
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ సదస్సు గురువారం ఇక్కడ ప్రారంభమవుతుంది. రెండు రోజులు జరగనున్న ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అరుణ్జైట్లీ, పీయూష్ గోయెల్, సురేశ్ ప్రభులు హాజరవుతారని అతున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. మొండిబకాయిలు, తాజా మూలధన కల్పన, బ్యాంకింగ్ విలీనాలు వంటి అంశాలపై ఈ సదస్సు చర్చించనున్నట్లు సమాచారం. నీతి ఆయోగ్, సెంటర్ ఫర్ ఎకనమిక్ పాలసీ రీసెర్చ్ నిర్వహిస్తున్న ఈ సదస్సులో కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్ అధికారులుసహా ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల ఉన్నత స్థాయి అధికారులు దాదాపు అందరూ పాల్గొంటారు.
Comments
Please login to add a commentAdd a comment