జీఎస్టీ చెల్లింపుదారులకు ఊరట! | CbicIssues Major Relief To Gst Payers | Sakshi
Sakshi News home page

జీఎస్టీఆర్‌-3 : ఆలస్య రుసుం తగ్గింపు

Published Fri, Jul 3 2020 5:20 PM | Last Updated on Fri, Jul 3 2020 5:20 PM

CbicIssues Major Relief To Gst Payers - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జీఎస్టీ చెల్లింపుదారులకు ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. జీఎస్టీఆర్‌-3బీ రిటర్న్‌ దాఖలుకు సంబంధించి ఆలస్య రుసుంను ప్రభుత్వం తగ్గించింది. దీంతో జులై 2017 నుంచి జులై 2020కు సంబంధించిన జీఎస్టీఆర్‌-3 బీ రిటర్న్స్‌ను ఈ ఏడాది సెప్టెంబర్‌ 30లోపు దాఖలు చేస్తే ఆలస్య రుసుం గరిష్టంగా 500 రూపాయలుగానే ఉండనుంది. ఇక పన్ను చెల్లించనవసరం లేని పక్షంలో ఆలస్య రుసుం చెల్లించాల్సిన పని లేదని కేంద్ర పరోక్ష పన్నుల బోర్డ్‌ (సీబీఐసీ) ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే తగ్గించిన ఆలస్య రుసుం ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 వరకూ దాఖలు చేసిన జీఎస్టీఆర్‌-3 బీ రిటర్స్న్‌కు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది.

చదవండి : మెరుగైన జీఎస్టీ వసూళ్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement