగలిగింది టీమిండియా.అనంతరం ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్లో 669 పరుగులు చేసి సవాలు విసరగా.. భారత్ ఐదో రోజు ఆఖరి సెషన్ వరకు అద్భుతంగా పోరాడి.. మ్యాచ్ను డ్రా చేసుకుంది. ఇక వేలి నొప్పి కారణంగా పంత్ ఐదో టెస్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో నారాయణన్ జగదీశన్కు బీసీసీఐ పిలుపునిచ్చింది.ఉత్తమమైన, గర్వకారణమైన క్షణం అదేఇదిలా ఉంటే.. తన గాయం గురించి స్పందిస్తూ.. ‘‘నేను త్వరగా కోలుకోవాలంటూ నా శ్రేయోలాభిలాషుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. నిజానికి నేను దృఢంగా ఉండటానికి మీ ప్రేమాభిమానాలే కారణం.గాయం పూర్తిగా నయమైన తర్వాత నేను రిహాబిలిటేషన్ మొదలుపెడతాను. తిరిగి మైదానంలో అడుగుపెట్టే ప్రక్రియ ప్రారంభిస్తాను. ఓపికగా ఎదురుచూస్తూ.. నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధమవుతాను.దేశం కోసం ఆడటమే నా జీవితంలోని అత్యంత ఉత్తమమైన, గర్వకారణమైన క్షణం. త్వరలోనే మళ్లీ మైదానంలో దిగాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని పంత్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు. ఈ మేరకు అతడు చేసిన ట్వీట్ వైరల్గా మారింది.కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో గిల్ సేన 1-2తో వెనుకబడి ఉంది. లండన్లోని ఓవల్ మైదానంలో చివరిదైన ఐదో టెస్టు గెలిస్తేనే టీమిండియా 2-2తో సిరీస్ సమం చేయగలుగుతుంది.చదవండి: IND vs ENG: ‘రెండు కుక్కలు తెచ్చి.. ఆ పేర్లు పెడతాడు’ 🙌#RP17 pic.twitter.com/LlAZ7lJKDm— Rishabh Pant (@RishabhPant17) July 28, 2025 -
రిషబ్ పంత్ స్ధానంలో 'వైల్డ్ కార్డ్' ఎంట్రీ.. ఎవరీ జగదీశన్?
లండన్లోని ఓవల్ వేదికగా ఇంగ్లండ్ జరగనున్న ఐదో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. నాలుగో టెస్టులో గాయపడిన స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఓవల్ టెస్టుకు దూరమయ్యాడు. మాంచెస్టర్లో టెస్టులో బంతి బలంగా తాకడంతో కుడి కాలి బొటనవేలి ఫ్రాక్చర్ అయింది. ఈ క్రమంలోనే తిరిగి స్వదేశానికి పయనమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ధ్రువీకరించింది."మాంచెస్టర్లో ఇంగ్లండ్తో జరిగిన నాల్గవ టెస్ట్ సందర్భంగా పంత్ కుడి పాదానికి ఫ్రాక్చర్ అయింది. దీంతో ఈ సిరీస్లోని ఆఖరి టెస్టుకు అతడు దూరమయ్యాడు. అతడు బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉండనున్నాడు. త్వరగా కోలుకుని తిరిగి మైదానంలో అడుగుపెట్టాలని" ఆశిస్తున్నామని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.కాగా ఇది నిజంగా భారత్కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. రిషబ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఈ సిరీస్లో 4 మ్యాచ్లు ఆడి 479 పరుగులు చేశాడు. ఇక అతడి స్ధానాన్ని వికెట్ కీపర్ బ్యాటర్ నారాయణ్ జగదీశన్తో సెలక్టర్లతో భర్తీ చేశారు.జట్టులో పంత్కు ప్రత్యామ్నాయంగా ధ్రువ్ జురెల్ ఉన్నప్పటికి, బ్యాకప్ వికెట్ కీపర్గా జగదీశన్ను తీసుకున్నారు. జగదీశన్ ఇప్పటికే లండన్కు చేరుకున్నాడు. ఈ క్రమంలో ఎవరీ జగదీశన్ అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.ఎవరీ జగదీశన్..?తమిళనాడుకు చెందిన టాలెంటడ్ వికెట్ కీపర్ బ్యాటర్ జగదీశన్.. దేశవాళీ క్రికెట్లో తనకంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో జగదీశన్కు అద్బుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు 52 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన నారాయణ్.. 47.50 సగటుతో 3,373 పరుగులు. అందులో 10 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గత రంజీ ట్రోఫీ సీజన్లో జగదీశన్ తమిళనాడు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఎనిమిది మ్యాచ్లలో 56.16 సగటుతో 674 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి. లిస్ట్-ఎ క్రికెట్, టీ20ల్లో కూడా అతడు అదరగొడుతున్నాడు. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ (277).. వరుసగా ఐదు ఇన్నింగ్స్లతో సెంచరీలు చేసిన వరల్డ్ రికార్డు అతడి పేరిట ఉన్నాయి.చదవండి: మీ వాళ్లైతే ఇలాగే చేస్తావా?.. స్టోక్స్పై మండిపడ్డ గంభీర్ -
టీమిండియాకు గుడ్ న్యూస్.. పోరాట యోధుడు బ్యాటింగ్కు రానున్నాడు?
మాంచెస్టర్ వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు తుది అంకానికి చేరుకుంది. ఈ మ్యాచ్లో ఓటమి నుంచి తప్పించుకుని, సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవడానికి టీమిండియా పోరాడుతోంది.311 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ను మొదలు పెట్టిన భారత జట్టుకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వోక్స్ వేసిన తొలి ఓవర్లో స్కోరు బోర్డుపై ‘సున్నా’ పరుగులు ఉండగానే యశస్వి జైస్వాల్(0), సాయి సుదర్శన్(0) వికెట్లను భారత్ కోల్పోయింది.ఈ సమయంలో కేఎల్ రాహుల్(210 బంతుల్లో 8 ఫోర్లతో 87 నాటౌట్), శుభ్మన్ గిల్(167 బంతుల్లో 10 ఫోర్లతో 78 నాటౌట్) ఇంగ్లండ్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. దీంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఇంగ్లండ్ స్కోర్కు భారత్ ఇంకా 137 పరుగుల వెనుకంజలో ఉంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ విజయం సాధించాలంటే 8 వికెట్లు కావాలి. మాంచెస్టర్ టెస్టును భారత్ డ్రా ము గించాలంటే ఆఖరి రోజు ఆటలో కనీసం రెండు సెషన్ల పాటు వికెట్లు కోల్పోకుండా ఆడాలి. ఈ క్రమంలో భారత జట్టుకు ఓ గుడ్న్యూస్ అందింది. కాలి పాదం ఎముక విరిగిన గాయంతో బాధపడుతున్న స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్.. ఐదో రోజు ఆటలో బ్యాటింగ్కు రానున్నాడు. ఈ విషయాన్ని టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ ధ్రువీకరించాడు. ఆఖరి రోజు ఆటలో బ్యాటింగ్ చేసేందుకు పంత్ సిద్దంగా ఉన్నాడని కోటక్ నాలుగో రోజు అనంతరం కోటక్ పేర్కొన్నాడు.ఆరు వారాల విశ్రాంతి?కాగా మొదటి రోజు ఆట సందర్భంగా పంత్కు గాయమైంది. క్రిస్ వోక్స్ బౌలింగ్లో రివర్స్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించగా బంతి.. బ్యాట్కు తగులుతూ అతడి కుడి కాలి పాదానికి తాకింది. దీంతో అతడు మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు.ఆ తర్వాత అతడికి స్కానింగ్ తరలించగా మెటాటార్సల్ ఫ్రాక్చర్(పాదంలోని ఎముక విరగడం) ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. అతడికి ఆరు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు పలు రిపోర్ట్లు పేర్కొన్నాయి.కానీ రిషబ్ మాత్రం గాయంతో బాధపడుతూనే రెండో రోజు బ్యాటింగ్కు వచ్చి హాఫ్ సెంచరీ బాదాడు. ఇప్పుడు కూడా ఆఖరి రోజు ఆట భారత్కు కీలకం కావడంతో ఈ పోరాట యోధుడు మరోసారి నొప్పిని భరిస్తూనే బ్యాటింగ్ చేయనున్నాడు.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్కు టీమిండియా సవాల్ విసురుతుందా? ఆఖరి రోజు ఎవరిది? -
టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన టీమిండియా టాప్ క్రికెటర్లు వీరే!
ఇది టీ20ల జమానా.. కో...డితే బంతి బౌండరీ దాటాల్సిందే.. పొట్టి ఫార్మాట్లో ఫోర్లు, సిక్సర్లు సులువుగానే కొట్టేయవచ్చు. కానీ టెస్టుల్లో సిక్స్ బాదడం అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. సంప్రదాయ ఫార్మాట్లో ఆచితూచి ఆడకపోతే భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది.మంచి నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు కూడా మాత్రమే సరిగ్గా షాట్ను కనెక్ట్ చేసి టెస్టుల్లో సిక్స్లు బాదగలరు. అప్పట్లో ఆడం గిల్క్రిస్ట్, వీరేందర్ సెహ్వాగ్, బ్రెండన్ మెకల్లమ్, క్రిస్ గేల్ (Chris Gayle) అలవోకగా సిక్సర్లు కొడితే.. తర్వాత రోహిత్ శర్మ (Rohit Sharma), మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) కూడా తమదైన షాట్లతో అలరించారు.కాలానికి అనుగుణంగా పిచ్లు ఫ్లాట్గా మారుతున్న వేళ ప్రస్తుతం డిఫెన్స్ షాట్లకు బదులు దూకుడుగా బౌలర్లపై విరుచుకుపడే బ్యాటర్ల సంఖ్య పెరుగుతోంది. టెస్టు క్రికెట్లో ప్రస్తుతం టీమిండియా యువ తరంగాలు రిషభ్ పంత్, యశస్వి జైస్వాల్ విధ్వంసకర షాట్లతో వీరూ, రోహిత్, ధోనిల సిక్సర్ల వారసత్వాన్ని కొనసాగిస్తుండగా.. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా వీరికి పోటీనిస్తున్నాడు.సెహ్వాగ్ రికార్డు సమం చేసిన పంత్అయితే, ఇంగ్లండ్తో నాలుగో టెస్టు సందర్భంగా సిక్సర్ల రికార్డులో పంత్ సెహ్వాగ్ను సమం చేశాడు. టెస్టుల్లో అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్గా చరిత్రకెక్కాడు. కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా భారత్- ఇంగ్లండ్ ప్రస్తుతం ఐదు టెస్టుల సిరీస్లో తలపడుతున్న విషయం తెలిసిందే. తొలి టెస్టులో ఇంగ్లండ్.. రెండో టెస్టులో భారత్ గెలిచాయి.ఇక కీలకమైన మూడో టెస్టులో ఆఖరి వరకు పోరాడినా టీమిండియాకు ఓటమే ఎదురైంది. దీంతో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ క్రమంలో మాంచెస్టర్ వేదికగా బుధవారం మొదలైన నాలుగో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులు చేసింది. గాయం వేధిస్తున్నాఅయితే, తొలి రోజు ఆటలో గాయపడిన పంత్ 37 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగి.. రెండో రోజైన గురువారం తిరిగి వచ్చి మరో 17 పరుగులు సాధించాడు. టీమిండియా మెరుగైన స్కోరు చేయడంలో పంత్ అర్ధ శతకం కూడా కీలకం.మొత్తంగా 75 బంతులు ఎదుర్కొన్న పంత్.. 54 పరుగులు సాధించాడు. ఇందులో మూడు ఫోర్లు, రెండు సిక్స్లు ఉన్నాయి. జోఫ్రా ఆర్చర్లో బాదిన సిక్సర్తో పంత్ సెహ్వాగ్ రికార్డును సమం చేయడం విశేషం. అయితే మ్యాచ్ల పరంగా చూస్తే సెహ్వాగ్ కంటే పంత్ ముందే ఈ మైలురాయిని చేరుకున్నాడు.Rishabh-Panti Max! 🔥😎They tried to hit him where it hurts... Pant responds by hitting it out of the park! Toughness has a new name @RishabhPant17 🙌🏻#ENGvIND 👉 4th TEST, DAY 2 | LIVE NOW on JioHotstar 👉 https://t.co/Y3btplYguV pic.twitter.com/6a2zPCQsr5— Star Sports (@StarSportsIndia) July 24, 2025 టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన టీమిండియా టాప్-10 క్రికెటర్లు వీరే🏏1.రిషభ్ పంత్- 47 మ్యాచ్లలో కలిపి 90 సిక్సర్లు*🏏2. వీరేందర్ సెహ్వాగ్- 103 మ్యాచ్లలో కలిపి 90 సిక్సర్లు🏏3.రోహిత్ శర్మ- 67 మ్యాచ్లలో కలిపి 88 సిక్సర్లు🏏4. మహేంద్ర సింగ్ ధోని- 90 మ్యాచ్లలో కలిపి 78 సిక్సర్లు🏏5. రవీంద్ర జడేజా- 84 మ్యాచ్లలో కలిపి 74 సిక్సర్లు🏏6. సచిన్ టెండుల్కర్- 200 మ్యాచ్లలో కలిపి 69 సిక్సర్లు🏏7. కపిల్ దేవ్- 131 మ్యాచ్లలో కలిపి 61 సిక్సర్లు🏏8. సౌరవ్ గంగూలీ- 113 మ్యాచ్లలో కలిపి 57 సిక్సర్లు🏏9. శుబ్మన్ గిల్- 36 మ్యాచ్లలో కలిపి 43 సిక్సర్లు🏏10. హర్భజన్ సింగ్- 103 మ్యాచ్లలో కలిపి 42 సిక్సర్లు.👉కాగా టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కేవలం 23 టెస్టుల్లోనే ఇప్పటికే 41 సిక్సర్లు బాదాడు. అతడు ఈ రికార్డు జాబితాలో టాప్-10లోకి చేరుకోవడానికి మరీ ఎక్కువ సమయం పట్టకపోవచ్చు.చదవండి: ఏడ్చేసిన కరుణ్ నాయర్.. ఓదార్చిన కేఎల్ రాహుల్.. ఇక గుడ్బై!? -
మరణాన్నే జయించిన వాడికి ఇదో లెక్కా?: మాజీ క్రికెటర్ ప్రశంసలు
టీమిండియా స్టార్ రిషభ్ పంత్ (Rishabh Pant)పై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసల జల్లు కురిపించాడు. గాయపడినా జట్టు ప్రయోజనాల కోసం అతడు పోరాడిన తీరు అమోఘమని కొనియాడాడు. అయినా.. మరణాన్నే జయించిన వాడు ఇలాంటి చిన్న చిన్న ఎదురుదెబ్బలకు తలవంచడంటూ ఆకాశానికెత్తాడు.చావోరేవోటెండుల్కర్- ఆండర్సర్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy)లో భాగంగా మాంచెస్టర్ వేదికగా భారత్- ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య బుధవారం నాలుగో టెస్టు మొదలైంది. చావోరేవో తేల్చుకోవాల్సిన ఈ మ్యాచ్లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్కు దిగింది. తొలిరోజు ఆటలో భాగంగా నాలుగు వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది.రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిఅయితే, మొదటి రోజు 37 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా పంత్.. క్రిస్ వోక్స్ బౌలింగ్లో రివర్స్ స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతిని అంచనా వేయడంలో పొరపడగా.. అది పంత్ కుడికాలి పాదాన్ని బలంగా తాకింది. దీంతో నొప్పితో విలవిల్లాడిన పంత్ రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. స్కానింగ్లో అతడి బొటనవేలు ఫ్యాక్చర్ అయిందనే వార్తలు వచ్చాయి.హాఫ్ సెంచరీతో మెరిసిఈ నేపథ్యంలో పంత్ మళ్లీ తిరిగి బ్యాటింగ్కు రాడనే అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా అతడు రెండో రోజు మైదానంలో దిగాడు. కుంటుకుంటూనే బ్యాటింగ్కు వచ్చిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. అర్ధ శతకం (54) బాది పెవిలియన్ చేరాడు. తన పాత స్కోరుకు మరో పదిహేడు పరుగులు జత చేసి వెనుదిరిగాడు.తద్వారా తొలి ఇన్నింగ్స్లో భారత్ 358 పరుగులు చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో పంత్ పోరాటపటిమ, ఆట పట్ల అతడి అంకితభావం గురించి కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.అనిల్ భాయ్ను గుర్తు చేశాడు‘‘రిషభ్ పంత్ పట్టుదల గురించి తప్పక మాట్లాడాలి. అతడు నాకు అనిల్ (కుంబ్లే) భాయ్ను గుర్తు చేశాడు. ఆంటిగ్వాలో తన దవడ విరిగినా బౌలింగ్ చేసేందుకు వచ్చాడు. అప్పుడు అది అవసరం లేదు. కానీ ఆయన ఆ వికెట్ తీసి మరీ సత్తా చాటాడు.ఇక ఇప్పుడు రిషభ్ పంత్.. కనీసం నడవలేకపోతున్నాడు. అయినా సరే మళ్లీ మైదానంలో దిగాడు. MRI స్కాన్, ఎక్స్-రే పూర్తయ్యాయి. అతడు ఆరు వారాల పాటు ఆటకు దూరంగా ఉండనున్నాడనే వార్తలు వచ్చాయి.మరణాన్నే జయించిన వాడికి ఇదో లెక్కా?ఈ ఒక్క మ్యాచ్ కాదు.. అతడు సిరీస్ మొత్తానికి దూరమవుతాడని అనుకున్నారంతా! కానీ అతడు తిరిగి వచ్చాడు. మరణాన్నే జయించిన వాడికి ఇదో లెక్కా?.. ఇలాంటి చిన్న చిన్న కష్టాలకు పంత్ లాంటి పోరాట యోధుడు తలవంచుతాడా?’’ అంటూ ఆకాశ్ చోప్రా పంత్ను ప్రశంసించాడు. కాగా 2022, డిసెంబర్లో పంత్ పెను ప్రమాదం నుంచి.. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. అసలు నడుస్తాడా? లేదా? అన్న సందేహాల నడుమ.. రీఎంట్రీ ఇవ్వడమే కాకుండా మునుపటి కంటే మెరుగ్గా ఆడుతూ అద్భుతాలు చేస్తున్నాడు.ఇదిలా ఉంటే.. మాంచెస్టర్ టెస్టులో భారత బ్యాటర్లు ఫరవాలేదనిపించినా.. బౌలర్లు తడబడుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం నాటి రెండో రోజు ఆట ముగిసేసరికి ఇంగ్లండ్ రెండు వికెట్ల నష్టానికి 46 ఓవర్లలో 225 పరుగులు చేసింది. భారత్ కంటే తొలి ఇన్నింగ్స్లో ఇంకా 133 పరుగులు మాత్రమే వెనుకబడి ఉండగా.. చేతిలో ఇంకా ఎనిమిది వికెట్లు ఉన్నాయి. చదవండి: సిరాజ్ను కాదని అతడికి బంతినిస్తారా? బుమ్రాకు ఏమైంది?: పాంటింగ్ ఫైర్A knock for the ages! 💪#RishabhPant returned after being retired hurt and showed the world what true grit looks like.How would you rate Rishabh Pant’s comeback knock? 👇#ENGvIND 👉 4th TEST, DAY 3 | FRI, 25th JUL, 2:30 PM | Streaming on JioHotstar! pic.twitter.com/QsDlwZkIbc— Star Sports (@StarSportsIndia) July 24, 2025 -
IND vs ENG: అప్పుడు కుంబ్లే.. ఇప్పుడు పంత్!
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత బౌలర్లు తడబడతున్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి ఇంగ్లండ్ 225 పరుగులు స్కోర్ సాధించింది. ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ(84), బెన్ డకెట్(94) దంచికొట్టారు.ప్రస్తుతం క్రీజులో జో రూట్(11), ఓలీ పోప్(20) ఉన్నారు. భారత బౌలర్లలో అన్షుల్ కాంబోజ్, రవీంద్ర జడేజా తలా వికెట్ సాధించారు. ప్రధాన బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఇప్పటివరకు ఒక్క వికెట్ సాధించలేకపోయారు. అంతకుముందు టీమిండియా తమ మొదటి ఇన్నింగ్స్లో 358 పరుగులకు ఆలౌటైంది.రిషబ్ విరోచిత పోరాటం..కాగా ఈ మ్యాచ్ తొలి రోజే స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ గాయపడటంతో భారత్కు ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. వోక్స్ సంధించిన బంతి పంత్ కుడికాలి బొటనవేలికి బలంగా తగలడంతో అతను విలవిలలాడుతూ రిటైర్ట్హర్ట్గా వెనుదిరిగాడు.తదనంతరం స్కానింగ్లో బొటనవేలికి ఫ్రాక్చర్ అయినట్లు తేలడంతో ఇక ఆడే పరిస్థితి లేనట్లేనని భావించారంతా! కానీ 2022, డిసెంబర్లో పెను ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన పంత్ నడవలేని స్థితి నుంచి... పట్టుదలతో నడవడమే కాదు ఏకంగా పిచ్పై చకచకా పరుగులు తీస్తున్న ఈ పోరాటయోధుడు రెండో రోజు బ్యాటింగ్కు దిగి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. గాయాన్ని పంటిబిగువన భరించి అసౌకర్యంగా నడుకుకుంటూ వచ్చిన రిషభ్ పంత్ క్రీజ్లో మొండిగా పోరాడి అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. దెబ్బ తగలగానే అడుగుతీసి అడుగు వేయడంలో ఇబ్బంది పడిన పంత్ రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ బౌలర్లకు ఎదురీది అర్ధసెంచరీ సాధించడం విశేషం. ఈ స్పెషలిస్ట్ బ్యాటర్ ఆడటం వల్లే భారత్ తొలి ఇన్నింగ్స్లో 350 పైచిలుకు స్కోరు చేయగలిగింది. లేదంటే భారత్ పరిస్థితి భిన్నంగా ఉండేది. మొత్తమ్మీద అతని పోరాటం దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లేను గుర్తుకుతెచ్చింది. 2002లో కరీబియన్ పర్యటనకు వెళ్లిన భారత జట్టులో అప్పటి బౌలింగ్ దళానికి తురుపుముక్కలాంటి కుంబ్లే తలకు గాయమైంది. అయినాసరే తలకు బ్యాండేజ్ కట్టుకొని వచ్చి మరీ 14 ఓవర్లు వేసిన కుంబ్లే... వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారాను అవుట్ చేశాడు.చదవండి: వచ్చే ఏడాదీ ఇంగ్లండ్కు టీమిండియా -
పంత్ వీరోచిత పోరాటం.. ముగిసిన భారత తొలి ఇన్నింగ్స్
మాంచెస్టర్ టెస్ట్లో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 358 పరుగులకు ఆలౌటైంది. 264/4 వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా.. ఓవర్నైట్ స్కోర్కు మరో 94 పరుగులు జోడించి మిగతా 6 వికెట్లు కోల్పోయింది.తొలి రోజు ఆటలో గాయపడిన వికెట్కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఇవాళ వీరోచితంగా పోరాడి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇవాళ శార్దూల్ ఠాకూర్ ఔటయ్యాక రీఎంట్రీ ఇచ్చిన పంత్.. వాషింగ్టన్ సుందర్, అన్షుల్ కంబోజ్ సాయంతో భారత ఇన్నింగ్స్ను తీర్చిదిద్దాడు. పంత్ తొమ్మిదో వికెట్గా వెనుదిరిగాక భారత ఇన్నింగ్స్ క్షణాల్లో ముగిసింది.భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, శుభ్మన్ గిల్ 12, రిషబ్ పంత్ 54, రవీంద్ర జడేజా 20, శార్దూల్ ఠాకూర్ 41, వాషింగ్టన్ సుందర్ 27, అన్షుల్ కంబోజ్ 0, జస్ప్రీత్ బుమ్రా 5, మహ్మద్ సిరాజ్ 5 (నాటౌట్) పరుగులు చేశారు.ఇవాల్టి ఆటలో ఇంగ్లండ్ బౌలర్ బెన్ స్టోక్స్ చెలరేగిపోయాడు. ఈ ఇన్నింగ్స్లో మొత్తంగా అతను 5 వికెట్లు తీశాడు. ఆర్చర్కు సత్తా చాటి 3 వికెట్లు తీశాడు. వోక్స్, డాసన్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. -
గాయాన్ని సైతం లెక్క చేయకుండా ఆడి చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్
మాంచెస్టర్ టెస్ట్లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో గాయాన్ని సైతం లెక్క చేయకుండా బరిలోకి దిగిన పంత్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో అత్యధిక పరుగులు (67 ఇన్నింగ్స్ల్లో 2719 పరుగులు) చేసిన భారత ఆటగాడిగా అవతరించాడు. ఈ రికార్డు ఇంతకుముందు రోహిత్ శర్మ (69 ఇన్నింగ్స్ల్లో 2716 పరుగులు) పేరిట ఉండేది. పంత్ తాజాగా హిట్మ్యాన్ రికార్డును బద్దలు కొట్టాడు.ఈ మ్యాచ్లో పంత్ 54 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. తొలి రోజు ఆటలో 37 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్ అయిన పంత్.. మరో 17 పరుగులు జోడించి పెవిలియన్కు చేరాడు. బొటన వేలు గాయంతో బాధపడుతూనే పంత్ ఆడిన ఈ ఇన్నింగ్స్ విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. పంత్ వీరోచిత పోరాటానికి అందరూ సలాం కొడుతున్నారు. పంత్ హాఫ్ సెంచరీకి చేరువలో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో బాదిన ఓ సిక్సర్ మ్యాచ్ మొత్తానికే హైలైట్గా నిలిచింది. ఈ సిక్సర్తో పంత్ భారత్ తరఫున టెస్ట్ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును సమం చేశాడు. ప్రస్తుతం పంత్, సెహ్వాగ్ టెస్ట్ల్లో తలో 90 సిక్సర్లతో ఉన్నారు.హాఫ్ సెంచరీ పూర్తి కాగానే పంత్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పంత్ ఔటయ్యాక భారత్ ఇన్నింగ్స్ కొద్ది క్షణాల్లోనే ముగిసింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్లో భారత్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది.భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, శుభ్మన్ గిల్ 12, రిషబ్ పంత్ 54, రవీంద్ర జడేజా 20, శార్దూల్ ఠాకూర్ 41, వాషింగ్టన్ సుందర్ 27, అన్షుల్ కంబోజ్ 0, జస్ప్రీత్ బుమ్రా 5, మహ్మద్ సిరాజ్ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ 5, ఆర్చర్ 3, వోక్స్ డాసన్ తలో వికెట్ తీశారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. -
మళ్లీ బ్యాటింగ్కు దిగిన పంత్.. లంచ్ సమయానికి టీమిండియా స్కోర్ ఎంతంటే..?
మాంచెస్టర్ టెస్ట్లో భారత్ ఓ మోస్తరు స్కోర్ దిశగా పయనిస్తుంది. రెండో రోజు లంచ్ విరామం సమయానికి టీమిండియా 6 వికెట్ల కోల్పోయి 321 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ (20), రిషబ్ పంత్ (39) క్రీజ్లో ఉన్నారు.ఓవర్నైట్ స్కోర్ 264/4 వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రవీంద్ర జడేజా తన వ్యక్తిగత స్కోర్కు మరో పరుగు మాత్రమే జోడించి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో హ్యారీ బ్రూక్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.జడేజా ఆదిలోనే ఔటైనప్పటికీ శార్దూల్ ఠాకూర్ (41).. వాషింగ్టన్ సుందర్ సాయంతో ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. లంచ్ విరామానికి కొద్ది సమయం ముందు శార్దూల్ స్టోక్స్ బౌలింగ్లో బెన్ డకెట్కు క్యాచ్ ఇచ్చి ఆరో వికెట్గా వెనుదిరిగాడు.అనంతరం పంత్ గాయంతో బాధపడుతూనే బరిలోకి దిగాడు. తొలి రోజులో ఆటలో పంత్ 37 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద గాయం బారిన పడి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. పంత్ గాయం తీవ్రమైందే అయినప్పటికీ జట్టు అవసరాల దృష్ట్యా బ్యాటింగ్కు దిగాడు. పంత్ సేవలు ఈ మ్యాచ్లో కేవలం బ్యాటింగ్కు మాత్రమే పరిమితమవుతాయని, అతను వికెట్కీపింగ్ చేయడని బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది.ఈ మ్యాచ్లో భారత్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన విషయం తెలిసిందే. భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, శుభ్మన్ గిల్ 12, రవీంద్ర జడేజా 20, శార్దూల్ ఠాకూర్ 41 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ 3, వోక్స్, ఆర్చర్, డాసన్ తలో వికెట్ తీశారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. -
ఇషాన్ కిషన్ కాదు.. పంత్కు రీప్లేస్మెంట్ అతడే..!
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్ట్లో (తొలి రోజు) టీమిండియా వికెట్కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ గాయపడిన విషయం తెలిసిందే. పంత్ గాయం తీవ్రత అధికంగా ఉన్నా జట్టు అవసరాల దృష్ట్యా రెండో రోజు బ్యాటింగ్కు దిగి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే పంత్ సేవలు కేవలం బ్యాటింగ్కు మాత్రమే పరిమితమవుతాయని, అతను వికెట్కీపింగ్ చేయడని బీసీసీఐ స్పష్టం చేసింది.జట్టు అవసరాల దృష్ట్యా పంత్ను ఈ మ్యాచ్లో బ్యాటింగ్కు వాడుకున్నా, ఐదో టెస్ట్లో మాత్రం అతను బరిలోకి దిగే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో పంత్కు ప్రత్యామ్నాయంగా ఎవరో ఒకరిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ధృవ్ జురెల్ అందుబాటులో ఉన్నా, కవర్ ప్లేయర్ ఎంపిక తప్పనిసరి అవుతుంది.నిన్నటి వరకు పంత్కు ప్రత్యామ్నాయంగా ఇషాన్ కిషన్ను ఎంపిక చేస్తారని ప్రచారం జరిగినా, తాజాగా ఓ కొత్త పేరు తెరపైకి వచ్చింది. చివరి టెస్ట్ కోసం పంత్కు రీప్లేస్మెంట్గా తమిళనాడుకు చెందిన రైట్ హ్యాండ్ వికెట్కీపర్ బ్యాటర్ నారాయణన్ జగదీశన్ పేరు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. 29 ఏళ్ల జగదీశన్ ఐపీఎల్లో సీఎస్కే, కేకేఆర్ తరఫున ఆడాడు. చివరిగా అతను 2023 సీజన్లో కేకేఆర్లో ఉన్నాడు. జగదీశన్ ఐపీఎల్లో పెద్దగా రాణించకపోయిన దేశవాలీ క్రికెట్లో అద్భుతాలు చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ (277).. లిస్ట్-ఏ క్రికెట్లో వరుసగా ఐదు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేసిన వరల్డ్ రికార్డు ఇతని ఖాతాలో ఉన్నాయి. వికెట్కీపర్గానూ జగదీశన్కు మంచి రికార్డే ఉంది. -
‘పది కుట్లు పడ్డాయి.. టీమిండియాలోకి వచ్చే ఛాన్స్ లేదు’
ఇంగ్లండ్తో నాలుగో టెస్టు సందర్భంగా గాయపడిన టీమిండియా స్టార్ రిషభ్ పంత్ (Rishabh Pant) తిరిగి బ్యాటింగ్కు దిగాడు. రెండో రోజు ఆటలో భాగంగా మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur- 41) ఆరో వికెట్గా వెనుదిరిగిన తర్వాత పంత్ క్రీజులోకి వచ్చాడు.వికెట్ కీపర్గా జురెల్ఇదిలా ఉంటే.. పంత్ బ్యాటింగ్కు వచ్చే కంటే ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇందుకు సంబంధించి గురువారం ప్రకటన విడుదల చేసింది. జట్టు కోసం అతడు ఆడతాడని.. అయితే, ధ్రువ్ జురెల్ పంత్కు బదులు వికెట్ కీపింగ్ చేస్తాడని తెలిపింది.అయితే, అంతకు ముందు.. పంత్ ఇంగ్లండ్తో ఆఖరి టెస్టుకు దూరమవుతున్నాడనే వార్త క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది. పంత్ కుడికాలి బొటన వేలు ఫ్యాక్చర్ అయినందు వల్ల అతడు ఆఖరిదైన ఐదో టెస్టుకు దూరం కానున్నాడని బీసీసీఐ వర్గాలు తెలిపినట్లు వార్తా సంస్థ పీటీఐ వెల్లడించింది.ఇషాన్ కిషన్ జట్టులోకి వస్తాడంటూ..అంతేకాదు.. పంత్ స్థానంలో ఇషాన్ కిషన్ జట్టులోకి వస్తాడని తెలిపింది. అయితే, తాజా సమాచారం ప్రకారం ఇషాన్ కూడా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి టైమ్స్ ఆఫ్ ఇండియాతో అతడి సన్నిహిత వర్గాలు మాట్లాడుతూ.. ‘‘ఇషాన్ ఇటీవల స్కూటీ మీద నుంచి కిందపడ్డాడు.పది కుట్లు పడ్డాయిఅతడి చీలమండకు గాయమైంది. పది కుట్లు పడ్డాయి. ప్రస్తుతం కుట్లు తీసినా అతడి ఎడమ చీలమండకు ప్లాస్టర్ వేసే ఉంది. సెలక్టర్లు అతడిని గురువారం అతడిని సంప్రదించిన మాట నిజమే. కానీ అతడు ఇంకా పూర్తిగా కోలుకోలేదు’’ అని వెల్లడించాయి.ఇదిలా ఉంటే.. ఒకవేళ పంత్ గనుక ఐదో టెస్టుకు దూరమైతే నారాయణన్ జగదీశన్ అతడి స్థానంలోకి వచ్చే అవకాశం ఉందని క్రిక్బజ్ పేర్కొంది. తమిళనాడుకు చెందిన 29 ఏళ్ల ఈ వికెట్ కీపర్ బ్యాటర్ను టీమిండియాలో చేర్చడం దాదాపు ఖరారైపోయిందని వెల్లడించింది.కాగా ఇంగ్లండ్- ఇండియా మధ్య ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు జరుగుతున్నాయి. ఇందులో ఇప్పటికి మూడు పూర్తి కాగా ఆతిథ్య ఇంగ్లండ్ రెండు గెలిచి 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇరుజట్ల మధ్య బుధవారం మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్టు మొదలైంది. ఈ క్రమంలో గురువారం నాటి భోజన విరామ సమయానికి టీమిండియా 105 ఓవర్లు పూర్తయ్యేసరికి.. ఆరు వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. అప్పటికి పంత్ 39, వాషింగ్టన్ సుందర్ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు.చదవండి: మరోసారి ఇంగ్లండ్లో పర్యటించనున్న టీమిండియా.. షెడ్యూల్ విడుదల -
ENG VS IND 4th Test: పంత్ బ్యాటింగ్ చేస్తాడు.. బీసీసీఐ కీలక ప్రకటన
ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్ తొలి రోజు ఆటలో గాయపడి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన రిషబ్ పంత్కు సంబంధించి బీసీసీఐ కీలక అప్డేట్ ఇచ్చింది. పంత్ ఈ మ్యాచ్లో వికెట్కీపింగ్కు దూరంగా ఉన్నా, బ్యాటింగ్ చేస్తాడని కన్ఫర్మ్ చేసింది. పంత్ స్థానంలో ధృవ్ జురెల్ వికెట్ కీపింగ్ చేస్తాడని స్పష్టం చేసింది. గాయం తీవ్రత అధికంగా ఉన్నా ఆట రెండో రోజు పంత్ జట్టుతో చేరాడని, జట్టు అవసరాల దృష్ట్యా అతను బ్యాటింగ్ చేస్తాడని బీసీసీఐ తమ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా ప్రకటన చేసింది.𝗨𝗽𝗱𝗮𝘁𝗲: Rishabh Pant, who sustained an injury to his right foot on Day 1 of the Manchester Test, will not be performing wicket-keeping duties for the remainder of the match. Dhruv Jurel will assume the role of wicket-keeper.Despite his injury, Rishabh Pant has joined the…— BCCI (@BCCI) July 24, 2025కాగా, ఈ మ్యాచ్ తొలి రొజు ఆటలో పంత్ క్రిస్ వోక్స్ బౌలింగ్లో రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నం చేసి తీవ్రంగా గాయపడ్డాడు. బంతి బ్యాట్ ఎడ్జ్కు తగిలి పంత్ కుడి కాలు పాదానికి బలంగా తాకింది. దీంతో పంత్ తీవ్రమైన నొప్పితో విలవిలలాడాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికి ఫలితం లేకపోవడంతో పంత్ రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. నడవలేని స్థితిలో ఉన్న పంత్ను వాహనంలో తీసుకెళ్లారు. పంత్ రిటైర్డ్ అయ్యే సమయానికి 37 పరుగులు చేశాడు.ఇదిలా ఉంటే, ఓవర్నైట్ స్కోర్ 264/4 వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓవర్నైట్ బ్యాటర్ రవీంద్ర జడేజా తన స్కోర్కు మరో పరుగు మాత్రమే జోడించి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో హ్యారీ బ్రూక్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.జడేజా ఆదిలోనే ఔటైనప్పటికీ శార్దూల్ ఠాకూర్ (39) ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు. వాషింగ్టన్ సుందర్ (13) శార్దూల్కు సహకరిస్తున్నాడు. కడపటి వార్తలు అందేసరికి భారత్ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో భారత్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన విషయం తెలిసిందే. భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, శుభ్మన్ గిల్ 12, రిషబ్ పంత్ 37 (రిటైర్డ్ హర్ట్), రవీంద్ర జడేజా 20 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ 2, వోక్స్, ఆర్చర్, డాసన్ తలో వికెట్ తీశారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. -
రిషభ్ పంత్ అవుట్?.. జట్టులోకి ఊహించని ప్లేయర్!
ఇంగ్లండ్తో మిగిలిన టెస్టులకు టీమిండియా స్టార్ రిషభ్ పంత్ (Rishabh Pant) దూరమైనట్లు తెలుస్తోంది. గాయం కారణంగా అతడు నాలుగో టెస్టుతో పాటు ఐదో మ్యాచ్కు కూడా దూరం కానున్నట్లు సమాచారం. దీంతో టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ-2025 (Tendulkar- Anderson Trophy)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఇంగ్లండ్తో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికి మూడు టెస్టులు పూర్తి కాగా.. ఆతిథ్య జట్టు 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్లో రిషభ్ పంత్ ఇప్పటి వరకు రెండు సెంచరీలు, రెండు అర్ధ శతకాల సాయంతో ఏకంగా 462 పరుగులు సాధించాడు.కాలికి గాయంఇక మాంచెస్టర్ వేదికగా బుధవారం మొదలైన నాలుగో టెస్టులోనూ రిషభ్ పంత్ రాణించాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. 48 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 37 పరుగులు చేశాడు.అయితే, క్రిస్ వోక్స్ బౌలింగ్లో రివర్స్ స్వీప్ షాట్ ఆడేందుకు పంత్ ప్రయత్నించగా.. అతడి కుడికాలి పాదానికి దెబ్బ తగిలింది. దీంతో నొప్పితో విలవిల్లాడిన పంత్ మధ్యలోనే రిటైర్డ్ హర్ట్గా మైదానాన్ని వీడాడు. అనంతరం అతడిని ఆస్పత్రికి తరలించారు.ఆరు వారాల విశ్రాంతితాజా సమాచారం ప్రకారం.. పంత్ కుడికాలి బొటన వేలు ఫ్యాక్చర్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతడి గాయం తీవ్రత దృష్ట్యా అతడికి ఆరు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో మాంచెస్టర్ టెస్టుతో పాటు.. లండన్లో జరిగే ఆఖరిదైన ఐదో టెస్టుకూ అతడు దూరం కానున్నాడు.జట్టులోకి ఊహించని ప్లేయర్!బీసీసీఐ సన్నిహిత వర్గాలు వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాయి. ‘‘పంత్ ఆరు వారాల పాటు ఆటకు దూరంగా ఉంటాడు. అతడి స్థానంలో కవర్ ప్లేయర్గా ఇషాన్ కిషన్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.కాగా రిషభ్ పంత్తో పాటు మరో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ ప్రస్తుతం జట్టులో ఉన్నాడు. ఇటీవల లార్డ్స్ టెస్టు సందర్భంగా పంత్ వేలికి గాయమైనపుడు అతడు కీపర్గా బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే, తాజాగా పంత్ పూర్తిగా దూరం కావడంతో జురెల్కు బ్యాకప్గా ఇషాన్ కిషన్ను జట్టులోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన ఇషాన్ఇక ఇషాన్ కిషన్ ఇంత వరకు కేవలం రెండు టెస్టులు మాత్రమే ఆడిన విషయం తెలిసిందే. 2023లో సౌతాఫ్రికా పర్యటనకు ఎంపికైన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. వ్యక్తిగత కారణాలు చూపుతూ టూర్ మధ్యలోనే భారత్కు తిరిగి వచ్చాడు. అనంతరం బీసీసీఐ ఆదేశాల మేరకు రంజీల్లో ఆడేందుకు కూడా విముఖత చూపాడు. ఈ నేపథ్యంలో అతడి సెంట్రల్ కాంట్రాక్టును రద్దు చేసిన బోర్డు.. ఇంతవరకు మళ్లీ జాతీయ జట్టుకు ఎంపిక చేయలేదు. అయితే, ఇషాన్ ఆ తర్వాత రంజీలతో పాటు దులిప్ ట్రోఫీ ఆడాడు. ఈ క్రమంలో, ఈ ఏడాది అతడి కాంట్రాక్టును పునరుద్ధరించారు. ఇక ఇటీవల ఇంగ్లండ్ కౌంటీల్లోనూ ఇషాన్ మెరిశాడు.చదవండి: అతడు ఫిట్గానే ఉన్నాడు కదా.. అన్షుల్ను ఎలా తీసుకున్నారు? -
నాకు ఇలానే జరిగింది.. అదే అయితే పంత్ ఆడడం కష్టమే: పాంటింగ్
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ గాయం కారణంగా రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ బౌలింగ్లో రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నంలో పంత్ గాయపడ్డాడు.బంతి బ్యాట్ ఎడ్జ్ తగిలి పంత్ కుడి కాలి పాదానికి బలంగా తాకింది. వెంటనే పత్యేక వాహనంలో పంత్ మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత స్కానింగ్ కోసం అతడిని ఆస్పత్రికి తరలించారు. స్కాన్ రిపోర్ట్లు కోసం బీసీసీఐ వైద్య బృందం ఎదురు చూస్తోంది.ఒకవేళ అతడి గాయం తీవ్రమైనదిగా తేలితే అది భారత్కు గట్టి ఎదురు దెబ్బ కానుంది. రిషబ్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. ఈ సిరీస్లో సెకెండ్ లీడింగ్ రన్స్కోరర్గా కొనసాగుతున్న పంత్.. ఈ మ్యాచ్తో పాటు ఆఖరి టెస్టు అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది. ఈ నేపథ్యంలో పంత్ గాయంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు."రిషబ్ పంత్ కుడి కాలి పాదానికి బలంగా బంతి తాకింది. దెబ్బ తాకిన పంత్ తన కాలును నేలపై పెట్టలేకపోయాడు. గోల్ఫ్ కార్ట్ వాహనం మైదానంలో లోపలికి వచ్చేముందు అతడు కొద్ది నిమిషాల పాటు అటు ఇటు తిరిగాడు. అయితే వెంటనే వాపు రావడం నాకు ఆందోళన కలిగించింది.గతంలో నాకు ఓ సారి ఇటువంటి గాయమే అయింది. పాదంలో చిన్న చిన్న పెళుసుగా ఉండే ఎముకలు ఉంటాయి. బంతి తాకడంతో అందులో ఒకట్రెండు విరిగిపోయాయి. అలా జరిగితే కాలు కింద పెట్టలేము. ఒకవేళ పంత్ విషయంలో అదే జరిగితే అతడు ఈ మ్యాచ్ నుంచి వైదొలగక తప్పదు. అలా అతడు తిరిగి బ్యాటింగ్కు వచ్చే అవకాశముంది. ఒకవేళ తిరిగొచ్చిన ఇటువంటి రివర్స్ స్వీప్ షాట్లు ఆడడని నేను ఆశిస్తున్నా అని స్కై స్పోర్ట్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాంటింగ్ పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: రిషబ్ పంత్ గాయంపై బీసీసీఐ కీలక అప్డేట్ -
తీవ్రమైన గాయమే.. పంత్ లేకపోతేనేం.. మిగిలిన వాళ్లు చాలు!
మాంచెస్టర్ టెస్టులో తొలి రోజు ఆటలో టీమిండియా మెరుగైన స్థితిలో నిలిచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్.. బుధవారం నాటి ఆట ముగిసేసరికి 83 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. మొదటి రోజు పరిస్థితులు సానుకూలంగానే ఉన్నా.. స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) గాయం రూపంలో టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బే తగిలింది.టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ-2025 (Tendulkar- Anderson Trophy)లో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఇప్పటికి ఏకంగా 462 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గాయపడిన పంత్తద్వారా ప్రస్తుతం ఈ సిరీస్లో అత్యధిక పరుగుల వీరుల స్థానంలో పంత్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, మాంచెస్టర్లో బుధవారం మొదలైన నాలుగో టెస్టు సందర్భంగా ఈ ఎడమచేతి వాటం బ్యాటర్కు గాయమైంది.క్రిస్ వోక్స్ (Chris Woakes) సంధించిన బంతిని రివర్స్ స్వీప్ షాట్ ఆడే క్రమంలో పంత్ కుడిపాదానికి తీవ్రమైన గాయమైంది. నొప్పి తట్టుకోలేక అతడు రిటైర్డ్ హర్ట్గా మైదానాన్ని వీడాడు. అతడిని ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు.పంత్ లేకపోకపోతే కష్టమేఈ విషయంపై పంత్ సహచర ఆటగాడు, టీమిండియా యువ క్రికెటర్ సాయి సుదర్శన్ స్పందించాడు. పంత్ కోలుకోలేకపోతే తమకు ఎదురుదెబ్బ తప్పదని పేర్కొన్నాడు. అయితే, పంత్ లేకపోయినా మిగిలిన బ్యాటర్లు సత్తా చాటి జట్టును పటిష్ట స్థితిలో నిలపగలరని ధీమా వ్యక్తం చేశాడు. తొలిరోజు ఆట ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అతడిని స్కాన్స్ కోసం పంపించారు. రాత్రికల్లా రిపోర్టులు వస్తాయి. ఒకవేళ పంత్ గాయం కారణంగా మ్యాచ్కు దూరమైతే చాలా కష్టం. అతడు ఈరోజు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కానీ ఒకవేళ గాయం తీవ్రతరమై తిరిగి బ్యాటింగ్కు రాకపోతే మాత్రం.. ఇందుకు సంబంధించిన పరిణామాలు మేము ఎదుర్కోకతప్పదు.మరేం పర్లేదు.. మిగిలిన వాళ్లు చాలుఅయితే, జట్టులో ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్నవాళ్లు.. మిగిలిన ఆల్రౌండర్లు ఉన్నారు. కాబట్టి మా అత్యుత్తమ ప్రదర్శనతో ప్రతికూల పరిస్థితులు అధిగమిస్తాం. పంత్ లేనిలోటును పూడ్చేందుకు మా వాళ్లు ఎక్కువసేపు క్రీజులో నిలబడాల్సి ఉంటుంది’’ అని సాయి సుదర్శన్ పేర్కొన్నాడు.గెలిస్తేనే.. నిలుస్తారుకాగా ఇంగ్లండ్తో ఐదు టెస్టుల్లో భాగంగా 1-2తో వెనుకబడి ఉన్న టీమిండియా.. మాంచెస్టర్లో గెలిస్తేనే గెలుపు అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఇక లీడ్స్లో జరిగిన తొలి టెస్టు ద్వారా అరంగేట్రం చేసిన సాయి సుదర్శన్ డకౌట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్లో ముప్పై పరుగులే చేసిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ను రెండో టెస్టు నుంచి తప్పించారు.తాజాగా నాలుగో టెస్టు ద్వారా రీఎంట్రీ ఇచ్చిన సాయి.. 151 బంతులు ఎదుర్కొని 61 పరుగులతో అదరగొట్టాడు. కాగా తొలి రోజు ఆటలో ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (58), కేఎల్ రాహుల్ (46) శుభారంభం అందించగా.. సాయి దానిని కొనసాగించాడు. అయితే, కెప్టెన్ శుబ్మన్ గిల్ (12) మరోసారి విఫలం కావడం.. పంత్ 37 పరుగుల వద్ద మైదానం వీడటం ప్రభావం చూపాయి. ఆట పూర్తయ్యేసరికి ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ చెరో పందొమ్మిది పరుగులతో క్రీజులో ఉన్నారు. చదవండి: IND vs ENG: గిల్ నీకు కొంచమైన తెలివి ఉందా.. ఇంత చెత్తగా ఔట్ అవుతావా? వీడియో -
చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. తొలి ప్లేయర్గా ప్రపంచ రికార్డు
ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ను దురదృష్టం వెంటాడింది. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో పంత్కు తీవ్రగాయమైంది. క్రిస్ వోక్స్ బౌలింగ్లో రివర్స్ స్వీప్ షాట్ ఆడే క్రమంలో పంత్ కుడికాలికి గాయమైంది.దీంతో 37 పరుగులు చేసిన రిషబ్ రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. పంత్ గాయపడక ముందు ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. విదేశీ గడ్డపై 1000 పరుగుల మైలు రాయిని అందుకున్న తొలి పర్యాటక జట్టు వికెట్ కీపర్ బ్యాటర్గా పంత్ చరిత్ర సృష్టించాడు. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యంకాని రికార్డును పంత్ తన పేరిట లిఖించుకున్నాడు. పంత్ ఇప్పటివరకు ఇంగ్లండ్లో టెస్టుల్లో 1004 పరుగులు చేశాడు. ప్రస్తుతం పంత్ దారిదాపుల్లో ఎవరూ లేరు.ఇంగ్లండ్లో అత్యధిక పరుగులు చేసిన విజిటింగ్ వికెట్ కీపర్లు వీరే..1004 పరుగులు-రిషబ్ పంత్ (భారత్)*778 పరుగులు- ఎంఎస్ ధోని (భారత్)773 పరుగులు - రాడ్ మార్ష్ (ఆస్ట్రేలియా)684 పరుగులు - జాన్ వైట్ (దక్షిణాఫ్రికా)624 పరుగులు - ఇయాన్ హీలీ (ఆస్ట్రేలియా)విదేశాల్లో అత్యధిక పరుగులు చేసిన విజిటింగ్ వికెట్ కీపర్లు వీరే..1000 – రిషబ్ పంత్ (ఇంగ్లాండ్)879 – రిషబ్ పంత్ (ఆస్ట్రేలియా)778 – ఎంఎస్ ధోని (ఇంగ్లాండ్)773 – రాడ్ మార్ష్ (ఇంగ్లాండ్)717 – ఆండీ ఫ్లవర్ (భారతదేశం)👉ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక టెస్టు పరుగులు చేసిన పర్యాటక వికెట్ కీపర్గా పంత్(879) కొనసాగుతున్నాడు.కాగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 77 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా(19), శార్ధూల్ ఠాకూర్(19) ఉన్నారు. భారత బ్యాటర్లలో ఓపెనర్లు యశస్వి జైశ్వాల్(58), సాయిసుదర్శన్(61), కేఎల్ రాహుల్(46) రాణించారు.చదవండి: IND vs ENG: గిల్ నీకు కొంచమైన తెలివి ఉందా.. ఇంత చెత్తగా ఔట్ అవుతావా? వీడియో -
రిషబ్ పంత్ గాయంపై బీసీసీఐ కీలక అప్డేట్
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్కు తీవ్రగాయమైంది. తొలి రొజు ఆటలో భాగంగా పేసర్ క్రిస్ వోక్స్ బౌలింగ్లో మూడో బంతికి పంత్ రివర్స్ స్వీప్ ఆడటానికి ప్రయత్నించాడు.అయితే బంతి బ్యాట్ ఎడ్జ్కు తగిలి పంత్ కుడి కాలు పాదానికి బలంగా తాకింది. దీంతో రిషబ్ తీవ్రమైన నొప్పితో విల్లవిల్లాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికి ఫలితం లేకపోవడంతో ఈ ఢిల్లీ ఆటగాడు రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. పంత్ రిటైర్డ్ హార్ట్ అయ్యే సమయానికి 37 పరుగులు చేశాడు. అద్భుతమైన ఫామ్లో ఉన్న రిషబ్ గాయపడడం భారత్కు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి. అస్సలు రెండో రోజు ఆటలో పంత్ బ్యాటింగ్ వస్తాడా లేదా అన్నది ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారింది. ఇంతకుముందు లార్డ్స్ టెస్టులో కూడా పంత్ గాయపడిన సంగతి తెలిసిందే. ఇక తాజా గాయంపై బీసీసీఐ అప్డేట్ ఇచ్చింది."మాంచెస్టర్ టెస్ట్ మొదటి రోజు ఆటలో బ్యాటింగ్ చేస్తుండగా రిషబ్ పంత్ కుడి పాదానికి గాయమైంది. అతడిని స్కాన్ల కోసం అస్పత్రికి తరలించారు. పంత్ ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని" భారత క్రికెట్ బోర్డు ఎక్స్లో రాసుకొచ్చింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 77 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది.క్రీజులో రవీంద్ర జడేజా(19), శార్ధూల్ ఠాకూర్(19) ఉన్నారు. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్ (58), రాహుల్ (46) రాణించగా.. కెప్టెన్ శుభమన్ గిల్ 12 పరుగులు మాత్రమే చేసి నిరాశ పర్చాడు. ఇక యువ ఆటగాడు సాయిసుదర్శన్(61) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో కెప్టెన్ బెన్ స్టోక్స్ రెండు వికెట్ల పడగొట్టగా.. వోక్స్, డాసన్ చెరో వికెట్ తీశారు.చదవండి: IND vs ENG: భారత మాజీ వికెట్ కీపర్కు అరుదైన గౌరవం..𝗨𝗽𝗱𝗮𝘁𝗲:Rishabh Pant was hit on his right foot while batting on Day 1 of the Manchester Test. He was taken for scans from the stadium. The BCCI Medical Team is monitoring his progress.— BCCI (@BCCI) July 23, 2025 -
తీవ్ర గాయం.. నొప్పితో విలవిల్లాడిపోయిన పంత్ (ఫొటోలు)
-
ENG VS IND 4th Test: టీమిండియాకు బిగ్ షాక్.. మైదానాన్ని వీడిన పంత్
83 ఓవర్ల తర్వాత టీమిండియా బ్యాటర్ శార్ధుల్ ఠాకూర్ 19, జడేజా 19 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. 4 వికెట్ల నష్టానికి స్కోర్ 264 పరుగులుగా ఉంది.మాంచెస్టర్ టెస్ట్లో టీమిండియాకు తొలి రోజు చివరి సెషన్లో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మూడో టెస్ట్లో వేలి గాయానికి గురైన పంత్ తాజాగా కాలి బొటన వేలికి దెబ్బ తగిలించుకున్నాడు. నొప్పితో విలవిలలాడిపోయిన పంత్ను వాహనంలో డ్రెస్సింగ్ రూమ్కు తీసుకెళ్లారు. పంత్ (37) మైదానాన్ని వీడే సమయానికి ఓ చారిత్రక రికార్డు సాధించాడు. ఇంగ్లండ్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి పర్యాటక వికెట్కీపర్ బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డును పంత్ సిక్సర్తో అందుకోవడం విశేషం.పంత్ రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాక రవీంద్ర జడేజా క్రీజ్లోకి వచ్చాడు. పంత్ మైదానాన్ని వీడిన కొద్ది సేపటికే సాయి సుదర్శన్ అర్ద సెంచరీ పూర్తి చేశాడు. 78 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 4 వికెట్ల నష్టానికి 249 పరుగులుగా ఉంది. సాయి సుదర్శన్ (61), రవీంద్ర జడేజా (12) క్రీజ్లో ఉన్నారు.ఈ మ్యాచ్లో భారత్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (46), యశస్వి జైస్వాల్ (58) రాణించగా.. శుభ్మన్ గిల్ (12) నిరాశపరిచాడు. భారత్ కోల్పోయిన వికెట్లలో రాహుల్ వికెట్ క్రిస్ వోక్స్కు.. జైస్వాల్ వికెట్ లియామ్ డాసన్కు.. శుభ్మన్ గిల్ వికెట్ బెన్ స్టోక్స్కు దక్కింది.కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ ప్రస్తుతం 1-2 తేడాతో వెనుకపడి ఉన్న విషయం తెలిసిందే. మొదటి, మూడు టెస్ట్ల్లో ఇంగ్లండ్ విజయం సాధించగా.. భారత్ రెండో మ్యాచ్లో గెలుపొందింది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే భారత్ సిరీస్లో నిలబడుతుంది. కాబట్టి ఈ మ్యాచ్ భారత్కు డు ఆర్ డైగా మారింది.తుది జట్లు..ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్-కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్.భారత్: యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్, రిషబ్ పంత్ (WK),రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. -
ENG VS IND 4th Test: ఇన్నింగ్స్ను చక్కదిద్దుతున్న సాయి సుదర్శన్, పంత్
మాంచెస్టర్ టెస్ట్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ 200 పరుగుల మార్కును దాటింది. 46 పరుగుల వ్యవధిలో కేఎల్ రాహుల్ (46), యశస్వి జైస్వాల్ (58), శుభ్మన్ గిల్ (12) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్ను సాయి సుదర్శన్ (46), రిషబ్ పంత్ (28) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్కు అజేయమైన 61 పరుగులు జోడించి భారత ఇన్నింగ్స్ను చక్కదిద్దుతున్నారు.సాయి సుదర్శన్ ఎంతో ఓపికగా ఆడుతూ ఇంగ్లండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తుండగా.. పంత్ తనదైన శైలిలో ధాటిగా ఆడుతున్నాడు. 65 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 201/3గా ఉంది. భారత్ కోల్పోయిన వికెట్లలో రాహుల్ వికెట్ క్రిస్ వోక్స్కు.. జైస్వాల్ వికెట్ లియామ్ డాసన్కు.. శుభ్మన్ గిల్ వికెట్ బెన్ స్టోక్స్కు దక్కింది.కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ ప్రస్తుతం 1-2 తేడాతో వెనుకపడి ఉన్న విషయం తెలిసిందే. మొదటి, మూడు టెస్ట్ల్లో ఇంగ్లండ్ విజయం సాధించగా.. భారత్ రెండో మ్యాచ్లో గెలుపొందింది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే భారత్ సిరీస్లో నిలబడుతుంది. కాబట్టి ఈ మ్యాచ్ భారత్కు డు ఆర్ డైగా మారింది.తుది జట్లు..ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్-కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్.భారత్: యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్, రిషబ్ పంత్ (WK),రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. -
ఐపీఎల్ కోసం దాచి ఉంచు పంత్.. ఇంగ్లండ్లో ఆ షాట్లు వద్దులే!
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో టీమిండియా స్టార్ రిషభ్ పంత్ (Rishabh Pant) అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటికి మూడు టెస్టులు ఆడిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. ఆరు ఇన్నింగ్స్లో కలిపి 70కి పైగా సగటుతో 425 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు కూడా ఉండటం విశేషం.అయితే, పంత్ కొన్నిసార్లు అనవసరపు షాట్లకు పోయి వికెట్ పారేసుకోవడం వల్ల విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. చివరగా ఆస్ట్రేలియాతో టెస్టుల్లోనూ నిర్లక్ష్యపు షాట్లతో మూల్యం చెల్లించిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ఇంగ్లండ్లోనూ అదే పునరావృతం చేస్తున్నాడు. ముఖ్యంగా స్పిన్నర్ షోయబ్ బషీర్ (Shoaib Bashir) బౌలింగ్లో రెండుసార్లు భారీ షాట్లకు పోయి వికెట్ సమర్పించుకున్నాడు.ఐపీఎల్ కోసం దాచి ఉంచు పంత్ఈ నేపథ్యంలో పంత్ రిస్కీ షాట్ల గురించి భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ ఫారూఖ్ ఇంజనీర్ స్పందిస్తూ.. ‘‘కచ్చితంగా అతడు ఇలాంటి షాట్లు ఆడటం మానుకోవాలి. ఇలాంటివి ఐపీఎల్ కోసం దాచిపెట్టుకోవాలి. టెస్టు క్రికెట్లో ఎంతో క్రమశిక్షణతో బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది.ముఖ్యంగా మూడు, నాలుగు స్థానాల్లో ఆడేవాళ్లు సరైన రీతిలో ఆడాలి. సహచర ఆటగాళ్లతో కలిసి భారీ భాగస్వామ్యాలు నెలకొల్పి.. తమ ఇన్నింగ్స్ను భారీ స్కోర్లుగా మలచుకోవాలి’’ అని సూచించాడు.పళ్లు మొత్తం రాలిపోయి ఉండేవేమో!అదే విధంగా.. ‘‘పంత్కు ఆత్మవిశ్వాసం ఎక్కువ. అయితే, కీలక సమయాల్లో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అతడు ప్రతిభావంతుడైన ఆటగాడే. కొత్త కొత్త షాట్లు కనిపెడతాడు. ఒక్కోసారి హెల్మెట్ ఉండబట్టి సరిపోయిందిలే అనిపిస్తుంది. మా రోజుల్లో అయితే, పళ్లు మొత్తం రాలిపోయి ఉండేవేమో’’ అంటూ ఫారూఖ్ ఇంజనీర్ సరదాగా వ్యాఖ్యానించాడు.కాగా రిషభ్ పంత్ వేలికి గాయమై విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాంచెస్టర్లో జరిగే నాలుగో టెస్టులో అతడు కేవలం బ్యాటర్గానే బరిలోకి దిగాలని.. అతడికి బదులు ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్గా వ్యవహరించాలని ఫారూఖ్ ఇంజనీర్ సూచించాడు. ఇక ఐదు టెస్టుల సిరీస్లో ఇప్పటికి మూడు పూర్తి కాగా.. ఇంగ్లండ్ రెండు గెలవగా.. టీమిండియా ఒక మ్యాచ్లో విజయం సాధించింది.చదవండి: వైభవ్ సూర్యవంశీ ఖాతాలో మరో ప్రపంచ రికార్డు -
ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్.. చరిత్ర సృష్టించేందుకు సిద్దంగా ఉన్న పంత్
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించేందుకు అతి సమీపంలో ఉన్నాడు. జులై 23 నుంచి ఇంగ్లండ్తో ప్రారంభం కాబోయే నాలుగో టెస్ట్లో పంత్ మరో 182 పరుగులు చేస్తే.. ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన వికెట్కీపర్ బ్యాటర్గా సరికొత్త రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు సౌతాఫ్రికా దిగ్గజం డెనిస్ లిండ్సే పేరిట ఉంది. లిండ్సే 1966/67 ఆస్ట్రేలియా సిరీస్లో 5 మ్యాచ్ల్లో (7 ఇన్నింగ్స్ల్లో) 86.57 సగటున 3 సెంచరీలు, 2 అర్ద సెంచరీల సాయంతో 606 పరుగులు చేశాడు.ఈ రికార్డు బద్దలు కొట్టేందుకు పంత్ 182 పరుగుల దూరంలో ఉన్నాడు. ఆరు దశాబ్దాల తర్వాత పంత్కు ఈ రికార్డు బద్దలు కొట్టే అవకాశం వచ్చింది. ప్రస్తుతం ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో పంత్ ఇప్పటివరకు 3 మ్యాచ్లు ఆడి 6 ఇన్నింగ్స్ల్లో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీల సాయంతో 425 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో శుభ్మన్ గిల్ (607) తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. ఒక వేళ పంత్ నాలుగో టెస్ట్లో ఈ అవకాశం మిస్ అయినా ఐదో టెస్ట్లో సాధించే అవకాశం ఉంటుంది.మరో 101 పరుగులు చేస్తే..!ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్లో పంత్ 101 పరుగులు చేస్తే ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్ కీపర్గా రికార్డు సాధిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు బుద్ది కుందరన్ పేరిట ఉంది. కుందరన్ 1963/64లో ఇంగ్లండ్తో జరిగిన 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో 10 ఇన్నింగ్స్లు ఆడి 525 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ ఉంది.ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్ బ్యాటర్లు..డెనిస్ లిండ్సే-606ఆండీ ఫ్లవర్- 540కుందరన్- 525బ్రాడ్ హడిన్- 493గెర్రి అలెగ్జాండర్- 484ఆడమ్ గిల్క్రిస్ట్- 473అలెక్ స్టివార్ట్- 465వాల్కాట్- 452రిషబ్ పంత్- 425రికార్డుల మాట అటుంచితే, అసలు పంత్ ఆడతాడా..?రికార్డుల మాట అటుంచితే ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్లో పంత్ ఆడతాడా లేదా అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. మూడో టెస్ట్లో గాయపడిన పంత్.. నాలుగో మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొనడం లేదు.పంత్ గాయంపై భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ డెష్కటే అప్డేట్ ఇచ్చాడు. పంత్ ఇంకా నొప్పితో బాధపడుతున్నాడని, నాలుగో టెస్ట్ సమయానికి ఫిట్నెస్ సాధిస్తాడని థీమా వ్యక్తం చేశాడు. ముందుస్తు జాగ్రత్తగా పంత్ను ప్రాక్టీస్కు దూరంగా ఉంచామని తెలిపాడు.కాగా, మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్కు ముందే పంత్ చేతి వేలికి గాయమైంది. దీంతో అతడి స్ధానంలో ధ్రువ్ జురెల్ సబ్స్ట్యూట్ వికెట్ కీపర్గా బాధ్యతలు నిర్వర్తించాడు. వికెట్కీపింగ్కు దూరంగా ఉన్నా పంత్ రెండు ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ మాత్రం చేశాడు. -
నాలుగో టెస్టులో రిషబ్ పంత్ ఆడుతాడా? కీలక్ అప్డేట్ ఇచ్చిన కోచ్
ఇంగ్లండ్తో మాంచెస్టర్ వేదికగా జూలై 23 నుంచి ప్రారంభం కానున్న నాలుగో టెస్టులో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు బెకెన్హామ్లో తమ ప్రాక్టీస్ను మొదలు పెట్టింది. గురువారం తొలి ప్రాక్టీస్ సెషన్లో గిల్ సేన తీవ్రంగా శ్రమించింది. అయితే ఈ ప్రాక్టీస్ సెషన్కు టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ దూరమయ్యాడు.లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో పంత్ చేతి వేలికి గాయమైంది. దీంతో అతడి స్ధానంలో ధ్రువ్ జురెల్ సబ్స్ట్యూట్ వికెట్ కీపర్గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఫీల్డింగ్కు దూరంగా ఉన్న పంత్.. రెండు ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు మాత్రం వచ్చాడు. తీవ్రమైన నొప్పితో బాధపడుతూనే బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో నాలుగో టెస్టుకు పంత్ అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారింది. తాజాగా పంత్ గాయంపై భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్డెష్కాట్ అప్డేట్ ఇచ్చాడు. పంత్ ఇంకా నొప్పితో బాధపడుతున్నాడని, మాంచెస్టర్ టెస్ట్ సమయానికి ఫిట్నెస్ సాధిస్తాడని టెన్డెష్కాట్ థీమా వ్యక్తం చేశాడు."మాంచెస్టర్లో జరిగే నాలుగో టెస్టుకు ముందు పంత్ తన బ్యాటింగ్ ప్రాక్టీస్ను మొదలు పెడతాడు. ఆ సమయానికి అతడు కచ్చితంగా ఫిట్నెస్ సాధిస్తాడన్న నమ్మకం ఉంది. అతడు మూడో టెస్టులో చాలా నొప్పితో బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత అతడి చేతి వేలి నొప్పి కాస్త తగ్గింది.కానీ ముందుస్తు జాగ్రత్తగా ప్రస్తుతం అతడు ప్రాక్టీస్కు దూరంగా ఉన్నాడు. వికెట్ కీపింగ్ చేయగలడా లేదా అన్నది ఆఖరిలో మేము నిర్ధారించుకుంటాము. మరోసారి ఇన్నింగ్స్ మధ్యలో కీపర్ను మార్చాల్సిన పరిస్థితి రాకూడదు. పూర్తి ఫిట్నెస్ సాధిస్తే పంత్నే బ్యాటింగ్, వికెట్ కీపింగ్ రెండూ చేస్తాడు. రాబోయే రోజుల్లో అతడి ఫిట్నెస్పై కచ్చితంగా అప్డేట్ ఇస్తామని" విలేకరుల సమావేశంలో డెష్కాట్ పేర్కొన్నాడు.చదవండి: ENG vs IND: ఇంగ్లండ్తో నాలుగో టెస్టు.. టీమిండియాకు భారీ షాక్ -
రిషబ్ పంత్లా మారిన 'లేడీ సెహ్వాగ్'
టీమిండియా స్టార్ మహిళా క్రికెటర్ దీప్తి శర్మను అభిమానులు "లేడీ సెహ్వాగ్" అని పిలుచుకుంటారు. దీప్తి సెహ్వాగ్లా భయం, బెరుకు లేకుండా డాషింగ్గా షాట్లు ఆడటమే ఇందుకు కారణం. లేడీ సెహ్వాగ్ బిరుదుకు దీప్తి శర్మ తాజాగా మరోసారి సార్దకత చేకూర్చింది. నిన్న (జులై 16) ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో దీప్తి మెరుపు ఇన్నింగ్స్ (64 బంతుల్లో 62; 3 ఫోర్లు, సిక్స్) ఆడి భారత విజయంలో ప్రధానపాత్ర పోషించింది.ఈ ఇన్నింగ్స్లో దీప్తి కొట్టిన ఏకైక సిక్సర్ ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతుంది. ఈ షాట్ను దీప్తి రిషబ్ పంత్లా ఆడటం వల్ల అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. దీప్తి పంత్ ట్రేడ్ మార్క్ షాట్ అయిన "ఒంటి చేత్తో సిక్సర్" విజయవంతంగా పూర్తి చేయడంలో సఫలమైంది. DEEPTI SHARMA ON ONE-HANDED SIX:"I play these shots in practice - I picked that up from Rishabh Pant". pic.twitter.com/Y5u2eYdZ0i— Johns. (@CricCrazyJohns) July 17, 2025మ్యాచ్ అనంతరం ఈ షాట్ గురించి దీప్తి మాట్లాడుతూ.. నేను ఇలాంటి షాట్లను నిత్యం ప్రాక్టీస్ చేస్తుంటాను. రిషబ్ పంత్ను చూసినప్పటి నుంచే ఇలాంటి షాట్లను ఆడటం మొదలుపెట్టానని అంది.ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ పర్యటనలో భారత మహిళల క్రికెట్ జట్టు జోరు కొనసాగుతోంది. ఈ పర్యటనలో ఇదివరకే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 3-2 తేడాతో కైవసం చేసుకున్న భారత్.. తాజాగా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో ఘనంగా బోణీ కొట్టింది. సౌతాంప్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసి, సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. సోఫీ డంక్లీ (83), డేవిడ్సన్ రిచర్డ్స్ (53) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా తలో రెండు వికెట్లు తీయగా.. అమన్జోత్ కౌర్, శ్రీ చరణి చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. ఆది నుంచే నిలకడగా ఆడుతూ పెద్దగా కష్టపడకుండానే విజయం సాధించింది. టాపార్డర్ బ్యాటర్లలో ప్రతీక రావల్ (36), స్మృతి మంధన (28), హర్లీన్ డియోల్ (27), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (17), జెమీమా రోడ్రిగెజ్ (48) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించగా.. ఆల్రౌండర్ దీప్తి శర్మ (62 నాటౌట్) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో భారత్ను గెలిపించింది. -
వరల్డ్ నెం1 టెస్టు బ్యాటర్గా జో రూట్.. దిగజారిన జైశ్వాల్, గిల్ ర్యాంక్లు
ఐసీసీ టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్లో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ మళ్లీ అగ్ర పీఠాన్ని అధిరోహించాడు. వారం రోజులు తిరగక ముందే తన సహచర ఆటగాడు హ్యారీ బ్రూక్ను అధిగమించి రూట్ టాప్ ర్యాంక్కు చేరుకున్నాడు. లార్డ్స్ వేదికగా టీమిండియాతో జరిగిన మూడో టెస్టులో సెంచరీతో చెలరేగిన రూట్.. ఒక స్ధానం మెరుగుపరుచుకుని నెం1 టెస్టు బ్యాటర్గా నిలిచాడు.భారత్ రెండో టెస్టు అనంతరం టాప్ ర్యాంక్కు చేరుకున్న హ్యారీ బ్రూక్.. ఇప్పుడు 862 పాయింట్లతో మూడో స్ధానానికి పడిపోయాడు. టాప్లో రూట్(888) కొనసాగుతుండగా.. విలియమ్సన్(867), బ్రూక్, స్టీవ్ స్మిత్(816) తర్వాత స్ధానాల్లో కొనసాగుతున్నారు. ఇక లార్డ్స్ టెస్టులో విఫలమైన యశస్వి జైశ్వాల్, శుబ్మన్ గిల్ రాంక్లు దిగజారాయి. జైశ్వాల్(801) ఒక్క స్ధానం డ్రాప్ అయ్యి ఐదో స్ధానంలో కొనసాగుతుండగా.. శుబ్మన్ గిల్ (765)ఏకంగా మూడు స్ధానాలు దిగజారి తొమ్మిదో ర్యాంక్కు పడిపోయాడు. అదేవిధంగా రిషబ్ పంత్ కూడా ఒక స్ధానం డ్రాప్ అయ్యి ఎనిమిదో ర్యాంక్లో కొనసాగుతున్నాడు. భారత్ నుంచి టాప్-10 ర్యాంక్లో మొత్తంగా ముగ్గురు ఆటగాళ్లు ఉన్నారు.సెకెండ్ ప్లేయర్గాటెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్లో జో రూట్ అగ్రస్దానాన్ని కైవసం చేసుకోవడం ఇది ఎనిమిదోసారి కావడం గమనార్హం. టెస్టుల్లో నెం1 ర్యాంక్లో కొనసాగుతున్న రెండో అతి పెద్ద వయష్కుడిగా రూట్ నిలిచాడు. 34 ఏళ్ల వయస్సులో రూట్ ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార్ సంగక్కర టాప్లో ఉన్నాడు. సంగక్కర 37 ఏళ్ల వయస్సులో టెస్టుల్లో నెం1 బ్యాటర్గా నిలిచాడు.కాగా లార్డ్స్ టెస్టులో 22 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆఖరి వరకు పోరాడినప్పటికి విజయం మాత్రం టీమిండియాకు వరించలేదు. ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు జూలై 23 నుంచి మాంచెస్టర్ వేదికగా ప్రారంభం కానుంది.చదవండి: జడేజా దూకుడుగా ఆడాల్సింది!.. టీమిండియా దిగ్గజాలకు ఇచ్చిపడేసిన పుజారా -
అతడికి ఇంకొక్క ఛాన్స్ ఇవ్వండి.. నాలుగో టెస్టులో ఆడించండి: కుంబ్లే
ఇంగ్లండ్తో నాలుగో టెస్టు నేపథ్యంలో భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (Anil Kumble) టీమిండియా నాయకత్వ బృందానికి కీలక సూచనలు చేశాడు. లార్డ్స్ (Lord's Test)లో ఆడించిన తుదిజట్టునే మాంచెస్టర్లోనూ కొనసాగించాలని సూచించాడు. మూడో టెస్టులో టీమిండియా బాగానే ఆడిందని... అయితే, ఆఖరి వరకు పోరాడినా దురదృష్టవశాత్తూ ఓటమిపాలైందని పేర్కొన్నాడు.పొరపాట్లను సరిచేసుకుంటే నాలుగో టెస్టులో అనుకున్న ఫలితాన్ని రాబట్టవచ్చని.. కానీ ఇందుకోసం తుదిజట్టులో మాత్రం మార్పులు అవసరం లేదని కుంబ్లే అభిప్రాయపడ్డాడు. కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy)లో భాగంగా టీమిండియా ఇంగ్లండ్తో ఐదు టెస్టులు ఆడుతోంది.ఆధిక్యంలో ఆతిథ్య జట్టుఈ క్రమంలో తొలుత లీడ్స్లో ఇంగ్లండ్ గెలుపొందగా.. రెండో టెస్టులో భారత్ ఎడ్జ్బాస్టన్లో జయభేరి మోగించింది. ఇక ఇరుజట్ల మధ్య ఆఖరి రోజు వరకు ఉత్కంఠగా సాగిన లార్డ్స్ టెస్టులో మాత్రం గిల్ సేన 22 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఫలితంగా ఇంగ్లండ్కు 2-1తో ఆధిక్యం దక్కింది.కరుణ్ నాయర్ వరుస వైఫల్యాలుకాగా ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో కెప్టెన్ శుబ్మన్ గిల్ (16, 6)తో పాటు కీలక ఆటగాళ్లు యశస్వి జైస్వాల్(13, 0 ), కరుణ్ నాయర్ (40, 14) విఫలం కావడం తీవ్ర ప్రభావం చూపింది. మరోవైపు.. వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ సైతం తొలి ఇన్నింగ్స్ (74)లో రనౌట్ కావడం.. రెండో ఇన్నింగ్స్ (9)లో ఫెయిల్ అవడం టీమిండియా కొంపముంచింది.అయితే, వీరిలో ప్రధానంగా కరుణ్ నాయర్ వరుస వైఫల్యాల కారణంగా తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఎనిమిదేళ్ల తర్వాత జట్టులోకి పునరాగమనం చేసిన ఈ విదర్భ స్టార్కు ఇంగ్లండ్లో వరుస అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోవడం ఇందుకు కారణం.ఇంగ్లండ్తో సిరీస్లో కరుణ్ ఇప్పటి వరకు చేసిన స్కోర్లు వరుసగా.. 0, 20, 31, 26, 40, 14. ముఖ్యంగా లార్డ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్లో అతడు అవుటైన తీరు అభిమానులకు సైతం ఆగ్రహం తెప్పించింది. దీంతో అతడిపై వేటు వేయాలనే డిమాండ్లు పెరిగాయి.పంత్ విషయంలో నో క్లారిటీఈ నేపథ్యంలో అనిల్ కుంబ్లే మాత్రం కరుణ్ నాయర్కు మద్దతుగా నిలవడం విశేషం. నాలుగో టెస్టులో భారత తుదిజట్టు కూర్పు గురించి మాట్లాడుతూ.. ‘‘మాంచెస్టర్లో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగితేనే బాగుంటుంది. నిజానికి లార్డ్స్లో మనవాళ్లు అద్భుతంగా ఆడారు.అవును.. మనం 22 పరుగుల తేడాతో ఓడిపోయిన మాట వాస్తవమే. అయినా మనవాళ్లు ఆఖరి వరకు పోరాడిన తీరు అద్భుతం. గాయాల బెడదలు లేకుంటే ఇదే జట్టుతో కొనసాగవచ్చు. అయితే, రిషభ్ పంత్ (వేలికి గాయం) విషయంలో మాత్రం నేనేమీ కచ్చితంగా చెప్పలేను.అతడికి ఇంకొక్క అవకాశం ఇవ్వండిమరొక విషయం.. కరుణ్ నాయర్ తన చోటును పదిలం చేసుకుంటాడనే అనుకుంటున్నాను. ఎందుకంటే.. తొలి ఇన్నింగ్స్లో అతడు రాణించాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో అతడు అవుటైన తీరు నిరాశపరిచినా.. అతడి బ్యాటింగ్కు మాత్రం పేరుపెట్టలేము. అతడు నెలకొల్పిన భాగస్వామ్యం కూడా మ్యాచ్లో కీలకమైనదే.తొలి ఇన్నింగ్స్లో ఒకవేళ నాయర్ ముందే అవుటై ఉంటే.. అప్పుడు గిల్ మరింత ముందుగానే కొత్త బంతిని ఎదుర్కోవాల్సి వచ్చేది. తొలి 20- 25 ఓవర్లు కీలకం. కాబట్టి ఈ విషయంలో నాయర్ను తప్పుబట్టడానికి లేదు. అతడు దురదృష్టవశాత్తూ అవుటయ్యాడు.జో రూట్ అద్భుతమైన క్యాచ్ పట్టడం వల్ల వెనుదిరిగాడు. కాబట్టి ఇంకొక్క అవకాశం పొందేందుకు కరుణ్ నాయర్ అర్హుడు’’ అని అనిల్ కుంబ్లే పేర్కొన్నాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా జూలై 23- 27 మాంచెస్టర్ వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్ల షెడ్యూల్ విడుదల.. భారత్ ఎవరితో ఆడనుందంటే..?Ups & downs, fightbacks & heartbreaks, Day 5 of the Lord's Test had it all! 🙌"In the end, Cricket was the real winner!" ❤#ENGvIND | 4th Test starts WED, 23rd JULY, 2:30 PM | Streaming on JioHotstar! pic.twitter.com/ak9WkvZ2G2— Star Sports (@StarSportsIndia) July 14, 2025 -
బ్రిటన్ కింగ్ చార్లెస్-3ను కలిసిన టీమిండియా (ఫొటోలు)
-
జోఫ్రా ఆర్చర్ సూపర్ డెలివరీ.. రిషబ్ పంత్కు మైండ్ బ్లాంక్! వీడియో
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఓటమి అంచున నిలిచింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి భారత జట్టు 82 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ నిప్పులు చెరుగుతున్నాడు.అతడి బౌలింగ్ ధాటికి భారత బ్యాటర్లు బెంబేలెత్తుతున్నారు. ఐదో రోజు ఆట ఆరంభంలో భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ను అద్బుత బంతితో ఆర్చర్ బోల్తా కొట్టించాడు. ఆర్చర్ వేసిన డెలివరీకి పంత్ దగ్గర సమాధానమే లేకపోయింది. భారత ఇన్నింగ్స్ 21 ఓవర్ వేసిన ఆర్చర్ బౌలింగ్లో మూడో బంతికి పంత్ అద్బుతమైన బౌండరీ బాదాడు.ఆ తర్వాత ఐదో బంతికి పంత్ను క్లీన్ బౌల్డ్ చేసి ఈ ఇంగ్లండ్ పేసర్ ప్రతీకారం తీర్చుకున్నాడు. ఆర్చర్ ఆ ఐదో బంతిని రౌండ్ది వికెట్ నుంచి హాఫ్ స్టంప్ దిశగా హార్డ్ లెంగ్త్ డెలివరీగా పంత్ సంధించాడు. ఆ బంతిని పంత్ డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ పంత్ తన బ్యాట్ను కిందకు తీసుకొచ్చేలోపే బంతి స్టంప్స్ను గిరాటేసింది.దీంతో పంత్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే పంత్కు వద్దకి వెళ్లి స్లెడ్జ్ చేశాడు. అతడి వైపు చూస్తూ సీరియస్గా ఏదో అంటూ సెండాఫ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.అనంతరం వాషింగ్టన్ సుందర్ను కూడా సంచలన రిటర్న్ క్యాచ్తో ఆర్చర్ పెవిలియన్కు పంపాడు. టీమిండియా విజయానికి ఇంకా 93 పరుగులు కావాలి. క్రీజులో రవీంద్ర జడేజా(14), నితీశ్ కుమార్ రెడ్డి(5) ఉన్నారు.Split screen angles just hit different with Jofra 😍👌 pic.twitter.com/9kf7r2QmUk— England Cricket (@englandcricket) July 14, 2025చదవండి: IND vs ENG 3rd Test Day 5: తొలి సెషన్ కీలకం.. ఆరు వికెట్లు తీసి..: ఇంగ్లండ్ కోచ్ -
నా వల్లే అలా జరిగింది.. పంత్ను ఏమి అనొద్దు: కేఎల్ రాహుల్
లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్కు టీమిండియా ధీటైన జవాబు ఇచ్చింది. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 387 పరుగులు చేయగా.. టీమిండియా సైతం సరిగ్గా 387 పరుగులకు ఆలౌటైంది. అయితే మూడో రోజు తొలి సెషన్లో ఇంగ్లండ్పై భారత్ ఆధిపత్యం చెలాయించింది.కానీ లంచ్ విరామానికి ముందు పంత్ వికెట్ను కోల్పోవడంతో కథ తారుమారైంది. అనవసరంగా రనౌట్ అయ్యి ఇంగ్లండ్కు తన వికెట్ను సమర్పించుకున్నాడు. కేఎల్ రాహుల్, పంత్ మధ్య సమన్వయలోపం వల్ల భారత్ వికెట్ కోల్పోవల్సి వచ్చింది.అయితే లేని పరుగు కోసం పంత్ ప్రయత్నించి రనౌటయ్యాడు అని చాలా మంది విమర్శించారు. కానీ ఈ పూర్తి బాధ్యతను రాహుల్ తీసుకున్నాడు. లంచ్ బ్రేక్కు ముందు సెంచరీ సాధించాలనే తన ఆత్రుత అనవసర రనౌట్కు అవుట్కు దారితీసిందని వెల్లడించాడు."ఈ మ్యాచ్లో మా ఇద్దరి మధ్య చాలా సంభాషణలు జరిగాయి. వీలైతే లంచ్ విరామానికి ముందే సెంచరీ సాధిస్తానని నేను పంత్తో చెప్పాను. బషీర్ లంచ్ బ్రేక్కు ముందు చివరి ఓవర్ వేయడంతో సెంచరీ చేయడానికి మంచి అవకాశం భావించాను.అందుకే పంత్ నాకు సింగిల్ తీసి స్ట్రైక్ ఇవ్వాలని ప్రయత్నించాడు. కానీ దురదృష్టవ శాత్తూ రనౌట్ అయ్యాడు. అయితే ఆ ఓవర్లో తొలి బంతికి బౌండరీ బాదే అవకాశముండేది. కానీ నేను మిస్ చేసుకున్నాను. ఆ బంతికి కేవలం సింగిల్ మాత్రమే లభించింది. దీంతో పంత్ మళ్లీ నన్ను స్ట్రైక్లోకి తీసుకురావాలనకున్నాడు. అందుకే క్విక్ సింగిల్ కోసం ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో అతడు రనౌట్ అవ్వాల్సి వచ్చింది. ఇది మా ఇద్దరికీ నిరాశ కలిగించింది. కానీ ఏ బ్యాటర్ కూడా ఈ విధంగా ఔట్ అవ్వాలని అనుకోరు. ఏదేమైనా ఆ రనౌట్ మా మూమెంటమ్ను దెబ్బతీసింది. ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఇంగ్లండ్ తిరిగి గేమ్లోకి వచ్చింది"అని రాహుల్ మూడో రోజు ఆట అనంతరం విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు. ఆ తర్వాత షోయబ్ బషీర్ బౌలింగ్లోనే రాహుల్ 177 బంతుల్లో సరిగ్గా 100 పరుగులు చేసిఔటయ్యాడు. ఈ కర్ణాటక ఆటగాడు రిషబ్ పంత్తో కలిసి నాలగో వికెట్కు 140 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్ గడ్డపై రాహుల్ సూపర్ సెంచరీ.. వీరేంద్ర సెహ్వాగ్ రికార్డు బ్రేక్ -
'అంత తొందర ఎందుకు పంత్.. రూట్ను చూసి నేర్చుకో'
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ అద్బుతమైన హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఎడమ చేతి వేలికి గాయమైనప్పటికీ బ్యాటింగ్కు వచ్చి జట్టును ఆదుకున్నాడు. కేఎల్ రాహుల్తో కలిసి నాలుగో వికెట్కు 141 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఓవరాల్గా 112 బంతుల్లో 8 ఫోర్లు, రెండు సిక్సర్లతో 74 పరుగులు చేసి అవుటయ్యాడు. మంచి టచ్లో కన్పించిన రిషబ్ దురదృష్టవశాత్తూ రనౌట్ రూపంలో పెవిలియన్కు చేరాడు. అవసరంలేని రన్కు పరిగెత్తి తన వికెట్ను పంత్ కోల్పోయాడు. ఈ క్రమంలో పంత్ను టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే విమర్శించారు. లంచ్ విరామానికి ముందు పంత్ అనవసరంగా తన వికెట్ను సమర్పించుకున్నాడని కుంబ్లే మండిపడ్డాడు."రిషబ్ పంత్ అనవసరంగా ఔటయ్యాడు. అస్సలు అక్కడ పరుగు వచ్చే ఛాన్స్ లేదు. పంత్ మొదట పరుగుకు పిలుపిచ్చి, వెంటనే తన మనసు మార్చుకున్నాడు. కానీ పంత్ పిలుపుతో కేఎల్ రాహుల్ వెంటనే నాన్ స్ట్రైక్ నుంచి రన్ కోసం పరిగెత్తాడు.దీంతో ప్రారంభంలో పంత్ కాస్త సంకోంచి పరిగెత్తడంతో రనౌట్ అవ్వాల్సి వచ్చింది. నిజంగా ఇది అనవసరం. ఎందుకంటే మరో మూడు బంతులు ఆడి ఉంటే, లంచ్ బ్రేక్కు వెళ్లిపోయేవారు. ఆ తర్వాత తమ ప్రణాళికలను అమలు చేసి ఉంటే సరిపోయిండేది.అంతకుముందు జో రూట్ 99 పరుగుల వద్ద ఉండగా ఆట ముగిసింది. తన సెంచరీ కోసం అతడు ఒక రాత్రి వేచి ఉండాల్సి వచ్చింది. కానీ అతడు ఎక్కడ కూడా తొందరపడి ఆడలేదు. పోప్, స్టోక్స్తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అదే వారు భారీ స్కోర్ సాధించడంలో సహాయపడింది" అని జియో హాట్స్టార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుంబ్లే పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా -
చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ దుమ్ములేపుతున్నాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో పంత్ అద్బుతమైన నాక్ ఆడాడు. ఓవైపు చేతి వేలి గాయంతో పోరాడుతూనే కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్లో 112 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, 2 సిక్స్ల సాయంతో 74 పరుగులు చేశాడు. ఈ క్రమంలో పంత్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.పంత్ సాధించిన రికార్డులు ఇవే..👉టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్పై అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రిషబ్ పంత్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఇంగ్లండ్పై 15 టెస్టులు ఆడిన పంత్.. 36 సిక్సర్లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ వివ్ రిచర్డ్స్ పేరిట ఉండేది.రిచర్డ్స్ తన17 ఏళ్ల టెస్ట్ కెరీర్లో ఇంగ్లండ్పై 36 టెస్టులు ఆడి 34 సిక్సర్లు కొట్టాడు. తాజా మ్యాచ్లో రెండు సిక్సర్లు బాదిన పంత్.. విండీస్ గ్రేట్ను ఆధగమించాడు.👉అదేవిధంగా ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో అత్యధిక యాభైకి పైగా స్కోర్లు పర్యాటక వికెట్ కీపర్గా ఎంఎస్ ధోని రికార్డును పంత్ సమం చేశాడు. ఇంగ్లండ్లో ధోని 8 సార్లు ఏభైకి పైగా ఫిప్టీ ప్లస్ స్కోర్లు చేయగా.. పంత్ కూడా సరిగ్గా ఎనిమిది సార్లు యాభైకి పైగా స్కోర్లు సాధించాడు. మరో ఫిప్టీ ప్లస్ స్కోర్ సాధిస్తే ధోనిని ఆధిగమిస్తాడు.ఇంగ్లండ్పై టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్లు వీరే35 రిషబ్ పంత్34 వివ్ రిచర్డ్స్30 టిమ్ సౌతీ27 యశస్వి జైస్వాల్26 శుభమన్ గిల్భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 81 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. భారత్ ఇంకా ఇంగ్లండ్ కంటే 96 పరుగుల వెనకంజలో ఉంది. ప్రస్తుతం క్రీజులో రవీంద్ర జడేజా(31), నితీశ్ కుమార్(13) ఉన్నారు. -
ఓ వైపు గాయం.. అయినా విధ్వంసకర ఇన్నింగ్స్! శెభాష్ రిషబ్
ఓ వైపు తీవ్రమైన గాయం.. అయినా నేను ఉన్నా అంటూ బ్యాట్ పట్టుకుని మైదానంలోకి వచ్చాడు. అతడికి తన గాయం కంటే జట్టు గెలవడమే ముఖ్యం. తన విరోచిత పోరాటంతో కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్నాడు. గాయంతో పోరాడుతూనే జట్టు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. చేతి వేలి నొప్పితో బాధపడుతూనే ప్రత్యర్ధి బౌలర్లను ఊతికారేశాడు. అతడే టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో పంత్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్లో 112 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, 2 సిక్స్ల సాయంతో 74 పరుగులు చేశాడు. ఓ దశలో సునాయసంగా సెంచరీ మార్క్ను అందుకునేటట్లు కన్పించిన పంత్.. దురదృష్టవశాత్తూ రనౌట్ రూపంలో పెవిలియన్కు చేరాడు. గాయాన్ని లెక్కచేయని పంత్..తొలి రోజు ఆట సందర్బంగా పంత్ ఎడమ చేతి వేలికి గాయమైంది. దీంతో అతడు మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు. రెండో రోజు ఆటలో కూడా పంత్ ఫీల్డింగ్కు రాలేదు. అతడి స్ధానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఆ తర్వాత ప్రాక్టీస్లో కూడా పంత్ చేతి వేలి నొప్పితో బాధపడుతూ కన్పించాడు. దీంతో అతడు బ్యాటింగ్కు వస్తాడా రాడా? అన్న సందేహం అందరిలోనూ నెలకొంది. కానీ పంత్ మాత్రం తన గాయాన్ని సైతం లెక్క చేయకుండా బ్యాటింగ్కు వచ్చాడు. అప్పటికే జైశ్వాల్, గిల్ వికెట్లను కోల్పోయిన భారత జట్టును పంత్ ఆదుకున్నాడు. కేఎల్ రాహుల్తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. రాహల్లో కలిసి నాలుగో వికెట్కు 141 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కానీ అద్బుతంగా ఆడుతున్న సమయంలో రనౌట్ రూపంలో పంత్ మైదానం వీడాల్సి వచ్చింది. ఈ క్రమంలో పంత్పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. శెభాష్ రిషబ్ అంటూ కొనియాడుతున్నారు.సెంచరీకి చేరువలో రాహుల్..మూడో రోజు లంచ్ విరామ సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. భారత్ ఇంకా ఇంగ్లండ్ కంటే 139 పరుగుల వెనకంజలో ఉంది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్(98) సెంచరీకి చేరువలో ఉన్నాడు. -
లార్డ్స్ టెస్టులో టీమిండియాకు గుడ్ న్యూస్..
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. చేతి వేలి గాయం కారణంగా ఫీల్డింగ్కు దూరమైన వికెట్ కీపర్ రిషబ్ పంత్.. తిరిగి బ్యాటింగ్కు రానున్నాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చేందుకు పంత్ ప్యాడ్స్ కట్టుకుని సిద్దంగా ఉన్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.కాగా తొలి రోజు ఆట సందర్భంగా బుమ్రా బౌలింగ్లో పంత్ చూపుడు వేలికి గాయమైంది. దీంతో ఆట మధ్యలోనే మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు. రెండో రోజు ఆటలో కూడా పంత్ ఫీల్డింగ్ రాలేదు. అతడి స్దానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్గా బాధ్యతలు నిర్వర్తించాడు.నెట్స్లో ప్రాక్టీస్ చేసిన పంత్..అయితే రెండో రోజు ఆట ఆరంభానికి ముందు రిషబ్ పంత్.. బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కోటక్, ఫిజియో యోగేష్ పర్మార్ పర్యవేక్షణలో ద్దరు త్రోడౌన్ స్పెషలిస్టులతో కలిసి పంత్ నెట్ ప్రాక్టీస్ చేశాడు. ఈ సందర్బంగా అతడు కాస్త ఆసౌక్యర్యంగా కన్పించాడు.ఇంకా అతడికి ఇంకా పూర్తిగా చేతి వేలి నొప్పి తగ్గనట్లు తెలుస్తోంది. అయినప్పటికి జట్టు అవసరం దృష్ట్యా అతడు బ్యాటింగ్కు రావాలని అతడి నిర్ణయించుకున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కాగా రిషబ్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్లో సెంచరీల మోత మ్రోగించిన పంత్.. రెండో టెస్టులో హాఫ్ సెంచరీతో మెరిశాడు. -
ENG VS IND 3rd Test: అదే జరిగితే టీమిండియా 10 మందితోనే బ్యాటింగ్ చేయాలి..!
లార్డ్స్ టెస్ట్ తొలి రోజు ఆటలో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయపడిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 34వ ఓవర్ వేసిన జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో రెండో బంతిని అందుకునే క్రమంలో పంత్ ఎడమ చేతి చూపుడు వేలికి గాయమైంది. బంతిని అందుకున్న తర్వాత పంత్ తీవ్రమైన నొప్పితో విలవిలలాడాడు.ఫిజియో వచ్చి మ్యాజిక్ స్ప్రే చేసినా అతడి నొప్పి తగ్గలేదు. ఈ క్రమంలో పంత్ మైదానాన్ని వీడాడు. అతడి స్ధానంలో సబ్స్టిట్యూట్ వికెట్ కీపర్గా దృవ్ జురెల్ మైదానంలోకి వచ్చాడు. పంత్ గాయంపై బీసీసీఐ ప్రకటన చేసింది. అయితే అందులో గాయం తీవ్రత, మ్యాచ్లో పంత్ కొనసాగింపుపై ఎలాంటి సమాచారం లేదు.రెండో రోజు ఆట ప్రారంభానికి మరి కొద్ది గంటల సమయం మాత్రమే ఉన్నప్పటికీ పంత్ గాయంపై సందిగ్దత వీడలేదు. ఈ నేపథ్యంలో పంత్ మ్యాచ్లో కొనసాగుతాడా లేదా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఒకవేళ పంత్ గాయం కారణంగా మ్యాచ్కు దూరమైతే టీమిండియాకు అది భారీ ఎదురుదెబ్బ అవుతుంది.ఎందుకంటే ఐసీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్ మొదలయ్యాక గాయపడిన ఆటగాడికి ప్రత్యామ్నాయంగా ఫీల్డింగ్ లేదా వికెట్కీపింగ్కు మాత్రమే అనుమతి ఉంటుంది. సబ్స్టిట్యూట్గా వచ్చిన ఆటగాడు బ్యాటింగ్ చేయడానికి వీలు ఉండదు. ఈ లెక్కన పంత్ మైదానంలోని తిరిగి రాకపోతే భారత్ 10 మందితోనే బ్యాటింగ్ను కొనసాగించాల్సి ఉంటుంది. భీకర ఫామ్లో ఉన్న పంత్ బ్యాటింగ్కు అందుబాటులో ఉండకపోతే టీమిండియా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఈ సిరీస్లో పంత్ కెరీర్ అత్యుత్తమ ఫామ్లో ఉన్నాడు. తొలి టెస్ట్ రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు సహా ఇప్పటివరకు ఆడిన నాలుగు ఇన్నింగ్స్ల్లో 342 పరుగులు చేసి గిల్ తర్వాత ఈ సిరీస్లో సెకెండ్ హయ్యెస్ట్ రన్ స్కోరర్గా ఉన్నాడు. ఇలాంటి ఫామ్లో ఉన్న పంత్ బ్యాటింగ్కు దిగకపోతే టీమిండియా విజయావకాశాలను తప్పక ప్రభావితం చేస్తుంది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 4 వికెట్ల నష్టానికి 251 పరుగులు (83 ఓవర్లలో) చేసింది. జో రూట్ 99 (191 బంతుల్లో 9 ఫోర్లు), కెప్టెన్ బెన్ స్టోక్స్ 39 పరుగులతో (102 బంతుల్లో 2 ఫోర్లు) క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే 18, బెన్ డకెట్ 23, ఓలీ పోప్ 44, హ్యారీ బ్రూక్ 11 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో నితీశ్ కుమార్ రెడ్డి 2, బుమ్రా, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు. పంత్కు ప్రత్యామ్నాయంగా వచ్చిన జురెల్ జడేజా బౌలింగ్లో ఓ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు.కాగా, ఈ సిరీస్లో ఇంగ్లండ్, భారత్ తలో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్లో ఇంగ్లండ్ గెలవగా.. రెండో టెస్ట్లో భారత్ భారీ విజయం సాధించింది. -
లార్డ్స్ టెస్టులో టీమిండియాకు భారీ షాక్
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియాకు ఊహించని ఎదురదెబ్బ తగిలింది. తొలి రోజు ఆట సందర్భంగా భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయపడ్డాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 34వ ఓవర్ వేసిన జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో రెండో బంతిని అందుకునే క్రమంలో పంత్ ఎడమ చేతి వేలికి గాయమైంది.బంతిని తీసుకున్నాక పంత్ తీవ్రమైన నొప్పితో విల్లవిల్లాడు. అంతకుముందు ఓవర్ కూడా పంత్ కాస్త ఆసౌకర్యంగా కన్పించాడు. ఫిజియో వచ్చి మ్యాజిక్ స్ప్రే చేసినప్పటికి అతడు నొప్పి తగ్గలేదు. ఈ క్రమంలోనే పంత్ ఫిజియో సాయంతో మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు. అతడి స్ధానంలో సబ్స్ట్యూట్ వికెట్ కీపర్గా ధ్రువ్ జురెల్ మైదానంలోకి వచ్చాడు. అయితే పంత్ గాయం తీవ్రమైనది కాకుడదని భారత అభిమానులు కోరుకుంటున్నారు. పంత్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్లో సెంచరీల మోత మ్రోగించిన పంత్.. రెండో టెస్టులో హాఫ్ సెంచరీతో మెరిశాడు.41 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో రెండు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. క్రీజులో జో రూట్(37), పోప్(24) ఉన్నారు. ఓపెనర్లు జాక్ క్రాలీ(18), బెన్ డకెట్(23)ను నితీశ్ కుమార్ రెడ్డి పెవిలియన్కు పంపాడు.తుదిజట్లుభారత్శుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్దీప్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి.ఇంగ్లండ్బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్.చదవండి: IND vs ENG: టీమిండియా చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
రిషబ్ పంత్ ఏమి గిల్క్రిస్ట్ కాదు.. దయచేసి ఇక ఆపేయండి: అశ్విన్
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ దమ్ములేపుతున్నాడు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్లలోనూ శతక్కొట్టిన రిషబ్.. రెండో టెస్టులో అద్భుతమైన హాఫ్ సెంచరీతో మెరిశాడు.దీంతో చాలా మంది పంత్ను ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ ఆడమ్ గిల్క్రిస్ట్తో పోలుస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గిల్క్రిస్ట్తో పంత్ను పోల్చడం మానేయాలని అభిమానులను అశ్విన్ కోరాడు. చాలా ఆంశాల్లో ఆసీస్ దిగ్గజం కంటే పంత్ మెరుగ్గా ఉన్నాడని అశ్విన్ అభిప్రాయపడ్డాడు."రిషబ్ పంత్ ఒక అద్బుతమైన ఆటగాడు. అతడికి ఉన్న స్పెషల్ స్కిల్స్ మరొకరు వద్ద లేవు. చాలా మంది అతన్ని ఆడమ్ గిల్క్రిస్ట్తో పోలుస్తున్నారు. దయచేసి ఇక పై పంత్ను గిల్క్రిస్ట్తో పోల్చొద్దు. గిల్ క్రిస్ట్ కు అంత మంచి డిఫెన్స్ ఆడే టెక్నిక్ లేదు.అదే రిషబ్ పంత్కు డిఫెన్స్ ఆడడంలో అత్యుత్తమ స్కిల్స్ ఉన్నాయి. అయితే నేనేమి గిల్క్రిస్ట్ను తక్కువ చేసి మాట్లాడడం లేదు. వరల్డ్ క్రికెట్లో అతడికంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. విధ్వంసానికి మారు పేరు అతడు. గిల్లీ ఒక అద్బుతమైన వికెట్ కీపర్. ఏడో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చి తన జట్టుకు ఎన్నో చారిత్రత్మక విజయాలు అందించాడు. అయితే రిషబ్కు గిల్క్రిస్ట్కు మాత్రం చాలా తేడాలు ఉన్నాయి. అతడి ఏడో స్దానంలో బ్యాటింగ్కు వస్తే.. పంత్ ఐదవ స్దానంలో బ్యాటింగ్ చేస్తున్నాడు. పంత్ చేసే పనులు మరో బ్యాటర్ చేయలేడు" అని తన యూట్యూబ్ ఛానల్లో అశ్విన్ పేర్కొన్నాడు. కాగా భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు గురువారం నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభం కానుంది.చదవండి: ICC Test Rankings: వరల్డ్ నెం1 బ్యాటర్గా ఇంగ్లండ్ ఆటగాడు.. టాప్-10లోకి గిల్ -
ENG VS IND 3rd Test: చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో రిషబ్ పంత్
టీమిండియా డాషింగ్ బ్యాటర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. రేపటి నుంచి ఇంగ్లండ్తో ప్రారంభమయ్యే మూడో టెస్ట్లో మరో 5 సిక్సర్లు బాదితే టెస్ట్ల్లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా అవతరిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. వీరూ 103 టెస్ట్ల్లో 90 సిక్సర్లు బాదాడు. వీరూ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. హిట్మ్యాన్ 67 టెస్ట్ల్లో 88 సిక్సర్లు కొట్టాడు. పంత్ విషయానికొస్తే.. ఇతగాడు కేవలం 45 మ్యాచ్ల్లోనే 86 సిక్సర్లు బాది చరిత్ర సృష్టించేందుకు మరో 5 సిక్సర్ల దూరంలో ఉన్నాడు. పంత్ ప్రస్తుత ఫామ్ను బట్టి చూస్తే రేపటి నుంచి ప్రారంభమయ్యే టెస్ట్లో ఈ రికార్డు సాధించడం ఖాయంగా కనినిస్తుంది.ఓవరాల్గా చూస్తే టెస్ట్ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో పంత్ 12వ స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్తో మూడో టెస్ట్లో పంత్ 5 సిక్సర్లు కొడితే భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డుతో పాటు టెస్ట్ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ఏడో స్థానానికి ఎగబాకుతాడు. టెస్ట్ల్లో అత్యధిక సిక్సర్ల రికార్డు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ పేరిట ఉంది. స్టోక్స్ 113 మ్యాచ్ల్లో 133 సిక్సర్లు బాదాడు. స్టోక్స్ తర్వాతి స్థానాల్లో బ్రెండన్ మెక్కల్లమ్ (107), గిల్క్రిస్ట్ (100), టిమ్ సౌథీ (98), గేల్ (98), కల్లిస్ (97), సెహ్వాగ్ (91), ఏంజెలో మాథ్యూస్ (90), రోహిత్ శర్మ (88), లారా (88) ఉన్నారు (టాప్-10లో).కొద్ది రోజుల కిందట మరో భారీ సిక్సర్ల రికార్డు బద్దలు కొద్ది రోజుల కిందట జరిగిన ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో పంత్ మరో భారీ సిక్సర్ల రికార్డు సాధించాడు. విదేశీ గడ్డపై టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్గా అవతరించాడు. ఈ క్రమంలో బెన్ స్టోక్స్ పేరిట ఉన్న ఆల్టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. పంత్ ఇంగ్లండ్లో (టెస్ట్ల్లో) 23 సిక్సర్లు బాదగా.. స్టోక్స్ సౌతాఫ్రికాలో 21 సిక్సర్లు కొట్టాడు. భీకర ఫామ్లో పంత్ఇంగ్లండ్తో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో పంత్ రెండు ఇన్నింగ్స్లో శతకాలతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్లో 178 బంతుల్లో 12 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్లో 140 బంతుల్లో 15 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 118 పరుగులు సాధించాడు.ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో పంత్ తొలి ఇన్నింగ్స్లో తక్కువ స్కోర్కే (25) ఔటైనా, రెండో ఇన్నింగ్స్లో తనదైన శైలిలో మెరుపు అర్ద సెంచరీ (65) చేశాడు. రేపటి నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభమయ్యే మూడో టెస్ట్లో భారీ అంచనాలు ఉన్నాయి. పంత్ మరోసారి చెలరేగాలని అంతా ఆశిస్తున్నారు. ఈ సిరీస్లో భారత్, ఇంగ్లండ్ తలో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. తొలి టెస్ట్లో ఇంగ్లండ్ గెలవగా.. రెండో టెస్ట్లో భారత్ భారీ విజయం సాధించింది. -
పంత్పై శుబ్మన్ గిల్ సీరియస్.. ఎందుకంటే?
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తుది అంకానికి చేరుకుంది. ఈ మ్యాచ్లో పర్యాటక టీమిండియా విజయానికి 7 వికెట్ల దూరంలో నిలవగా.. ఆతిథ్య ఇంగ్లండ్ తమ గెలుపునకు 536 పరుగుల దూరంలో ఉంది. 608 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన స్టోక్స్ సేన నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది.క్రీజులో ఓలీ పోప్(24), హ్యారీ బ్రూక్(15) ఉన్నారు. ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్ను ఆలౌట్ చేసి ఎడ్జ్బాస్టన్లో తొలి టెస్టు విజయాన్ని అందుకోవాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది. ఇక ఇది ఇలా ఉండగా.. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ పంత్పై కెప్టెన్ శుబ్మన్ గిల్ సీరియస్ అయ్యాడు. డీఆర్ఎస్ విషయంలో కెప్టెన్-వైస్ కెప్టెన్ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది.అసలేమి జరిగిందంటే?సెకెండ్ ఇన్నింగ్స్లో భారత పేసర్లు ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్ తమ అద్బుత బౌలింగ్తో ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ, బెన్డకెట్ను ఆరంభంలోనే పెవిలియన్కు పంపారు. ఈ క్రమంలో గిల్ మూడో పేసర్ ప్రసిద్ద్ కృష్ణను ఎటాక్లో తీసుకొచ్చాడు.పదో ఓవర్ వేసిన ప్రసిద్ద్ కృష్ణ.. మూడో బంతిని జో రూట్కు ఫుల్లర్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని డిఫెన్స్ ఆడేందుకు రూట్ ప్రయత్నించాడు. కానీ బంతి మిస్ అయ్యి అతడి ప్యాడ్కు తాకింది. దీంతో ఎల్బీకి అప్పీల్ చేయగా.. అంపైర్ నాటౌట్ అంటూ తల ఊపాడు.అయితే బంతి లెగ్ సైడ్కు వెళ్తున్నట్లగా అన్పించడంతో గిల్ రివ్యూ తీసుకోవడానికి ఆసక్తి చూపలేదు. కానీ రిషబ్ పంత్ మాత్రం పట్టుపట్టి మరి రివ్యూకి వెళ్లమని బలవంతం చేశాడు. దీంతో గిల్ ఆఖరి సెకెన్లలో రివ్యూ తీసుకునేందుకు సిగ్నల్ చేశాడు.రిప్లేలో బంతి స్టంప్స్ మిస్స్ అయ్యి డౌన్ది లెగ్ వెళ్తున్నట్లు తేలింది. దీంతో శుబ్మన్ కోపంతో పంత్ వద్దకు వెళ్లాడు. పంత్ వెంటనే తను అనుకున్నది కెప్టెన్కు వివరించాడు. కానీ గిల్ మాత్రం కోపంగానే పంత్ వైపు చూస్తూ తన ఫీల్డింగ్ స్ధానానికి చేరుకున్నాడు. అయితే ఆ తర్వాతే ఓవర్లోనే రూట్ను ఆకాష్దీప్ క్లీన్ బౌల్డ్ చేశాడు.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన టీమిండియా.. టెస్టు క్రికెట్ హిస్టరీలోనే -
అదరగొట్టిన టీమిండియా.. ఇంగ్లండ్కు కొండంత లక్ష్యం
రెండో టెస్టులో టీమిండియా ఇంగ్లండ్కు భారీ లక్ష్యం విధించింది. ఆతిథ్య జట్టుపై ఆద్యంతం పైచేయి సాధించిన భారత్.. ఏకంగా 608 పరుగుల టార్గెట్ ఇచ్చింది. టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Torphy)లో భాగంగా బర్మింగ్హామ్ వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు బుధవారం మొదలైంది.587 పరుగులుఈ క్రమంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 587 పరుగులు స్కోరు చేసింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) భారీ ద్విశతకం (269) బాదగా.. రవీంద్ర జడేజా (89), యశస్వి జైస్వాల్ (87) అద్భుత ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నారు. వీరితో పాటు వాషింగ్టన్ సుందర్ (42) కూడా రాణించాడు.ఇక ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ అత్యధికంగా మూడు వికెట్లు తీయగా.. క్రిస్ వోక్స్, జోష్ టంగ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు. మిగిలిన వారిలో కెప్టెన్ బెన్ స్టోక్స్, బ్రైడన్ కార్స్ తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్.. మూడో రోజు ఆటలో భాగంగా 407 పరుగులకు ఆలౌట్ అయింది.హ్యారీ బ్రూక్ (158), జేమీ స్మిత్ (184 నాటౌట్) అద్భుత శతకాలతో 303 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో.. ఇంగ్లండ్ మేర స్కోరు చేయగలిగింది. భారత బౌలర్లలో పేసర్లు మహ్మద్ సిరాజ్ ఆరు వికెట్లతో చెలరేగగా.. ఆకాశ్ దీప్ నాలుగు వికెట్లు దక్కించుకున్నాడు. ఇక తొలి ఇన్నింగ్స్తో కలుపుకొని 180 పరుగుల ఆధిక్యం సంపాదించిన భారత్.. ఓవర్ నైట్ స్కోరు 64/1 (13)తో శనివారం నాటి నాలుగో రోజు ఆట మొదలుపెట్టింది.మరోసారి గిల్ దంచేశాడుఆట మొదలైన కాసేపటికే కరుణ్ నాయర్ (26) పెవిలియన్ చేరగా.. ఓపెనర్ కేఎల్ రాహుల్ (55) అర్ధ శతకంతో రాణించాడు. ఇక గిల్ మరోసారి భారీ శతకం (161)తో దుమ్ములేపగా.. వికెట కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (65), ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (69 నాటౌట్) అర్ధ శతకాలతో అదరగొట్టారు. నితీశ్ రెడ్డి (1) మరోసారి నిరాశపరచగా.. వాషింగ్టన్ సుందర్ జడేజాతో కలిసి 12 పరుగులతో అజేయంగా నిలిచాడు.గిల్ భారీ శతకం పూర్తైన కాసేపటికి భారత్ తమ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 83 ఓవర్ల ఆటలో ఆరు వికెట్ల నష్టానికి 427 పరుగుల వద్ద డిక్లేర్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్లో దక్కిన 180 పరుగులకు ఈ మేర (427) స్కోరు జతచేసి... ప్రత్యర్థికి భారీ లక్ష్యం విధించింది. ఈ క్రమంలో శనివారం మూడో సెషన్ ఆఖర్లో లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్.. 108 ఓవర్లలో పనిపూర్తి చేయాలి. ఈ నేపథ్యంలో ఆదివారం నాటి ఆఖరి రోజు ఆట ఆసక్తికరంగా మారింది. ఇంగ్లండ్ను టీమిండియా ఆలౌట్ చేస్తుందా? లేదంటే.. డ్రా చేసుకునేందుకు స్టోక్స్ బృందం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా? అన్న విషయం తేలుతుంది.చదవండి: వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు.. మరో ఆటగాడి శతకం.. భారత్ భారీ స్కోరు -
శెభాష్!.. మరోసారి శతక్కొట్టిన గిల్.. అరుదైన రికార్డు
టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) తన కెరీర్లోనే అద్భుత ఫామ్లో ఉన్నాడు. ఇంగ్లండ్ గడ్డ మీద వరుస శతకాలతో దుమ్ములేపుతున్నాడు. ఆతిథ్య జట్టుతో లీడ్స్ వేదికగా తొలి టెస్టులో గిల్ భారీ శతకం (147) బాదిన విషయం తెలిసిందే.అనంతరం బర్మింగ్హామ్లో బుధవారం మొదలైన రెండో టెస్టులోనూ శతక్కొట్టిన శుబ్మన్ గిల్.. దానిని డబుల్ సెంచరీగా మార్చాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 387 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 30 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 269 పరుగులు సాధించాడు. అయితే, కెరీర్లో సాధించిన తొలి ద్విశతకాన్ని ట్రిపుల్ సెంచరీగా మార్చడంలో గిల్ విఫలమయ్యాడు.జోష్ టంగ్ బౌలింగ్లో ఓలీ పోప్నకు క్యాచ్ ఇచ్చి గిల్ పెవిలియన్ చేరడంతో.. అతడి భారీ డబుల్ సెంచరీ ఇన్నింగ్స్కు తెరపడింది. ఇక శనివారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా గిల్ మరోసారి బ్యాట్ ఝులిపించాడు. యాభై ఏడు బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న కెప్టెన్ సాబ్.. 129 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో వంద పరుగుల మార్కు అందుకున్నాడు.భారీ ఆధిక్యంలో భారత్ఇదిలా ఉంటే.. 64/1 ఓవర్నైట్ స్కోరుతో శనివారం నాటి నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన భారత్.. కాసేపటికే వన్డౌన్ బ్యాటర్ కరుణ్ నాయర్ (26) వికెట్ కోల్పోయింది. అయితే, ఓపెనింగ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అర్ధ శతకం(55)తో రాణించగా.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మెరుపు హాఫ్ సెంచరీ (58 బంతుల్లో 65) సాధించాడు. ఇక గిల్ మరోసారి శతక్కొట్టగా.. 68 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. గిల్ సెంచరీ పూర్తి చేసుకునేసరికి, టీ బ్రేక్ సమయానికి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం (180)తో కలుపుకొని భారత్.. 484 పరుగుల భారీ లీడ్ సాధించింది.భారత రెండో బ్యాటర్గా..కాగా టెస్టు మ్యాచ్లో ఓ ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ.. మరో ఇన్నింగ్స్లో సెంచరీ బాదిన భారత రెండో బ్యాటర్గా గిల్ చరిత్రకెక్కాడు. అతడి కంటే ముందు భారత మాజీ కెప్టెన్ సునిల్ గావస్కర్ 1971లొ పోర్ట్ ఆఫ్ స్పెయిన్వేదికగా వెస్టిండీస్పై ఈ ఘనత సాధించాడు. ఇక ఓవరాల్గా ఈ జాబితాలో గిల్ తొమ్మిదో ఆటగాడు.టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ రెండో టెస్టుషెడ్యూల్: బుధవారం (జూలై 2)- ఆదివారం (జూలై 6)వేదిక: ఎడ్జ్బాస్టన్, బర్మింగ్హామ్టాస్: ఇంగ్లండ్- తొలుత బౌలింగ్టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 587 ఆలౌట్ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 407 ఆలౌట్ టీమిండియాకు తొలి ఇన్నింగ్స్లో 180 పరుగుల ఆధిక్యం.చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర శతకం.. మరోసారి సునామీ ఇన్నింగ్స్ -
వాటే ఫామ్!.. ధనాధన్ దంచికొట్టి.. గిల్, పంత్ హాఫ్ సెంచరీలు
టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇంగ్లండ్ (Ind vs Eng)తో తొలి టెస్టులో శతకం (147) బాదిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఏకంగా డబుల్ సెంచరీతో చెలరేగాడు. మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో విరాట్ కోహ్లి (Virat Kohli) లేని లోటు పూడుస్తూ.. ఇంగ్లండ్ గడ్డ మీద అతడి రికార్డునే బద్దలు కొట్టాడు.భారీ ద్విశతకం (269)తో ఆకట్టుకుని.. ఎడ్జ్బాస్టన్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన టీమిండియా క్రికెటర్, కెప్టెన్గా నిలిచాడు. ఇక రెండో ఇన్నింగ్స్లోనూ శుబ్మన్ గిల్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. యాభై ఏడు బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. జోష్ టంగ్ బౌలింగ్లో ఫోర్ బాది 51 పరుగులు సాధించాడు.𝐅𝐥𝐮𝐞𝐧𝐭. 𝐅𝐞𝐚𝐫𝐥𝐞𝐬𝐬. 𝐅𝐨𝐜𝐮𝐬𝐞𝐝. 🔥Leading with intent, #ShubmanGill crafts a classy fifty, setting the stage for a commanding team effort 🫡#ENGvIND 👉 2nd TEST, Day 4 | LIVE NOW on JioHotstar ➡ https://t.co/2wT1UwEcdi pic.twitter.com/ftaIUA9YIy— Star Sports (@StarSportsIndia) July 5, 2025మరోవైపు.. గిల్కు తోడుగా వైస్ కెప్టెన్ బ్యాటర్ రిషభ్ పంత్ కూడా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 51 బంతుల్లోనే 50 పరుగుల మార్కు అందుకున్నాడు. ఈ క్రమంలో 44 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి మూడు వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసిన టీమిండియా ఆధిక్యం.. 400కు చేరింది.పంత్ అవుటైన తర్వాత స్కోరు ఇలాకాగా ఎడ్జ్బాస్టన్ టెస్టులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 587 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్ అయింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ డబుల్ సెంచరీ (269)తో అదరగొట్టగా.. రవీంద్ర జడేజా (89), యశస్వి జైస్వాల్ (87) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ మూడు వికెట్లు తీయగా.. క్రిస్వోక్స్, జోష్ టంగ్ రెండేసి వికెట్లు కూల్చారు. బ్రైడన్ కార్స్, కెప్టెన్ బెన్స్టోక్స్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఇక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 407 పరుగులకు ఆలౌట్ అయింది. హ్యారీ బ్రూక్ (158), జేమీ స్మిత్ (184 నాటౌట్) శతకాలతో చెలరేగారు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ ఆరు, ఆకాశ్ దీప్ నాలుగు వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్తో కలుపుకొని భారత్కు 180 పరుగుల ఆధిక్యం లభించింది.ఈ క్రమంలో 64/1 ఓవర్నైట్ స్కోరుతో శనివారం నాటి నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన భారత్.. కేఎల్ రాహుల్ (55), రిషభ్ పంత్ (65) అర్ధ శతకాలు.. గిల్ అజేయ హాఫ్ సెంచరీ (ప్రస్తుతానికి 58) కారణంగా 46.2 ఓవర్ల ఆట ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసి.. 416 పరుగుల ఆధిక్యంలో ఉంది. పంత్ 65 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షోయబ్ బషీర్ బౌలింగ్లో డకెట్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర శతకం.. మరోసారి సునామీ ఇన్నింగ్స్ -
చరిత్ర సృష్టించిన పంత్.. ఆల్టైమ్ వరల్డ్ రికార్డు బద్దలు
భారత స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ గడ్డపై ధనాధన్ ఆటతో అలరిస్తున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. రెండో టెస్టు సందర్భంగా ఓ అరుదైన రికార్డు సాధించాడు. విదేశీ గడ్డపై టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్గా అవతరించాడు.ఈ క్రమంలో బెన్ స్టోక్స్ (Ben Stokes) పేరిట ఉన్న ఆల్టైమ్ వరల్డ్ రికార్డు (World Record)ను పంత్ బద్దలు కొట్టాడు. కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లీడ్స్ వేదికగా తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్లోనూ రిషభ్ పంత్ శతకాలతో చెలరేగాడు.వరుసగా రెండు శతకాలుతొలి ఇన్నింగ్స్లో 178 బంతుల్లో 12 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్లో 140 బంతుల్లో 15 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 118 పరుగులు సాధించాడు. అయితే, ఎడ్జ్బాస్టన్ వేదికగా బుధవారం మొదలైన రెండో టెస్టులో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఆరంభంలో విఫలమయ్యాడు.దూకుడుగా ఆడుతూరెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 42 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ బాది 25 పరుగులు చేసిన పంత్.. షోయబ్ బషీర్ బౌలింగ్లో జాక్ క్రాలేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే, రెండో ఇన్నింగ్స్లో మాత్రం తనలోని దూకుడైన ఆటను మరోసారి వెలికితీశాడు. శనివారం నాటి నాలుగో రోజు ఆట భోజన విరామ సమయానికి పంత్ 35 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 41 పరుగులతో అజేయంగా ఉన్నాడు.ఈ క్రమంలోనే పంత్ స్టోక్స్ ప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు. ఇంగ్లండ్లో టెస్టు ఫార్మాట్లో మొత్తంగా 23 సిక్సర్లు పూర్తి చేసుకున్న పంత్.. విదేశీ గడ్డ(ఒకే దేశం)పై అత్యధిక సిక్స్లు నమోదు చేసిన క్రికెటర్గా నిలిచాడు. అంతకుముందు బెన్ స్టోక్స్ సౌతాఫ్రికాలో 21 సిక్సర్లు బాదాడు. ఇక ఇంగ్లండ్పై పంత్ తర్వాత అత్యధిక సిక్స్లు కొట్టిన రెండో పర్యాటక బ్యాటర్గా.. వెస్టిండీస్ దిగ్గజం సర్ వివియన్ రిచర్డ్స్ (16 సిక్సర్లు) నిలిచాడు.విదేశీ గడ్డపై టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్లు🏏రిషభ్ పంత్ (ఇండియా)- ఇంగ్లండ్పై 23 సిక్సర్లు🏏బెన్ స్టోక్స్ (ఇండియా)- సౌతాఫ్రికాపై 21 సిక్సర్లు🏏మాథ్యూ హెడెన్ (ఆస్ట్రేలియా)- టీమిండియాపై 19 సిక్సర్లు🏏వివియన్ రిచర్డ్స్ (వెస్టిండీస్)- ఇంగ్లండ్పై 16 సిక్సర్లు🏏హ్యారీ బ్రూక్ (ఇంగ్లండ్)- న్యూజిలాండ్పై 16 సిక్సర్లు.భారత్ 177/3 @ లంచ్ బ్రేక్ఇక ఓవర్నైట్ స్కోరు 64/1తో శనివారం నాటి ఆట మొదలుపెట్టిన టీమిండియా.. భోజన విరామ సమయానికి 38 ఓవర్ల ఆటలో మూడు వికెట్ల నష్టానికి 177 పరుగులు సాధించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ అర్ధ శతకం (55) చేయగా.. వన్డౌన్ బ్యాటర్ కరుణ్ నాయర్ (26) మరోసారి స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. కెప్టెన్ శుబ్మన్ గిల్ 24, పంత్ 41 పరుగులతో క్రీజులో ఉన్నారు. నాలుగో రోజు లంచ్ బ్రేక్ సమయానికి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం (180) కలుపుకొని భారత జట్టుకు ఇంగ్లండ్పై 357 పరుగుల ఆధిక్యం లభించింది. కాగా తొలి టెస్టులో ఐదు వికెట్ల తేడాతో ఓడిన గిల్ సేన.. ఎడ్జ్బాస్టన్ టెస్టులో గెలిచి సిరీస్ 1-1తో సమం చేయాలని పట్టుదలగా ఉంది.పంత్ 65 పరుగులు చేసి...కాగా 51 బంతుల్లోనే 50 పరుగులు చేసిన పంత్.. 65 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు. షోయబ్ బషీర్ బౌలింగ్లో బెన్ డకెట్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు.చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర శతకం.. ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడిన చిచ్చరపిడుగుIt’s Rishabh’s world and we’re just living in it! 😌#SonySportsNetwork #GroundTumharaJeetHamari #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings pic.twitter.com/d1V9UBz17b— Sony Sports Network (@SonySportsNetwk) July 5, 2025 -
దూసుకుపోతున్న రిషబ్ పంత్
టెస్ట్ ర్యాంకింగ్స్లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ దూసుకుపోతున్నాడు. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్లో ఓ స్థానం మెరుగుపర్చుకొని ఆరో ప్లేస్కు ఎగబాకాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్ట్లో ట్విన్ సెంచరీస్ (రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు) చేసిన పంత్.. గత వారం ర్యాంకింగ్స్లోనే ఓ ర్యాంక్ మెరుగుపర్చుకున్నాడు. తాజాగా మరో ర్యాంక్ మెరుగుపర్చుకొని తన కెరీర్ అత్యుత్తమ ఐదో ర్యాంక్కు అ్యతంత చేరువయ్యాడు.గత వారం ర్యాంకింగ్స్ అనంతరం పంత్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో 800 రేటింగ్ పాయింట్లు సాధించిన తొలి భారత వికెట్కీపర్ బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ వికెట్కీపర్ బ్యాటర్ 800 రేటింగ్ పాయింట్లు సాధించలేదు. టీమిండియా దిగ్గజ వికెట్కీపర్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోనికి కూడా ఇది సాధ్యపడలేదు. ప్రస్తుతం పంత్ 801 రేటింగ్ పాయింట్లు ఖాతాలో కలిగి ఉన్నాడు.ఇంగ్లండ్తో ప్రస్తుతం జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో పంత్ ఇదే జోరును కొనసాగిస్తే.. త్వరలోనే నంబర్ వన్ టెస్ట్ బ్యాటర్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం టాప్ ర్యాంక్లో ఉన్న జో రూట్కు పంత్కు 88 రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం ఉంది. పంత్ నెక్స్ట్ టార్గెట్ స్టీవ్ స్మిత్. స్మిత్ తాజా ర్యాంకింగ్స్లో ఐదో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ హ్యారీ బ్రూక్, న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్, టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ వరుసగా 2 నుంచి 4 స్థానాల్లో ఉన్నారు.ఈ వారం ర్యాంకింగ్స్లో పంత్తో పాటు మరిన్ని చెప్పుకోదగ్గ మార్పులు జరిగాయి. ఆసీస్ ఆటగాడు ట్రవిస్ హెడ్ 3, శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిస్సంక 14, ఆసీస్ ఆల్రౌండర్ బ్యూ వెబ్స్టర్ 11, సౌతాఫ్రికా ఆల్రౌండర్ 17, మరో సౌతాఫ్రికా ఆల్రౌండర్ కార్బిన్ బాష్ 15, వెస్టిండీస్ ప్లేయర్ జస్టిన్ గ్రీవ్స్ 15 స్థానాలు మెరుగుపర్చుకొని 10, 17, 53, 56, 59, 86 స్థానాలకు ఎగబాకారు.బౌలర్ల ర్యాంకింగ్స్లో బుమ్రా, రబాడ, కమిన్స్ టాప్-3లో కొనసాగుతుండగా.. విండీస్ పేసర్ షమార్ జోసఫ్ 14, ముల్దర్ 6, కార్బిన్ బాష్ 45, చివంగ 35 స్థానాలు మెరుగుపర్చుకొని 36, 52, 57, 88 స్థానాలకు ఎగబాకారు. ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. రవీంద్ర జడేజా, మెహిది హసన్, జన్సెన్ మొదటి మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. -
మళ్లీ వేలానికి రిషబ్ పంత్
గత ఐపీఎల్ సీజన్ మెగా వేలంలో రూ. 27 కోట్ల ధర దక్కించుకొని, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా చరిత్ర సృష్టించిన లక్నో సూపర్ జెయింట్స్ సారధి రిషబ్ పంత్ మరోసారి వేలం బరిలోకి దిగనున్నాడు. ఈసారి పంత్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్ వేలంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. జులై 6, 7 తేదీల్లో న్యూఢిల్లీలో జరుగబోయే డీపీఎల్ వేలంలో పంత్ పేరు నమోదు చేసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. పంత్ డీపీఎల్ ఆడేందుకు గతంలో తన ఇష్టాన్ని వ్యక్తం చేశాడు. పంత్ డీపీఎల్ ఎంట్రీ విషయాన్ని డీడీసీఏకు (ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్) చెందిన ఓ కీలక అధికారి బహిర్గతం చేశాడు. పంత్తో పాటు ఐపీఎల్ 2025 సంచలనాలు ప్రియాంశ్ ఆర్య (పంజాబ్ కింగ్స్), దిగ్వేశ్ రాఠీ (లక్నో సూపర్ జెయింట్స్) కూడా డీపీఎల్ వేలంలో పాల్గొననున్నారు. ఈ ముగ్గురితో పాటు మరో ఏడుగురు ఐపీఎల్ స్టార్లు (ఇషాంత్ శర్మ, ఆయుష్ బదోని, హర్షిత్ రాణా, హిమ్మత్ సింగ్, సుయాష్ శర్మ, మయాంక్ యాదవ్, అనూజ్ రావత్) కూడా డీపీఎల్ 2025 వేలం బరిలో ఉండనున్నారు. ప్రియాంశ్ ఆర్య, దిగ్వేశ్ రాఠీ గత డీపీఎల్ సీజన్లో సంచలనాలు సృష్టించి ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ ఇద్దరూ ఐపీఎల్లోనూ ఇరగదీసి తమకు గుర్తింపునిచ్చిన డీపీఎల్ బరిలో మళ్లీ నిలువనున్నారు.కొత్తగా రెండు ఫ్రాంచైజీలుగతేడాదే పురుడుపోసుకున్న డీపీఎల్ రాబోయే ఎడిషన్లో మరో రెండు కొత్త జట్లను పరిచయం చేస్తుంది. తొలి ఎడిషన్లో (2024) ఆరు జట్లతో జరిగిన డీపీఎల్ ఈసారి ఎనిమిది జట్లతో సాగనుంది. కొత్త జట్ల వివరాలను డీడీసీఏ అధ్యక్షుడు రోహన్ జైట్లీ ఇవాళ వెల్లండించారు. ఇందులో ఓ జట్టు పేరు ఔటర్ ఢిల్లీ కాగా.. మరో జట్టు పేరు న్యూఢిల్లీ. ఔటర్ ఢిల్లీని సవిత పెయింట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు రూ.10.6 కోట్లకు కొనుగోలు చేయగా.. న్యూఢిల్లీ ఫ్రాంచైజీని భీమా టోలింగ్ అండ్ ట్రాఫిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు క్రేయాన్ అడ్వర్టైజ్మెంట్ సంస్థలు రూ.9.2 కోట్లకు దక్కించుకున్నాయి.డీపీఎల్ తొలి ఎడిషన్లో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్, ఈస్ట్ ఢిల్లీ రైడర్స్, నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్, పురానీ దిల్లీ 6, సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్జ్, వెస్ట్ ఢిల్లీ లయన్స్ జట్లు పాల్గొన్నాయి. గత ఎడిషన్లో ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ ఛాంపియన్గా నిలిచింది. ఫైనల్లో ఆ జట్టు సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్జ్ను ఓడించి విజేతగా అవతరించింది. గత సీజన్లో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్జ్ ఊహలకందని విధంగా 20 ఓవర్లలో 308 పరుగులు చేసి ఔరా అనిపించింది. ఆ సీజన్లో ఇలాంటి ప్రదర్శనలు ఎన్నో నమోదయ్యాయి. గత సీజన్లో ప్రియాంశ్ ఆర్య రెండు సెంచరీలు నమోదు చేశాడు. ఆయుశ్ బదోని ఓసారి శతక్కొట్టాడు. గత సీజన్ సూపర్ సక్సెస్ కావడంతో ఈ సీజన్పై భారీ అంచనాలు ఉన్నాయి. డీపీఎల్ మహిళల విభాగంలోనూ జరుగుతుంది. -
ఇకపై మళ్లీ ఆడగలనా?
లండన్: భారత వికెట్ కీపర్, బ్యాటర్ రిషభ్ పంత్ ఇప్పుడైతే మైదానంలో సెంచరీలు చేసి... పిచ్పై ఎగిరి గంతులేస్తూ... పల్టీలతో సంబరాలు చేసుకుంటున్నాడు. కానీ... రెండున్నరేళ్ల క్రితమైతే అతను ఇకపై క్రికెట్ ఆడనేమో అన్న కంగారులో మంచంపై ఉండిపోయాడు. 2022లో పంత్ ఘోరమైన ప్రమాదానికి గురయ్యాడు. ఆ ఏడాది డిసెంబర్ 30వ తేదీన ఢిల్లీ నుంచి సొంతూరు రూర్కీకి కారు నడుపుకుంటూ వెళ్తుండగా ఆ కారు అదుపుతప్పి వేగంగా డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ఘోరప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. దాదాపు ప్రాణంమీదికి తెచ్చుకున్నాడు. వెంటనే హాస్పిటల్కు తరలించగా... స్పృహలోకి రాగానే తొలుత క్రికెట్ కెరీర్ గురించే ఆందోళన చెందాడు. తనకు చికిత్స అందిస్తున్న డాక్టర్ దిన్షా పర్దివాలాతో ‘ఇకపై నేను మళ్లీ క్రికెట్ ఆడగలనా?’ అని ప్రశ్నించాడని ఆ డాక్టర్ వెల్లడించాడు. గతేడాది పారిస్ ఒలింపిక్స్లో భారత బృందానికి చీఫ్ మెడికల్ ఆఫీసర్గా వ్యవహరించిన ఈ సీనియర్ డాక్టర్ అప్పటి ప్రమాదం, తదనంతర చికిత్సపై ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన సంగతులివి... బతికి బట్టకట్టడమే గొప్ప ఘోరమైన ఆ ప్రమాదంలో రిషభ్ బతికి బట్టకట్టడమే పెద్ద అదృష్టం. మంచంపై అతన్ని మొదట చూసినప్పుడు... పంత్ కుడికాలు మామూలు స్థితిలోనే లేదు. అక్కడక్కడ విరిగి చాలావరకు జరిగిపోయింది. ఆ కాలి చీలమండకు పెద్ద గాయమే అయ్యింది. ఒళ్లంతా గాయాలే. ప్రమాదంలో చర్మం అంతా గీరుకొనిపోయింది. శరీరభాగాల్లో పెద్దగా రాసుకుపోయింది. మెడ నుంచి మోకాళ్ల వరకైతే పైచర్మమంతా చీరుకుపోయింది. కారు లోపలి నుంచి లాగే ప్రయత్నంలో పగిలిన అద్దాలు అతని వీపును, చర్మాన్ని లోపలిదాకా చీల్చాయి. ఇలాంటి పరిస్థితిలోని ఓ క్షతగాత్రుడు బ్రతకడమే కష్టం. పంత్ చాలా అదృష్టవంతుడు కాబట్టే బ్రతకడం కాదు... ఏకంగా తనకిష్టమైన ఆటను ఆడేస్తున్నాడు 635 రోజులపాటు... వెంటనే ఐసీయూలో చికిత్స, తదనంతరం మోకాలుకు పలుమార్లు ఆపరేషన్లు, రోజుల తరబడి క్రమం తప్పని ఫిజియోథెరపీ చికిత్స అతన్ని బతికించాయి. కానీ ఆడించాలంటే అది చాలదుగా... ఇంకా చేయాలి. అప్పటిదాకా వైద్యులు శ్రమించారు. అక్కడి నుంచి వైద్యులతో కలిసి పంత్ శ్రమించాల్సి వచ్చింది. అలా ఓ వారమో నెలనో కాదు... ఏకంగా 635 రోజులు అంటే దాదాపు రెండేళ్లపాటు సాగిన వైద్యచికిత్స, పునరావాస కార్యక్రమాలతోనే రిషభ్ ఓ పెషెంట్ నుంచి ఎప్పట్లాగే మళ్లీ క్రికెటర్ అయ్యాడు. నిజం చెప్పాలంటే అతని పోరాటం క్రీడాచరిత్రలో నిలిపోయే పాఠమని చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి ఘోరమైన ప్రమాదాల్లో మరణాలే ఎక్కువగా సంభవిస్తాయి. రక్తనాళాలు పని చేయడంవల్లే... ప్రమాదం తీవ్రత వల్ల అతని మోకాలు నుంచి పాదం వరకు జరిగిపోవడంతో అక్కడక్కడ ఎముక స్నాయువులు విరిగాయి. ఇలాంటపుడు కండరాలు, ప్రధాన రక్తనాళాలు కూడా తెగిపోయి రక్తసరఫరా ఆగిపోతుంది. దీంతో కాలు తీసేయాల్సిన పరిస్థితి రావడం సహజం. కానీ అదృష్టమేమిటంటే... ఇంత జరిగినా కూడా అతని రక్తనాళాలేవీ గాయపపడలేదు. తెగలేదు. దీనివల్లే అతని కాలు తీసేయాల్సిన దుస్థితి రాలేదు. కాలు తిరిగి యథాతథ స్థితికి వచ్చేందుకు, నడిచేందుకు, ఇప్పుడైతే ఆడేందుకు పనిచేస్తుందంటే దీనికంతటికి ప్రధాన కారణం బలమైన రక్తనాళాలే! ఇది ఎంతో అదృష్టముంటేగానీ జరగదు. వాళ్ల అమ్మయితే నడుస్తాడా అని విలపించింది రిషభ్ తాను మళ్లీ క్రికెట్ ఆడగలనా అని ప్రశ్నిస్తే... అతడి పరిస్థితిని చూసిన వాళ్ల అమ్మయితే ‘నా కొడుకు అసలు నడవగలడా’ అని విలపించింది. దీంతో అప్పుడు గాయాల తీవ్రత గురించి వివరించాను. మళ్లీ మోకాలు పునర్నిర్మాణానికి ఉన్న అవకాశాల్ని చెప్పాను. ఆ తర్వాతే ఏదైనా ఆశించవచ్చని బదులిచ్చాను. 2023 జనవరి 6న నిష్ణాతులైన ఆర్థోపెడిక్ వైద్య బృందం నాలుగు గంటలపాలు తొలి సర్జరీని విజయవంతంగా పూర్తి చేసింది.మూడు చోట్ల ఎముక స్నాయువుల్ని సరిచేసింది. మామూలుగా విరిగిన చోట్ల చికిత్స చేసింది. కొన్నివారాల తర్వాత కూడా అతను సొంతంగా తన పళ్లను బ్రష్ చేసుకోలేకపోయాడు. చేతులకు అయిన గాయాలు, చర్మంలోతుగా అయిన గాట్లతో చేతుల్ని కూడా సాధారణంగా కదిలించలేకపోయాడు. మెల్లమెల్లగా నీళ్లు తాగడంతో మొదలుపెట్టి... తర్వాత తర్వాత అన్ని పనులు అలవాటు చేసుకున్నాడు.హ్యాట్రిక్ మిరాకిల్స్ వల్లే...సర్జరీ, తదనంతరం పరిస్థితిని సమీక్షించిన మీదటే పంత్ తల్లికి అతను నడవగలడనే ధైర్యమిచ్చాం. ఇక అతను మాత్రం ఇంతటి ఘోరమైన ప్రమాదంలో జీవించి ఉండటమే అద్భుతమని, కాలు తిరిగి సాధారణ స్థితిలో నడవడం, పరుగెత్తడం మరో అద్భుతమని చెప్పాను. ఇక క్రికెట్ ఆడటమైతే మూడో మిరాకిల్ అని అతని ధైర్యాన్ని పెంచాను. తను కూడా ఆత్మస్థయిర్యంతో మెలిగాడు. తనకెంతో ఇష్టమైన క్రికెట్ కోసం తిరిగి పునరాగమనం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషిచేశాడు. అందువల్లే బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి తర్వాత మైదానంలోకి వచ్చి యథేచ్ఛగా ఆడగలుగుతున్నాడు. అయితే సెంచరీ చేశాక ఉత్సాహంతో పంత్ మైదానంలో పల్టీలు కొడుతున్నాడు. ఈ విన్యాసాలు చేయకపోతేనే మంచిదని సలహా ఇస్తున్నా. -
వాళ్లంతా డుమ్మా!.. వీళ్లకు సీరియస్ వార్నింగ్.. సిరాజ్ బ్యాటింగ్ ప్రాక్టీస్!
ఇంగ్లండ్తో రెండో టెస్టు నేపథ్యలో టీమిండియా (Ind vs Eng 2nd Test) ప్రాక్టీస్లో తలమునకలైంది. తొలి మ్యాచ్లో చేసిన తప్పిదాలు పునరావృతం చేయకుండా ఉండేందుకు కఠినంగా సాధన చేస్తోంది. ఇందులో భాగంగా స్టార్ పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) బ్యాట్తో నెట్స్లో శ్రమించడం విశేషంగా నిలిచింది.ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)తో పాటు యువ పేస్ బౌలర్ ప్రసిద్ కృష్ణ ట్రెయినింగ్ సెషన్కు గైర్హాజరు కాగా.. సిరాజ్తో ఇతర టెయిలెండర్లు కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్లో మునిగిపోవడం గమనార్హం. టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్తో ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా అక్కడికి వెళ్లిన విషయం తెలిసిందే.లోయర్ ఆర్డర్ కూడా దారుణంగా విఫలంఈ క్రమంలో లీడ్స్ వేదికగా తొలి టెస్టు జరుగగా.. గిల్ సేన ఐదు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. బౌలర్లు, ఫీల్డర్లు తేలిపోవడం ఇందుకు ప్రధాన కారణం. అయితే, లోయర్ ఆర్డర్ కూడా దారుణంగా విఫలం కావడం ప్రభావం చూపింది. రెండు ఇన్నింగ్స్లో కలిపి టెయిలెండర్లంతా కలిపి కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే చేయడం గమనార్హం.అదే సమయంలో ఇంగ్లండ్ లోయర్ ఆర్డర్ ఉత్తమంగా రాణించి జట్టు విజయంలో భాగమైంది. ఈ నేపథ్యంలో భారత టెయిలెండర్లపై విమర్శలు వచ్చాయి. ఇలాంటి తరుణంలో సిరాజ్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సీరియస్ వార్నింగ్.. సిరాజ్ బ్యాటింగ్ ప్రాక్టీస్!బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ నిర్దేశకత్వంలో సిరాజ్ డిఫెన్సివ్ షాట్లు ఎక్కువగా ప్రాక్టీస్ చేశాడు. షార్ట్ బంతులు ఎదుర్కొన్న అతడు.. అవుట్ సైడ్ ఆఫ్ దిశగా వెళ్తున్న బంతుల్ని వదిలేశాడు. ఫార్వర్డ్ డిఫెన్స్ కూడా ప్రాక్టీస్ చేశాడు.సాధారణంగా బౌలర్లు.. ఇంతగా బ్యాటింగ్పై దృష్టి పెట్టరు. అయితే, మేనేజ్మెంట్ ఆదేశాల మేరకు టెయిలెండర్లు బ్యాటింగ్పై కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్కు కెప్టెన్ శుబ్మన్ గిల్తో పాటు వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ డుమ్మా కొట్టినట్లు సమాచారం. కాగా గిల్ (147)తొలి టెస్టులో శతకం బాదగా.. వైస్ కెప్టెన్ పంత్ ఏకంగా రెండు సెంచరీలు (134, 118) బాదాడు.ఇక రెండో టెస్టుకు ప్రధాన పేసర్ బుమ్రా దూరం కానున్నాడన్న వార్తల నేపథ్యంలో అర్ష్దీప్ సింగ్ అరంగేట్రం చేయనున్నాడని తెలుస్తోంది. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ సూచనల మేరకు నెట్స్లో అర్ష్ బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం ఇందుకు కారణం. కాగా బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియం భారత్- ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టుకు వేదిక. ఇరుజట్ల మధ్య జూలై 2-6 వరకు మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: ఇప్పట్లో టీమిండియాలో అతడికి చోటు దక్కదు! -
వెళ్లి పక్కన కూర్చొ.. గంభీర్ తో పంత్ ఫైట్
-
నేనే గనుక గంభీర్ అయితే.. అతడిని పక్కకు తీసుకువెళ్లి..: అశ్విన్
ఇంగ్లండ్తో రెండో టెస్టు (Ind vs Eng)కు ముందు భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ టీమిండియాకు కీలక సూచనలు చేశాడు. భారత బ్యాటర్లు వీలైనంత ఎక్కువ సేపు క్రీజులో ఉండాలన్న ఈ స్పిన్ దిగ్గజం.. పరుగులు సాధించడం కంటే కూడా ఈ విషయం మీదే ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించాడు. ఏదేమైనా.. ఐదో రోజు వరకు ఆటను పొడిగించాలని.. ప్రత్యర్థిని ఫీల్డింగ్లో అలసిపోయేలా చేయాలని పేర్కొన్నాడు.అతడిని తీసుకోండిఇక తుదిజట్టులో పెద్దగా మార్పులు అక్కర్లేదన్న అశ్.. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav)ను ఆడిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ఓటమికి భయపడాల్సిన పనిలేదు. వెనువెంటనే జట్టులో మార్పులూ చేయకూడదు.రెండో టెస్టులో గెలిచి సిరీస్ సమం చేయగల సత్తా టీమిండియాకు ఉంది. అయితే, ఇంగ్లండ్ వ్యూహాలను మనం సరిగ్గా అర్థం చేసుకుంటేనే ఇది సాధ్యమవుతుంది. లేదంటే సిరీస్ మన చేజారిపోవడానికి ఎక్కువ సమయం అక్కర్లేదు.ఒత్తిడి పెంచాలిఐదో రోజు వరకు కూడా బ్యాటింగ్ చేయాలి. లేదంటే కథ ముగిసిపోతుంది. ఐదో రోజు ఎంత పెద్ద టార్గెట్ అయినా తాము ఛేదిస్తామని ఇంగ్లండ్ బహిరంగంగానే చెప్పింది. ఈ విషయాన్ని మన బ్యాటింగ్ లైనప్ గుర్తు పెట్టుకోవాలి. ప్రత్యర్థికి తక్కువ సమయంలోనే.. ఎక్కువ లక్ష్యాన్ని ఛేదించేలా ఒత్తిడి పెంచాలి.కనీసం 400- 450 పరుగుల మేర లక్ష్యాన్ని నిర్దేశిస్తేనే ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఇంగ్లండ్లో టెస్టు మ్యాచ్ గెలవగలం. వికెట్ను బట్టి ఎప్పటికప్పుడు ఆటను మార్చుకుంటూ ఉండాలి’’ అశ్విన్ భారత జట్టుకు సూచించాడు.అద్భుతమైన ఆటగాడు అతడుఇక రిషభ్ పంత్ తొలి టెస్టులో రెండు శతకాలు బాదడాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘విరాట్ కోహ్లితో పోల్చగల ఆటగాడు. ఒకవేళ నేనే గనుక హెడ్కోచ్ గౌతం గంభీర్ అయి ఉంటే.. అతడిని పక్కకు తీసుకువెళ్లి.. ‘నువ్వు అద్భుతంగా, అసాధారణ రీతిలో బ్యాటింగ్ చేశావు. ఈసారి సెంచరీని డబుల్ సెంచరీగా మార్చు.130 పరుగులు చేసినపుడు కూడా నువ్వొక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. మన లోయర్ ఆర్డర్ అంతగా బ్యాటింగ్ చేయలేదు కాబట్టి.. నువ్వు వీలైనంత ఎక్కువ సేపు క్రీజులో ఉండాలి’ అని చెప్పేవాడిని. వాహ్.. ఎంతటి అద్భుతమైన ఆటగాడు అతడు’’ అంటూ అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. అదే విధంగా.. శతకం బాదిన తర్వాత ఫ్లిప్ కొట్టి సెలబ్రేట్ చేసుకోవద్దని అశూ ఈ సందర్భంగా పంత్కు సూచించాడు. ఐపీఎల్ ఆడేటపుడు శరీరం ఎక్కువగా అలసిపోదని.. అప్పుడు జంప్ కొట్టినా పర్లేదన్న అశూ.. టెస్టు క్రికెట్ అందుకు భిన్నమని సున్నితంగా హెచ్చరించాడు. కాగా ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా లీడ్స్లో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇరుజట్ల మధ్య బర్మింగ్హామ్లో జూలై 2-6 రెండో టెస్టు జరుగుతుంది. చదవండి: రింకూ సింగ్కు ప్రభుత్వ ఉద్యోగం.. పోస్ట్ ఏమిటంటే?! -
తప్పుడు వ్యక్తులతో స్నేహం.. అప్పుడు అతడు తప్ప ఎవరూ మాట్లాడలేదు: పృథ్వీ షా
భారత క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw) గత రెండేళ్లుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. ఒకప్పుడు.. ఆటలో సచిన్ టెండుల్కర్ వారసుడిగా పేరొందిన ఈ ముంబైకర్ ఇప్పుడు అవకాశాల కోసం పాకులాడాల్సిన పరిస్థితి. క్రమశిక్షణా రాహిత్యం, ఫిట్నెస్ లేమి కారణంగా కెరీర్ పరంగా ఎంతో వెనుకబడిపోయాడు పృథ్వీ.గిల్ ఏకంగా టీమిండియా సారథి అయితే..అండర్-19 జట్టు కెప్టెన్గా భారత్కు ప్రపంచకప్ అందించిన పృథ్వీ షా సారథ్యంలో ఆడిన శుబ్మన్ గిల్ (Shubman Gill) ఏకంగా టీమిండియా కెప్టెన్ అయితే.. ఇతడు మాత్రం దేశవాళీ జట్టులోనూ చోటు దక్కించుకోలేకపోతున్నాడు. ఇక ఐపీఎల్-2025 మెగా వేలంలో ఒక్క ఫ్రాంఛైజీ కూడా కనీస ధర రూ. 75 లక్షల ధరకు పృథ్వీని కొనుగోలు చేయకపోవడం అతడి పరిస్థితికి అద్దం పడుతోంది.ఈ నేపథ్యంలో పృథ్వీ షా ఇటీవలే ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశీ క్రికెట్లో ముంబై జట్టును వీడాలని నిర్ణయించుకోగా.. ముంబై క్రికెట్ అసోసియేషన్ ఇందుకు అంగీకరించింది. ఇక వచ్చే సీజన్లో కొత్త ప్రయాణం మొదలుపెట్టనున్న పృథ్వీ షా తాజాగా న్యూస్24కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని భావాలు పంచుకున్నాడు.పంత్ తప్ప ఎవరూ మాట్లాడలేదు.. సచిన్ సర్కు తెలుసుతాను కెరీర్ పరంగా ఇబ్బందుల్లో ఉన్నపుడు ఒక్క ‘బిగ్ క్రికెటర్’ కూడా తనకు అండగా నిలవలేదని పృథ్వీ చెప్పాడు. టీమిండియా స్టార్ రిషభ్ పంత్ (Rishabh Pant) తప్ప ఎవరూ తనతో కనీసం మాట్లాడలేదని తెలిపాడు. ‘‘సచిన్ టెండుల్కర్కు నాకు సమస్యలు తెలుసు.అర్జున్ టెండుల్కర్తో పాటు నేను క్రికెటర్గా ఎదగడం ఆయన చూశారు. ఓసారి వారి ఇంటికి కూడా వెళ్లాను. అయితే, నేను కెరీర్ పరంగా చిక్కుల్లో ఉన్నపుడు రిషభ్ పంత్ తప్ప ఒక్కరూ పలకరించలేదు’’ అని పృథ్వీ షా వెల్లడించాడు.అదే విధంగా ఆటపై దృష్టి పెట్టలేకపోవడానికి గల కారణాల్ని వివరిస్తూ.. ‘‘నా జీవితంలో ఏం జరుగుతుందో నాకు మాత్రమే తెలుసు. బయటి నుంచి చూసే వాళ్లకు ఇది అర్థం కాకపోవచ్చు. జీవితంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా.తప్పుడు వ్యక్తులతో స్నేహంఅందుకే ఆటకు ఎక్కువ సమయం కేటాయించలేకపోయా. నిజానికి నేను గంటల కొద్దీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసేవాడిని. కనీసం మూడు నాలుగు గంటలు నెట్స్లో గడిపేవాడిని. రోజులో సగం సమయం అక్కడే గడిపేవాడిని. కానీ ఆ తర్వాత ఆట నుంచి నా దృష్టి మరలింది.తర్వాత నాలో పశ్చాత్తాపం మొదలైంది. దేనికి ఎంత సమయం కేటాయించాలో ఓ అవగాహన వచ్చింది. తప్పుడు వ్యక్తులతో స్నేహం చేశాను. క్రికెటర్గా నేను ఉన్నత స్థితిలో ఉన్నపుడు వాళ్లు నా చెంత చేరారు. నన్ను చాలా చోట్లకు తిప్పారు.అప్పుడే నేను దారి తప్పాను. ఒకప్పుడు నెట్స్లో 8 గంటలకు పైగా ప్రాక్టీస్ చేసేవాడిని. ఇప్పుడు ఆ సమయం నాలుగు గంటలకు తగ్గింది’’ అని పృథ్వీ షా తన తప్పులను అంగీకరించాడు. ఇకపై ఆటపైనే దృష్టి కేంద్రీకరిస్తానని వెల్లడించాడు. కాగా వచ్చే డొమెస్టిక్ సీజన్లో పృథ్వీ మహారాష్ట్ర జట్టుకు ఆడే అవకాశం ఉంది.చదవండి: క్రికెట్ టీమ్ను కొనుగోలు చేసిన సల్మాన్ ఖాన్ -
అన్ లక్కీ పంత్.. ప్రతిసారి ఇంతే..!
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ క్రికెట్ చరిత్రలో మోస్ట్ అన్ లక్కీ బ్యాటర్గా మారిపోతున్నాడు. ఫార్మాట్ ఏదైనా ఇతగాడు సెంచరీ చేశాడంటే అతని జట్టు గెలవడం లేదు. తాజాగా భారత్, ఇంగ్లండ్ మధ్య లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ ఇందుకు ఉదాహరణ. ఈ మ్యాచ్లో పంత్ రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేసినా ఇండియా గెలవలేదు. దీనికి ముందు ఐపీఎల్-2025లోనూ ఇలాగే జరిగింది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో పంత్ అద్బుత సెంచరీ చేసినా, ఆ మ్యాచ్లోనూ అతని జట్టు (లక్నో) గెలవలేదు.టెస్ట్ క్రికెట్లో, ప్రత్యేకించి విదేశాల్లో పంత్ సెంచరీల బ్యాడ్ లక్ ఇప్పుడు మొదలైంది కాదు. 2018 నుంచి పంత్ విదేశాల్లో 6 టెస్ట్ సెంచరీలు చేయగా.. ఇందులో టీమిండియా ఒక్క మ్యాచ్లో కూడా గెలవలేదు. 2018లో పంత్ తన తొలి విదేశీ టెస్ట్ సెంచరీని (114) కెన్నింగ్స్టన్ ఓవల్ మైదానంలో ఇంగ్లండ్పై చేశాడు. ఆ మ్యాచ్లో టీమిండియా దారుణంగా ఓడింది. విదేశాల్లో పంత్ రెండో టెస్ట్ సెంచరీని (159 నాటౌట్) 2019లో సిడ్నీ గ్రౌండ్లో ఆస్ట్రేలియాపై చేశాడు. ఆ మ్యాచ్లో టీమిండియా అదృష్టవశాత్తు డ్రాతో గట్టెక్కింది.విదేశాల్లో పంత్ మూడో టెస్ట్ సెంచరీని (100 నాటౌట్) 2022లో న్యూలాండ్స్లో సౌతాఫ్రికాపై చేశాడు. ఆ మ్యాచ్లో కూడా టీమిండియాకు పరాజయమే ఎదురైంది. విదేశాల్లో పంత్ నాలుగో టెస్ట్ సెంచరీ (146) అదే ఏడాది ఇంగ్లండ్పై (ఎడ్జ్బాస్టన్) చేశాడు. ఆ మ్యాచ్లోనూ టీమిండియాకు పరాభవం తప్పలేదు. తాజాగా హెడింగ్లే టెస్ట్లో పంత్ ఇంగ్లండ్పై రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు (134 & 118) చేసినా టీమిండియా గెలవలేకపోయింది. ఈ మ్యాచ్లో భారత్ తరఫున ఐదు సెంచరీలు (పంత్-2, జైస్వాల్, గిల్, రాహుల్) నమోదైనా గెలుపు దక్కకపోవడం శోచనీయం.ఇదిలా ఉంటే, హెడింగ్లేలో నిన్న ముగిసిన తొలి టెస్ట్లో భారత్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 471, రెండో ఇన్నింగ్స్లో 364 పరుగులు చేసినా టీమిండియాకు పరాభవం తప్పలేదు. భారత బౌలర్లు 371 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయారు. ఛేదనలో బుమ్రా సహా భారత బౌలర్లంతా తేలిపోయారు. ఈ మ్యాచ్లో క్యాచ్లు కూడా టీమిండియా కొంపముంచాయి. భారత జట్టు మ్యాచ్ మొత్తంలో ఏడు క్యాచ్లు నేలపాలు చేసింది. ఒక్క జైస్వాల్ ఒక్కడే నాలుగు క్యాచ్లు జారవిడిచాడు. భారీ లక్ష్య ఛేదనలో బెన్ డకెట్ అద్భుతమైన సెంచరీ చేసి ఇంగ్లండ్ను గెలిపించాడు. రెండో టెస్ట్ జులై 2 నుంచి బర్మింగ్హమ్ వేదికగా జరుగనుంది. -
ఆ రెండే కాదు.. మరో మూడు ఉన్నాయి.. గంభీర్పై పంత్ ఫ్యాన్స్ ఫైర్
టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ తీరు (Gautam Gambhir)పై స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఇంగ్లండ్తో తొలి టెస్టులో అద్భుత శతకాలు బాదిన ఆటగాడిని తక్కువ చేసినట్లు మాట్లాడటం సరికాదని హితవు పలుకుతున్నారు. వేరే వాళ్లను ప్రశంసించడంలో తప్పులేదని.. కానీ అందుకోసం పంత్ గురించి అడిగిన ప్రశ్నకు ఇంతలా అసహనం వ్యక్తం చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.విషయం ఏమిటంటే.. టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar-Anderson Trophy)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. ఈ టూర్తో భారత టెస్టు జట్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ తన ప్రయాణం ఆరంభించాడు. ఇక ఈ సిరీస్లో భాగంగా ఇరుజట్ల మధ్య లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో తొలి టెస్టు జరిగింది.ఐదు శతకాలుఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో టీమిండియా మూడు సెంచరీలు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101)తో పాటు కెప్టెన్ గిల్ (147), వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (134) కూడా శతకాలతో అలరించారు.ఇక రెండో ఇన్నింగ్స్లో జైస్వాల్ (4), గిల్ (8) విఫలం కాగా.. మరో ఓపెనింగ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (137), పంత్ (118) సెంచరీలు బాది.. జట్టును ఆదుకున్నారు. వీరి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా ఇంగ్లండ్కు 371 పరుగుల లక్ష్యం విధించగలిగింది.అయితే, ఆఖరి రోజు వరకు ఉత్కంఠ సాగిన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు శతకాలు బాదినా టీమిండియాకు పరాభవమే మిగిలింది. ఫీల్డింగ్, బౌలర్ల వైఫల్యం కారణంగా ఓటమిని చవిచూసింది.ఆ రెండే కాదు.. మరో మూడు ఉన్నాయిఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం భారత జట్టు హెడ్కోచ్ గౌతం గంభీర్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా.. పంత్ ప్రదర్శన గురించి చెప్పాల్సిందిగా ఓ విలేకరి ప్రశ్నించారు. దీంతో అసహనానికి గురైన గౌతీ.. ‘‘ఈ మ్యాచ్లో మనకు మరో మూడో సెంచరీలు కూడా ఉన్నాయి.అవి కూడా అతిపెద్ద సానుకూల అంశాలే. మీరు ఈ ప్రశ్న అడిగినందుకు ధన్యవాదాలు. అయితే, యశస్వి బాదిన 100, కెప్టెన్గా అరంగేట్రంలోనే గిల్ చేసిన శతకం.. కేఎల్ రాహుల్ 100 గురించి కూడా మీరు ప్రస్తావించి ఉంటే ఇంకా సంతోషించేవాడిని.వీరు ఒక్కో సెంచరీ చేస్తే రిషభ్ పంత్ రెండు శతకాలు బాదాడు. ఒక్క టెస్టు మ్యాచ్లో ఐదు సెంచరీలు. నిజం చెప్పాలంటే.. ఇదొక గొప్ప ప్రదర్శన. ఏదేమైనా మీ ప్రశ్న ఇంకాస్త బెటర్గా ఉండాల్సింది’’ అని కౌంటర్ ఇచ్చాడు.అంత అసహనం ఎందుకు?ఈ మేరకు గంభీర్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కాగా... పంత్ ఫ్యాన్స్ అతడిపై ఫైర్ అవుతున్నారు. ఈ మ్యాచ్ సందర్భంగా పంత్ సాధించిన రికార్డులను ప్రస్తావిస్తూ గౌతీని విమర్శిస్తున్నారు. కాగా ఒకే టెస్టు మ్యాచ్లో రెండు శతకాలు బాదిన రెండో వికెట్ కీపర్ బ్యాటర్గా పంత్ చరిత్రకెక్కాడు. అతడి కంటే ముందు ఆండీ ఫ్లవర్ ఈ ఘనత సాధించాడు.మరోవైపు.. ఇంగ్లండ్లో రెండు ఇన్నింగ్స్లోనూ శతక్కొట్టిన ఏడో భారత బ్యాటర్గా పంత్ నిలిచాడు. అయితే, టీమిండియా ఇంగ్లండ్ చేతిలో ఓడటంతో అతడి వీరోచిత ప్రదర్శన వృథాగా పోయింది. ఇరుజట్ల మధ్య జూలై 2- 6 వరకు బర్మింగ్హామ్ వేదికగా రెండో టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: ఏ ఒక్కరినో తప్పుబట్టను.. కెప్టెన్ నిర్ణయం ప్రకారమే అలా చేశాం: గంభీర్𝘈 𝘚𝘰𝘯𝘨 𝘰𝘧 𝘐𝘤𝘦 & 𝘍𝘪𝘳𝘦 𝘢𝘵 𝘏𝘦𝘢𝘥𝘪𝘯𝘨𝘭𝘦𝘺.🔥❄️@klrahul set the foundation with a composed and elegant century while @RishabhPant17’s quickfire hundred electrified the crowd with an explosive display of fearless strokeplay! 🤩WATCH FULL HIGHLIGHTS OF DAY 4… pic.twitter.com/MQ13EvHIae— Star Sports (@StarSportsIndia) June 23, 2025 -
చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. 'ఆ ఘనత' సాధించిన తొలి మొనగాడు
టీమిండియా వికెట్కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో 800 రేటింగ్ పాయింట్లు సాధించిన తొలి భారత వికెట్కీపర్ బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ వికెట్కీపర్ బ్యాటర్ 800 రేటింగ్ పాయింట్లు సాధించలేదు. టీమిండియా దిగ్గజ వికెట్కీపర్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోనికి కూడా ఇది సాధ్యపడలేదు.ఐసీసీ తాజాగా (జూన్ 25) విడుదల చేసిన ర్యాంకింగ్స్లో పంత్ 800 రేటింగ్ పాయింట్ల మార్కును (801) తాకాడు. అలాగే ర్యాంకింగ్స్లో ఓ స్థానం మెరుగపర్చుకొని ఏడో స్థానానికి ఎగబాకాడు. ప్రస్తుతమున్న వికెట్కీపర్లలో పంత్దే అత్యుత్తమ ర్యాంకింగ్. ఇంగ్లండ్తో నిన్న (జూన్ 24) ముగిసిన తొలి టెస్ట్లో రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేయడంతో పంత్ ఈ ఘనతలను సాధించాడు.తాజా ర్యాంకింగ్స్లో టాప్-10లో పంత్తో పాటు మరో భారత బ్యాటర్ కూడా ఉన్నాడు. ఇంగ్లండ్తో తొలి టెస్ట్లో (తొలి ఇన్నింగ్స్లో) సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. మరో తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో, టీమిండియా నయా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఐదు స్థానాలు మెరుగుపర్చుకొని 20వ స్థానానికి చేరాడు. సెకెండ్ ఇన్నింగ్స్లో అద్బుతమైన సెంచరీ చేసిన కేఎల్ రాహుల్ ఏకంగా 10 స్థానాలు మెరుగుపర్చుకొని 38వ స్థానానికి ఎగబాకాడు.ఈ వారం ర్యాంకింగ్స్లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ గణనీయంగా లబ్ది పొందాడు. భారత్పై అద్భుతమైన సెంచరీ (149) చేసినందుకు గానూ ఐదు స్థానాలు ఎగబాకి ఎనిమిదో స్థానానికి చేరాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లలో జో రూట్, హ్యారీ బ్రూక్ మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా.. ఓలీ పోప్ 3 స్థానాలు మెరుగుపర్చుకొని 19వ స్థానానికి ఎగబాకాడు. కేన్ విలియమ్సన్ 3, స్టీవ్ స్మిత్ 5, టెంబా బవుమా 6, కమిందు మెండిస్ 9, సౌద్ షకీల్ 10 స్థానాల్లో ఉన్నారు.మిగతా బ్యాటర్ల విషయానికొస్తే.. ఇటీవల శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్లో రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేసిన బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ షాంటో ఏకంగా 21 స్థానాలు మెరుగుపర్చుకొని 29వ స్థానానికి చేరగా.. అదే మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన మరో బంగ్లాదేశీ ముష్ఫికర్ రహీం 11 స్థానాలు మెరుగుపర్చుకొని 28వ స్థానానికి ఎగబాకాడు. అదే మ్యాచ్లో భారీ సెంచరీ చేసిన శ్రీలంక ఆటగాడు పథుమ్ నిస్సంక కూడా 21 స్థానాలు మెరుగుపర్చుకొని 31వ స్థానానికి ఎగబాకాడు. ఈ వారం బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో ఇవే చెప్పుకోదగ్గ మార్పులు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టాప్-10 పెద్దగా మార్పులేమీ లేవు. బుమ్రా, రబాడ, కమిన్స్, నౌమన్ అలీ, హాజిల్వుడ్, నాథన్ లియోన్, జన్సెన్, మ్యాట్ హెన్రీ టాప్-8లో కొనసాగుతున్నారు. మిచెల్ స్టార్క్ ఓ స్థానం ఎగబాకి తొమ్మిదో స్థానానికి చేరాడు. భారత్తో తాజాగా జరిగిన టెస్ట్లో రాణించిన బ్రైడన్ కార్స్ 8 స్థానాలు, జోష్ టంగ్ 16 స్థానాలు మెరుగుపర్చుకొని 32, 64 స్థానాలకు ఎగబాకారు. ఇంగ్లండ్తో తొలి టెస్ట్లో పర్వాలేదనిపించిన భారత పేసర్ ప్రసిద్ద్ కృష్ణ 21 స్థానాలు మెరుగుపర్చుకొని 72వ ప్లేస్కు చేరాడు. ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో రవీంద్ర జడేజా, మెహిది హసన్ మిరాజ్, జన్సెన్ టాప్-3లో కొనసాగుతున్నారు. -
రిషబ్ పంత్కు భారీ షాకిచ్చిన ఐసీసీ..
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఊహించని షాకిచ్చింది. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో అంపైర్తో వాగ్వదం దిగినందుకు గానూ పంత్కు ఓ డిమెరిట్ పాయింట్ ఐసీసీ విధించింది.ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.8ని ఉల్లంఘించినందుకు ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. గత 24 నెలలలో ఇదే తొలి తప్పిదం అయినందున కేవలం ఒక డీమెరిట్ పాయింట్తో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సరిపెట్టింది.అసలేమి జరిగిందంటే?ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 61 ఓవర్లో బంతిని మార్చమని ఫీల్డ్ అంపైర్ పాల్ రీఫెల్పై పంత్ ఒత్తిడి తీసుకొచ్చాడు. బంతి కండీషన్ బాగోలేదని కొత్త బంతిని తీసుకురావాలని పంత్ సూచించాడు. కానీ ఫీల్డ్ అంపైర్లు బంతిని పరిశీలించి, మార్చాల్సిన అవసరంలేదంటూ అదే బాల్ను తిరిగి పంత్కు ఇచ్చాడు.ఈ క్రమంలో సహనం కోల్పోయిన పంత్.. బంతిని నేలకేసి బలంగా కొట్టాడు. దీంతో అంపైర్లు మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్కు ఫిర్యాదు చేశారు. పంత్ కూడా తన తప్పును అంగీకరించాడు. ఈ నేపథ్యంలోనే పంత్పై ఐసీసీ మ్యాచ్ రిఫరీ ఈ చర్యలు తీసుకున్నారు.శతక్కొట్టిన పంత్..కాగా ఈ మ్యాచ్లో పంత్ సెంచరీలు మోత మోగించాడు. రెండో ఇన్నింగ్స్లలోనూ శతకాలు బాది సంచలనం సృష్టించాడు. ఓ టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో సెంచరీలు చేసిన తొలి భారత వికెట్ కీపర్గా రికార్డులకెక్కాడు. తొలి ఇన్నింగ్స్లో 134 పరుగులు చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్లో 118 పరుగులు చేశాడు. కాగా తొలి టెస్టులో విజయంపై భారత్ కన్నేసింది.ఇంగ్లండ్ ముందు 371 పరుగుల భారీ లక్ష్యాన్ని గిల్ సేన ఉంచింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఆఖరి రోజు ఆటలో ఎవరు మెరుగ్గా రాణిస్తే వారిదే విజయం.చదవండి: రింకూ సింగ్- ఎంపీ ప్రియా సరోజ్ పెళ్లి వాయిదా!.. కారణం ఇదే! -
రిషబ్ పంత్ సరికొత్త చరిత్ర.. 148 ఏళ్ల టెస్టు క్రికెట్ హిస్టరీలోనే
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్లలోనూ పంత్ సెంచరీలతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్లో 134 పరుగులు చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్లో 118 పరుగులు చేశాడు.తన అద్బుత సెంచరీలతో ఇంగ్లండ్కు 371 పరుగుల లక్ష్యాన్ని ఉంచడంలో పంత్ కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో పంత్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.పంత్ సాధించిన రికార్డులు ఇవే..ఒక టెస్టు మ్యాచ్లో అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్గా పంత్ చరిత్ర సృష్టించాడు. లీడ్స్ టెస్టులో పంత్ 252 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఈ రికార్డు భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ బుద్ధి కుందరన్ పేరిట ఉండేది. కుందరన్ 1964లో ఇంగ్లండ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో రెండు సెంచరీలు సాధించాడు. తాజా మ్యాచ్తో 61 ఏళ్ల కుందరన్ ఆల్టైమ్ రికార్డును పంత్ బ్రేక్ చేశాడు.ఒకే టెస్టు మ్యాచ్లో అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్ కీపర్లు వీరే..👉రిషబ్ పంత్ 252👉బుద్ధి కుందరన్ 230👉ఎంఎస్ ధోని 224👉రిషబ్ పంత్ 203👉ఫరోఖ్ ఇంజనీర్ 187👉అదేవిధంగా 148 టెస్టు క్రికెట్ హిస్టరీలోనే ఒకే మ్యాచ్లో 2 సెంచరీలు బాదిన రెండో వికెట్ కీపర్గా రిషబ్ పంత్ నిలిచాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో జింబాబ్వే దిగ్గజం ఆండీ ఫ్లవర్ అగ్రస్ధానంలో ఉన్నారు. సౌతాఫ్రికాతో 2001లో జరిగిన టెస్ట్లో తొలి ఇన్నింగ్స్లో 142 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 199 పరుగులతో ఫ్లవర్ ఆజేయంగా నిలిచాడు.👉ఒక టెస్టు మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లలోనూ సెంచరీలు చేసిన ఏకైక ఆసియాన్ వికెట్ కీపర్ కూడా పంత్ కావడం విశేషం.👉ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో భారత ఆటగాడిగా క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్,దిలీప్ వెంగ్సర్కార్ రికార్డును రిషబ్ సమం చేశాడు. వారిద్దరూ ఇంగ్లండ్లో నాలుగు టెస్టు సెంచరీలు సాధించారు. పంత్కు కూడా ఇంగ్లండ్ గడ్డపై నాలుగో టెస్టు సెంచరీ. ఈ రేర్ ఫీట్సాధించిన జాబితాలో రాహుల్ ద్రవిడ్ 6 సెంచరీలతో రాహుల్ ద్రవిడ్ అగ్రస్ధానంలో ఉన్నాడు.Cartwheeling into the record books literally! 🌀Rishabh Pant brings his love for gymnastics into every 100 celebration, and it’s just as fearless as his batting.Who needs quiet fist pumps when you can flip your way to history?#ENGvIND 1st Test Day 4 LIVE NOW Streaming on… pic.twitter.com/iOQ8fVgHJT— Star Sports (@StarSportsIndia) June 23, 2025 -
పంత్ సెంచరీలపై అలా.. కేఎల్ రాహుల్ శతకంపై ఇలా! గోయెంకా పోస్ట్ వైరల్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant)పై ప్రముఖ వ్యాపారవేత్త, లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా (Sanjiv Goenka) ప్రశంసలు కురిపించారు. దూకుడైన ఆటకు మారుపేరంటూ పంత్ బ్యాటింగ్ తీరును కొనియాడారు. అదే సమయంలో.. భారత ఓపెనింగ్ బ్యాటర్, లక్నో మాజీ ఆటగాడు కేఎల్ రాహుల్ను కూడా సంజీవ్ గోయెంకా ప్రశంసించడం విశేషం.రెండు ఇన్నింగ్స్లోనూ శతకాలుకాగా భారత్- ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య తొలి టెస్టులో రిషభ్ పంత్ శతకాలతో అదరగొట్టిన విషయం తెలిసిందే. లీడ్స్ వేదికగా తొలి ఇన్నింగ్స్లో 178 బంతులు ఎదుర్కొన్న ఈ ఐదో నంబర్ బ్యాటర్.. 12 ఫోర్లు, ఆరు సిక్సర్ సాయంతో.. 75కు పైగా స్ట్రైక్రేటుతో 134 పరుగులు సాధించాడు.ఇక రెండో ఇన్నింగ్స్లోనూ పంత్ దంచికొట్టాడు. 140 బంతుల్లోనే 118 పరుగులు రాబట్టాడు. అతడి ఇన్నింగ్స్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లు ఉండటం విశేషం. స్ట్రైక్రేటు 84.29. తన అద్భుత శతక ఇన్నింగ్స్ల ద్వారా టీమిండియా పటిష్ట స్థితిలో నిలవడంలో పంత్ కీలక పాత్ర పోషించాడు.అమోఘం.. రాహుల్కు కంగ్రాట్స్ ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ యజమాని తమ కెప్టెన్ రిషభ్ పంత్ను ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘అమోఘం! రెండు వరుస సెంచరీలు.. దూకుడుకు మారుపేరుగా, బెదురులేని.. అద్భుత ఇన్నింగ్స్.టెస్టు మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన రెండో వికెట్ కీపర్గా చరిత్ర.. సూపర్’’ అంటూ క్లాప్ ఎమోజీలు జత చేశారు. అదే సమయంలో మరో శతక వీరుడు కేఎల్ రాహుల్ పేరును కూడా గోయెంకా ప్రస్తావించడం వైరల్గా మారింది. ‘‘సెంచరీ చేసిన కేఎల్ రాహుల్కు కూడా శుభాకాంక్షలు’’ అని గోయెంకా ట్వీట్ చేశారు.కాగా 2022లో ఐపీఎల్లో అడుగుపెట్టిన లక్నో జట్టుకు మూడేళ్ల పాటు కేఎల్ రాహుల్ కెప్టెన్గా వ్యవహరించాడు. 2022, 2023లో వరుసగా రెండుసార్లు జట్టును ప్లే ఆఫ్స్నకు చేర్చాడు. కానీ 2024లో మాత్రం రాహుల్ ఇదే ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయాడు.రాహుల్పై ఫైర్.. ఫ్రాంఛైజీని వీడిన స్టార్ఈ నేపథ్యంలో సంజీవ్ గోయెంకా మైదానంలో బహిరంగంగా రాహుల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఇక ఈ పరిణామం తర్వాత అంటే.. 2025 మెగా వేలానికి ముందు రాహుల్ లక్నో ఫ్రాంఛైజీని వీడాడు.అనంతరం ఆక్షన్లో భాగంగా లక్నో రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లకు రిషభ్ పంత్ను కొనుగోలు చేసి కెప్టెన్గా నియమించింది. అయితే, బ్యాటర్, కెప్టెన్గా ఈ సీజన్లో పంత్ పూర్తిగా విఫలమయ్యాడు. పద్నాలుగు మ్యాచ్లలో కలిపి పంత్ కేవలం 269 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ ఉండటం చెప్పుకోదగ్గ అంశం.గెలుపునకు పది వికెట్ల దూరంలోఇక పంత్ సేన తాజా ఎడిషన్లో పద్నాలుగింట ఆరు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికే పరిమితమైంది. మరోవైపు.. 2025లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిథ్యం వహించిన కేఎల్ రాహుల్ పదమూడు మ్యాచ్లు ఆడి.. ఓ శతకం సాయంతో 539 పరుగులు సాధించడం విశేషం.ఇక టీమిండియా- ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు రసవత్తరంగా మారింది. ఆఖరిదైన ఐదో రోజు ఆటలో విజేత ఎవరన్నది తేలనుంది. భారత బౌలర్లు రాణించి పది వికెట్లు కూలిస్తే.. గిల్ సేనకు శుభారంభం లభిస్తుంది. మరోవైపు.. భారత్ విధించిన 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలంటే ఇంగ్లండ్ మంగళవారం 350 పరుగులు చేయాలి. చదవండి: ‘లక్ష్మణ్ను కాదని అతడిని తీసుకున్నాం.. నాతో మూడు నెలలు మాట్లాడలేదు’𝘈 𝘚𝘰𝘯𝘨 𝘰𝘧 𝘐𝘤𝘦 & 𝘍𝘪𝘳𝘦 𝘢𝘵 𝘏𝘦𝘢𝘥𝘪𝘯𝘨𝘭𝘦𝘺.🔥❄️@klrahul set the foundation with a composed and elegant century while @RishabhPant17’s quickfire hundred electrified the crowd with an explosive display of fearless strokeplay! 🤩WATCH FULL HIGHLIGHTS OF DAY 4… pic.twitter.com/MQ13EvHIae— Star Sports (@StarSportsIndia) June 23, 2025 -
విజయంపై గురి
భారత బ్యాటింగ్ దళం అంచనాలకు అనుగుణంగా తమ బాధ్యత ముగించింది. చివర్లో కొంత తడబాటు కనిపించినా...రాహుల్, పంత్ సెంచరీలతో చెలరేగి భారీ భాగస్వామ్యం నెలకొల్పడంతో ప్రత్యరి్థకి కష్టసాధ్యమైన లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇప్పుడు ఇక బౌలర్ల వంతు...బుమ్రా ఒక్కడే ఇంగ్లండ్ ఆట కట్టిస్తాడా...ఈసారి మేం కూడా అంటూ ఇతర బౌలర్లూ సహకరిస్తారా అనేది చూడాలి.చివరి రోజు 90 ఓవర్లలో 350 పరుగులు చేయాల్సిన ఇంగ్లండ్ దూకుడుగా ఆడి ఛేదనకు మొగ్గు చూపుతుందా...లేక పరిస్థితి మారిపోతే కాస్త తగ్గి ‘డ్రా’కు ప్రయతి్నస్తుందా చూడాలి. మరోవైపు హెడింగ్లీ మైదానంలో ఆఖరి రోజు ఆటకు వాన ముప్పు కూడా ఉంది! లీడ్స్: భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రసవత్తర స్థితికి చేరింది. 371 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. జాక్ క్రాలీ (12 బ్యాటింగ్), బెన్ డకెట్ (9 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు భారత్ తమ రెండో ఇన్నింగ్స్లో 96 ఓవర్లలో 364 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (247 బంతుల్లో 137; 18 ఫోర్లు) శతకం పూర్తి చేసుకోగా... రిషభ్ పంత్ (140 బంతుల్లో 118; 15 ఫోర్లు, 3 సిక్స్లు) ఈ టెస్టులో రెండో సెంచరీ సాధించాడు. వీరిద్దరు నాలుగో వికెట్కు 195 పరుగులు జోడించారు. ఒకదశలో 333/4తో ఉన్న భారత్ 31 పరుగుల వ్యవధిలో చివరి 6 వికెట్లు కోల్పోయింది. తొలి సెషన్ నెమ్మదిగా... ఓవర్నైట్ స్కోరు 90/2తో నాలుగో రోజు ఆట కొనసాగించిన భారత్ అదే స్కోరు వద్ద కెపె్టన్ శుబ్మన్ గిల్ (8) వికెట్ కోల్పోయింది. దాంతో రాహుల్, పంత్ తొలి సెషన్లో చాలా జాగ్రత్తగా ఆడారు. 87 బంతుల్లో రాహుల్ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఇంగ్లండ్ కూడా చక్కటి నియంత్రణతో బౌలింగ్ చేయడంతో పరుగులు అంత సులువుగా రాలేదు. 58 పరుగుల వద్ద రాహుల్ ఇచి్చన క్యాచ్ను బ్రూక్ వదిలేయడం జట్టుకు కలిసొచ్చింది. తొలి సెషన్లో భారత్ 24.1 ఓవర్లలో 63 పరుగులే చేయగలిగింది. పంత్, రాహుల్ జోరు... లంచ్ తర్వాత ఒక్కసారిగా భారత్ ఆట మారింది. బ్యాట్ ఝళిపించిన పంత్ దూకుడు పెంచి పరుగులు రాబట్టగా... రాహుల్ తనదైన శైలిలో చూడచక్కటి షాట్లతో అలరించారు. 83 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న పంత్ ఆ తర్వాత మరింత ధాటిగా ఆడుతూ తర్వాతి 25 బంతుల్లోనే 44 పరుగులు రాబట్టాడు. మరోవైపు 202 బంతుల్లో రాహుల్ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత కొద్ది సేపటికే పంత్ కూడా ఈ టెస్టులో రెండో సెంచరీని (130 బంతుల్లో) తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ జోడీని విడదీసేందుకు తీవ్రంగా శ్రమించిన ఇంగ్లండ్ ఎట్టకేలకు 46.4 ఓవర్ల తర్వాత సఫలమైంది. శతకం పూర్తయిన తర్వాత రూట్ ఓవర్లో వరుసగా 4, 6, 4 బాదిన పంత్... బషీర్ వేసిన తర్వాతి ఓవర్లో మరో భారీ షాట్కు ప్రయత్నించి వెనుదిరిగాడు. రెండో సెషన్లో భారత్ 27 ఓవర్లలోనే ఏకంగా 5.37 రన్రేట్తో 145 పరుగులు సాధించడం విశేషం. విరామానంతరం ఆట మళ్లీ మలుపు తిరిగింది. కార్స్ బౌలింగ్లో రాహుల్ బౌల్డ్ కాగా...కరుణ్ నాయర్ (20) మరో అవకాశాన్ని వృథా చేసుకున్నాడు. ఆ తర్వాత టంగ్ నాలుగు బంతుల్లో శార్దుల్ (4), సిరాజ్ (0), బుమ్రా (0)లను అవుట్ చేయగా... ప్రసిధ్ కృష్ణ (0) చివరి వికెట్గా వెనుదిరిగాడు. మరో ఎండ్లో రవీంద్ర జడేజా (40 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని పరుగులు జోడించగలిగాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 471; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 465; భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) స్మిత్ (బి) కార్స్ 4; రాహుల్ (బి) కార్స్ 137; సాయి సుదర్శన్ (సి) క్రాలీ (బి) స్టోక్స్ 30; గిల్ (బి) కార్స్ 8; పంత్ (సి) క్రాలీ (బి) బషీర్ 118; నాయర్ (సి అండ్ బి) వోక్స్ 20; జడేజా (నాటౌట్) 25; శార్దుల్ (సి) రూట్ (బి) టంగ్ 4; సిరాజ్ (సి) స్మిత్ (బి) టంగ్ 0; బుమ్రా (బి) టంగ్ 0; ప్రసిధ్ (సి) టంగ్ (బి) బషీర్ 0; ఎక్స్ట్రాలు 18; మొత్తం (96 ఓవర్లలో ఆలౌట్) 364. వికెట్ల పతనం: 1–16, 2–82, 3–92, 4–287, 5–333, 6–335, 7–349, 8–349; 9–349; 10–364. బౌలింగ్: వోక్స్ 19–4–45–1, కార్స్ 19–2–80–3, టంగ్ 18–2–72–3, బషీర్ 22–1–90–2, స్టోక్స్ 15–2–47–1, రూట్ 3–0–21–0. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (బ్యాటింగ్) 12; డకెట్ (బ్యాటింగ్) 9; ఎక్స్ట్రాలు 0; మొత్తం (6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 21. బౌలింగ్: బుమ్రా 3–0–9–0, సిరాజ్ 2–1–9–0, జడేజా 1–0–3–0. -
IND VS ENG 1st Test: శతక్కొట్టిన రాహుల్, పంత్.. ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యం
తొలి టెస్ట్ లో టీమిండియా విధించిన 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఇంగ్లండ్ బరిలోకి దిగింది. సోమవారం నాటి నాలుగో రోజు ఆట ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించాలంటే ఆఖరిదైన ఐదవ రోజు బౌలింగ్ లో సత్తా చాటి 10 వికెట్లు తీయాల్సి ఉంది. మరోవైపు విజయానికి ఇంగ్లండ్ కు 350 పరుగులు అవసరం.ఇంగ్లండ్ లక్ష్యం 371లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో టీమిండియా పట్టు బిగించింది. నాలుగో రోజు భారత్ సెకెండ్ ఇన్నింగ్స్లో భారీ స్కోర్ (364) చేసి ఆలౌటైంది. ఫలితంగా ఇంగ్లండ్ ముందు 371 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. కేఎల్ రాహుల్ (137), రిషబ్ పంత్ (118) సెంచరీలతో కదంతొక్కారు. మిగతా భారత ఆటగాళ్లలో సాయి సుదర్శన్ 30, రవీంద్ర జడేజా 25 (నాటౌట్), యశస్వి జైస్వాల్ 4, శుభ్మన్ గిల్ 8, కరుణ్ నాయర్ 20, శార్దూల్ ఠాకూర్ 4, సిరాజ్ 0, బుమ్రా 0, ప్రసిద్ద్ కృష్ణ 0 పరుగులకు ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్, జోష్ టంగ్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. బషీర్ 2, వోక్స్, స్టోక్స్ చెరో వికెట్ దక్కించుకున్నారు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. యశస్వి జైస్వాల్ (101), శుభ్మన్ గిల్ (147), రిషబ్ పంత్ (134) సెంచరీలతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ తలో నాలుగు వికెట్లు తీయగా.. షోయబ్ బషీర్, బ్రైడన్ కార్స్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ టీమిండియాకు ధీటుగా బదులిచ్చింది. ఓలీ పోప్ (106) సెంచరీతో కదంతొక్కగా.. హ్యారీ బ్రూక్ (99) పరుగు తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు. మిగతా బ్యాటర్లలో బెన్ డకెట్ 62, జేమీ స్మిత్ 40, క్రిస్ వోక్స్ 38 రాణించడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 465 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్ కృష్ణ మూడు, సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు. -
IND VS ENG 1st TEST: చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్
టీమిండియా స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ టెస్ట్ల్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఓ టెస్ట్ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేసిన తొలి ఆసియా వికెట్కీపర్ బ్యాటర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఆసియా వికెట్కీపర్ బ్యాటర్ ఈ ఘనత సాధించలేదు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో పంత్ ఈ ఘనత సాధించాడు.ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 178 బంతుల్లో డజను ఫోర్లు, అర డజను సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్లో 140 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 118 పరుగులు చేసి ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్లో పంత్కు ముందు కేఎల్ రాహుల్ కూడా సెంచరీతో కదంతొక్కడంతో భారత్ పటిష్ట స్థితికి చేరింది.నాలుగో రోజు టీ విరామం సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసి 304 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. కేఎల్ రాహుల్ 120, కరుణ్ నాయర్ 4 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. రెండో ఇన్నింగ్స్లో భారత ఆటగాళ్లు యశస్వి జైస్వాల్ 4, సాయి సుదర్శన్ 30, శుభ్మన్ గిల్ 8 పరుగులు చేసి ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 2 వికెట్లు పడగొట్టగా.. షోయబ్ బషీర్, బెన్ స్టోక్స్ తలో వికెట్ తీశారు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. యశస్వి జైస్వాల్ (101), శుభ్మన్ గిల్ (147), రిషబ్ పంత్ (134) సెంచరీలతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ తలో నాలుగు వికెట్లు తీయగా.. షోయబ్ బషీర్, బ్రైడన్ కార్స్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ టీమిండియాకు ధీటుగా బదులిచ్చింది. ఓలీ పోప్ (106) సెంచరీతో కదంతొక్కగా.. హ్యారీ బ్రూక్ (99) పరుగు తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు. మిగతా బ్యాటర్లలో బెన్ డకెట్ 62, జేమీ స్మిత్ 40, క్రిస్ వోక్స్ 38 రాణించడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 465 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్ కృష్ణ మూడు, సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు. -
IND VS ENG 1st Test: రెండో ఇన్నింగ్స్లోనూ శతక్కొట్టిన పంత్.. అయితే ఈసారి..!
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేశాడు. తొలి ఇన్నింగ్స్లో 178 బంతుల్లో డజను ఫోర్లు, అర డజను సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్లో 130 బంతుల్లో 13 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఈ సారి పంత్ సెంచరీ చేసిన తర్వాత పల్టీ సెలబ్రేషన్స్ చేసుకోలేదు. స్టాండ్స్ నుంచి గవాస్కర్ పల్టీ కొట్టాలని అడిగినా పంత్ పెద్దగా పట్టించుకోలేదు. డబుల్ సెంచరీ తర్వాత అన్నట్లు సైగలు చేశాడు. తాజా సెంచరీతో టెస్ట్ల్లో పంత్ సెంచరీల సంఖ్య 8కి చేరింది. మరో ఎండ్లో కేఎల్ రాహుల్ కూడా సెంచరీ పూర్తి చేశాడు. తొలి ఇన్నింగ్స్లో 42 పరుగులకు ఔటైన రాహుల్.. ఈసారి మరింత బాధ్యతాయుతంగా ఆడి కెరీర్లో తొమ్మిదో సెంచరీ పూర్తి చేశాడు. రాహుల్ 202 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో సెంచరీ మార్కును అందుకున్నాడు.నాలుగో రోజు ఆట ప్రారంభం కాగానే శుభ్మన్ గిల్ (8) వికెట్ కోల్పోయిన భారత్ను రాహుల్-పంత్ జోడీ ఆదుకుంది. ఈ ఇద్దరు ఎంతో సంయమనంతో బ్యాటింగ్ చేస్తూ.. భారత్ పైచేయి సాధించే దిశగా తీసుకెళ్తున్నారు. ఈ జోడీ ఇప్పటికే నాలుగో వికెట్కు 172 పరుగులు జోడించింది. పంత్ సెంచరీ పూర్తయ్యే సమయానికి రెండో ఇన్నింగ్స్లో భారత్ స్కోర్ 264/3గా ఉంది. రాహుల్ 112, పంత్ 100 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతానికి భారత్ ఆధిక్యం 270 పరుగులుగా ఉంది. భారత రెండో ఇన్నింగ్స్లో జైస్వాల్ 4, సాయి సుదర్శన్ 30, గిల్ 8 పరుగులు చేసి ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 2, స్టోక్స్ ఓ వికెట్ దక్కించుకున్నారు.అంతకుముందు భారత్, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ల్లో నువ్వా నేనా అన్నట్లు బ్యాటింగ్ చేశాయి. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101), కెప్టెన్ శుబ్మన్ గిల్ (147), వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (134) సెంచరీలతో చెలరేగడంతో 471 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ తలో నాలుగు వికెట్లు తీయగా.. షోయబ్ బషీర్, బ్రైడన్ కార్స్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ టీమిండియాకు ధీటుగా బదులిచ్చింది. ఓపెనర్ బెన్ డకెట్ (62) అర్ధ శతకంతో రాణించగా.. ఓలీ పోప్ (106) శతక్కొట్టాడు. హ్యారీ బ్రూక్ 99 పరుగులతో తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. మిగతా ఆటగాళ్లలో జేమీ స్మిత్ 40, క్రిస్ వోక్స్ 38 పరుగులతో పర్వాలేదనిపించారు. ఫలితంగా ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్లో 465 పరుగులు చేసింది. దీంతో భారత్కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్ కృష్ణ మూడు, సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు. -
భారత్-ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్ హైలైట్స్ (ఫోటోలు)
-
Ind vs Eng 1st Test: శతక్కొట్టిన కేఎల్ రాహుల్
ఇంగ్లండ్తో మొదటి టెస్టులో కేఎల్ రాహుల్ (KL Rahul) అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో 42 పరుగుల వద్ద అవుటైన ఈ స్టార్ ఓపెనర్.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం శతకంతో మెరిశాడు. జట్టు కష్టాల్లో ఉన్న వేళ పెద్దన్నలా ఆదుకుని బాధ్యతాయుత ఇన్నింగ్స్తో ఆకట్టుకుంటున్నాడు. 202 బంతుల్లో వంద పరుగుల మార్కును అందుకున్నాడు.రాహుల్ శతక ఇన్నింగ్స్లో 13 ఫోర్లు ఉన్నాయి. మరోవైపు.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కూడా అదరగొడుతున్నాడు. సోమవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా పంత్ కూడా సెంచరీ బాదాడు.కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్లో పర్యటిస్తోంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో శుక్రవారం తొలి టెస్టు ఆరంభమైంది.టాస్ గెలిచిన ఆతిథ్య ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101), కెప్టెన్ శుబ్మన్ గిల్ (147), వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ (134) శతకాలతో చెలరేగడంతో.. తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులు చేసింది.ఇందుకు బదులుగా స్టోక్స్ బృందం తమ మొదటి ఇన్నింగ్స్లో 465 పరుగులు చేయగా.. భారత్కు ఆరు పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టగా.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.ఓపెనర్ యశస్వి జైస్వాల్ నాలుగు పరుగులు మాత్రమే చేసి.. బ్రైడన్ కార్స్ బౌలింగ్లో జేమీ స్మిత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ పట్టుదలగా నిలబడగా.. వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ 30 పరుగులు చేశాడు.ఇక నాలుగో రోజు ఆట ఆరంభమైన కాసేపటికే కెప్టెన్ శుబ్మన్ గిల్ రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో రాహుల్- పంత్ నిలకడగా ఆడుతూ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 69.4 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి పంత్ 100, రాహుల్ 112 పరుగులతో ఉన్నారు. టీమిండియా 270 పరుగుల ఆధిక్యంలో ఉంది.𝗖 𝗛 𝗔 𝗠 𝗣 𝗜 𝗢 𝗡 𝗦 𝗧 𝗨 𝗙 𝗙 🫡🙌🏻After missing out in the first innings, @klrahul makes it count in the second! A priceless century that puts #TeamIndia in a commanding position in the 1st Test! 🇮🇳#ENGvIND 1st Test Day 4 LIVE NOW Streaming on JioHotstar 👉… pic.twitter.com/FVrutSIABd— Star Sports (@StarSportsIndia) June 23, 2025 -
KL Rahul: చూసి ఆడు పంత్.. నేనేమీ నిర్లక్ష్యపు షాట్లు ఆడటం లేదు!.. నువ్వే..
ఇంగ్లండ్ (Ind vs Eng)తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో భారత్ ఆచితూచి ఆడుతోంది. ఇప్పటికే ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4), వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (30), కెప్టెన్ శుబ్మన్ గిల్ (8)ల వికెట్లను టీమిండియా కోల్పోయింది. ఇలాంటి క్లిష్ట దశలో ఓపెనర్ కేఎల్ రాహుల్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్లపై భారం పడింది.నాలుగో రోజు ఆటలో భాగంగా ఆదిలోనే గిల్ అవుట్ కావడంతో.. పంత్ రాహుల్ (KL Rahul)కు జతయ్యాడు. ఇద్దరూ కలిసి భోజన విరామ సమయానికి 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఫలితంగా లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.ఓవైపు కేఎల్ రాహుల్ కూల్గా తన పని తాను చేసుకుపోతుంటే.. రిషభ్ పంత్ (Rishabh Pant) మాత్రం తగ్గేదేలే అంటూ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ఈ క్రమంలో ముప్పై మూడవ ఓవర్లో మూడో బంతికి బ్రైడన్ కార్స్ బౌలింగ్లో ఫోర్ బాదిన పంత్.. అదృష్టవశాత్తూ క్యాచ్ అవుట్ అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. బ్యాట్ ఎడ్జ్ను తాకిని బంతి ఫైన్-లెగ్ రీజన్లో గాల్లోకి లేవగా.. వికెట్ కీపర్, ఫస్ట్ స్లిప్ క్యాచ్ పట్టేందుకు ప్రయత్నం చేసి విఫలమయ్యారు. దీంతో పంత్ బతికిపోయాడు.చూసి ఆడు.. నేనేమీ నిర్లక్ష్యఫు షాట్లు ఆడటం లేదుఈ నేపథ్యంలో రాహుల్ పంత్కు సలహా ఇచ్చాడు. ‘కాస్త చూసి ఆడు.. జాగ్రత్త’ అని హెచ్చరించాడు. అయితే, పంత్ ఇందుకు కాస్త దురుసుగానే సమాధానం ఇచ్చినట్లు అనిపించింది. ‘‘నేనేమీ నిర్లక్ష్యఫు షాట్లు ఆడటం లేదు. జాగ్రత్తగానే హిట్టింగ్ చేస్తున్నా’’ అని పంత్ పేర్కొన్నాడు. స్టంప్ మైకులో ఈ మాటలు రికార్డయ్యాయి.స్కోర్ చేయలేకపోతున్నాంఆ తర్వాత మరోసారి.. ‘‘బంతి పాతబడిపోయింది. మరీ ఆచితూచి ఆడటం వల్ల స్కోర్ చేసే అవకాశాన్ని మిస్ అయిపోతున్నాం’’ అని పంత్ పేర్కొనడం గమనార్హం. వీరికి సంభాషణను హైలైట్ చేస్తూ కామెంటేటర్లు హర్షా భోగ్లే, ఛతేశ్వర్ పుజారా నవ్వుకున్నారు. మరోవైపు.. టీమిండియా అభిమానులు రాహుల్ కూల్గానే పని పూర్తి చేస్తాడని ప్రశంసిస్తూనే.. పంత్ కాన్ఫిడెన్స్ వేరే లెవల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.కాగా సోమవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా 54 ఓవర్ల ఆట పూర్తయ్యే సరికి టీమిండియా మూడు వికెట్ల నష్టాననికి 175 పరుగుల వద్ద నిలిచింది. రాహుల్ 83, పంత్ 41 రన్స్తో ఆడుతున్నారు. ఇక 57వ ఓవర్ ముగిసే సరికి భారత్ 57 ఓవర్లలో 192 పరుగులు చేసింది. పంత్ అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. రాహుల్ సెంచరీకి 15 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇద్దరూ కలిసి ఇప్పటికే 100 పరుగుల భాగస్వామ్యం పూర్తి చేసుకున్నారు. ఇక ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా టీమిండియా ఇంగ్లండ్తో లీడ్స్ వేదికగా శుక్రవారం తొలి టెస్టు ఆరంభించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గిల్ సేన.. మొదటి ఇన్నింగ్స్లో 471 పరుగులు చేసింది. ఇందుకు దీటుగా బదులిచ్చిన ఇంగ్లండ్ 465 పరుగులు సాధించింది. ఈ క్రమంలో ఆరు పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా మెరుగ్గా ఆడి.. మంచి స్కోరు నమోదు చేస్తేనే ఆతిథ్య జట్టుకు సవాల్ విసరగలదు.UPDATE: Ind vs Eng 1st Test: శతక్కొట్టిన కేఎల్ రాహుల్చదవండి: ‘లక్ష్మణ్ను కాదని అతడిని తీసుకున్నాం.. నాతో మూడు నెలలు మాట్లాడలేదు’Give us a day full of stump mic Pant, we won't complain! 🎙️ 🤭 #SonySportsNetwork #GroundTumharaJeetHamari #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia | @RishabhPant17 pic.twitter.com/51XLsNwqu9— Sony Sports Network (@SonySportsNetwk) June 23, 2025 -
అంపైర్తో వాగ్వాదం.. సహనం కోల్పోయిన పంత్
లీడ్స్: భారత్ -ఇంగ్లండ్ల మధ్య లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో రిషభ్ పంత్ సహనం కోల్పోయాడు. ఆదివారం మూడో రోజు ఆటలో భాగంగా తొలి సెషన్లో భారత వైస్ కెప్టెన్ పంత్ కాస్త దూకుడుగా వ్యవహరించాడు. అంపైర్ పాల్ రఫెల్ వద్దకు వెళ్లి బాల్ను మార్చాలంటూ విజ్ఞప్తి చేశాడు. ఈ క్రమంలో బాల్ను పట్టుకుని చూసిన అంపైర్ రఫెల్.. అవసరం లేదు అంటూ అదే బాల్ను తిరిగి పంత్కు చేతికిచ్చాడు. దాంతో అసంతృప్తి చెందిన పంత్.. అదే బాల్తో నేలకేసి కొట్టాడు. ఇది 63 ఓవర్లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ క్రీజ్లో ఉన్న సమయంలో జరిగింది. పంత్ ఇలా ప్రవర్తించడం ఐసీసీ క్రమశిక్షణా చర్యలు ఉల్లంఘన చర్యలు కిందకు రావడంతో భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. ఇది ఐసీసీ నియమావళికి విరుద్ధం కావడంతో పంత్పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. Rishabh Pant asked the umpire to change the ball, got denied and then threw it in frustration 😭😭😭 pic.twitter.com/F1A78XGwWV— Sandy (@flamboypant) June 22, 2025 కాగా, ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 471 పరుగులకు ఆలౌట్ కాగా, ఇంగ్లండ్ కూడా అంతే ధీటుగా బదులిస్తోంది. ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్ లో భాగంగా ఓలీ పోప్)106) సెంచరీ చేయగా, హారీ బ్రూక్ 99 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. -
టీమిండియాతో తొలి టెస్టు.. రెండో రోజు ఇంగ్లండ్దే
లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటలో టీమిండియాపై ఇంగ్లండ్ పై చేయి సాధించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లీష్ జట్టు 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. క్రీజులో వైస్ కెప్టెన్ ఓలీ పోప్(100), హ్యారీ బ్రూక్ (0) ఉన్నారు. టీమిండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులకు ఆలౌటైంది. 359/3 ఓవర్ నైట్స్కోర్తో రెండో రోజు ఆటను ఆరంభించిన టీమిండియా అదనంగా 112 పరుగులు జోడించి తమ ఇన్నింగ్స్ను ముగించింది. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్తో పాటు కెప్టెన్ శుబ్మన్ గిల్ (147, 227 బంతుల్లో 19 ఫోర్లు, 1 సిక్స్), యశస్వి జైస్వాల్ (101, 159 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో చెలరేగారు. -
చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
టెస్టు క్రికెట్లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ మరోసారి తన సత్తా చాటాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో పంత్ ఫియర్లెస్ ఇన్నింగ్స్ ఆడాడు. యశస్వి జైశ్వాల్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన రిషబ్.. తనదైన స్టైల్లో బ్యాటింగ్ చేశాడు.మొదటి రోజు ఆటముగిసే సమయానికి పంత్ 65 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో ఇప్పటివరకు 6 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో పంత్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.హిట్మ్యాన్ రికార్డు బ్రేక్..వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ హిస్టరీలోనే అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా పంత్ రికార్డులెక్కాడు. పంత్ ఇప్పటివరకు డబ్ల్యూటీసీలో 35 మ్యాచ్లు ఆడి 58 సిక్సర్లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ(56) పేరిట ఉండేది.తాజా మ్యాచ్తో రోహిత్ను రిషబ్ అధిగమించాడు. ఇక ఓవరాల్గా ఈ ఫీట్ సాధించిన జాబితాలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(83) అగ్రస్ధానంలో ఉండగా.. పంత్ రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్లో మూడు వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో కెప్టెన్ శుబ్మన్ గిల్(127 నాటౌట్), యశస్వి జైశ్వాల్(101) సెంచరీలతో మెరిశారు.చదవండి: అలా అయితే అవుట్ అయిపోతావు! గిల్కు పంత్ వార్నింగ్.. వైరల్ -
IND vs ENG: టీమిండియాకు బ్యాడ్ న్యూస్?!
ఇంగ్లండ్తో తొలి టెస్టు ఘనంగా ఆరంభించిన టీమిండియా జోరుకు రెండో రోజు కాస్త బ్రేక్ పడే అవకాశం ఉంది. వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆక్యూవెదర్ వివరాల ప్రకారం.. లీడ్స్లో శనివారం ఉదయం ఎండ కాస్తుంది. 28-29 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.అయితే, 25 శాతం మేర వర్షం కురిసేందుకు కూడా ఆస్కారం ఉంది. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత వాన పడే అవకాశాలు 86 శాతం ఉన్నాయి. 31 శాతం ఉరుములు, మెరుపులతో వర్షం కురిసేందుకు ఛాన్స్ ఉంది. టీమిండియా- ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య తొలి టెస్టు రెండో రోజు ఆటలో రెండో, మూడో సెషన్లో వర్షం పడే ఛాన్సులు 77 శాతం ఉన్నాయి.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) 2025-27లో భాగంగా భారత్- ఇంగ్లండ్ తమ తొలి సిరీస్లో పరస్పరం తలపడుతున్నాయి. టెండుల్కర్-ఆండర్సన్ (Tendulkar-Anderson Trophy) ట్రోఫీలో భాగంగా ఇరుజట్లు ఐదు టెస్టులు ఆడతాయి. ఈ క్రమంలో శుక్రవారం లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో తొలి టెస్టు మొదలైంది.ఇరగదీసిన భారత బ్యాటర్లుటాస్ గెలిచిన ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్.. గిల్ సేనను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించాడు. పిచ్ పరిస్థితులను అంచనా వేయడంలో విఫలమై ఈ మేరకు అతడు తీసుకున్న నిర్ణయం భారత్కు కలిసి వచ్చింది. తొలి రోజు పొడిగా ఉన్న పిచ్పై టీమిండియా స్టార్లు బ్యాట్తో ఇరగదీశారు.ఓపెనర్లలో కేఎల్ రాహుల్ (42) ఫర్వాలేదనిపించగా.. యశస్వి జైస్వాల్ (101) సెంచరీతో చెలరేగాడు. ఇక కెప్టెన్ శుబ్మన్ గిల్ 175 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 127 పరుగులతో అజేయంగా ఉండగా.. వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ అర్ధ శతకం (65*) పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో తొలిరోజు ఆట ముగిసే సరికి టీమిండియా 85 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 359 పరుగులు చేయగా.. గిల్, పంత్ క్రీజులో ఉన్నారు.వరుణుడు అడ్డుపడతాడా?అయితే, రెండో రోజు ఆటలో వీరు మరింత చెలరేగితే చూడాలని ఆశపడుతున్న అభిమానులకు వరుణుడు షాకిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా తొలిరోజు కూడా ఇదే తరహా హెచ్చరికలు కాగా.. ఆట సజావుగానే సాగింది. ఇక మొదటి రోజు టీమిండియా అభిమానులను నిరాశపరిచిన అంశం ఏదైనా ఉందంటే.. అది సాయి సుదర్శన్ డకౌట్ మాత్రమే.అదొక్కటే నిరాశఇంగ్లండ్ గడ్డ మీద ఈ తమిళనాడు బ్యాటర్ టెస్టు క్రికెట్లోకి అడుగు పెట్టాడు. 24 ఏళ్ల సాయి భారత్ తరఫున టెస్టు ఆడిన 317వ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. భారత సీనియర్ క్రికెటర్ చతేశ్వర్ పుజారా అతనికి టెస్టు క్యాప్ను అందించాడు. అయితే, దురదృష్టవశాత్తూ కెరీర్ తొలి ఇన్నింగ్స్ అతనికి కలిసి రాలేదు. నాలుగు బంతులే ఎదుర్కొన్న అతను ‘సున్నా’కే వెనుదిరిగాడు. ఇదిలా ఉంటే.. టెస్టు అరంగేట్రానికి ముందు సాయి భారత్ తరఫున 3 వన్డేలు, 1 టీ20 మ్యాచ్ ఆడాడు. చదవండి: బుర్ర వాడేవాళ్లు ఇలాంటి పనిచేయరు: స్టోక్స్పై మాజీ కెప్టెన్ ఫైర్ -
అలా అయితే అవుట్ అయిపోతావు! గిల్కు పంత్ వార్నింగ్.. వైరల్
ఇంగ్లండ్తో తొలి టెస్టులో మొదటి రోజు టీమిండియా అదరగొట్టింది. సీనియర్లు లేకపోయినా మేమున్నాము కదా అంటూ యువ ఆటగాళ్లు బ్యాట్తో చెలరేగారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)తో పాటు కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) శతకంతో చెలరేగితే.. వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) కూడా హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.భారీ భాగస్వామ్యాలుజైసూ 101 పరుగులు సాధించి.. బెన్ స్టోక్స్ బౌలింగ్లో బౌల్డ్ కాగా.. శుక్రవారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి గిల్ 127, పంత్ 65 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా జైస్వాల్ మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (42)తో కలిసి తొలి వికెట్కు 91 పరుగులు జోడించడంతో పాటు.. గిల్తో కలిసి మూడో వికెట్కు 129 పరుగులు జతచేశాడు.అనంతరం గిల్కు తోడైన పంత్ అభేద్యంగా 138 పరుగుల భాగస్వామ్యం జోడించి.. అతడితో కలిసి నాటౌట్గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో మొదటి రోజు ఆట ముగిసే సరికి భారత్ 85 ఓవర్లు ఆడి మూడు వికెట్ల నష్టానికి 359 పరుగులు సాధించింది.ఇక మొదటి రోజు ముగింపునకు చేరే క్రమంలో షాట్ ఎంపిక విషయంలో గిల్కు పంత్ స్నేహపూర్వక హెచ్చరిక జారీ చేశాడు.ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ సంధించిన ఫుల్లర్ బాల్ను ఆడేందుకు క్రీజు వెలుపలికి వచ్చిన గిల్.. షార్ట్ కవర్ దిశగా బాదాడు.అలా అయితే అవుట్ అయిపోతావు!ఆ సమయంలో నాన్- స్ట్రైకర్ ఎండ్లో ఉన్న పంత్.. ‘‘క్రీజు బయటకు వచ్చేటపుడు కాస్త చూసుకో.. ఏమాత్రం తేడా జరిగినా క్యాచ్ అవుట్ అయ్యే ప్రమాదం ఉంది’’ అని హెచ్చరించాడు. మైక్ స్టంప్లో ఈ మాటలు రికార్డు అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.కాగా ఇంగ్లండ్తో టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టు అక్కడికి వెళ్లింది. ఈ సిరీస్తో ఇరుజట్లు తమ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సైకిల్ను మొదలుపెట్టాయి. ఇక ఇదే సిరీస్తో టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్.. అతడికి డిప్యూటీగా రిషభ్ పంత్ తమ ప్రస్థానం మొదలుపెట్టారు.ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా లీడ్స్లోని హెడింగ్లీలో తొలి మ్యాచ్ జరుగుతుండగా.. ఎడ్జ్బాస్టన్ (బర్మింగ్హామ్), లార్డ్స్ (లండన్), ఎమిరేట్స్ ఓల్డ్ ట్రఫోర్డ్ (మాంచెస్టర్), కెన్నింగ్టన్ ఓవల్ (లండన్) మిగిలిన టెస్టులకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ తొలి టెస్టు👉షెడ్యూల్: జూన్ 20- 24👉వేదిక: హెడింగ్లీ, లీడ్స్👉టాస్: ఇంగ్లండ్.. తొలుత బౌలింగ్👉తొలిరోజు ఆట ముగిసేసరికి టీమిండియా స్కోరు: 359/3 (85).చదవండి: బుర్ర వాడేవాళ్లు ఇలాంటి పనిచేయరు: స్టోక్స్పై మాజీ కెప్టెన్ ఫైర్Warning: When @RishabhPant17's on strike, expect some advice and plenty of chatter between the wickets! 😜🎙️Watch now 👉 https://t.co/PXeXAKeYoj #ENGvIND | 1st Test | LIVE NOW on JioHotstar pic.twitter.com/v53iqPg8cm— Star Sports (@StarSportsIndia) June 20, 2025 -
ఆరోజు ముగ్గురం సెంచరీలు చేశామన్న సచిన్.. గంగూలీ రిప్లై ఇదే
ఇంగ్లండ్ (Ind vs Eng Tests)తో టెస్టు సిరీస్ ప్రయాణంలో టీమిండియా శుభారంభం అందుకుంది. లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో.. శుక్రవారం మొదలైన తొలి టెస్టు మొదటి రోజు ఆటలోనే పటిష్ట స్థితిలో నిలిచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన గిల్ సేన.. 85 ఓవర్ల ఆటలో మూడు వికెట్ల నష్టానికి మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 359 పరుగులు సాధించి పట్టు బిగించింది.ఓపెనర్లలో కేఎల్ రాహుల్ (42) రాణించగా.. యశస్వి జైస్వాల్ (101) శతకంతో చెలరేగాడు. ఇక టీమిండియా టెస్టు సారథిగా తొలి మ్యాచ్లో శుబ్మన్ గిల్ కూడా అద్భుత సెంచరీతో మెరిశాడు. శుక్రవారం నాటి ఆట ముగిసే సరికి గిల్ 127 పరుగులతో క్రీజులో ఉండగా.. వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) 65 పరుగులతో అతడికి తోడుగా ఉన్నాడు.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్లో మొదటి టెస్టులో తొలి రోజు టీమిండియా ప్రదర్శనపై బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) సంతృప్తి వ్యక్తం చేశాడు. కేఎల్ రాహుల్, జైస్వాల్, గిల్, పంత్లను ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు.‘‘కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ భారత ఇన్నింగ్స్కు బలమైన పునాది వేశారు. ఇక అద్భుతమైన శతకాలు బాదిన జైస్వాల్, శుబ్మన్ గిల్లకు శుభాకాంక్షలు. రిషభ్ పంత్ కూడా వీరితో సమానంగా తన వంతు పని పూర్తి చేశాడు.ఈరోజు టీమిండియా బ్యాటింగ్ను చూస్తుంటే.. నాకు 2002లో హెడింగ్లీలో.. రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, నేను తొలి ఇన్నింగ్స్లో శతకాలు బాదడం గుర్తుకువచ్చింది. ఆ టెస్టులో మేము గెలిచాము.ఈరోజు.. యశస్వి, శుబ్మన్ తమ పని పూర్తి చేశారు. ఇక మూడో సెంచూరియన్ ఎవరు అవుతారో చూడాలి’’ అని సచిన్ టెండుల్కర్ పేర్కొన్నాడు. ఇందుకు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందిస్తూ.. ‘‘హాయ్ చాంప్.. ఈసారి నలుగురు సెంచరీలు చేస్తారేమో.. పిచ్ బాగుంది.. పంత్.. కరుణ్ కూడా శతకాలు బాదుతారేమో!అయితే, 2002 నాడు తొలి రోజు పిచ్ స్వభావానికి ఇప్పటి వికెట్కు కాస్త తేడా ఉంది’’ అని బదులిచ్చాడు. కాగా 2002లో ఇదే వేదికపై సచిన్ టెండుల్కర్ గంగూలీతో కలిసి 249 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇక టెండుల్కర్ 303 బంతుల్లో 193 పరుగులు సాధించగా.. గంగూలీ 128 రన్స్ స్కోరు చేశాడు. అదే విధంగా.. ‘వాల్’ రాహుల్ ద్రవిడ్ 148 పరుగులు చేయగా.. అప్పటి ఓపెనర్ సంజయ్ బంగర్ 68 రన్స్ రాబట్టాడు.కాగా ఇప్పటి వరకు ఇంగ్లండ్- టీమిండియా మధ్య టెస్టు సిరీస్ను పటౌడీ ట్రోఫీగా పిలిచేవారు. తాజాగా దీనికి టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీగా నామకరణం చేశారు. ఇక దఫా పర్యటనలో భారత్ ఇంగ్లండ్తో ఐదు టెస్టుల్లో తలపడనుంది. దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి, స్పిన్ లెజెండ్ రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ టెస్టులకు గుడ్బై చెప్పిన తర్వాత.. టీమిండియా ఆడుతున్న తొలి సిరీస్ ఇదే. రోహిత్ స్థానంలో టెస్టు జట్టు కెప్టెన్గా పగ్గాలు చేపట్టిన యువ ఆటగాడు శుబ్మన్ గిల్కు ఈ సిరీస్ ప్రతిష్టాత్మకంగా మారింది.Tendulkar at Leeds, 2002pic.twitter.com/o7MlA5Zn3L— Cricketopia (@CricketopiaCom) June 20, 2025 చదవండి: నాకు అది అలవాటు..! నువ్వే గుర్తు చేస్తూ ఉండాలి!.. నో చెప్పడం వల్లే ఇలా.. -
IND Vs ENG: ఇంగ్లండ్ గడ్డపై అదరగొట్టిన భారత బ్యాటర్లు.. పట్టుబిగించిన ‘గిల్’ సేన (ఫొటోలు)
-
ధోని వరల్డ్ రికార్డుపై కన్నేసిన పంత్
టీమిండియా యువ ఆటగాడు రిషభ్ పంత్ (Rishabh Pant).. భారత దిగ్గజ కెప్టెన్, లెజెండరీ వికెట్ కీపర్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) ప్రపంచ రికార్డుపై కన్నేశాడు. ఇంగ్లండ్ గడ్డ మీద సరికొత్త చరిత్ర సృష్టించేందుకు 267 పరుగుల దూరంలో నిలిచాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) 2025-27లో భాగంగా భారత్- ఇంగ్లండ్ శుక్రవారం నుంచి ఐదు మ్యాచ్ల సిరీస్లో తలపడనున్నాయి.ఇంగ్లండ్ గడ్డ మీద అరంగేట్రంఈ సిరీస్తో టీమిండియా సారథిగా శుబ్మన్ గిల్ ప్రస్థానం మొదలుకానుండగా.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. కాగా 2018లో టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన పంత్.. ఇంగ్లండ్తో తన తొలి మ్యాచ్ ఆడాడు.ట్రెంట్ బ్రిడ్జి వేదికగా నాడు ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్టులో పంత్ రెండు ఇన్నింగ్స్లో వరుసగా 24, 1 పరుగు చేశాడు. ఈ మ్యాచ్లో టీమిండియా 203 పరుగుల భారీ తేడాతో గెలిచింది. అరంగేట్రంలో అంతంత మాత్రంగానే ఆడిన పంత్.. ఇంగ్లండ్ మీద ఆ తర్వాత మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు.రెండు సెంచరీలుఇప్పటి వరకు మొత్తంగా అక్కడ ఎనిమిది టెస్టు మ్యాచ్లు ఆడిన పంత్ 511 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు కూడా ఉన్నాయి. ఇక ఇంగ్లండ్లో అత్యధిక పరుగులు చేసిన పర్యాటక జట్ల వికెట్ కీపర్ల జాబితాలో 27 ఏళ్ల పంత్ ప్రస్తుతం తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఈ లిస్టులో టీమిండియా లెజెండ్ ధోని అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.ఇంగ్లండ్లో ధోని మొత్తంగా 778 పరుగులు సాధించాడు. అతడిని అధిగమించాలంటే.. పంత్ ఇంకో 267 పరుగులు చేయాలి. తాజా పర్యటనలో భాగంగా టీమిండియా ఐదు టెస్టులు ఆడనున్న నేపథ్యంలో.. పంత్ గనుక బ్యాట్ ఝులిపిస్తే ఇదేమీ అంతకష్టం కాబోదు. మరి.. ఈ ఉత్తరాఖండ్ బ్యాటర్ ఈసారి ధోని వరల్డ్ రికార్డును బ్రేక్ చేస్తాడేమో చూడాలి!!కాగా రిషభ్ పంత్ టీమిండియా తరఫున ఇప్పటి వరకు 43 టెస్టు మ్యాచ్లు ఆడి 2948 పరుగులు చేశాడు. ఇందులో ఆరు శతకాలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.ఇంగ్లండ్లో అత్యధిక పరుగులు సాధించిన పర్యాటక జట్ల వికెట్ కీపర్ బ్యాటర్లు వీరే..1. మహేంద్ర సింగ్ ధోని (ఇండియా)- 778 పరుగులు2. రోడ్నీ మార్ష్(ఆస్ట్రేలియా)- 773 పరుగులు3. జాన్ హెన్రీ (సౌతాఫ్రికా)- 684 పరుగులు4. ఇయాన్ హేలీ (ఆస్ట్రేలియా)- 624 పరుగులు5. జెఫ్రీ డుజాన్ (వెస్టిండీస్)- 604 పరుగులు6. ఫారూఖ్ ఇంజనీర్ (ఇండియా)- 563 పరుగులు7. ఆడం గిల్క్రిస్ట్ (ఆస్ట్రేలియా)- 521 పరుగులు8. బ్రాడ్ హాడిన్ (ఆస్ట్రేలియా)- 513 పరుగులు9. రిషభ్ పంత్ (ఇండియా)- 511 పరుగులు.చదవండి: ’కర్మ ఎవరినీ వదిలిపెట్టదు.. కచ్చితంగా అనుభవిస్తారు’ -
Ind vs Eng: కోహ్లి స్థానంలో అతడే: క్లారిటీ ఇచ్చిన పంత్
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ ఆరంభం నేపథ్యంలో టీమిండియా వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ కీలక అప్డేట్ అందించాడు. విరాట్ కోహ్లి స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి పేరు వెల్లడించాడు. మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో కెప్టెన్ శుబ్మన్ గిల్ బరిలోకి దిగుతాడని స్పష్టం చేశాడు.ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగంగా టీమిండియా తమ తొలి సిరీస్లో ఇంగ్లండ్తో తలపడనుంది. లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. కాగా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు ముందే రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో రోహిత్ స్థానాన్ని శుబ్మన్ గిల్తో భర్తీ చేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI).. అతడికి డిప్యూటీగా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ను నియమించింది. కాగా కోహ్లి నిష్క్రమణ నేపథ్యంలో టెస్టుల్లో భారత బ్యాటింగ్ ఆర్డర్లో నాలుగో స్థానంలో ఎవరు దిగుతారన్న అంశంపై గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.కోహ్లి వారసుడిగా కరుణ్ నాయర్, సాయి సుదర్శన్ పేర్లు వినిపించాయి. తాజాగా ఈ విషయంపై వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ క్లారిటీ ఇచ్చేశాడు. ప్రి- మ్యాచ్ కాన్ఫరెన్స్లో భాగంగా బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘శుబ్మన్ గిల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు.అయితే, అతడు ఆడుతున్న మూడో స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తారన్న అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నేను యథావిధిగా ఐదో స్థానంలో బ్యాటింగ్కు వస్తాను’’ అని రిషభ్ పంత్ వెల్లడించాడు. దీంతో తుదిజట్టుపై మరోసారి సందిగ్దం నెలకొంది. సాయి సుదర్శన్ టెస్టుల్లో అరంగేట్రం చేస్తాడా? లేదంటే ‘ట్రిపుల్ సెంచూరియన్’ కరుణ్ నాయర్ ఎనిమిదేళ్ల తర్వాత పునరాగమనం చేస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది.ఇంగ్లండ్తో టెస్టులకు టీమిండియా:శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్/వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.చదవండి: టీమిండియాకు గేమ్ ఛేంజర్లు వీరిద్దరే: ఊహించని పేర్లు చెప్పిన ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ -
స్టేడియం పైకప్పు బద్దలు కొట్టిన పంత్.. వైరల్ వీడియో
ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం భారత సీనియర్ క్రికెట్ జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్ జూన్ 20న లీడ్స్లోని హెడింగ్లేలో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్కు ముందు భారత్ జూన్ 13 నుంచి 16 వరకు కెంట్ కౌంటీ క్రికెట్ గ్రౌండ్లో ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడనుంది. ప్రతిష్టాత్మకమైన ఈ సిరీస్ కోసం భారత్ రెండు వారాల ముందే ఇంగ్లండ్లో వాలిపోయింది. ప్రస్తుతం టీమిండియా లార్డ్స్ క్రికెట్ మైదానంలో కఠోరమైన సాధన చేస్తుంది.- PANT BROKE THE ROOF WITH A SIX...!!!🔥 [Espn Cricinfo]- RISHABH PANT IS GEARING UP FOR THE TEST SERIES AGAINST ENGLAND.- RISHABH PANT IS IN GREAT TOUCH WITH BAT, GUD TO SEE HIM.#Rishabhpant#ENGvsIND#rinkusingh#RohitSharma#INDvsAUS#WTCFinalpic.twitter.com/t3dRuyeMGg— Nitesh Prajapati (@itsmenitesh004) June 9, 2025ఇందులో భాగంగా తాజాగా జరిగిన ఓ ప్రాక్టీస్ సెషన్లో టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ఓ భారీ సిక్సర్ బాది వార్తల్లోకెక్కాడు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో పంత్ కొట్టిన ఓ సిక్సర్ స్టేడియం పైకప్పును బద్లలు కొట్టింది. దీనికి సంబంధిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోను చూసి పంత్ అభిమానులు సంబరపడిపోతున్నారు. తమ ఫేవరెట్ ఆటగాడు తిరిగి లయను అందుకున్నాడని ముచ్చటపడిపోతున్నారు.పంత్ను ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్ కోసం టీమిండియా వైస్ కెప్టెన్గా ఎంపిక చేశారు. ఈ సిరీస్లో అతను తొలిసారి భారత టెస్ట్ జట్టుకు కెప్టెన్గా ఎంపికైన శుభ్మన్ గిల్కు డిప్యూటీగా వ్యవహరిస్తాడు. పంత్కు ఇంగ్లండ్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇక్కడ అతను 17 మ్యాచ్ల్లో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీల సాయంతో 32.70 సగటున 556 పరుగులు చేశాడు. పంత్ ఇంగ్లండ్ గడ్డపై చివరి సారి ఆడిన టెస్ట్ మ్యాచ్లో సెంచరీ చేశాడు. 2022 పర్యటనలో అతను 111 బంతుల్లో 146 పరుగులు చేశాడు.పేలవ ఫామ్ కొనసాగినా..!పంత్ తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్లో పేలవ ప్రద్శనలు చేశాడు. 13 ఇన్నింగ్స్ల్లో కేవలం 269 పరుగులు మాత్రమే చేశాడు. సీజన్ ఆధ్యాంతం పేలవ ఫామ్లో కొనసాగిన పంత్.. తమ చివరి లీగ్ మ్యాచ్లో చెలరేగిపోయాడు. ఆర్సీబీతో జరిగిన ఆ మ్యాచ్లో పంత్ విధ్వంసకర శతకంతో (61 బంతుల్లో 118 నాటౌట్) విరుచుకుపడ్డాడు. అయినా ఆ మ్యాచ్లో పంత్ జట్టు ఎల్ఎస్జీ ఓటమిపాలైంది. జితేశ్ శర్మ ఊహకందని మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీని గెలిపించాడు. ఈ సీజన్కు ముందు ఎల్ఎస్జీ పంత్ను రికార్డు ధర రూ. 27 కోట్లకు సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ చరిత్ర సృష్టించాడు. ఇంత డబ్బుపోసి కొనుక్కునా ఈ సీజన్లో పంత్ దారుణంగా నిరాశపరిచాడు. కెప్టెన్గా, ఆటగాడిగా తేలిపోయాడు. సీజన్ ఆరంభంలో టైటిల్ ఫేవరెట్గా కనిపించిన లక్నో చివరి వచ్చే సరికి ఏడో స్థానంతో సీజన్ను ముగించింది. ఇంగ్లండ్ పర్యటనలోనైనా పంత్ స్థాయికి తగ్గట్టు రాణించాలని కోరుకుందాం. -
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్.. టీమిండియాకు భారీ షాక్! స్టార్ ప్లేయర్కు గాయం
ఇంగ్లండ్తో తొలి టెస్టుకు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఆదివారం జరిగిన నెట్ ప్రాక్టీస్ సెషన్లో భారత జట్టు వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ గాయపడినట్లు తెలుస్తోంది. రెవ్స్పోర్ట్స్ ప్రకారం.. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా బంతి అతడి ఎడమ చేతికి బలంగా తాకినట్లు సమాచారం. తీవ్రమైన నొప్పితో పంత్ విల్లవిల్లాడని, ఫిజియో మైదానంలోకి వచ్చి ఐస్ ప్యాక్ పెట్టి చికిత్స అందించాడని సదరు వెబ్సైట్ పేర్కొంది.ఆ తర్వాత ఫిజియో పంత్ తన చేతికి బ్యాండేజ్ వేసినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి పంత్ ప్రాక్టీస్కు దూరంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పంత్ గాయంపై బీసీసీఐ మాత్రం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా పంత్ గాయం తీవ్రమైనది అయితే భారత్కు నిజంగా గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పాలి. ఎందుకంటే భారత టెస్టు జట్టులో పంత్ కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. ఇప్పుడు కొత్త వైస్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా ఈ డైనమిక్ వికెట్ కీపర్ బ్యాటర్ చేపట్టాడు. ఇక ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి టెస్టు లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి 24 వరకు జరగనుంది.అంతకంటే ముందు ఈ నెల 13న ఇండియా-ఎ జట్టుతో భారత సీనియర్ జట్టు ఇంట్రాస్వ్కాడ్ మ్యాచ్ ఆడనుంది. కాగా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు రిటైర్మెంట్ ప్రకటించడంతో శుబ్మన్ గిల్ సారథ్యంలో యువ భారత జట్టు ఇంగ్లండ్ను ఢీకొట్టనుంది.ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు భారత జట్టు..శుభ్మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్, యశస్వి జైస్వాల్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఆకాశ్దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ షెడ్యూల్..జూన్ 20-24- తొలి టెస్ట్ (లీడ్స్)జులై 2-6- రెండో టెస్ట్ (బర్మింగ్హమ్)జులై 10-14- మూడో టెస్ట్ (లార్డ్స్)జులై 23-27- నాలుగో టెస్ట్ (మాంచెస్టర్)జులై 31-ఆగస్ట్ 4- ఐదో టెస్ట్ (కెన్నింగ్స్టన్ ఓవల్) చదవండి: ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియాలో కీలక నియామకం -
ఆల్ది బెస్ట్ టీమిండియా.. ఇంగ్లండ్కు పయనమైన గిల్ సేన (ఫోటోలు)
-
LSG VS RCB: రిషబ్ పంత్పై మండిపడ్డ అశ్విన్.. సొంత బౌలర్నే ఫూల్ చేశాడు..!
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 27) జరిగిన లక్నో-ఆర్సీబీ మ్యాచ్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ కీలక దశలో సాగుతుండగా లక్నో స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీ మన్కడింగ్కు (నాన్ స్ట్రయికర్ ఎండ్లోని బ్యాటర్ బంతి వేయకముందే క్రీజ్ను దాటిన సమయంలో బౌలర్ వికెట్లను గిరాటు వేయడం) పాల్పడ్డాడు. ఈ విషయమై రాఠీ అప్పీల్ చేసినప్పటికీ.. లక్నో కెప్టెన్ పంత్ దాన్ని విత్డ్రా చేసుకున్నాడు. రీప్లే పరిశీలించిన అనంతరం థర్డ్ అంపైర్ దీన్ని నాటౌట్గా ప్రకటించాడు.టెక్నికల్గా (రాఠీ ఫ్రంట్ ఫుట్ ల్యాండ్ అయ్యే సమయానికి నాన్ స్ట్రయికింగ్ ఎండ్లో ఉన్న జితేశ్ శర్మ క్రీజ్లోనే ఉన్నాడు) ఇది నాటౌటే అయినప్పటికీ.. రూల్స్కు విరుద్దం అయితే కాదు. గతంలో చాలా సందర్భాల్లో బౌలర్లు మన్కడింగ్ చేసి బ్యాటర్లను ఔట్ చేశారు. తాజాగా అదే ప్రయత్నం జరిగింది. అయితే ఇక్కడ కెప్టెన్ బౌలర్ను సమర్థించకపోవడం చర్చనీయాంశంగా మారింది.అ విషయమై క్రికెట్ సర్కిల్స్లోభిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు రాఠీ చర్యను సమర్దిస్తుంటే.. మరికొందరు పంత్ అప్పీల్ను వెనక్కు తీసుకోవడాన్ని తప్పుబడుతున్నారు.రాఠీ చర్యను సమర్దించిన వారిలో సీఎస్కే వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఉన్నాడు. యాష్ ఓ పక్క రాఠీ చర్యను సమర్దిస్తూనే, అప్పీల్ను విత్డ్రా చేసుకున్న పంత్ను తప్పుబట్టాడు. పంత్ అప్పీల్ను విత్డ్రా చేసుకోవడం వల్ల రాఠీ కోట్లాది మంది అభిమానుల ముందు ఫూల్ అయ్యాడని అభిప్రాయపడ్డాడు. పంత్ రాఠీని జీవితంలో ఇంకోసారి మన్కడింగ్కు పాల్పడకుండా చేశాడని మండిపడ్డాడు.మన్కడింగ్ విషయంలో బౌలర్లంటే ఎందుకు అంత చిన్న చూపని ప్రశ్నించాడు. ఓ రకంగా బౌలర్కు ఇది అవమానమని అన్నాడు. పంత్ తీసుకున్న నిర్ణయం వల్ల రాఠీ భయపడి ఉంటాడని తెలిపాడు. బౌలర్ చర్యను వెనకేసుకురావడం కెప్టెన్ బాధ్యత అని గుర్తు చేశాడు. ఔటైనా, నాటౌటైనా మన్నడింగ్ అనేది ఆటలో భాగమని అన్నాడు. మ్యాచ్ కీలక దశలో సాగుతుండగా బౌలర్ ఇలాంటి ప్రయత్నం చేయడం తప్పేది కాదని అభిప్రాయపడ్డాడు.కాగా, ఆర్సీబీ 228 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తుండగా ఇన్నింగ్స్ 17వ ఓవర్లో (ఆఖరి బంతికి) ఇది జరిగింది. రాఠీ మన్కడింగ్కు పాల్పడే సమయానికి ఆర్సీబీ 19 బంతుల్లో 29 పరుగులు చేయాలి. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. అప్పటకే జితేశ్ శర్మ జోరు మీదున్నాడు. ఒకవేళ జితేశ్ మన్కడింగ్ ద్వారా ఔటయ్యుంటే ఆర్సీబీ కష్టాల్లో పడేది. మ్యాచ్ను కూడా కోల్పోవాల్సి వచ్చేది. ఇలాంటి సందర్భంలో పంత్ బౌలర్ అప్పీల్ను ఉపసంహరించుకుని ఆర్సీబీకి ఫేవర్ చేశాడు. క్రీడా స్పూర్తి అని పెద్దపెద్ద మాటలు అనుకోవచ్చు కానీ, మ్యాచ్ను కాపాడుకునే ప్రయత్నంలో బౌలర్ చేసింది కరెక్టే అని చెప్పాలి. రాఠీ అప్పీల్ను పంత్ చిన్నచూపు చూసి తన వ్యక్తిగత ఇమేజ్ను పెంచుకున్నాడు. అంతటితో ఆగకుండా అప్పీల్ విత్డ్రా చేసుకున్న తర్వాత జితేశ్ను కౌగించుకుని సొంత బౌలర్ను అవమానించాడు. మన్కడింగ్ తర్వాత మరింత రెచ్చిపోయిన జితేశ్ కొద్ది బంతుల్లోనే మ్యాచ్ను లక్నో చేతుల్లో నుంచి లాగేసుకున్నాడు. -
IPL 2025, LSG VS RCB: విధ్వంసకర శతకం.. పల్టీ కొట్టిన పంత్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పేలవ ప్రదర్శన కారణంగా ముప్పేట దాడిని ఎదుర్కొన్న పంత్ ఎట్టకేలకు తమ చివరి మ్యాచ్లో ఫామ్లోకి వచ్చాడు. ఆర్సీబీతో ఇవాళ (మే 27) జరుగుతున్న మ్యాచ్లో పంత్ విధ్వంసకర శతకంతో (61 బంతుల్లో 118 నాటౌట్; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్లో ఆది నుంచే దూకుడుగా ఆడిన పంత్.. 54 బంతుల్లో సెంచరీని పూర్తి చేశాడు. ఐపీఎల్లో పంత్కు ఇది రెండో సెంచరీ. సెంచరీ పూర్తి చేసిన అనంతరం పంత్ ఆనందంతో పల్టీ కొట్టాడు. దీనికి సంబంధించిన క్లిప్పింగ్స్, వీడియోలు సోషల్మీడియాలో వైరవలవుతున్నాయి.Coldest IPL hundred celebration 🥶pic.twitter.com/WDHHIvLVv6— CricTracker (@Cricketracker) May 27, 2025ఎట్టకేలకు పంత్ తనపై పెట్టిన పెట్టుబడికి (రూ. 27 కోట్లు) న్యాయం చేశాడని నెటిజన్లు అంటున్నారు. ఈ సీజన్లో పంత్ చాలా దారుణమైన ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్కు ముందు 12 ఇన్నింగ్స్ల్లో కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ చేశాడు. పంత్ పేలవ ప్రదర్శన కారణంగా లక్నో సూపర్ జెయింట్స్ చాలా మ్యాచ్ల్లో ఓటమిపాలైంది. ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించాక ఎట్టకేలకు తమ చివరి మ్యాచ్లో పంత్ సెంచరీతో సత్తా చాటాడు.ఇటీవలికాలంలో పంత్ బ్యాట్ నుంచి జాలువారిన అత్యుత్తమ ఇన్నింగ్స్ ఇది. ఐపీఎల్లో పంత్ చివరిగా 2018 సీజన్లో సెంచరీ చేశాడు. నాడు సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో 128 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున నేటికి ఇదే అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్గా చలామణి అవుతుంది. తాజా శతకంతో పంత్ తనలో చేవ తగ్గలేదని నిరూపించుకున్నాడు.ఆర్సీబీతో మ్యాచ్లో పంత్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో పాటు మిచెల్ మార్ష్ (37 బంతుల్లో 67; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీ సాధించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్నో ఇన్నింగ్స్లో మాథ్యూ బ్రీట్జ్కీ 14, పూరన్ 13 పరుగులు చేసి ఔటయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో తుషార, భువనేశ్వర్ కుమార్, షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు.కాగా, ఈ సీజన్లో లక్నో ప్రయాణం ఇదివరకే ముగిసింది. ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఆ జట్టు రెండు మ్యాచ్ల ముందే నిష్క్రమించింది. సీజన్ ఆరంభంలో అద్భుత విజయాలు సాధించిన ఈ జట్టు క్రమంగా నీరసపడిపోయింది. మిచెల్ మార్ష్, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్ అత్యుత్తమ ఫామ్లో ఉన్నా ఎందుకో విజయాలు సాధించలేకపోయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న లక్నో ఆర్సీబీతో ఇవాళ జరుగబోయే మ్యాచ్లో గెలిస్తే ఆరో స్థానానికి చేరుకుంటుంది.ఆర్సీబీ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో లక్నోపై గెలిస్తే ఆర్సీబీ క్వాలిఫయర్-1 బెర్త్ దక్కించుకుంటుంది. ఈ మ్యాచ్లో ఓడితే మాత్రం ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. పంజాబ్ ఇదివరకే క్వాలిఫయర్ బెర్త్ సాధించగా.. మరో బెర్త్ కోసం గుజరాత్, ఆర్సీబీ పోటీలో ఉన్నాయి. ముంబై తప్పనిసరిగా ఎలిమనేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. -
‘శుబ్’ సమయం మొదలు
భారత టెస్టు క్రికెట్కు కొత్త నాయకుడు వచ్చాడు...నాలుగున్నరేళ్ల కెరీర్ అనుభవం ఉన్న శుబ్మన్ గిల్ టీమిండియా టెస్టు సారథిగా ఎంపికయ్యాడు... 93 ఏళ్ల భారత టెస్టు చరిత్రలో 37వ సారథిగా గిల్ బాధ్యతలు చేపడుతున్నాడు...గత కొంత కాలంగా చర్చ సాగినట్లుగా ఎలాంటి అనూహ్య నిర్ణయాలు లేకుండా సెలక్టర్లు 25 ఏళ్ల గిల్కే మద్దతు పలికారు... ఇంగ్లండ్ పర్యటనలో అతను తొలిసారి టెస్టు జట్టును నడిపించనున్నాడు. టెస్టు జట్టులో సాయిసుదర్శన్, అర్ష్ దీప్ లకు తొలి అవకాశం లభించగా...ఎనిమిదేళ్ల తర్వాత కరుణ్ నాయర్ మళ్లీ టీమ్లోకి రావడం విశేషం. ముంబై: ఇంగ్లండ్తో గడ్డపై జరిగే ఐదు టెస్టుల సిరీస్ కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. 18 మంది సభ్యుల ఈ బృందానికి శుబ్మన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. వికెట్ కీపర్ రిషభ్ పంత్కు వైస్ కెప్టెన్సీ దక్కింది. ఆసీస్తో సిరీస్లో బుమ్రా కెప్టెన్గా వ్యవహరించినా...అతని ఫిట్నెస్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని కెప్టెన్సీ కోసం బుమ్రా పేరును పరిశీలించలేదు. కోహ్లి, రోహిత్, అశ్విన్ల శకం ముగిసిన తర్వాత భవిష్యత్తు కోసం టీమ్ను సిద్ధం చేసే కోణంలో జట్టు ఎంపిక జరిగింది. 2025–27 వరల్డ్ టెస్టు చాంపియన్షిప్లో భాగంగా భారత్ పాల్గొనే తొలి సిరీస్ ఇదే కానుంది. భారత జట్టు చివరిసారిగా ఆ్రస్టేలియాలో ఆడిన టెస్టు సిరీస్తో పోలిస్తే జట్టులో ఐదు మార్పులు జరిగాయి. కోహ్లి, రోహిత్, అశ్విన్ రిటైర్ కాగా...రెండు టెస్టులు ఆడిన పేసర్ హర్షిత్ రాణా, ఒక్క మ్యాచ్ కూడా ఆడని బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ స్థానం కోల్పోయారు. వీరి స్థానాల్లో కరుణ్ నాయర్, సాయిసుదర్శన్, అర్ష్ దీప్ సింగ్, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చారు. ఎనిమిదేళ్ల తర్వాత... 33 ఏళ్ల కరుణ్ నాయర్ తన కెరీర్లో 6 టెస్టులు ఆడాడు. తన మూడో టెస్టులో ఇంగ్లండ్పై 303 పరుగులు చేసి అజేయంగా నిలిచిన అతను...సెహ్వాగ్ తర్వాత ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అయితే ఆ తర్వాత మరో 3 టెస్టులు మాత్రమే ఆడి జట్టులో 2017లో జట్టులో స్థానం కోల్పోయాడు. ఈ సీజన్ రంజీ ట్రోఫీలో 9 మ్యాచ్లలో 863 పరుగులు సాధించి రేసులోకి వచ్చాడు. కోహ్లి రిటైర్మెంట్తో మిడిలార్డర్లో ఖాళీ ఏర్పడి మరో అవకాశం లభించింది. దేశవాళీ క్రికెట్లో, భారత్ ‘ఎ’ తరఫున టన్నుల కొద్దీ పరుగులు చేసి అభిమన్యు ఈశ్వరన్కు మరోసారి పిలుపు లభించింది. ఇక ఇప్పటికీ వన్డేలు, టి20లు ఆడిన పేసర్ అర్ష్ దీప్ సింగ్, సాయి సుదర్శన్కు టెస్టుల్లో ఇదే తొలి అవకాశం. షమీ అవుట్... సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీకి ఊహించినట్లుగానే చోటు దక్కలేదు. గాయం నుంచి కోలుకున్న తర్వాత వన్డేలు, టి20లు ఆడినా...టెస్టు మ్యాచ్లకు తగిన స్థాయిలో అతని ఫిట్నెస్ లేదని సెలక్టర్లు తేల్చారు. కివీస్తో సిరీస్లో చివరి రెండు టెస్టుల్లో విఫలమై మళ్లీ మ్యాచ్ అవకాశం దక్కని సర్ఫరాజ్ ఖాన్ను కూడా పక్కన పెట్టారు. ఆసీస్ గడ్డపై రెండు టెస్టులు ఆడిన హర్షిత్ రాణాను కూడా ఎంపిక చేయలేదు. ‘కోహ్లి, రోహిత్, అశ్విన్లాంటి ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేయడం కష్టం. అయితే కొత్తగా జట్టులోకి వచ్చే వారికి తమ సత్తా చాటేందుకు ఇది మంచి అవకాశం. ఫిట్నెస్ సమస్యల కారణంగా బుమ్రా అన్నీ టెస్టులూ ఆడతాడనే నమ్మకం లేదు. అందుకే కెప్టెన్సీ భారం లేకుండా అతను బౌలర్గా మాకు అందుబాటులో ఉంటే చాలు. ఈ విషయాన్ని బుమ్రా కూడా అర్థం చేసుకున్నాడు. గిల్లో మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న విషయాన్ని గమనించాం. చాలా మంది అభిప్రాయాలు కూడా విన్నాం. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొనే కెప్టెన్, జట్టును ఎంపిక చేశాం. ప్రస్తుత స్థితిలో సర్ఫరాజ్తో పోలిస్తే అనుభవజ్ఞుడైన కరుణ్ సరైనవాడు అనిపించింది’ అని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వ్యాఖ్యానించారు. భారత జట్టు వివరాలు గిల్ (కెప్టెన్ ), పంత్ (వైస్ కెప్టెన్ ), జైస్వాల్, రాహుల్, జురేల్, జడేజా, కుల్దీప్, బుమ్రా, సిరాజ్, ఆకాశ్దీప్, ప్రసిధ్, సుదర్శన్, ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, సుందర్, శార్దుల్, అర్ష్ దీప్ భారత జట్టు విజేతగా నిలిచిన 2020–21 బోర్డర్ గావస్కర్ ట్రోఫీతో శుబ్మన్ గిల్ టెస్టుల్లోకి అడుగు పెట్టాడు. 91 పరుగులతో చారిత్రాత్మక గాబా టెస్టు విజయంలో అతను కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత టెస్టు టీమ్లో గిల్ రెగ్యులర్ సభ్యుడిగా మారాడు. భారత జట్టు ఆడిన రెండు వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్లలో గిల్ ఆడాడు. 32 టెస్టుల కెరీర్లో గిల్ 35.05 సగటుతో 1893 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 7 అర్ధ సెంచరీలు ఉన్నాయి.స్వదేశంలో ప్రదర్శనతో పోలిస్తే విదేశీ గడ్డపై అతని రికార్డు పేలవంగా ఉన్నా...మంచి ప్రతిభావంతుడైన బ్యాటర్గా మున్ముందు సత్తా చాటగలడని సెలక్టర్లు నమ్ముతున్నారు. భారత అండర్–19 జట్టు తరఫున ఆడినా అతను కెపె్టన్గా ఎప్పుడు వ్యవహరించలేదు. రంజీ ట్రోఫీలో కూడా పంజాబ్కు ఒకే ఒక మ్యాచ్లో సారథ్యం వహించాడు. అయితే భారత్కు 5 టి20 మ్యాచ్లలో కెప్టెన్ గా పని చేసిన అనుభవం గిల్కు ఉంది. రెండు సీజన్లుగా ఐపీఎల్లో గుజరాత్ జట్టును నడిపిస్తున్నాడు. -
IPL 2025: మళ్లీ అదే కథ.. తీరు మారని రిషబ్ పంత్
ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఆట తీరు ఏ మాత్రం మారలేదు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న కీలక మ్యాచ్లో పంత్ తీవ్ర నిరాశపరిచాడు. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన పంత్.. 6 బంతులు ఎదుర్కొని కేవలం 7 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.ఎస్ఆర్హెచ్ పేసర్ ఇషాన్ మలింగ బౌలింగ్లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి పంత్ పెవిలియన్కు చేరాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన పంత్.. తన ధరకు ఏ మాత్రం న్యాయం చేయలేకపోయాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడిన పంత్.. 12.27 సగటుతో కేవలం 135 పరుగులు మాత్రమే చేశాడు.ఈ క్రమంలో పంత్ చెత్త ఆట తీరును లక్నో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో పంత్ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. పంత్ నీవు ఇక మారవా అంటూ ఎక్స్లో పోస్టులు పెడుతున్నారు. ఈ మ్యాచ్లో పంత్ ఔటైన అనంతరం మ్యాచ్ వీక్షిస్తున్న లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో రూ. 27 కోట్ల భారీ ధరకు లక్నో కొనుగోలు చేసింది.ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్(39 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్స్లతో 65), మార్క్రమ్(38 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 61) హాఫ్ సెంచరీలతో రాణించగా.. నికోలస్ పూరన్(26 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్తో 45) మెరుపులు మెరిపించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఇషాన్ మలింగ రెండు వికెట్లు పడగొట్టగా.. దూబే, హర్షల్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి తలా వికెట్ సాధించారు.చదవండి: అతడొక అద్బుతం.. గిల్ను మించిపోయాడు: జడేజా -
LSG Vs SRH: రైజర్స్ గాడిన పడేనా!
లక్నో: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ 18వ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జట్టు నామమాత్రమైన పోరుకు సిద్ధమైంది. సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ)తో రైజర్స్ తలపడనుంది. ఇప్పటికే ‘ప్లే ఆఫ్స్’ రేసు నుంచి తప్పుకున్న గత సీజన్ రన్నరప్ సన్రైజర్స్... మెరుగైన స్థానంతో ఈ సీజన్కు ముగింపు పలకాలని భావిస్తోంటే... పడుతూ లేస్తూ సాగుతున్న లక్నో జట్టు మిగిలిన మూడు మ్యాచ్ల్లోనూ విజయం సాధించాలని తహతహలాడుతోంది. రిషభ్ పంత్ సారథ్యంలోని లక్నో జట్టు గత ఐదు మ్యాచ్ల్లో నాలుగింట ఓడింది. ఈ నేపథ్యంలో తెగించి పోరాడేందుకు రెడీ అవుతోంది. పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్న లక్నో సారథి పంత్పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. అనుకోని విరామం తర్వాతైనా పంత్ విజృంభిస్తాడా చూడాలి. ఈ సీజన్లో 11 మ్యాచ్లాడిన లక్నో 5 విజయాలు, 6 పరాజయాలతో 10 పాయింట్లతో ఉంది. మరోవైపు ‘ఆరెంజ్ ఆర్మీ’ 11 మ్యాచ్ల్లో 3 విజయాలు, 7 ఓటములు, ఒక మ్యాచ్లో ఫలితం తేలకపోవడంతో 7 పాయింట్లతో ఉంది. బౌలింగ్ మెరుగైతేనే! తొలి మ్యాచ్లో భారీ స్కోరు చేసి ప్రత్యర్థులను హడలెత్తించిన సన్రైజర్స్ ఆ తర్వాత అదే జోరు కొనసాగించడంలో విఫలమైంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో ఏమాత్రం ప్రభావం చూపలేక పరాజయాలతో సహవాసం చేసింది. ఇప్పటికే రేసు నుంచి తప్పుకున్న కమిన్స్ బృందం... ఇక మిగిలిన మూడు మ్యాచ్ల్లో అయినా కాస్త మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తోంది. గతేడాది ‘ఎమర్జింగ్ ప్లేయర్’ అవార్డు గెలుచుకున్న ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఈసారి పేలవ ప్రదర్శన చేస్తుంటే... తొలి మ్యాచ్లో సెంచరీ చేసిన ఇషాన్ కిషన్ ఆ తర్వాత జట్టుకే భారంగా మారాడు. అభిషేక్ శర్మ అడపాదడపా మెరుపులు తప్ప నిలకడలేమితో ఇబ్బంది పడుతుంటే... సీజన్లో కాస్త మెరుగైన ప్రదర్శన చేసిన ట్రావిస్ హెడ్ కోవిడ్–19 సోకడంతో ఈ మ్యాచ్కు అందుబాటులో లేకుండా పోయాడు. దీంతో అభిషేక్తో కలిసి ఇషాన్ ఇన్నింగ్స్ను ఆరంభించనుండగా... సచిన్ బేబీకి తుది జట్టులో చోటు దక్కనుంది. మిడిలార్డర్లో క్లాసెన్, నితీశ్, అనికేత్, మెండిస్ కీలకం కానున్నారు. ఇక ఈ సీజన్లో లయ దొరకబుచ్చుకోలేక ఇబ్బంది పడుతున్న టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీతో పాటు కమిన్స్, ఉనాద్కట్ బౌలింగ్లో మెరుగుపడాల్సిన అవసరముంది. పంత్పైనే అందరి చూపు పది రోజుల విరామం తర్వాత బరిలోకి దిగుతున్న లక్నో జట్టు పంత్పై భారీ ఆశలు పెట్టుకుంది. ఈ సీజన్లో 10 ఇన్నింగ్స్ల్లో ఆరుసార్లు సింగిల్ డిజిట్కే పరిమితమైన పంత్... 12.8 సగటుతో 128 పరుగులు చేశాడు. కనీసం 100 బంతులు ఎదుర్కొన్న వారిలో పంత్దే అతితక్కువ సగటు, స్ట్రయిక్ రేట్. ఈ గణాంకాలు చాలు ఈ సీజన్లో పంత్ ఎంతలా తడబడుతున్నాడో అర్థం చేసుకునేందుకు. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో అయితే అబ్దుల్ సమద్, ఆయుశ్ బదోనీ తర్వాత ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. భారత టెస్టు జట్టు కెప్టెన్సీ రేసులో ముందు వరసలో ఉన్న పంత్ ఈ మ్యాచ్లోనైనా చెలరేగుతాడా చూడాలి. మార్క్రమ్, మార్‡్ష, పూరన్, మిల్లర్ రూపంలో నలుగురు భీకర బ్యాటర్లు లక్నోకు అందుబాటులో ఉండగా... మిల్లర్ ఫామ్లేమీ మేనేజ్మెంట్ను ఇబ్బంది పెడుతోంది. బౌలింగ్లో లక్నో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆరంభంలో మెరిపించిన శార్దుల్ ఠాకూర్ ప్రభావం చూపలేకపోతుండగా... మయాంక్ యాదవ్ గాయాలతో సతమతమవుతున్నాడు. విఘ్నేశ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్, అవేశ్ ఖాన్ కలసి కట్టుగా కదంతొక్కాల్సిన అవసరముంది. తుది జట్లు (అంచనా) లక్నో సూపర్ జెయింట్స్: పంత్ (కెప్టెన్), మార్క్రమ్, మార్‡్ష, పూరన్, బదోని, మిల్లర్, సమద్, రవి బిష్ణోయ్, శార్దుల్ ఠాకూర్, విగ్నేశ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్, అవేశ్ ఖాన్. సన్రైజర్స్ హైదరాబాద్: కమిన్స్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, సచిన్ బేబీ, క్లాసెన్, నితీశ్ రెడ్డి, అనికేత్ వర్మ, కమిందు మెండిస్, ఉనాద్కట్, హర్శల్ పటేల్, షమీ, జీషాన్ అన్సారీ. -
తుదిజట్టులో చోటే కష్టం.. అలాంటి ఆటగాడు కెప్టెనా?
టీమిండియా టెస్టు జట్టు కొత్త కెప్టెన్ ఎవరు?.. జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపించగలిగే సత్తా ఉన్న నాయకుడు ఎవరు?.. భారత క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)కు పగ్గాలు అప్పగించాలని సునిల్ గావస్కర్, అనిల్ కుంబ్లే వంటి దిగ్గజ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.మరోవైపు.. ఇప్పటికే యువ ఆటగాడు శుబ్మన్ గిల్ (Shubman Gill)ను సారథిగా నియమించడం లాంఛనమే అని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ గిల్ను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశాడు. టెస్టు తుదిజట్టులో చోటే కరువైన ఆటగాడు కెప్టెన్సీకి ఎలా అర్హుడు అవుతాడని ప్రశ్నించాడు.విదేశీ గడ్డపై గిల్ విఫలంకాగా 2020లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన గిల్.. ఇప్పటికి 32 మ్యాచ్లు ఆడాడు. 35.06 సగటుతో 1893 పరుగులు సాధించాడు. ఇందులో ఏడు అర్ధ శతకాలు, ఐదు సెంచరీలు ఉన్నాయి. అయితే, సొంతగడ్డపై వైట్ జెర్సీలో రాణిస్తున్న గిల్కు విదేశాల్లో రికార్డు అంత గొప్పగా ఏమీ లేదు.ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్లో గిల్ దారుణంగా విఫలమయ్యాడు. ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో మొత్తంగా 93 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అతడి చెత్త ప్రదర్శ కారణంగా మెల్బోర్న్ టెస్టులో ఆడించకుండా యాజమాన్యం వేటు వేసింది కూడా!తుదిజట్టులో చోటే కష్టం.. అలాంటి ఆటగాడు కెప్టెనా?అంతకు ముందు వెస్టిండీస్, సౌతాఫ్రికా పర్యటనల్లోనూ ఈ కుడిచేతి వాటం బ్యాటర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ గిల్ వైఫల్యాలను ఎత్తి చూపాడు. ‘‘టెస్టు క్రికెట్లో అతడు ఇంకా పూర్తిగా నిలదొక్కుకోనేలేదు.మరి ఇప్పుడే కెప్టెన్గా ఎందుకు? జస్ప్రీత్ బుమ్రానే సారథిని చేయాలి. ఒకవేళ అతడు ఫిట్గా లేకుంటే కేఎల్ రాహుల్ లేదంటే రిషభ్ పంత్లలో ఒకరు భారత జట్టుకు నాయకుడిగా వ్యవహరించాలి’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ హిందుస్తాన్ టైమ్స్తో పేర్కొన్నాడు.కేఎల్ రాహుల్ సరైనోడుఇక విరాట్ కోహ్లి రిటైర్మెంట్ నేపథ్యంలో కీలకమైన నాలుగో స్థానంలో కేఎల్ రాహుల్ను ఆడించాలని చిక్కా ఈ సందర్భంగా సూచించాడు. కోహ్లి వదిలి వెళ్లిన స్థానానికి రాహుల్ మాత్రమే న్యాయం చేయగలగడని అభిప్రాయపడ్డాడు. టెస్టు క్రికెట్లో భారత్కు అతడు విలువైన ఆటగాడని.. అతడికి జట్టులో స్థిరమైన స్థానం ఇవ్వాలని మేనేజ్మెంట్కు విజ్ఞప్తి చేశాడు.కాగా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి కూడా టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యువ రక్తంతో నిండిన జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సీజన్లో భాగంగా తొలుత ఇంగ్లండ్ను ఢీకొట్టనుంది. అన్నట్లు.. ఇంగ్లండ్ గడ్డ మీద శుబ్మన్ గిల్ మూడు టెస్టులు ఆడి 88 పరుగులు మాత్రమే చేశాడు!!చదవండి: Ind vs Eng: కుర్రాళ్లతో ఈ సిరీస్ ఆడటం కష్టం.. రహానే, పుజారా రీ ఎంట్రీ! -
IND vs ENG: టీమిండియా కెప్టెన్గా గిల్.. వైస్ కెప్టెన్గా అతడే!
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు టీమిండియా కొత్త కెప్టెన్ నియామకం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ (Rohit Sharma) నిష్క్రమణ నేపథ్యంలో యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ (Shubman Gill)కు పగ్గాలు అప్పగించేందుకు బోర్డు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా.. అతడికి డిప్యూటీగా మరో యువ ఆటగాడినే ఎంపిక చేయాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం.ఈసారి కనీసం ఫైనల్ చేరకుండానేగతేడాది టెస్టుల్లో పరాభవాల పాలైన టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC)-2025 ఫైనల్కు దూరమైన విషయం తెలిసిందే. వరుసగా రెండుసార్లు డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరినప్పటికీ టైటిల్కు అడుగుదూరంలో నిలిచిపోయిన భారత్.. ఈసారి ఆలోటు తీర్చుకుంటుందనుకుంటే ఇలా మొత్తానికే మోసం వచ్చింది.స్వదేశంలో న్యూజిలాండ్తో మూడు టెస్టుల్లో 3-0తో వైట్వాష్ కావడం.. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (BGT)-2025లో 3-1తో ఓడటం ఇందుకు ప్రధాన కారణాలు. ఈ రెండు సందర్భాల్లోనూ కెప్టెన్గా, బ్యాటర్గా విఫలమైన రోహిత్ శర్మ బుధవారమే సంప్రదాయ ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు.విరాట్ కోహ్లి కూడా రోహిత్ బాటలోనే!ఈ క్రమంలో మరో సీనియర్ బ్యాటర్, దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లి కూడా రోహిత్ బాటలోనే నడుస్తాడనే వార్తలు వినిపించాయి. కోహ్లి ఇంగ్లండ్తో సిరీస్లో కెప్టెన్గా వ్యవహరించేందుకు సిద్ధంగా ఉన్నా.. బోర్డు అందుకు సమ్మతించలేదని.. అందుకే అతడు ఈ మేర తీవ్ర నిర్ణయానికి వచ్చినట్లు వదంతులు వ్యాపించాయి.వైస్ కెప్టెన్గా పంత్డబ్ల్యూటీసీ 2025-27 కొత్త సీజన్లో యువ రక్తంతో నిండిన జట్టును ఇప్పటి నుంచే సిద్ధం చేయాలనే యోచనలో ఉన్న బోర్డు.. కోహ్లికి నో చెప్పిందన్నది వాటి సారాంశం. తాజా సమాచారం ప్రకారం.. శుబ్మన్ గిల్ను కెప్టెన్గా నియమించాలని బీసీసీఐ నిర్ణయించింది. మే ఆఖరి వారంలో ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.అదే విధంగా.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ను వైస్ కెప్టెన్గా నియమించాలని సెలక్టర్లు నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి గిల్ కంటే పంత్ సీనియర్. అంతేకాదు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి విదేశీ గడ్డలపై సమర్థవంతంగా ఆడిన అనుభవం అతడికి ఉంది.అయితే, ఇటీవల ఆసీస్ పర్యటనలో పంత్ పూర్తిగా విఫలమయ్యాడు. షాట్ల ఎంపిక విషయంలో పదే పదే తప్పులు చేస్తూ విమర్శల పాలయ్యాడు. ఇలాంటి తరుణంలో గిల్ వైపు మొగ్గు చూపిన యాజమాన్యం.. అతడి చుట్టూ భవిష్యత్ జట్టును నిర్మించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వికెట్ కీపర్గా బాధ్యతలు నిర్వర్తించే పంత్పై అదనపు భారం మోపకుండా.. బ్యాటింగ్పైనే ప్రధానంగా దృష్టి పెట్టేలా బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.కాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య టెస్టులతో డబ్ల్యూటీసీ 2025-27 సీజన్ ఆరంభం కానుంది. జూన్ 20 నుంచి ఇరుజట్ల మధ్య ఇంగ్లండ్ వేదికగా ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ జరుగుతుంది. చదవండి: SRH: బ్యాటర్ల వైఫల్యం... బౌలర్ల నిస్సహాయత -
టెస్టుల్లో అద్భుతం.. కానీ వన్డే, టీ20లలో మాత్రం వేస్ట్!
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) బ్యాటింగ్ తీరుపై భారత మాజీ ఆటగాడు సంజయ్ బంగర్ (Sanjay Bangar)విమర్శలు గుప్పించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో పంత్ ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడని అన్నాడు. వన్డే, టీ20 క్రికెట్లో సరైన షాట్ల ఎంపిక విషయంలో ఇప్పటికీ అతడు తడబడుతుండటం ఇందుకు నిదర్శనం అని పేర్కొన్నాడు.అత్యంత ఖరీదైన ఆటగాడిగాఐపీఎల్-2025 (IPL 2025) మెగా వేలంలో రిషభ్ పంత్ను లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా రూ. 27 కోట్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తద్వారా క్యాష్ రిచ్ లీగ్లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఈ ఉత్తరాఖండ్ వికెట్ కీపర్ బ్యాటర్ చరిత్ర సృష్టించాడు.చెత్త ప్రదర్శనఅయితే, ఆట విషయంలో మాత్రం పంత్ తుస్సుమనిపించాడు. ఇప్పటి వరకు పది ఇన్నింగ్స్ 12.80 సగటుతో.. 99.22 స్ట్రైక్రేటుతో 128 పరుగులే చేశాడు. పంత్ ఐపీఎల్ ఆడటం మొదలుపెట్టిన నాటి (2016) నుంచి అతడి కెరీర్లో ఇదే అత్యంత చెత్త ప్రదర్శన అని చెప్పవచ్చు.టెస్టుల్లో అద్బుతం.. కానీ వన్డే, టీ20లలో మాత్రం వేస్ట్!లక్నో కెప్టెన్గా ఫర్వాలేదనిపిస్తున్నా.. బ్యాటర్గా, వికెట్ కీపర్గా పంత్ విఫలం కావడం తీవ్రమైన విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో కామెంటేటర్ సంజయ్ బంగర్ మాట్లాడుతూ.. ‘‘వైట్ బాల్ క్రికెట్ను పూర్తిగా అర్థం చేసుకోవడంలో పంత్ తడబడుతున్న విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది.50, 20 ఓవర్ల ఫార్మాట్లో అతడి ఆట గొప్పగా లేదు. అయితే, టెస్టు క్రికెట్లో మాత్రం అతడొక అద్భుతమైన బ్యాటర్. సంప్రదాయ ఫార్మాట్లో అతడి ఆటకు పేరు పెట్టే పనేలేదు.కానీ ఈ ఐపీఎల్ సీజన్లో అతడు అవుటైన విధానం చూస్తుంటే.. స్కూప్ షాట్లు ఆడేందుకు అతడు విఫలయత్నం చేసిన తీరును గమనించవచ్చు’’ అని స్టార్ స్పోర్ట్స్ షోలో పేర్కొన్నాడు.వారం పాటు వాయిదా అదే విధంగా.. రిషభ్ పంత్ బ్యాటింగ్ టెక్నిక్ సరిగా లేదని సంజయ్ బంగర్ ఈ సందర్భంగా విమర్శించాడు. తనలోని అత్యుత్తమ బ్యాటర్ ఆడే విధానాన్ని పంత్ మర్చిపోయాడని.. అందుకే ఇలా విఫలమవుతున్నాడని అభిప్రాయపడ్డాడు.కాగా ఐపీఎల్-2025లో పంత్ సారథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటికి పదకొండు మ్యాచ్లు పూర్తి చేసుకుని.. ఐదు గెలిచి.. ఆరింట ఓడింది. తద్వారా పది పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఇక భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్-2025ని వారం పాటు వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే.టీమిండియా తరఫున ఇలా..టెస్టుల్లో రిషభ్ పంత్కు మెరుగైన రికార్డు ఉంది. ఇప్పటికి 43 మ్యాచ్లు ఆడి 2948 పరుగులు చేశాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఖాతాలో ఆరు టెస్టు సెంచరీలు ఉన్నాయి.అయితే, వన్డేల్లో 31 మ్యాచ్లలో కలిపి పంత్ కేవలం 871 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 76 అంతర్జాతీయ టీ20లలో కలిపి 1209 పరుగులు సాధించగలిగాడు. ఇక ఐపీఎల్లో మొత్తంగా 122 మ్యాచ్లు పూర్తి చేసుకుని 3412 రన్స్ తన ఖాతాలో జమ చేసుకున్నాడు.చదవండి: విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం!.. బీసీసీఐకి చెప్పేశాడు! -
IPL 2025: చెత్త ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో జట్టు ప్రకటన.. కెప్టెన్గా రిషబ్ పంత్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఘెరంగా విఫలమవుతున్న ఆటగాళ్లతో ఓ జట్టును రూపొందించింది ఐస్ల్యాండ్ క్రికెట్. ఈ జట్టుకు సారధిగా రిషబ్ పంత్ను ఎంపిక చేసింది. ఈ జట్టుకు ఐపీఎల్ 2025 మోసగాళ్లు, స్కామర్ల జట్టని నామకరణం చేసింది. ఈ జట్టులో రాహుల్ త్రిపాఠి, రచిన్ రవీంద్ర, ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, వెంకటేశ్ అయ్యర్, గ్లెన్ మ్యాక్స్వెల్, లియామ్ లివింగ్స్టోన్, దీపక్ హుడా, రవిచంద్రన్ అశ్విన్, మతీష పతిరణ, మహ్మద్ షమీకి చోటు కల్పించింది. పంత్ను కెప్టెన్ కమ్ వికెట్ కీపర్గా ఎంపిక చేసింది. ఈ జట్టును నిన్న తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.On a rain day in Reyjavík, we give you our IPL 2025 frauds and scammers team:R TripathiR RavindraI KishanR Pant (c & wk)V IyerG MaxwellL LivingstoneD HoodaR AshwinM PathiranaM ShamiNo impact player: M Kumar— Iceland Cricket (@icelandcricket) May 5, 2025ఐస్ల్యాండ్ క్రికెట్ ఎంపిక చేసిన ఈ టీమ్పై సోషల్మీడియాలో విపరీతమైన స్పందన వస్తుంది. నిజంగానే వీరు స్కామర్లు, మోసగాళ్లు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కోట్లలో డబ్బు తీసుకుని కనీస వందల విలువ చేసే ప్రదర్శన కూడా చేయలేకపోతున్నారంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కొందరేమే ఆటగాళ్లు ఎలా ఆడినా ఐస్ల్యాండ్ క్రికెట్ ఇలాంటి విమర్శలు చేయకూడదని సలహాలు ఇస్తున్నారు. కాగా, ఐస్ల్యాండ్ క్రికెట్కు ఇలాంటి వివాదాస్పద పోస్ట్లు చేయడం కొత్తేమీ కాదు. క్రికెట్కు సంబంధించిన అంశాలపై గతంలో చాలా సందర్భాల్లో వ్యంగ్యంగా స్పందించింది.ఇదిలా ఉంటే, మోసగాళ్లు.. స్కామర్లు అంటూ ఐస్ల్యాండ్ క్రికెట్ ఐపీఎల్ ఆటగాళ్లను విమర్శించడం సరి కాదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వారి అభిప్రాయాన్ని పక్కన పెడితే, ఐస్ల్యాండ్ క్రికెట్ ప్రకటించిన జట్టులోని ఆటగాళ్లుందరూ తీసుకున్న డబ్బుకు న్యాయం చేయలేకపోతున్నారన్నది కాదనలేని సత్యం. రిషబ్ పంత్, వెంకటేశ్ అయ్యర్ లాంటి ఆటగాళ్లు 20 కోట్లకు పైగా మొత్తాన్ని తీసుకున్నా కనీస ప్రదర్శన చేయలేకపోతున్నారు. మిగతా ఆటగాళ్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. మ్యాక్స్వెల్, లివింగ్స్టోన్ లాంటి విదేశీ ఆటగాళ్లయితే ఏదో హాలిడేకి వచ్చామన్నట్లు ఐపీఎల్ను చాలా ఈజీగా తీసుకుంటున్నారు. ఇషాన్ కిషన్, షమీపై వారి ఫ్రాంచైజీ ఎంతో నమ్మకముంచితే వారు ఆ నమ్మకాన్ని వమ్ము చేశారు. అశ్విన్ అయితే తనకున్న ఘన చరిత్రను చెత్త ప్రదర్శనలతో దిగజార్చుకున్నాడు. రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా లాంటి వారు కోట్లు మింగి గల్లీ క్రికెటర్ల కంటే హీనమైన క్రికెట్ను ఆడుతున్నారు.రాహుల్ త్రిపాఠి- 3.4 కోట్లురచిన్ రవీంద్ర- 4 కోట్లుఇషాన్ కిషన్- 11.25దీపక్ హుడా- 1.7 కోట్లురిషబ్ పంత్- 27 కోట్లువెంకటేశ్ అయ్యర్- 23.75గ్లెన్ మ్యాక్స్వెల్- 4.2 కోట్లులియామ్ లివింగ్స్టోన్- 8.75 కోట్లురవిచంద్రన్ అశ్విన్- 9.75 కోట్లుమతీష పతిరణ- 13 కోట్లుమహ్మద్ షమీ- 10 కోట్లు -
ఆ ముఖంలో నవ్వే లేదు.. రహానే, కోహ్లి కావాలేమో?
ఐపీఎల్-2025 (IPL 2025)లో భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ క్రికెటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) విఫలమవుతున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కెప్టెన్గా, బ్యాటర్గా వరుస మ్యాచ్లలో నిరాశపరుస్తున్నాడు. ఇప్పటికి మొత్తంగా పదకొండు మ్యాచ్లు పూర్తి చేసుకున్న పంత్.. కేవలం 128 పరుగులు రాబట్టగలిగాడు.ఇదే అత్యంత చెత్త ప్రదర్శన2016లో ఐపీఎల్ ఆడటం మొదలుపెట్టిన పంత్ కెరీర్లో ఇప్పటికి ఇదే అత్యంత చెత్త ప్రదర్శన. ఈ నేపథ్యంలో మేటి ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ ఆడం గిల్ క్రిస్ట్ పంత్ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఆ ముఖంలో నవ్వే లేదు.. ‘‘అతడిని చూసిన ప్రతిసారీ ఆటను ఎంతగానో ఆస్వాదిస్తూ ఆడుతున్నాడు అనిపిస్తుంది. కానీ ఈసారి తను అలా లేడు. ఆ ముఖంలో నవ్వు లేదు.. సహచర ఆటగాళ్లతో సరదాగా ఉన్నట్లు కనిపించడం లేదు.. ప్రశాంతవదనంతో ఉన్నాడా అంటే అదీ లేదు.కొత్త ఫ్రాంఛైజీ తరఫున కెప్టెన్సీ భారమా లేదంటే ప్రైస్ ట్యాగ్ అతడి నెత్తి గుదిబండగా మారిందా అర్థం కావడం లేదు. ఇది అతడు కానే కాదని వంద శాతం చెప్పగలను. అతడి ఆటలో మునుపటి మెరుపు, చురుకుదనం కనిపించడం లేదు’’ అని క్రిక్బజ్ షోలో గిల్క్రిస్ట్ అన్నాడు.రహానే, కోహ్లి కావాలేమో?ఇందుకు అదే షోలో పాల్గొన్న సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ షాన్ పొలాక్ బదులిస్తూ.. ‘‘పంత్ విషయంలో మీరు ఇచ్చిన చెప్పిన మాటల్ని విశ్లేషించేందుకు ప్రయత్నిస్తున్నా. అతడు సొంతగడ్డపై.. చుట్టూ భారత క్రికెటర్లు ఉంటే మాత్రమే అతడు ఆటను ఆస్వాదిస్తాడా?వారి కంపెనీని మాత్రమే ఎంజాయ్ చేస్తాడా? ఎందుకంటే ఇప్పుడు అతడి చుట్టూ ప్రధానంగా నలుగురూ విదేశీ బ్యాటర్లే ఉన్నారు. పంత్ సహచరులతో సంతోషంగా లేడని అంటున్నారా?అజింక్య రహానే, విరాట్ కోహ్లి తన జట్టులో ఉంటే పంత్ మారిపోతాడా? అంటే సమాధానం చెప్పలేము. ఏదేమైనా పంత్ మునుపటిలా మాత్రం లేడన్నది వాస్తవం’’ అని చెప్పుకొచ్చాడు. కాగా మెగా వేలం-2025లో రూ. 27 కోట్లకు లక్నో పంత్ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. తద్వారా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా పంత్ రికార్డులకెక్కాడు.పది జట్ల స్థానాలు ఇలాఈ సీజన్లో ఇప్పటికి 128 పరుగులు చేసిన పంత్ అత్యధిక స్కోరు 63. గత మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై 18 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఇక లక్నో సూపర్ జెయింట్స్ విషయానికొస్తే.. పదకొండు మ్యాచ్లు పూర్తి చేసుకుని కేవలం ఐదే గెలిచి.. ఆరు ఓడిపోయింది.తద్వారా పది పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు.. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి.ఆర్సీబీ 16 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండి.. ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపు ఖరారు చేసుకోగా.. పంజాబ్ కింగ్స్ రెండు, ముంబై ఇండియన్స్ మూడు, గుజరాత్ టైటాన్స్ నాలుగు, ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఆరో స్థానంలో ఉన్న కేకేఆర్, ఏడో స్థానంలో ఉన్న లక్నో కూడా సాంకేతికంగా ఇంకా రేసులో ఉన్నాయి.చదవండి: SRH Vs DC: ‘హే.. వెళ్లు.. వెళ్లు.. నువ్వు అవుట్’!.. కావ్యా మారన్ రియాక్షన్ వైరల్ -
ధోనికి కాల్ చేయ్ పంత్.. నాకు కూడా ఇలానే జరిగింది: వీరేంద్ర సెహ్వాగ్
ఐపీఎల్-2025లో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్, లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తన పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఆదివారం ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లోనూ పంత్ తీవ్ర నిరాశపరిచాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన పంత్ కేవలం 18 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.ఈ ఏడాది సీజన్లో ఒక్క హాఫ్ సెంచరీ మినహా.. మిగితా ఏ మ్యాచ్లోనూ పంత్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఐపీఎల్-2025 వేలంలో రికార్డు ధరకు అమ్ముడైన.. తన ప్రైస్ ట్యాగ్కు ఏ మాత్రం న్యాయం చేయలేకపోతున్నాడు. ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడిన పంత్.. 12.80 సగటుతో 128 పరుగులు మాత్రమే చేయగల్గాడు. ఈ క్రమంలో రిషబ్ పంత్కు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక సూచనలు చేశాడు. ఈ గడ్డు పరిస్థితుల్లో పంత్ తన ఆరాధ్య క్రికెటర్ ఎంఎస్ ధోనితో మాట్లాడాలని సెహ్వాగ్ సూచించాడు."పంత్ ఈ సమయంలో తను ఆరాధించే క్రికెటర్లతో ఓ సారి మాట్లాడితే బాగుంటుంది. అతడికి సలహాలు ఇచ్చేందుకు చాలా మంది క్రికెటర్లు ఉన్నారు. ఎంస్ ధోని.. అతడి రోల్ మోడల్ ఉన్న విషయం అందరికి తెలిసిందే. కాబట్టి ధోనికి ఓసారి కాల్ చేస్తే బెటర్గా ఉంటుంది. ధోనితో మాట్లాడితే పంత్ కచ్చితంగా తన ఫామ్ను తిరిగి అందుకుంటాడు. అదేవిధంగా రిషబ్ పంత్ గతంలో ఐపీఎల్లో అద్బుతంగా ఆడిన తన వీడియోలను చూడాలి నేను భావిస్తున్నాను. ఎందుకంటే అది అతడి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ప్రస్తుత రిషబ్ పంత్ గాయపడటానికి ముందు మనం చూసిన దానికి పూర్తి భిన్నంగా ఉన్నాడు. నా కెరీర్లో కూడా 2006-07 సమయంలో ఇటువంటి పరిస్థితులనే ఎదుర్కొన్నాను. నన్ను జట్టు నుంచి పక్కన పెట్టారు కూడా. ఆ సమయంలో రాహుల్ ద్రవిడ్ నన్ను నా పాత వీడియోలను చూడమని సలహా ఇచ్చాడు. గతంలో ఎలా ఆడానో ఓ సారి పరిశీలించుకున్నాను. దీంతో నా రిథమ్ను తిరిగి పొందాను. పంత్ విషయంలో కూడా ఇదే జరగొచ్చు" అని క్రిక్బజ్ లైవ్ షోలో సెహ్వాగ్ పేర్కొన్నాడు.చదవండి: ఏం ఆడుతున్నార్రా బాబూ! గుడ్లు ఉరిమి చూసిన రియాన్.. ఒక్క చూపుతోనే.. -
IND vs ENG: బుమ్రాకు షాక్.. వైస్ కెప్టెన్గానూ అవుట్!
గత కొంతకాలంగా టెస్టుల్లో పేలవ ప్రదర్శన కనబరిచిన టీమిండియా.. ఇంగ్లండ్లో సత్తా చాటి పూర్వ వైభవం పొందాలని పట్టుదలగా ఉంది. ఇంగ్లండ్తో సిరీస్లో నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సెలక్టర్లు సీనియర్ టీమ్, భారత ‘ఎ’ జట్టు కోసం కలిపి ఇప్పటికే ప్రాథమికంగా 35 మంది ప్రాబబుల్స్ను ఎంపిక చేశారు. ఇందులో కెప్టెన్గా రోహిత్ శర్మ (Rohit Sharma)పేరు దాదాపుగా ఖరారు కాగా.. వైస్ కెప్టెన్ ఎవరన్న అంశంపై సందిగ్దం నెలకొంది.నిజానికి స్వదేశంలో న్యూజిలాండ్తో 3-0తో క్లీన్స్వీప్, ఆస్ట్రేలియా పర్యటనలో 3-1తో బోర్డర్ గావస్కర్ ట్రోఫీ (BGT)ని చేజార్చుకున్న తర్వాత రోహిత్ టెస్టు భవితవ్యంపై సందేహాలు నెలకొన్నాయి. కెప్టెన్గానే కాకుండా బ్యాటర్గానూ అతడు విఫలం కావడంతో ఇక సంప్రదాయ ఫార్మాట్కు వీడ్కోలు పలుకుతాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కెప్టెన్గానే కాదు.. వైస్ కెప్టెన్గానూ బుమ్రా అవుట్!ఈ నేపథ్యంలో రోహిత్ స్థానాన్ని పేస్ దళ నాయకుడు, టెస్టు జట్టు వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)తో భర్తీ చేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం రోహిత్నే కెప్టెన్గా కొనసాగించేందుకు మొగ్గు చూపిన బోర్డు.. బుమ్రా పేరును కనీసం వైస్ కెప్టెన్సీ రేసులోనూ పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ.. ‘‘ఐదు టెస్టులకూ అందుబాటులో ఉండే ఆటగాడికే వైస్ కెప్టెన్ ఇవ్వాలని భావిస్తున్నాం.నిజానికి బుమ్రా ఈ పర్యటనలో అన్ని మ్యాచ్లు ఆడడు. కాబట్టి కెప్టెన్కు డిప్యూటీగా వేర్వేరు మ్యాచ్లలో వేర్వేరు ఆటగాళ్లను నియమించలేము. అందుకే ఐదు టెస్టులు ఆడే ఆటగాడినే వైస్ కెప్టెన్గా ఎంపిక చేస్తాం’’ అని పేర్కొన్నాయి.గాయం తిరగబెట్టే అవకాశం!కాగా ఆస్ట్రేలియా పర్యటనలో ఐదింట రెండు టెస్టులకు కెప్టెన్గా వ్యవహరించడంతో పాటు.. పేస్ దళం భారం మొత్తాన్ని బుమ్రానే మోశాడు. ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ 2023-25 సీజన్లో ముప్పై రెండు వికెట్లు కూల్చి సత్తా చాటాడు. కానీ ఈ సిరీస్లో భారత్ ఓడిపోయింది. మరోవైపు.. ఆఖరిదైన సిడ్నీ టెస్టులో బుమ్రా గాయపడ్డాడు.వెన్నునొప్పి తిరగబెట్టడంతో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 మొత్తానికి బుమ్రా అందుబాటులో లేకుండా పోయాడు. ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ ఆరంభ మ్యాచ్లకూ అతడు దూరమయ్యాడు. దాదాపు మూడు నెలల పాటు ఆటకు దూరంగానే న్నాడు.ఈ క్రమంలో బుమ్రా ఫిట్నెస్ దృష్ట్యా ఇంగ్లండ్లోనూ అతడిని వరుస మ్యాచ్లలో ఆడిస్తే మళ్లీ గాయం తిరగబెట్టే అవకాశం ఉందని పలువురు మాజీ క్రికెటర్లు హెచ్చరిస్తున్నారు.బుమ్రా వంటి విలువైన ఫాస్ట్ బౌలర్ను కాపాడుకోవాలంటే.. ఒక టెస్టు ముగిసిన తర్వాత రెండో టెస్టు కోసం అతడికి విశ్రాంతినివ్వాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుమ్రాపై పనిభారం తగ్గించే విషయంలో సెలక్టర్లు కూడా ఓ నిర్ణయానికి వచ్చారని.. అందుకే వైస్ కెప్టెన్సీ రూపంలో అదనపు బాధ్యతల నుంచి కూడా తప్పించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.రేసులో ఆ మూడు పేర్లుఒకవేళ బుమ్రాను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పిస్తే.. అతడి స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్ల ఎవరన్న చర్చ ఇప్పటికే మొదలైంది. రిషభ్ పంత్ లేదంటే.. శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ల పేర్లు ఈ రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే, అసలే ఇంగ్లండ్తో టెస్టులు కాబట్టి యువ ఆటగాళ్ల వైపు మొగ్గుచూపకుండా.. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్లకు బోర్డు బాధ్యతలు అప్పగించే అవకాశం లేకపోలేదు. కాగా టీమిండియా ఆటగాళ్లంతా ప్రస్తుతం ఐపీఎల్-2025తో బిజీగా ఉన్నారు. మే 25న క్యాష్ రిచ్ లీగ్ ఫైనల్ జరుగనుండగా.. ఆ తర్వాత భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తుంది. జూన్ 20 నుంచి ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ మొదలుకానుంది.చదవండి: PBKS VS LSG: అప్పుడే అంతా అయిపోలేదు: లక్నో కెప్టెన్ పంత్ -
PBKS VS LSG: అప్పుడే అంతా అయిపోలేదు: లక్నో కెప్టెన్ పంత్
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 4) రాత్రి జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్పై పంజాబ్ కింగ్స్ 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ (48 బంతుల్లో 91; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) రెచ్చిపోవడంతో 5 వికెట్ల నష్టానికి 236 పరుగుల భారీ స్కోర్ చేసింది. పంజాబ్ ఇన్నింగ్స్లో మరో ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (4 బంతుల్లో 1) విఫలమైనా, మిగతా బ్యాటర్లంతా సత్తా చాటారు. వన్డౌన్లో వచ్చిన జోష్ ఇంగ్లిస్ 14 బంతుల్లో బౌండరీ, 4 సిక్సర్ల సాయంతో 30, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 45, నేహల్ వధేరా 9 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్ సాయంతో 16 పరుగులు చేశారు. ఆఖర్లో శశాంక్ సింగ్ తాండవం చేశాడు. 15 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్ సాయంతో అజేయమైన 33 పరుగులు చేశాడు. ఇదే సమయంలో స్టోయినిస్ (5 బంతుల్లో 15 నాటౌట్; ఫోర్, సిక్స్) కూడా బ్యాట్ ఝులిపించాడు. లక్నో బౌలర్లలో ఆకాశ్ మహారాజ్ సింగ్, దిగ్వేశ్ రాఠీ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ప్రిన్స్ యాదవ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన లక్నో.. 73 పరుగులకే తమ కీలక బ్యాటర్ల వికెట్లన్నీ కోల్పోయింది. అర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో లక్నో టాపార్డర్ పేక మేడలా కూలింది. అర్షదీప్ 27 పరుగులకే మార్క్రమ్ (13), మిచెల్ మార్ష్ (0), నికోలస్ పూరన్ను (6) ఔట్ చేశాడు. ఆతర్వాత ఒమర్జాయ్.. రిషబ్ పంత్ (18), డేవిడ్ మిల్లర్ను (11) పెవిలియన్కు పంపాడు. ఈ దశలో ఆయుశ్ బదోని (40 బంతుల్లో 74; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), అబ్దుల్ సమద్ (24 బంతుల్లో 45; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ప్రతిఘటించారు. వీరిద్దరు ఆరో వికెట్కు 81 పరుగులు జోడించారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సమద్ ఔటయ్యే సమయానికి (16.4వ ఓవర్) లక్నో 20 బంతుల్లో 73 పరుగులు చేయాల్సి ఉండింది. దాదాపుగా అసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆఖరి ఓవర్ తొలి బంతికి బదోని కూడా ఔటయ్యాడు. దీంతో లక్నో ఓటమి ఖరారైపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 199 పరుగులు మాత్రమే చేయగలిగింది. అర్షదీప్ 3, ఒమర్జాయ్ 2, జన్సెన్, చహల్ తలో వికెట్ తీసి లక్నోను దెబ్బ కొట్టారు. ఈ గెలుపుతో పంజాబ్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరి ప్లే ఆఫ్స్కు చేరువయ్యింది. ఈ ఓటమితో లక్నో ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. లక్నో ఇకపై ఆడాల్సిన మూడు మ్యాచ్లు గెలిచినా ఇతర జట్ల జయాపజయాలపై వారి ఫేట్ ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం లక్నో రన్ రేట్ (-0-469) కూడా చాలా తక్కువగా ఉంది. ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న జట్లలో ఈ ఒక్క జట్టు రన్రేట్ మాత్రమే మైనస్లో ఉంది. లక్నో ఒక వేళ మూడు మ్యాచ్లు గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కాలంటే భారీ తేడాతో గెలవాలి.మ్యాచ్ అనంతరం లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. చాలా ఎక్కువ పరుగులు ఇచ్చాము. రాంగ్ టైమ్లో కీలక క్యాచ్లు వదిలేశాము. అది బాగా దెబ్బకొట్టింది. జారవిడిచిన క్యాచ్ల ప్రభావం ఇంకాస్త ఎక్కువగానే ఉంటుందని అనుకున్నాము. మేము ఆదిలోనే లయ తప్పాము. అక్కడే మ్యాచ్ కోల్పోయాము. ఇప్పటికీ మా ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగానే ఉన్నాయి. తదుపరి మూడు మ్యాచ్లను గెలిస్తే, మేము ఖచ్చితంగా రేసులో ఉంటాము.సీజన్ మొత్తంలో మా టాపార్డర్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. అయితే ప్రతి మ్యాచ్లో వారి నుంచే ఆశించలేము. ప్రతిసారి వారు జట్టును గెలిపించలేరు. మిగతా వారు కూడా బాధ్యత తీసుకోవాలి. మొత్తంగా చూస్తే ఈ మ్యాచ్లో మేము భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చింది. అది తీవ్రంగా బాధించింది -
ఇలా ఒక్కరినే టార్గెట్ చేయడం సరికాదు: రిషభ్ పంత్ అసహనం!
ఐపీఎల్-2025 (IPL 2025)లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) ఆటగాడిగా పూర్తిగా విఫలమవుతున్నాడు. చెత్త బ్యాటింగ్తో విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు అతడు నమోదు చేసిన స్కోర్లు వరుసగా.. 0, 15, 2, 2, 21, 63, 3, 0, 4.98.21 స్ట్రైక్రేటుతో మొత్తంగా కలిపి కేవలం 110 పరుగులు చేశాడు. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా చరిత్రకెక్కిన పంత్ నుంచి ఇలాంటి ఆట తీరు అస్సలు ఊహించనిది. దీంతో అభిమానులు సైతం అతడిపై విమర్శలు గుప్పిస్తున్నారు.అయితే, కెప్టెన్గా మాత్రం రిషభ్ పంత్ ప్రదర్శన బాగానే ఉంది. అతడి సారథ్యంలో ఇప్పటి వరకు పది మ్యాచ్లు పూర్తి చేసుకున్న లక్నో ఐదింట గెలిచింది. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడి ఐదో పరాజయం నమోదు చేసింది.ఎక్కువగా ఆలోచించకపోవడమే మంచిదిఈ నేపథ్యంలో ఓటమి అనంతరం బ్రాడ్కాస్టర్తో మాట్లాడిన రిషభ్ పంత్కు అతడి ఫామ్ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకపోవడమే మంచిది.పరిస్థితులు మనకు అనుకూలంగా లేనపుడు మన నైపుణ్యాలపై మనకే సందేహాలు తలెత్తుతాయి. అయితే, అలాంటి భావనలను దరిచేయనీయకూడదు. జట్టు బాగా ఆడుతున్నపుడు.. ఆ విషయంపైనే ఎక్కువగా దృష్టి సారించాలి.ఒక్కరినే టార్గెట్ చేయడం సరికాదుక్రికెట్ అంటేనే జట్టుగా ఆడాల్సిన ఆట. అవును.. ఒక్క ఆటగాడి వల్ల కూడా ప్రభావం ఉంటుంది. మ్యాచ్ దిశ మారిపోతుంది. కానీ ప్రతిసారి ఒక్కరినే టార్గెట్ చేయడం సరికాదనుకుంటా’’ అని పంత్ ఒకింత అసహనం వ్యక్తం చేశాడు.కాగా హార్దిక్ పాండ్యా నాయకత్వంలో ముంబై ఇండియన్స్ ఆదివారం జరిగిన పోరులో ముంబై 54 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ర్యాన్ రికెల్టన్ (32 బంతుల్లో 58; 6 ఫోర్లు, 4 సిక్స్లు), సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 54; 4 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధ సెంచరీలు సాధించారు. అనంతరం లక్నో 20 ఓవర్లలో 161 పరుగులకే ఆలౌటైంది.విల్ జాక్స్ ఆల్రౌండ్ ప్రదర్శనతోలక్నో ఆటగాళ్లలో ఆయుశ్ బదోని (22 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్స్లు), మిచెల్ మార్ష్ (24 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్స్లు) మాత్రమే ఫర్వాలేదనిపించారు. పంత్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చి కేవలం నాలుగు పరుగులే చేసి నిష్క్రమించాడు. విల్ జాక్స్ బౌలింగ్లో కర్ణ్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఈ వికెట్ కీపర్ బ్యాటర్ పెవిలియన్ చేరాడు.ఇదిలా ఉంటే.. ముంబౌ బౌలర్లలో బుమ్రా 4, బౌల్ట్ 3 వికెట్లు పడగొట్టగా, ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చిన విల్ జాక్స్ (29, 2/18) ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో లక్నో అత్యధికంగా రూ. 27 కోట్లు ఖర్చు చేసి పంత్ను కొనుగోలు చేసి.. కెప్టెన్గా నియమించిన విషయం తెలిసిందే.చదవండి: వాడికి ఏడాదిన్నర వయసు.. మాకు ఆ పిచ్చి లేదు: సంజనా𝙂𝙖𝙢𝙚. 𝙎𝙚𝙩. 𝘿𝙤𝙣𝙚 ✅@mipaltan make it 5⃣ in 5⃣ and are marching upwards and onwards in the season 📈Scorecard ▶ https://t.co/R9Pol9Id6m #TATAIPL | #MIvLSG pic.twitter.com/zW7EuWhU7j— IndianPremierLeague (@IPL) April 27, 2025 -
LSG VS DC: పంత్పై మండిపడుతున్న అభిమానులు.. గొయెంకాకు సరైన శాస్తి జరిగింది..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ చెత్త ప్రదర్శన కొనసాగుతుంది. నిన్న (ఏప్రిల్ 22) ఢిల్లీతో జరిగిన మ్యాచ్లోనూ పంత్ ఘోరంగా విఫలమయ్యాడు. ఇన్నింగ్స్ ముగిసే సమయంలో ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి రెండు బంతులు ఆడి డకౌటయ్యాడు. ఈ సీజన్లో పంత్కు ఇది రెండో డకౌట్.ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో పంత్ కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ సాయంతో 106 పరుగులు మాత్రమే చేశాడు. పంత్ చెత్త ఆటతీరు, కెప్టెన్గా తీసుకున్న చెత్త నిర్ణయాలు నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో లక్నో కొంపముంచాయి. ఓపెనర్లు మార్క్రమ్, మార్ష్ మంచి ఆరంభం ఇచ్చినా, ఆతర్వాత వచ్చిన బ్యాటర్లు దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవడంతో లక్నో స్వల్ప స్కోర్కే పరిమితమైంది. అనంతరం ఛేదనలో రాహుల్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్ అద్బుతంగా ఆడి ఢిల్లీని గెలిపించారు.వరుస వైఫల్యాల నేపథ్యంలో పంత్ భారీ ట్రోలింగ్ను ఎదుర్కొంటున్నాడు. లక్నో ఓనర్ సంజీవ్ గొయెంకా రాహుల్ లాంటి ఆణిముత్యాన్ని వదులుకుని పంత్ లాంటి చెత్తను రూ. 27 కోట్లకు కొనుక్కున్నాడని కామెంట్లు చేస్తున్నారు. రాహుల్ను కాదనుకుని ఎంతో నమ్మకంతో కెప్టెన్సీ కూడా కట్టబెడితే ఇదేనా వెలగబెట్టేదని మండిపడుతున్నారు. పంత్కు 27 లక్షలు కూడా దండగే అని అంటున్నారు. ఈ దెబ్బతో పంత్ పని అయిపోయిందని చర్చించుకుంటున్నారు.కాగా, నిన్నటి మ్యాచ్లో పంత్ ఆటగాడిగానే కాకుండా కెప్టెన్గా కూడా ఘోరంగా విఫలమయ్యాడు. మార్క్రమ్ ఔటైన తర్వాత మూడో స్థానంలో బ్యాటింగ్కు రాకుండా పెద్ద తప్పిదమే చేశాడు. మూడో స్థానంలో కాకపోయినా నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చినా లక్నో ఓ మోస్తరుకు మించి భారీ స్కోరే చేసేది. బ్యాటింగ్లో విఫలం కావడంతో పంత్ ఫీల్డింగ్ సమయంలో చాలా చిరాకుగా ఉన్నాడు. సహచరులపై అరుస్తూ కనిపించాడు. బౌలర్లను సరిగ్గా రొటేట్ చేయలేకపోయాడు. ఫలితంగా రాహుల్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్ రెచ్చిపోయారు.రాహుల్ గత సీజన్లో లక్నో యజమాని సంజీవ్ గొయెంకా చేతిలో ఎదురైన అవమానానికి నిన్నటి మ్యాచ్లో ప్రతీకారం తీర్చుకున్నాడు. రాహుల్ గొయెంకాకు బ్యాట్తో బుద్ది చెప్పడమే కాకుండా మ్యాచ్ ముగిసిన తర్వాత అసలు రివెంజ్ తీర్చుకున్నాడు. గొయెంకా కరచాలనం చేస్తూ మాట్లాడే ప్రయత్నం చేయగా రాహుల్ పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయారు. ఆ సమయంలో గొయెంకా పైకి నవ్వుతూ కనిపించినప్పటికీ. లోలోపల రాహుల్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్కు బెంబేలెత్తిపోయుంటాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. ఢిల్లీ పేసర్ ముకేశ్ కుమార్ (4-0-33-4) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్నో ఇన్నింగ్స్లో మార్క్రమ్ (52) అర్ద సెంచరీతో రాణించగా.. మిచెల్ మార్ష్ (45), ఆయుశ్ బదోని (36) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. రాహుల్ (57 నాటౌట్), అభిషేక్ పోరెల్ (51), అక్షర్ పటేల్ (34 నాటౌట్) సత్తా చాటడంతో 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఫలితంగా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. -
IPL 2025: తీసుకున్న డబ్బుకు న్యాయం చేయలేకపోతున్న స్టార్లు వీరే..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చాలా మంది క్రికెటర్లు తాము తీసుకున్న డబ్బుకు న్యాయం చేయలేకపోతున్నారు. వీరిలో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ముందు వరుసలో ఉన్నాడు. ఈ సీజన్ వేలంలో లక్నో పంత్ను రూ. 27 కోట్ల రికార్డు ధర చెల్లించి సొంతం చేసుకుంది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర. ఇంత భారీ మొత్తం పెట్టినా ఈ సీజన్లో పంత్ దారుణంగా విఫలమవుతున్నాడు. 8 మ్యాచ్ల్లో నామమాత్రపు స్ట్రయిక్రేట్తో (98.15) కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ సాయంతో 106 పరుగులు మాత్రమే చేశాడు.ఈ సీజన్లో లభించిన మొత్తానికి న్యాయం చేయలేకపోతున్న రెండో ఆటగాడు వెంకటేశ్ అయ్యర్. వెంకటేశ్ అయ్యర్ను కేకేఆర్ ఈ సీజన్ మెగా వేలంలో రూ. 23.75 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే వెంకటేశ్ జట్టు తనపై పెట్టుకున్న అంచనాలకు కనీస న్యాయం చేయలేకపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ల్లో నామమాత్రపు ప్ట్రయిక్రేట్తో ఒకే ఒక హాఫ్ సెంచరీ చేసి 121 పరుగులు చేశాడు.ఈ సీజన్లో తీసుకున్న డబ్బుకు న్యాయం చేయలేని మూడో ఆటగాడు మహ్మద్ షమీ. షమీని ఈ సీజన్ మెగా వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఎంతో నమ్మకంతో రూ. 10 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే అతను 7 మ్యాచ్లు ఆడి 5 వికెట్లు మాత్రమే తీశాడు.ఈ సీజన్లో చెత్త ప్రదర్శనలతో ఉసూరుమనిపిస్తున్న మరో క్రికెటర్ రషీద్ ఖాన్. రషీద్ను గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్ మెగా వేలానికి ముందు రూ. 18 కోట్లకు రీటైన్ చేసుకుంది. అయితే రషీద్ ఎన్నడూ లేనట్లుగా ఈ సీజన్లో దారుణంగా విఫలమవుతున్నాడు. ఒక్క మ్యాచ్లో కూడా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. రషీద్ ఈ సీజన్లో 7 మ్యాచ్ల్లో కేవలం 4 వికెట్లు మాత్రమే తీశాడు. అతని ఎకానమీ (9.73) కూడా చాలా దారుణంగా ఉంది.ఈ సీజన్లో అంచనాలు తగ్గట్టుగా రాణించలేని మరో క్రికెటర్ జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్. ఇతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ భారీ అంచనాలు పెట్టుకుని మెగా వేలంలో రూ. 9 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఇతగాడు ఆడిన 6 మ్యాచ్ల్లో 105.77 స్ట్రయిక్రేట్తో కేవలం 55 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో రెండు గుండు సున్నాలు ఉన్నాయి.పైన పేర్కొన్న ఆటగాళ్లతో పాటు మరికొందరు కూడా తీసుకున్న మొత్తానికి న్యాయం చేయలేకపోతున్నారు. వారిలో లివింగ్స్టోన్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, క్లాసెన్, ట్రవిస్ హెడ్, ఆండ్రీ రసెల్, హెట్మైర్, రబాడ, జన్సెన్ లాంటి విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. టి నటరాజన్ (10.75 కోట్లు, ఢిల్లీ) లాంటి ఆటగాళ్లు భారీ మొత్తం లభించినా అవకాశాలు లేక బెంచ్కే పరిమితమవుతున్నారు. ఇదిలా ఉంటే, కొందరు దేశీయ ఆటగాళ్లు మాత్రం ఈ సీజన్లో అంచనాలకు మించి తీసుకున్న డబ్బుకు న్యాయం చేస్తున్నారు. వీరిలో ప్రియాంశ్ ఆర్య (3.8 కోట్లు), అశుతోష్ శర్మ (3.8 కోట్లు), దిగ్వేశ్ రాఠీ (30 లక్షలు), విప్రాజ్ నిగమ్ (50 లక్షలు), అనికేత్ వర్మ (30 లక్షలు), వైభవ్ సూర్యవంశీ (1.1 కోట్లు), ఆయుశ్ మాత్రే లాంటి ఆటగాళ్లు ఉన్నారు. -
కొంప ముంచిన పంత్ నిర్ణయం!.. నాకు బంతి ఇస్తాడేమోనని వెళ్లా.. కానీ..
ఐపీఎల్-2025 (IPL 2025)లో వరుస విజయాలతో జోరు మీదున్న లక్నో సూపర్ జెయింట్స్కు ఎదురుదెబ్బ తగిలింది. సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. అయితే, డెత్ ఓవర్లలో కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) తీసుకున్న నిర్ణయాలే లక్నో ఓటమికి ప్రధాన కారణమనే విమర్శలు వస్తున్నాయి.49 బంతుల్లో 63 రన్స్లక్నోలోని ఏకనా స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్లో చెన్నై (LSG vs CSK)తో తలపడ్డ పంత్ సేన.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో ఐడెన్ మార్క్రమ్ (6) విఫలం కాగా.. మిచెల్ మార్ష్ (30) ఫర్వాలేదనిపించాడు. అయితే, ఇన్ఫామ్ బ్యాటర్ నికోలస్ పూరన్ 8 పరుగులకే పెవిలియన్ చేరాడు.ఈ క్రమంలో నాలుగో స్థానంలో ఆడిన పంత్ 49 బంతుల్లో 63 రన్స్ చేయగా.. ఆయుశ్ బదోని (22), అబ్దుల్ సమద్ (20) అతడికి సహకారం అందించారు. ఫలితంగా లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది.చెన్నై బౌలర్లలో స్పిన్నర్లు రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీయగా.. నూర్ అహ్మద్ (నాలుగు ఓవర్లలో 13 రన్స్) పొదుపుగా బౌలింగ్ చేశాడు. పేసర్లలో మతీశ పతిరణ రెండు, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే పరుగులు రాబట్టేందుకు చెన్నై తడబడింది.శివం దూబేతో కలిసి ధోనిఓపెనర్లు షేక్ రషీద్ (19 బంతుల్లో 27), రచిన్ రవీంద్ర (22 బంతుల్లో 37) ఓ మోస్తరుగా ఆడగా.. రాహుల్ త్రిపాఠి (9), రవీంద్ర జడేజా (7) పూర్తిగా విఫలమయ్యారు. వీరిద్దరు లక్నో స్పిన్నర్ రవి బిష్ణోయి బౌలింగ్లో వెనుదిరిగారు. ఇలాంటి తరుణంలో శివం దూబేతో కలిసి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు.రవి బిష్ణోయిని కాదని.. ఈ క్రమంలో ఆఖరి నాలుగు ఓవర్లలో చెన్నై విజయానికి 44 పరుగులు అవసరమయ్యాయి. దీంతో ఒత్తిడిలో కూరుకుపోయిన లక్నో సారథి పంత్ బౌలింగ్ చాయిస్ విషయంలో తప్పటడుగు వేశాడు. పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీసిన రవి బిష్ణోయిని కాదని.. పేస్ ద్వయం ఆవేశ్ ఖాన్, శార్దూల్ ఠాకూర్ను నమ్ముకున్నాడు.ఇక దూబే (37 బంతుల్లో 43), ధోని (11 బంతుల్లో 26) వారి బౌలింగ్లో పరుగులు పిండుకుని మరో మూడు బంతులు మిగిలి ఉండగానే చెన్నైని విజయతీరాలకు చేర్చారు. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం లక్నో స్పిన్నర్ రవి బిష్ణోయి పంత్ నిర్ణయంపై స్పందించాడు.నాకు బంతి ఇస్తాడేమోనని వెళ్లా.. కానీ..‘‘నేను పంత్తో ఏమీ మాట్లాడలేదు. అయితే, వికెట్ స్వభావాన్ని బట్టి నన్ను పిలుస్తాడేమోనని రెండు, మూడు సార్లు అతడికి దగ్గరగా వెళ్లాను. కానీ తన ప్రణాళికలు వేరేగా ఉన్నాయి. కాబట్టి నన్ను పట్టించుకోలేదేమో!ఇలాంటి కీలక సమయంలో కెప్టెన్గా, వికెట్ కీపర్గా తనకంటూ కొన్ని ప్లాన్స్ ఉంటాయి. మా కంటే అతడే గొప్పగా పరిస్థితులను అంచనా వేయగలడు. అందుకే తన నిర్ణయం సరైందనే భావనతో ముందుకు వెళ్లి ఉంటాడు.ఏదైమైనా మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. నేను, రాఠి, మార్క్రమ్ ఉన్నాం. కాబట్టి అదనపు స్పిన్నర్ అవసరం లేదు. ఇక మహీ భాయ్ గురించి చెప్పేదేముంది?!.. బంతి తన ఆధీనంలో ఉందంటే దానిని బౌండరీకి తరలించడమే తరువాయి’’ అని రవి బిష్ణోయి పరోక్షంగా పంత్ నిర్ణయాన్ని విమర్శించాడు.కాగా లక్నో బౌలర్లలో స్పిన్నర్లు రవి బిష్ణోయి మూడు ఓవర్లు బౌలింగ్ చేసి 18 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. దిగ్వేశ్ సింగ్ రాఠీ, మార్క్రమ్ ఒక్కో వికెట్ తీయగా.. పేసర్లలో ఆవేశ్ ఖాన్ ఒక్క వికెట్ దక్కించుకున్నాడు.చదవండి: MS Dhoni On POM Award: ఈ అవార్డు నాకెందుకు?.. అతడికి ఇవ్వాల్సింది The IMPACT player does it with MAX IMPACT 🤩Shivam Dube 🤝 MS Dhoni with a match-winning partnership 💛@ChennaiIPL are 🔙 to winning ways 😎Scorecard ▶ https://t.co/jHrifBlqQC #TATAIPL | #LSGvCSK pic.twitter.com/AI2hJkT9Dt— IndianPremierLeague (@IPL) April 14, 2025 -
ఈ అవార్డు నాకెందుకు?.. అతడికి ఇవ్వాల్సింది: ధోని
మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు ఐపీఎల్-2025 (IPL 2025)లో గెలుపు బాట పట్టింది. లక్నో సూపర్ జెయింట్స్ (LSG vs CSK)పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి.. తమ పరాజయ పరంపరకు బ్రేక్ వేసింది. సమిష్టి ప్రదర్శనతో ఈ సీజన్లో రెండో గెలుపు నమోదు చేసింది.రిషభ్ పంత్ తొలిసారిలక్నోలోని ఏకనా స్టేడియంలో సోమవారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై తొలుత బౌలింగ్ చేసింది. బౌలర్లు రాణించడంతో లక్నోను 166 పరుగులకు కట్టడి చేయగలిగింది. లక్నో ఆటగాళ్లలో ఓపెనర్ మిచెల్ మార్ష్ (30), ఆయుశ్ బదోని (22), అబ్దుల్ సమద్ (20) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ రిషభ్ పంత్ ఈ సీజన్లో తొలిసారి బ్యాట్ ఝులిపించాడు. 49 బంతుల్లో 63 పరుగులతో రాణించాడు. ఇక సీఎస్కే బౌలర్లలో మతీశ పతిరణ, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.పొదుపుగా బౌలింగ్ చేసిన నూర్మిగతా వాళ్లలో నూర్ అహ్మద్ అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఈ స్పిన్ బౌలర్ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 13 పరుగులే ఇచ్చాడు. ఇక లక్నో విధించిన లక్ష్యాన్ని ధోని సేన 19.3 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్లు షేక్ రషీద్ (19 బంతుల్లో 27), రచిన్ రవీంద్ర (22 బంతుల్లో 37) ఫర్వాలేదనిపించగా.. శివం దూబే (37 బంతుల్లో 43 నాటౌట్) నిలకడగా ఆడాడు. ఆఖర్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ధోని 11 బంతుల్లో 26 పరుగులతో అజేయంగా నిలిచి దూబేతో కలిసి జట్టు గెలుపును ఖరారు చేశాడు.ఈ నేపథ్యంలో విజయానంతరం చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మాట్లాడుతూ.. ‘‘మ్యాచ్ గెలవడం ఎంతో సంతోషంగా ఉంది. దురదృష్టవశాత్తూ వివిధ కారణాల వల్ల మేము ఆరంభ మ్యాచ్లలో విఫలమయ్యాం. సొంత మైదానం చెపాక్లో ఓటములు చవిచూశాం.ఘనమైన భవిష్యత్తుఇలాంటి సమయంలో ఇతర వేదికపై గెలవడం కాస్త ఊరట కలిగించే అంశం. జట్టులో మళ్లీ ఆత్మవిశ్వాసం నింపిన విజయం ఇది. పవర్ ప్లేలో మేము ఈసారి కూడా ఇబ్బందిపడ్డాం. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయాం.అయినప్పటికీ తిరిగి పుంజుకున్నాం. ఈరోజు మా బౌలర్లు, బ్యాటర్లు మెరుగ్గా రాణించారు. షేక్ రషీద్ మాతో చాన్నాళ్లుగా ప్రయాణం చేస్తున్నాడు. నెట్స్లో స్పిన్నర్లు, పేసర్లను ఎదుర్కొంటున్నాడు. ఈరోజు అతడు మ్యాచ్ ఆడాడు. ఇది ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో గొప్పగా రాణించగల సత్తా అతడికి ఉంది.ఈ అవార్డు నాకెందుకు?.. అతడికి ఇవ్వాల్సిందిఇక ఈరోజైతే నాకు.. ‘నాకు ఎందుకు ఈ అవార్డు ఇస్తున్నారు?’ అని అనిపించింది. నిజానికి నూర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు కదా!’’ అని పేర్కొన్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ను నూర్ అహ్మద్కు ఇచ్చి ఉంటే బాగుండేదని ధోని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2025లో తొలి మ్యాచ్లో ముంబైని ఓడించిన చెన్నై.. ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచ్లలో ఓడింది. తాజాగా లక్నోపై గెలిచినప్పటికీ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం చివర్లోనే కొనసాగుతోంది.ఐపీఎల్ 2025: లక్నో వర్సెస్ చెన్నై👉లక్నో స్కోరు: 166/7 (20)👉చెన్నై స్కోరు: 168/5 (19.3)👉ఫలితం: ఐదు వికెట్ల తేడాతో లక్నోపై చెన్నై గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మహేంద్ర సింగ్ ధోని.చదవండి: IPL 2025: ఎస్ఆర్హెచ్ జట్టులోకి విధ్వంసకర వీరుడు.. The IMPACT player does it with MAX IMPACT 🤩Shivam Dube 🤝 MS Dhoni with a match-winning partnership 💛@ChennaiIPL are 🔙 to winning ways 😎Scorecard ▶ https://t.co/jHrifBlqQC #TATAIPL | #LSGvCSK pic.twitter.com/AI2hJkT9Dt— IndianPremierLeague (@IPL) April 14, 2025 -
‘అక్కడ కూర్చుని మాట్లాడటం తేలికే.. ఇక్కడికి వస్తే తెలుస్తుంది’
లక్నో సూపర్ జెయింట్స్ ఫాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur)కు కోపమొచ్చింది. విమర్శలు చేసే వాళ్లు.. ముందుగా తమ పరిస్థితి ఏమిటో గమనించుకోవాలని.. ఆ తర్వాత ఇతరుల గురించి మాట్లాడాలంటూ మండిపడ్డాడు. స్టూడియోలో కూర్చుని మైదానంలోని పరిస్థితులను ఎవరూ అర్థం చేసుకోలేరని.. కామెంట్రీ పేరుతో శ్రుతిమించిన విమర్శలు చేయడం ఏమాత్రం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశాడు.అమ్ముడుపోకుండా మిగిలిపోయాడుఐపీఎల్-2025 (IPL 2025) మెగా వేలంలో శార్దూల్ ఠాకూర్ అమ్ముడుపోకుండా మిగిలిపోయిన విషయం తెలిసిందే. ముంబై తరఫున దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటినా ఫ్రాంఛైజీలు ఈ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ను పట్టించుకోలేదు. అయితే, లక్నో యువ పేసర్ మొహ్సిన్ ఖాన్ (Mohsin Khan) గాయం కారణంగా.. శార్దూల్కు ఊహించని విధంగా అదృష్టం కలిసి వచ్చింది.జట్టులోకి వచ్చి అదరగొడుతున్నాడుసీజన్ మొత్తానికి దూరమైన మొహ్సిన్ స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ శార్దూల్ ఠాకూర్ను జట్టులోకి తీసుకుంది. అంతేకాదు తుదిజట్టులోనూ చోటిచ్చింది. అయితే, శార్దూల్ కూడా యాజమాన్యం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్లలో కలిపి 11 వికెట్లు తీసి.. అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.200 స్కోరు అనేది కామన్ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్పై శనివారం నాటి మ్యాచ్లో లక్నో విజయానంతరం శార్దూల్ ఠాకూర్ విమర్శకులకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. ‘‘ఈ సీజన్ ఆరంభం నుంచి మేము బాగానే బౌలింగ్ చేస్తున్నాం. అయితే, చాలాసార్లు కామెంట్రీలో మా గురించి విమర్శుల చేస్తూనే ఉన్నారు.బౌలర్ల పట్ల కఠినంగా మాట్లాడుతున్నారు. ఈరోజుల్లో 200 స్కోరు అనేది కామన్ అయిపోయిన విషయాన్ని గుర్తించాలి. క్రికెట్ ఆడే తీరు రోజురోజుకూ మారిపోతోంది. స్టూడియోలో కూర్చుని ఒకరి బౌలింగ్ గురించి వ్యాఖ్యానాలు చేయడం సులువే.అక్కడ కూర్చుని మాట్లాడటం తేలికే.. ఇక్కడికి వస్తే తెలుస్తుందికానీ మైదానంలో ఉన్న వాళ్లకే వాస్తవ పరిస్థితుల గురించి తెలుస్తుంది. వేరే వాళ్లను విమర్శించే వాళ్లు.. వారి గణాంకాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి సమీక్షించుకోవాలి’’ అని శార్దూల్ ఠాకూర్ కామెంటేటర్లకు చురకలు అంటించాడు.కాగా ఐపీఎల్-2025 ఆరంభ మ్యాచ్లో ఓటమి పాలైన లక్నో త్వరగానే కోలుకుంది. ఇప్పటికి ఆరు మ్యాచ్లలో నాలుగు గెలిచింది. గుజరాత్ టైటాన్స్తో శనివారం మధ్యాహ్నం నాటి మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.ఘన విజయంబాధ్యతాయుతమైన బౌలింగ్కు తోడు.. దూకుడైన బ్యాటింగ్తో సొంత మైదానంలో గెలుపు జెండా ఎగురవేసింది. ఈ సీజన్లో హ్యాట్రిక్ విజయంతో మెరిసి సత్తా చాటింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన పంత్ సేన.. గుజరాత్ను 180 పరుగులకు కట్టడి చేసింది. లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయి రెండేసి వికెట్లు తీయగా.. దిగ్వేశ్ రాఠీ, ఆవేశ్ ఖాన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఇక లక్ష్య ఛేదనలో ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ (31 బంతుల్లో 58) మరోసారి విజృంభించగా.. బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చిన కెప్టెన్ రిషభ్ పంత్ (18 బంతుల్లో 21) మరోసారి విఫలమయ్యాడు. అయితే, నికోలస్ పూరన్ (34 బంతుల్లో 61) ధనాధన్ దంచికొట్టగా.. ఆయుశ్ బదోని (20 బంతుల్లో 28 నాటౌట్) అతడికి సహకరించాడు. ఫలితంగా 19.3 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి లక్నో లక్ష్యాన్ని ఛేదించింది.చదవండి: నేను కెప్టెన్ని!.. ముందు నన్ను అడగాలి కదా: మండిపడ్డ శ్రేయస్ అయ్యర్ -
IPL 2025: గుజరాత్పై లక్నో విజయం
గుజరాత్పై లక్నో విజయంఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 12) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై లక్నో సూపర్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. గిల్ (38 బంతుల్లో 60; 6 ఫోర్లు, సిక్స్), సాయి సుదర్శన్ (37 బంతుల్లో 56; 7 ఫోర్లు, సిక్స్) అర్ద సెంచరీతో రాణించారు.అనంతరం ఛేదనకు దిగిన లక్నో..మార్క్రమ్ (31 బంతుల్లో 58; 9 ఫోర్లు, సిక్స్), పూరన్ (34 బంతుల్లో 61; ఫోర్, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్లతో రెచ్చిపోవడంతో 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. బదోని సిక్సర్తో మ్యాచ్ను ముగించాడు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ 2, రషీద్ ఖాన్, వాషింగ్టన్ సందర్ తలో వికెట్ తీశారు.పూరన్ ఔట్15.2వ ఓవర్- 155 పరుగుల వద్ద లక్నో మూడో వికెట్ కోల్పోయింది. రషీద్ ఖాన్ బౌలింగ్లో షారుక్ ఖాన్కు క్యాచ్ ఇచ్చి పూరన్ (61) ఔటయ్యాడు.23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన పూరన్23 బంతుల్లో 6 సిక్సర్లు, బౌండరీ సాయంతో పూరన్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ మ్యాచ్లో లక్నో గెలవాలంటే 42 బంతుల్లో మరో 41 పరుగులు మాత్రమే చేయాలి. పూరన్ 51, బదోని 4 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన లక్నో11.1వ ఓవర్- 123 పరుగుల వద్ద లక్నో రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్దిద్ కృష్ణ బౌలింగ్లో శుభ్మన్ గిల్కు క్యాచ్ ఇచ్చి మార్క్రమ్ (58) ఔటయ్యాడు. 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన మార్క్రమ్181 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో ఓపెనర్ మార్క్రమ్ ధాటిగా ఇన్నింగ్స్ను ప్రారంభించాడు. మార్క్రమ్ కేవలం 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ (8 ఫోర్లు, సిక్స్) పూర్తి చేశాడు. పంత్ ఔటయ్యాక క్రీజ్లోకి వచ్చిన పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. పూరన్ కేవలం 16 బంతుల్లో 5 సిక్సర్ల సాయంతో 37 పరుగులు చేశాడు. 10 ఓవర్లలో లక్నో స్కోర్ 114/1గా ఉంది. తొలి వికెట్ కోల్పోయిన లక్నో.. పంత్ ఔట్6.2వ ఓవర్- 65 పరుగుల వద్ద లక్నో తొలి వికెట్ కోల్పోయింది. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో సుందర్కు క్యాచ్ ఇచ్చి రిషబ్ పంత్ (21) ఔటయ్యాడు.టార్గెట్ 181.. 6 ఓవర్లలో 61 పరుగులు చేసిన లక్నో181 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో ధాటిగా ఆడుతుంది. ఓపెనర్లు పంత్ (17), మార్క్రమ్ (38) వేగంగా పరుగులు సాధిస్తున్నారు. 6 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 61/0గా ఉంది. టార్గెట్ 181.. ఓపెనర్గా పంత్.. రెచ్చిపోయి ఆడుతున్న మార్క్రమ్181 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో ఓపెనర్గా రిషబ్ పంత్ బరిలోకి దిగాడు. మార్క్రమ్కు జతగా పంత్ క్రీజ్లో ఉన్నాడు. పంత్ 11 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 10 పరుగులు చేసి క్రీజ్లో ఉన్నాడు. అతనికి జతగా ఉన్న మార్క్రమ్ 18 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 33 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. ఈ మ్యాచ్లో మిచెల్ మార్ష్ గైర్హాజరీలో పంత్ ఓపెనర్గా బరిలోకి దిగాడు. 5 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 49/0గా ఉంది.లక్నో బౌలర్ల అద్బుత ప్రదర్శన.. ఓ మోస్తరు స్కోర్కే పరిమితమైన గుజరాత్టాస్ ఓడి లక్నో ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. గిల్ 60, సాయి సుదర్శన్ 56 పరుగులతో రాణించారు. వాస్తవానికి ఈ మ్యాచ్లో గుజరాత్ భారీ స్కోర్ సాధించాల్సి ఉండింది. ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ క్రీజ్లో ఉండగా గుజరాత్ స్కోర్ 12 ఓవర్లలో 120గా ఉండింది. అయితే వీరిద్దరు రెండు పరుగుల వ్యవధిలో ఔట్ కావడంతో గుజరాత్ స్కోర్ ఒక్కసారిగా నమ్మదించింది. ఈ దశలో లక్నో బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి గుజరాత్ను ఓ మోస్తరు స్కోర్కే పరిమితం చేశారు. రూథర్ఫోర్డ్ 22, బట్లర్ 16, షారుక్ ఖాన్ 11 (నాటౌట్), సుందర్ 2, తెవాటియా డకౌటయ్యారు. లక్నో బౌలర్లలో బిష్ణోయ్, శార్దూల్ ఠాకూర్ తలో 2 వికెట్లు తీయగా.. దిగ్వేశ్ రాఠీ, ఆవేశ్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు. నాలుగో వికెట్ కోల్పోయిన గుజరాత్16.4వ ఓవర్- 145 పరుగుల వద్ద గుజరాత్ నాలుగో వికెట్ కోల్పోయింది. దిగ్వేశ్ రాఠీ బౌలింగ్లో శార్దూల్ ఠాకూర్కు క్యాచ్ ఇచ్చి జోస్ బట్లర్ (16) ఔటయ్యాడు. రూథర్ఫోర్డ్కు (6) జతగా షారుక్ ఖాన్ క్రీజ్లోకి వచ్చాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన గుజరాత్ఇన్నింగ్స్ 14వ ఓవర్లో గుజరాత్ రెండు వికెట్లు కోల్పోయింది. తొలి బంతికి సాయి సుదర్శన్ (56), ఆఖరి బంతికి వాషింగ్టన్ సుందర్ను (2) రవి బిష్ణోయ్ ఔట్ చేశారు. 14 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 127/3గా ఉంది. బట్లర్ (3), రూథర్ఫోర్డ్ క్రీజ్లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్12.1వ ఓవర్- 120 పరుగుల వద్ద గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. ఆవేశ్ ఖాన్ బౌలింగ్లో మార్క్రమ్ బౌండరీ లైన్ వద్ద అద్బుతమైన క్యాచ్ పట్టడంతో శుభ్మన్ గిల్ (38 బంతుల్లో 60; 6 ఫోర్లు, సిక్స్) ఔటయ్యాడు. సాయి సుదర్శన్కు (55) జతగా జోస్ బట్లర్ క్రీజ్లోకి వచ్చాడు. హాఫ్ సెంచరీలు పూర్తి చేసిన గిల్, సుదర్శన్.. 11 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ ఎంతంటే..?11 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 109/0గా ఉంది. గిల్ (53), సాయి సుదర్శన్ (51) హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. నిలకడగా ఆడుతున్న గిల్, సాయి సుదర్శన్.. 7 ఓవర్ల తర్వాత స్కోర్ ఎంతంటే..?7 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 66/0గా ఉంది. ఓపెనర్లు సాయి సుదర్శన్ (30), శుభ్మన్ గిల్ (34) నిలకడగా ఆడుతున్నారు. ఆచితూచి ఆడుతున్న గుజరాత్ ఓపెనర్లుటాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్మన్ గిల్ (15), సాయి సుదర్శన్ (11) ఆచితూచి ఆడుతున్నారు. ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 12) లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. లక్నోలోని అటల్ బిహారి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో లక్నో కెప్టెన్ పంత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్లో లక్నో ఓ కీలక మార్పుతో బరిలోకి దిగుతుంది. స్టార్ ఆటగాడు, ఇన్ ఫామ్ ప్లేయర్ మిచెల్ మార్ష్ ఈ మ్యాచ్లో ఆడటం లేదు. వ్యక్తిగత కారణాల చేత మార్ష్ ఈ మ్యాచ్కు దూరంగా ఉన్నాడు. అతని స్థానాన్ని హిమ్మత్ సింగ్ భర్తీ చేయనున్నాడు. గుజరాత్ కూడా ఓ మార్పుతో బరిలోకి దిగుతుంది. కుల్వంత్ కేజ్రోలియా స్థానంలో వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చాడు.ప్రస్తుత సీజన్లో గుజరాత్ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో నాలుగింట గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. లక్నో ఐదింట మూడు గెలిచి ఆరో స్థానంలో ఉంది.తుది జట్లు..లక్నో: ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కెప్టెన్/వికెట్కీపర్), హిమ్మత్ సింగ్, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, ఆకాష్ దీప్, దిగ్వేష్ సింగ్ రాఠీ, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్కీపర్), వాషింగ్టన్ సుందర్, షెర్ఫానే రూథర్ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్ -
అంత డబ్బు కళ్ల చూడలేదు!.. అతడు బ్యాటింగ్కు రాకపోవడమేంటి?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు రిషభ్ పంత్ (Rishabh Pant). ఈ టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ను దక్కించుకునేందుకు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఏకంగా రూ. 27 కోట్లు ఖర్చు చేసింది. మెగా వేలంలో ఇతర జట్లతో పోటీపడి మరీ లక్నో యాజమాన్యం పంత్ను భారీ ధరకు దక్కించుకుంది.ఐపీఎల్-2025లో కెప్టెన్గా పంత్కు పగ్గాలు అప్పగించింది. అయితే, సారథిగా ఫర్వాలేదనిపిస్తున్న ఈ టీమిండియా స్టార్.. బ్యాటర్గా మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. ఈ సీజన్లో అతడి కెప్టెన్సీలో లక్నో ఇప్పటికి ఐదు మ్యాచ్లు పూర్తి చేసుకుని మూడు గెలిచింది.19 పరుగులుఇక బ్యాటర్గా రిషభ్ పంత్ చేసిన పరుగులు మొత్తం కలిపి కేవలం 19. ఈ నేపథ్యంలో అతడి బ్యాటింగ్ వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా లక్నో జట్టు శనివారం సొంత మైదానం ఏకనా స్టేడియంలో గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. కనీసం ఈ మ్యాచ్లోనైనా పంత్ బ్యాట్ ఝులిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు.ఒకేసారి అంత డబ్బు నేను కళ్లజూడలేదుఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా రిషభ్ పంత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ప్రైస్ ట్యాగ్’ పంత్పై ప్రతికూల ప్రభావం చూపిస్తోందా? అన్న నెటిజన్ల ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ఏమో నాకైతే తెలియదు. ఎందుకంటే.. నా జీవితంలో ఒకేసారి అంత డబ్బు నేను కళ్లజూడలేదు.కాబట్టి.. అతడిపై ఒత్తిడి ఉంటుందో లేదో నేను అంచనా వేయలేను. అయితే, ఓ ఆటగాడిపై ఇలాంటివి కచ్చితంగా ప్రభావం చూపుతాయా? అంటే అవుననీ చెప్పవచ్చు. డబ్బు (ప్రైస్ ట్యాగ్) లేదంటే కెప్టెన్సీ భారం అతడిపై ఒత్తిడి పెంచుతుండవచ్చు. కారణం ఏదైనా పంత్ దానిని అధిగమించాలి.. గానీ తప్పించుకోకూడదు. అతడు బ్యాటింగ్కు రాకపోవడమేంటి?గత మ్యాచ్లో పంత్ బ్యాటింగ్కు వెళ్లకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. క్రీజులోకి వెళ్తేనే కదా.. పరుగులు వస్తాయో.. రావో తెలిసేది. కనీస ప్రయత్నానికి కూడా వెనుకాడితే ఎలా?.. అతడు బ్యాటింగ్కు వెళ్లకుండా తప్పించుకోవడం ఎంతమాత్రం సరికాదు’’ అని ఆకాశ్ చోప్రా విమర్శించాడు.కాగా గత మ్యాచ్లో లక్నో జట్టు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడింది. ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఈ పోరులో టాస్ గెలిచిన ఆతిథ్య కేకేఆర్.. పంత్ సేనను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఓపెనర్లు ఐడెన్ మార్క్రమ్ (28 బంతుల్లో 47), మిచెల్ మార్ష్ (48 బంతుల్లో 81) దంచికొట్టగా.. నికోలస్ పూరన్ సుడిగాలి ఇన్నింగ్స్ (36 బంతుల్లో 87 నాటౌట్) ఆడాడు.అయితే, మిడిలార్డర్లో వచ్చే పంత్ ఈ మ్యాచ్లో బ్యాటింగ్కు రాలేదు. నాలుగో స్థానంలో అబ్దుల్ సమద్ (6).. ఐదో స్థానంలో డేవిడ్ మిల్లర్ (4 నాటౌట్)ను ఆడించాడు. ఇక ఈ మ్యాచ్లో 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి లక్నో 238 పరుగులు సాధించింది. లక్ష్య ఛేదనలో కేకేఆర్ 234 రన్స్కే పరిమితం కావడంతో నాలుగు పరుగుల స్వల్ప తేడాతో పంత్ సేన జయభేరి మోగించింది. చదవండి: IPL 2025: గుజరాత్ టైటాన్స్కు షాక్.. అతడు సీజన్ మొత్తానికి దూరం -
KKR VS LSG Updates: ఉత్కంఠపోరులో కేకేఆర్ ఓటమి..
ఉత్కంఠ పోరులో కేకేఆర్ ఓటమి..ఐపీఎల్-2025లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో కోల్కతా నైట్రైడర్స్పై 4 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. 239 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేయగల్గింది. కేకేఆర్ బ్యాటర్లలో అజింక్య రహానే(61) టాప్ స్కోరర్గా నిలవగా.. రింకూ సింగ్(38), వెంకటేశ్ అయ్యర్(45), సునీల్ నరైన్(30) పోరాడారు. లక్నో బౌలర్లలో ఆకాష్ దీప్, శార్ధూల్ ఠాకూర్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. అవేష్ ఖాన్,బిష్ణోయ్, దిగ్వేష్ తలా వికెట్ సాధించారు.రసవత్తరంగా కేకేఆర్-లక్నో మ్యాచ్ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో-కేకేఆర్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. కేకేఆర్ విజయానికి ఆఖరి ఓవర్లో 24 పరుగులు కావాలి. క్రీజులో రింకూ సింగ్(24), హర్షిత్ రానా(5) ఉన్నారు.కేకేఆర్ ఆరో వికెట్ డౌన్..వెంకటేశ్ అయ్యర్ రూపంలో కేకేఆర్ ఆరో వికెట్ కోల్పోయింది. 45 పరుగులు చేసిన అయ్యర్.. ఆకాష్దీప్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి రింకూ సింగ్ వచ్చాడు. 16 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 185/6గా ఉంది. ఐదో వికెట్ కోల్పోయిన కేకేఆర్త్వరగా లక్ష్యాన్ని చేరుకుందామనే తొందరలో కేకేఆర్ వరుసగా వికెట్లు కోల్పోతుంది. ఆ జట్టు 173 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. ఆవేశ్ ఖాన్ బౌలింగ్లో పంత్కు క్యాచ్ ఇచ్చి రఘువంశీ (5) ఔటయ్యాడు. 15 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 173/5గా ఉంది. నాలుగో వికెట్ కోల్పోయిన కేకేఆర్13.6వ ఓవర్- 166 పరుగుల వద్ద రవి భిష్ణోయ్ బౌలింగ్లో మార్క్రమ్కు క్యాచ్ ఇచ్చి రమన్దీప్ సింగ్ (1) ఔటయ్యాడు.మూడో వికెట్ కోల్పోయిన కేకేఆర్ఇన్నింగ్స్ 13వ ఓవర్లో వరుసగా ఐదు వైడ్లు వేసిన శార్దూల్ ఠాకూర్ ఆ ఓవర్ చివరి బంతికి అతి కీలకమైన రహానే (61) వికెట్ తీశాడు. 13 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 162/3గా ఉంది. ఈ మ్యాచ్లో కేకేఆర్ గెలవాలంటే 42 బంతుల్లో మరో 77 పరుగులు మాత్రమే చేయాలి. వాతావరణం బౌలర్లకు ఏమాత్రం సహకరించడం లేదు. బంతి అస్సలు నియంత్రణలో ఉండటం లేదు. టార్గెట్ 239.. 10 ఓవర్లలో 129 పరుగులు చేసిన కేకేఆర్239 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కేకేఆర్ కూడా ధీటుగా జవాబిస్తుంది. 10 ఓవర్లలోనే ఆ జట్టు 129 పరుగులు (2 వికెట్ల నష్టానికి) చేసింది. రహానే (47), వెంకటేశ్ అయ్యర్ (24) క్రీజ్లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్6.2వ ఓవర్- పవర్ ప్లేలో అదరగొట్టిన కేకేఆర్ (90/1) ఆతర్వాతి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. దిగ్వేష్ రాఠీ సునీల్ నరైన్ను (30) బోల్తా కొట్టించాడు. రహానేకు (36) జతగా వెంకటేశ్ అయ్యర్ క్రీజ్లోకి వచ్చాడు. టార్గెట్ 239.. విధ్వంసం సృష్టిస్తున్న కేకేఆర్ బ్యాటర్లుభారీ లక్ష్య ఛేదనలో కేకేఆర్ బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. ఆదిలోనే డికాక్ వికెట్ కోల్పోయినప్పటికీ.. సునీల్ నరైన్ (30), రహానే (18) విధ్వంసం సృష్టిస్తున్నారు. వీరిద్దరి ధాటికి కేకేఆర్ 5 ఓవర్లలో ఏకంగా 73 పరుగులు చేసింది. టార్గెట్ 239.. తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్2.3వ ఓవర్- 239 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కేకేఆర్ 37 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. తొలి ఓవర్లో 16 పరుగులిచ్చిన ఆకాశ్దీప్ అద్భుతంగా కమ్బ్యాక్ ఇచ్చి డికాక్ను (15) ఎల్బీడబ్ల్యూ చేశాడు. సునీల్ నరైన్కు (15) జతగా రహానే క్రీజ్లోకి వచ్చాడు.మార్ష్, పూరన్ విధ్వంసం.. లక్నో భారీ స్కోర్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో భారీ స్కోర్ చేసింది. మార్ష్ (48 బంతుల్లో 81; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), పూరన్ (36 బంతుల్లో 87 నాటౌట్; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. లక్నో ఇన్నింగ్స్లో మార్క్రమ్ (28 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా సత్తా చాటాడు. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా 2, రసెల్ ఓ వికెట్ తీశారు. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన పూరన్పూరన్ 21 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 16.4 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 192/2గా ఉంది. పూరన్తో పాటు అబ్దుల్ సమద్ (2) క్రీజ్లో ఉన్నాడు. రెండో వికెట్ కోల్పోయిన లక్నో.. మార్ష్ ఔట్15.2వ ఓవర్- 81 పరుగుల వద్ద మిచెల్ మార్ష్ ఔటయ్యాడు. రసెల్ బౌలింగ్లో రింకూ సింగ్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.సెంచరీకి చేరువవుతున్న మార్ష్15 ఓవర్ల అనంతరం లక్నో స్కోర్ 170/1గా ఉంది. మార్ష్ (47 బంతుల్లో 81; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీకి చేరువవుతున్నాడు. మరో ఎండ్లో పూరన్ కూడా ధాటిగా ఆడుతున్నాడు. పూరన్ 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 32 పరుగులు చేసి క్రీజ్లో ఉన్నాడు. దంచి కొడుతున్న మార్ష్హాఫ్ సెంచరీ పూర్తయ్యాక మార్ష్ మరింత స్పీడ్ పెంచాడు. వరుస పెట్టి బౌండరీలు, సిక్సర్లు బాదుతున్నాడు. 13 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 138/1గా ఉంది. మార్ష్ 42 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 71 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. పూరన్ 8 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 12 పరుగులు చేసి మార్ష్కు జతగా ఉన్నాడు. తొలి వికెట్ కోల్పోయిన లక్నో10.2వ ఓవర్- 99 పరుగుల వద్ద లక్నో తొలి వికెట్ కోల్పోయింది. 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేసి మార్క్రమ్ ఔటయ్యాడు. హర్షిత్ రాణా మార్క్రమ్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మిచెల్ మార్ష్ (34 బంతుల్లో 49; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. మార్ష్కు జతగా పూరన్ క్రీజ్లోకి వచ్చాడు. ధాటిగా ఆడుతున్న లక్నో ఓపెనర్లునిదానంగా ఇన్నింగ్స్ను ప్రారంభించిన లక్నో ఓపెనర్లు ఆతర్వాత గేర్ మార్చారు. మార్క్రమ్ (19 బంతుల్లో 36; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), మిచెల్ మార్ష్ (23 బంతుల్లో 34; ఫోర్, 3 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో 7 ఓవర్ల అనంతరం లక్నో స్కోర్ 72/0గా ఉంది. గేర్ మార్చిన మార్క్రమ్ఇన్నింగ్స్ ప్రారంభంలో నిదానంగా ఆడిన మార్క్రమ్ స్పెన్సర్ జాన్సన్ వేసిన నాలుగో ఓవర్లో గేర్ మార్చాడు. ఆ ఓవర్లో అతను 2 బౌండరీలు, సిక్సర్ సహా 18 పరుగులు రాబట్టాడు. 5 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 43/0గా ఉంది. మార్క్రమ్తో పాటు (28) మార్ష్ (13) క్రీజ్లో ఉన్నాడు. ఆచితూచి ఆడుతున్న లక్నో ఓపెనర్లుటాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన లక్నో నిదానంగా ఆడుతుంది. ఓపెనర్లు ఎయిడెన్ మార్క్రమ్ (9), మిచెల్ మార్ష్ (11) ఆచితూచి ఆడుతున్నారు. 3 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 20/0గా ఉంది. ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 8) కేకేఆర్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో కేకేఆర్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. నేటి మ్యాచ్ కోసం కేకేఆర్ ఓ మార్పు చేసింది. మొయిన్ అలీ స్థానంలో స్పెన్సర్ జాన్సన్ తుది జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్లో లక్నో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. ప్రస్తుతం కేకేఆర్, లక్నో పాయింట్ల పట్టికలో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. ఇరు జట్లు ఇప్పటివరకు తలో 4 మ్యాచ్లు ఆడి రెండింట గెలిచి, రెండిట ఓడాయి. ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరుకు ఐదు మ్యాచ్ల్లో తలపడగా.. లక్నో 3, కేకేఆర్ 2 మ్యాచ్ల్లో గెలుపొందాయి.తుది జట్లు..కేకేఆర్: క్వింటన్ డికాక్ (వికెట్కీపర్), సునీల్ నరైన్, అజింక్య రహానే (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరాలక్నో: మిచెల్ మార్ష్, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్/వికెట్కీపర్), ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్, దిగ్వేష్ రాఠి -
సొంతంగా పళ్లు తోముకోలేని దుస్థితి.. ఆయన మాటలు మంత్రంలా పనిచేశాయి
కారు ప్రమాదానికి గురై కోలుకుంటున్న సమయంలో భారత మాజీ ఆటగాడు ఆశిష్ నెహ్రా (Ashish Nehra) తనకు మానసికంగా ధైర్యాన్నిస్తూ అండగా నిలిచాడని వికెట్ కీపర్ రిషభ్ పంత్ (Rishabh Pant) గుర్తు చేసుకున్నాడు. అతడి స్ఫూర్తిదాయక మాటలతో తాను ప్రతికూల పరిస్థితులను అధిగమించానని పంత్ అన్నాడు. ఆయన మాటలు మంత్రంలా పనిచేశాయి‘కష్టకాలంలో ఒక సలహా నాపై బాగా ప్రభావం చూపించింది. భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా.. నేను ఆడే స్థానిక క్లబ్లో కూడా సీనియర్. ఆయన నా వద్దకు వచ్చి నా ఆరోగ్యం గురించి వాకబు చేసిన తర్వాత ఆయన ఒకే ఒక మాట అన్నాడు.నీకు సంతోషం కలిగించే పనులు మాత్రమే చేస్తూ ఉండు. నేను కూడా గతంలో చాలా సార్లు గాయాలబారిన పడ్డాను. అయినా సరే అన్నీ మరచి ఆనందంగా ఉండటం ముఖ్యం అని నెహ్రా చెప్పాడు. నేను కోలుకునే క్రమంలో ఈ మాటలు బాగా ప్రభావం చూపించాయి’ అని పంత్ వివరించాడు. సొంతంగా పళ్లు కూడా తోముకోలేని దుస్థితిఒకటి, రెండు రోజుల్లోనే కోలుకోలేనని వాస్తవం అర్థమైన తర్వాత తనను తాను తిట్టుకోవడం మానేశానని, ప్రతికూల విషయాల గురించి ఆలోచించడం తగ్గించాలని పంత్ చెప్పాడు. కారు ప్రమాదం వల్ల తాను జీవితాన్ని చూసే విధానం మారిందని రిషభ్ పంత్ భావోద్వేగంతో అన్నాడు. ఇది క్రికెట్ గురించి తన ఆలోచనలను కూడా మార్చేసిందని భారత వికెట్ కీపర్ పేర్కొన్నాడు. ‘ప్రమాదం తర్వాత నేను చాలా చిన్న చిన్న పనులు కూడా సొంతంగా చేసుకోలేకపోయేవాడిని. సొంతంగా పళ్లు కూడా తోముకోలేని దుస్థితి. అంతా బాగున్నట్లు మనం ఇలాంటివి పట్టించుకోం. కానీ వాటి విలువ నాకు అప్పుడు అర్థమైంది.నా ఆలోచనా ధోరణి మారిందిక్రీడల్లో కూడా ప్రతి రోజూ బాగా ఆడాలనే కోరుకుంటాం. కానీ అది ఎప్పుడూ జరగదు. ఇలాంటి అంశాల్లో ప్రమా దం తర్వాత నా ఆలోచనా ధోరణి మారింది’ అని పంత్ వెల్లడించాడు. ప్రస్తుతం ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న పంత్ ప్రదర్శన బాగా లేదు. అయితే తాను అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నానని, పరిస్థితి మారుతుందని అతను ఆశాభావం వ్యక్తం చేశాడు. చదవండి: గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్గా ఊహించని పేరు చెప్పిన కపిల్ దేవ్ -
LSG Vs MI: నువ్విక మారవా?.. లక్నో జట్టుకు రెండు భారీ షాకులు.. పాపం పంత్!
గెలుపు జోష్లో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో లక్నో జట్టు తప్పిదానికి గానూ ఐపీఎల్ పాలక మండలి అతడికి జరిమానా విధించింది. నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయనందున రూ. 12 లక్షల ఫైన్ వేసింది.దిగ్వేశ్కి మరోసారి షాక్అదే విధంగా.. లక్నో స్పిన్నర్ దిగ్వేశ్ సింగ్ రాఠీకి ఐపీఎల్ పాలక మండలి మరోసారి షాకిచ్చింది. అనుచిత ప్రవర్తనకు గానూ మ్యాచ్ ఫీజులో యాభై శాతం మేర కోత విధించడంతో పాటు.. అతడి ఖాతాలో మరో డీమెరిట్ పాయింట్ జతచేసింది.203 పరుగులుఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా లక్నోలోని ఏకనా స్టేడియంలో ఎల్ఎస్జీ- ముంబై (LSG vs MI) ఇండియన్స్ మధ్య శుక్రవారం మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు సాధించింది.ఓపెనర్లు మిచెల్ మార్ష్ (60), ఐడెన్ మార్క్రమ్ (53), ఆయుశ్ బదోని (30), డేవిడ్ మిల్లర్(27) రాణించారు. ముంబై బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా అత్యధికంగా ఐదు వికెట్లు తీయగా.. విఘ్నేశ్ పుతూర్, అశ్వనీ కుమార్, ట్రెంట్ బౌల్ట్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.పన్నెండు పరుగుల తేడాతోఇక లక్ష్య ఛేదనలో ముంబై ఐదు వికెట్లు నష్టపోయి 191 పరుగులకే పరిమితమైంది. నమన్ ధీర్ (24 బంతుల్లో 46), సూర్యకుమార్ యాదవ్ (43 బంతుల్లో 67), హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 28 నాటౌట్) పోరాటం వృథాగా పోయింది. పన్నెండు పరుగుల తేడాతో లక్నో చేతిలో ముంబై ఓటమి పాలైంది.అయితే, ఈ మ్యాచ్లో లక్నో జట్టు నిర్ణీత సమయంలో 20 ఓవర్ల కోటా పూర్తి చేయలేకపోయింది. ఫలితంగా ఆఖరి ఓవర్లో 30 యార్డ్ సర్కిల్లోకి అదనంగా ఓ ఫీల్డర్ను పిలవాల్సి వచ్చింది. ముంబై విజయానికి చివరి ఓవర్లో 22 పరుగులు అవసరమైన వేళ కేవలం నలుగురు ఫీల్డర్లను మాత్రమే రింగ్ బయట ఉంచాల్సి వచ్చింది. దీనితో పాటు.. స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా ఆ జట్టు కెప్టెన్ పంత్కు జరిమానా కూడా పడింది.స్లో ఓవర్ రేటు ‘‘లక్నోలోని భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో శుక్రవారం ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసినందు వల్ల లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్కు జరిమానా విధించడమైనది’’ అని ఐపీఎల్ ఒక ప్రకటన విడుదల చేసింది.ఇదిలా ఉంటే.. దిగ్వేశ్ సింగ్ రాఠీ విషయంలోనూ ఐపీఎల్ పాలక మండలి మరో ప్రకటన జారీ చేసింది. ‘‘లక్నోలోని భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో శుక్రవారం ముంబై ఇండియన్స్తో మ్యాచ్ సందర్భంగా ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన లక్నో బౌలర్ దిగ్వేశ్ సింగ్ మ్యాచ్ ఫీజులో యాభై శాతం కోత విధిస్తున్నాం.మళ్లీ అదే తప్పుఆర్టికల్ 2.5లోని లెవల్ 1 తప్పిదానికి అతడు పాల్పడ్డాడు. ఈ సీజన్లో అతడు నిబంధనలు అతిక్రమించడం ఇది రెండోసారి. మంగళవారం పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లోనూ దిగ్వేశ్ రూల్స్ ఉల్లంఘించాడు. అప్పుడు ఒక డీమెరిట్ పాయింట్తో పాటు తాజాగా మరో డీమెరిట్ పాయింట్ అతడి ఖాతాలో చేరింది’’ అని సదరు ప్రకటనలో పేర్కొంది. అయితే, దిగ్వేశ్కు ఫైన్ వేయడానికి గల కారణం.. నమన్ వికెట్ తీసిన తర్వాత.. మరోసారి నోట్బుక్లో రాస్తున్నట్లుగా సెలబ్రేట్ చేసుకోవడం అని తెలుస్తోంది.నువ్విక మారవా? .. పాపం పంత్!కాగా ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో.. లక్నో జట్టులోని మిగతా బౌలర్లతో పోలిస్తే దిగ్వేశ్ సింగ్ పొదుపుగా బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 21 పరుగులే ఇచ్చి.. నమన్ ధీర్ రూపంలో కీలక వికెట్ తీశాడు. ఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. కానీ తన అనుచిత ప్రవర్తనతో ఇలా మరోసారి శిక్షను అనుభవించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు దిగ్వేశ్పై.. ‘‘మారవా.. నువ్విక మారవా?’’ అంటూ మీమ్స్ ట్రోల్స్ చేస్తున్నారు. మరోవైపు..బ్యాటర్గా విఫలమవుతున్న పంత్కు ఇలా సారథిగానూ ఎదురుదెబ్బ తగలడం పట్ల.. ‘పాపం పంత్’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.చదవండి: హిట్టర్లు అవసరం.. అందుకే తిలక్ను వెనక్కి పంపించాం: హార్దిక్ Just the breakthrough #LSG needed! Avesh Khan's change in pace does the trick as LSG dismiss Surya Kumar Yadav at a crucial juncture! 👊Updates ▶️ https://t.co/HHS1Gsaw71#TATAIPL | #LSGvMI | @LucknowIPL pic.twitter.com/KKptbNOjLI— IndianPremierLeague (@IPL) April 4, 2025 -
రూ. 27 కోట్లు.. కనీసం 27 పరుగులైనా చేయవా? పంత్కు గోయెంకా క్లాస్? (ఫోటోలు)
-
రూ. 20 కోట్లు లెక్కకాదు!.. ఎక్కువ డబ్బు ఇస్తే ప్రతి మ్యాచ్లో స్కోరు చేయాలా?
ఐపీఎల్ మెగా వేలం-2025లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్లలో వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer)మూడోవాడు. లక్నో సూపర్ జెయింట్స్ రిషభ్ పంత్ (Rishabh Pant) కోసం రూ. 27 కోట్లు ఖర్చు చేస్తే.. పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ను ఏకంగా రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేసింది.రూ. 23.75 కోట్లుఅయితే, కోల్కతా నైట్ రైడర్స్ అనూహ్య రీతిలో వెంకటేశ్ అయ్యర్ను దక్కించుకునేందుకు రూ. 23.75 కోట్లు కుమ్మరించింది. నిజానికి గతేడాది అతడు అంత గొప్పగా ఏమీ ఆడలేదు. పదిహేను మ్యాచ్లలో కలిపి 370 పరుగులు సాధించాడు.అయితే, సన్రైజర్స్ హైదరాబాద్తో కీలకమైన ఫైనల్లో మాత్రం వెంకటేశ్ అయ్యర్ బ్యాట్ ఝులిపించాడు. కేవలం 26 బంతుల్లోనే 52 పరుగులతో అజేయంగా నిలిచి.. జట్టును చాంపియన్గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో కేకేఆర్ అతడిని భారీ ధరకు దక్కించుకోవడం గమనార్హం.ఆరంభ మ్యాచ్లో ఆరు.. ముంబైపై మూడుఅయితే, ఐపీఎల్-2025 ఆరంభ మ్యాచ్లలో మాత్రం వెంకటేశ్ అయ్యర్ తేలిపోయాడు. ఆర్సీబీతో మ్యాచ్లో కేవలం ఆరు పరుగులే చేసిన ఈ ఆల్రౌండర్.. రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో బ్యాటింగ్కు దిగలేదు. ఇక ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో కేవలం మూడు పరుగులకే పెవిలియన్ చేరాడు.మెరుపు బ్యాటింగ్ఈ క్రమంలో వెంకటేశ్కు కేకేఆర్ భారీ మొత్తం చెల్లించడం వృథా అయిందని పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. అయితే, సన్రైజర్స్ హైదరాబాద్తో గురువారం నాటి మ్యాచ్ సందర్భంగా విమర్శకులందరికీ బ్యాట్తోనే సమాధానమిచ్చాడు వెంకటేశ్. ఇన్నింగ్స్ ఆరంభంలో టెస్టు మ్యాచ్ మాదిరి ఆడిన అతడు ఆఖర్లో మెరుపులు మెరిపించాడు.Lighting up Eden Gardens with some fireworks 💥 Sit back and enjoy Rinku Singh and Venkatesh Iyer's super striking 🍿👏5⃣0⃣ up for Iyer in the process!Updates ▶ https://t.co/jahSPzdeys#TATAIPL | #KKRvSRH | @KKRiders pic.twitter.com/AAAqnOsRy8— IndianPremierLeague (@IPL) April 3, 2025 కేవలం 29 బంతుల్లోనే వెంకటేశ్ అయ్యర్ 60 పరుగులు చేసి కేకేఆర్ టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. రైజర్స్పై కేకేఆర్ 80 పరుగుల తేడాతో గెలుపొందడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం వెంకటేశ్ అయ్యర్ తన ‘ప్రైస్ ట్యాగ్’పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.రూ. 20 లక్షలు.. రూ. 20 కోట్లు.. ఏదైనా ఒకటే‘‘ఒక్కసారి ఐపీఎల్ మొదలైందంటే.. ఓ ఆటగాడు రూ. 20 లక్షలకు అమ్ముడుపోయాడా? లేదంటే రూ. 20 కోట్లకు అమ్ముడుపోయాడా? అన్న విషయంతో సంబంధం ఉండదు. మనం ఎలా ఆడతామన్నది డబ్బు నిర్ణయించదు. మా జట్టులో అంగ్క్రిష్ రఘువన్షీ అనే కుర్రాడు ఉన్నాడు.అతడు ఆరంభం నుంచి అద్భుతంగా ఆడుతున్నాడు. ఆటగాడి ధరకు అనుగుణంగానే అంచనాలూ ఉంటాయని నాకు తెలుసు. కానీ జట్టు విజయానికి ఒక ఆటగాడు ఎంత మేర తోడ్పడుతున్నాడన్నదే ముఖ్యం. పరిస్థితులకు అనుగుణంగా నేను ఈరోజు బ్యాటింగ్ చేశాను.ఎక్కువ డబ్బు ఇస్తే ప్రతి మ్యాచ్లో స్కోరు చేయాలా?అంతేగానీ.. నేను అత్యధిక ధర పలికిన ఆటగాడిని గనుక ప్రతి మ్యాచ్లో స్కోరు చేయాలనే నిబంధన ఏమీ లేదు. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభావం చూపానా? లేదా? అన్నదే ముఖ్యం. ప్రైస్ ట్యాగ్ వల్ల ఒత్తిడి ఉంటుందన్న మాట నిజం.ఈ విషయంలో నాకు అబద్ధం ఆడాల్సిన పనిలేదు. అయితే, ఆ ఒత్తిడి డబ్బు గురించి కాదు.. జట్టుకు నేను ఉపయోగపడుతున్నానా? లేదా? అన్న అంశం మీద ఆధారపడి ఉంటుంది’’ అని వెంకటేశ్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. కాగా గతేడాది సత్తా చాటిన అంగ్క్రిష్ను కేకేఆర్ తిరిగి రూ. 3 కోట్లకు సొంతం చేసుకుంది. ఇప్పటికే అతడు ఈ సీజన్లో ఓ హాఫ్ సెంచరీ బాదేశాడు. నాలుగు మ్యాచ్లలో కలిపి 128 రన్స్ చేశాడు.ఐపీఎల్-2025: కోల్కతా వర్సెస్ హైదరాబాద్👉కోల్కతా స్కోరు: 200/6 (20)👉హైదరాబాద్ స్కోరు: 120 (16.4)👉ఫలితం: 80 పరుగుల తేడాతో సన్రైజర్స్పై కేకేఆర్ విజయం.చదవండి: జట్టు మారనున్న తిలక్ వర్మ?.. HCA స్పందన ఇదే -
LSG Vs MI: ఏం చేయాలో.. అది సరిగ్గానే చేశాను: జహీర్ ఖాన్తో రోహిత్ శర్మ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్-2025 (IPL 2025)లో ఇప్పటి వరకు తన మార్కు చూపలేకపోయాడు. ముంబై ఇండియన్స్ తరఫున ఈ సీజన్లో మూడు మ్యాచ్లు పూర్తి చేసుకున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్.. మొత్తంగా కేవలం 21 పరుగులే చేశాడు.తమ తొలి మ్యాచ్లో భాగంగా చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్తో పోరులో డకౌట్ అయిన రోహిత్.. గుజరాత్ టైటాన్స్పై ఎనిమిది పరుగులకే పెవిలియన్ చేరాడు. చివరగా కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లో పదమూడు పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ (Rohit Sharma) బ్యాటింగ్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇక ముంబై ఇండియన్స్ తదుపరి శుక్రవారం నాటి మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్తో తలపడనుంది. ఇందుకోసం ఇప్పటికే లక్నోలోని ఏకనా స్టేడియంలో కసరత్తు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో లక్నో మెంటార్, టీమిండియా పేస్ దిగ్గజం జహీర్ ఖాన్ (Zaheetr Khan)తో రోహిత్ శర్మ జరిపిన సంభాషణ వైరల్గా మారింది.ఏం చేయాలో.. అది సరిగ్గానే చేశాను‘‘నేనేం చేయాలో అది సరిగ్గానే చేశాను. గతంలో చాలానే చేశాను. ఇప్పుడు కొత్త చేయాల్సింది ఏమీ లేదు’’ అని రోహిత్ జహీర్తో అన్నాడు. ఇంతలో లక్నో కెప్టెన్, టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ వచ్చి వెనుక నుంచి రోహిత్ శర్మను ఆలింగనం చేసుకున్నాడు. ఈ క్రమంలో చిన్నగా స్మైల్ ఇస్తూనే రోహిత్ సీరియస్గా తన సంభాషణను కొనసాగించాడు.ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. కాగా ఐపీఎల్-2025లో రోహిత్ వరుస వైఫల్యాల నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ గట్టిగానే విమర్శించాడు.మూస పద్ధతులకే పరిమితమైతే కుదరదు‘‘రోహిత్ ప్రస్తుతం గడ్డు దశను ఎదుర్కొంటున్నాడు. గత మూడు- నాలుగేళ్ల క్రితం ఉన్న పస ఇప్పుడు తన బ్యాటింగ్లో లేదు. ప్రతి ఉదయం కొత్తదే. అత్యుత్తమంగా రాణించాలంటే కఠినంగా శ్రమించకతప్పదు.పరిస్థితులు అతడి చేజారిపోయాయి. ఇప్పటికీ తన సహజమైన ప్రతిభ, మూస పద్ధతులకే పరిమితమైతే కుదరదు’’ అని మంజ్రేకర్ ఘాటు విమర్శలు చేశాడు. ఈ నేపథ్యంలో రోహిత్ జహీర్తో అన్న మాటలను మంజ్రేకర్కు ఆపాదిస్తూ నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.ఘనమైన చరిత్రఇదిలా ఉంటే.. గతేడాది ముంబై ఇండియన్స్.. కెప్టెన్గా రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. ఈ క్రమంలో 2025లో అతడు జట్టును వీడతాడనే ప్రచారం జరిగినా.. హిట్మ్యాన్ ముంబైతోనే కొనసాగుతున్నాడు. కాగా ముంబైకి ఐదుసార్లు ట్రోఫీ అందించిన చరిత్ర రోహిత్ శర్మకు ఉంది. క్యాష్ రిచ్ లీగ్లో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి సారథి కూడా అతడే. ఇక ఐపీఎల్లో రోహిత్ శర్మ ఇప్పటి వరకు 260 మ్యాచ్లు ఆడి 6649 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు కూడా ఉన్నాయి. చదవండి: జట్టు మారనున్న తిలక్ వర్మ?.. HCA స్పందన ఇదేQ: For how long are you going to watch this reel? 😍A: Haaanjiiii 🫂💙#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL #LSGvMI pic.twitter.com/e2oxVieoz2— Mumbai Indians (@mipaltan) April 3, 2025 -
మాకు సొంత మైదానం.. కానీ ఇక్కడ..: జహీర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్
సొంత మైదానంలో లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Ziants) ఓడిపోవడాన్ని ఆ జట్టు మెంటార్ జహీర్ ఖాన్ (Zaheer Khan) జీర్ణించుకోలేకపోతున్నాడు. పంజాబ్ కింగ్స్ గెలుపునకు పరోక్షంగా పిచ్ క్యూరేటరే కారణమంటూ విస్మయకర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా లక్నో మంగళవారం పంజాబ్తో తలపడ్డ విషయం తెలిసిందే.లక్నోలోని భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకనా క్రికెట్ స్టేడియం ఇందుకు వేదిక. టాస్ గెలిచిన పంజాబ్.. లక్నో జట్టును తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. అయితే, ఏకనా వికెట్పై పరుగులు రాబట్టేందుకు లక్నో బ్యాటర్లు తడబడ్డారు.అయితే, 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి లక్నో కష్టాల్లో పడిన వేళ నికోలస్ పూరన్ (44), ఆయుశ్ బదోని (41), అబ్దుల్ సమద్ (12 బంతుల్లో 27)బ్యాట్ ఝులిపించారు. ఈ ముగ్గురి ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయగలిగింది.16.2 ఓవర్లలోనే..ఇక లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (8) వికెట్ కోల్పోయినప్పటికీ పంజాబ్ అద్బుత రీతిలో పుంజుకుంది. వికెట్ కీపర్ ప్రభ్సిమ్రన్ సింఘ్ (34 బంతుల్లో 69) మెరుపు అర్ధ శతకంతో రాణించగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (30 బంతుల్లో 52), నేహాల్ వధేరా (25 బంతుల్లో 43) అజేయంగా నిలిచి జట్టు గెలుపును ఖరారు చేశారు. ఈ ముగ్గురి విజృంభణ కారణంగా 16.2 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే నష్టపోయి పంజాబ్ లక్నోపై ఘన విజయం సాధించింది.మాకు సొంత మైదానం..ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం లక్నో మెంటార్, టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. లక్నో తమకు సొంత మైదానం అయినా.. పిచ్ క్యూరేటర్ మాత్రం పంజాబ్కు మేలు చేయడం నిరాశపరిచిందన్నాడు. ఈ మేరకు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ... ‘‘సొంత మైదానంలో మ్యాచ్ అంటే.. అక్కడి జట్టుకే కాస్త ఫేవర్గా ఉంటుంది.కానీ ఇక్కడ పంజాబ్ క్యూరేటర్ ఉన్నారుకానీ ఈ విషయంలో లక్నో క్యూరేటర్ చేసిన పని వల్ల.. ఇది హోం మ్యాచ్ అన్న భావనే రాలేదు. ఇక్కడి వికెట్ ఇలాగే ఉంటుందేమో బహుశా!.. ఇక్కడ పంజాబ్ క్యూరేటర్ ఉన్నారనిపించింది. ఈ మ్యాచ్లో నాకు అన్నింటికంటే ఇదే ఎక్కువ నిరాశను కలిగించింది.క్యూరేటర్ మమ్మల్నే కాదు లక్నో అభిమానులను కూడా నిరాశకు గురిచేశారు. సొంతగడ్డపై లక్నో గెలుస్తుందని వారంతా భావించారు. కానీ ఇలా జరిగిపోయింది. జట్టుగా మేము పటిష్టంగా ఉన్నాము. మ్యాచ్లో ఓడిపోయామన్న వాస్తవాన్ని మేము అంగీకరిస్తున్నాం.వినూత్న రీతిలో.. ముందడుగుఅయితే, సొంతమైదానంలో ఓటమి కాస్త ఎక్కువ బాధించింది. ఇక్కడ మాకు ఇంకో ఆరు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. మేము కచ్చితంగా మెరుగ్గా రాణిస్తామనే నమ్మకం ఉంది. సంప్రదాయ పద్ధతులను కాస్త పక్కనపెట్టి.. వినూత్న రీతిలో.. ముందడుగు వేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాము’’ అని జహీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు.రహానే కూడా ఇలాగేకాగా లక్నో పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందని చెప్తారు. కానీ పంజాబ్తో మ్యాచ్లో లక్నో స్పిన్నర్లకు పెద్దగా కలిసిరాలేదు. రవి బిష్ణోయి, మణిమరన్ సిద్దార్థ్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోగా.. దిగ్వేశ్ సింగ్ రాఠీ మాత్రం రెండు వికెట్లు పడగొట్టాడు. మరోవైపు.. పంజాబ్ బౌలర్లలో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్, రిస్ట్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. ఆరంభమ్యాచ్లో ఓటమి తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే కూడా.. ఈడెన్ గార్డెన్స్ పిచ్ గురించి ఇదే తరహా వ్యా ఖ్యలు చేసిన విషయం తెలిసిందే.చదవండి: లక్నో బౌలర్ ఓవరాక్షన్.. భారీ షాకిచ్చిన బీసీసీఐStatement victory ✅Skipper's second 5⃣0⃣ this season ✅Consecutive wins ✅Punjab Kings cap off a perfect day 🙌#TATAIPL | #LSGvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/HSrX8KwiY4— IndianPremierLeague (@IPL) April 1, 2025 -
రూ. 27 కోట్లు దండుగ!.. పంత్కు గట్టిగానే క్లాస్ తీసుకున్న గోయెంకా!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డులకెక్కాడు టీమిండియా స్టార్ రిషభ్ పంత్ (Rishabh Pant). ఐపీఎల్-2025 మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ ఈ వికెట్ కీపర్ కోసం ఏకంగా రూ. 27 కోట్లు ఖర్చు చేసింది. ఇతర ఫ్రాంఛైజీలతో పోటీపడి మరీ పంత్ను సొంతం చేసుకుని.. జట్టు పగ్గాలు అప్పగించింది.అయితే, లక్నో సారథిగా తొలి మ్యాచ్లోనే పంత్ విఫలమయ్యాడు. బ్యాటర్గా, వికెట్ కీపర్గా స్థాయికి తగ్గట్లు రాణించలేక.. గెలవాల్సిన మ్యాచ్ను చేజార్చుకున్నాడు. ఇక రెండో మ్యాచ్లో మాత్రం పంత్కు ఊరట దక్కింది. సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో లక్నో గెలుపొందడంతో అతడు తొలి విజయం అందుకున్నాడు. అయితే, సొంత మైదానంలో మాత్రం మళ్లీ పాత కథే పునరావృతమైంది.పంజాబ్ కింగ్స్(Punjab Kings)తో మంగళవారం నాటి మ్యాచ్లో లక్నో ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. సమిష్టి వైఫల్యం కారణంగా హోం గ్రౌండ్లో తొలి మ్యాచ్లోనే పరాజయాన్ని చవిచూసింది. ఇక ఇప్పటి వరకు లక్నో ఆడిన మూడు మ్యాచ్లలోనూ పంత్ బ్యాటర్గా విఫలం కావడం తీవ్ర విమర్శలకు దారితీసింది.బ్యాటర్గా విఫలంతొలుత ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో రిషభ్ పంత్ ఆరు బంతులు ఎదుర్కొని డకౌట్గా వెనుదిరిగాడు. రెండో మ్యాచ్లో భాగంగా సన్రైజర్స్తో పోరులో పదిహేను బంతుల్లో పదిహేను పరుగులు చేయగలిగాడు. ఇక తాజాగా పంజాబ్తో మ్యాచ్లో ఐదు బంతులు ఎదుర్కొని కేవలం రెండే పరుగులు చేసి నిష్క్రమించాడు. ఈ నేపథ్యంలో పంత్ బ్యాటింగ్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.రూ. 27 కోట్లు దండుగ!‘‘పంత్కు ఏమైంది? హ్యాట్రిక్ అట్టర్ఫ్లాప్లు.. రూ. 27 కోట్లు.. లక్నో బూడిదలో పోసినట్లే..’’ అంటూ సోషల్ మీడియా వేదికగా పంత్పై భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. మరోవైపు.. ప్రతి మ్యాచ్ తర్వాత లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయెంకా పంత్తో సంభాషిస్తున్న ఫొటోలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.గట్టిగానే క్లాస్ తీసుకున్న గోయెంకాతాజాగా పంజాబ్తో మ్యాచ్ తర్వాత కూడా గోయెంకా పంత్కు గట్టిగానే క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. పంత్ చేతులు కట్టుకుని నిలబడగా.. అతడి వైపు వేలు చూపిస్తూ మరీ గోయెంకా సీరియస్ అయిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో గోయెంకా తీరుపై కూడా ట్రోల్స్ వస్తున్నాయి. గతంలో కేఎల్ రాహుల్తో ఇలాగే వ్యవహరించిన తీరును గుర్తుచేస్తూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.‘‘విజయాల కంటే కూడా ఇలాంటి వివాదాలతోనే హైలైట్ కావాలని చూసే ఓనర్ ఈయన ఒక్కడేనేమో! ప్రతి మ్యాచ్ తర్వాత ఇలా కెప్టెన్తో అందరి ముందే సంభాషిస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా బిల్డప్ ఇవ్వడం ద్వారా ఏం నిరూపించాలనుకుంటున్నారు? డబ్బులు పెట్టి కొన్నంత మాత్రాన వారిని తక్కువ చేసి చూపడం సరికాదు’’ అంటూ హితవు పలుకుతున్నారు.ఐపీఎల్-2025: లక్నో వర్సెస్ పంజాబ్ స్కోర్లు👉వేదిక: భారత రత్న శ్రీ అటల్ బిహారి వాజ్పేయి ఏకనా క్రికెట్ స్టేడియం, లక్నో👉టాస్: పంజాబ్.. తొలుత బౌలింగ్👉లక్నో స్కోరు: 171/7 (20)👉పంజాబ్ స్కోరు: 177/2 (16.2)👉ఫలితం: ఎనిమిది వికెట్ల తేడాతో లక్నోపై పంజాబ్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ప్రభ్సిమ్రన్ సింగ్ (34 బంతుల్లో 69).చదవండి: ఐపీఎల్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్.. రోహిత్ శర్మకు నో ఛాన్స్! కెప్టెన్ ఎవరంటే?Statement victory ✅Skipper's second 5⃣0⃣ this season ✅Consecutive wins ✅Punjab Kings cap off a perfect day 🙌#TATAIPL | #LSGvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/HSrX8KwiY4— IndianPremierLeague (@IPL) April 1, 2025 -
పాఠాలు నేర్చుకుంటాం.. ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను: పంత్
సొంత మైదానంలో తొలి మ్యాచ్లోనే లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants)కు చేదు అనుభవం ఎదురైంది. పంజాబ్ కింగ్స్ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. కనీసం మరో 20- 25 పరుగులు చేసి ఉంటే బాగుండేదని పేర్కొన్నాడు.హోం గ్రౌండ్లో పిచ్ పరిస్థితులను అంచనా వేయడంలో విఫలమయ్యామని.. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటామని పంత్ అన్నాడు. కాగా ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా లక్నో మంగళవారం పంజాబ్ కింగ్స్తో తలపడింది. టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. లక్నో బ్యాటింగ్కు దిగింది.పంత్ ఫెయిల్టాపార్డర్లో ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ (18 బంతుల్లో 28) తొలిసారి రాణించగా.. ఇన్ ఫామ్ ఓపెనర్ మిచెల్ మార్ష్ మాత్రం డకౌట్ అయ్యాడు. వన్డౌన్లో వచ్చిన నికోలస్ పూరన్ (30 బంతుల్లో 44) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ పంత్ (5 బంతుల్లో 2) మాత్రం మరోసారి పూర్తిగా నిరాశపరిచాడు.ఈ క్రమంలో ఆయుష్ బదోని (33 బంతుల్లో 41) మెరుగ్గా బ్యాటింగ్ చేయగా.. డేవిడ్ మిల్లర్ (18 బంతుల్లో 19) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఆఖర్లో అబ్దుల్ సమద్ మెరుపు ఇన్నింగ్స్ (12 బంతుల్లో 27) ఆడటంతో లక్నో 170 పరుగుల మార్కు దాటింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.పంజాబ్ ఫటాఫట్ఇక లక్ష్య ఛేదనలో పంజాబ్ ఆరంభంలోనే ప్రియాన్ష్ ఆర్య(8) వికెట్ కోల్పోయినప్పటికీ.. మరో ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ ధనాధన్ ఇన్నింగ్స్తో చెలరేగాడు. 34 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 69 పరుగులు సాధించాడు. ఇక శ్రేయస్ అయ్యర్ (30 బంతుల్లో 52 నాటౌట్) మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. నేహాల్ వధేరా (25 బంతుల్లో 43 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.Statement victory ✅Skipper's second 5⃣0⃣ this season ✅Consecutive wins ✅Punjab Kings cap off a perfect day 🙌#TATAIPL | #LSGvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/HSrX8KwiY4— IndianPremierLeague (@IPL) April 1, 2025 ఈ నేపథ్యంలో 16.2 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి పంజాబ్ కింగ్స్ జయకేతనం ఎగురవేసింది. లక్నోపై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఈ సీజన్లో ఆడిన రెండు మ్యాచ్లలో పంజాబ్ గెలుపొందింది. మరోవైపు.. మూడు మ్యాచ్లు పూర్తి చేసుకున్న లక్నోకు ఇది రెండో ఓటమి.పాఠాలు నేర్చుకుంటాం.. ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేనుఈ క్రమంలో ఓటమి అనంతరం లక్నో సారథి రిషభ్ పంత్ మాట్లాడుతూ.. ‘‘మేము మరిన్ని పరుగులు సాధించాల్సింది. కనీసం మరో 20- 25 రన్స్ చేయాల్సింది. అయితే, ఆటలో ఇవన్నీ సహజమే. మా సొంత మైదానంలో వికెట్ను అంచనా వేసేందుకు ఇంకా సమయం పడుతోంది.ఆరంభంలోనే వికెట్లు కోల్పోతే భారీ స్కోర్లు సాధించడం చాలా కష్టం. అయితే, జట్టులోని ప్రతి సభ్యుడు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. స్లో వికెట్ ఉంటుందని భావించాం. ఈ మ్యాచ్ ద్వారా నేర్చుకోవాల్సిన పాఠాలు చాలానే ఉన్నాయి. అయితే, ఇందులో మాకు కొన్ని సానుకూలతలు కూడా ఉన్నాయి. ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు.చదవండి: ఐపీఎల్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్.. రోహిత్ శర్మకు నో ఛాన్స్! కెప్టెన్ ఎవరంటే? -
ఐపీఎల్లో నేడు (ఏప్రిల్ 1) విధ్వంసకర వీరుల సమరం.. గెలిచేది ఎవరు..?
ఐపీఎల్-2025లో ఇవాళ (ఏప్రిల్ 1) రెండు విధ్వంసకర జట్ల మధ్య పోటీ జరుగనుంది. హార్డ్ హిట్టర్లతో నిండిన లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచే జట్టును అంచనా వేయడం చాలా కష్టం. ఇరు జట్లలో సమాంతరమైన మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. సొంత మైదానంలో ఆడటం ఎల్ఎస్జీకి కాస్త అడ్వాంటేజ్ అవుతుంది. అలాగని పంజాబ్ను తక్కువ అంచనా వేయలేము. ఆ జట్టులో ఉన్న ఆటగాళ్లు చెలరేగితే ఎక్కడైనా, ఏ జట్టుపై అయినా విజయం సాధించగలరు.ఈ సీజన్లో పంజాబ్ ఇప్పటివరకు ఆడిన ఏకైక మ్యాచ్లో అద్భుత విజయం సాధించింది. గుజరాత్పై 11 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో పంజాబ్ కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చెలరేగిపోయాడు. 42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 97 పరుగులు చేసి సెంచరీ చేసే అవకాశమున్నా జట్టు ప్రయోజనాల కోసం వద్దనుకున్నాడు. ఈ మ్యాచ్లో అరంగేట్రం కుర్రాడు ప్రియాంశ్ ఆర్య (23 బంతుల్లో 47), శశాంక్ సింగ్ (16 బంతుల్లో 44 నాటౌట్) కూడా సత్తా చాటారు. మెరుపు వీరులు మ్యాక్స్వెల్ (0), స్టోయినిస్ (20) విఫలమైనా ఈ మ్యాచ్లో పంజాబ్ 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో గుజరాత్ కూడా అద్భుతంగా పోరాడింది. లక్ష్యానికి కేవలం 12 పరుగుల దూరంలో నిలిచిపోయింది. బ్యాటింగ్కు అనుకూలించే అహ్మదాబాద్ పిచ్ కావడంతో ఈ మ్యాచ్లో ఇరు జట్ల బౌలర్లు తేలిపోయారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ (4-0-36-2), స్పిన్నర్ విజయ్కుమార్ వైశాక్ (3-0-28-0) మాత్రమే పర్వాలేదనిపించారు. కీలక సమయంలో వైశాక్ అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థికి మ్యాచ్ను దూరం చేశాడు. నేడు లక్నోతో జరుగబోయే మ్యాచ్లో తొలి మ్యాచ్లో సత్తా చాటిన ఆటగాళ్లతో పాటు మ్యాక్సీ, స్టోయినిస్ కూడా రాణిస్తే పంజాబ్ను ఆపడం కష్టమవుతుంది.లక్నో విషయానికొస్తే.. ఈ జట్టు ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓ దాంట్లో ఓడి, మరో మ్యాచ్లో విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో లక్నో గెలవాల్సింది. అయితే ఆ మ్యాచ్లో ఢిల్లీ ఆటగాళ్లు అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్ మెరుపు ఇన్నింగ్స్లు ఆడి లక్నో నుంచి మ్యాచ్ను లాగేసుకున్నారు. ఈ మ్యాచ్లో లక్నో విధ్వంసకర బ్యాటర్లు మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. వీరిద్దరు మెరుపు అర్ద సెంచరీలు చేసి తమ జట్టు భారీ స్కోర్కు (209) దోహదపడ్డారు. మరో డేంజర్ బ్యాటర్ కిల్లర్ మిల్లర్ కూడా ఓ మోస్తరు మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్లో భారీ అంచనాలు పెట్టుకున్న కొత్త కెప్టెన్ రిషబ్ పంత్ దారుణంగా విఫలమయ్యాడు. మరో హార్డ్ హిట్టర్ మార్క్రమ్ కూడా సత్తా చాటలేకపోయాడు. మొహిసిన్ ఖాన్కు ప్రత్యామ్నాయ ఆటగాడిగా ఎల్ఎస్జీలో చేరిన శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో పర్వాలేదనిపించాడు. దేశీయ బౌలర్లు మణిమారన్ సిద్దార్థ్, దిగ్వేశ్ రతీ కూడా రాణించారు. సీనియర్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు.ఈ సీజన్లో తమ రెండో మ్యాచ్లో లక్నో పిచ్చ కొట్టుడు కొట్టి సన్రైజర్స్ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో తొలుత శార్దూల్ ఠాకూర్ (4-0-34-4) బంతితో చెలరేగిపోయాడు. ఆతర్వాత మార్ష్, పూరన్ విధ్వంసం సృష్టించారు. ఫలితంగా సన్రైజర్స్ సెట్ చేసిన 191 పరుగుల లక్ష్యాన్ని ఎల్ఎస్జీ 16.1 ఓవర్లలోనే ఊదేసింది. పంజాబ్తో నేడు జరుగబోయే మ్యాచ్లో పూరన్, మార్ష్ మరోసారి విజృంభిస్తే లక్నో విజయం ఖాయం. పంజాబ్తో పోలిస్తే లక్నోలో భారీ హిట్టర్ల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంది. మార్క్రమ్, పంత్, ఆయుశ్ బదోని కూడా టచ్లోకి వస్తే లక్నోకు తిరుగుండదు. గతేడాది సన్రైజర్స్ తరఫున విధ్వంసం సృష్టించిన అబ్దుల్ సమద్ ఈ సీజన్లో లక్నోతో ఉన్నాడు. శార్దూల్ కూడా లోయర్ ఆర్డర్లో మెరుపు ఇన్నింగ్స్లు ఆడగలదు.పంజాబ్, లక్నో జట్లలో భారీ హిట్టర్లు ఉండటంతో నేటి మ్యాచ్లో పరుగుల వరద ఖాయమైపోయింది. ఎవరు పైచేయి సాధిస్తారనేది చూడాలి. చరిత్ర చూస్తే ఇరు జట్ల ఇప్పటివరకు నాలుగు సార్లు ఎదురెదురుపడగా.. లక్నో 3, పంజాబ్ ఒక మ్యాచ్లో గెలిచాయి. నేటి మ్యాచ్లో లక్నోకు అనుకూలంగా ఉండే ఆనవాయితీనే కొనసాగుతుందని చెప్పలేము. పంజాబ్లో కూడా మెరుపు వీరుల సంఖ్య తక్కువ లేదు.తుది జట్లు (అంచనా)..లక్నో: మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కెప్టెన్/వికెట్కీపర్), ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, దిగ్వేశ్ రతీ, ప్రిన్స్ యాదవ్పంజాబ్: ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్కీపర్), ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్వెల్, సూర్యాంశ్ షెడ్జ్, లాకీ ఫెర్గూసన్/అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ -
మొన్న అలా.. ఇప్పుడిలా! లక్నో జట్టు యజమాని చర్య వైరల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో వివిధ ఫ్రాంఛైజీ యజమానుల తీరు భిన్నంగా ఉంటుంది. అయితే గత సీజన్లో వివాదాస్పదంగా నిలిచి వార్తలలోకి ఎక్కిన యజమాని ఎవరంటే.. నిస్సందేహంగా లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజయ్ గోయెంకా(Sanjeev Goenka)నే. గత సీజన్ లో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో ఓడిపోయిన తర్వాత గోయెంకా స్టేడియంలోనే నిలబడి రాహుల్పై విమర్శలు గుప్పించారు.నాటి కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul)తో గోయెంకా చేసిన ఈ యానిమేటెడ్ చాట్ అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. గోయెంకా వ్యవహార శైలిపై అప్పట్లో అనేకమంది విమర్శలు గుప్పించారు. దీని ఫలితంగా చివరికి రాహుల్ ఫ్రాంచైజ్ నుంచి తప్పుకొన్నాడనే అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి.రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లు తర్వాత మెగా వేలంలో భారత్ వికెట్టుకీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ను లక్నో రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లు ఖర్చు కొనుగోలు చేసి కెప్టెన్గా నియమించింది. కానీ ఈ వికెట్ కీపర్-బ్యాటర్ తన పూర్వ ఫ్రాంచైజ్ ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో తడబడ్డాడు. పంత్ ఆరు బంతులు ఆడి చివరికి తన ఖాతాను కూడా తెరవకుండా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్ లో లక్నో పరాజయం చవిచూసిన తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా మళ్ళీ అదే రీతిలో కెప్టెన్ పంత్, ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్తో సమావేశమయ్యారు.Hyderabad conquered ✅Win secured ✅#LSG get their first 𝐖 of #TATAIPL 2025 with a comfortable victory over #SRH 💙Scorecard ▶ https://t.co/X6vyVEvxwz#SRHvLSG | @LucknowIPL pic.twitter.com/7lI4DESvQx— IndianPremierLeague (@IPL) March 27, 2025ఈసారి వీరి సంభాషణ కొద్దిగా స్నేహపూర్వకంగా వాతావరణంలో జరిగినట్లు కనిపించింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం అభిమానులు గోయెంకా మాజీ కెప్టెన్ కెఎల్ రాహుల్తో చేసిన వివాదాస్పద సంభాషణ తో పోలుస్తూ ఈ వీడియో ని బాగా వైరల్ చేసారు.పంత్ను గట్టిగా కౌగిలించుకొనిఅయితే ఈసారి కథనం నాటకీయ మలుపు తీసుకుంది. గురువారం జరిగిన మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ పై లక్నో పూర్తి ఆధిపత్యం చెలాయించి సొంత గడ్డ పై ప్రత్యర్థి ని అయిదు వికెట్ల తేడాతో.. అదీ ఇంకా 23 బంతులు మిగిలి ఉండగానే ఓడించింది. దీంతో గోయెంకా ఆనందాన్ని పట్టలేక కెప్టెన్ రిషబ్ పంత్ను గట్టిగా కౌగిలించుకోవడం కనిపించింది. గత సంవత్సరం రాహుల్ కెప్టెన్సీలో ఇదే జట్టుపై ఓటమి తర్వాత గోయెంకా జరిపిన సంభాషణకు.. తాజా దృశ్యాలు పూర్తి విరుద్ధంగా కనిపించాయి. గోయెంకా ప్రవర్తనలో ఈ మార్పును అభిమానులు గ్రహించి సోషల్ మీడియాలో ఈ సంభాషను పోలుస్తూ మీమ్లతో ముంచెత్తారు. ఈ సందర్భంగా భారత మాజీ పేసర్, లక్నో బౌలింగ్ కోచ్ జహీర్ ఖాన్ కూడా నవ్వుతూ కనిపించారు. ఈ విజయం లక్నో ఫ్రాంచైజ్ లోని అందరికీ చాలా ఉపశమనం ఇచ్చినట్టు స్పష్టంగా కనిపించింది.Sanjiv Goenka gives a tight hug to Rishabh Pant. pic.twitter.com/yHcnCCmxXP— Mufaddal Vohra (@mufaddal_vohra) March 27, 2025 వ్యక్తిగత ఒడిదుడుకుల మధ్య పంత్ కెప్టెన్సీతన జట్టును విజయపథంలో నడిపించినప్పటికీ, రిషబ్ పంత్ బ్యాటింగ్ ఫామ్ ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉంది. వ్యక్తిగతంగా చూస్తే తన తొలి మ్యాచ్లో డకౌట్ అయిన పంత్ ఈ మ్యాచ్లో 15 బంతుల్లో 15 పరుగులు చేసాడు. అయితే, బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్ పై ముందుగా బౌలింగ్ చేయాలన్న పంత్ దృఢ సంకల్పం అతని నాయకత్వ ధోరణిని చెప్పకనే చెబుతుంది.చదవండి: Kavya Maran: క్యాచ్ డ్రాప్.. చిన్న పిల్లలా కేరింతలు.. కానీ పాపం ఆఖరికి! -
మా బెస్ట్ ఇవ్వలేకపోయాం.. గెలిచినందుకు సంతోషం: పంత్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2025లో లక్నో సూపర్ జెయింట్స్ బోణీ కొట్టింది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో గురువారం జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. విధ్వంసకర బ్యాటింగ్కు మారుపేరైన రైజర్స్కే షాకిస్తూ.. సొంతమైదానంలోనే కమిన్స్ బృందానికి చుక్కలు చూపించింది. బిగ్ రిలీఫ్ఇటు బౌలర్లు.. అటు బ్యాటర్లు.. సమిష్టి ప్రదర్శనతో రాణించగా.. లక్నో కెప్టెన్గా టీమిండియా స్టార్ రిషభ్ పంత్కు తొలి గెలుపు దక్కింది. ఈ నేపథ్యంలో విజయానంతరం పంత్ హర్షం వ్యక్తం చేశాడు. ‘‘నిజంగా మాకు ఎంతో ఉపశమనాన్ని ఇచ్చే ఫలితం ఇది. గెలిచినప్పుడు పొంగిపోయి.. ఓడినపుడు కుంగిపోయే రకం మేము కాదు. జట్టుగా మా నియంత్రణలో ఉన్న అంశాలపైనే దృష్టి పెడతాం. మా మెంటార్ ప్రతిసారీ ఇదే చెబుతారు. మన పరిధిలో ఉన్న అంశాల గురించి మాత్రమే ఆలోచించాలని.. వాటి ద్వారా లబ్ది పొందేందుకు అత్యుత్తమ మార్గాలు అన్వేషించాలని అంటారు. ఈరోజు నేను అదే చేశాను.మా బెస్ట్ ఇవ్వలేకపోయాం.. పర్లేదు గెలిచాంమా బౌలర్లు ప్రిన్స్, ఠాకూర్ అద్భుతంగా ఆడారు. ఇక పూరన్ ఆట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతడిని మూడో స్థానంలో ఆడిస్తే బాగుంటుందని అనుకున్నాం. తనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చాం. ఈరోజు అతడు అత్యద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.మా జట్టు మొత్తం రాణించింది. మా స్థాయికి తగ్గ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయాం. అయినప్పటికీ గెలుపొందినందుకు సంతోషంగా ఉంది’’ అని రిషభ్ పంత్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2025లో లక్నో తమ తొలి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడింది. విశాఖపట్నంలో ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో లక్నో ఒక్క వికెట్ తేడాతో ఓటమిపాలైంది. వికెట్ కీపర్గా పంత్ చేసిన తప్పిదం కారణంగా భారీ మూల్యమే చెల్లించుకుంది.రైజర్స్ దూకుడుకు లక్నో బౌలర్ల కళ్లెం ఈ నేపథ్యంలో తాజాగా తదుపరి సన్రైజర్స్తో మ్యాచ్ ఆడిన లక్నో ఉప్పల్ మైదానంలో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసింది. సొంత గ్రౌండ్లో రైజర్స్ బ్యాటింగ్ సత్తా ఏమిటో తెలిసీ పంత్ ఈ నిర్ణయం తీసుకోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. అయితే, కెప్టెన్ నమ్మకాన్ని లక్నో బౌలర్లు నిలబెట్టారు.రైజర్స్ పవర్ హిట్టర్లు అభిషేక్ శర్మ(6), ఇషాన్ కిషన్(0)లను శార్దూల్ ఠాకూర్ వెనువెంటనే పెవిలియన్కు పంపగా.. ప్రమాదకర బ్యాటర్లు ట్రవిస్ హెడ్ (28 బంతుల్లో 47)ను అవుట్ చేసిన ప్రిన్స్ యాదవ్.. హెన్రిచ్ క్లాసెన్(26)ను రనౌట్గా వెనక్కి పంపాడు. ఈ క్రమంలో అనికేత్ వర్మ(13 బంతుల్లో 36) మెరుపులు మెరిపించగా.. దిగ్వేశ్ రాఠీ అతడిని అవుట్ చేశాడు.అయితే, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (4 బంతుల్లో 18) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి స్కోరును 200 దాటించే ప్రయత్నం చేయగా.. ఆవేశ్ ఖాన్ అతడి దూకుడుకు కళ్లెం వేశాడు. ఈ క్రమంలో రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో శార్దూల్ (4/34) నాలుగు వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్, దిగ్వేశ్ రాఠీ, రవి బిష్ణోయి, ప్రిన్స్ యాదవ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.నికోలస్ పూరన్ తుపాన్ ఇన్నింగ్స్ఇక లక్ష్య ఛేదనలో ఓపెనర్ మిచెల్ మార్ష్ (31 బంతుల్లో 52) లక్నోకు శుభారంభం అందించాడు. మరో ఓపెనర్ ఐడైన్ మార్క్రమ్(1) మరోసారి విఫలం కాగా.. వన్డౌన్లో వచ్చిన నికోలస్ పూరన్ తుపాన్ ఇన్నింగ్స్తో దుమ్ములేపాడు. కేవలం 26 బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 70 పరుగులు సాధించాడు. మిగతా వాళ్లలో డేవిడ్ మిల్లర్ (7 బంతుల్లో 13), అబ్దుల్ సమద్ (8 బంతుల్లో 22) ధనాధన్ బ్యాటింగ్తో అజేయంగా నిలిచి లక్నోను విజయతీరాలకు చేర్చారు.ఐపీఎల్-2025: సన్రైజర్స్ వర్సెస్ లక్నో👉వేదిక: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం, హైదరాబాద్👉టాస్: లక్నో.. తొలుత బౌలింగ్👉సన్రైజర్స్ స్కోరు: 190/9 (20)👉లక్నో స్కోరు: 193/5 (16.1)👉ఫలితం: ఐదు వికెట్ల తేడాతో సన్రైజర్స్పై లక్నో గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శార్దూల్ ఠాకూర్ (4/34).చదవండి: IPL 2025: 13 బంతుల్లో విధ్వంసం.. ఎస్ఆర్హెచ్ నయా హీరో! ఎవరీ అనికేత్? Hyderabad conquered ✅Win secured ✅#LSG get their first 𝐖 of #TATAIPL 2025 with a comfortable victory over #SRH 💙Scorecard ▶ https://t.co/X6vyVEvxwz#SRHvLSG | @LucknowIPL pic.twitter.com/7lI4DESvQx— IndianPremierLeague (@IPL) March 27, 2025 -
300 సాధ్యమే.. లక్నో బ్యాటింగ్ ఆర్డర్ కూడా ప్రమాదకరమైందే: SRH కోచ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2025లో తమ ఆరంభ మ్యాచ్లోనే సన్రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. విధ్వంసకర బ్యాటింగ్కు మారుపేరుగా మారిన ఈ జట్టు.. రాజస్తాన్ రాయల్స్పై 286 పరుగుల స్కోరు నమోదు చేసింది. ఇక తదుపరి మ్యాచ్లో భాగంగా గురువారం లక్నో సూపర్ జెయింట్స్తో రైజర్స్ తలపడనుంది.ఈ నేపథ్యంలో సొంతమైదానం ఉప్పల్ చెలరేగి ఆడే సన్రైజర్స్.. 300 పరుగుల మార్కును అందుకుంటుందా? అనే చర్చ జరుగుతోంది. ఈ విషయంపై సన్రైజర్స్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్ జేమ్స్ ఫ్రాంక్లిన్ (James Franklin) స్పందించాడు.300 సాధ్యమే.. ‘‘ఇలా జరగదని.. నేను ఎన్నటికీ చెప్పను. ఈ సీజన్లో ఇప్పటికే రెండు మ్యాచ్లలో 230, 240 స్కోర్లు దాటాయి. కాబట్టి తాజా ఎడిషన్లో 300 పరుగుల మార్కు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మా జట్టు ఈ స్కోరుకు దగ్గరగా వచ్చింది. కాబట్టి.. 300 స్కోరు అనే మాటను కొట్టిపారేయలేం’’ అని రైజర్స్- లక్నో మ్యాచ్కు ముందు ఫ్రాంక్లిన్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.లక్నో బ్యాటింగ్ ఆర్డర్ కూడా ప్రమాదకరమైందేఅదే విధంగా లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ ఆర్డర్ గురించి ప్రస్తావన రాగా... ‘‘ఎల్ఎస్జీ బ్యాటింగ్ విభాగం ప్రమాదకరమైనది. ఆ జట్టులో టాపార్డర్ బ్యాటర్లు అద్భుతమైన ఆటగాళ్లు. వారిని ఎదుర్కోవాలంటే మూస తరహా వ్యూహాలు సరిపడవు. మేము కాస్త సృజనాత్మకంగా ఆలోచించాల్సి ఉంటుంది. వారి బ్యాటర్లను కట్టడి చేయడానికి మా బౌలింగ్ విభాగం బాగానే కష్టపడాల్సి ఉంటుంది’’ అని జేమ్స్ ఫ్రాంక్లిన్ చెప్పుకొచ్చాడు.కాగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్తో పాటు టీమిండియా స్టార్ మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, సిమ్రన్జిత్ సింగ్లతో సన్రైజర్స్ పేస్ దళం పటిష్టంగా ఉంది. మరోవైపు లక్నో జట్టులో ఐడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, కెప్టెన్ రిషభ్ పంత్, డేవిడ్ మిల్లర్ రూపంలో పవర్ హిట్టర్లు ఉన్నారు.ఇక ఐపీఎల్ తాజా ఎడిషన్లో తమ తొలి మ్యాచ్లో సన్రైజర్స్ గెలుపొందగా.. లక్నో మాత్రం పరాజయాన్ని చవిచూసింది. విశాఖపట్నంలో ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ఒక్క వికెట్ తేడాతో పరాజయం పాలైంది.ఐపీఎల్-2025లో సన్రైజర్స్ జట్టుట్రవిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), సిమర్జీత్ సింగ్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ, సచిన్ బేబి, జయదేవ్ ఉనాద్కట్, జీషన్ అన్సారీ, ఆడం జంపా, వియాన్ ముల్దర్, రాహుల్ చహర్, కమిందు మెండిస్, అథర్వ టైడే, ఈషన్ మలింగలక్నో సూపర్ జెయింట్స్ జట్టుఐడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఆయుశ్ బదోని, రిషభ్ పంత్(కెప్టెన్/వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేశ్ రాఠీ, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయి, మణిమరన్ సిద్ధార్థ్, అబ్దుల్ సమద్, హిమ్మత్ సింగ్, ఆర్ఎస్ హంగ్రేకర్, ఆకాశ్ మహరాజ్ సింగ్, అర్షిన్ కులకర్ణి, యువరాజ్ చౌదరి, మయాంక్ యాదవ్.చదవండి: ‘అతడిని ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా? ప్రపంచంలో ఎక్కడా ఇలా జరగదు’ -
ఐపీఎల్లో నేడు (మార్చి 27) సన్రైజర్స్ మ్యాచ్.. 300 చూడగలమా..?
ఐపీఎల్-2025లో ఇవాళ (మార్చి 27) ఆసక్తికర సమరం జరుగనుంది. అరివీర భయంకరమైన ఫామ్లో ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్.. తొలి మ్యాచ్లో ఢిల్లీ చేతిలో ఊహించని పరాజయాన్ని ఎదుర్కొన్న లక్నో సూపర్ జెయింట్స్ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ హోం గ్రౌండ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది.ఈ మ్యాచ్ కోసం సన్రైజర్స్ అభిమానులు కళ్లకు వత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. వై నాట్ 300 అని టార్గెట్ పెట్టుకున్న తమ జట్టు ఈ మ్యాచ్లో తప్పక టార్గెట్ను రీచ్ అవుతుందని గంపెడాశలు పెట్టుకున్నారు. సన్రైజర్స్ ఈ సీజన్లో తమ తొలి మ్యాచ్లోనే టార్గెట్ 300ను దాదాపుగా రీచ్ అయినంత పని చేసింది. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఆరెంజ్ ఆర్మీ 286 పరుగులు చేసింది.తొలి మ్యాచ్లో మిస్ అయిన టార్గెట్ 300ను నేటి మ్యాచ్లో తప్పక రీచ్ అవ్వాలని ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు కూడా పట్టుదలగా ఉన్నారు. ఐపీఎల్లో ఇప్పటివరకు ఏ జట్టు 300 పరుగులు చేయలేదు. ఐపీఎల్లో టాప్-3 అత్యధిక స్కోర్లు (287, 286, 277) సన్రైజర్స్ ఖాతాలోనే ఉన్నాయి. ఈ సీజన్లో సన్రైజర్స్ తప్పక 300 మార్కును తాకుతుందని క్రికెట్ పండితులు జోస్యం చెబుతున్నారు. దీని కోసమే సన్రైజర్స్ ఆడే ప్రతి మ్యాచ్ను అభిమానులు ఫాలో అవుతున్నారు.నేడు మ్యాచ్ జరుగబోయే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం పిచ్ బ్యాటర్లకు స్వర్గధామం. ప్రస్తుతం సన్రైజర్స్ ఆటగాళ్లు ఉన్న ఫామ్ను బట్టి చూస్తే.. నేటి మ్యాచ్లో మరోసారి పరుగుల వరద పారడం ఖాయమని తెలుస్తుంది. నాలుగు రోజుల క్రితం ఇక్కడ జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ 286 పరుగులు చేయగా.. ఛేదనలో రాయల్స్ కూడా ఏమాత్రం తగ్గకుండా 242 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో రాయల్స్ 44 పరుగుల తేడాతో ఓడినా అద్భుతంగా పోరాడింది.రాయల్స్ మ్యాచ్తో సన్రైజర్స్ తరఫున అరంగేట్రం చేసిన ఇషాన్ కిషన్.. విధ్వంసకర సెంచరీతో విరుచుకుపడ్డాడు. 47 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 106 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో మిగతా సన్రైజర్స్ ఆటగాళ్లు కూడా 200పైగా స్ట్రయిక్రేట్తో పరుగులు సాధించారు. హెడ్ అర్ద సెంచరీ చేశాడు. అభిషేక్, క్లాసెన్ తమదైన శైలిలో ఉన్న కాసేపు విధ్వంసం సృష్టించారు. నితీశ్ రెడ్డి కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.ఐపీఎల్లో సన్రైజర్స్, లక్నో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడాయి. ఇందులో లక్నో మూడు గెలువగా.. సన్రైజర్స్ కేవలం ఒకే మ్యాచ్లో విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య చివరిగా జరిగిన మ్యాచ్లో సన్రైజర్సే విజయం సాధించింది. గత సీజన్లో జరిగిన ఈ మ్యాచ్లో లక్నో నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని సన్రైజర్స్ తొలి అర్ద భాగంలోనే ఛేదించి, 10 వికెట్ల తేడాతో గెలుపొందింది.ఈ సీజన్లో సన్రైజర్స్, లక్నో రెండూ బలంగా కనిపిస్తున్నాయి. ఇరు జట్లలో విధ్వంసకర వీరులున్నారు. సన్రైజర్స్లో అభిషేక్, హెడ్, ఇషాన్, క్లాసెన్, నితీశ్ ఉంటే.. లక్నోలో మిచెల్ మార్ష్, పూరన్, మార్క్రమ్, మిల్లర్, పంత్ ఉన్నారు. ఈ సీజన్ తొలి మ్యాచ్లో ఓడినా లక్నో బ్యాటింగ్లో అదరగొట్టింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో మార్ష్, పూరన్ సుడిగాలి అర్ద శతకాలతో విరుచుకుపడ్డారు. ఈ మ్యాచ్లో లక్నో బౌలర్లు కూడా రాణించారు. అయితే ప్రత్యర్ధి ఆటగాళ్లు అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్ లక్నో చేతుల్లో నుంచి మ్యాచ్ను లాగేసుకున్నారు. గత మ్యాచ్తో పోలిస్తే నేటి మ్యాచ్లో లక్నో బౌలింగ్ మరింత బలపడనుంది. గాయం కారణంగా తొలి మ్యాచ్కు దూరంగా ఉన్న ఆవేశ్ ఖాన్ నేటి మ్యాచ్లో బరిలోకి దిగవచ్చు.తుది జట్లు (అంచనా)..సన్రైజర్స్: అభిషేక్ శర్మ, ట్రవిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ , అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, ఆడమ్ జంపా, మహమ్మద్ షమీ, సిమర్జీత్ సింగ్లక్నో: ఐడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, రిషబ్ పంత్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, శార్దూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, దిగ్వేష్ రాఠీ, అవేష్ ఖాన్, మణిమారన్ సిద్దార్థ్ -
రికార్డులు బద్దలు కొట్టాల్సిందే.. ఉప్పల్ స్టేడియంలో ఆటగాళ్ల ప్రాక్టీస్ (ఫొటోలు)
-
రిషభ్ పంత్ సోదరి సాక్షి హల్దీ వేడుక.. ఫొటోలు వైరల్
-
పంత్ చేసిన ఆ ఒక్క తప్పు వల్లే.. లక్నో మూల్యం చెల్లించింది!
పొట్టి ఫార్మాట్ క్రికెట్లో మ్యాచ్ల ఫలితం ఎప్పుడూ అనూహ్యంగా ఉంటుంది. ఢిల్లీ కేపిటల్స్- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య సోమవారం విశాఖపట్నం వేదికగా జరిగిన మ్యాచ్ ఈ విషయాన్ని మరో మారు స్పష్టమైంది.సత్తా చాటిన శార్దూల్ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2025లో భాగంగా.. ఈ మ్యాచ్ ప్రారంభం నుంచి అదే ధోరణిలో జరిగింది. భారత్ జట్టులో స్థానం కోల్పోయి, వేలంలో అమ్ముడుపోక దిక్కుతోచని స్థితిలో ఉన్న అల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్... మీడియం పేసర్ మొహ్సిన్ ఖాన్ గాయం కారణంగా తప్పుకోవడంతో జట్టులోకి వచ్చి.. సత్తా చాటడం ఒక ఎత్తు.ఇక ఇంగ్లండ్ కౌంటీ లో ఎసెక్స్ జట్టు తరపున ఆడాలని నిర్ణయించుకుని ఫ్లయిట్ ఎక్కడానికి సిద్ధంగా ఉన్న అతడు.. అనూహ్యంగా దక్కిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. మొదటి ఓవర్లో ఢిల్లీ ఓపెనర్ జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్ మరియు అభిషేక్ పోరెల్ ల వికెట్లు పడగొట్టాడు.దిక్కుతోచని స్థితిమరో వైపు ఎడమచేతి వాటం స్పిన్నర్ ఎం సిద్ధార్థ్ కు సమీర్ రిజ్వి ని అవుట్ చేయడంతో ఢిల్లీ రెండో ఓవర్ లోనే 7 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. 209 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ ఒక దశలో 66 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి దిక్కుతోచని స్థితికి చేరింది. ఈ దశలో ఉత్తర్ ప్రదేశ్ అల్ రౌండర్ విప్రజ్ నిగమ్ 15 బంతుల్లో 39 పరుగులు చేసి ఢిల్లీకి కొంత ఉపశమనాన్నిచ్చాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా బ్యాటింగ్ కి వచ్చిన ఢిల్లీ బ్యాట్స్మన్ అశుతోష్ శర్మ తాను ఎదుర్కొన్న తొలి 20 బంతుల్లో కేవలం 20 పరుగులు మాత్రమే చేశాడు.ఇక ఢిల్లీకి లక్ష్య సాధన దాదాపు కష్టమన్న దశలో అశుతోష్ శర్మ పూనకం వచ్చిన రీతిలో బ్యాటింగ్ చేసి తదుపరి 11 బంతుల్లో 46 పరుగులు సాధించాడు. అందులో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. దీనితో ఓటమి చేరువులో ఉన్న ఢిల్లీ కి ఇంకా మూడు బంతులు మిగిలి ఉండగానే ఒక వికెట్ తేడాతో అద్భుత విజయాన్ని అందించాడు.లక్నోను ఆదుకున్న మార్ష్, పూరన్గత సీజన్ లో తరచుగా పవర్ ప్లేలో వెనుకబడి ఉన్నట్లు కనిపించిన లక్నో ఈ సీజన్ లో దానిని సరిదిద్దే ప్రయత్నం చేసింది. జట్టులోని ఇద్దరు విదేశీ ఆటగాళ్ల కు ఆ బాధ్యతను అప్పగించింది. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్, వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ రెండవ వికెట్కు కేవలం 42 బంతుల్లో 87 పరుగులు జోడించారు. పూరన్ 30 బంతుల్లో ఆరు ఫోర్లు, ఏడు సిక్సర్లు లతో 75 పరుగులు చేయగా, మార్ష్ 36 బంతుల్లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్ల తో 72 పరుగులు సాధించాడు. ఫలితంగా లక్నో జట్టు 250 పరుగులు పైగా సాధిస్తుందని భావిస్తున్న తరుణంలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ మరియు భారత్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వరుసగా వికెట్లు తీసి లక్నోని దెబ్బతీశారు. లక్నో 14 నుంచి 19 ఓవర్లలో కేవలం 33 పరుగులు మాత్రమే జోడించి ఆరు వికెట్లు కోల్పోయింది.ఈ దశలో లక్నో 200 పరుగులు దాటడమే కష్టమని భావిస్తున్న తరుణంలో డేవిడ్ మిల్లర్ ఇన్నింగ్స్ చివరి రెండు బంతుల్లో మీడియం పేసర్ మోహిత్ శర్మ రెండు సిక్సర్లు కొట్టడంతో స్కోరు 209కి చేరింది. నిజానికి ఢిల్లీ స్కోరు 204/9 వద్ద ఉన్న సమయంలో మోహిత్ శర్మను స్టంపౌట్ చేసే అవకాశాన్ని పంత్ మిస్ చేశాడు. ఆఖరి ఓవర్ మొదటి బంతికి షాబాజ్ అహ్మద్ బౌలింగ్లో బాల్ మోహిత్ ప్యాడ్లను తాకినట్లుగా అనిపించింది.పంత్ చేసిన ఆ ఒక్క తప్పు వల్లేఅయితే, అంతలోనే అతడు పరుగు కోసం క్రీజును వీడగా కీపర్ పంత్ స్టంపింగ్ చేయకుండా.. రివ్యూకు వెళ్లాడు. ఎల్బీడబ్ల్యూకు అప్పీలు చేశాడు. అయితే, రీప్లేలో బంతి స్టంప్స్ను మిస్ అవుతోందని థర్డ్ అంపైర్ నుంచి నిర్ణయం వెలువడగా.. సేఫ్ అయ్యాడు మోహిత్. నిజానికి అతడిని స్టంపౌట్ చేస్తే.. పదో వికెట్ కోల్పోయి అప్పుడే ఢిల్లీ కథ ముగిసేది. అదే ఓవర్లో మూడో బంతికి అశుతోష్ సిక్సర్ బాది మ్యాచ్ను ముగించాడు. అలా నాటకీయ పరిణామాలతో ఢిల్లీ ఈ మ్యాచ్ లో విజయం సాధించడం విశేషం. Never gave up hope 💪Never stopped believing 👊A special knock and match to remember for the ages 🥳#DC fans, how's the mood? 😉Scorecard ▶ https://t.co/aHUCFODDQL#TATAIPL | #DCvLSG | @DelhiCapitals pic.twitter.com/HYeLTrEjTn— IndianPremierLeague (@IPL) March 24, 2025pic.twitter.com/JBNXCNw3Ql— The Game Changer (@TheGame_26) March 25, 2025 చదవండి: ‘గిల్ ఒక్కడే ఏమీ చేయలేడు.. మేమంతా ఉంటేనే ఏదైనా సాధ్యం’ -
DC Vs LSG: అదృష్టం కూడా కలిసి రావాలి.. విప్రాజ్ మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు: పంత్
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా నిన్న (మార్చి 24) జరిగిన ఉత్కంఠ పోరులో లక్నో సూపర్ జెయింట్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ తేడాతో గెలుపొందింది. లక్నో నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆదిలోనే చేతులెత్తేసిన ఢిల్లీని ఆశుతోష్ శర్మ (31 బంతుల్లో 66 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), విప్రాజ్ నిగమ్ (15 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్లు ఆడి గెలిపించారు. ఈ మ్యాచ్లో ఢిల్లీ గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. మిచెల్ మార్ష్ (36 బంతుల్లో 72; 6 ఫోర్లు, 6 సిక్సర్లు), నికోలస్ పూరన్ (30 బంతుల్లో 75; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్లతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. మార్ష్, పూరన్ మినహా లక్నో ఇన్నింగ్స్లో ఎవరూ రాణించలేదు. వీరిద్దరూ బ్యాటింగ్ చేస్తున్నంత సేపు లక్నో 250 పైచిలుకు పరుగులు సాధిస్తుందని అంతా అనుకున్నారు. అయితే మార్ష్, పూరన్ ఔటయ్యాక ఆ జట్టు మిడిలార్డర్ అనూహ్యంగా కుప్పకూలింది. రిషబ్ పంత్ 6 బంతుల్లో డకౌట్ కాగా.. ఆయుశ్ బదోని 4, శార్దూల్ ఠాకూర్ 0, షాబాజ్ అహ్మద్ 9, బిష్ణోయ్ 0 పరుగులకు ఔటయ్యారు. చివరి ఓవర్లో డేవిడ్ మిల్లర్ (19 బంతుల్లో 27 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) రెండు సిక్సర్లు బాదడంతో లక్నో 200 పరుగుల మార్కును దాటింది. ఢిల్లీ బౌలర్లలో స్టార్క్ 3, కుల్దీప్ 2, విప్రాజ్, ముకేశ్ కుమార్ తలో వికెట్ తీశారు.అనంతరం 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. 65 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి గెలుపుపై ఆశలు వదులుకుంది. ఈ దశలో అశుతోష్ అద్భుతం చేశాడు. ట్రిస్టన్ స్టబ్స్ (22 బంతుల్లో 34; ఫోర్, 3 సిక్సర్లు), విప్రాజ్ నిగమ్ సాయంతో ఢిల్లీకి ఊహించని విజయాన్నందించాడు. చివరి ఓవర్ మూడో బంతికి సిక్సర్ కొట్టి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఢిల్లీ ఇన్నింగ్స్లో డుప్లెసిస్ (29), అక్షర్ పటేల్ (22) రెండంకెల స్కోర్లు చేయగా, మిగతా వారంతా సింగిల్ డిజిట్లకే పరిమితమయ్యారు. లక్నో బౌలరల్లో శార్దూల్ ఠాకూర్, మణిమారన్ సిద్దార్థ్, దిగ్వేశ్ రతీ, రవి బిష్ణోయ్ తలో రెండు వికెట్లు తీశారు.కాగా, ఈ మ్యాచ్లో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ఆ జట్టు ఓటమికి ప్రత్యక్ష కారకుడయ్యాడు. తొలుత బ్యాటింగ్లో 6 బంతులు ఆడి డకౌటైన పంత్.. ఛేదనలో (ఢిల్లీ 9 వికెట్లు కోల్పోయిన దశలో) చివరి ఓవర్ తొలి బంతికి స్టంపింగ్ మిస్ చేసి లక్నో చేతుల్లో నుంచి మ్యాచ్ను వదిలేశాడు. పంత్ ఈ స్టంపింగ్ చేసుంటే లక్నో మ్యాచ్ గెలిచేది.మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ పంత్ ఇలా అన్నాడు. మా టాపార్డర్ బ్యాటర్లు చాలా బాగా ఆడారు. ఈ వికెట్పై ఇది చాలా మంచి స్కోర్. దురదృష్టవశాత్తు మేము ఆ స్కోర్ను కాపాడుకోలేకపోయాము. మేము ప్రారంభంలో వికెట్లు తీసినప్పటికీ.. ఇది బ్యాటింగ్ చేయడానికి మంచి వికెట్ అని తెలుసు. వారు (ఢిల్లీ) రెండు మంచి భాగస్వామ్యాలు (స్టబ్స్తో, విప్రాజ్ నిగమ్తో అశుతోష్) నెలకొల్పారు. విప్రాజ్ నిగమ్ చాలా బాగా ఆడాడు. అతడే మా నుంచి మ్యాచ్ను దూరం చేశాడు.బౌలర్లకు ఈ పిచ్పై తగినంత ఉంది. కానీ మేము కొన్ని బేసిక్స్ మిస్ అయ్యాము. చివర్లో ఒత్తిడికి లోనయ్యాము. ఇది ఇంకా తొలి మ్యాచే. ఓటమిని అధిగమించి ట్రాక్లో పడతాము. ఈ మ్యాచ్ నుండి తీసుకోవలసిన సానుకూల అంశాలు చాలా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ఆటలో అదృష్టం కీలక పాత్ర పోషిస్తుంది. స్టంపింగ్ మిస్పై స్పందిస్తూ.. బంతి మోహిత్ ప్యాడ్లకు తాకకపోయుంటే స్టంపింగ్కు అవకాశం ఉండేది. క్రికెట్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వీటినే పట్టించుకుంటూ పోతే ఆటపై దృష్టి పెట్టలేము. -
విశాఖలో ఐపీఎల్ మ్యాచ్.. అభిమానుల సందడే సందడి (ఫొటోలు)
-
DC vs LSG: విశాఖలో మ్యాచ్.. తుదిజట్లు ఇవే!.. వర్షం ముప్పు?
ఐపీఎల్-2025 (IPL)లో మరో ఆసక్తికర మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)- లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) మధ్య సోమవారం పోటీ జరుగనుంది. విశాఖపట్నంలోని వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం ఇందుకు వేదిక. కాగా ఢిల్లీ క్యాపిటల్స్కు ఇది రెండో హోంగ్రౌండ్ అన్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే.. ఢిల్లీకి గతేడాది సారథ్యం వహించిన టీమిండియా స్టార్ రిషభ్ పంత్.. ఈసారి లక్నో సూపర్ జెయింట్స్కు కెప్టెన్ అయ్యాడు. రూ. 27 కోట్ల భారీ ధరకు లక్నో ఫ్రాంఛైజీ కొనుక్కోగా.. ఈ సీజన్లో తొలి మ్యాచ్లోనే తన పాత జట్టుపై ఈ వికెట్ కీపర్ ప్రతాపం చూపేందుకు సిద్ధమయ్యాడు.పంత్ వర్సెస్ అక్షర్!మరోవైపు.. పంత్ నిష్క్రమణతో ఖాళీ అయిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ పోస్టును టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ భర్తీ చేశాడు. ఈ జట్టులో మరో టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్ కూడా కీలకం కానున్నాడు. అయితే, లక్నోతో మ్యాచ్కు అతడు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాహుల్ భార్య అతియా శెట్టి త్వరలోనే తమ తొలి సంతానానికి జన్మనివ్వనుండటం ఇందుకు కారణంగా తెలుస్తోంది.గాయాల బెడదఇదిలా ఉంటే.. లక్నో జట్టును గాయాల బెడద వేధిస్తోంది. ఆ జట్టు పేసర్ మొహ్సిన్ ఖాన్ సీజన్ మొత్తానికి దూరం కాగా.. అతడి స్థానంలో శార్దూల్ ఠాకూర్ జట్లుఓకి వచ్చాడు. అయితే, కీలక పేసర్లు మయాంక్ యాదవ్, ఆవేశ్ ఖాన్, ఆకాశ్ దీప్ కూడా గాయాల బారిన పడ్డారు. వీరంతా ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు.ఇలా స్టార్ పేసర్లంతా గాయపడటం లక్నో తుదిజట్టు కూర్పుపై కచ్చితంగా ప్రభావం చూపనుంది. మరోవైపు.. ఢిల్లీ రాహుల్ సేవలను కోల్పోయినా జేక్ ఫ్రేజర్-మెగర్క్తో పాటు ఫాఫ్ డుప్లెసిస్ అందుబాటులో ఉండటం.. ఆ జట్టుకు సానుకూలాంశంగా పరిణమించింది. అంతేకాదు ప్రపంచస్థాయి పేసర్ మిచెల్ స్టార్క్ కూడా జట్టుతో ఉండటం ఢిల్లీకి కలిసి రానుంది.లక్నోదే పైచేయిఇక లక్నో మిచెల్ మార్ష్తో అర్షిన్ కులకర్ణిని ఇన్నింగ్స్ ఆరంభించేందుకు పంపే సూచనలు ఉన్నాయి. పంత్ వికెట్ కీపర్గా బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు నాయకుడిగానూ జట్టును ముందుండి నడిపించనుండగా.. నికోలస్ పూరన్ స్పెషలిస్టు బ్యాటర్గా అందుబాటులో ఉన్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా ఆకాశ్ సింగ్ లేదంటే షాబాజ్ అహ్మద్ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. కాగా ఢిల్లీ- లక్నో జట్లు ఇప్పటి వరకు ముఖాముఖి ఐదుసార్లు తలపడగా.. ఢిల్లీ రెండుసార్లు, లక్నో మూడుసార్లు గెలిచాయి.వర్షం ముప్పు?ఇదిలా ఉంటే.. విశాఖపట్నంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములతో ఆకాశం మేఘావృతమైంది. ఇక హైదరాబాద్లో ఇప్పటికే కుండపోత వర్షం కురుస్తుండగా.. విశాఖలోనూ వాన పడితే ఢిల్లీ- లక్నో మ్యాచ్పై ప్రభావం పడనుంది.ఐపీఎల్-2025: ఢిల్లీ వర్సెస్ లక్నో తుదిజట్లు (అంచనా)ఢిల్లీజేక్ ఫ్రేజర్-మెగర్క్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), కరుణ్ నాయర్, అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, ముకేష్ కుమార్, టి.నటరాజన్ఇంపాక్ట్ ప్లేయర్: మోహిత్ శర్మలక్నోఅర్షిణ్ కులకర్ణి, మిచెల్ మార్ష్, రిషభ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), నికోలస్ పూరన్, ఆయుశ్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, రాజ్వర్ధన్ హంగ్రేకర్, రవి బిష్ణోయి, షమార్ జోసెఫ్ఇంపాక్ట్ ప్లేయర్: ఆకాశ్ సింగ్/షాబాజ్ అహ్మద్.చదవండి: కలకాలం గుర్తుండిపోతుంది!.. ఎవరీ విఘ్నేశ్?.. ధోని కూడా ఫిదా!Captains 👍Match-day rivals 🆚Friends through & through 🤝𝗠. 𝗢. 𝗢. 𝗗 Axar & Rishabh as we gear up for tonight's #DCvLSG clash 👌👌#TATAIPL | @DelhiCapitals | @LucknowIPL | @akshar2026 | @RishabhPant17 pic.twitter.com/mI2RI3WHYF— IndianPremierLeague (@IPL) March 24, 2025 -
ఇంతకంటే చెత్త ఫ్రాంఛైజీ మరొకటి ఉండదు: ‘లక్నో’పై నెటిజన్లు ఫైర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఆరంభానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ తీవ్ర స్థాయిలో విమర్శలు మూటగట్టుకుంటోంది. ఇంతకంటే చెత్త ఫ్రాంఛైజీ ఇంకొకటి ఉండదంటూ క్రికెట్ ప్రేమికులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు పెట్టి కొనుకున్నాం కాబట్టి.. ఆటగాళ్ల భావోద్వేగాలతో ఆడుకోవచ్చనే సంస్కృతికి వీడ్కోలు పలకాలని హితవు పలుకుతున్నారు.భారీ ధరకు కొనుగోలుఅసలేం జరిగిందంటే.. ఐపీఎల్ మెగా వేలం-2025లో లక్నో యాజమాన్యం సౌతాఫ్రికా హార్డ్ హిట్టర్ డేవిడ్ మిల్లర్ (David Miller)ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గతేడాది గుజరాత్ టైటాన్స్కు ఆడిన ఈ విధ్వంసకర వీరుడు ఆక్షన్లోకి రాగా.. రూ. 7.5 కోట్లకు లక్నో కొనుగోలు చేసింది.ఇక మార్చి 22న ఐపీఎల్ తాజా ఎడిషన్ ఆరంభం కానుండగా.. మార్చి 24న లక్నో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. విశాఖపట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరుజట్లు విశాఖకు చేరుకున్నాయి. ఇదిలా ఉంటే.. లక్నో ఫ్రాంఛైజీ డేవిడ్ మిల్లర్తో ఓ ఇంటర్వ్యూయర్ జరిపిన సంభాషణకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ఇందులో ఓ వ్యక్తి.. మీ కెరీర్లో బిగ్గర్ హార్ట్బ్రేక్ ఏది? అంటూ మిల్లర్ను ప్రశ్నించాడు. బిగ్గర్ హార్ట్బ్రేక్ ఏది? నవ్వుతూ ప్రశ్నలుఇందులో.. ‘‘గుజరాత్ టైటాన్స్ తరఫున 2023 ఫైనల్లో ఓటమి.. 2014లో పంజాబ్ కింగ్స్ ఫైనల్ ఓటమి.. లేదంటే.. వరల్డ్కప్-2019, 2021లలో సౌతాఫ్రికా గ్రూప్ దశలోనే నిష్క్రమించడం.. లేదా టీ20 వరల్డ్కప్-2024 ఫైనల్లో ఓటమి.. అదీ కాదంటే వన్డే వరల్డ్కప్-2023 సెమీస్లో ఓటమి.. లేదంటే.. చాంపియన్స్ ట్రోఫీ-2025లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి.. వీటిల్లో మీ హృదయాన్ని ముక్కలు చేసిన సంఘటన ఏది?’’ అంటూ బోలెడన్ని ఆప్షన్లు కూడా ఇచ్చాడు.అంతేకాదు.. సదరు వ్యక్తి నవ్వుతూ ఈ ప్రశ్నలు అడగటం గమనార్హం. ఇందుకు మిల్లర్ బాధగా, దిగాలుగా ముఖం పెట్టుకుని సమాధానాలు ఇచ్చాడు. అయితే, ఇంటర్వ్యూయర్ మాత్రం నవ్వుతూనే ఉన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన లక్నో.. ‘ఇకపై మిల్లర్కు ఇలాంటి బాధలు ఉండవు’ అంటూ తాము ఈసారి టైటిల్ గెలవబోతున్నట్లు క్యాప్షన్ ఇచ్చింది.ఇంతకంటే చెత్త ఫ్రాంఛైజీ మరొకటి లేదుమిలియన్కు పైగా వ్యూస్ సాధించిన ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘‘ఇది వినోదం కాదు.. ఓ ఆటగాడిని మానసికంగా వేధించడం లాంటిది. ఓటములను గుర్తుచేస్తూ అతడి మనసును మరింత బాధపెట్టడం సరికాదు. వీడియోలు సృజనాత్మకంగా ఉండాలి గానీ.. ఇలా ఆటగాడి మనసును నొప్పించేలా ఉండకూడదు.డబ్బులు పెట్టి కొన్నారు కాబట్టి ఆటగాళ్లంతా తాము చెప్పినట్లు నడచుకోవాలనే లక్నో యాజమాన్యం అహంభావ వైఖరికి ఇది నిదర్శనం. గత సీజన్లో కేఎల్ రాహుల్ను అవమానించిన తీరును మేము ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం. ఐపీఎల్లో ఇంతకంటే చెత్త ఫ్రాంఛైజీ మరొకటి లేదు’’ అంటూ తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.రాహుల్ పట్ల అదే తీరుకాగా గతేడాది సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమి తర్వాత లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయెంకా.. అప్పటి తమ కెప్టెన్ కేఎల్ రాహుల్పై మైదానంలోనే అరిచేశాడు. అందుకు సంబంధించిన దృశ్యాలు విస్తృతంగా వైరల్ కాగా.. గోయెంకాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.ఇక ఈ పరిణామాల నేపథ్యంలో కేఎల్ రాహుల్ లక్నోను వీడి వేలంలోకి రాగా.. ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. మరోవైపు.. మరో టీమిండియా స్టార్ రిషభ్ పంత్ను రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లకు కొన్న లక్నో.. కెప్టెన్గా అతడికి పగ్గాలు అప్పగించింది. చదవండి: నమ్మశక్యం కాని ఇన్నింగ్స్.. అతడి బ్యాటింగ్ అద్భుతం: కివీస్ కెప్టెన్Manifesting zero heartbreaks for Miller bhai this season 🤞 pic.twitter.com/4zd5FbtblW— Lucknow Super Giants (@LucknowIPL) March 20, 2025 -
IPL 2025: రాహుల్ రానట్టేనా?
విశాఖ స్పోర్ట్స్: ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో తమ తొలి మ్యాచ్ ఆడేందుకు లక్నో సూపర్ జెయింట్స్(ఎల్ఎస్జీ) జట్టు విశాఖపట్నం చేరుకుంది. శుక్రవారం ప్రత్యేక విమానంలో లక్నో నుంచి జట్టు విశాఖకు వచ్చింది. వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఈ నెల 24వ తేదీ రాత్రి 7.30 గంటలకు ఎల్ఎస్జీ, ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కు కెప్టెన్గా వ్యవహరించిన రిషబ్ పంత్ విశాఖ స్టేడియంలో రెండు మ్యాచ్లు ఆడాడు. ఈసారి ఎల్ఎస్జీ జట్టు కు రిషబ్ పంత్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. తమ తొలి మ్యాచ్లో విజయం సాధించాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాక్టీస్ ప్రారంభించగా, ఎల్ఎస్జీ జట్టు శనివారం ప్రాక్టీస్ చేయనుంది. ఎల్ఎస్జీ జట్టుకు మెంటర్గా జహీర్ ఖాన్, హెడ్ కోచ్గా లాంగర్, సహాయ కోచ్లుగా జాంటీ రోడ్స్, ప్రవీణ్ తంబే, లాన్స్ క్లుసెనర్ వంటి వారు ఉన్నారు. జట్టులో వికెట్ కీపర్లుగా ఆర్యన్, నికోలస్ అందుబాటులో ఉన్నారు. ఆల్రౌండర్లుగా మార్క్రమ్, మార్ష్, షాబాజ్ ఉండగా, బ్యాటింగ్లో ఆయుష్, డేవిడ్ మిల్లర్, సమద్ తమ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. బౌలింగ్లో రవి బిష్ణోయ్, ఆవేష్, ఆకాష్తో పాటు ఇంపాక్ట్ ప్లేయర్గా సిద్ధార్థ్ లేదా అర్షిన్ ఆడే అవకాశం ఉంది. అయితే మయాంక్, మోషిన్, ఆవేష్ గాయా ల కారణంగా జట్టుకు అందుబాటులో ఉండటంపై సందేహాలు ఉన్నాయి. ప్రాక్టీస్ సెషన్ తర్వాత బౌలింగ్ విభాగంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇరు జట్లు గ్రూప్–2లో ఉన్నాయి. గత సీజన్లో ఇరు జట్లు కూడా లీగ్ దశలోనే నిష్క్రమించాయి.రాహుల్ రానట్టేనా?కాగా.. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆటగాడు కె.ఎల్.రాహుల్ ఇంకా విశాఖ చేరుకోలేదు. దీంతో ఆయన విశాఖలో జరిగే రెండు మ్యాచ్లకు అందుబాటులో ఉండటం అనుమానమే.! దీంతో ఎల్ఎస్జీతో జరిగే తొలి మ్యాచ్లో ఢిల్లీ తరపున ఫెరీరా వికెట్ కీపర్గా బరిలోకి దిగే అవకాశం ఉంది. గత సీజన్లో రాహుల్ లక్నో జట్టుకు కెప్టెన్గా ఉన్నాడు. -
#IPL2025 : ఐపీఎల్ ట్రోఫీతో కెప్టెన్లు.. (ఫోటోలు)
-
విధ్వంసకర వీరులు.. పంత్కు పగ్గాలు.. లక్నో ఫైనల్ చేరుతుందా?
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో 2022లో అరంగేట్రం చేసింది. వరుసగా రెండు (2022, 2023) సీజన్లలో మూడో స్థానంలో నిలిచి.. ప్లే ఆఫ్స్ చేరింది. అయితే, గతేడాది మాత్రం లక్నోకు ఎదురు దెబ్బతగిలింది. తొలిసారిగా ఐపీఎల్లో లీగ్ దశ నుంచే నిష్క్రమించింది. ఏడు విజయాలు, ఏడు పరాజయాలతో 14 పాయింట్లతో ఏడవ స్థానంతో ముగించింది.ఈ నేపథ్యంలో 2025 సీజన్ కోసం జట్టులో భారీ మార్పులు చేపట్టింది. ఐపీఎల్ మెగా వేలం ఇందుకు అనువుగా ఉపయోగించుకుంది. విశాఖపట్నంలోని డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఏసీఏ-విడిసిఏ క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ మార్చి 24 (గురువారం)న ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగే మ్యాచ్ తో లక్నో సూపర్ జెయింట్స్ తన ఐపీఎల్ టైటిల్ వేట ప్రారంభిస్తుంది.భారీ మార్పులతో కొత్త సీజన్లోకి ప్రారంభంలో నికోలస్ పూరన్ (Nicholas Pooran), రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, ఆయుష్ బదోని, మోసిన్ ఖాన్ వంటి ఆటగాళ్ళని రెటైన్ చేసుకుంది. అయితే అనూహ్యంగా కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul)ను తప్పించాలని నిర్ణయించింది. రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరాడు. వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేసిన భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant)ను రూ. 27 కోట్ల భారీ బిడ్తో కొనుగోలుచేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలో నే అత్యంత ఖరీదైన ఒప్పందంగా రికార్డ్ నెలకొల్పింది.ఇంకా వేలంలో డేవిడ్ మిల్లర్, ఐడెన్ మార్క్రామ్ మరియు మిచెల్ మార్ష్ వంటి విదేశీ ఆటగాళ్ల ను జట్టులో చేర్చుకుంది. వీరు కాక అవేష్ ఖాన్, అబ్దుల్ సమద్, ఆర్యన్ జుయల్, ఆకాష్ దీప్ వంటి వారిని కూడా తీసుకున్నారు. విధ్వంసకర ఆటగాళ్లు.. ఫైనల్ చేరేనా?రిషబ్ పంత్తో పటు విధ్వంసకర ఆటగాళ్లుగా పేరుపొందిన మాథ్యూ బ్రీట్జ్కే, నికోలస్ పూరన్, డేవిడ్ మిల్లర్ వంటి ఆటగాళ్లు ఉన్నందున లక్నో జట్టు బ్యాటింగ్ ఫైర్ పవర్ పూర్తి స్థాయిలో ఉందని చెప్పవచ్చు.ఇంకా ఆల్ రౌండర్లు మిచెల్ మార్ష్, షాబాజ్ అహ్మద్ జట్టు కు సమతుల్యతను తెస్తారు. అవేష్ ఖాన్, మోసిన్ ఖాన్, రవి బిష్ణోయ్ నేతృత్వంలోని బౌలింగ్ యూనిట్ ఏ బ్యాటింగ్ లైనప్నైనా కూల్చివేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ భారీ మార్పులు తర్వాత ఇప్పుడు రిషబ్ పంత్ నాయకత్వంలో ఐపీఎల్ ఫైనల్కి చేరాలని లక్నో ఆశిస్తోంది.గంభీర్ వెళ్లిపోయిన తర్వాతఅలాగే, 2024 సీజన్ ప్రారంభంలో మెంటార్ గౌతమ్ గంభీర్ జట్టును విడిచిపెట్టి కోల్కతాలో చేరాడు. గంభీర్ రెండు సీజన్ లలో లక్నో జట్టుకు మెంటార్ గా పనిచేసాడు. ఇప్పుడు అతడి స్థానంలో దక్షిణాఫ్రికా లెజెండ్ లాన్స్ క్లూసెనర్ను అసిస్టెంట్ కోచ్గా చేర్చుకోవడం ద్వారా కోచింగ్ సిబ్బందిని బలోపేతం చేసింది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ జస్టిన్ లాంగర్ నాయకత్వంలో క్లూసెనర్ నైపుణ్యం ఉండటంతో, లక్నో చివరి అడ్డంకులను అధిగమించి రాబోయే సీజన్లో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.లక్నో సూపర్ జెయింట్స్ జట్టు లో ప్రధాన ఆటగాళ్లురిషబ్ పంత్లక్నో సూపర్ జెయింట్స్ బిడ్డింగ్ పోరులో విజయం సాధించి, రిషబ్ పంత్ను రూ. 27 కోట్లకు దక్కించుకుంది. ఈ చారిత్రాత్మక బిడ్లో గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి, పంత్ను టోర్నమెంట్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిపింది. పంత్ చేరికతో లక్నో వ్యూహం, స్వరూపం పూర్తిగా మారే అవకాశముంది.నికోలస్ పూరన్ఈ వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ తన అసాధారణ ప్రతిభ తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలడు. అందుకే లక్నో ఈ ఆటగాడ్ని వేలానికి ముందే రెటైన్ చేసుకుంది. 76 ఐపీఎల్ మ్యాచ్ లలో పూరన్ 160 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తో 1,769 పరుగులు చేశాడు, తొమ్మిది అర్ధ సెంచరీలు కూడా సాధించాడు. అతని అపార సామర్థ్యం కారణంగా జట్టులో కీలకమైన ఆటగాడనడంలో సందేహం లేదు.డేవిడ్ మిల్లర్మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసే డేవిడ్ మిల్లర్ ఇప్పటికే మ్యాచ్ విన్నర్గా నిరూపించుకున్నాడు. డేవిడ్ మిల్లర్ 130 ఐపీఎల్ మ్యాచ్ లలో 13 అర్ధ సెంచరీలు, ఒక సెంచరీతో దాదాపు 140 స్ట్రైక్ రేట్ తో 2,924 పరుగులు చేశాడు.మయాంక్ యాదవ్మయాంక్ యాదవ్ బౌలింగ్లో లక్నోకి కీలకమైన ఆటగాడిగా ఉండే అవకాశముంది. లక్నో రూ. 11 కోట్లకు మయాంక్ యాదవ్ ను కొనుగోలు చేసింది. వేగం, వైవిధ్యం మయాంక్ సొత్తు. కొత్త బంతితో పాటు డెత్ బౌలింగ్లో కూడా మయాంక్ బాగా రాణించగలనని ఇప్పటికే నిరూపించాడు.ఆయుష్ బదోనిలక్నో జట్టుతో చేరినప్పటి నుంచి ఆయుష్ బదోని తన క్రికెట్ కెరీర్లో భారీ పురోగతి సాధించాడు. 25 ఏళ్ల ఈ స్టైలిష్ బ్యాటర్ 2022 సీజన్లో రెండు మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడటం ద్వారా ఫ్రాంచైజీపై తనదైన ముద్ర వేశాడు. అయితే, టోర్నమెంట్ కొనసాగే కొద్దీ అతని ఫామ్ క్షీణించింది. కొద్దిగా నిలకడ తగ్గినప్పటికీ లక్నో అతన్ని రెటైన్ చేయాలని నిర్ణయించింది.లక్నో సూపర్ జెయింట్స్ జట్టులక్నో సూపర్ జెయింట్స్ జట్టునికోలస్ పూరన్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, మొసిన్ ఖాన్, ఆయుష్ బదోని, రిషబ్ పంత్, డేవిడ్ మిల్లర్, ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, అవేష్ ఖాన్, అబ్దుల్ సమద్, ఆర్యన్ జుయల్, ఆకాష్ దీప్, హిమ్మత్ సింగ్, ఎం. సిద్ధార్థ్, దిగ్వేష్ సింగ్, ప్రిన్స్ యాదవ్, యువరాజ్ చౌదరి, రాజవర్ధన్ హంగర్గేకర్, షెహబాజ్ అహ్మద్, షమార్ జోసెఫ్, అర్షిన్ కులకర్ణి, మాథ్యూ బ్రీట్జ్కే. చదవండి: ముగ్గురు టీమిండియా కెప్టెన్లు.. అది నా అదృష్టం: హార్దిక్ పాండ్యా Never give up the superpower 👊 pic.twitter.com/NtahEerR2x— Lucknow Super Giants (@LucknowIPL) March 19, 2025 -
కెప్టెన్ల మార్పు.. ఎవరి జీతం ఎంత?.. అతి చవగ్గా దొరికిన సారథి అతడే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పద్దెమినిదవ ఎడిషన్ ఆరంభానికి రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్తో శనివారం (మార్చి 22) ఐపీఎల్-2025కి తెరలేవనుంది. ఇక ఈ సీజన్కు ముందు మెగా వేలం జరగడంతో జట్లలో చాలా మార్పులే చోటుచేసుకున్నాయి.చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ తప్ప.. మిగిలిన ఐదు జట్లు తమ కెప్టెన్లను కూడా మార్చేశాయి. లక్నో సూపర్ జెయింట్స్ టీమిండియా స్టార్ రిషభ్ పంత్ (Rishabh Pant) కోసం రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లు ఖర్చు చేసి.. అతడిని తమ సారథిగా నియమించుకుంది.మరోవైపు.. పంజాబ్ కింగ్స్ కూడా ఈసారి కెప్టెన్ కోసం భారీగానే ఖర్చుపెట్టింది. భారత జట్టు మిడిలార్డర్ స్టార్, ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ను రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ఈ ఇద్దరు టీమిండియా స్టార్లు క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్లుగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. మరి మిగిలిన జట్ల కెప్టెన్లు, వారి జీతాలు ఈసారి ఎలా ఉన్నాయో చూద్దామా?కోల్కతా నైట్ రైడర్స్2012, 2014 2024లో చాంపియన్గా నిలిచిన జట్టు. గతేడాది తమకు ట్రోఫీ అందించిన శ్రేయస్ అయ్యర్ను వదులుకున్న కేకేఆర్.. ఈసారి అనూహ్య రీతిలో ఓ వెటరన్ ప్లేయర్ను తమ కెప్టెన్గా నియమించింది.మెగా వేలం-2025లో తొలి రౌండ్లో అమ్ముడుపోకుండా మిగిలి పోయిన అజింక్య రహానేను రూ. 1.5 కోట్లకు కొని.. పగ్గాలు అప్పగించింది. అతడికి డిప్యూటీగా యువ ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్కు బాధ్యతలు ఇచ్చింది. ఐపీఎల్-2025 కెప్టెన్లలో అతి తక్కువ జీతం అందుకున్న కెప్టెన్ రహానేనే కావడం గమనార్హం. అన్నట్లు వెంకటేశ్ అయ్యర్ జీతం రూ.23.75 కోట్లు.సన్రైజర్స్ హైదరాబాద్గతేడాది రన్నరప్గా నిలిచిన సన్రైజర్స్ ఈసారీ తమ కెప్టెన్గా ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్ను కొనసాగించింది. అయితే, గతేడాది అతడికి రూ. 20.50 కోట్ల మేర ముట్టజెప్పిన ఫ్రాంఛైజీ.. ఈసారి రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకోవడం గమనార్హం.రాజస్తాన్ రాయల్స్ఐపీఎల్ తొట్టతొలి విజేతగా చరిత్ర సృష్టించిన రాజస్తాన్ రాయల్స్ గత కొన్నేళ్లుగా టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ సామ్సన్ను తమ కెప్టెన్గా కొనసాగిస్తోంది. ఈసారి కూడా ‘పింక్’ జట్టును సంజూ ముందుండి నడిపించనున్నాడు. ఇందుకోసం రూ. 18 కోట్ల జీతం అందుకుంటున్నాడు.చెన్నై సూపర్ కింగ్స్మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో ఏకంగా ఐదు ట్రోఫీలు గెలిచిన చెన్నై.. గతేడాది నుంచి రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో ఆడుతోంది. ఈసారీ అతడినే కెప్టెన్గా కొనసాగించిన సీఎస్కే.. ఇందుకోసం అతడిని రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకుంది.ఢిల్లీ క్యాపిటల్స్ఈసారి కెప్టెన్ను మార్చిన ఫ్రాంఛైజీల జాబితాలో ఢిల్లీ ఒకటి. గతేడాది రిషభ్ పంత్ కెప్టెన్సీలో ఆడిన ఢిల్లీ.. ఈసారి టీమిండియా వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ నాయకత్వంలో బరిలోకి దిగనుంది. ఇందుకోసం తమ కెప్టెన్కు రూ. 16.50 కోట్ల మేర చెల్లిస్తోంది.గుజరాత్ టైటాన్స్అరంగేట్ర సీజన్లో తమకు టైటిల్ అందించిన హార్దిక్ పాండ్యా జట్టును వీడిన తర్వాత.. అంటే గతేడాది టీమిండియా నయా సూపర్ స్టార్ శుబ్మన్ గిల్కు పగ్గాలు అప్పగించింది. వేలానికి ముందు గిల్ను రూ. 16.5 కోట్లకు రిటైన్ చేసుకున్న గుజరాత్ ఈసారీ అతడినే సారథిగా కొనసాగిస్తోంది.ముంబై ఇండియన్స్ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మను కాదని.. గతేడాది హార్దిక్ పాండ్యాను ఏరికోరి కెప్టెన్ను చేసిన ముంబై ఘోర పరాభవం చవిచూసింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. అయితే, ఈసారీ అతడికి మరో అవకాశం ఇచ్చిన అంబానీల యాజమాన్యంలోని ముంబై... పాండ్యాను రూ. 16.35 కోట్లకు రిటైన్ చేసుకుంది.రాయల్ చాలెంజర్స్ బెంగళూరుఎంత క్రేజ్ ఉన్నా ఒక్క టైటిల్ కూడా గెలవని జట్టుగా పేరొందిన ఆర్సీబీ.. ఈసారి ఊహించని రీతిలో రజత్ పాటిదార్ను సారథిగా నియమించింది. విరాట్ కోహ్లి మరోసారి పగ్గాలు చేపడతాడనే ప్రచారం జరిగగా.. బెంగళూరు ఫ్రాంఛైజీ ప్రకటనతో అది జరగదని తేలింది. అన్నట్లు వేలానికి ముందు రూ. 11 కోట్లకు పాటిదార్ను ఆర్సీబీ రిటైన్ చేసుకుంది. ఐపీఎల్-2025 కెప్టెన్లలో రహానే తర్వాత తక్కువ జీతం ఆర్సీబీ సారథికే!చదవండి: వాళ్లను చూస్తేనే చిరాకు.. బుమ్రా, రబడ మాత్రం వేరు: డేల్ స్టెయిన్ -
‘స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్’: గావస్కర్ ఫైర్.. రిపీట్ చేసిన పంత్!
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ ఐపీఎల్ -2025 (IPL 2025)కి సన్నద్ధమవుతున్నాడు. గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా ఉన్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. ఈసారి లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) సారథిగా బరిలోకి దిగనున్నాడు. ఈ ఉత్తరాఖండ్ ఆటగాడి కోసం లక్నో ఏకంగా రూ. 27 కోట్లు ఖర్చు చేసింది.సమతూకంగాతద్వారా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన క్రికెటర్గా పంత్ నిలిచాడు. ఇక ఈ సీజన్లో తాము రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగబోతున్నామన్న పంత్.. సీనియర్లు, యువ ఆటగాళ్లతో జట్టు సమతూకంగా ఉందని హర్షం వ్యక్తం చేశాడు. నికోలస్ పూరన్, ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు అందుబాటులో ఉండటం తమకు సానుకూలాంశమని పేర్కొన్నాడు. ‘‘జట్టులోని ప్రతి ఒక్కరు తమ నైపుణ్యాలను ప్రదర్శరించే విధంగా.. తమలోని అత్యుత్తమ ప్రదర్శనను వెలికి తీసేలా.. అందుకు తగ్గట్లుగా డ్రెసింగ్ రూమ్ వాతావరణం ఉండేలా మేము చూసుకుంటున్నాం. మా మేనేజ్మెంట్ అన్ని రకాలుగా ఆటగాళ్లకు అండగా ఉంటుంది. అనుభవజ్ఞులైన ఆటగాళ్లు నిక్కీ, మార్క్రమ్, మిల్లర్ ఉండటం మాకు కలిసి వస్తుంది’’ అని పంత్ పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను లక్నో తమ సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది.Oh Captain… My Captain! 💙 pic.twitter.com/Qkite1n4bh— Lucknow Super Giants (@LucknowIPL) March 17, 2025 ఇదిలా ఉంటే.. ఓ బ్రాండ్ షూట్లో భాగంగా రిషభ్ పంత్ వ్యవహరించిన తీరు వైరల్గా మారింది. టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ తనను ఉద్దేశించి విమర్శించిన మాటలను పునరావృతం చేస్తూ పంత్ వ్యాఖ్యానించడంపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ‘‘స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్’’అసలేం జరిగిందంటే.. ఆస్ట్రేలియా గడ్డ మీద రిషభ్ పంత్కు మంచి రికార్డు ఉన్న విషయం తెలిసిందే. అయితే, గతేడాది కంగారూ దేశ పర్యటనలో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో పంత్ తన స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. 'ముఖ్యంగా మెల్బోర్న్ టెస్టులో అతడు అవుటైన తీరు విమర్శలకు దారి తీసింది. ఆసీస్ పేసర్ స్కాట్ బోలాండ్ బౌలింగ్లో పంత్ వికెట్ పారేసుకున్న తీరుపై కామెంటేటర్ గావస్కర్ తీవ్ర స్థాయిలో అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్’’ అంటూ పంత్ తీరును విమర్శించాడు.రీక్రియేట్ చేసిన పంత్ఇప్పుడు అదే మూమెంట్ను పంత్ రీక్రియేట్ చేశాడు. తనదైన శైలిలో.. ‘‘స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్’’ అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. ‘‘ఎన్నోసార్లు నిన్ను సమర్థించి, నీకు మద్దతుగా నిలిచిన గావస్కర్ సార్నే ఇలా ఇమిటేట్ చేసి అవమానిస్తావా?’’ అంటూ కొంత మంది కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. ‘‘ఐకానిక్ మూమెంట్ను పంత్ క్యాష్ చేసుకుంటున్నాడు. ఇందులో గావస్కర్ను అవమానించిట్లు ఏమీ లేదు’’ అని పంత్కు సపోర్టు చేస్తున్నారు.Rishabh Pant recreating the 'Stupid, Stupid, Stupid!' of Sunil Gavaskar. 🤣pic.twitter.com/JhrK34luWh— Mufaddal Vohra (@mufaddal_vohra) March 17, 2025 కాగా గతేడాది ఐపీఎల్లో ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 446 పరుగులు చేశాడు. అయితే, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. జట్టును ఆరో స్థానంలో నిలిపి విమర్శలు మూటగట్టుకున్నాడు. ఇక ఈసారి మార్చి 24న లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్గా.. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్తో పంత్ తన కొత్త ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. చదవండి: అతడిపై నిషేధం.. బీసీసీఐ నిర్ణయం సరైందే: మొయిన్ అలీ -
పాకిస్తాన్ సూపర్ హిట్ పాటను పాడిన పంత్.. షాకైన జహీర్ ఖాన్.. వైరల్ వీడియో
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్-2025 కోసం సన్నాహకాలు మొదలుపెట్టాడు. గత వారమంతా సోదరి వివాహ వేడుకలతో బిజీగా గడిపిన పంత్.. నిన్ననే తన కొత్త ఐపీఎల్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్తో కలిశాడు. పంత్ను ఎల్ఎస్జీ మేనేజ్మెంట్ గతేడాది జరిగిన మెగా వేలంలో రికార్డు ధరకు (రూ. 27 కోట్లు) సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఓ ఆటగాడికి లభించిన అత్యధిక ధర ఇదే. పంత్ను ఎల్ఎస్జీ యాజమాన్యం కెప్టెన్గా కూడా ఎంపిక చేసింది. గత సీజన్ వరకు కెప్టెన్గా ఉండిన కేఎల్ రాహుల్ను లక్నో యాజమాన్యం మెగా వేలానికి ముందు వదిలేసింది. రాహుల్ను వేలంలో ఢిల్లీ కొనుగోలు చేసింది. లక్నో.. ఐపీఎల్ 2025 సీజన్ను మార్చి 24న ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగే మ్యాచ్తో మొదలుపెడుతుంది. ఈ మ్యాచ్ విశాఖలో జరుగనుంది.2022లో గుజరాత్తో పాటు ఐపీఎల్ అరంగేట్రం చేసిన లక్నో మూడు సీజన్లలో ఒక్క టైటిల్ కూడా గెలువలేదు. తొలి రెండు సీజన్లలో మూడో స్థానంలో సరిపెట్టుకున్న లక్నో.. గత సీజన్లో పేలవ ప్రదర్శన చేసి ఏడో స్థానంలో నిలిచింది. కొత్త కెప్టెన్ రిషబ్ పంత్ నాయకత్వంలో ఈ సారైనా టైటిల్ సాధించాలని లక్నో అభిమానులు కోరుకుంటున్నారు. మరి పంత్ లక్నో ఆశలను నిజం చేస్తాడో లేక నీరుగారుస్తాడో వేచి చూడాలి.Part-time wicketkeeper-batter. Full-time karaoke singer 🎤 pic.twitter.com/mFf2BC77e3— Lucknow Super Giants (@LucknowIPL) March 15, 2025ఇదిలా ఉంటే, పంత్కు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతుంది. ఈ వీడియోలో పంత్ పాకిస్తాన్ సూపర్ హిట్ పాట 'అఫ్సానే'ను పాడుతూ కనిపించాడు. పాకిస్తానీ బ్యాండ్ యంగ్ స్టన్నర్స్కు చెందిన ఈ పాటను పంత్ అద్భుతంగా పాడాడు. పంత్లో సింగింగ్ టాలెంట్ చూసి లక్నో మెంటార్ జహీర్ ఖాన్ షాక్కు గురయ్యాడు. పంత్ పాట పాడుతుండగా జహీర్ అతన్ని చూస్తూ ఉండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోను లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం తమ సోషల్మీడియా ఖాతాల్లో షేర్ చేసింది. ఈ వీడియోకు పార్ట్ టైమ్ వికెట్కీపర్ బ్యాటర్.. ఫుల్ టైమ్ కరావోకే సింగర్ అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తుంది. పంత్ సింగింగ్ టాలెంట్కు జనాలు ముగ్దులవుతున్నారు. చిన్న పిల్లాడిలా, ఎప్పుడూ ఏదో ఒక కోతి పని చేస్తూ ఉండే పంత్లో ఇంత టాలెంట్ ఉందా అని ముక్కున వేలేసుకుంటున్నారు.కాగా, 27 ఏళ్ల పంత్ 2022వ సంవత్సరం చివర్లో కారు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలైన విషయం తెలిసిందే. ఈ ఘటనతో పంత్ కెరీర్ ముగుస్తుందని అంతా అనుకున్నారు. అయితే పంత్ మొక్కవోని మనో ధైర్యంతో గాయాలను జయించి పునర్జన్మ సాధించాడు. రీఎంట్రీలో పంత్ గతం కంటే మెరుగ్గా ఆడుతున్నాడు. గతేడాది ఐపీఎల్తో రీఎంట్రీ ఇచ్చిన పంత్.. ఆ సీజన్లో ఢిల్లీ తరఫున లీడింగ్ రన్స్కోరర్గా నిలిచాడు. అనంతరం పంత్ భారత జట్టుకు కూడా ఎంపికై టీ20 వరల్డ్కప్-2025, ఛాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచాడు.2016లో ఐపీఎల్ కెరీర్ ప్రారంభించిన పంత్.. వరుసగా ఎనిమిది సీజన్ల పాటు ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడాడు. పంత్ ఐపీఎల్లో 111 మ్యాచ్లు ఆడి 148.93 స్ట్రయిక్రేట్తో3284 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.2025 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు..రిషబ్ పంత్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, హిమ్మత్ సింగ్, ఎయిడెన్ మార్క్రమ్, ఆయుశ్ బదోని, అబ్దుల్ సమద్, యువరాజ్ చౌదరీ, షాబాజ్ అహ్మద్, మిచెల్ మార్ష్, అర్శిన్ కులకర్ణి, ఆర్ఎస్ హంగార్గేకర్, మాథ్యూ బ్రీట్జ్కీ, నికోలస్ పూరన్, ఆర్యన్ జుయల్, రవి భిష్ణోయ్, మయాంక్ యాదవ్, ఆకాశ్దీప్, మణిమారన్ సిద్దార్థ్, షమార్ జోసఫ్, ఆవేశ్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, మొహిసిన్ ఖాన్, ఆకాశ్ మహారాజ్ సింగ్, దిగ్వేశ్ రతీ -
నిన్న ఆట.. ఇవాళ పాట.. ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ధోని వీడియోలు
టీమిండియా వికెట్కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ సోదరి సాక్షి పంత్ వివాహ వేడుకలు గత రెండు రోజులుగా ముస్సోరిలోని ఐటీసీ హోటల్లో జరుగుతున్నాయి. ఈ వేడుకలకు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సతీసమేతంగా హాజరయ్యాడు. ధోని.. భార్య సాక్షి ధోనితో కలిసి మెహంది, సంగీత్, హల్దీ ఫంక్షన్లలో సందడి చేశాడు. ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్మీడియాలో వైరలవుతున్నాయి. ఇందులోని ఓ వీడియో నిన్న ఇంటర్నెట్ను మొత్తం షేక్ చేసింది. ఇందులో ధోని, పంత్, రైనా కలిసి గ్రూప్గా డ్యాన్స్ చేశారు. ధోనిని చాలాకాలం తర్వాత డ్యాన్స్ చేసిది చూసి అభిమానులు తెగ సంబరపడిపోయారు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఇదే ఫంక్షన్కు సంబంధించిన మరో వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. ఈ వీడియోలో ధోని.. భార్య సాక్షితో కలిసి రణబీర్ కపూర్ 2009 బ్లాక్ బస్టర్ "అజబ్ ప్రేమ్కి గజబ్ కహానీ"లోని "తు జానే నా" అనే పాట పాడుతూ కనిపించాడు. పాట పాడుతున్న సమయంలో మ్యూజిక్కు తగ్గట్టుగా ఆడాడు. ఆ సమయంలో ధోని ముఖం ఆనందంతో వెలిగిపోతూ కనిపించింది. పక్కనే ధోని భార్య సాక్షి కూడా పాటలో లీనమైపోయి కనిపించింది. This was my all time favourite song 😭😭.. I was listening this morning also 😭💛!!Tu Jaane naa 🫶🏻!!pic.twitter.com/Wb3wulVjVL— 𝑻𝑯𝑨𝑳𝑨 (@Vidyadhar_R) March 12, 2025ధోని దంపతులు లైవ్ మ్యూజిక్ ప్లే అవుతుండగా పెద్ద సంఖ్యలో జనసమూహంతో కలిసి ఆడిపాడారు. ఈ వీడియోను లక్షల సంఖ్యలో లైక్లు వస్తున్నాయి. పంత్ సోదరి వివాహ వేడుకల్లో ధోని జంట సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది. ఈ వేడుకలకు సురేశ్ రైనా కూడా కుటుంబంతో కలిసి హాజరయ్యాడు. వీరిద్దరు సతీసమేతంగా ప్రతి ఈవెంట్లో పాల్గొని తెగ హడావుడి చేశారు. ధోని అయితే తమ ఇంట్లో ఫంక్షన్ అన్నట్లు లీనమైపోయి అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. Rishabh Pant, MS Dhoni and Suresh Raina dancing at Rishabh Pant's sister's sangeet ceremony 🕺🏻❤️ pic.twitter.com/pw232528w8— Sandy (@flamboypant) March 11, 2025ఈ వేడుకలకు ధోని, రైనాతో పాటు టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ కూడా హాజరయ్యాడు. 2011 ప్రపంచకప్ ఫైనల్ హీరోలైన ఈ ఇద్దరూ పంత్ మరియు కొత్తగా పెళ్లైన దంపతులతో కలిసి ఫోటోలకు పోజిచ్చారు. ఈ ఫోటోలు కూడా సోషల్మీడియాలో వైరలవుతుంది. ఈ ఫోటోలో ధోని, గంభీర్ నలుపు రంగు టీ షర్ట్లు ధరించి కనిపించారు. ఎప్పడూ రిజర్వగా ఉండే గంభీర్ ఈ వివాహ వేడుకల్లో చాలా ఆనందంగా కనిపించాడు. గంభీర్.. తాజాగా టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. 2013లో ధోని నేతృత్వంలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టు.. 12 ఏళ్ల తర్వాత గంభీర్ ఆథ్వర్యంలో మరోసారి టైటిల్ చేజిక్కించుకుంది. 2011 వన్డే వరల్డ్కప్ ఫైనల్లో టీమిండియా గెలుపులో ధోని, గంభీర్ కీలకపాత్రలు పోషించిన విషయం తెలిసిందే.కాగా, పంత్ సోదరి సాక్షి పంత్ తన చిరకాల ప్రియుడు అంకిత్ చౌదరీని నిన్న (మార్చి 12) ఉదయం మనువాడింది. సాక్షి-అంకిత్ పదేళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. గతేడాది జనవరి 6న వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. సాక్షి ఎంబీఏ పూర్తి చేసి నేషనల్ ఫార్మసీ అసోసియేషన్లో పని చేస్తుంది. ఆమె భర్త అంకిత్ లండన్లో వ్యాపారం చేస్తున్నాడు. సాక్షికి సోదరుడు రిషబ్తో చాలా బాండింగ్ ఉంది. పంత్కు కారు ప్రమాదం జరిగినప్పుడు సాక్షి అన్నీ తానై చూసుకుంది. పంత్ కోలుకుని తిరిగి క్రికెట్ బరిలోకి దిగేందుకు సాక్షి ఎంతో తోడ్పడింది. -
రిషబ్ పంత్ సోదరి వివాహ వేడుక.. డ్యాన్స్లతో పిచ్చెక్కించిన ధోని, రైనా (ఫొటోలు)
-
ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్.. రిషభ్ పంత్ భావోద్వేగం
టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్(Rishabh Pant) ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ అయ్యాడు. లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డు(Laureus World Sports Awards)కు అతడి పేరును పరిశీలిస్తున్నట్లు లారెస్ స్పోర్ట్ వెల్లడించింది. అత్యుత్తమ పునరాగమనం(బెస్ట్ కమ్బ్యాక్ ఆఫ్ ది ఇయర్) విభాగంలో అతడిని నామినేట్ చేసినట్లు తెలిపింది. ఈ అవార్డు కోసం పంత్తో పాటు మరో ఐదుగురు పోటీపడుతున్నారు.పంత్ భావోద్వేగంఇక తన పేరు లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డుకు నామినేట్ అవడం పట్ల రిషభ్ పంత్ హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ఆ దేవుడు మనకు ఇచ్చిన వాటి పట్ల కృతజ్ఞతతో ఉండాలని నేను విశ్వసిస్తాను. కారు ప్రమాదంలో దాదాపు చావు అంచుల దాకా వెళ్లిన నేను ఆ దేవుడి దయ వల్లే బయటపడ్డాను.ఆ తర్వాత నాలో చాలా పరివర్తన వచ్చింది. పిచ్పై తిరిగి పరుగుల వరద పారించాలనే కసి మరింతగా పెరిగింది. అదంత సులువు కాదని తెలుసు. అయినా.. సరే నేను పోరాడాలనే నిర్ణయించుకున్నా. తిరిగి ఫిట్నెస్ సాధించి టీమిండియాకు మళ్లీ ఆడాలనే కలను నెరవేర్చుకున్నాను.అయితే, నా ప్రయాణం నల్లేరు మీద నడకేమీ కాదు. ఎన్నో కఠిన సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. మానసికంగా, శారీరకంగా అలసిపోయాను. నాతో నేను ఓ యుద్ధమే చేశా. అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నా. లారెస్ వరల్డ్ కమ్బ్యాక్ అవార్డుకు నామినేట్ కావడం నాకు దక్కిన గౌరవం.నేను మళ్లీ సాధారణ జీవితం గడపడానికి నా కుటుంబం, బీసీసీఐ, వైద్యులు, నా వైద్య బృందం, మా జట్టు సహాయక సిబ్బంది, ట్రెయినర్లు.. ముఖ్యంగా నా అభిమానులు కారణం. నాకు దక్కిన గొప్ప గౌరవంగా దీనిని భావిస్తున్నా. ఎప్పుడూ ఓటమిని అంగీకరించకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలన్నది నేను నేర్చుకున్న పాఠం. మానసికంగా బలంగా ఉంటే మునుపటి సంతోషాలు అవే వెతుక్కుంటూ వస్తాయి’’ అని రిషభ్ పంత్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు.తీవ్రంగా గాయపడి2022, డిసెంబరు 30న రిషభ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి తన స్వస్థలం రూర్కీకి వెళ్తున్న క్రమంలో పంత్ ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. అయితే, అదృష్టవశాత్తూ అతడు ప్రాణాలతో బయటపడినా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ క్రమంలో డెహ్రాడూన్ ఆస్పత్రిలో ప్రాథమిక చికత్స అనంతరం బీసీసీఐ అతడిని ముంబైకి ఎయిర్లిఫ్ట్ చేసింది. ప్రత్యేక వైద్య బృందంతో చికిత్స అందించింది.ఈ నేపథ్యంలో క్రమక్రమంగా కోలుకున్న 27 ఏళ్ల పంత్.. ఐపీఎల్-2024 ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు. అనంతరం బంగ్లాదేశ్తో టెస్టుల సందర్భంగా టీమిండియా తరఫున పునరాగమనం చేయడంతో పాటు టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన జట్టులోనూ భాగమయ్యాడు. ఇక ఐపీఎల్-2025 మెగా వేలంలో ఏకంగా రూ. 27 కోట్లకు(లక్నో సూపర్ జెయింట్స్) అమ్ముడుపోయి క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడుతున్న భారత జట్టులో పంత్ భాగం. ఇదిలా ఉంటే పంత్తో పాటు బ్రెజిల్ జిమ్నాస్ట్ రెబెక ఆండ్రడే, అమెరికా స్విమ్మర్ సెలెబ్ డ్రెసెల్, స్విట్జర్లాండ్కు చెందిన లారా గట్- బెహ్రామీ, స్పెయిన్మోటార్ సైక్లిస్ట్ మార్క్ మార్కేజ్, ఆస్ట్రేలియా స్విమ్మర్ అరియానే టైట్మస్ కమ్బ్యాక్ అవార్డు పోటీలో నిలిచారు. ఇక భారత్ నుంచి లారెస్ వరల్డ్ స్పోర్ట్ అవార్డుకు నామినేట్ అయిన ప్లేయర్లలో సచిన్ టెండుల్కర్ తర్వాతి స్థానాన్ని పంత్ ఆక్రమించాడు. కాగా ఏప్రిల్ 21న స్పెయిన్లోని మాడ్రిడ్లో ఈ అవార్డు వేడుక జరుగనుంది. చదవండి: BCCI: ‘రోహిత్ లావుగా ఉన్నాడు.. కెప్టెన్గానూ గొప్పోడు కాదు ’.. స్పందించిన బీసీసీఐ -
Ind vs NZ: కివీస్తో మ్యాచ్లో ఓపెనర్గా అతడు.. పంత్కి ఛాన్స్!
న్యూజిలాండ్(India vs New Zealand)తో వన్డే నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు గురించి టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓపెనింగ్ జోడీ మారవచ్చని.. అదే విధంగా.. కొత్తగా ఇద్దరు ఆటగాళ్లకు జట్టులో దక్కవచ్చని అంచనా వేశాడు. అయితే, తాను మాత్రం ఇలాంటి మార్పులు వద్దనే సూచిస్తానని పేర్కొన్నాడు.సెమీస్లో భారత్, కివీస్ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భాగంగా భారత్.. పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్లతో కలిసి గ్రూప్-‘ఎ’లో ఉంది. ఈ క్రమంలో లీగ్ దశలో భాగంగా తొలుత బంగ్లాదేశ్ను ఓడించిన రోహిత్ సేన.. అనంతరం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై కూడా జయభేరి మోగించింది. మరోవైపు.. న్యూజిలాండ్ కూడా ఈ రెండు జట్లపై గెలిచి భారత్తో పాటు సెమీస్ చేరింది.రోహిత్ శర్మ దూరం?ఈ క్రమంలో లీగ్ దశలో చివరగా నామమాత్రపు మ్యాచ్లో భారత్- కివీస్ ఆదివారం తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఇరుజట్లకు సెమీస్కు సన్నాహకంగా మారనుంది. ఇందులో గెలిచి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని భారత్- న్యూజిలాండ్ పట్టుదలగా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. పాక్తో మ్యాచ్ సందర్భంగా పిక్కల్లో నొప్పితో బాధపడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. పూర్తిస్థాయిలో కోలుకోలేదని సమాచారం.అదే విధంగా.. మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ కూడా జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘న్యూజిలాండ్తో మ్యాచ్లో టీమిండియా మార్పులు చేయబోతోందా? రోహిత్ శర్మ ఇందులో ఆడకపోవచ్చు. మహ్మద్ షమీ కూడా విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది.రిషభ్ పంత్, అర్ష్దీప్ సింగ్లకు అవకాశంకేఎల్ రాహుల్ ఓపెనర్గా రాబోతున్నాడు. రిషభ్ పంత్, అర్ష్దీప్ సింగ్లకు ఈసారి తుదిజట్టులో చోటు దక్కుతుందనే వార్తలు వస్తున్నాయి. ఇలా జరగొచ్చు. లేదంటే జరగకపోవచ్చు. కానీ నా అభిప్రాయం ప్రకారం భారత్ గత రెండు మ్యాచ్లలో ఆడిన జట్టుతోనే ముందుకు వెళ్లాలి.గెలుపు మనకు ఓ అలవాటుగా మారినప్పుడు.. అదే జట్టును కొనసాగిస్తే ఇంకా మెరుగైన ఫలితాలు ఉంటాయి. చాంపియన్స్ ట్రోఫీలో జడ్డూ గత మ్యాచ్లలో పెద్దగా వికెట్లు తీయలేదు. అయినా సరే అతడిని కొనసాగించాల్సిందే. జడ్డూను కాదని వరుణ్ చక్రవర్తిని తీసుకువచ్చే ఆలోచన కూడా యాజమాన్యానికి ఉండి ఉండవచ్చు.జడ్డూనే ఆడించాలిలేదా.. కివీస్ జట్టులో ఎడమచేతి వాటం ఆటగాళ్లు ఎక్కువ కాబట్టి వాషింగ్టన్ సుందర్ను ఆడించే యోచనలో ఉండొచ్చు. కానీ జడ్డూనే ఆడించాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే.. అతడు తదుపరి సెమీస్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇలాంటి సమయంలో విశ్రాంతి పేరిట పక్కనపెట్టకూడదు’’ అని అభిప్రాయపడ్డాడు.ఒకవేళ తుదిజట్టులో మార్పు చేయాలని భావిస్తే షమీని తప్పించి అర్ష్దీప్ను ఆడిస్తే ప్రయోజనకరంగానే ఉంటుందని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా బంగ్లాదేశ్తో మ్యాచ్లో తొమ్మిది ఓవర్ల కోటా వేసిన స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 37 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు. ఇక పాకిస్తాన్తో మ్యాచ్లో మాత్రం ఏడు ఓవర్లలోనే 40 రన్స్ ఇచ్చిన జడ్డూ ఒక వికెట్ తీయగలిగాడు. ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో కేఎల్ రాహుల్తో కలిసి వికెట్ కీపర్ కోటాలో అవకాశం దక్కించుకున్న రిషభ్ పంత్కు మాత్రం తుదిజట్టులో ఆడే ఛాన్స్ రావడం లేదు. అయితే, కివీస్తో మ్యాచ్కు రోహిత్ దూరంగా ఉంటే మాత్రం.. రాహుల్ ఓపెనర్గా వస్తే.. పంత్కు చోటు దక్కవచ్చు.బంగ్లాదేశ్, పాకిస్తాన్లతో మ్యాచ్లలో ఆడిన భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.బెంచ్: రిషభ్ పంత్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్.చదవండి: అతడొక అద్భుతం.. క్రెడిట్ తనకే.. బాధగా ఉంది: బట్లర్ -
పాక్తో మ్యాచ్లో అతడిని ఆడించాల్సింది.. కానీ: గావస్కర్
బంగ్లాదేశ్పై గెలుపొంది చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025)ని విజయంతో ఆరంభించింది టీమిండియా. రెండో మ్యాచ్లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలనే పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో రోహిత్ సేన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్(India vs Pakistan)ను ఢీకొట్టింది. దుబాయ్ వేదికగా ఆదివారం నాటి ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ భారత జట్టును తొలుత ఫీల్డింగ్కు ఆహ్వానించింది.ఆ నలుగురు మళ్లీ బెంచ్ మీదేఇక ఈ మ్యాచ్లో టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది. బంగ్లాదేశ్తో ఆడిన తుదిజట్టునే పాక్తో మ్యాచ్లోనూ కొనసాగించింది. స్టార్ ప్లేయర్లు రిషభ్ పంత్, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్కు మరోసారి మొండిచేయి చూపింది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ టాస్ సమయంలో స్పోర్ట్స్ ప్రజెంటర్ మయాంతి లాంగర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ప్లేయింగ్ ఎలెవన్ విషయంలో మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాడు.ఒక్క మార్పు చేసి ఉంటే బాగుండేది..‘‘అయినా.. వాళ్లెందుకు తుదిజట్టులో మార్పులు చేయాలి? ఇది స్లో వికెట్. అంతేగాక ప్రస్తుత ప్లేయింగ్ ఎలెవన్తోనే వారు గత మ్యాచ్ గెలిచారు. అయితే, ఒక్క మార్పు చేసి ఉంటే బాగుండేది. వరుణ్ చక్రవర్తిని పాకిస్తాన్తో మ్యాచ్లో ఆడించి ఉండాల్సింది. కానీ గత మ్యాచ్లో ఐదు వికెట్లు తీసిన మహ్మద్ షమీని ఎలా పక్కనపెట్టగలరు?అంతేగాక.. మరో పేసర్ హర్షిత్ రాణా కూడా గత మ్యాచ్లో ఎలాంటి తప్పిదాలు చేయలేదు. అందుకే టీమిండియాపాక్తో పోరులోనూ అదే జట్టుతో బరిలోకి దిగింది’’ అని సునిల్ గావస్కర్ నిక్కచ్చిగా తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ మాత్రం ఒక మార్పుతో మైదానంలో దిగింది. ఆరంభ మ్యాచ్లో న్యూజిలాండ్తో తలపడిన సమయంలో ఫఖర్ జమాన్ గాయపడగా.. భారత్తో మ్యాచ్లో సౌద్ షకీల్తో అతడి స్థానాన్ని భర్తీ చేసింది.2017లో చివరిసారిగాకాగా చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో భారత్- పాకిస్తాన్ 2017లో చివరిసారిగా తలపడ్డాయి. నాడు లీగ్ దశలో టీమిండియా గెలుపొందగా.. ఫైనల్లో మాత్రం పాకిస్తాన్ భారత జట్టును ఓడించిన టైటిల్ ఎగురేసుకపోయింది. ఈ క్రమంలో దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత మరోసారి చాంపియన్స్ ట్రోఫీ జరుగుతుండగా. ఆతిథ్య జట్టు హోదాలో డిఫెండింగ్ చాంపియన్గా పాక్ బరిలోకి దిగింది.అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా మాత్రం తమ మ్యాచ్లన్నీ దుబాయ్లో ఆడుతోంది. ఇక ఈ మెగా టోర్నీలో గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ ట్రోఫీ కోసం తలపడుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లలో పాకిస్తాన్పై న్యూజిలాండ్, బంగ్లాదేశ్పై భారత్, అఫ్గనిస్తాన్పై సౌతాఫ్రికా, ఇంగ్లండ్పై ఆస్ట్రేలియా గెలుపొందాయి. పాయింట్ల పట్టికలో గ్రూప్-ఎ నుంచి న్యూజిలాండ్.. గ్రూప్-బి నుంచి సౌతాఫ్రికా టాప్లో ఉన్నాయి.పాకిస్తాన్తో మ్యాచ్లో భారత తుదిజట్టురోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.పాకిస్తాన్ ప్లేయింగ్ ఎలెవన్సౌద్ షకీల్, బాబర్ ఆజం, ఇమామ్ ఉల్ హక్, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్/వికెట్ కీపర్), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహిన్ అఫ్రిది, నసీం షా, హరీస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్.చదవండి: షమీ చెత్త రికార్డు.. చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే.. -
చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా స్టార్ దూరం!?
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్(Rishabh Pant) గాయపడ్డాడు. ప్రాక్టీస్ సెషన్లో భాగంగా హార్దిక్ పాండ్యా(Hardik Pandya) షాట్ కారణంగా అతడి మెకాలి(Knee Injury)కి గాయమైంది. దీంతో పంత్ నొప్పితో విలవిల్లాడగా ఫిజియో వచ్చి అతడిని పరీక్షించాడు. ఈ నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్కు ఈ వికెట్ కీపర్ బ్యాటర్ దూరం కానున్నాడనే వార్తలు ఊపందుకున్నాయి.అయితే, పంత్ పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉన్నట్లు సమాచారం. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన భారత జట్టులో పంత్కు చోటు దక్కిన విషయం తెలిసిందే. వికెట్ కీపర్ల కోటాలో కేఎల్ రాహుల్తో పాటు ఈ లెఫ్టాండర్ బ్యాటర్ కూడా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. ఈ మెగా టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుండగా.. టీమిండియా మాత్రం తటస్థ వేదికైన దుబాయ్లో తమ మ్యాచ్లు ఆడనుంది.ఎడమ మోకాలికి బలంగా తాకిన బంతిఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడికి చేరుకున్న రోహిత్ సేన ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా.. ఆదివారం తొలి సెషన్ జరుగగా.. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఈ క్రమంలో అతడు బలంగా బాదిన బంతి పంత్ ఎడమ మోకాలికి తగిలింది. దీంతో ఒక్కసారిగా కిందపడిపోయిన ఈ యువ ఆటగాడు నొప్పితో విలవిల్లాడాడు.ఇంతలో అక్కడికి చేరుకున్న ఫిజియో కమలేశ్ జైన్ పంత్ను పరీక్షించాడు. హార్దిక్ పాండ్యా సైతం పంత్ దగ్గరకు వచ్చి అతడి పరిస్థితి ఎలా ఉందో అడిగితెలుసుకున్నాడు. అయితే, కాసేపటి తర్వాత ఈ వికెట్ కీపర్ సాధారణ స్థితికి చేరుకున్నాడు. తొలి దఫాలో బ్యాటింగ్ చేసిన ఆటగాళ్లు నిష్క్రమించిన తర్వాత తాను కూడా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. దీనిని బట్టి పంత్ గాయం అంత తీవ్రమైనదని కాదని తేలిపోయింది.కాగా 27 ఏళ్ల రిషభ్ పంత్ తొలిసారిగా చాంపియన్స్ ట్రోఫీ జట్టుకు ఎంపికయ్యాడు. అంతకంటే ముందు ఇంగ్లండ్తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్ జట్టులోనూ అతడికి స్థానం ఉన్నా.. ప్లేయింగ్ ఎలెవన్లో మాత్రం చోటు దక్కలేదు. సీనియర్ కేఎల్ రాహుల్కు ప్రాధాన్యం ఇచ్చిన నాయకత్వ బృందం.. మూడు వన్డేల్లోనూ అతడినే ఆడించింది.పంత్ బెంచ్కే పరిమితం!ఫలితంగా చాంపియన్స్ ట్రోఫీ-2025 తుదిజట్టులోనూ పంత్కు అవకాశం రాదనే సంకేతాలు ఇచ్చినట్లయింది. అంతేకాదు.. కేఎల్ రాహుల్కు వన్డేల్లో ఉన్న రికార్డు దృష్ట్యా అతడినే ఈ ఐసీసీ టోర్నీ ఆసాంతం ఆడించే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో పంత్ బెంచ్కే పరిమితం కావాల్సిన పరిస్థితి. కాగా కేఎల్ రాహుల్ చివరగా ఐసీసీస వన్డే వరల్డ్కప్-2023లో 500 పరుగులు సాధించాడు. అందుకే ఈ మెగా టోర్నీలోనూ అతడికే వికెట్ కీపర్గా మొదటి ప్రాధాన్యం దక్కనుంది.ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ పోటీ పడనున్నాయి. కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ఈ ఐసీసీ ఈవెంట్ ఆరంభం కానుంది. ఇక టీమిండియా ఫిబ్రవరి 20న దుబాయ్లో తమ తొలిమ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడనుంది.చదవండి: CT 2025: కోహ్లి, హెడ్ కాదు!.. టాప్ రన్ స్కోరర్గా అతడే.. వికెట్ల వీరుడిగా ఆర్చర్! -
CT 2025: రైనా ఎంచుకున్న భారత తుదిజట్టు... వరల్డ్కప్ వీరులకు నో ఛాన్స్!
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) ఆరంభానికి సమయం ఆసన్నమైంది. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న ఈ వన్డే మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఇందులో పాల్గొనే ఎనిమిది జట్ల వివరాలు వెల్లడయ్యాయి. ఇక భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సైతం ఈ ఐసీసీ టోర్నీకి తొలుత ప్రకటించిన జట్టులో రెండు మార్పులతో టీమ్ను ఖరారు చేసింది.యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ను ఈ జట్టు నుంచి తప్పించిన బీసీసీఐ(BCCI).. అతడి స్థానంలో ఐదో స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy)ని జట్టులో చేర్చింది. అదే విధంగా.. స్టార్ బౌలర్, పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా ఇంకా వెన్నునొప్పి నుంచి కోలుకోకపోవడంతో అతడి స్థానంలో యువ పేసర్ హర్షిత్ రాణాను ఎంపిక చేసింది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత తుదిజట్టుపై తన అభిప్రాయాలు పంచుకున్నాడు. తన ప్లేయింగ్ ఎలెవన్ ఇదేనని ప్రకటించిన ఈ మాజీ బ్యాటర్.. అనూహ్యంగా వన్డే వరల్డ్కప్-2023 హీరోలను మాత్రం పక్కనపెట్టాడు.అద్బుత ప్రదర్శనస్వదేశంలో 2023లో జరిగిన వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్లో ఆలస్యంగా అడుగుపెట్టినా అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు మహ్మద్ షమీ. మెగా ఈవెంట్లో ఏకంగా 24 వికెట్లు తీసి.. అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. అనంతరం చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న షమీ.. దాదాపు పద్నాలుగు నెలల తర్వాత పునరాగమనం చేశాడు.సొంతగడ్డపై ఇంగ్లండ్తో ఇటీవల ముగిసిన టీ20, వన్డే సిరీస్లలో షమీ ఆడాడు. అయితే, ఇంగ్లండ్తో మ్యాచ్లలో ఈ బెంగాల్ పేసర్ స్థాయికి తగ్గట్లు రాణించలేదు. మూడు వన్డేల సిరీస్లో భాగంగా రెండు మ్యాచ్లు ఆడి కేవలం రెండే వికెట్లు తీశాడు.మరోవైపు.. వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా ఇంగ్లండ్తో వన్డేల్లో ఆకట్టుకోలేకపోయాడు. అయితే, అతడిని బ్యాటింగ్ ఆర్డర్లో డిమోట్ చేయడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. సాధారణంగా ఐదో స్థానంలో వచ్చే ఈ కర్ణాటక బ్యాటర్ను మేనేజ్మెంట్ ఆరో స్థానంలో పంపింది. ఈ క్రమంలో ఇంగ్లండ్తో తొలి రెండు వన్డేల్లో రాహుల్(2, 10) విఫలమయ్యాడు.రాహుల్ ధనాధన్ ఇన్నింగ్స్అయితే, మూడో వన్డే సందర్భంగా తన రెగ్యులర్ ప్లేస్లో బ్యాటింగ్ చేసిన కేఎల్ రాహుల్ ధనాధన్ ఇన్నింగ్స్(29 బంతుల్లో 40) ఆడాడు. ఇక అంతకుముందు వన్డే వరల్డ్కప్లోనూ రాహుల్ రాణించాడు. అయినప్పటికీ షమీతో పాటు కేఎల్ రాహుల్కు కూడా సురేశ్ రైనా తన చాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటివ్వకపోవడం గమనార్హం.ఇక షమీని కాదని యువ పేసర్ హర్షిత్ రాణా వైపు మొగ్గు చూపిన సురేశ్ రైనా.. వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ స్థానంలో రిషభ్ పంత్ను ఎంచుకున్నాడు. కాగా ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో యాజమాన్యం రిషభ్ పంత్ను పూర్తిగా పక్కనపెట్టడం గమనార్హం.చాంపియన్స్ ట్రోఫీ-2025కి బీసీసీఐ ఎంపిక చేసిన జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చాంపియన్స్ ట్రోఫీ-2025కి సురేశ్ రైనా ఎంచుకున్న తుదిజట్టురోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్.చదవండి: ఆఖరికి అతడికి జట్టులో స్థానమే లేకుండా చేశారు: భారత మాజీ క్రికెటర్ ఫైర్ -
ప్రాణాపాయస్థితిలో రిషబ్ పంత్ను కాపాడిన వ్యక్తి
టీమిండియా స్టార్ వికెట్కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ (Rishabh Pant) 2022, డిసెంబర్ 30న కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. పంత్.. రూర్కీలోని తన సొంతింటికి వెళ్తుండగా ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయస్థితిలో కొట్టిమిట్టాడుతున్న పంత్ను హైవేపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు కాపాడారు. వీరిలో ఓ వ్యక్తి రజత్ (25) ప్రస్తుతం చావు బతుకులతో పోరాడుతున్నాడు. రజత్.. తన ప్రియురాలు మనూ కశ్యప్తో (21) కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీరిద్దరి ప్రేమను మనూ తరపు వారు అంగీకరించకపోవడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. కొద్ది రోజుల కిందట ఈ జంట ఎవరూ లేని నిర్మానుష ప్రాంతంలో పురుగుల మందు తాగింది. కొన ఊపిరితో కొట్టిమిట్టాడుతున్న వీరిని అటుగా వెళ్తున్న వారు సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ మనూ తుదిశ్వాస విడిచింది. రజత్ పరిస్థితి విషమంగా ఉంది. మనూ మరణాన్ని జీర్ణించుకోలేని ఆమె తల్లి రజతే తన కూతురికి విషమిచ్చి చంపాడని ముజఫర్నగర్ పోలీసులకు (ఉత్తర్ప్రదేశ్) ఫిర్యాదు చేసింది. అయితే ప్రేమ వైఫల్యం కారణంగా ఇద్దరూ ఇష్ఠపూర్వకంగానే ఆత్మహత్యకు పాల్పిడినట్లు పోలీసులు చెప్పారు.మనూ, రజత్ గత ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరివి వేర్వేరు కులాలు కావడంతో పెద్దలు వీరి ప్రేమను అంగీకరించలేదు. మనూ పెద్దలు వేరే వ్యక్తితో ఆమె వివాహానికి ప్లాన్ చేశారు. ఇది తెలిసి మనూ, రజత్ ఆత్యహత్యకు పాల్పడ్డారు.కాగా, రజత్ అతని స్నేహితుడు నిషు.. రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైనప్పుడు అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు. తనను కాపాడినందుకు పంత్.. రజత్, నిషులకు స్కూటర్ గిఫ్ట్గా ఇచ్చాడు. కారు ప్రమాదం నుంచి కోలుకున్న పిమ్మట పంత్ మళ్లీ టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. పునరాగమనంలో పంత్ మునుపటి తరహాలోనే అదరగొడుతున్నాడు. ఐపీఎల్ 2024లో సత్తా చాటిన పంత్.. గతేడాది టీమిండియా టీ20 వరల్డ్కప్ సాధించడంలో కీలకంగా వ్యవహరించాడు. -
భారత అత్యుత్తమ తుదిజట్టుకు ఆఖరి కసరత్తు.. వారిద్దరికి ఛాన్స్!
ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)కి భారత్ తన తుది జట్టును ప్రకటించడానికి సమయం దగ్గర పడుతోంది. జట్టులోని ఆటగాళ్ల ఫామ్ గురించి అంచనా వేయడానికి అహ్మదాబాద్లో ఇంగ్లండ్(India vs England)తో బుధవారం జరిగే మూడో వన్డే మ్యాచ్ టీమిండియాకు చివరి అవకాశం. భారత్ జట్టు ఇప్పటికే వన్డే సిరీస్ను కైవసం చేసుకున్నందున.. ఈ మూడో వన్డేలో కొంతమంది ఇతర ఆటగాళ్లకు అవకాశం ఇచ్చి ప్రయత్నించేందుకు వెసులుబాటు దొరుకుతుంది. ఫిబ్రవరి 19న పాకిస్తాన్(Pakistan)- దుబాయ్ వేదికగా ప్రారంభమయ్యే -2025 ఛాంపియన్స్ ట్రోఫీకి అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్ను నిర్ణయించడానికి భారత్ కి ఇదే చివరి అవకాశం.పంత్కు అవకాశంకర్ణాటక వికెట్ కీపర్-బ్యాటర్ కెఎల్ రాహుల్ ఇంగ్లండ్తో జరిగిన రెండు వన్డేల్లోనూ వికెట్ కీపర్గా రాణించాడు. కానీ ఈ మూడో వన్డే లో రాహుల్ స్థానంలో రిషబ్ పంత్ కు అవకాశం కల్పించడం తప్పనిసరి గా కనిపిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో రాహుల్ భారత జట్టులో ప్రధాన వికెట్ కీపర్ అని కెప్టెన్ రోహిత్ శర్మ ఇంతకూ ముందే ప్రకటించినప్పటికీ పంత్ దూకుడుగా ఆడే స్వభావం వల్ల మిడిల్ ఆర్డర్లో అతనికి అవకాశం కల్పించే అవకాశం లేకపోలేదు.పైగా జట్టులో రెండో వికెట్ కీపర్ గా అతని ఎంపిక తప్పనిసరిగా కనిపిస్తోంది. పంత్కి వన్డేల్లో మెరుగైన రికార్డు (27 ఇన్నింగ్స్లలో 871 పరుగులు) ఉంది. అంతేగాక తన అసాధారణ షాట్లతో మ్యాచ్ స్వరూపాన్ని క్షణాల్లో మార్చగల సత్తా పంత్కు ఉంది. మరోవైపు, ఇంగ్లండ్తో జరిగిన రెండు వన్డేల్లో రాహుల్ వికెట్ కీపర్ గా రాణించినా తన బ్యాటింగ్తో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. నాగ్పూర్ లో కేవలం రెండు పరుగులు చేయగా కటక్ లో పది పరుగులు చేశాడు. అయితే, ఎడమ చేతి వాటం ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఇప్పటికే జట్టులో ఉండటంతో పంత్కి అది ప్రతికూలంగా మారవచ్చు.రాణా స్థానంలో అర్ష్దీప్ సింగ్భారత్ ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ గురించి ఇంకా స్పష్టత లేక పోవడంతో.. అర్ష్దీప్ సింగ్ కి అవకాశం కల్పించే అవకాశం ఉంది. గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీ ఇంకా తన పూర్తి స్థాయి ఫామ్ కనిపించలేకపోయాడు. ఇంగ్లండ్తో జరిగిన రెండు వందేళ్లలో షమీ ప్రదర్శన అతని స్థాయికి తగ్గట్టుగా లేదు.ఫలితంగా తన పూర్తి ఓవర్ల కోటా బౌలింగ్ చేయలేక పోయాడు. ఈ కారణంగా ఇంగ్లండ్తో జరిగే మూడో వన్డేకు పేస్ బౌలర్ హర్షిత్ రాణా స్థానంలో అర్ష్దీప్ సింగ్ను తీసుకోవడం ఖాయం గా కనిపిస్తోంది. హర్షిత్ ఇంగ్లాండ్తో జరిగిన రెండు వన్డేల నాలుగు వికెట్లు పడగొట్టాడు. బుధవారం ఇంగ్లండ్తో జరిగే మూడో వన్డేలో కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ ఇద్దరు ఆడే అవకాశం ఉంది.రేసులో వరుణ్ చక్రవర్తి ఇక కుల్దీప్ అవకాశం కల్పించిన ప్రతీ సారి తన వైవిధ్యమైన బౌలింగ్ తో రాణిస్తున్నాడు. ఈ కారణంగా అతనికి ఛాంపియన్స్ ట్రోఫీలో అవకాశం తప్పనిసరిగా కనిపిస్తోంది. అయితే కుల్దీప్నకు వరుణ్ చక్రవర్తి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ క్రికెట్లో వరుణ్ చక్రవర్తి తన అద్భుతమైన ప్రదర్శనతో నిలకడగా రాణిస్తూ భారత్ విజయానికి బాటలు వేస్తున్నాడు. ఈ కారణంగా భారత్ కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలతో పాటు ఆల్ రౌండర్లయిన అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ లను కూడా జట్టులో తీసుకోనే అవకాశం ఉంది. చదవండి: తప్పు చేస్తున్నావ్ గంభీర్.. అతడిని బలి చేయడం అన్యాయం: మాజీ క్రికెటర్ ఫైర్ -
తప్పు చేస్తున్నావ్ గంభీర్.. అతడిని బలి చేయడం అన్యాయం!
టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) తీరుపై భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మిడిలార్డర్ విషయంలో గౌతీ అనుసరిస్తున్న వ్యూహాలు సరికావని విమర్శించాడు. ఆల్రౌండర్ అక్షర్ పటేల్(Axar Patel)ను ప్రమోట్ చేయడం బాగానే ఉన్నా.. అందుకోసం కేఎల్ రాహుల్(KL Rahul)ను బలి చేయడం సరికాదని హితవు పలికాడు.వరుసగా రెండింట గెలిచి.. సిరీస్ సొంతంకాగా టీమిండియా ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్తో వన్డేలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మూడు మ్యాచ్లలో ఇప్పటికే రెండు గెలిచి సిరీస్ సొంతం చేసుకుంది రోహిత్ సేన. అయితే, ఈ సిరీస్లో వికెట్ కీపర్గా రిషభ్ పంత్ను కాదని సీనియర్ కేఎల్ రాహుల్కు పెద్దపీట వేసిన యాజమాన్యం.. బ్యాటింగ్ ఆర్డర్లో మాత్రం అతడిని డిమోట్ చేసింది.అతడికి ప్రమోషన్.. రాహుల్కు అన్యాయం?స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను ఐదో స్థానంలో ఆడిస్తూ.. కేఎల్ రాహుల్ను ఆరో నంబర్ బ్యాటర్గా పంపింది. ఈ క్రమంలో నాగ్పూర్, కటక్ వన్డేల్లో అక్షర్ వరుసగా 52, 41 నాటౌట్ పరుగులు చేయగా... రాహుల్ మాత్రం విఫలమయ్యాడు. తొలి వన్డేలో రెండు, రెండో వన్డేలో పది పరుగులకే పరిమితమయ్యాడు.ఇది చాలా దురదృష్టకరంఈ పరిణామాలపై టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ స్పందించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘నాలుగో నంబర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఫామ్లో ఉండటం టీమిండియాకు సానుకూలాంశం. అయితే, కేఎల్ రాహుల్ పరిస్థితి చూసి నాకు బాధ కలుగుతోంది.ఇది చాలా దురదృష్టకరం. అక్షర్ పటేల్ 30, 40 పరుగులు చేస్తున్నాడు. మంచిదే.. కానీ కేఎల్ రాహుల్ పట్ల మేనేజ్మెంట్ వ్యవహరిస్తున్న తీరు అన్యాయం. ఐదో స్థానంలో అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడు. అందుకు అతడి గణాంకాలే నిదర్శనం.ఎల్లప్పుడూ ఇదే వ్యూహం పనికిరాదుకాబట్టి.. హేయ్.. గంభీర్ నువ్వు చేస్తున్నది తప్పు. పరిస్థితులకు అనుగుణంగా అక్షర్ను ఐదో స్థానంలో బ్యాటింగ్కు పంపవచ్చు. కానీ ఎల్లప్పుడూ ఇదే వ్యూహం పనికిరాదు. ఇలాంటి వాటి వల్ల దీర్ఘకాలం ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో నీకూ తెలుసు. కీలకమైన మ్యాచ్లో ఇలాంటి వ్యూహాలు బెడిసికొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి.రిషభ్ పంత్ విషయంలోనూ ఇలాగే చేస్తారా?అక్షర్ పటేల్తో నాకు ఎలాంటి సమస్యా లేదు. అతడికి ఇబ్బడిముబ్బడిగా అవకాశాలు ఇస్తున్నారు. కానీ అందుకోసం రాహుల్ను ఆరో నంబర్లో ఆడిస్తారా? అలాగే చేయాలని అనుకుంటే రిషభ్ పంత్ను కూడా ఆరోస్థానంలోనే పంపండి. రాహుల్ ఆత్మవిశ్వాసాన్ని ఎందుకు దెబ్బతీస్తున్నారు? వరల్డ్క్లాస్ ప్లేయర్గా పేరొందిన అద్భుతమైన ఆటగాడి పట్ల ఇలా వ్యవహరించడం సరికాదు’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ గంభీర్ విధానాన్ని ఎండగట్టాడు. చదవండి: క్రికెట్ చరిత్రలో అరుదైన ఘటన -
BCCI: రోహిత్ సేనకు ప్రత్యేకమైన వజ్రపు ఉంగరాలు.. వీడియో చూశారా?
టీమిండియా ఆటగాళ్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) అరుదైన కానుకలు అందించింది. టీ20 ప్రపంచకప్-2024(T20 World Cup 2024)లో విజేతగా నిలిచిన భారత జట్టులోని సభ్యులకు వజ్రపుటుంగరాలు ప్రదానం చేసింది. ఉంగరాల పైభాగంలో అశోక్ చక్ర గుర్తుతో పాటు.. సైడ్లో ఆటగాళ్ల జెర్సీ నంబర్ వచ్చేలా ప్రత్యేకంగా వీటిని తీర్చిదిద్దారు.ఈసారి ప్రత్యేకమైన కానుకలుఅంతేకాదు.. ఈ మెగా టోర్నీలో ఆఖరి వరకు అజేయంగా నిలిచిన జట్టు జైత్రయాత్రకు గుర్తుగా విజయాల సంఖ్యను కూడా ఈ డిజైన్లో చేర్చారు. ఇటీవల నమన్ అవార్డుల వేడుక సందర్భంగా రోహిత్ సేన(Rohit Sharma&Co)కు ఈ వజ్రపు ఉంగరాలను బోర్డు ఆటగాళ్లకు అందజేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్గా మారింది.‘‘టీ20 ప్రపంచకప్లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమిండియా ఆటగాళ్లను చాంపియన్స్ రింగ్తో సత్కరిస్తున్నాం. వజ్రాలు శాశ్వతమే కావచ్చు. అయితే, కోట్లాది మంది హృదయాల్లో వీరు సంపాదించిన స్థానం మాత్రం ఎన్నటికీ చెక్కుచెదరదు. అలాగే ఈ ఉంగరం కూడా అందమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది’’ అని బీసీసీఐ పేర్కొంది.కాగా అమెరికా- వెస్టిండీస్ వేదికలుగా గతేడాది పొట్టి ప్రపంచకప్ టోర్నీ జరిగిన విషయం తెలిసిందే. లీగ్ దశలో ప్రతి మ్యాచ్ గెలిచిన రోహిత్ సేన.. సౌతాఫ్రికాతో ఫైనల్లోనూ జయభేరి మోగించింది. ఆఖరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో ఏడు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి.. ట్రోఫీని దక్కించుకుంది.ఓవరాల్గా ఐదోసారితద్వారా దాదాపు పదకొండేళ్ల విరామం తర్వాత మరోసారి టీమిండియా ఖాతాలో ఐసీసీ టైటిల్ చేరింది. అదే విధంగా.. ఓవరాల్గా ఐదో ట్రోఫీ భారత్ కైవసమైంది. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో తొట్టతొలి ప్రపంచకప్(వన్డే) గెలిచిన టీమిండియా.. 2007లో మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో టీ20 ప్రపంచకప్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత మళ్లీ ధోని నాయకత్వంలోనే 2011 వన్డే వరల్డ్కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీని భారత్ దక్కించుకుంది. ఇక గతేడాది రోహిత్ శర్మ కూడా ఈ ఐసీసీ విన్నింగ్ కెప్టెన్ల జాబితాలో చేరిపోయాడు.ఇక టీ20 ప్రపంచకప్-2024లో గెలిచిన అనంతరం బీసీసీఐ రోహిత్ సేనకు అత్యంత భారీ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. కళ్లు చెదిరే రీతిలో ఏకంగా రూ. 125 కోట్ల క్యాష్ ప్రైజ్ను కానుకగా ఇచ్చింది. నాడు ఇలా ఆటగాళ్లపై కనకవర్షం కురిపించిన బోర్డు.. తాజాగా వజ్రపు ఉంగరాలతో మరోసారి ఘనంగా సత్కరించింది.టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన భారత జట్టులోని సభ్యులురోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, యజువేంద్ర చహల్, సంజు శాంసన్, మహ్మద్ సిరాజ్, యశస్వి జైస్వాల్.చదవండి: సెంచరీకి చేరువలో ఉన్నాడని.. ఇలా చేస్తావా?: మండిపడ్డ గావస్కర్Presenting #TeamIndia with their CHAMPIONS RING to honour their flawless campaign in the #T20WorldCup 🏆Diamonds may be forever, but this win certainly is immortalised in a billion hearts. These memories will 'Ring' loud and live with us forever ✨#NamanAwards pic.twitter.com/SKK9gkq4JR— BCCI (@BCCI) February 7, 2025 -
ఢిల్లీ జట్టు ప్రకటన.. విరాట్ కోహ్లికి చోటు! పంత్ దూరం
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి 12 ఏళ్ల తర్వాత రంజీల్లో ఆడేందుకు సిద్దమయ్యాడు. రంజీ ట్రోఫీ 2024-25లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జనవరి 30 ప్రారంభం కానున్న మ్యాచ్లో రైల్వేస్తో ఢిల్లీ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) తమ జట్టును ప్రకటించింది.ఈ జట్టులో విరాట్ కోహ్లి డీడీసీఎ సెలక్టర్లు చోటిచ్చారు. జనవరి 28న కోహ్లి జట్టుతో చేరుతాడని ఢిల్లీ హెడ్కోచ్ శరణ్దీప్ సింగ్ ఇప్పటికే ధ్రువీకరించారు. ఇప్పుడు ఢిల్లీ తమ జట్టును ప్రకటించడంతో కోహ్లి రీఎంట్రీ ఖాయమైంది. యువ ఆటగాడు అయూష్ బడోని సారథ్యంలో కింగ్ కోహ్లి ఆడనున్నాడు. కోహ్లి చివరగా రంజీల్లో 2012-13 సీజన్లో ఢిల్లీ తరపున ఆడాడు.ఆ సీజన్లో కోహ్లి కేవల ఒకే ఒక మ్యాచ్ ఆడి 57 పరుగులు చేశాడు. అయితే అంతకుముందు సీజన్లలో మాత్రం విరాట్ అద్బుతంగా రాణించాడు. ఇప్పటివరకు 23 రంజీ మ్యాచ్లు ఆడిన కోహ్లి.. 50.77 సగటుతో 1574 పరుగులు చేశాడు. అతడి ఫస్ట్క్లాస్ కెరీర్లో ఇప్పటివరకు 5 సెంచరీలు ఉన్నాయి.అయితే కోహ్లి కేవలం 19 ఏళ్ల వయస్సులోనే జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇవ్వడంతో ఎక్కువగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్లు ఆడే అవకాశం లభిచించలేదు. ఇక 12 ఏళ్ల తర్వాత కోహ్లి రంజీల్లో ఆడుతుండడంతో మ్యాచ్ను వీక్షించేందుకు ప్రేక్షకులను ఢిల్లీ క్రికెట్ అసోషియేషన్ ఉచితంగా అనుమతించనుంది.రిషబ్ పంత్ దూరం..ఇక రైల్వేస్తో మ్యాచ్కు ఢిల్లీ స్టార్, భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. సౌరాష్ట్రపై ఆడిన పంత్ ఈ మ్యాచ్కు మాత్రం దూరంగా ఉన్నాడు. ఇంగ్లండ్తో వన్డేల,ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికైన పంత్.. వైట్ బాల్ క్రికెట్పై దృష్టిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. అతడు వైట్బాల్తో ప్రాక్టీస్ చేయనున్నట్లు తెలుస్తోంది. తన రంజీ రీ ఎంట్రీ మ్యాచ్లో పంత్ నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్లో 17 పరుగులు చేసి ఔటయ్యాడు. ఢిల్లీ జట్టు: ఆయుష్ బడోని (కెప్టెన్), విరాట్ కోహ్లి, సనత్ సాంగ్వాన్, అర్పిత్ రాణా, యశ్ ధుల్, జాంటీ సిద్ధు, హిమ్మత్ సింగ్, నవదీప్ సైనీ, మనీ గ్రేవాల్, హర్ష్ త్యాగి, సిద్ధాంత్ శర్మ, శివం శర్మ, ప్రణవ్ రాజ్వంశీ, వైభవ్ కంద్పాల్, మయాంక్ గుసైన్, గగన్ వాట్స్ , ఆయుష్ దోసెజా, సుమిత్ మాథుర్, రాహుల్ గహ్లోట్, జితేష్ సింగ్, వంశ్ బేడీ.చదవండి: అప్పట్లో ఒకడుండేవాడు.. ఇప్పుడు తిలక్ వర్మ!: భారత మాజీ క్రికెటర్ -
12 వికెట్లతో చెలరేగిన జడేజా.. పంత్ టీమ్ చిత్తు
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) తన రంజీ పునరాగమనంలో సత్తాచాటాడు. రంజీ ట్రోఫీ 2024-25లో సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్న జడేజా.. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో 12 వికెట్లతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు పడగొట్టిన జడ్డూ.. రెండో ఇన్నింగ్స్లో 7 వికెట్లతో మెరిశాడు. అతడి స్పిన్ మయాజాలానికి ప్రత్యర్ధి బ్యాటర్లు విల్లవిల్లాడారు. అటు బ్యాటింగ్లోనూ జడేజా అదరగొట్టాడు. 38 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.ఢిల్లీని చిత్తు చేసిన సౌరాష్ట్ర..ఇక ఈ మ్యాచ్లో ఢిల్లీపై సౌరాష్ట్ర 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ కేవలం రెండు రోజుల్లో మాత్రమే ముగిసిపోయింది. ఢిల్లీ విధించిన 15 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సౌరాష్ట్ర జట్టు వికెట్ నష్టపోకుండా చేధించింది. ఓపెనర్లు హర్విక్ దేశాయ్(6), అర్పిత్ రానా(4) ఆజేయంగా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేశారు.కాగా అంతకముందు 163/5 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన సౌరాష్ట్ర తమ తొలి ఇన్నింగ్స్లో 271 పరుగులకు ఆలౌటైంది. దీంతో సౌరాష్ట్రకు తొలి ఇన్నింగ్స్లో 83 పరుగుల ఆధిక్యం లభించింది. సౌరాష్ట్ర బ్యాటర్లలో హర్విక్ దేశాయ్(93) టాప్ స్కోరర్గా నిలవగా.. వాస్వాద(62), జడేజా(38) పరుగులతో రాణించారు.ఢిల్లీ బౌలర్లలో హర్ష్ త్యాగీ నాలుగు వికెట్లు పడగొట్టగా.. అయూష్ బదోని మూడు వికెట్లు సాధించాడు. అనంతరం 83 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఢిల్లీ కేవలం 94 పరుగులకే ఆలౌటైంది. దీంతో సౌరాష్ట్రముందు ఢిల్లీ కేవలం 15 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగల్గింది.ఢిల్లీ ఇన్నింగ్స్లో కెప్టెన్ అయూష్ బదోని(44) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఢిల్లీ స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్(Rishabh Pant) రెండు ఇన్నింగ్స్లలో తీవ్రనిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్లో 17 పరుగులు చేసి ఔటయ్యాడు. సౌరాష్ట్ర బౌలర్లలో జడేజా(7 వికెట్లు)తో పాటు దర్మేంద్ర జడేజా రెండు వికెట్లు సాధించారు. కాగా తొలి ఇన్నింగ్స్లో ఢిల్లీ 188 పరుగులకు ఆలౌటైంది.ఇక 12 వికెట్లతో మెరిసిన రవీంద్ర జడేజాకు ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు దక్కింది.చదవండి: రోహిత్, కోహ్లి పరుగుల వరద పారించడం ఖాయం: ఇర్ఫాన్ పఠాన్ -
పంత్తో పోటీలో సంజూ వెనుకబడటానికి కారణం అదే: డీకే
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) జట్టులో రిషభ్ పంత్కు చోటు దక్కడంపై భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ స్పందించాడు. సంజూ శాంసన్(Sanju Samson)ను కాదని.. సెలక్టర్లు ఈ ఉత్తరాఖండ్ ఆటగాడి వైపు మొగ్గుచూపడానికి గల కారణాన్ని విశ్లేషించాడు. ఇద్దరూ సూపర్ బ్యాటర్లే అయినా.. పంత్(Rishabh Pant)లోని ఓ ప్రత్యేకతే అతడిని రేసులో ముందు నిలిపిందని పేర్కొన్నాడు.పాకిస్తాన్ వేదికగావన్డే ఫార్మాట్లో నిర్వహించే చాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్ ఫిబ్రవరి 19న పాకిస్తాన్ వేదికగా మొదలుకానుంది. భద్రతా కారణాల దృష్ట్యా తటస్థ వేదికైన దుబాయ్లో మ్యాచ్లు ఆడనున్న టీమిండియా.. తమ తొలి మ్యాచ్లో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో తలపడనుంది. ఇక ఈ మెగా టోర్నీకి ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్ నేరుగా క్వాలిఫై అయింది.మరోవైపు.. ఆస్ట్రేలియా, భారత్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ వన్డే వరల్డ్కప్-2023 పాయింట్ల పట్టికలో స్థానాల ఆధారంగా అర్హత సాధించాయి. ఇందుకు సంబంధించి ఈ ఏడు దేశాలు తమ జట్లను ప్రకటించగా.. పాకిస్తాన్ మాత్రం ఇంకా టీమ్ వివరాలు వెల్లడించలేదు.సంజూకు దక్కని చోటుఇదిలా ఉంటే.. జనవరి 18న భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించిన జట్టులో కేరళ ఆటగాడు సంజూ శాంసన్కు చోటు దక్కలేదు. వికెట్ కీపర్ల కోటాలో వన్డే వరల్డ్కప్- 2023లో రాణించిన కేఎల్ రాహుల్తో పాటు.. రిషభ్ పంత్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. నిజానికి వన్డేల్లో పంత్ కంటే సంజూ గణాంకాలు మెరుగ్గా ఉన్నాయి.అప్పుడు కూడా ఇదే తరహాలోఇప్పటి వరకు టీమిండియా తరఫున 31 వన్డేల్లో పంత్ 33.5 సగటుతో 871 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉంది. మరోవైపు.. సంజూ 16 వన్డేల్లో 56.66 సగటుతో ఓ శతకం, మూడు హాఫ్ సెంచరీల సాయంతో 510 పరుగులు సాధించాడు. నిజానికి సంజూకు వన్డే వరల్డ్కప్-2023 జట్టులో కూడా చోటు దక్కాల్సింది. కానీ నాడు అతడిని కాదని.. టీ20 స్పెషలిస్టు సూర్యకుమార్ యాదవ్ను బీసీసీఐ ఎంపిక చేసింది.అయితే, ఈ ఐసీసీ టోర్నీలో సూర్య పూర్తిగా తేలిపోయాడు. దీంతో సంజూకు అవకాశం ఇచ్చి ఉంటే.. ఫలితాలు ఇంకాస్త మెరుగ్గా ఉండేవనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సూర్య కోసం అతడిని బలిచేసి.. మరోసారి అన్యాయం చేశారంటూ బీసీసీఐపై విమర్శలు వచ్చాయి. తాజాగా మరోసారి కూడా పంత్ కోసం సంజూను కావాలనే పక్కనపెట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి.పంత్ను చేర్చడం ద్వారానే అది సాధ్యంఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్.. ఈ ఇద్దరినీ పోలుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘రిషభ్ పంత్.. లేదా సంజూ శాంసన్.. ఇద్దరి మధ్య పోటాపోటీ నెలకొంది. ఇద్దరూ అచ్చమైన బ్యాటర్లే. అయితే, రిషభ్ పంత్ వైపు సెలక్టర్లు మొగ్గు చూపడానికి కారణం.. అతడు ఎడమచేతి వాటం బ్యాటర్ కావడమే.బ్యాటింగ్ ఆర్డర్లో మేనేజ్మెంట్ కోరుకుంటున్న వైవిధ్యం పంత్ను చేర్చడం ద్వారా సాధ్యమవుతుంది. ఏదేమైనా సంజూ శాంసన్ కూడా చివరి వరకు పోటీలో నిలిచాడని చెప్పవచ్చు.విజయ్ హజారే ట్రోఫీలో ఆడి ఉంటే..అయితే, ఈసారి విజయ్ హజారే ట్రోఫీ ఆడకపోవడం కూడా అతడి ఎంపికపై ప్రభావం చూపింది. ఈ దేశీ టోర్నీలో ఆడి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది’’ అని దినేశ్ కార్తిక్ క్రిక్బజ్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.కాగా దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీకి సంజూ శాంసన్ దూరంగా ఉన్నాడు. కేరళ క్రికెట్ అసోసియేషన్(కేసీఏ)తో అతడికి విభేదాలు తలెత్తిన కారణంగానే ఈ టోర్నీలో పాల్గొనలేకపోయాడు. మూడు రోజుల పాటు నిర్వహించిన శిక్షణా శిబిరానికి సంజూ రాలేదని కేసీఏ పెద్దలు వేటు వేయగా.. సంజూ తండ్రి శాంసన్ విశ్వనాథ్ మాత్రం తన కుమారుడిపై కావాలనే కక్ష సాధిస్తున్నారని ఆరోపించాడు. సంజూ మాదిరి ప్రాక్టీస్ సెషన్కు హాజరుకాని ఎంతో మంది ఆటగాళ్లకు కేరళ జట్టులో చోటు ఇచ్చారని పేర్కొన్నాడు.చదవండి: అతడొక సూపర్స్టార్.. మా ఓటమికి కారణం అదే: బట్లర్ -
ఘోరంగా విఫలమైన రోహిత్, యశస్వి, గిల్, పంత్.. ఐదు వికెట్లతో సత్తా చాటిన జడేజా
రంజీ ట్రోఫీ 2024-25 సెకెండ్ లెగ్ మ్యాచ్లు ఇవాల్టి నుంచి (జనవరి 23) ప్రారంభమయ్యాయి. ఖాళీగా ఉన్న టీమిండియా ఆటగాళ్లంతా రంజీల్లో తప్పక ఆడాలని బీసీసీఐ కండీషన్ పెట్టిన నేపథ్యంలో హేమాహేమీలంతా బరిలోకి దిగారు. ముంబై తరఫున రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్.. పంజాబ్ తరఫున శుభ్మన్ గిల్.. ఢిల్లీ తరఫున రిషబ్ పంత్.. సౌరాష్ట్ర తరఫున రవీంద్ర జడేజా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.తేలిపోయిన పంత్.. ఐదేసిన జడేజాఎలైట్ గ్రూప్ డిలో భాగంగా ఇవాళ ఢిల్లీ, సౌరాష్ట్ర జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 188 పరుగులకే ఆలౌటైంది. ఢిల్లీ తరఫున బరిలోకి దిగిన టీమిండియా స్టార్ రిషబ్ పంత్ దారుణంగా విఫలమయ్యాడు. పంత్ 10 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఆయుశ్ బదోని (60), యశ్ ధుల్ (44), మయాంక్ గుసెయిన్ (38 నాటౌట్) ఓ మోస్తరు ఇన్నింగ్స్లు ఆడటంతో ఢిల్లీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ను టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కకావికలం చేశాడు. జడ్డూ 17.4 ఓవర్లలో 66 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. జడేజాకు మరో జడేజా (ధర్మేంద్రసిన్హ్) తోడయ్యాడు. ఈ జడేజా 19 ఓవర్లలో 63 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్, యువరాజ్ సింగ్ దోడియా తలో వికెట్ దక్కించుకున్నారు. ఢిల్లీ ఇన్నింగ్స్ చివరి రెండు బంతులకు వికెట్లు తీసిన రవీంద్ర జడేజాకు సెకెండ్ ఇన్నింగ్స్లో హ్యాట్రిక్ తీసే అవకాశం ఉంటుంది. 36 ఏళ్ల జడ్డూకు ఫస్ట్ క్లాస్ కెరీర్లో ఇది 35వ ఐదు వికెట్ల ఘనత.పేలవ ఫామ్ను కొనసాగించిన రోహిత్.. నిరాశపరిచిన జైస్వాల్, శ్రేయస్, దూబేఎలైట్ గ్రూప్-ఏలో భాగంగా రోహిత్ శర్మ, జైస్వాల్ ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై.. జమ్మూ అండ్ కశ్మీర్తో తలపడుతుంది. ఈ మ్యాచ్లో పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన ముంబై.. జమ్మూ అండ్ కశ్మీర్ బౌలర్ల ధాటికి విలవిలలాడిపోయింది. ముంబై తొలి ఇన్నింగ్స్లో 33.2 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ప్రదర్శన రంజీల్లోనూ కొనసాగింది. హిట్మ్యాన్ కేవలం 3 పరుగులకే వెనుదిరిగాడు. మరో టీమిండియా స్టార్ యశస్వి జైస్వాల్ 4 పరుగులకే ఔటయ్యాడు. టీమిండియా పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్లు శ్రేయస్ అయ్యర్ (11), శివమ్ దూబే (0) నిరాశపరిచారు. ముంబై కెప్టెన్, టీమిండియా ఆటగాడు అజింక్య రహానే (12) కూడా తేలిపోయాడు. పీకల్లోతు కష్టాల్లో ఉన్న ముంబైను మరో టీమిండియా ఆటగాడు శార్దూల్ ఠాకూర్ (51) గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. శార్దూల్ హాఫ్ సెంచరీ పుణ్యమా అని ముంబై 100 పరుగుల మార్కును దాటగలిగింది. శార్దూల్కు తనుశ్ కోటియన్ (26) కాసేపు సహకరించాడు. జమ్మూ అండ్ కశ్మీర్ బౌలర్లు యుద్వీర్ సింగ్ చరక్ (8.2-2-31-4), ఉమర్ నజీర్ మిర్ (11-2-41-4), ఆకిబ్ నబీ దార్ (13-3-36-2) స్టార్లతో నిండిన ముంబై బ్యాటింగ్ లైనప్కు బెంబేలెత్తించారు.తీరు మార్చుకోని గిల్గిల్ వైఫల్యాల పరంపర రంజీల్లోనూ కొనసాగుతుంది. బీజీటీ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయిన గిల్.. కర్ణాటకతో జరుగుతున్న రంజీ మ్యాచ్లోనూ నిరాశపరిచాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 55 పరుగులకే కుప్పకూలింది. కర్ణాటక బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి పంజాబ్ ఇన్నింగ్స్ను మట్టుబెట్టారు. వి కౌశిక్ 4, అభిలాశ్ షెట్టి 3, ప్రసిద్ద్ కృష్ణ 2, యశోవర్దన్ పరంతాప్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్లో పంజాబ్ సారధిగా వ్యవహరిస్తున్న గిల్ కేవలం 4 పరుగులకే ఔటయ్యాడు. పంజాబ్ ఇన్నింగ్స్లో రమన్దీప్సింగ్ (16), మార్కండే (12) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. -
NADA: బుమ్రా, సూర్య, పంత్, సంజూ శాంసన్.. ఇంకా..
జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా)లో కొత్తగా 14 మంది క్రికెటర్ల పేర్లు చేరాయి. ‘నాడా’ పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా తయారు చేసే రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్ (ఆర్టీపీ)– 2025 జాబితాలో భారత టి20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, టాప్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. వీరితో పాటు బీసీసీఐ కాంట్రాక్ట్ క్రికెటర్లు శుబ్మన్ గిల్(Shubman Gill), రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal), అర్ష్దీప్ సింగ్, సంజు శాంసన్, తిలక్ వర్మ(Tilak Varma) పేర్లు కూడా జత చేరాయి.ఇక ముగ్గురు మహిళా క్రికెటర్లు షఫాలీ వర్మ, దీప్తి శర్మ, రేణుకా సింగ్ పేర్లను కూడా ‘ఆర్టీపీ’లో చేర్చారు. ‘నాడా’ నిబంధనల ప్రకారం ఈ ఏడాదిలో ఏ సమయంలోనైనా వీరి శాంపిల్స్ను అధికారులు సేకరిస్తారు. డోపింగ్ పరీక్షలకు హాజరు కాకపోతేతాము ‘ఎప్పుడు, ఎక్కడ’ ఉంటామో చెబుతూ అధికారుల కోసం ఆటగాళ్లు అందుబాటులో ఉండాలి. తమ చిరునామా, ప్రాక్టీస్, ప్రయాణాలు, మ్యాచ్ల షెడ్యూల్వంటి వివరాలు కూడా వారు అందజేయాల్సి ఉంటుంది.కాగా డోపింగ్ పరీక్షలకు హాజరు కాకపోతే దానికి సదరు ఆటగాడే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఏడాది కాలంలో ఏదైనా కారణంతో మూడుసార్లు ఇలాగే జరిగితే డోపింగ్ నిబంధనల ఉల్లంఘన కింద ‘నాడా’ చర్యలు తీసుకుంటుంది. 2019 నుంచే ‘నాడా’ పరిధిలోకి క్రికెటర్లు రాగా... ఓవరాల్గా అన్ని క్రీడాంశాల్లో కలిపి ప్రస్తుతం 227 మంది భారత ప్లేయర్లు ఈ జాబితాలో ఉన్నారు.మరిన్నిక్రీడా వార్తలుఆసియా మిక్స్డ్ బ్యాడ్మింటన్ టోర్నీకి భారత జట్టు ప్రకటన న్యూఢిల్లీ: ఆసియా బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ చాంపియన్షిప్లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. ఫిబ్రవరి 11 నుంచి 16 వరకు చైనాలో జరగనున్న ఈ టోర్నీలో భారత్ నుంచి 14 మంది షట్లర్లు పాల్గొంటారు. రెండు ఒలింపిక్ పతకాలు నెగ్గిన స్టార్ పీవీ సింధుతోపాటు పారిస్ ఒలింపిక్స్లో పోటీపడ్డ లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణయ్ ఈ ప్రతిష్టాత్మక టోరీ్నలో ఆడతారు. 2023లో దుబాయ్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో భారత జట్టు కాంస్య పతకం నెగ్గింది.ఈసారి అంతకంటే మెరుగైన ప్రదర్శన చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) కార్యదర్శి సంజయ్ మిశ్రా తెలిపారు. పురుషుల సింగిల్స్లో లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్, మహిళల సింగిల్స్లో సింధు, మాళవిక బరిలోకి దిగుతారు’ అని వెల్లడించారు. పురుషుల జట్టు: లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణయ్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, ధ్రువ్ కపిల, ఎంఆర్ అర్జున్, సతీశ్ కుమార్. మహిళల జట్టు: సింధు, మాళవిక బన్సోద్, గాయత్రి గోపీచంద్, ట్రెసా జాలీ, అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టో, ఆద్య. సహజ శుభారంభంబెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ100 మహిళల టోర్నీలో భారత రెండో ర్యాంకర్, తెలంగాణ అమ్మాయి సహజ యామలపల్లి శుభారంభం చేసింది. బుధవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 315వ ర్యాంకర్ సహజ 6–3, 3–6, 6–0తో ప్రపంచ 182వ ర్యాంకర్ యురికో మియజకి (జపాన్)పై సంచలన విజయం సాధించింది.2 గంటల 14 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సహజ తన సర్వీస్ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను ఏడుసార్లు బ్రేక్ చేసింది. హైదరాబాద్కే చెందిన మరో క్రీడాకారిణి భమిడిపాటి శ్రీవల్లి రషి్మక 0–6, 0–6తో ప్రపంచ 155వ ర్యాంకర్ సారా బెజ్లెక్ (చెక్ రిపబ్లిక్) చేతిలో 45 నిమిషాల్లో ఓడిపోయింది. మరో మ్యాచ్లో భారత నంబర్వన్ అంకిత రైనా 7–6 (7/2), 7–6 (7/4)తో దరియా కుదషోవా (రష్యా)పై గెలిచింది. -
‘నా కుమారుడిపై పగబట్టారు.. కావాలనే తొక్కేస్తున్నారు’
టీమిండియా స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్(Sanju Samson) తండ్రి శాంసన్ విశ్వనాథ్ మరోసారి తీవ్ర ఆరోపణలతో తెరమీదకు వచ్చారు. తన కుమారుడి ఎదుగులను ఓర్వలేక.. కావాలనే తొక్కేస్తున్నారంటూ కేరళ క్రికెట్ అసోసియేషన్(కేసీఏ)పై మండిపడ్డారు. అసోసియేషన్లోని ‘పెద్ద తలకాయల’పై తనకేమీ కోపం లేదని.. సమస్యంతా అబద్దాలను కూడా నిజంలా ప్రచారం చేసే ‘చిన్నవాళ్ల’ గురించేనని పేర్కొన్నారు.కాగా ఇటీవల అంతర్జాతీయ టీ20లలో మూడు శతకాలతో చెలరేగాడు కేరళ స్టార్ సంజూ శాంసన్. ఈ క్రమంలో ఈ వికెట్ కీపర్ బ్యాటర్కు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) జట్టులో చోటు దక్కడం ఖాయమని సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు సైతం అభిప్రాయపడ్డారు. ఈ వన్డే ఫార్మాట్ టోర్నీలో సంజూ సత్తా చాటగలడని మద్దతు పలికారు.సంజూ శాంసన్కు మొండిచేయిఅయితే, ఈ మెగా టోర్నీలో సంజూ శాంసన్కు టీమిండియా సెలక్టర్లు మొండిచేయి చూపారు. వికెట్ కీపర్ల కోటాలో కేఎల్ రాహుల్(KL Rahul)తో పాటు రిషభ్ పంత్(Rishabh Pant)ను ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో సంజూ ఆడకపోవడం కూడా ఇందుకు ఓ కారణం అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.కాగా దేశీ క్రికెట్ టోర్నీల్లో కేరళ జట్టుకు సంజూ కెప్టెన్గా పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే, ఈసారి మాత్రం కేసీఏ అతడి పట్ల కాస్త కఠినంగా వ్యవహరించింది. తాము నిర్వహించిన మూడు రోజుల శిక్షణా శిబిరానికి హాజరుకానుందున సంజూకు విజయ్ హజారే ట్రోఫీ ఆడే జట్టులో చోటివ్వలేదని తెలిపింది.అదే విధంగా.. సెలక్షన్కు అందుబాటులో ఉంటాడో.. లేదో కూడా తమకు సమాచారం ఇవ్వలేదని సంజూపై ఆరోపణలు చేసింది. తనకు నచ్చినపుడు వచ్చి ఆడతామంటే కుదరదని.. అందరి ఆటగాళ్లలాగే అతడు కూడా అని స్పష్టం చేసింది.నా కుమారుడిపై పగబట్టారునిజానికి విజయ్ హజారే ట్రోఫీలో గనుక తనను తాను నిరూపించుకుంటే సంజూ కచ్చితంగా చాంపియన్స్ ట్రోఫీ రేసులో ఉండేవాడే! ఈ పరిణామాల నేపథ్యంలో సంజూ శాంసన్ తండ్రి విశ్వనాథ్ స్పందించారు. ‘‘కేసీఏలో ఉన్న కొద్ది మంది వ్యక్తులు నా కుమారుడికి వ్యతిరేకంగా పనిచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. పగ సాధిస్తున్నారు.ఇంతవరకు మేము అసోసియేషన్కు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ఈసారి వారి చేష్టలు శ్రుతిమించాయి. సంజూ ఒక్కడే క్యాంపునకు హాజరు కాలేదన్నట్లు మాట్లాడుతున్నారు. చాలా మంది శిక్షణా శిబిరంలో పాల్గొనకపోయినా వాళ్లను ఎంపిక చేశారు.వారి ప్రమేయం లేదుకేసీఏ అధ్యక్షుడు జయేశ్ జార్జ్, కార్యదర్శి వినోద్కు ఈ విషయంలో ప్రమేయం లేదని అనుకుంటున్నా. అయితే, కొంతమంది కిందిస్థాయి వ్యక్తులు సంజూ గురించి తప్పుడు ప్రచారాలు చేస్తూ వారి మనసులలో విషాన్ని నింపుతున్నారు’’ అని విశ్వనాథ్ మాతృభూమికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమేరకు ఆరోపణలు చేశారు.కాగా గతంలోనూ విశ్వనాథ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మతో పాటు హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ వల్ల తన కుమారుడి కెరీర్ నాశనం అయిందని.. పదేళ్ల పాటు అతడి సమయం వృథా అయిందని పేర్కొన్నారు. ప్రస్తుత హెడ్కోచ్ గౌతం గంభీర్, సూర్యకుమార్ యాదవ్ మాత్రం తన కొడుకుకు మద్దతు ఇస్తున్నారని తెలిపారు. కాగా సంజూ ప్రస్తుతం ఇంగ్లండ్తో టీ20 సిరీస్ సన్నాహకాల్లో బిజీగా ఉన్నాడు.చదవండి: Ind vs Eng: టీ20, వన్డే సిరీస్లకు భారత్, ఇంగ్లండ్ జట్లు ఇవే -
IPL 2025: పంత్కే లక్నో పగ్గాలు
కోల్కతా: ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ తమ కెప్టెన్ పేరును అధికారికంగా ప్రకటించింది. ఊహించిన విధంగానే వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ను సారథిగా నియమిస్తున్నట్లు టీమ్ మేనేజ్మెంట్ వెల్లడించింది. లక్నో ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా సోమవారం జరిగిన కార్యక్రమంలో కెప్టెన్ పంత్కు టీమ్ జెర్సీని అందిస్తూ తమ ఎల్ఎస్జీ కుటుంబంలోకి ఆహ్వానించారు. ఐపీఎల్ వేలంలో రూ. 27 కోట్లకు పంత్ను లక్నో సొంతం చేసుకోవడంతోనే అతనే కెపె్టన్ కావడం దాదాపు ఖాయమైంది. ‘కొత్త ఆశలు, ఆశయాలతో పాటు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో కొత్తగా మేం మొదలు పెడుతున్నాం. మీకందరికీ మా కొత్త కెప్టెన్ రిషభ్ పంత్ను పరిచయం చేస్తున్నాం. మా జట్టుకు సంబంధించి ఇదో కీలక క్షణం. మూడేళ్లు ముగిసిన తర్వాత మా ప్రణాళికల్లో మార్పులతో ముందుకు వెళ్లబోతున్నాం’ అని గోయెంకా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీమ్ మెంటార్ జహీర్ ఖాన్ కూడా పాల్గొన్నాడు. ఐపీఎల్లో మూడు సీజన్లు ఆడిన లక్నోకు కేఎల్ రాహుల్ కెప్టెన్గా వ్యవహరించాడు. తొలి రెండు సీజన్లలో ప్లే ఆఫ్స్కు చేరిన ఆ జట్టు గత ఏడాది పూర్తిగా విఫలమైంది. దాంతో పాటు కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్పై కూడా విమర్శలు రావడంతో మార్పు అనివార్యమైంది. వేలంలో పంత్ను సొంతం చేసుకున్న టీమ్ ఇప్పుడు కెపె్టన్గా బాధ్యతలు అప్పగించింది. 2016 నుంచి 2024 వరకు ఢిల్లీ టీమ్ సభ్యుడైన పంత్... మూడేళ్లు నాయకుడిగా కూడా పని చేశాడు. 200 శాతం ప్రదర్శన కనబరుస్తా... దేశవాళీ క్రికెట్లో ఢిల్లీ తరఫున ఆడినా... పంత్ స్వస్థలం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్. గతంలో ఇది ఉత్తరప్రదేశ్లోనే భాగం. ఇప్పుడు అదే రాష్ట్రానికి చెందిన ఐపీఎల్ టీమ్కు అంటే దాదాపుగా సొంత టీమ్కు అతను ప్రాతినిధ్యం వహించబోతున్నాడు. లక్నో మేనేజ్మెంట్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని పంత్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘నా వైపు నుంచి ఎలాంటి లోపం లేకుండా 200 శాతం కష్టపడతానని మీకు మాటిస్తున్నా. కొత్త ఉత్సాహంతో కొత్త జట్టు తరఫున బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నా. నాకు ఇచి్చన బాధ్యతలతో సంతోషంగా ఉన్నా. టీమ్లో యువకులు, అనుభవజ్ఞులు ఉన్నారు. కొత్త లక్ష్యాలతో మా ప్రయాణం మొదలైంది’ అని పంత్ వ్యాఖ్యానించాడు. కెపె్టన్గా తాను ఇప్పటికే ఎంతో నేర్చుకున్నానని పంత్ అన్నాడు. ‘ఇక్కడ కొత్త ఫ్రాంచైజీ, కొత్త ఆరంభం అని నాకు తెలుసు. కానీ కెప్టెన్సీ బాధ్యతలు నాకు కొత్త కాదు. అయితే మా జట్టు అవసరాలను బట్టి నేనేం చేయాలో మేనేజ్మెంట్తో చర్చిస్తా. సహచరులకు అండగా ఎలా నిలవాలో, వారినుంచి మంచి ప్రదర్శన ఎలా రాబట్టాలో రోహిత్ శర్మ నుంచి, ఇతర సీనియర్ ఆటగాళ్ల నుంచి కూడా ఎంతో నేర్చుకున్నా. ఎవరికి ఎలాంటి బాధ్యతలు ఇవ్వాలనే విషయంపై నాకు స్పష్టత ఉంది’ అని పంత్ వివరించాడు. పంత్లో సత్తా ఉంది... భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ ఢిల్లీ కెప్టెన్గా ఉన్న 2016లో పంత్ మొదటిసారి ఐపీఎల్లోకి అడుగు పెట్టాడు. ఇప్పుడు లక్నో మెంటార్గా ఉన్న జహీర్తో పంత్ మళ్లీ కలిసి పని చేయనున్నాడు. ‘ఎన్నో ఆటుపోట్లను దాటి పంత్ క్రికెటర్గా ఎదగడం నేను ప్రత్యక్షంగా చూశాను. తన ఆటతో అతను అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పాడు. ఇకపై అతను సాధించాల్సింది ఎంతో ఉంది. ఇక్కడ పంత్ ఆ పని చేయగలడు’ అని జహీర్ వ్యాఖ్యానించాడు. మరోవైపు తమ జట్టు మిడిలార్డర్లో అంతా ఎడంచేతి వాటం బ్యాటర్లు ఉండటం కూడా ఒకరకమైన వ్యూహమని తెలిపాడు.