10% పెరిగిన ఇంధన డిమాండ్‌ | 10% increase in fuel demand | Sakshi
Sakshi News home page

10% పెరిగిన ఇంధన డిమాండ్‌

Published Sat, Oct 21 2017 1:34 AM | Last Updated on Mon, Jul 29 2019 6:10 PM

10% increase in fuel demand - Sakshi

న్యూఢిల్లీ: భారత ఇంధన డిమాండ్‌ ఈ ఏడాది సెప్టెంబర్లో 10 శాతం పెరిగింది. ఇంధన డిమాండ్‌ ఈ స్థాయిలో పెరగడం గత ఏడాది కాలంలో ఇదే మొదటిసారి. చమురు వినియోగంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా.. భారత్‌.. గత నెలలో 16.25 మిలియన్‌ టన్నుల పెట్రోలియమ్‌ ఉత్పత్తులను వినియోగించింది. గత ఏడాది ఇదే నెలలో ఈ వినియోగం 14.78 మిలియన్‌ టన్నులుగా నమోదైంది.

చమురు శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం...
♦ గత ఏడాది ఆగస్టు తర్వాత చమురు ఉత్పత్తుల వృద్ధి గత నెలలోనే భారీగా నమోదైంది. ఆగస్టు, 2016లో డిమాండ్‌ 18.2 శాతానికి పెరిగింది.
♦  ఈ ఏడాది ఆగస్టులో చమురు ఉత్పత్తులకు డిమాండ్‌ 6.1% తగ్గింది. 2003 ఏప్రిల్‌ నుంచి చూస్తే ఇదే అత్యధిక తగ్గుదల. వివిధ ప్రాంతాల్లో వరదల కారణంగా ఈ ఆగస్టులో డీజిల్, పెట్రోల్‌ ఉత్పత్తులకు డిమాండ్‌  బాగా తగ్గింది.
♦ ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ(ఐఈఏ) అంచనాల ప్రకారం, 2040 వరకూ చమురు వినియోగంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్‌ కొనసాగుతుంది. అయితే ♦  ఏడాది ఎనిమిది నెలలకు గాను  నాలుగు నెలల్లో ఆయిల్‌ డిమాండ్‌ పడిపోయింది.
♦  చమురు అవసరాల్లో దాదాపు 81 శాతం వరకూ మన దేశం దిగుమతి చేసుకుంటోంది.
♦ ఈ ఏడాది సెప్టెంబర్‌లో డీజిల్‌ అమ్మకాలు 16.5 శాతం వృద్ధితో 6.08 మిలియన్‌ టన్నులు, పెట్రోల్‌ వినియోగం 18 శాతం వృద్ధితో 2.14 మిలియన్‌ టన్నులకు పెరిగాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement