రేపటి నుంచి బ్యాంకింగ్‌ సదస్సు! | Banking Conference from Tomorrow | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి బ్యాంకింగ్‌ సదస్సు!

Published Wed, Aug 22 2018 12:39 AM | Last Updated on Wed, Aug 22 2018 12:39 AM

Banking Conference from Tomorrow - Sakshi

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌ సదస్సు గురువారం ఇక్కడ ప్రారంభమవుతుంది. రెండు రోజులు జరగనున్న ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, పీయూష్‌ గోయెల్, సురేశ్‌ ప్రభులు హాజరవుతారని అతున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. మొండిబకాయిలు, తాజా మూలధన కల్పన, బ్యాంకింగ్‌ విలీనాలు వంటి అంశాలపై ఈ సదస్సు చర్చించనున్నట్లు సమాచారం. నీతి ఆయోగ్, సెంటర్‌ ఫర్‌ ఎకనమిక్‌ పాలసీ రీసెర్చ్‌ నిర్వహిస్తున్న ఈ సదస్సులో కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్‌ అధికారులుసహా ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల ఉన్నత స్థాయి అధికారులు దాదాపు అందరూ పాల్గొంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement