
న్యూఢిల్లీ: భారత ఇంధన డిమాండ్ ఈ ఏడాది సెప్టెంబర్లో 10 శాతం పెరిగింది. ఇంధన డిమాండ్ ఈ స్థాయిలో పెరగడం గత ఏడాది కాలంలో ఇదే మొదటిసారి. చమురు వినియోగంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా.. భారత్.. గత నెలలో 16.25 మిలియన్ టన్నుల పెట్రోలియమ్ ఉత్పత్తులను వినియోగించింది. గత ఏడాది ఇదే నెలలో ఈ వినియోగం 14.78 మిలియన్ టన్నులుగా నమోదైంది.
చమురు శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం...
♦ గత ఏడాది ఆగస్టు తర్వాత చమురు ఉత్పత్తుల వృద్ధి గత నెలలోనే భారీగా నమోదైంది. ఆగస్టు, 2016లో డిమాండ్ 18.2 శాతానికి పెరిగింది.
♦ ఈ ఏడాది ఆగస్టులో చమురు ఉత్పత్తులకు డిమాండ్ 6.1% తగ్గింది. 2003 ఏప్రిల్ నుంచి చూస్తే ఇదే అత్యధిక తగ్గుదల. వివిధ ప్రాంతాల్లో వరదల కారణంగా ఈ ఆగస్టులో డీజిల్, పెట్రోల్ ఉత్పత్తులకు డిమాండ్ బాగా తగ్గింది.
♦ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ(ఐఈఏ) అంచనాల ప్రకారం, 2040 వరకూ చమురు వినియోగంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్ కొనసాగుతుంది. అయితే ♦ ఏడాది ఎనిమిది నెలలకు గాను నాలుగు నెలల్లో ఆయిల్ డిమాండ్ పడిపోయింది.
♦ చమురు అవసరాల్లో దాదాపు 81 శాతం వరకూ మన దేశం దిగుమతి చేసుకుంటోంది.
♦ ఈ ఏడాది సెప్టెంబర్లో డీజిల్ అమ్మకాలు 16.5 శాతం వృద్ధితో 6.08 మిలియన్ టన్నులు, పెట్రోల్ వినియోగం 18 శాతం వృద్ధితో 2.14 మిలియన్ టన్నులకు పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment