రేపటి నుంచి వైఎస్ జగన్ రెండో విడత రైతు భరోసా యాత్ర | YS Jagan mohan reddy second phase rythu bharosa yatra starts | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి వైఎస్ జగన్ రెండో విడత రైతు భరోసా యాత్ర

Published Sun, May 10 2015 1:22 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

YS Jagan mohan reddy second phase rythu bharosa yatra starts

హైదరాబాద్: అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నుంచి రెండో విడత రైతు భరోసా యాత్ర నిర్వహిస్తారని ఆ పార్టీ రైతు నాయకుడు ఎమ్వీఎస్ నాగిరెడ్డి తెలిపారు. ఆదివారం హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ... గిట్టుబాటు ధరలు లేక, రుణమాఫీ జరగకపోవడంతో రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారని నాగిరెడ్డి ఆరోపించారు.

ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతులకు భరోసా ఇచ్చేందుకే వైఎస్ జగన్ రేపట్టి నుంచి రైతు భరోసా యాత్ర నిర్వహిస్తున్నట్లు ఎమ్మీఎస్ నాగిరెడ్డి వెల్లడించారు.  ఈ ఏడాది ఫిబ్రవరిలో వైఎస్ జగన్ అనంతపురం జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్ర విజయవంతమైన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement