relief
-
పోసాని కృష్ణమురళీకి హైకోర్టులో ఊరట
-
ఐటీ నోటీసు వస్తే ‘రాజీ’ చేసుకోండి..
ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు వస్తే, వెంటనే వారితో ‘సంధి’ లేదా రాజీ చేసుకోవచ్చు. దీనికి ఎవరి రాయబారమూ అక్కర్లేదు. మీరే స్వయంగా ఒప్పందంలాంటిది చేసుకోవచ్చు. 2025 మార్చి 17న ఓ సర్క్యులర్ ద్వారా డిపార్టుమెంటు వారు సులువుగా రాజీ చేసుకోమని మార్గదర్శకాలు ఇచ్చారు. దీన్నే ఇంగ్లీషులో COMPOUNDING అంటారు.ఎన్నో సందర్భాల్లో డిపార్టుమెంటు వారు నోటీసులు ఇస్తారు. వాటికి బదులివ్వకపోతే వారు కోర్టుకు వెళ్తారు. కొన్ని సీరియస్ కేసుల్లో జైలుకి పంపిస్తారు. అంతవరకు వెళ్లడం అవసరమా! పరువు గంగపాలై, బతుకు హాస్పిటల్ పాలై, కృష్ణ జన్మస్థానంలో గడపడమెందుకు?ఈ పథకం .. లేదా ఒప్పందం.. లేదా రాజీ మార్గం ప్రకారం.. 1 కోర్టుకు వెళ్లక్కర్లేదు. లీగల్ ప్రాసిక్యూషన్ ఉండదు. 2. టైం కలిసి వస్తుంది. 3. మానసిక ఒత్తిడి ఉండదు 4. ఆర్థిక ప్రమాదం ఉండదు 5. బ్యాంకు అకౌంటు అటాచ్మెంట్ ఉండదు 6. వ్యాపారం సజావుగా చేసుకోవచ్చు 7. నలుగురికీ తెలియకుండా గొడవ సమసిపోతుంది 8. ఇది అతి పెద్ద ఉపశమనంవివరాల్లోకి వెళ్తే.. అన్ని రకాల నేరాలకు ఇది వర్తిస్తుంది. ఎన్ని సార్లయినా ఈ స్కీమ్తో ప్రయోజనం పొందవచ్చు. కాల వ్యవధులు లేవు. వ్యాపార నిర్వహణలో ఉన్నప్పుడు తెలిసో, తెలియకో ఎన్నో నేరాలు, ఇన్కంట్యాక్స్ చట్టం ప్రకారం జరుగుతుంటాయి. వీటన్నింటి మీద సమయం వెచ్చించలేము. కోర్టు చుట్టూ తిరగలేము. తిరిగినా జడ్జిమెంటు ఎలా ఉంటుందో చెప్పలేము.ఇన్ని కష్టాలతో, ఇబ్బందులతో వ్యాపారం చేయలేము. వ్యాపారం కుంటుపడుతుంది. బైటి జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటారు. వీటన్నింటిని అధిగమించేందుకు కల్పిస్తున్న ఈ వెసులుబాటు, పాత కేసులకూ వర్తిస్తుంది. పాత కేసులను తిరస్కరించినా ఈ ఒప్పందంలో చేరి, రాజీపడొచ్చు. మరీ మోసపూరితమైన కేసుల్లో తప్ప మిగతా అన్నింటికీ ఈ ‘‘రాజీ’’లో ఉపశమనం ఉంది.చాలా త్వరగా పరిష్కారం దొరుకుతుంది. ఒక దరఖాస్తు చేసుకోగానే మార్గం సుగమం అవుతుంది. హై–ప్రొఫైల్ కేసుల్లో ముందుగా స్పెషల్ పర్మిషన్ తీసుకుని గానీ రిలీఫ్ ఇవ్వరు. ఉదాహరణకు జైలు శిక్ష 2 సంవత్సరాలు దాటినా .. సీబీఐ, ఈడీ మొదలైన సంస్థలతో సమస్యలు ఉన్నా, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ పర్మిషన్ అవసరం. ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు.. 👉 బిజినెస్ వ్యక్తులు 👉 టీడీఎస్ విషయంలో ప్రాసిక్యూషన్ ఎదుర్కొంటున్నవారు 👉 పన్నుభారాన్ని కోర్టుకు వెళ్లకుండా సెటిల్ చేసుకునే వారు 👉 గతంలో రాజీకి వెళ్లి తిరస్కరణకు గురైన వారు 👉 అనేక నేరాలు చేసి బైటికి రానివాళ్లుఎలా చేయాలి: వంద రూపాయల స్టాంపు పేపరు మీద అన్ని వివరాలను మీ సంబంధిత అధికారికి సబ్మిట్ చేయాలి. దరఖాస్తుతో పాటు ఫీజు చెల్లించాలి. ఎంత చెల్లించాలో డిపార్టుమెంటు నిర్ణయిస్తుంది. రాజీపత్రం రాగానే ఉపశమనం వచ్చినట్లే. ప్రాసిక్యూషన్ ఆగిపోతుంది. మీరు మాత్రం అప్పీలులో ఉన్న కేసులను ఉపసంహరించుకోవాలి.రాజీకి వెళ్లకపోతేషరా మామూలే. లీగల్ ప్రాసిక్యూషన్ కొనసాగుతుంది. ఫైన్ పడుతుంది. జైలు శిక్ష పడొచ్చు. కోర్టు ఖర్చులు భరించాలి. రికార్డుల్లో అలాగే ఉండిపోతే ఉత్తరోత్తరా డిపార్టుమెంటు వారి దృష్టిలో చెడుగా.. అంటే డిఫాల్టరుగా ఉండిపోతారు. కాబట్టి వెంటనే రాజీమార్గంలో వెళ్లి, రాజీపడి అన్ని కష్టాల్లో నుంచి బైటపడండి.పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు. -
ఐపీఎస్ అధికారి మహంతికి హైకోర్టులో ఊరట
సాక్షి,హైదరాబాద్: తెలంగాణాకు చెందిన ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతి(IPS officer Abhishek Mohanty)కి హైకోర్టులో ఊరట లభించింది. క్యాట్లో విచారణ ముగిసే వరకు తెలంగాణలోనే అభిషేక్ మహంతి విధులు నిర్వహించాలని హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పుతో అభిషేక్ మహంతికి ఉపశమనం లభించింది.తెలంగాణ నుంచి ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఏపీకి బదిలీచేస్తూ డీఓపీటీ ఆదేశాలు జారీ చేసింది. వీరిలో అభిషేక్ మహంతి ఒకరు. అయితే ఆయన తనను ఆంధ్రప్రదేశ్కు పంపడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు. ప్రస్తుతం క్యాట్లో అభిషేక్ మహంతి పిటీషన్ పై విచారణ కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో గతంలో డీవోపీటీ జారీ చేసిన ఉత్తర్వులపై క్యాట్లో విచారణ ముగిసేంత వరకూ ఆయన బదిలీని నిలిపేయాలని, అప్పటి వరకూ తెలంగాణలోనే ఆయన విధులు నిర్వహించవచ్చని హైకోర్టు(High Court) పేర్కొంది.రాష్ట్ర విభజన సమయంలో మహంతికి కేటాయించిన ఏపీలో ఆయన విధులలో చేరాలని కేంద్రం గత నెల ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఐపీఎస్ అభిషేక్ మహంతి క్యాట్ను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన క్యాట్ కేంద్ర ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో క్యాట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ, ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్పై జస్టిస్ అభినంద్కుమార్ షావిలి, జస్టిస్ తిరుమలాదేవీ ధర్మాసనం విచారణ చేపట్టింది. మహంతి గురువారం ఏపీలో చేర్చాల్చి ఉండటంతో నేటి (సోమవారం) వరకు కేంద్రం ఉత్తర్వులను నిలిపివేసింది.ఇది కూడా చదవండి: కర్నాటక ముస్లిం కోటా బిల్లుపై రాజ్యసభలో రసాభాస -
వేల కన్నీళ్లను మేం తుడవలేకపోవచ్చు, కానీ.. : సుప్రీం కోర్టు
‘‘ఏ సంస్థను మేం ఇక్కడ నిందించడం లేదు. అలాగే వాటి పని తీరును మేం తప్పుబట్టడం లేదు. దేశంలో వేల మంది కన్నీళ్లు పెడుతున్నారు. అంతమంది కన్నీళ్లను మేం తుడవలేకపోవచ్చు. కానీ, వాళ్ల సమస్యలను మేం ప్రస్తావిస్తాం. కచ్చితంగా సీబీఐ విచారణ జరిపిస్తాం. ఇది మాత్రం స్పష్టం’’ అంటూ సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. న్యూఢిల్లీ: బ్యాంకులకు, బిల్డర్లు.. డెవలపర్లు మధ్య నలిగిపోతూ ఏళ్ల తరబడి సొంతింటి కల కోసం ఆశగా ఎదురు చూస్తున్న కొందరు సుప్రీం కోర్టు తలుపు తట్టారు. ఈ పిటిషన్లను ఒక్కటిగా విచారణ జరిపిన జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం.. వాళ్లకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చింది. బిల్డర్లు, డెవలపర్లు తమ చేతికి ఇంటి తాళాలు ఇవ్వకపోయినా.. ఇంకోవైపు నుంచి బ్యాంకులు ఈఎంలు కట్టాలని వేధిస్తున్నాయని పలువురు పిటిషన్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో హోంబయ్యర్లను లోన్లకు మాధ్యమంగా ఉపయోగించుకుంటున్నారని.. ఒకవేళ బయ్యర్లు గనుక అభ్యంతరాలు వ్యక్తం చేస్తే బ్యాంకులు వాళ్లపై చర్యలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈ తరుణంలో ఈ వ్యవహారంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. కాలపరిమితితో కూడిన సీబీఐ దర్యాప్తునకు కచ్చితంగా ఆదేశిస్తామని తెలిపింది. అలాగే.. ఈ పనిని ఎలా చేపట్టాలనే దానిపై ఒక ప్రణాళికను దాఖలు చేయాలని కేంద్ర దర్యాప్తు సంస్థను కోరింది. ఈ క్రమంలో ఫైనాన్షియర్ల తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీపై జస్టిస్ సూర్యకాంత్ మండిపడ్డారు.బ్యాంకులు ఎలా పనిచేస్తాయో మాకు తెలుసు. సైట్లో ఒక్క ఇటుక కూడా పెట్టలేదని మీకు తెలుసు. అయినా కూడా 60 శాతం పేమెంట్ చేసేశారు. సైట్లో ఏం జరుగుతోందో తెలుసుకోకుండా ఇలా ఏలా చేశారు? అని ప్రశ్నించారు. ఇది ఇది లక్షల మంది జీవితాలకు సంబంధించిన అంశమని, అవసరమైతే మూలాల్లోకి వెళ్లి పరిశీలిస్తామని, సహాయం కోసం అమీకస్ క్యూరీని నియమించుకునే అవకాశాలు కూడా పరిశీలిస్తామని పేర్కొంటూ తదుపురి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. సాధారణంగా కేసులు ఎక్కువగా ఉన్నప్పుడే అమీకస్ క్యూరీని కోర్టు నియమించుకుంటుంది.ఇదిలా ఉంటే.. నేషనల్ క్యాపిటల్ రీజియన్లోని హోంబయ్యర్లకు కిందటి ఏడాది జులైలో తన ఆదేశాల ద్వారా భారీ ఊరట ఇచ్చింది సుప్రీం కోర్టు. ఇంటి తాళాలు అందుకోని యాజమానులపై ఈఎంఐ రికవరీ సహా బలవంతపు చర్యలు ఉండకూడదని స్పష్టం చేసింది. అయితే ఆ దేశాల ఆచరణకు నోచుకోవడం లేదు. పైగా ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్న సందర్భాలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. -
కొడాలి నానికి ఏపీ హైకోర్టులో ఊరట
అమరావతి, సాక్షి: ఏపీ మాజీ మంత్రి కొడాలి నానికి హైకోర్టులో ఊరట లభించింది. విశాఖలో తనపై నమోదు అయిన కేసును క్వాష్ చేయాలని ఆయన పిటిషన్ వేయగా.. 35(3) కింద నోటీసులు ఇచ్చి వివరాలు తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని మూడేళ్లపాటు చంద్రబాబు, లోకేశ్లపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారని కిందటి ఏడాది నవంబర్లో విశాఖ మూడో పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు వచ్చింది. దీంతో ఆయనపై కేసు నమోదు అయ్యింది. -
AP High Court: పోసాని కృష్ణమురళికి ఊరట
సాక్షి, అమరావతి: ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali)కి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై చిత్తూరు, విశాఖ జిల్లాల్లో నమోదైన కేసుల్లో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఉన్నత న్యాయస్థానం పోలీసులను గురువారం ఆదేశించింది.పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 30 ఫిర్యాదుల ఆధారంగా.. 16 కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్లను దూషించారంటూ ఇటు టీడీపీ, అటు జనసేన శ్రేణులు ఫిర్యాదులు చేయడంతో ఈ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో.. ఫిబ్రవరి 28వ తేదీన రాత్రి హైదరాబాద్లోని నివాసంలో పోసానిని అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. రిమాండ్ మీద ఆయన్ని రాజంపేట సబ్ జైలుకు తరలించారు. ఆపై పీటీ వారెంట్ల మీద పల్నాడు జిల్లా నరసరావుపేట, అటు నుంచి కర్నూల్ సెంట్రల్ జైలుకు రిమాండ్ మీద తరలించారు. అయితే ఉద్దేశపూర్వకంగా ఒక్కో జిల్లా తిప్పుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగానే.. తన పైన నమోదైన కేసులను కొట్టివేయాలంటూ పోసాని కృష్ణ మురళి క్వాష్ పిటిషన్(Posani Quash Petition) వేశారు. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు.. రెండు జిల్లాల్లో నమోదైన కేసుల నుంచి కాస్త ఊరట ఇచ్చింది. ఈ పిటిషన్పై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. -
సుప్రీంకోర్టులో వైఎస్సార్సీపీ నేతలకు ఊరట
సాక్షి, ఢిల్లీ: టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేష్, దేవినేని అవినాష్ సహా 24 మందికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ముందస్తు బెయిల్ను మంజూరు చేసింది. విచారణ జరిపిన జస్టిస్ సుధాంశు దులియా ధర్మాసనం.. షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు.. విచారణకు సహకరించాలని ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం తరువు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.. బెయిల్ను వ్యతిరేకించగా, ఈ కేసుపైనే ఎందుకు స్పెషల్ అటెన్షన్ అంటూ సిద్ధార్థ లూత్రాను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ.. ఇది రాజకీయపరమైన కేసు అని.. పాస్ పోర్ట్ను ఇప్పటికే సరెండర్ చేశామన్నారు. దాడికి పాల్పడ్డ 30 మందికి ఏపీ హై కోర్టు ఇప్పటికే రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. టీడీపీ ఆఫీస్పై దాడి జరిగిన రోజు అక్కడ లేరు. వీళ్ల ప్రమేయంపై ఎలాంటి ఆధారాలు లేవు’’ అని కపిల్ సిబల్ పేర్కొన్నారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి, న్యాయవాది అల్లంకి రమేష్ హాజరయ్యారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్రావుకు ఊరట
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్రావు ఊరట లభించింది. పంజాగుట్ట పీఎస్లో నమోదైన కేసు విచారణపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలిచ్చేవరుకూ అరెస్ట్ చేయొద్దని న్యాయస్థానం ఆదేశించింది.తన ఫోన్ ట్యాప్ చేశారంటూ రియల్టర్ చక్రధర్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. తదుపరి విచారణను హైకోర్టు మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాధా కిషన్ రావుకు కూడా ఊరట లభించింది. -
శిక్షాకాలం లేకుండా తీర్పిస్తా
న్యూయార్క్: అమెరికా రాజకీయ చరిత్రలో గతంలో ఎన్నడూ కనివినీ ఎరుగని వింత ఘట్టానికి న్యాయమూర్తి జువాన్ ఎం.మర్చన్ తెరలేపారు. క్రిమినల్ కేసులో దోషిగా తేలిన వ్యక్తిని శిక్షిస్తానంటూనే శిక్షాకాలం విధించబోనని చెప్పి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణంచేయడానికి సరిగ్గా పది రోజుల ముందు జనవరి పదో తేదీ ఉదయం 9.30 గంటలకు సంబంధిత తీర్పు చెప్తానని జడ్జి ప్రకటించారు. నీలిచిత్రాల తార స్టార్మీ డేనియల్కు అనైతిక నగదు చెల్లింపుల కేసులో దోషిగా తేలిన ట్రంప్కు పదో తేదీన శిక్ష ఖరారుచేస్తానని శుక్రవారం న్యూయార్క్లోని మాన్హట్టన్ కోర్టు జడ్జి వెల్లడించారు. ‘‘కారాగారంలో జైలుశిక్ష అనుభవించాల్సిన అవసరంలేకుండా ట్రంప్ను బేషరతుగా వదిలేస్తూ, కేసుకు ముగింపు పలుకుతూ తీర్పు రాస్తా. అన్కండీషనల్ డిశ్చార్జ్ తీర్పు వినేందుకు ట్రంప్ కుదిరితే ప్రత్యక్షంగా లేదంటే వర్చువల్గా కోర్టు ఎదుట హాజరవ్వాల్సి ఉంటుంది. ట్రంప్కు ఎలాంటి ప్రొబేషన్ పిరియడ్, జరిమానా విధించబోను’’అని జడ్జి చెప్పారు. గతంలో తనతో శృంగారం జరిపిన విషయం ఎవరికీ చెప్పకుండా దాచేందుకు స్టార్మీ డేనియల్కు ట్రంప్ తన లాయర్ ద్వారా 2016 ఏడాదిలో 1,30,000 డాలర్లు ఇచ్చారు. ఈ నగదును లెక్కల్లో తప్పుగా చూపారు. ఈమెకు నగదు ఇచి్చన విషయాన్ని దాచి ఆ నగదును ఎన్నికల జమా ఖర్చు కింద మార్చిరాశారు. ఈ అనైతిక చెల్లింపును ‘హష్ మనీ’గా పేర్కొంటారు. ఎన్నికల విరాళాలను ఇలా అక్రమంగా దుర్వినియోగం చేశారని ట్రంప్పై కేసు నమోదైంది. ఈ కేసులో 34 అంశాల్లో ట్రంప్ దోషిగా తేలిన విషయం విదితమే. జూలై 11వ తేదీనే ట్రంప్ కేసు ముగింపుకొచ్చినా అధ్యక్షునిగా గెలిచిన వ్యక్తికి క్రిమినల్ కేసు విచారణ నుంచి మినహాయింపు ఉంటుందంటూ ట్రంప్ న్యాయవాదులు ఇన్నాళ్లూ వాదిస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఇవన్నీ చెల్లవంటూ న్యాయమూర్తి తన తీర్పున వెలువరించేందుకు సిద్ధమయ్యారు. క్రిమినల్ కేసులో దోషిగా తేలి శిక్షను ఎదుర్కోబోతున్న మొట్టమొదటి అమెరికా మాజీ, కాబోయే అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్రలో నిలవబోతున్నారు. తీర్పు వచ్చాక న్యూయార్క్ చట్టాల ప్రకారం ట్రంప్ తన డీఎన్ఏ శాంపిల్ను రాష్ట్ర నేర డేటాబ్యాంక్కు అందించాల్సి ఉంటుంది. ఒకవేళ ట్రంప్కు జడ్జి శిక్ష విధిస్తే పదిరోజుల తర్వాత అధ్యక్షుడి హోదాలో తనకు తాను క్షమాభిక్ష ప్రసాదించుకునే అవకాశం ట్రంప్ లేదని అమెరికా రాజ్యాంగం చెబుతోంది. దేశ స్థాయిలో శిక్షలకు మాత్రమే అధ్యక్షుడు క్షమాభిక్ష ప్రసాదించగలడు. న్యూయార్క్ రాష్ట్ర కోర్టు ఇచ్చే తీర్పులకు ఇది వర్తించదు.ఇదీ చదవండి: డాలర్ డ్రీమ్స్పై మరో పిడుగు -
55 ఏళ్లు.. 150 కిలోమీటర్లు
కొందరు ఓటమి నుంచి విజయాలు అందుకుంటారు. మరికొందరు తమ జీవితంలో ఎదురైన ప్రతిబంధకాల నుంచి బయటపడేందుకు ఏదో సాధించాలనే తపనతో ముందుకు సాగుతారు. ఆ కోవకు చెందిన వారే స్విమ్మర్ గోలి శ్యామల. సామర్లకోటకు చెందిన శ్యామల భర్త మోహన్ ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి. కుమారుడితో కలిసి బతుకుదెరువు కోసం హైదరాబాద్లో యానిమేషన్ స్టూడియో పెట్టుకుని పలు సీరియళ్లు, సినిమాలకు పనిచేశారు. దురదృష్టవశాత్తూ స్టూడియో ద్వారా తీవ్రంగా నష్టపోవడంతో మానసికంగా మనోవేదనకు గురయ్యారు. దాంతో ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. 45 ఏళ్ళ వయసులో శరీరం సహకరించని స్థితిలో మనసును మళ్ళించేందుకు హైదరాబాద్లో స్విమ్మింగ్ నేర్చుకున్నారు. స్వతహాగా ఆమె స్విమ్మర్ కాదు... అయితేనేం, నాటి మనోవేదనకు ఉపశమనంగా ప్రారంభించిన స్విమ్మింగ్ నేడు ఐదు పదుల వయసులో ఆమెను సముద్రాలు దాటే సాహస యాత్రికురాలిగా తీర్చిదిద్దింది.150 కిలోమీటర్లు ఏడు రోజుల్లో అలవోకగా.. డిసెంబరు 28న విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద సముద్ర తీరంలో ఈత ప్రారంభించిన శ్యామల శుక్రవారం కాకినాడ తీరం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడుతూ యానిమేషన్ స్టూడియోలో నష్టం రావడంతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన తాను మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు స్విమ్మింగ్ప్రారంభించాననీ, కోచ్ జాన్ సిద్ధిక్ సహకారంతో జీరో లెవెల్ నుంచి 150 కిలోమీటర్ల స్విమ్ చేసేలా తయారయ్యానని సగర్వంగా చెప్పారు. 2021లో శ్రీలంక నుంచి ఇండియా వరకు రామ్సేతు దాటానని, తాజాగా ఫిబ్రవరిలో లక్షద్వీప్లో స్విమ్ చేశానన్నారు. బంగాళాఖాతంలో 150 కిలోమీటర్లు ఈదడం ద్వారా ఆసియా స్థాయిలో ఘనత సాధించానన్నారు. విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు ఈదాలని రెండేళ్ళ కిందటే నిర్ణయించుకున్నానని, అయితే రెండుసార్లు వాతావరణం అనుకూలించలేదనీ, ఎట్టకేలకు డిసెంబర్ 28న చిన్న ఫిషింగ్ బోట్, ఇద్దరు స్క్రూపర్ డ్రైవర్స్తోప్రారంభించానన్నారు. ఆర్కే బీచ్లో సముద్రంలో ప్రవేశించాక మళ్ళీ కాకినాడలో నేలపైకి వచ్చామన్నారు. మొదటి రోజు 7 గంటల్లోనే 30 కిలోమీటర్ల దూరం ఈదానన్నారు. తరువాత నుంచి ఈరోజు వరకు అనేక ఒడుదొడుకులను అధిగమిస్తూ ఈదుకుంటూ వచ్చానన్నారు. తల వెంట్రుకల నుంచి కాలి గోళ్ల వరకు స్విమ్మింగ్ వల్లే ఆరోగ్యం కలుగుతుందని, స్విమ్మింగ్ను స్పోర్ట్గా కాకుండా సర్వైవల్ స్పోర్ట్గానే చెబుతానన్నారు. మహిళలు ఈత చేయడం వలన గైనిక్ సమస్యలు తగ్గుతాయన్నారు. హేళన చేసిన వారే పొగుడుతున్నారుసముద్రంలో ఈత కోసం తొలి ప్రయత్నం చేసినప్పుడు చాలామంది హేళన చేశారు. కొందరు యూ ట్యూబ్లో కామెంట్లు పెట్టారు. వాటిని పట్టించుకోలేదు. అరేబియా సముద్రం ఈదాను, శ్రీలంక నుంచి ఇండియా ఈత మరపురానిది, మేదీ స్ఫూర్తితో లక్షద్వీప్లో 18గంటల పాటు 48 కిలోమీటర్లు ఈదాను. వైజాగ్ నుంచి కాకినాడ 150 కిలోమీటర్లు ఈదగలిగినందుకు చాలా హ్యాపీగా ఉంది. – గోలి శ్యామల – స్విమ్మర్. – లక్కింశెట్టి శ్రీనివాసరావుసాక్షి ప్రతినిధి.. కాకినాడ.ఫోటోలు: విశ్వనాధుల రాజబాబు. కాకినాడ రూరల్ -
చలికాలంలో కీళ్ల నొప్పులా? ఇవిగో ది బెస్ట్ టిప్స్!
చలికాలం రాగానే ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయి. దీంతో జలుబు, గొంతునొప్పి, జ్వరం లాంటి వివిధ వ్యాధుల బారిన పడటం సాధారణంగా. అలాగే చల్లని వాతావరణం వల్ల కీళ్ల నొప్పులు పెరుగుతాయని, ఆర్థరైటిస్ లక్షణాలు మరింత తీవ్రమవుతాయని కూడా నమ్ముతారు. అయితే ఇందులో నిజమెంత? చలికాలానికి, మోకాళ్ల నొప్పులకు సంబంధం; మరి ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తెలుసుకుందాం.పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, వివిధ రకాల వాతావరణ పరిస్థితుల్లో మన జీవన పరిస్థతులకనుగుణంగానే శారీరక మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. జర్నల్ సెమినార్స్ ఇన్ ఆర్థరైటిస్ , అండ్ రుమాటిజంలో ప్రచురించిన 2024 అధ్యయనం ప్రకారం వాతావరణ మార్పులు నేరుగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా ఆస్టియో ఆర్థరైటిస్ , ఇతక కీళ్ల నొప్పులను పెద్దగా ప్రభావితం చేయవని వెల్లడించింది.అయితే చల్లని వాతావరణం కీళ్లను గట్టిపరుస్తుంది ,రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది, చిన్న కదలికలను కూడా కష్టతరం చేస్తుంది. తక్కువ తేమతో కూడిన అధిక ఉష్ణోగ్రతలు గౌట్ మంట ప్రమాదాన్ని రెట్టింపు చేస్తాయని అధ్యయనం కనుగొంది. ఆర్థరైటిస్తో బాధపడే వ్యక్తులు శీతాకాలంలో వాతావరణ ఒత్తిడి మార్పు వల్ల కీళ్ళు సాధారణం కంటే ఎక్కువగా ఉబ్బి, నొప్పి పెరగడానికి దారితీస్తుందని తేలింది.తక్కువ బారోమెట్రిక్ పీడనం శరీరంలోని కణజాలాలు నరాలపై ఒత్తిడిని పెంచుతుంది.మరి కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే ఏం చేయాలి?వింటర్ సీజన్లో శారీరక శ్రమ తగ్గడం వల్ల ఎముకల మధ్య కదలిక తగ్గిపోతుంది. దీంతోపాటు విటమిన్ డి లోపం కూడా కీళ్ల నొప్పులకు మరో కారణం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కండరాలు దృఢంగా ఉండే వ్యాయామాలను ఎంచుకోవాలి.వేడి నీటి కొలనులో ఈత కొట్టడం లేదా ఇంట్లోనే సైక్లింగ్ చేయడం వంటి తక్కువ-ప్రభావ వ్యాయామాలు ఉత్తమం.ఎక్కువసేపు ఒకే భంగిమలో ఉండకుండా, కదలిక ఉండేలా చూసుకోండి. .యోగ, ధ్యానం లాంటివి చేయాలి. కీళ్లలో నొప్పినుంచం ఉపశమనం కలిగే , దృఢత్వాన్ని పెంచే ఆసనాలు తెలుసుకొని ఆచరించాలి. చలికాలం కదా అశ్రద్ధ చేయకుండా, తగినంత నీరును తాగాలి. చలికాలం వచ్చిందంటే వృద్ధులకే కాదు, యుక్తవయస్సులో ఉన్నవారిలో కూడా కొంతమందికి మోకాళ్ల నొప్పులు మొదలవుతాయి రక్త ప్రసరణ మెరుగుపరచడానికి , దృఢత్వాన్ని తగ్గించడానికి వెచ్చని బట్టని ధరించాలి. వేడి నీటి స్నానం మంచిది.నొప్పి ఉన్న ప్రదేశంలో ఉపశమనం కోసం హీట్ ప్యాడ్లను వాడవచ్చు.కీళ్ల నొప్పులకు మరో చక్కటి ఉపశమన ప్రక్రియ మసాజ్. ఇది చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది.నువ్వుల నూనె, కొబ్బరి నూనె, లేదా కొన్ని ఆయుర్వేద తైలాలతో పది నిమిషాల పాటు మసాజ్ చేసుకుంటే ఉపశమనం లభిస్తుంది. నోట్: శారీరకంగా చురుకుగా ఉండటం, హీట్ థెరపీ, చక్కటి ఆహారం ద్వారా చాలావరకు సమస్యలనుంచి తప్పించుకోవచ్చు. దీంతో పాటు సమస్య తీవ్రతను గుర్తించి, సంబంధిత వైద్యులను సంప్రదించి, చికిత్స తీసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు -
రేపిస్టులకు, హంతకులకు మరణశిక్షే: ట్రంప్
వాషింగ్టన్: మరణశిక్షను కఠినంగా అమలు చేస్తానని అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ మంగళవారం ప్రకటించారు. మరణశిక్ష పడిన ఫెడరల్ ఖైదీ శిక్షలను తగ్గించిన జో బైడెన్పై ట్రంప్ విరుచుకుపడ్డారు. ఉరిశిక్ష పడిన 40 మందిలో 37 మందికి పెరోల్ లేకుండా యావజ్జీవ కారాగార శిక్షను మారుస్తూ సోమవారం బైడెన్ తీసుకున్న నిర్ణయం అర్థరహితమని, బాధిత కుటుంబాలను అవమానించడమేనని ట్రంప్ విమర్శించారు. హింసాత్మక రేపిస్టులు, హంతకులు, రాక్షసుల నుంచి అమెరికన్ కుటుంబాలను, పిల్లలను రక్షించేందుకు మరణశిక్షను పకడ్బందీగా అమలు చేయాలని న్యాయశాఖను ఆదేశిస్తానని ట్రంప్ ప్రకటించారు. ‘మన దేశంలో అత్యంత దారుణమైన హంతకుల్లో 37 మందికి జో బైడెన్ మరణశిక్షను తగ్గించారు. ఇది నమ్మశక్యం కాని నిజం. దీనివల్ల బాధితుల బంధుమిత్రులు మరింత కుంగిపోతారు’అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాటా్ఫమ్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. మరణశిక్షపై బైడెన్ తాత్కాలిక నిషేధం ఫెడరల్ మరణశిక్షపై బైడెన్ తాత్కాలిక నిషేధం విధించారు. ఉరిశిక్ష కోసం ఎదురుచూస్తున్న 40 మంది ఫెడరల్ ఖైదీల్లో 37 మందికి పెరోల్ అవకాశం లేకుండా జీవిత ఖైదుగా మారుస్తున్నట్లు అధ్యక్షుడు బైడెన్ సోమవారం ప్రకటించారు. 2013 బోస్టన్ మారథాన్ బాంబర్లలో ఒకరు, 2018లో 11 మంది యూదు ఆరాధకులను హత్య చేసిన దుండగుడు, 2015లో తొమ్మిది మంది నల్లజాతి చర్చిలలో కాల్పులు జరిపిన శ్వేతజాతి ఆధిపత్యవాదిని ఆయన తన ఉత్తర్వుల నుంచి మినహాయించారు. ఈ ఖైదీల్లో తోటి ఖైదీలను హత్య చేసిన తొమ్మిది మంది, బ్యాంకు దోపిడీల సమయంలో చేసిన హత్యలకు నలుగురు, జైలు గార్డును చంపిన కేసులో ఒకరు ఉన్నారు. బైడెన్ నిర్ణయంపై కొన్ని బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే ఫెడరల్ ఖైదీలకు మరణశిక్షను విధించడంలో కాబోయే అధ్యక్షుడు ట్రంప్కు మరింత కష్టతరం చేయాలని కోరుతూ న్యాయవాద గ్రూపుల నుంచి వచి్చన ఒత్తిడితో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉగ్రవాదం, విద్వేష ప్రేరేపిత సామూహిక హత్యలు కాకుండా ఇతర కేసుల్లో ఫెడరల్ మరణశిక్షలపై విధించిన నిషేధానికి అనుగుణంగా వారి శిక్షలను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చడం సమంజసమని బైడెన్ అన్నారు. ఏసీఎల్యూ, యూఎన్ కాన్ఫరెన్స్ ఆఫ్ కాథలిక్ బిషప్స్ ఈ నిర్ణయాన్ని అభినందించాయి.అధ్యక్షుడి ప్రమేయం ఎంత? క్రిమినల్ కేసుల్లో ప్రతివాదుల కోసం ఫెడరల్ ప్రాసిక్యూటర్లు కోరే శిక్షలను నిర్దేశించడంలో లేదా సిఫారసు చేయడంలో అధ్యక్షుల ప్రమేయం ఉండదు. అయినప్పటికీ ట్రంప్ చాలా కాలంగా న్యాయ శాఖ కార్యకలాపాలపై మరింత ప్రత్యక్ష నియంత్రణను కోరుతున్నారు. తాను అధికారంలోకి రాగానే మరణశిక్షను అమలు చేయా లని విభాగాన్ని ఆదేశిస్తానని అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన ప్రకటించారు. పోలీసు అధికారులను చంపినవారికి, మాదకద్రవ్యాలు, మావన అక్రమ రవాణాకు పాల్పడినవారికి, యూఎస్ పౌరులను చంపిన వలసదారులకు ఫెడరల్ మరణశిక్షను విస్తరించాలని ఎన్నికల ప్రచారంలో పదేపదే చెప్పారు. మరణశిక్షను ఒక ముఖ్యమైన సాధనంగా తాను భావిస్తున్నానని, దానిని ఉపయోగించాలనుకుంటున్నానని ట్రంప్ చాలా స్థిరంగా చెప్పారు. అయితే ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం ఆచరణలో ఇది జరుగుతుందా? అనేది కష్టమైన విషయం. హత్యకు పాల్పడిన వ్యక్తులకు మరణశిక్షను ఒకప్పుడు చాలా మంది అమెరికన్లు సమరి్ధంచారు. కానీ కొన్ని దశాబ్దాలుగా ఈ మద్దతు తగ్గుతోంది. అక్టోబర్లో జరిగిన ఓ సర్వేలు.. సగం మంది అమెరికన్లు మరణశిక్షను వ్యతిరేకించారు. 2007లో నిర్వహించిన ఓ సర్వేలో మాత్రం 10 మంది అమెరికన్లలో 7 మంది మరణశిక్షను సమరి్థంచారు. -
TG:పీజీ మెడికల్ విద్యార్థులకు హైకోర్టులో ఊరట
సాక్షి,హైదరాబాద్:మెడికల్ పీజీ అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ స్థానికత ఉండి ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ చదవినా, తెలంగాణ స్థానికత లేకుండా ఇక్కడ ఎంబీబీఎస్, బీడీఎస్ చదవిన వారిని కూడా స్థానికులుగా పరిగణించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు సంబంధించిన ప్రభుత్వ జీఓను హైకోర్టు నిలిపివేసింది. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 140ని సవరణ చేయాలని గతంలోనే ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ జీవోను సవాల్ చేస్తూ మెడికల్ పీజీ విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. జీవో 140 ప్రకారం 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలంగాణలో చదవడంతోపాటు ఎంబీబీఎస్ కూడా ఇక్కడే పూర్తి చేసినవారికి తెలంగాణ స్థానికత కల్పిస్తారు. ఈ జీవో అమలును ప్రస్తుతం హైకోర్టు నిలిపివేసింది. -
సజ్జల రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట
సాక్షి,గుంటూరు: వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను మంగళవారం(డిసెంబర్10) ఏపీ హైకోర్టు విచారించింది. సజ్జల కేసు విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు గతంలో ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు మరో రెండు వారాలపాటు పొడిగించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్పీ నేతలకు వేధింపులు ఎక్కువయ్యాయని సజ్జల తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తనపై 41ఏ నోటీసుకు వీలులేని సెక్షన్లు పెట్టి అరెస్టు చేయాలని చూస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని సజ్జల ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఇదీ చదవండి: బరితెగించిన ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ పోరాటం -
మా ఆశలు చచ్చిపోయాయి
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం స్పష్టించిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థిని ఎం.రిషితేశ్వరి ఆత్మహత్య కేసును కొట్టివేస్తూ గుంటూరు కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. వరంగల్కు చెందిన రిషితేశ్వరి గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఏఎన్యూలో బ్యాచిలర్ ఆఫ్ అర్కిటెక్చర్ (బీఆర్క్) చదువుతూ, 2015 జూలై 14న బాలికల వసతిగృహంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ర్యాగింగ్, వేధింపులవల్లే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలి తల్లిదండ్రులు అప్పట్లో పెదకాకాని పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు. అయితే, నిందితులపై మోపిన నేరాన్ని ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోవడంతో కేసును కొట్టేస్తూ గుంటూరు ఐదో అదనపు జిల్లా జడ్జి కె. నీలిమా తీర్పు వెలువరించారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు/నగరంపాలెం: ‘కోర్టు తీర్పుతో మా ఆశలు చచ్చిపోయాయి. మాకు పూడ్చలేని బాధను మిగిల్చారు. న్యాయం జరుగుతుందని తొమ్మిదేళ్లుగా కోర్టుల చుట్టూ తిరిగాం. సాక్ష్యాధారాలు లేకపోవడంతో కేసు కొట్టేశామని చెప్పడం ఎంతో బాధగా ఉంది. మా కుమార్తె తన డైరీని స్వయంగా రాసింది. ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా రిషితేశ్వరినే రాసిందని తేల్చిచెప్పింది. అయినా మా కుమార్తెకు అన్యాయం జరిగింది. ఇందులో 170 మంది సాక్షులున్నారు. కానీ, ఏ ఒక్కరూ వారికి కని పించలేదు. మాకింక దిక్కెవరు? గంగలో దూకడమే శరణ్యం. పాప రాసిన డైరీలను ఎందుకు సాక్ష్యంగా తీసుకోలేదో అర్థంకావడంలేదు. గతంలో సీఎం చంద్రబాబు, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, జిల్లా ఎస్పీకి డైరీ కాపీలు అందజేసినా పరిగణలోకి తీసుకోలేదు’.. ఆచార్య నాగార్జున వర్సిటీ బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసు కొట్టేస్తూ గుంటూరు కోర్టు శుక్రవారం ఇచ్చిన తీర్పు అనంతరం మృతురాలి తల్లిదండ్రులు దుర్గాబాయి, మురళీకృష్ణ ఆవేదన ఇది. తీర్పు వెలువడగానే కోర్టు ప్రాంగణంలో కన్నీరుమున్నీరైన వారిని చూసి అందరి గుండెలు బరువెక్కాయి.కేసు పూర్వాపరాలు..రిషితేశ్వరి ఆత్మహత్య ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బీసీ సామాజికవర్గానికి చెందిన విద్యార్థిని బలవన్మరణానికి కారణమైన వర్సిటీ అధికారులు, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోకుండా అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. విద్యార్థిని మృతికి కారణమైన అప్పటి ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ జి.బాబు రావుతోపాటు వర్సిటీ ఉన్నతాధికారులపై కేసు న మోదు చేయాలని, ర్యాగింగ్కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, రిషితేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజా, విద్యార్థి సంఘాలు పెద్దఎత్తున ఉద్యమం చేశాయి. చంద్రబాబు నిర్లక్ష్యం వీడాలని అసెంబ్లీలోనూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ ఉద్యమాన్ని అణచివేసేందుకు నాటి ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. చివరికి.. ఈ పోరాటాల ఫలితంగా టీడీపీ ప్రభుత్వం విధిలేని పరిస్థితుల్లో ప్రిన్సిపాల్ బాబురావుపై చర్యలు తీసుకుని, ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థులను సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో సుదీర్ఘకాలం విచారణ జరిగిన అనంతరం శుక్రవారం గుంటూరు కోర్టు కేసును కొట్టివేసింది. అన్నీ సమర్పించాం, అప్పీలుకు వెళ్లాలి..రిషితేశ్వరి డైరీల్లో ఎవరెవరు ర్యాగింగ్కు పాల్పడ్డారు, మానసికంగా వేధించిన వారి పేర్లు స్పష్టంగా ఉ న్నాయి. ఈ తీర్పు న్యాయమైంది కాదని భావిస్తున్నాం. హైకోర్టుకు వెళ్లే ఆలోచన చేస్తాం. పోలీసులు అప్పీల్ చేయాలి. – వై.కోటేశ్వరరావు, స్పెషల్ పీపీగుండెఘోషకు రిషితేశ్వరి అక్షర రూపం ఇదే..రిషితేశ్వరి ఆత్మహత్య తరువాత ఆమె గదిలో డైరీ లభించింది. అందులో రిషితేశ్వరి స్వహస్తాలతో రాసుకున్న కొన్ని ఘటనలు, తాను ఎదుర్కొన్న ఆవేదన, గుండెఘోషను కూలంకషంగా అక్షర రూపంలో వివరించింది. ‘మై లాస్ట్ నోట్’ పేరుతో తన స్వహస్తాలతో రిషితేశ్వరి రాసిన కొన్ని ముఖ్యాంశాలు ఏమిటంటే..⇒ నవ్వు!!! నవ్వు!!! నవ్వు!!! ఈ నవ్వు అంటే నాకు చాలా ఇష్టం. అందుకే నేను ఎప్పుడూ నవ్వుతూ ఉంటా. అందరిని నవ్విస్తూ ఉంటా. కానీ, ఆ నవ్వే నాకు పెద్ద సమస్య అయింది.⇒ మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. నిజానికి పిచ్చి. అంత ప్రేమగా పెంచాడు మా నాన్న. నాకు చదువు అంటే ఇష్టం. ఈ చదువు కోసం నా ఊరు వదిలి ఇక్కడకొచ్చా. ⇒ ఇలా వచ్చిన నన్ను.. నా సీనియర్స్లో కొంతమంది చదువు వైపు కాకుండా ప్రేమవైపు లాగడానికి ప్రయత్నించారు. నేను ఆ దారిలోకి వెళ్లలేదు. దాంతో నా మీద రూమర్స్ క్రియేట్ చేశారు. అది వింటేనే నా మొహంలో నవ్వు మాయమై పోయేది.. ఏడుపు కూడా వచ్చేది.⇒ నేను నాన్న దగ్గర ఏమీ దాచేదాన్ని కాదు.. కాని ఇక్కడకు వచ్చాక చెబితే ఏమైపోతారో అని దాయాల్సి వస్తోంది. నాకు నరకయాతన కనిపిస్తోంది. ⇒ నా ఆఖరి కోరిక ఒక్కటే. నా చావుకు కారణం ఎవరో వాళ్లకు తెలుసు. వాళ్లు వాళ్ల తప్పు తెలుసుకుంటే చాలు. ఇంకెవ్వరినీ ఇలా (నాలా) బాధపెట్టకుంటే చాలు.⇒ ఏ అమ్మాయిలూ యూనివర్సిటీలో ర్యాగింగ్ ఉండదని అనుకోవద్దు. ఏ తల్లిదండ్రులు పిల్లల్ని ఇంత ప్రేమగా పెంచవద్దు. మీకు చెప్పలేక వాళ్లలో వాళ్లు దాచుకోలేక నరకం కనిపిస్తుంది.⇒ అమ్మా, నాన్న జాగ్రత్త! నాన్న ప్లీజ్ ఏడవకండి. నేను ఎప్పుడూ మీ దగ్గర్లోనే ఉంటా. ట్రై టూ డొనేట్ మై ఆర్గాన్స్ ఇఫ్ దే ఆర్ ఇన్ గుడ్ కండీషన్.. (నా అవయవాలు పనిచేసే స్థితిలో ఉంటే వాటిని దానం చేయడానికి ప్రయత్నించండి) అంటూ చాలా అంశాలు రాసింది. -
ట్రంప్కు మరో కేసు నుంచి ఊరట
వాషింగ్టన్:అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్నకు కేసుల్లో వరుసగా ఊరట లభిస్తోంది. ట్రంప్పై ఉన్న 2020 నాటి అధ్యక్ష ఎన్నికల ఫలితాల తారుమారుకు యత్నించిన కేసును కొట్టివేస్తునట్లు తాజాగా కోర్టు తీర్పిచ్చింది. తన క్లైంట్పై ఉన్న 2020 ఎన్నికల కేసును కొట్టివేయాలని ట్రంప్ తరఫు న్యాయవాది జాక్ స్మిత్ కోర్టును కోరారు. ఈ విజ్ఞప్తిని జడ్జి అంగీకరించారు.కేసును తొలగించడం సముచితమేనని,ఈ తీర్పు అధ్యక్ష పదవిలో ఉన్నంతవరకు మాత్రమేనని కోర్టు స్పష్టం చేసింది. తనపై కేసును కొట్టివేయడంపై ట్రంప్ స్పందించారు. తనపై కేసులన్నీ చట్ట విరుద్ధమైనవని, వీటి కోసం డెమొక్రాట్లు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేశారని సోషల్మీడియాలో పోస్టుపెట్టారు. 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా బరిలో దిగిన ట్రంప్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. -
ట్రంప్నకు కేసుల నుంచి భారీ ఊరట..! అధ్యక్షుడిగా ఎన్నికైనందునే..
వాషింగ్టన్:అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్నకు అన్ని క్రిమినల్ కేసుల నుంచి ఉపశమనం లభించనుంది. ముఖ్యంగా 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ట్రంప్ ప్రయత్నించిన కేసు ముందుకు వెళ్లేలా కనిపించడం లేదు. వాషింగ్టన్ కోర్టులో ప్రస్తుతం నడుస్తున్న ఈ కేసులో విచారణ డెడ్లైన్లన్నింటినీ పక్కన పెడుతున్నట్లు జడ్జి తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఫెడరల్ ప్రాసిక్యూటర్ల విజ్ఞప్తి మేరకే ఈ ఆదేశాలిచ్చినట్లు జడ్జి తెలిపారు.ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనందున.. అధ్యక్షుడిని క్రిమినల్ కేసుల్లో ప్రాసిక్యూట్ చేయడం కుదరనందునే విచారణను వాయిదా వేయాలని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు కోర్టును కోరారు. దీంతో ట్రంప్పై కేసు విచారణ డెడ్లైన్లను పక్కన పెడుతున్నట్లు జడ్జి ఆదేశాలిచ్చారు. కాగా శృంగార తార స్టార్మీ డేనియల్కు సంబంధించి హష్ మనీ కేసులో ట్రంప్కు ఇప్పటికే దోషిగా తేలిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: అమెరికా నుంచి వెళ్లిపోతా.. మస్క్ కుమార్తె -
కొత్త డివైస్ : ఇది కట్టుకుంటే నొప్పులు మాయమట!
జిమ్లో వ్యాయామం చేసేవారికి, మైదానాల్లో ఆటలాడే వారికి ఒక్కోసారి కీళ్లు పట్టేసి నొప్పులు తలెత్తడం మామూలే! ఇళ్లల్లో రోజువారీ పనులు చేసుకునేటప్పుడు కూడా ఒక్కోసారి నొప్పులు తలెత్తుతుంటాయి. ఇలాంటి నొప్పులకు నొప్పినివారణ మాత్రలు వాడటం, పైపూతగా ఆయింట్మెంట్లు పూసుకోవడం వంటివి చేస్తుంటారు. ఇకపై వాటితో పని లేకుండా, ఈ ఫొటోలో కనిపిస్తున్న పరికరాన్ని నొప్పి ఉన్నచోట పెట్టుకుని, దీనికి ఉన్న బెల్టుతో బిగించి కట్టుకుంటే చాలు, సత్వరమే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అమెరికన్ కంపెనీ ‘థెరాబాడీ’ ఇటీవల ‘రికవరీ థెర్మ్క్యూబ్’ పేరిట ఈ పరికరాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో మనం కోరుకున్న విధంగా చల్లదనం లేదా వెచ్చదనాన్ని ఎంచుకోవడానికి స్విచ్లు ఉంటాయి. నొప్పి ఉన్న చోట ఈ క్యూబ్ను అదిమిపెట్టి బిగించి బెల్ట్ కట్టుకుంటే చాలు, రెండు గంటల్లోనే పూర్తిగా నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇవీ చదవండి : చలి పులి వచ్చేస్తోంది నెమ్మదిగా...ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!నో జిమ్.. నో డైటింగ్ : ఏకంగా 20 కిలోల బరువు తగ్గింది! -
వరద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం: సీఎం రేవంత్
సాక్షి,ఖమ్మం: వరద బాధితులకు తక్షణసాయం కింద రూ. 10 వేలు ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఖమ్మం వరదల ప్రాంతాల్లో సీఎం రెండో రోజు పర్యటన సందర్భంగా మీడియాతో చిట్చాట్ మాట్లాడారు. అనంతరం మహబూబాబాద్లో పర్యటించి వరద బాధితులను ఉద్దేశించి మాట్లాడారు. ‘ఖమ్మంలో కూడా వరదలు ఆక్రమణల వల్లే వచ్చాయి. మున్నేరు రిటెయినింగ్ వాల్ ఎత్తు పెంచడంపై ఇంజనీర్లతో మాట్లాడి చూస్తాం. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ద్వారా గుర్తించి అవసరం అనుకుంటే ఆక్రమణలు తొలగిస్తాం. మిషన్ కాకతీయ అనేదే కమీషన్ కాకతీయ అని దివంగత మంత్రి నాయిని నర్సింహారెడ్డి అసెంబ్లీలో చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పటిష్టం చేశాం అన్నారు.మరి గతంలో తెగని చెరువులు ,ఇప్పుడు ఎందుకు తెగుతున్నాయి.75 సంవత్సరాలలో ఇంత వర్షం ఎప్పుడూ పడలేదు. అంత విపత్తు జరిగినా ప్రాణ నష్టాన్ని తగ్గించామంటే అది ప్రభుత్వ ముందు చూపే. వరదలపై హరీశ్రావు మాట్లాడుతున్నారు. ముందు మీ పార్టీ నాయకుడు పువ్వాడ అజయ్ ఆక్రమించిన హాస్పిటల్లో కాలువల విషయంలో హరీశ్రావు నిలబడి తొలగించి ఆదర్శంగా ఉండాలి. కేంద్రం ప్రభుత్వానికి లేఖ రాశాం. వారి నుంచి స్పందన రావాలి. రాష్ట్ర ప్రభుత్వం తరపున మాత్రం మృతి చెందిన వారికి రూ. 5 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తున్నాం. వరదల సహాయంతో మా మంత్రులు ప్రజలతో ఉంటున్నారు. మా ప్రజలు మమ్ముల్ని అడుగుతారు.. నిలదీస్తారు.. వారు మా వారే.. మాకు ఓటు వేసి గెలిపించారు. ఫాంహౌస్లో పడుకున్న వారిని అడుగుతారా? ఇటువంటి విపత్తుల సమయంలో గతంలో ముఖ్యమంత్రులు హామీలు ఇచ్చారు. అమలు చేయలేదు. మాది చేతల ప్రభుత్వం. గత ప్రభుత్వ హామీలు కూడా మేమే అమలు చేస్తాం. రాష్ట్రానికి కూడా ప్రత్యేకంగా విపత్తు నిర్వహణ సంస్థ సిద్ధం చేస్తున్నాం’అని సీఎం తెలిపారు. మహబూబాబాద్లో సీఎం కామెంట్స్.. యువ సైంటిస్టు అశ్విని కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అశ్విని సోదరునికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాంఆకేరు వాగు పొంగిన ప్రతిసారి మూడు తండాలు మునుగుతున్నాయి.వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకుంటాం. -
బిగ్ డిబేట్కు ముందు ట్రంప్కు ఊరట
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల క్యాంపెయిన్లో భాగంగా నిర్వహిస్తున్న బిగ్ డిబేట్కు కొద్ది గంటగల ముందు రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ఊరట లభించింది. హష్ మనీ కేసులో భాగంగా న్యూయార్క్లోని మన్హట్టన్ కోర్టు గతంలో ట్రంప్పై విధించిన గ్యాగ్(సైలెన్స్) ఆంక్షలను కొద్దిగా సడలించింది.సవరించిన ఆర్డర్ ప్రకారం హష్ మనీ కేసులో సాక్షులపై మాట్లాడడానికి ట్రంప్నకు అనుమతి లభించింది. అయితే కేసులో ప్రాసిక్యూటర్లు, ఇతర వ్యక్తులపై కామెంట్ చేయడానికి మాత్రం కోర్టు అనుమతివ్వలేదు. త్వరలో జరగబోయే డిబేట్లో డెమొక్రాట్ అభ్యర్థి, ప్రస్తుత దేశ అధ్యక్షుడు జో బైడెన్ మాటల దాడిని ఎదుర్కొని ధీటుగా సమాధానం చెప్పేందుకు కోర్టు విధించిన ఆంక్షలు అడ్డొస్తున్నాయని ట్రంప్ లాయర్లు వాదించారు. ట్రంప్ లాయర్ల అభ్యర్థనకు ప్రాసిక్యూటర్లు కూడా వ్యతిరేకించకపోవడంతో కోర్టు ఆంక్షలను కొంత మేర సడలించింది.హష్ మనీ కేసులో ట్రంప్ దోషి అని కోర్టు ఈ ఏడాది మే30న తేల్చింది. ఈ కేసులో కోర్టు జ్యూరీ తుది తీర్పు వెలువరించడంతో పాటు శిక్షను ఖరారు చేయాల్సి ఉంది. తనను లైంగికంగా వాడుకొని ఆ విషయం బయటికి చెప్పకుండా ఉండేందుకు డబ్బులు చెల్లించాడని పోర్న్స్టార్ స్టార్మీ డేనియల్స్ ట్రంప్పై హష్ మనీ కేసు పెట్టింది. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక ఘట్టంగా చెబుతున్న ట్రంప్, జో బైడెన్ల బిగ్ డిబేట్ గురువారం(జూన్27)న జార్జియాలో జరగనుంది. పలు అంశాలపై 90 నిమిషాల పాటు జరగనున్న ఈ డిబేట్లో జో బైడెన్, ట్రంప్ పలు కీలక అంశాలపై ముఖాముఖి చర్చించనున్నారు. -
London: వికిలీక్స్ ఫౌండర్కు యూకే కోర్టులో ఊరట
లండన్: స్విస్ బ్యాంకుల్లో నల్లధనం దాచుకున్న వారి వివరాలతో పాటు పలు సంచలన రహస్యాలు బహిర్గతం చేసిన వికీలిక్స్ ఫౌండర్ జూలియన్ అసాంజెకు యునైటెడ్ కింగ్డమ్ (యూకే) కోర్టులో ఊరట లభించింది.అసాంజెను అమెరికాకు అప్పగించాలని కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్కు వెళ్లొచ్చని లండన్లోని రాయల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్ తాజాగా తీర్పు చెప్పింది. తదుపరి విచారణను మే 20కి వాయిదా వేసింది. తదుపరి విచారణలో గనుక అసాంజెను ఎందుకు అప్పగించాలో సంతృప్తికర కారణాలు అమెరికా చెప్పలేకపోతే అసాంజె అప్పగింత విషయంలో కోర్టు మళ్లీ మొదటి నుంచి కేసు విచారిస్తుంది. దీంతో అసాంజె అప్పగింత సుదీర్ఘంగా వాయిదాపడే అవకాశం ఉంది. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్పై అమెరికా జరిపిన దాడులకు సంబంధించిన పత్రాలను లీక్చేశారని అసాంజెపై అమెరికాలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణ కోసమే అసాంజెను అప్పగించాలని అమెరికా కోరుతోంది. ఇదీ చదవండి.. మిస్ యూనివర్సిటీ పోటీలు.. సౌదీ అరేబియా సంచలన నిర్ణయం -
తెలంగాణ ఇంటర్బోర్డు కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో.. తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షకు ఐదు నిమిషాలు ఆలస్యమైనా విద్యార్థుల్ని పరీక్షకు అనుమతించాలని నిర్ణయించింది. ఈ మేరకు.. నిర్దిష్ట కారణాల వల్ల విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా చేరుకుంటే ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ను అనుమతించాలని ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారులు ఆయా జిల్లాల అధికారులకు, సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్లకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షలకు విద్యార్థులు ఉదయం 8:45 గంటలకు తమ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 9 గంటల తర్వాత ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ కు అనుమతి చేస్తామన్నారు. ఇప్పటివరకు పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించకుండా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిబంధన కారణంగా విద్యార్థులు నష్టపోతున్నారనే విమర్శలు ఎక్కువగా వినవస్తున్నాయి. మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్థి ఈ నిబంధన కారణంగా పరీక్షకు అధికారులు అనుమతించకపోవడంతో.. తండ్రికి సూసైడ్ లేఖ రాసి బలవన్మరణానికి పాల్పడడం తీవ్ర విషాదాన్ని నింపింది. -
ఐటీ కంపెనీ కాగ్నిజెంట్కు భారీ ఊరట!
అమెరికాకు చెందిన మల్టీనేషనల్ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్కు భారీ ఊరట దక్కింది. రూ. 4,300 కోట్ల పన్ను బకాయిలకు బదులుగా కంపెనీకి చెందిన రూ. 2,956 కోట్ల బ్యాంక్ డిపాజిట్లను ఆదాయపు పన్ను శాఖ లిక్విడేట్ చేయడంపై మద్రాస్ హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. పన్ను బకాయిల కోసం నాలుగు వారాల్లోగా రూ.1,500 కోట్లు చెల్లించాలని, ఆస్తి భద్రతగా పెట్టాలని జస్టిస్ ఆర్ మహదేవన్, జస్టిస్ మహమ్మద్ షఫీక్లతో కూడిన డివిజన్ బెంచ్ కాగ్నిజెంట్ను ఆదేశించింది. ఈ షరతులను పాటించడంలో విఫలమైతే కంపెనీకి ఇచ్చిన మధ్యంతర స్టే రద్దవుతుందని కోర్టు స్పష్టం చేసింది. దీంతో పాటు రూ. 1,500 కోట్ల చెల్లించడానికి, ఆస్తిని భద్రతగా పెట్టడం కోసం బ్యాంకు డిపాజిట్లపై పెట్టిన తాత్కాలిక స్తంభనను విడుదల చేయాలని కోర్టు ఐటీ శాఖను ఆదేశించింది. ఈ వ్యవహారం 2017-18లో కాగ్నిజెంట్ చేపట్టిన రూ.19,000 కోట్ల షేర్ బైబ్యాక్కు సంబంధించినది. ఇది వాటాదారులకు మూలధన లాభాల పన్నును మాత్రమే ఆకర్షిస్తుందని కంపెనీ వాదించగా ఆదాయపు పన్ను శాఖ.. దీనిని సేకరించిన లాభాల పంపిణీగా పరిగణించి డివిడెండ్పై వేసినట్లుగా పన్ను విధించింది. -
వడ్డీతో సహా చెల్లించాల్సిందే.. కార్వీ కేసులో బ్యాంకులకు ఊరట
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్వీ స్టాక్ బ్రోకింగ్ కేసులో బ్యాంకింగ్కు అనుకూలంగా సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్) బుధవారం కీలక ఉత్తర్వులు వెలువరించింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్)లు సంయుక్తంగా బ్యాంకులకు కార్వీ తాకట్టు పెట్టిన షేర్లను తిరిగి ఇవ్వాలని లేదా బ్యాంకులకు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కార్వీ రుణదాతలకు (బ్యాంకులకు) ఎన్ఎస్డీఎల్, ఎన్ఎస్ఈ, సెబీలు వార్షికంగా 10 శాతం వడ్డీ సహా షేర్ల విలువ రూ. 1,400 కోట్ల పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. కేసు వివరాల్లోకి వెళితే... క్లయింట్ సెక్యూరిటీలను కార్వీ స్టాక్ బ్రోకింగ్ దుర్వినియోగం చేసిననట్లు సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) 2019లో ధ్రువీకరించింది. బ్యాంకుల వద్ద రూ.2,300 కోట్లకుపైగా విలువైన ఖాతాదారుల సెక్యూరిటీలను స్టాక్ బ్రోకర్ తాకట్టు పెట్టినట్లు పేర్కొంది. అయితే తాము బ్రోకరేజ్ సంస్థకు ఇచ్చిన రుణాలకుగాను (ప్లెడ్జ్ ఆధారంగా) ఈ తనఖా షేర్లను సర్దుబాటు చేసుకుంటామని యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ సెబీని అభ్యర్థించాయి. అయితే దీనిని సెబీ తిరస్కరించింది. తాకట్టు పెట్టిన సెక్యూరిటీలను బ్యాంకులకు బదిలీ చేయవద్దని రెగ్యులేటర్ డిపాజిటరీని ఆదేశించిన సెబీ, ఈ షేర్లను తిరిగి క్లయింట్ ఇన్వెస్టర్లకు బదిలీ చేయాలని డిపాజిటరీని ఆదేశించింది. దీనితో రుణ దాతలు ట్రిబ్యునల్ను ఆశ్రయించాయి. ట్రిబ్యునల్లో తాజాగా రెండు వేర్వేరు రూలింగ్ ఇస్తూ, సెబీ ఆదేశాలను తప్పుపట్టింది. -
ఢిల్లీలో మరింత దిగజారిన గాలి నాణ్యత
దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్లో గత నెల రోజులుగా కాలుష్య తీవ్రత కొనసాగుతోంది. దీపావళికి ముందు కురిసిన వర్షంతో ఇక్కడి జనం కాస్త ఊపిరి పీల్చుకున్నప్పటికీ, దీపావళి నుండి కాలుష్యం ‘అతి పేలవమైన’ స్థాయికి చేరడంతో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శుక్రవారం కూడా ఢిల్లీలో గాలి నాణ్యత సూచి(ఏక్యూఐ) 300 కంటే ఎక్కువగా ఉంది. అంటే అతి పేలవమైన కేటగిరీలో ఉంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ)తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఉదయం ఢిల్లీ-ఎన్సీఆర్లో గాలి నాణ్యత స్థాయి 360 దాటింది. ఆనంద్ విహార్లో ఏక్యూఐ 350, ఆర్కె పురంలో 325, పంజాబీ బాగ్లో 332, ఐటీవోలో 328గా ఉంది. శనివారం నుంచి గాలి వేగం పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ ఏక్యూఐ శుక్రవారం 324గా ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో గాలి వేగం తక్కువగా ఉంది. పగటిపూట గాలి వేగం సాధారణంగా గంటకు పది కిలోమీటర్ల కంటే తక్కువగానే ఉంటుంది. అందుకే ఇక్కడి గాలిలో కాలుష్య కణాలు ఎక్కువ కాలం ఉంటాయి. శనివారం, ఆదివారాల్లో ఢిల్లీవాసులు ప్రాణాంతక కాలుష్యం నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఈ సమయంలో గాలి వేగం గంటకు 12 నుంచి 16 కిలోమీటర్లు ఉండవచ్చు. బలమైన గాలి ప్రభావం కారణంగా కాలుష్యం తగ్గే అవకాశాలున్నాయి. శుక్రవారం ఆకాశం నిర్మలంగా ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే ఒక డిగ్రీ ఎక్కువగా 25.7 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 9.4 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. శనివారం కూడా ఉదయం తేలికపాటి పొగమంచు, పగటిపూట నిర్మలమైన ఆకాశం ఉండనుంది. గరిష్ట ఉష్ణోగ్రత 25, కనిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెల్సియస్గా ఉండవచ్చు. శని, ఆదివారాల్లో ఈదురు గాలులు వీస్తాయని, కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా తగ్గే అవకాశం ఉన్నందున ఉదయం, సాయంత్రం వేళల్లో చలి పెరుగుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: హాయిగా నడుస్తూ వెళ్తున్న వ్యక్తికి హఠాత్తుగా పులి ఎదురైతే? -
తుపానుపై సర్వత్రా అప్రమత్తం
సాక్షి, అమరావతి: మిచాంగ్ తుపాను నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాలపై స్పందించి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. మూడు రోజుల ముందు నుంచే జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ వచ్చింది. సోమవారం సీఎం వైఎస్ జగన్ జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి తుపాను వల్ల ఎక్కడా ఇబ్బందికర పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో సహాయ, పునరావాస కార్యక్రమాలకు సంబంధించి రెవెన్యూ శాఖ ఐదు జీఓలు, ఒక మెమో విడుదల చేసింది. సీఎం ఆదేశాలతో 10 జిల్లాల్లో తుపాను అత్యవసర సహాయక చర్యల కోసం ఆయా జిల్లాల కలెక్టర్లు రూ.11 కోట్లను అత్యవసరంగా డ్రా చేసుకునేందుకు అనుమతి ఇస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ జీఓ నంబరు 72 జారీ చేశారు. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు రూ.2 కోట్లు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలకు రూ.కోటి చొప్పున వినియోగించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నిధులను వర్ష ప్రభావిత ప్రాంతాల నుంచి బాధితులను సహాయక శిబిరాలకు తరలించడం, ఆయా ప్రాంతాల్లో సురక్షితమైన తాగునీరు, ఆహారం, పాలు అందించడంతోపాటు వారికి అవసరమైన ఆరోగ్య శిబిరాలు, పారిశుధ్య నిర్వహణ, పశువులకు ఆహారం, కూలిపోయిన లేక దెబ్బతిన్న ఇళ్లకు తక్షణ పరిహారం ఇచ్చేందుకు వినియోగించాలని ఆదేశించింది. సహాయక చర్యలు ముమ్మరం ► తుఫాను సమాచారాన్ని ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లకు పంపుతున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. అత్యవసర సహాయక చర్యల కోసం నెల్లూరులో 4, బాపట్లలో 3, కృష్ణాలో 2, తిరుపతి, ప్రకాశంలో ఒక్కొక్క బృందం చొప్పున మొత్తం 5 ఎన్డీఆర్ఎఫ్, 6 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయని తెలిపారు. కృష్ణా, బాపట్ల, ప్రకాశం, ఎస్పీఎస్సార్ నెల్లూరు, తిరుపతి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో 192 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, సోమవారం సాయంత్రం వరకు 7,361 మందిని తరలించామన్నారు. ప్రభావిత జిల్లాల్లోని 2.38 కోట్ల మందికి తుపాను హెచ్చరిక సందేశాలు (సెల్ ఫోన్కు) పంపినట్లు తెలిపారు. ► ముందస్తు చర్యల్లో భాగంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ లోతట్టు ప్రాంతాలను గుర్తించి సమీపంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, 1,900 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి లోతట్టు ప్రాంతాలలోని పేదలకు ఆహారం అందజేశారు. రెస్క్యూ టీంలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ముత్తుకూరు, నెలటూరు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు. ► తిరుపతి జిల్లాలోని 162 మంది గర్భిణిలను ప్రసూతి ఆస్పత్రులకు తరలించారు. జిల్లా వ్యాప్తంగా 31 గ్రామాలలో 2,620 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రకాశం జిల్లాలో కొత్తపట్నం, సింగరాయకొండ, టంగుటూరు, ఒంగోలు, నాగులుప్పలపాడు మండలాల్లోని తీర ప్రాంతాల్లో పూరిళ్లు, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న పాత ఇళ్లలో ఉంటున్న వారిని 47 పునరావాస శిబిరాలకు తరలించారు. ప్రతి శిబిరానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. ► బాపట్ల జిల్లాలో 14 పునరావాస కేంద్రాలు, 43 తుపాను షెల్టర్లు సిద్ధం చేసి, లోతట్లు ప్రాంత ప్రజలను తరలిస్తున్నారు. 18 మంది గర్భిణీలను వైద్యశాలలకు తరలించారు. ఎన్డిఆర్ఎఫ్(నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్), ఎస్డిఆర్ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్) బృందాలను, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. సూర్యలంకలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని బాపట్ల జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి సోమవారం పరిశీలించారు. ► కృష్ణా జిల్లాలో 64 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మచిలీపట్నం, అవనిగడ్డ ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, గజ ఈతగాళ్ల బృందాలు చేరుకున్నాయి. జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు, ఎస్పీ పి.జాషువా నేతృత్వంలో శిబిరాల్లో తాగునీరు, ఆహారంతో పాటు వైద్య సహాయం కోసం వైద్య సిబ్బంది, మరుగుదొడ్లను, వైర్లెస్ సెట్లను ఏర్పాటు చేశారు. 40 వేల టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. మరో 20 వేల టన్నుల ధాన్యాన్ని గోడౌన్కు తరలించారు. ఇంకో 10 వేల టన్నుల ధాన్యాన్ని ఆఫ్లైన్లో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ► పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం, మొగల్తూరు తీర ప్రాంత మండలాల్లో 12 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. పీఎం లంక నుంచి 150 మందిని పునరావాస కేంద్రానికి తరలించారు. ఆరుగురు గర్భిణులను ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేర్పించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఈతగాళ్లు, మెకనైజ్డ్ బోట్లను సిద్ధం చేసినట్టు కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. ►అనకాపల్లి జిల్లాలో 52 పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. వీటిలో 60 వేల మందికి పైగా వసతి కల్పించేలా ఏర్పాట్లు చేశారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఏలూరులో విద్యుత్ శాఖ 9440902926 టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేసింది. రూ.1,000 నుంచి రూ.2,500 ఆర్థిక సాయం సహాయక శిబిరాల నుంచి బాధిత కుటుంబాలను ఇంటికి పంపే ముందు ఆర్థిక ఆసరా కోసం రూ.1,000 నుంచి రూ.2,500 ఇవ్వాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ జీఓ నెంబరు 73 విడుదల చేసింది. ఆయా కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, ఒక లీటర్ పామాయిల్, కేజీ చొప్పున ఉల్లిపాయలు, బంగాళాదుంపలను ఉచితంగా పంపిణీ చేయాలని మరో జీఓ ఇచ్చింది. తుపాను వల్ల దెబ్బతిన్న, కూలిపోయిన ఇళ్లు, గుడిసెలకు ఇచ్చే పరిహారాన్ని రూ.8 వేల నుంచి రూ.10 వేలకు పెంచి ఇవ్వాలని ఆదేశించింది. సీఎం జగన్ సమీక్షలో ఈ విషయంపై ఆదేశాలు ఇవ్వడంతో అందుకనుగుణంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. పశు వైద్య శిబిరాల ఏర్పాటు, పశువులకు గడ్డి సరఫరా వంటి అవసరాలకు నిధులు వినియోగించుకునేందుకు కలెక్టర్లకు అనుమతి ఇచ్చారు. తుపాను సహాయ, పునరావాస చర్యల్లో సహకరించేందుకు 8 జిల్లాలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. బాపట్ల జిల్లాకు కాటంనేని భాస్కర్, అంబేడ్కర్ కోనసీమకు జి జయలక్ష్మి, తూర్పుగోదావరికి వివేక్ యాదవ్, ప్రకాశంకు పీఎస్ ప్రద్యుమ్న, కాకినాడకు ఎన్ యువరాజ్, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరుకు సీహెచ్ హరికిరణ్, తిరుపతికి జే శ్యామలరావు, పశ్చిమగోదావరికి కే కన్నబాబును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి జీఓ జారీ చేశారు. కాగా, భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. -
Delhi liquor scam: జైలు నుంచి ఇంటికెళ్లిన సిసోడియా
సాక్షి, న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో తీహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కొద్దిసేపు ఉపశమనం లభించింది. అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను ఓదార్చేందుకు ఆరు గంటలపాటు ఇంటికి వెళ్లేందుకు సిసోడియాకు ఢిల్లీ సిటీ కోర్టు శుక్రవారం అనుమతి మంజూరు చేసింది. తిహార్ జైలు నుంచి ఢిల్లీలోని మధుర రోడ్డులో గల నివాసానికి శనివారం ఉదయం 10గంటలకు చేరుకున్నారు. సాయంత్రం నాలుగింటివరకు ఆయనకు అనుమతి ఇచ్చింది. కొంతకాలంగా సిసోడియా భార్య సీమా అనారోగ్యంతో బాధ పడుతున్న విషయం తెల్సిందే. ఇంటికి వెళ్లేందుకు అనుమతి కావాలంటూ సిసోడియా గతంలో కోర్టును కోరిన విషయం విదితమే. దీంతో ఆయనకు కోర్టు ఇలా కొద్దిగంటలపాటు ఉపశమనం కలి్పంచింది. అయితే బయట ఉన్న సమయంలో రాజకీయ ఉపన్యాసాలు చేయొద్దని, మీడియాతో మాట్లాడొద్దని, సమావేశాల్లో పాల్గొనవద్దని ఆదేశించింది. గతంలోనూ భార్యను కలిసేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతిచి్చనా ఇంటికొచ్చే సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లడంతో కలవలేకపోయారు. -
టీవీ చూస్తూ ఇలాంటి పనులు చేస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే
టీవీ చూస్తూ చాలా పనులు చేసుకోవడం మనలో చాలామందికి అలవాటు. కొంతమంది దర్జాగా రిమోట్ తిప్పుతూ టీవీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరికొంతమంది ఏ సిరీయల్లో చూస్తూ ఈ ప్రపంచాన్నే మర్చిపోతారు. అలాగే కూరగాయలు కట్ చేస్తూనో, పిల్లలకు అన్నం తినిపిస్తూనో టీవీ షోలను చూస్తూ ఉంటారు. పరధ్యానంగా టీలో పంచదారకు బదులు ఉప్పు వేసినా పెద్దగా ఇబ్బందేమీ ఉండదేమో కానీ ఒక్కోసారి ఊహించని సమస్యకి దారి తీస్తుంది. మహిళ టీవీ చూస్తూ ఒకటి చేయబోయి.. ఇంకోటి చేసి ఆ తరువాత ఇబ్బందులు పడింది. పరధ్యానానికి పరాకాష్టగా నిలిచిన ఈ ఘటన తరువాత ఇపుడు మనమంతా కాస్త జాగ్రత్త పడాల్సిన వార్త ఇది. అసలు విషయం ఏమిటంటే..డైలీ స్టార్ కథనం ప్రకారం మియా కిట్టిల్సన్ అనే మహిళకి బెక్ హమ్(Beckham) డాక్యు సిరీస్ అంటే పిచ్చి. దీనిపై బాయ్ ఫ్రెండ్తో చర్చిస్తుంది కూడా. ఇంకా దాని గురించి ఆలోచిస్తున్న క్రమంలోనే ఆమె పళ్లుతోముకునేందుకు టూత్ పేస్ట్ కు బదులుగా పెయిన్ కిల్లర్ క్రీమ్ డీప్ హీట్ క్రీమ్ వాడేసింది. ఇంకేముందు నోటిలో చురుక్కున మండడంతో అప్పుడు వాస్తవంలోకి వచ్చింది. ఘాటైన వాసనతో ఇబ్బంది పడింది. దీంత విషయం తెలిసిన వెంటనే ఆమె బాయ్ ఫ్రెండ్ పాయిజన్ కంట్రోల్ కు కాల్ చేశాడు. తన షాకింగ్ అనుభవాన్ని ఆమె టిక్టాక్లో షేర్ చేసింది. అది కోల్గేట్ టూత్పేస్ట్లానే ఉంది అంటూ నొప్పి నివారణ క్రీమును వాడిన వైనాన్ని వివరించింది. దీంతో నెటిజను కమెంట్ల వర్షం కురిపించారు. టిక్టాక్లో కిట్టెల్సన్ వీడియోకు వచ్చిన వ్యూస్ 10 లక్షలకు పై మాటే అంటేనే అర్థం చేసుకోవచ్చు ఇది ఏమేరకు వైరల్ అయిందో. ఇది ఇలా ఉంటే గతంలో న్యూజిలాండ్కు చెందిన ఒక మహిళ కోల్డ్ సోర్ క్రీం బదులుగా పెదాలకు సూపర్గ్లూను రాసేసుకుంది. తెలుసుగా గ్లూ రాసుకుంటే ఏమవుతుందో.. పెదాలకు అతుక్కుపోయి నానా బాధలు పడింది. విపరీతమైన జలుబుతో బాధపడింది. చివరికి వైద్యులు పారాఫిన్ ఆయిల్తో ఆమె పెదవుల సీల్ను విప్పారు. సో.. తస్మాత్ జాగ్రత్త! -
అలసిన కళ్లకు రిలీఫే ఈ ఐ మసాజర్!
మారిన లైఫ్ స్టయిల్ వల్ల మన బాడీలో బాగా స్ట్రెయిన్ అవుతున్నవి కళ్లే! కంప్యూటర్, సెల్ఫోన్.. కళ్లకు క్షణం తీరికనివ్వడం లేదు. దాంతో ఆ అలసట అందాన్ని ఎఫెక్ట్ చేస్తోంది. దానికి చక్కటి రిలీఫే ఐ మసాజర్. చిత్రంలోని ఈ హీటింగ్ ఫటీగ్ థెరపీ వెల్నెస్ డివైస్.. కళ్ల భారాన్ని, ఒత్తిడిని దూరం చేస్తుంది. ఇందులో హై, మీడియం, లో అనే త్రీ మోడ్స్ ఉంటాయి. ‘లో’ ఆప్షన్కి 36 డిగ్రీల సెల్సియస్ (97 డిగ్రీల ఫారెన్ హీట్) ప్రభావం ఉంటే.. ‘మీడియం’ ఆప్షన్కి 39 డిగ్రీల సెల్సియస్ (102 డిగ్రీల ఫారెన్ హీట్) ప్రభావం ఉంటుంది. ఇక ‘హై’ ఆప్షన్లో 42 డిగ్రీల సెల్సియస్ (108 డిగ్రీల ఫారెన్ హీట్) టెంపరేచర్ ఉత్పత్తి అవుతుంది. ఈ డివైస్ చేతిలో ఇమిడిపోయేంత చిన్నగా.. కళ్లకు అమరేంత సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది వేడెక్కడానికి 10 సెకన్ల సమయం పడుతుంది. అలాగే దీనికి చార్జింగ్ పెట్టుకోవడానికి ప్రత్యేకమైన ప్యాడ్ లభిస్తుంది. దాంతో ఈ మసాజర్ని వైర్లెస్గా వినియోగించుకోవచ్చు. ఇది ఒత్తిడిని తగ్గించడంతో పాటు.. అలసటను దూరం చేస్తుంది. కళ్ల చుట్టూ మచ్చలు, ముడతలు ఏర్పడి, కళాహీనంగా మారకుండా సంరక్షిస్తుంది. అలాగే సరికొత్త ఉత్తేజాన్ని ఇచ్చి రిలాక్స్ చేస్తుంది. ఈ పోర్టబుల్ పర్ఫెక్ట్ ఐ మసాజర్ని ప్రతిరోజూ వినియోగించుకోవచ్చు. (చదవండి: ముఖానికి ఫేస్ యోగా! దెబ్బకు మొటిమలు, మచ్చలు మాయం!) -
గాజాకు భారత్ మానవతా సాయం!
పాలస్తీనా మిలిటెంట్లు హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా గాజాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తెలిసిందే. ఈ భీకర యుద్ధంలో వేలాది మంది సాధారణ పాలస్తీనీయన్లు ప్రాణాలు కోల్పాయారు. హమస్ మిలిటెంట్లను తుదముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయల్ సైన్యం గాజాపై విధ్యంసకరంగా విరుచుపడింది. ఈ దాడులతో గాజా చిగురుటాకులా వణికిపోయింది. ఈ నేపథ్యంలో భారత్ నేడు గాజాలోని పాలస్తీనియన్లకు వైద్య సహాయం, విపత్తు సహాయ సామగ్రిని పంపింది. అంతేగాక యుద్ధంలో తీవ్రంగా గాయపడిన వారి ప్రాణాలను రక్షించే మందులు, శస్త్రచికిత్స వస్తువులు, టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్లు, టార్పాలిన్లు, శానిటరీ యుటిలిటీలు తదితరాల తోపాటు ఇతర అత్యవసర వస్తులు, నీటి శుద్దీకరణ మాత్రలు గాజాకు పంపిచినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విట్టర్లో పేర్కొన్నారు. గాజా ఆరోగ్యమంత్రిత్వ శాఖ ప్రకారం ఇప్పటి వరకు ఈ దాడుల్లో దాదాపు 4,300 మంది పాలస్తనీయన్లు మరణించారని, ప్రధానంగా పౌరులే ఎక్కువుగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. అలాగే వేలాదిమందికి పైగా ప్రజలు క్షతగ్రాతులుగా మారారని పేర్కొంది. ఇదిలా ఉండగా, భారత ప్రధాని మోదీ పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్తో గాజాలో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై ఈ వారం ప్రారంభంలోనే చర్చించిన సంగతి తెలిసిందే. పైగా భారత్ పాలస్తీనియన్ల కోసం తన వంతుగా మానవతా సాయాన్ని అందిస్తూనే ఉంటుందని మోదీ పాలస్తీనా అధ్యక్షుడుకి హామీ కూడా ఇచ్చారు. ఈ ఘర్షణలో పౌరుల మరణాలే అధికంగా ఉండటం బాధకరం అన్నారు. ఈ దుశ్చర్యకు పాల్పడినవారు తప్పక దీనికి బాధ్యత వహించక తప్పదని ఫైర్ అయ్యారు. మరోవైపు ఈ జిప్టు శిఖరాగ్ర సమావేశంలో యూఎన్ చీఫ్ ఆంటోనియా గుటెర్రెస్ కూడా మానవతావాద దృక్పథంతో కాల్పులు విరమించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం గాజాలో తాగునీరు, ఆహరం, పెట్రోలు వంటివి లేక తీరని మానవతా పరిస్థితితో అట్టుడుకుతోందన్నారు. గాజా పరిస్థితిని చక్కబడేలా ప్రపంచ దేశాలన్ని తమవంతుగా సాయం అందించేలా మరింత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కాగా, ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ సంస్థ ప్రయత్నాలు ఫలితంగా ఇజ్రాయెల్ కూడా గాజాకు మానవతా సాయం అందించేందుకు అంగీకరించింది 🇮🇳 sends Humanitarian aid to the people of 🇵🇸! An IAF C-17 flight carrying nearly 6.5 tonnes of medical aid and 32 tonnes of disaster relief material for the people of Palestine departs for El-Arish airport in Egypt. The material includes essential life-saving medicines,… pic.twitter.com/28XI6992Ph — Arindam Bagchi (@MEAIndia) October 22, 2023 (చదవండి: గాజాకు స్వల్ప ఊరట.. అమెరికా మాటతో వెనక్కి తగ్గిన ఇజ్రాయెల్) -
కశ్మీరీ వలస కుటుంబాలకు ఇకపై నెలకు రూ.27 వేలు
ఢిల్లీ: ఢిల్లీలో నివసిస్తున్న కశ్మీరీ వలస కుటుంబాలకు ఇస్తున్న పరిహారాన్ని రూ.10,000 నుంచి రూ. 27,000లకు పెంచుతూ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా కొత్త కశ్మీరీ మైగ్రెంట్ కార్డులు జారీ చేయడానికి కూడా ఎల్జీ అనుమతినిచ్చారు. ఇప్పటికే ఉన్న కార్డులలో కొత్త పేర్లను జత చేయడానికి కూడా అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పెద్దైన పిల్లలు, కొత్తగా వివాహమైన వారికి కొత్తగా కార్డులను ఇవ్వనున్నారు. వలసదారు కాని యువతి, వలసదారుల కుటుంబానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంటే.. అలాంటివారికి కూడా అవకాశం కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. కశ్మీర్లో ఉగ్రవాదం కారణంగా వలస వచ్చిన వారికి ఢిల్లీలో చాలాకాలం క్రితం పునరావాసం కల్పించిన విషయం తెలిసిందే. ఇలాంటి వారికి 1989-90లలోనే ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందించడం మొదలుపెట్టంది. 2007లో ఈ ఆర్ధిక సహాయాన్ని రూ.5000 నుంచి రూ.10,000లకు పెంచారు. ఆ తరువాత సాయాన్ని మరింత పెంచింది ఇప్పుడే. పెంపుతో ఇప్పుడు వలసదారులకు ఇచ్చే ఆర్థిక సాయం రూ.27,000లకు చేరింది. కశ్మీర్లోయ ఉగ్రవాదం చెలరేగడంతో 1989-90లలో హిందువులతో పాటు వివిధ మతాల ప్రజలు ఆ ప్రాంతాన్ని వీడారు. దాదాపు 60,000 వేల కుటుంబాలు కశ్మీర్లోయను వీడి జమ్మూ, చుట్టుపక్కల ప్రాంతాల్లో స్ధిరపడ్డారు. అందులో సుమారు 23,000 కుటుంబాలు ఇతర రాష్ట్రాల్లో స్థిరపడ్డాయి. ఢిల్లీలో ప్రస్తుతం 2000 కశ్మీరీ వలస కుటుంబాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సంఖ్య పెరగడంతో ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 70 శాతం పెరిగే అవకాశం ఉంది. కేంద్ర రక్షణ సంబంధిత నిధుల నుంచి వీరికి ఆర్ధిక సహాయం అందుతోంది. ఇదీ చదవండి: బీజేపీ కీలక నిర్ణయం.. గవర్నర్గా ఇంద్రసేనారెడ్డి నియామకం -
నోరు నొక్కేందుకే ఈ కుట్ర: భయపడుతూ కూచుంటే ఎలా?
న్యూఢిల్లీ: బాలీవుడ్నటి పరిణీతి చోప్రో భర్త, ఆప్ ఎంపీ, రాఘవ్ చద్దాకు ఊరట లభించింది. ఢిల్లీలోని ప్రభుత్వం బంగ్లాను ఖాళీ చేయాలన్న ట్రయల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఢిల్లీ హైకోర్టు పక్కన పెట్టింది. అయితే ఏప్రిల్ ఆర్డర్ను రద్దు చేస్తూ అక్టోబర్ 5న ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రాఘవ్ చద్దా సవాలు చేయడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. దీంతో రాఘవ్ చద్దాకు భారీ ఊరట లభించింది. పాటియాలా హౌస్ కోర్టు ఆదేశాలను పక్కన పెడుతూ, రాఘవ్ చద్దా తన ప్రభుత్వ బంగ్లాలో ఉండవచ్చని, దానిని ఖాళీ చేయాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు మంగళవారం తెలిపింది. ఏప్రిల్ 18న సిటీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను జస్టిస్ అనుప్ జైరామ్ భంభానీతో కూడిన సింగిల్ బెంచ్ సమర్ధించింది. రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటం ఈ తీర్పుపై స్పందించిన రాఘవ్ చద్దా ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు. తన పోరాటం ఇల్లు లేదా దుకాణం గురించి రాజ్యంగ రక్షణ గురించి అని ట్వీట్ చేశారు. యువ ఎంపీగా తన నోరు నొక్కే ప్రయత్నంలో భాగంగా, రాజకీయ కక్షతోనే తన బంగ్లా కేటాయింపు రద్దు చేశారని విమర్శించారు.కోట్లాది మంది భారతీయుల తరపున మాట్లాడేవారిని, ప్రతిపక్షాలను ఉద్దేశ పూర్వకంగా టార్గెట్ చేశారని ధ్వజమెత్తారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రాన్ని విమర్శిస్తూ తాను పార్లమెంటులో రెండు ప్రసంగాలు చేశానని, తన తొలి ప్రసంగం తర్వాత తన అధికారిక వసతి రద్దు చేశారన్నారు.అలాగే రెండో ప్రసంగం తరువాత ఎంపీగా తన సభ్యత్వాన్ని సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. నీతిగా, నిజాయితీగా మాట్లాడితే ఏమవుతుందో భయపడుతూంటే ఇక ఏ ఎంపీ పని చేయలేరంటూ తన ఎక్స్ పోస్ట్లో తెలిపారు. Ye makan ya dukan ki nahin, Samvidhan ko bachane ki ladhayi hai In the end, truth and justice have prevailed My statement on the Hon'ble Delhi High Court's ruling to set aside the unjust order to evict me from my official residence. pic.twitter.com/fA7BJ2zLYm — Raghav Chadha (@raghav_chadha) October 17, 2023 -
మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో నిరాశ
ఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో నిరాశే ఎదురైంది. సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను అక్టోబర్ 4కు వాయిదా వేసింది న్యాయస్థానం. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టీ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు విచారణ చేపట్టింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్య సీమాను కలుసుకునేందుకు మానవతా దృక్పథంతో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన భార్య ఆరోగ్యం క్షీణిస్తోందని ధర్మాసనానికి విన్నవించుకున్నారు. సిసోడియా తరపున హాజరైన సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సంఘ్వీ వాదనలు వినిపించారు. తన తరుపున వాదనలకు రెండు గంటల సమయం ఇవ్వాలని బెంచ్ను కోరారు. తమ క్లయింట్ అభ్యర్ధనపై తక్షణం ప్రత్యేక శ్రద్ధ చూపించాలని కోరారు. ఢిల్లీ మద్యం కుంభకోణం.. ఢిల్లీ ఎక్సైజ్ పోర్టుఫోలియోను నిర్వహించే క్రమంలో మధ్యం కుంభకోణం జరిగిందని సీబీఐ మనీష్ సిసోడియాను అరెస్టు చేసింది. ఢిల్లీ ప్రభుత్వంలో ఆయన ఉపముఖ్యమంత్రి పదవిని కూడా నిర్వర్తించారు. అయితే.. మద్యం కుంభకోణంలో ఫిబ్రవరి 26న సీబీఐ ఆయన్ని అరెస్టు చేసింది. అప్పటి నుంచీ కస్టడీలోనే ఉన్నారు. మనీలాండరింగ్ కేసులో ఈడీ కూడా సిసోడియాపై కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. ఫిబ్రవరి 28న ఢిల్లీ ప్రభుత్వంలో తన పదవులకు సిసోడియా రాజీనామా చేశారు. ఇదీ చదవండి: Nuh Violence: కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. ఇంటర్నెట్ బంద్.. -
రూ.6 చిల్లర ఇవ్వనందుకు 26 ఏళ్లుగా శిక్ష..
ముంబయి: ఆరు రూపాయలు చిల్లర తిరిగి ఇవ్వనందుకు ఓ రైల్వే క్లర్కుకు గత 26 ఏళ్లుగా ఉపశమనం లభించలేదు. విజిలెన్స్ టీం పంపిన వ్యక్తికి చిల్లర ఇవ్వని కారణంగా 26 ఏళ్ల క్రితం విధుల నుంచి తొలగించబడ్డారు. అనంతరం అప్పీలుకు వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. రైల్వే టికెట్ క్లర్క్ రాజేశ్ వర్మ ముంబయి కుర్లా టెర్మినల్ జంక్షన్ వద్ద పనిచేసేవారు. 1997 ఆగష్టు 30న విజిలెన్స్ టీం ఓ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ను ప్యాసింజర్గా పంపి టికెట్ కొనుగోలు చేయించగా.. వర్మ బుక్కయ్యారు. సదరు ప్యాసింజర్ రూ.500 ఇవ్వగా.. టికెట్టు ధర రూ.214 పోగా మిగిలిన రూ.286 ఇవ్వాల్సి ఉంది. కానీ రాజేశ్ వర్మ రూ.280 ఇచ్చి చిల్లర ఇవ్వలేదు. విజిలెన్స్ అధికారులు చెక్ చేయగా.. ఆ రోజు వసూళ్లలో రూ. 58 మిస్ అయ్యాయి. అంతేకాకుండా ఆ క్లర్క్ వెనక ఉన్న అల్మారాలో రూ.450 ఉన్నట్లు గుర్తించారు. దీంతో రాజేశ్ వర్మ తప్పుడు మార్గంలో డబ్బు సంపాదిస్తున్నట్లు అధికారులు ఓ అంచనాకు వచ్చారు. క్రమశిక్షణా చర్యల కింద రాజేశ్ వర్మను జనవరి 31, 2002న విధుల నుంచి తప్పించారు. అయితే.. ఆ నిర్ణయాన్ని రాజేశ్ వర్మ సవాలు చేస్తూ అప్పీలుకు వెళ్లారు. చిల్లర రూ.6 లేనందుకే ఇవ్వలేకపోయాడని రాజేశ్ వర్మ తరుపున లాయర్ మిహిర్ దేశాయ్ కోర్టుకు విన్నవించారు. అల్మారాను రాజేశ్ వర్మతో పాటు ఉద్యోగులందరూ ఉపయోగిస్తారని తెలిపారు. చిల్లర ఇవ్వలేదనడానికి ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ అల్మారాకు ప్రవేశం ఉందని, అధిక ఛార్జీలు వసూలు చేశారనడానికి రుజువు ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. రాజేశ్ వర్మ అప్పీలును తిరస్కరించింది. ఇదీ చదవండి: ఆ పని చేస్తే.. శరద్ పవార్కు కేంద్ర మంత్రి పదవి..? క్లారిటీ.. -
Andhra Pradesh: వరద ప్రాంతాల్లో వేగంగా సాయం
సాక్షి, అమరావతి / సాక్షి నెట్వర్క్: గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ముంపు బారిన పడిన జిల్లాల్లోని 211 గ్రామాల ప్రజల కోసం ప్రభుత్వం 74 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. 46,170 మంది బాధితులను అక్కడికి యుద్ధ ప్రాతిపదికన తరలించింది. అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 51 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడికి 43,587 మందికి తాత్కాలికంగా పునరావాసం కల్పించారు. ఏలూరు జిల్లాలో 4 కేంద్రాల్లోకి 1,528 మందిని, బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 18 కేంద్రాలకు 758, తూర్పుగోదావరి జిల్లాలో ఒక కేంద్రం ఏర్పాటు చేసి 306 మందిని తరలించారు. ఆయా ప్రాంతాల్లో తక్షణ వైద్య సౌకర్యం కల్పించేందుకు 68 వైద్య శిబిరాలు నెలకొల్పారు. మొత్తం 178 బోట్లు, 10 లాంచీలను సహాయక చర్యల కోసం ఏర్పాటు చేశారు. ఐదు జిల్లాలకు ప్రభుత్వం తక్షణ అవసరాల కోసం రూ.12 కోట్లు విడుదల చేయడంతో పునరావాసకేంద్రాల ఏర్పాటు, బాధితుల తరలింపు, వారికి అవసరమైన ఆహారం, తాగు నీరు ఇతర సౌకర్యాల కల్పన వేగంగా జరిగింది. ఐదు జిల్లాల్లో మొత్తం 26 మండలాల్లోని 211 గ్రామాలపై గోదావరి వరద ముంపు ప్రభావం పడినట్లు నిర్ధారించి, ముందస్తు సహాయక చర్యలు చేపట్టారు. అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 96 గ్రామాలు ప్రభావితమయ్యాయి. ఈ నేపథ్యంలో 10 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను వరద ప్రభావిత ప్రాంతాల్లో అందుబాటులో ఉంచారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు, కుక్కునూరులో రెండు, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మామిడికుదురు, అయినవిల్లి, ముమ్మిడివరం, ఐ పోలవరంలో ఒక్కొక్కటి చొప్పున ఎన్టీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూనవరం, చింతూరు, పి గన్నవరం, అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి గన్నవరం, ఏలూరు జిల్లాలోని వేలేరుపాడులో ఒక్కొక్కటి చొప్పున ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. ఇప్పటికే ఆ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్టేట్ ఎమర్జెన్సీ సెంటర్ నుంచి నిరంతరం అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఆయా జిల్లాలకు ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు జారీ చేస్తున్నారు. ఎక్కడికక్కడ పర్యవేక్షణ ♦ వరద తాకిడికి గురైన చింతూరు, వీఆర్పురం, కూనవరం ఎటపాక మండలాల్లోని వరద ప్రభావిత గ్రామాల ప్రజలకు సంబంధించి ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో బాధితులకు తాగునీటితో పాటు వాడుక నీటి సౌకర్యం కల్పించారు. విద్యుత్ అందుబాటులో లేని ప్రాంతాల్లో జనరేటర్ సౌకర్యం కల్పించారు. బాధితులకు నిత్యావసరాలతో పాటు కూరగాయలు, పాలు అందిస్తున్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా కేంద్రాల పరిసరాల్లో బ్లీచింగ్, ఫాగింగ్ వంటి పారిశుధ్య చర్యలు చేపట్టారు. గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ వలంటీర్లను అందుబాటులో వుంచారు. ఎక్కడికక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ♦ చింతూరు మండలంలో బాధితులకు కూరగాయలు, పాలతో పాటు కొవ్వొత్తులు పంపిణీ చేశారు. కిరోసిన్ పంపిణీకి కలెక్టర్ ఏర్పాట్లు చేస్తున్నారు. సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకుంటున్న వారికి 10 వేల టార్పాలిన్లను సిద్ధం చేస్తున్నారు. కూనవరం మండలంలో 12, వీఆర్పురం మండలంలో 10, చింతూరు మండలంలో 8 మర పడవలను సహాయక చర్యలకు వినియోగిస్తున్నారు. ఇళ్లు దెబ్బతిన్న వారికి పరిహారం పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ♦ వరద ముంపు ప్రాంతాలకు లాంచీలు, పడవల ద్వారా కూరగాయలను పంపించారు. చింతూరు జీసీసీ గోడౌను నుంచి వీఆర్పురం, కూనవరం మండలాలకు మూడు టన్నుల చొప్పున ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, రెండు టన్నుల చొప్పున వంకాయలు, దొండకాయలు పంపించారు. నడి గోదావరిలో ఆరుగురు గర్భిణుల తరలింపు నడి గోదావరిలో శనివారం రాత్రి 10.30 గంటలకు బోట్పై ఆరుగురు గర్భిణులను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏలూరు జిల్లా వేలేరుపాడు మండల కేంద్రానికి తరలించాయి. డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ రాజీవ్ వేలేరుపాడు మండలంలో అత్యంత మారుమూల గ్రామాలైన టేకుపల్లి, టేకూరు గ్రామాల్లో ఆరుగురు గర్భిణులను గుర్తించారు. వీరిని వెంటనే పునరావాస కేంద్రానికి తరలించేందుకు బోట్పై ప్రయత్నించగా, తిర్లాపురం గ్రామానికి వచ్చేసరికి చీకటి పడి అక్కడే బోట్ ఆగిపోయింది. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందానికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ మోహన్యాదవ్, మిగిలిన బృంద సభ్యులు.. ఆరుగురు గర్భిణులను వేలేరుపాడుకు తరలించారు. అక్కడి నుంచి అంబులెన్స్లో జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి వారిని తీసుకెళ్లారు. నిత్యావసర వస్తువుల పంపిణీ ♦ పశ్చిమగోదావరి జిల్లాలోని ఆచంట మండలంలో అయోధ్య లంక, మర్రిమూల, పెదమల్లం గ్రామాల్లో మాజీ మంత్రి, ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు పర్యటించి, బాధితులకు భరోసా ఇచ్చారు. యలమంచిలి మండలంలోని లంక గ్రామాలైన దొడ్డిపట్ల, కనకాయలంక, పెదలంక, లక్ష్మీపాలెం, ఏనుగువాని లంక, బాడవ గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి లంక గ్రామాల్లో పర్యటించారు. ♦ ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో 35 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. శనివారం రాత్రి ఇళ్లలోకి వరద నీరు చేరుతుండటంలో ఐదు గ్రామాలు నీటమునిగాయి. పాత నార్లవరం, ఎడవల్లి, టేకూరు, రుద్రమకోట, వేలేరుపాడు సంతబజారుల్లో 30 ఇళ్ల వరకు నీటమునగడంతో జనం పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. వీరందరికీ భోజన వసతి కల్పించారు. వేలేరుపాడులో పది దేశీయ బోట్లు, రెండు పెద్ద బోట్లు, మరో రెండు ఫైర్ బోట్లు వినియోగిస్తున్నారు. వరద బారిన పడిన కుటుంబాలన్నిటికీ ఆదివారం 3900 లీటర్ల వంట నూనె, 4 వేల కేజీల కందిపప్పు, కుటుంబానికి 25 కేజీల బియ్యం, కూరగాయలు పంపిణీ చేయనున్నారు. నూజివీడు సబ్ కలెక్టర్ ఆదర్‡్ష రాజేంద్రన్, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఝాన్సీ దగ్గరుండి వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ♦ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పలు గ్రామాల్లో ఇళ్ల మధ్య వరద చేరింది. స్థానికులు పడవల మీద రాకపోకలు సాగిస్తున్నారు. అధికార యంత్రాంగం ప్రజలకు నిత్యావసర వస్తువులు అందజేశారు. వైద్య సేవలకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర రవాణా శాఖమంత్రి పినిపే విశ్వరూప్ అల్లవరం మండలం బోడసుకుర్రు పల్లిపాలెంలో పునరావస కేంద్రంలో బాధితులతో మాట్లాడారు. వారి కోసం తయారు చేసిన భోజనాన్ని పరిశీలించారు. జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణు గోపాలరావు, ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబులు మామిడికుదురు, అయినవిల్లి మండలాల్లో పర్యటించి వరద ఉధృతిని పరిశీలించారు. ♦ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు, కూనవరం, వీఆర్పురం, ఎటపాక మండలాల్లోని పలు గ్రామాల్లోకి వరదనీరు ప్రవేశిస్తోంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్కు రాకపోకలు నిలిచిపోయాయి. రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంత ఉదయ్భాస్కర్ శనివారం కూనవరం, వీఆర్పురం మండలంలో వరదముంపు ప్రాంతాల్లో పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని 30 పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు. దెబ్బతిన్న ఇళ్లకు పరిహారం పెంపు సాక్షి, అమరావతి: గోదావరి వరద ముంపు గ్రామాలకు చెందిన బాధితులు పునరావాస కేంద్రాల నుంచి తిరిగి ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రత్యేక ఆర్థిక సాయం కింద రూ.1,000 నుంచి రూ.2,000 వరకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన సమీక్షలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ సొమ్మును పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు ఆర్ధికసాయంపై రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా ఈ జిల్లాల్లో ముంపునకు గురైన కుటుంబాలకు ఉచితంగా 25 కేజీల బియ్యం, కేజీ కందపప్పు, లీటర్ పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళాదుంపలు ఇవ్వాలని మరో ఉత్తర్వు జారీ చేశారు. ఈ సరుకులను సమకూర్చాల్సిందిగా మార్కెటింగ్కు ఆదేశాలిచ్చారు. దెబ్బతిన్న, పాడైన ఇళ్లకు ఇచ్చే పరిహారాన్ని సీఎం జగన్ ఆదేశాల మేరకు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ మరో ఉత్తర్వు జారీ చేశారు. -
AP: ఉదారంగా వరద సాయం
సాక్షి, అమరావతి: వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలను అత్యంత సమర్థంగా అమలు చేయాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. వరద బాధితులకు మానవీయ కోణంలో సహాయం అందించాలని స్పష్టం చేశారు. ఇలాంటి విపత్తు పరిస్థితుల్లో ఉండాల్సిన దాని కన్నా ఎక్కువగా మానవత్వంతో పని చేయాలనే విషయాన్ని అంతా దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. ఒక రూపాయి అదనంగా ఖర్చు అయినా సరే బాధితులకు అండగా ఉండాలన్నారు. కలెక్టర్లు మాకు మంచి చేశారనే మాటే వినిపించాలని, మన వల్ల జిల్లాకు మంచి జరిగిందని, మంచి కలెక్టర్ అనిపించుకునేలా పని చేయాలని సూచించారు. ప్రధానంగా ఐదు జిల్లాల్లో కలెక్టర్లు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలన్నారు. సహాయ శిబి రాల నుంచి బాధితులు తిరిగి ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.2 వేలు చొప్పున ఇవ్వాలని, వ్యక్తులైతే రూ.1,000 చొప్పున అందచేయాలని ఆదేశించారు. కచ్చా ఇళ్లను నష్టపోయిన బాధితులకు రూ.10 వేల చొప్పున సాయం అందించి ఆదుకోవాలని నిర్దేశించారు. శిబిరాల్లో తలదాచుకునే బాధితులకు మంచి సదుపాయాలను కల్పించడంతోపాటు ముంపు ప్రాంతాల్లో బియ్యం, ఉల్లిపాయలు, కందిపప్పు, బంగాళా దుంపలు, పామాయిల్ పంపిణీ చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, నదుల్లో వరద ప్రవాహం, సహాయ, పునరావాస కార్యక్రమాలపై ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే... ఐదు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం భద్రాచలం వద్ద నీటిమట్టం 49.60 అడుగులు ఉంది. శనివారం 53.81 అడుగులకు చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ధవళేశ్వరం వద్ద ఇన్ఫ్లో, అవుట్ ప్లో 13 లక్షల క్యూసెక్కులు ఉంది. ఇది రేపటికి (శనివారం) సుమారు 16 లక్షలకు చేరుకుని ఆ తర్వాత క్రమేపీ తగ్గుముఖం పట్టే అవకాశాలున్నట్లు అంచనా. ప్రవాహం 17 లక్షల క్యూసెక్కులు ఉంటే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ప్రస్తుతం రెండు, మూడు ప్రమాద హెచ్చరికల మధ్యలో అంటే 13 – 17 లక్షల క్యూసెక్కుల లోపే ప్రవాహం ఉంటుంది. గతేడాది గోదావరిలో 26 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని చూశాం. శిబిరాల్లో మంచి సదుపాయాలు లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇప్పటికే కొన్ని చోట్ల ఖాళీ చేశారు. 16 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. అవసరం అనుకుంటే పరిస్థితిని అంచనా వేసి మిగిలిన వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. బాధితులకు సహాయ శిబిరాల్లో మంచి సదుపాయాలు కల్పించాలి. శిబిరాల్లో స్వయంగా అధికారులే ఉంటే ఎలాంటి సదుపాయాలను కోరుకుంటారో అలాంటి సదుపాయాలన్నీ కల్పించాలి. ఆ మేరకు జాగ్రత్తలు తీసుకోవాలి. కచ్చా ఇళ్లపై వర్గీకరణే వద్దు.. మరో ముఖ్యమైన అంశం.. కచ్చా ఇళ్ల విషయంలో కలెక్టర్లు మానవీయ ధృక్పథంతో ఉదారంగా వ్యవహరించాలి. కచ్చా ఇళ్ల బాధితులను సహాయ శిబిరాల నుంచి తిరిగి పంపించేటప్పుడు రూ.10 వేల చొప్పున సాయంగా అందించాలి. అది వారికి తిరిగి కచ్చా ఇంటిని నిర్మించుకునేందుకు, మరమ్మతులు చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. లేదంటే వారు ఎక్కడికి వెళ్లాలో తెలియక అవస్థలు ఎదుర్కొంటారు. కచ్చా ఇంటి విషయంలో పాక్షికంగా దెబ్బతిందా? లేక పూర్తిగా దెబ్బతిందా? అనే వర్గీకరణే వద్దు. వారు ఉండేదే కచ్చా ఇళ్లు అయినప్పుడు ఇక వర్గీకరణ అనవసరం. అలాంటి వారి జీవితాలపై మరింత భారం పడేలా వ్యవహరించకూడదు. అందుకే మానవీయ దృక్పథంతో ఉండాలని కలెక్టర్లను కోరుతున్నా. ఇలాంటి సమయాల్లో వారికి బాసటగా నిలిచామనే మాట రావాలి. బియ్యం, ఉల్లిపాయలు, కందిపప్పు, బంగాళా దుంపలు, పామాయిల్.. ముంపునకు గురైన ఇళ్లు, వరదనీరు ప్రవహించిన ప్రాంతాల్లో నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేయాలి. ఉదారంగా నిత్యావసరాలను అందించాలి. 25 కేజీల బియ్యం, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళాదుంపలు, కేజీ పామాయిల్, కేజీ కందిపప్పు ఇవ్వాలి. మొత్తంగా బాధితుల పట్ల మరింత ఉదారంగా, మానవతా దృక్ఫథంతో వ్యవహరించాలి. సచివాలయాల స్థాయిలో కంట్రోల్ రూమ్స్ రాష్ట్రంలో నాలుగేళ్లుగా ప్రతి ఏటా ఇలాంటి పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొంటున్నాం. ఇప్పడు కూడా అప్రమత్తంగా ఉండాలి. కంట్రోల్ రూమ్స్కు సంబంధించి జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకూ ఏర్పాటు చేయాలి. సచివాలయాల స్థాయిలో కూడా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయండి. సచివాలయాల సిబ్బందితో పాటు వలంటీర్ల సేవలను పూర్తిగా వినియోగించుకోవాలి. ముంపు గ్రామాలు, లంకలపై ప్రత్యేక దృష్టి ముంపు బాధిత గ్రామాలు, లంకలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఆయా ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు సరిపడా నిల్వ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనిపై మరోసారి సమీక్షించి సిద్ధంగా ఉండాలి. లంక గ్రామాలలో జనరేటర్లు లాంటి వాటిని కూడా సిద్ధం చేసుకోండి. తాగునీటి కొరత లేకుండా.. తాగునీటి కొరత లేకుండా, సరఫరా వ్యవస్థలకు ఆటంకాలు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలి. తాగునీటి ప్యాకెట్లను సిద్ధం చేసుకోండి. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టండి. బ్లీచింగ్, ఫినాయిల్ లాంటివి సిద్ధంగా ఉంచాలి. ఆరోగ్య శిబిరాల ఏర్పాటుపై కూడా ప్రత్యేక ధ్యాస పెట్టాలి. విలేజ్ క్లినిక్స్, పీహెచ్సీలలో సరిపడా మందులను ఉంచాలి. వీటిపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించుకోవాలి. వరదల కారణంగా పాము కాట్లు లాంటి ఘటనలు జరిగితే అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలి. వరద తగ్గాక పంట నష్టం నమోదు వరద నీరు తగ్గాక పంట నష్టం వివరాలను నమోదు చేసుకుని రైతులకు బాసటగా నిలవాలి. అత్యంత పారదర్శక పద్ధతిలో ఎన్యుమరేషన్ జరగాలి. వరద ప్రభావిత ప్రాంతాల్లో గర్భవతులు, బాలింతల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యం, మంచి సదుపాయాలు ఉన్నచోటకు ముందే తరలించాలి. ప్రతి విషయంలోనూ ప్రజలకు ప్రభుత్వం అండగా ఉందన్న సందేశాన్ని అందించాలి. సమావేశంలో హోం, విపత్తు నిర్వహణ శాఖల మంత్రి తానేటి వనిత, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్రెడ్డి, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి. సాయిప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ కె.విజయానంద్, పౌరసరఫరాలశాఖ కమిషనర్ హెచ్.అరుణ్కుమార్, ఆర్ అండ్ బీ కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ పి.కోటేశ్వరరావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ ఏ.సూర్యకుమారి, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ జి.లక్ష్మీషా, ఏపీ విపత్తు నిర్వహణశాఖ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. -
బీమా కొరేగావ్ కేసు: ఇద్దరు నిందితులకు సుప్రీంకోర్టు ఊరట
ముంబయి: బీమా కొరేగావ్ కేసులో నిందితులుగా ఉన్న ఎల్గార్ పరిషత్ సభ్యులు వెర్నాన్ గోన్సాల్వేస్, అరుణ్ ఫెరీరాలకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తీవ్రవాద వ్యతిరేక నిరోధక చట్టం (ఊపా) కింద అరెస్టైన వీరిద్దరి బెయిల్ పిటీషన్ను 2021 డిసెంబర్లో బాంబే హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. బీమా కోరేగావ్ కేసులో హింసను ప్రేరేపించారనే ఆరోపణలపై 2018లో వీరిని అరెస్టు చేశారు. అప్పటి నుంచి ముంబయిలోని తలోజా జైలులో నిర్భందించారు. ఐదేళ్లపాటు వరుసగా కస్టడీలోనే ఉన్నందున కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. నిందితులపై ఉన్న ఆరోపణలు తీవ్రమైనవి అనే ఒక్క కారణంతో బెయిల్ నిరాకరించడం సమంజసం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. వెర్నాన్ గోన్సాల్వేస్, అరుణ్ ఫెరీరాల తరపున న్యాయవాదులు మూడు రోజుల పాటు వాదనలు వినిపించారు. ఊపా చట్టం కింద అరెస్టు చేయడానికి సరిపడు ఆధారాలు తమ క్లయింట్ల వద్ద లభించలేదని విన్నివించారు. అందుకు తగు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకోలేదని స్పష్టం చేశారు. పూణెలోని బీమా కొరేగావ్ యుద్ధ స్మారకం వద్ద 2017 డిసెంబర్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ కేసులో వెర్నాన్ గోన్సాల్వేస్, అరుణ్ ఫెరీరాలతో సహా 14 మందిని ఎన్ఐఏ నిందితులుగా చేర్చింది. బీమా కొరేగావ్ యుద్ధం జరిగి 200 ఏళ్ల వార్షికోత్సవాన్ని 2017 డిసెంబర్ 31న జరిపారు. దీనిని పురస్కరించుకుని ఎల్గార్ పరిషత్ ఈవెంట్కు సంబంధించి మావోయిస్టులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ముంబయి, నాగ్పూర్, ఢిల్లీ నుంచి 2018 జూన్లో ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఎల్గార్ పరిషత్ కార్యక్రమంలో రెచ్చగొట్టే ప్రసంగాలు హింసను ప్రేరేపించాయని విశ్రాంబాగ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇదీ చదవండి: కావాలనే లీక్ చేశారు.. మణిపూర్ నగ్న ఊరేగింపు ఘటనపై హోం మంత్రి వ్యాఖ్యలు -
సహారా డిపాజిటర్లకు గుడ్న్యూస్: చెల్లింపుల ప్రక్రియ షురూ.. ఫస్ట్ వారికే..
న్యూఢిల్లీ: సహారా గ్రూప్నకు చెందిన నాలుగు కోఆపరేటివ్ సొసైటీల్లో ఇరుక్కుపోయిన దాదాపు రూ. 5,000 కోట్ల మొత్తాన్ని తిరిగి డిపాజిటర్లకు అందజేసే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రారంభించింది. దీనితో చాలా కాలంగా తమ కష్టార్జితం కోసం ఎదురుచూస్తున్న కోట్ల మంది చిన్న ఇన్వెస్టర్లకు ఊరట లభించనుంది. ఇందుకోసం సీఆర్సీఎస్–సహారా రీఫండ్ పోర్టల్ను కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించారు. దీనితో ఒక కోటి మంది డిపాజిటర్లకు ప్రయోజనం చేకూరగలదని ఆయన పేర్కొన్నారు. ముందుగా రూ. 10,000 వరకు ఇన్వెస్ట్ చేసిన కోటి మంది ఇన్వెస్టర్లకు చెల్లింపులు జరపనున్నట్లు మంత్రి చెప్పారు. నాలుగు సొసైటీల (సహారా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ, సహారాయాన్ యూనివర్సల్ మల్టీపర్పస్ సొసైటీ, హమారా ఇండియా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ, స్టార్స్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ) మొత్తం డేటా సీఆర్సీఎస్–సహారా రీఫండ్ పోర్టల్లో ఉందని, దాని ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇందుకోసం ఇన్వెస్టరు ఆధార్ కార్డు వారి మొబైల్ నంబరు, బ్యాంకు ఖాతాలకు అనుసంధానమై ఉండాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న 45 రోజుల్లోగా వారికి రావాల్సిన సొమ్ము వారి ఖాతాల్లో జమవుతుందని చెప్పారు. రూ. 5,000 కోట్ల చెల్లింపులు పూర్తయిన తర్వాత ఇతర ఇన్వెస్టర్లకు చెందిన డబ్బును కూడా తిరిగి చెల్లించేందుకు అనుమతుల కోసం సుప్రీం కోర్టును కోరనున్నట్లు ఆయన తెలిపారు. సహారా–సెబీ రిఫండ్ ఖాతా నుంచి రూ. 5,000 కోట్ల మొత్తాన్ని సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ (సీఆర్సీఎస్)కు బదలాయించాలంటూ గతంలో సుప్రీం కోర్టు ఆదేశించింది. నాలుగు సహకార సంఘాలకు చెందిన 10 కోట్ల మంది ఇన్వెస్టర్లకు 9 నెలల్లోగా డిపాజిట్ మొత్తాలను వాపసు చేస్తామంటూ మార్చి 29న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. -
సుప్రీంకోర్టుకు చేరిన వరద నీరు.. సైన్యం సహకారాన్ని కోరిన కేజ్రీవాల్..
ఢిల్లీ: యమునా నది ఉప్పొంగడంతో దేశ రాజధాని తీవ్ర ముప్పును ఎదుర్కొంటోంది. ఢిల్లీలో ప్రధాన ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. డ్రెయిన్ రెగ్యులేటర్ పాడవడంతో ఐటీఓ క్రాసింగ్ ఏరియా, నిత్య రద్దీగా ఉండే ప్రాంతాల్లోకి యమునా నది వరద నీరు పారుతోంది. దీంతో అప్రమత్తమైన సీఎం కేజ్రీవాల్.. ఆర్మీ సహాయం కోరాలని అధికారులకు ఆదేశించారు. విపత్తు నిర్వహణ శాఖ సహాయం తీసుకుని రెగ్యులేటర్ను సరిచేయాలని కోరారు. ఇందుకోసం ఇంజినీరు బృందాలు రాత్రంతా ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయిందని చెప్పారు. ఇంద్రప్రస్తా బస్ డిపో నుంచి డబ్ల్యూహెచ్ఓ బిల్డింగ్ మధ్య ఉండే డ్రెయిన్ రెగ్యులేటర్ పాడయిపోయిన కారణంగా వరద ఉద్దృతి ఈ ప్రాంతానికి చేరినట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. కాగా.. ఐటీఓ క్రాసింగ్ ఏరియాలో ఎలక్ట్రిక్ పోల్స్కు షాక్ వచ్చిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆ ప్రాంతంలో కరెంట్ సరఫరాను నిలిపివేశారు. This breach is causing flooding of ITO and surroundings. Engineers have been working whole nite. I have directed the Chief Secretary to seek help of Army/NDRF but this shud be fixed urgently https://t.co/O8R1lLAWXX — Arvind Kejriwal (@ArvindKejriwal) July 14, 2023 సుప్రీంకోర్టుకు వరద నీరు.. ఢిల్లీలో రికార్డ్ స్థాయిలో ఉప్పొంగిన యమునా నది ఈ రోజు కాస్త తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. నిన్న యమునా నది 208.46 మీటర్ల మేర ప్రవహించింది. కానీ ఈ రోజు మధ్యాహ్నానానికి 208.30కు తగ్గుతుందని కేంద్ర వాటర్ కమిషన్ అంచనా వేసింది. అయితే.. ఇప్పటికే వరద నీరు ఏకంగా ఢిల్లీ నడిబొడ్డున ఉన్న తిలక్ మార్గ్లోని సుప్రీంకోర్టుకు చేరుకుంది. ఢిల్లీలో వరద నేపథ్యంలో ఫ్రాన్స్లో పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. హోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు. పరిస్థితి తీవ్రతను సమీక్షించారు. దేశ రాజధాని ఢిల్లీలో రహదారులు నదులయ్యాయి. ఇళ్లు నీట మునిగిపోయాయి. శ్మశాన వాటికలు సైతం జలమయంగా మారాయి. రోడ్లపైకి వచ్చే వీలు లేకుండాపోయింది. మొత్తంగా ఢిల్లీలో జనజీవనం స్తంభించిపోయింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో యమునా నదిలో నీటమట్టం గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఏకంగా 208.62 మీటర్లకు చేరుకుంది. దీంతో నగరంలో మరిన్ని ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో పాఠశాలలకు, ఆఫీసులకు సెలువులు ప్రకటించారు. ఇదీ చదవండి: Delhi Rainfall Floods: యమున విశ్వరూపం.. ముంపులో ఢిల్లీ.. జల దిగ్బంధంలో జనజీవనం -
పరువు నష్టం కేసులో రాహుల్కు గాందీకి ఊరట.. ‘చర్యలు వద్దు’
రాంచీ: గతంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి పేరు వ్యవహారంలో పరువు నష్టం కేసును ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాందీకి జార్ఖండ్ హైకోర్టు ఊరట కలిగించింది. ఈ కేసు విచారణ కోసం వ్యక్తిగతంగా రాంచీ కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదంటూ మినహాయింపు ఇచి్చంది. ప్రస్తుతానికి రాహుల్పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయమూర్తి జస్టిస్ ఎస్కే ద్వివేదీ ఆదేశాలు జారీ చేశారు. పరువు నష్టం కేసులో తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ రాంచీ ఎంపీ–ఎమ్మెల్యే కోర్టు ఇచి్చన ఉత్తర్వును సవాలు చేస్తూ రాహుల్ వేసిన పిటిషన్పై జార్ఖండ్ హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. తదుపరి విచారణను ఆగస్టు 16వ తేదీకి వాయిదా వేసింది. 2019 ఏప్రిల్లో కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ప్రదీప్ మోదీ అనే వ్యక్తి రాంచీ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. -
అమెరికా కోర్టులో బైజూస్కు ఊరట
న్యూఢిల్లీ: టర్మ్ లోన్ బి (టీఎల్బీ) న్యాయ వివాదంలో ఎడ్టెక్ కంపెనీ బైజూస్కు అమెరికా కోర్టులో ఊరట లభించింది. బైజూస్ తమ అమెరికన్ అనుబంధ కంపెనీ నుంచి 500 మిలియన్ డాలర్ల నిధులను ఇతర సంస్థలకు మళ్లించడంపై విచారణ జరపాలంటూ టీఎల్బీ రుణదాతలు వేసిన పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. దీనిపై తదుపరి విచారణ చేయడానికి సంబంధించి రుణదాతలకు తగిన ప్రాతిపదిక లేదని డెలావేర్ కోర్టు వ్యాఖ్యానించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 1.2 బిలియన్ డాలర్ల టీఎల్బీ రుణాన్ని సత్వరం చెల్లించాలని రుణదాతలు ఒత్తిడి తేవడంపై వివాదం తలెత్తడం, దీన్ని సవాల్ చేస్తూ బైజూస్ .. న్యూయార్క్ సుప్రీం కోర్టును ఆశ్రయించడం తెలిసిందే. -
టాబ్లెట్స్ వేసుకున్నా తలనొప్పి తగ్గడం లేదా? అయితే ఇలా చేయండి
తలనొప్పి..ఈరోజుల్లో ప్రతి ఒక్కరిని సాధరణంగా వేధించే సమస్య ఇది. ఒత్తిడి సహా అనేక కారణాల వల్ల తలనొప్పి రావొచ్చు. కొన్నిసార్లు గంటల సమయం నుంచి రోజుల వరకు తలనొప్పి వేధిస్తుంటుంది. తల పగిలిపోయినట్లు అనిపించే ఈ బాధ నుంచి బయటపడేందుకు చాలామంది నొప్పి నివారణ బామ్లు, పెయిన్ కిల్లర్ మాత్రలు వేసుకుంటుంటారు. కానీ ఇవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. సులభంగా, ఇంటి చిట్కాలతోనే తలనొప్పి నుంచి సత్వర ఉపశమనం పొందవచ్చు. అవేంటో తెలుసుకుందాం. నీటిని తగినంత తీసుకోకపోయినా తలనొప్పి వస్తుంటుంది. కాబట్టి రోజుకు 8-10 గ్లాసుల నీరు తప్పనిసరిగా తాగాలి. కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి పానీయాలను ఎక్కువగా తీసుకోవాలి. ఒక గ్లాసు వేడి నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగితే తలనొప్పి నుంచి రిలీఫ్ లభిస్తుంది. గోరు వెచ్చని ఆవుపాలు సైతం తలనొప్పి నివారణిగా పనిచేస్తుందట. బాగా తలనొప్పిగా ఉన్నప్పుడు జీడిపప్పు, బాదం వంటి డైఫ్రూట్స్ను గుప్పెడు తింటే తలనొప్పి తగ్గుతుందట. మెగ్నీషియం లోపంతో కూడా తలనొప్పి వేధిస్తుంది. అందుకని మెగ్నీషియం సప్లిమెంట్స్ తీసుకోవాలి. మంచినీటిలో ధనియాలు, చక్కెర కలిపి తాగితే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. గంధం చెక్కను అరగదీసి నుదిటిపై రాయడం ద్వారా కూడా తలనొప్పిని తగ్గించుకోవచ్చు. నిత్యం క్రమం తప్పకుండా 8 గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి. దీంతో పాటు వేళకు భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి. ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగితే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అల్లం ఎన్నో రకాల ఆయుర్వేద గుణాలని కలిగి ఉంటుంది. తలనొప్పిగా ఉన్నప్పుడు అల్లం టీని తాగడం వల్ల ఇన్స్టెంట్ రిలీఫ్ లభిస్తుంది. -
కెనడాలోని భారత విద్యార్ధులకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: కెనడాలోని భారత విద్యార్థులకు గొప్ప ఉపశమనం లభించింది. విద్యాభ్యాసం నిమిత్తం కెనడా వచ్చిన భారతీయ విద్యార్ధులు ఫేక్ ఆఫర్ లెటర్లతో వచ్చారని నిర్ధారించి కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ బహిష్కరణ వేటు వేసినా విషయం తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ విక్రంజీత్ సహానీ చొరవతో స్పందించిన CBSA మానవతాదృక్పథంతో స్పందించి బహిష్కరణ ప్రక్రియను నిలిపివేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ విక్రంజీత్ సహానీ, భారత హై కమిషన్ సహాయంతో బహిష్కరణ వేటుకు గురైన విద్యార్థులకు న్యాయం చేయమని కెనడా ప్రభుత్వాన్ని అభ్యర్ధించగా అందుకు సానుకూలంగా స్పందిస్తూ 700 విద్యార్ధులపై వారు విధించిన వేటును నిలిపివేశారు. ఈ మేరకు ప్రపంచ పంజాబీ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ అధ్యక్షుడు కూడా అయిన ఎంపీ విక్రంజీత్ సహానీ కెనడా ప్రభుత్వానికి కృతఙ్ఞతలు తెలిపారు. ఎంపీ మాట్లాడుతూ... విద్యార్థుల భవిష్యత్తుపై మేము కెనడా ప్రభుత్వాన్ని కోరిన ప్రకారం వారు సానుకూలంగా స్పందించడం చాలా సంతోషకరం. ఈ విద్యార్థుల తప్పేమీ లేదని ఎవరో చేసిన తప్పుకు వీరిని శిక్షించడం సరికాదని వారికి వివరించడం జరిగింది. బ్రిజేష్ మిశ్రా అని జలంధర్ కు చెందిన ఒక ఏజెంట్ తన స్వార్ధం కోసం ఫేక్ ఆఫర్ లెటర్లు, ఫేక్ రసీదులు ఇచ్చారు. దానికి విద్యార్థులు బలయ్యారు. మీరే అనుమతించారు.. ఎటువంటి తనిఖీలు చేయకుండానే కెనడా ఇమ్మిగ్రేషన్ అధికారులు కూడా వారిని అనుమతించారని వారికి జరిగింది వివరించిన తర్వాత వారు పరిస్థితిని అర్ధం చేసుకుని మొత్తం 700 విద్యార్ధులపై వేసిన వేటును నిలిపివేశారు. ఉదార స్వభావంతోనూ మానవతా దృక్పథంతోనూ స్పందించిన కెనడా ఎంపీ సీన్ ఫ్రేజర్ గారికి ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. Sincere thanks to @seanfraserMP @Bradredekopp @jennykwanBC for their very considerate and compassionate take on 700 students who are victims of fraudulent agencies and obliging our request for staying the deportation. I am hopeful that witness testimonies will help in punishing… pic.twitter.com/eXTXBYMOQ2— Vikramjit Singh MP (@vikramsahney) June 9, 2023 Thanks for this big relief. I am happy that our request has been considered to put an hold on the deputation of students who were made victims of the connivance of their agents and counterparts in Canada for issuing fake admission letters and fee receipts on which they received… https://t.co/Sl2FvbXCGV— Vikramjit Singh MP (@vikramsahney) June 8, 2023 -
భయం లేకుండా స్త్రీలు పార్కులకు వెళ్లొచ్చు.. ఇవి వారికి మాత్రమే!
ఢిల్లీలో స్త్రీలకు ఉపశమనం. ఢిల్లీలోని 250 వార్డుల్లో కేవలం స్త్రీలకు మాత్రమే ప్రవేశం కల్పించే ‘పింక్ పార్కు’లను ఏర్పాటు చేయనున్నారు. ఆకతాయుల వల్ల, దొంగల వల్ల పార్కులకు వెళ్లాలంటే భయపడే స్త్రీలు ఇళ్లల్లోనే మగ్గాల్సిన అవసరం లేకుండా చేసిన ఆ ఆలోచన మెచ్చుకోలు పొందుతోంది. బహుశా ప్రతి నగరంలో, పట్టణంలో ఇలాంటి పార్కులు ఉండాలేమో. ఆడవాళ్లు ఉదయాన్నే పార్క్కు వెళ్లి నడవాలనుకుంటారు. వారికి సౌకర్యంగా ఉండే బట్టలు వేసుకుని నడుస్తుంటారు. కాని అలా నడిచేవారిని చూడటానికి కొందరు ఆకతాయులు వస్తుంటారు. ఇంకేం నడక? పార్కుకు వచ్చి యోగా మ్యాట్ పరిచి ఆసనాలు వేద్దామనుకుంటారు. అటుగా వెళుతున్న మగవారు ఒక నిమిషం ఆగి చూసినా వారికి అసౌకర్యమే. ఆడవాళ్లు పార్క్లో పిల్లలతో ఆడుకోవాలనుకుంటారు. పక్కనే ఒక తండ్రి వచ్చి తన పిల్లలతో ఆడుకుంటూ ఉంటే వారు ఉండగలరా? పార్కుకు వచ్చి ఆడవాళ్లు అక్కడున్న జిమ్ పరికరాలతో ఏవో ప్రయత్నాలు చేయాలనుకుంటారు. మగవారు కూడా లోపల ఉంటే ఎంత ఇబ్బంది. పార్క్కు వచ్చిన ఆడవాళ్లు ఊరికే అలా బెంచీ మీద కూచుని పాటలు వినడమో, పుస్తకం చదువుకోవడమో చేయాలనుకున్నా కావలసిన ప్రైవసీ దొరుకుతుందా? ఇంట్లో ఇరవై నాలుగ్గంటలూ ఉండే గృహిణులు, అమ్మమ్మలు, నానమ్మలు, ఉద్యోగం చేసి అలసొచ్చిన స్త్రీలు కాస్త తెరిపిన పడాలంటే ఆహ్లాదమైన, సురక్షితమైన పబ్లిక్ ప్లేస్ ఉంటే ఎలా ఉంటుంది? వీటన్నింటికి జవాబు ‘పింక్ పార్క్’. ఢిల్లీలో ఉన్న 250 వార్డుల్లో ప్రతి వార్డులోనూ తప్పనిసరిగా ఒక ‘పింక్ పార్క్’ను ఏర్పాటు చేయాలని ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. ‘ఢిల్లీలో కార్పొరేషన్ పరిధిలో 15000 పార్కులు ఉన్నాయి. ఇవి స్త్రీలు, పురుషులు ఉపయోగించడానికి వీలుగా మెయిన్టెయిన్ అవుతున్నాయి. కాని వీటిలోని జిమ్లను కాని, వాకింగ్ ట్రాక్లను కాని, పిల్లల ప్లే ఏరియాలను కాని ఉపయోగించుకోవడానికి స్త్రీలు ఇబ్బంది పడటం గమనించాం. అందుకే స్త్రీలకు మాత్రమే ప్రవేశం కల్పించే పింక్ పార్క్లను ఏర్పాటు చేస్తున్నాం’ అని కార్పొరేషన్ డిప్యూటి మేయర్ తెలియచేశారు. నేరాలను దృష్టిలో పెట్టుకుని ఢిల్లీలో నేరాలు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి. పార్కుల్లో ఆకతాయిల బెడద ఉంటుంది. పిల్లలను ఎత్తుకుని పోయేవారు కూడా ఉండొచ్చు. అందుకని చాలామంది తల్లులు భర్త తోడు లేకుండా రావడానికి సంశయిస్తుంటారు. వీరి కోసమే ‘పింక్ పార్కులు’ రానున్నాయి. స్త్రీల నిర్వహణ పింక్ పార్కులకు ప్రవేశ ద్వారాల దగ్గర మాత్రమే మగ గార్డులు ఉంటారు. లోపల పార్కు నిర్వహణకు, జిమ్కు, క్యాంటిన్ దగ్గర ఆడవాళ్లే పని చేస్తారు. ‘పదేళ్ల లోపు మగ పిల్లలను మాత్రమే ఈ పార్కుల్లో తల్లులతో పాటు అనుమతిస్తాం’ అని కార్పొరేషన్ బాధ్యులు తెలియచేశారు. సీసీ టీవీలు అడుగడుగునా ఉంటాయి. పిల్లలు ఆడుకునే చోట నిఘా ఉంటుంది. దీని వల్ల పిల్లలను ఆడుకోవడానికి వదిలి స్త్రీలు తమ వ్యాయామాలను, నడకను, జిమ్ను నిశ్చింతగా కొనసాగించవచ్చు. ‘అన్నింటికంటే ముఖ్యం పిల్లలతో హాయిగా ఆడుకోవాలనుకునే తల్లులు బిడియం అక్కర్లేకుండా ఆడుకోవచ్చు’ అంటున్నారు ఈ ఆలోచనకు బాధ్యులు. ప్రతి ఊరిలో అవసరం బిజీ లైఫ్లో స్త్రీలు కాసింత విరామాన్ని, ఆహ్లాదాన్ని కోరుకుంటే అలాంటి వారికి పింక్ పార్కులు గొప్ప ఓదార్పు అవుతాయి. పిల్లల ఆరోగ్యం కోసం, కాలక్షేపం వారిని ఆడించాలనుకునే తల్లులు కూడా వీటి వల్ల మేలు పొందుతారు. తగిన చోటు లేక కనీసం వాకింగ్ కూడా చేయలేని స్త్రీలు వీటివల్ల చురుకుదనాన్ని, ఆరోగ్యాన్ని పొందే వీలుంటుంది. ఇన్నీ ప్రయోజనాలున్న ఆలోచనను ప్రతి రాష్ట్రంలో ప్రతిపాదించవచ్చు. స్త్రీలు విన్నవిస్తే ప్రభుత్వాలు వింటాయి కూడా. త్వరలో అన్ని ఊళ్లలో ఇలాంటి పార్క్లు రావాలని ఆశిద్దాం. -
చల్లని కబురు.. 5 రోజులు ఎండల నుంచి ఉపశమనం: వాతావరణ శాఖ
న్యూఢిల్లీ: దేశంలో వారం రోజులుగా ఎండలు, వడగాలులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. రానున్న అయిదు రోజుల్లో దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో వడగాలులు వీసేందుకు అవకాశాలు లేవని అంచనా వేసింది. తెలంగాణ, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలపై అల్పపీడన ద్రోణి ఏర్పడిందని తెలిపింది. దీని ప్రభావంతో ఆయా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మొత్తమ్మీద ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయని వివరించింది. ఆంధ్రప్రదేశ్, దక్షిణ కర్ణాటక, యూపీ, పంజాబ్, బిహార్ తదితర రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన గాలి వాన కురుస్తుందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ తెలిపింది. (మువ్వన్నెల జెండాకు అవమానం.. చికెన్ శుభ్రం.. వీడియో వైరల్.. అరెస్ట్) -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనానికి ఊరట..
ముంబై: మాతృసంస్థ హెచ్డీఎఫ్సీతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనానికి ముందు కొంత ఊరట లభించింది. కొన్ని అంశాల్లో ఆర్బీఐ స్వేచ్ఛను కల్పించగా, కొన్నింటి విషయంలో ఉపశమనం కల్పించేందుకు నిరాకరించింది. రెండు సంస్థల విలీనం జూలై నాటికి పూర్తవుతుందని అంచనా. తాము దరఖాస్తు చేసిన కొన్ని అంశాల్లో ఆర్బీఐ నుంచి సమాచారం వచ్చిందని, మరికొన్ని అంశాలు పరిష్కృతం కావాల్సి ఉందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రకటించింది. ఇదీ చదవండి: దేశంలో తొలి లిథియం బ్యాటరీ ప్లాంటు షురూ నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్), స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో (ఎస్ఎల్ఆర్) విషయంలో వెసులుబాట్లకు ఆర్బీఐ తిరస్కరించింది. ప్రాధాన్య రంగాలకు రుణాలు (పీఎస్ఎల్), పెట్టుబడుల విషయంలో మాత్రం ఉపశమనం కల్పించింది. విలీనం తేదీ నుంచి సీఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, ఎల్సీఆర్ను నిబంధనలకు అనుగుణంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నిర్వహించాల్సి ఉంటుంది. ఇక హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్ తదితర సంస్థలు ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ అనుబంధ సంస్థలు (సబ్సిడరీలు)గా ఉండగా.. విలీనం తర్వాత ఇవి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సబ్సిడరీలుగా కొనసాగేందుకు ఆర్బీఐ అనుమతించింది. విలీనానికి ముందే హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్లో వాటాని హెచ్డీఎఫ్సీ లేదా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 50 శాతానికి పైగా పెంచుకోవచ్చు. ఉన్నత విద్యకు రుణాలు అందించే హెచ్డీఎఫ్సీ క్రెడాలియా ఫైనాన్షియల్ సర్వీసెస్లో నూరు శాతం వాటా హెచ్డీఎఫ్సీకి ఉంది. రెండేళ్లలో ఈ వాటాని 10 శాతానికి హెచ్డీఎఫ్సీ బ్యాంకు తగ్గించుకోవాలి. కొత్త కస్టమర్లను తీసుకోవడాన్ని నిలిపివేయాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
డిస్కంలకు కాస్త ఊరట..విద్యుత్ అమ్మకం ధరలు తగ్గింపు!
సాక్షి, అమరావతి: విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కం)కు కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి(సీఈఆర్సీ) కాస్త ఊరట కలిగించింది. బహిరంగ మార్కెట్లో విద్యుత్ అమ్మకం ధరల సీలింగ్ను మారుస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది. వేసవిలో విద్యుత్ డిమాండ్, కొరతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఈఆర్సీ వెల్లడించింది. తాజా నిర్ణయంతో బహిరంగ మార్కెట్లో హై ప్రైస్ డే ఎహెడ్ మార్కెట్ ధరలు యూనిట్కు రూ.50 నుంచి రూ.30కు తగ్గాయి. సాధారణ సమయాలకు సంబంధించి యూనిట్ ధర రూ.12 నుంచి రూ.10కు తగ్గింది. అప్పట్లో అంతా వాళ్లిష్టమే.. దేశంలోని అన్ని రాష్ట్రాలూ తమ రోజువారీ అవస రాలకు సరిపడా విద్యుత్ను ఉత్పత్తి చేసుకోలేవు. కొన్ని రాష్ట్రాలు తమ ఉత్పత్తి సామర్థ్యానికి అనుగుణంగా అవసరం మేరకు ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ను కొనుగోలు చేస్తుంటాయి. అయి తే అది దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ప్రకారం జరుగుతుంది. కానీ ఇతర సమయా ల్లో నూ ఫిక్స్డ్ చార్జీలు చెల్లించాల్సి రావడంతో డిస్కంలు ఆర్థికంగా బాగా నష్టపోతుండేవి. ఈ నేపథ్యంలో లాంగ్ టర్మ్ పీపీఏలకు బదులు షార్ట్ టర్మ్ పీపీఏలు చేసుకోవడం మొదలుపెట్టాయి. కానీ ఆ ఒప్పందాల వల్ల కూడా కొన్ని రాష్ట్రాల్లో విద్యుత్ అవసరాలు తీరడం లేదు. ఈ నేపథ్యంలో బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్ను కొనుగోలు చేస్తున్నాయి. 2021 వరకు బహిరంగ మార్కెట్లో ని ధరలు విద్యుత్ ఉత్పత్తిదారుల ఇష్టానుసారం ఉండేవి. అదే ఏడాది అక్టోబర్లో బొగ్గు సంక్షోభం ఏర్పడటంతో థర్మల్ విద్యుత్ కేంద్రాలు మూతపడటం.. ఉత్పత్తిని తగ్గించడంతో విద్యుత్ కొరత ఏర్పడింది. ఆ సమయంలో మార్కెట్లో విద్యుత్కు డిమాండ్ పెరిగింది. ఇదే అదనుగా ఉత్పత్తి సంస్థలు భారీ ధరలు వసూలు చేశాయి. ఈ నేపథ్యంలో సీఈఆర్సీ గతేడాది మార్చి 5న సీలింగ్ విధానాన్ని తీసుకువచ్చింది. ఇవీ కొత్త ధరలు సీఈఆర్సీ గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించి యూనిట్ ధరను రూ.50 నుంచి రూ.20కు తగ్గించింది. అలాగే ఏడాదిగా అమలులో ఉన్న సాధా రణ సమయాల్లో సీలింగ్ ధరను రూ.12 నుంచి రూ.10కు మార్చింది. పవర్ మార్కెట్ రెగ్యులేషన్స్–2021 ప్రకారం రిజిస్టర్ అయిన అన్ని పవర్ ఎక్సే్చంజ్లలో ఏప్రిల్ 4 నుంచి ఈ సవరించిన ధరలతోనే విద్యుత్ ట్రేడింగ్ జరగాలని ఆదేశించింది. దిగుమతి చేసుకున్న గ్యాస్, బొగ్గు అధిక ధరను పరిగణనలోకి తీసుకుని గతంలో సీలింగ్ పెంచామని.. ఇప్పుడు వాటి ధరలు తగ్గడంతో సీలింగ్ కూడా తగ్గించామని కమిషన్ తెలిపింది. ఇప్పుడు కొనేవాళ్లు కరువై.. సీఈఆర్సీ సీలింగ్ ప్రకారం యూనిట్ విద్యుత్ను రూ.12కు మించి అమ్మడానికి అవకాశం ఉండేది కాదు. అంటే ఆ రేటుకు, లేదా అంతకంటే తక్కువకే డిస్కంలకు విద్యుత్ లభించేది. ఈ విధానం బాగున్నప్పటికీ కొందరు ప్రైవేటు జెన్కోల నిర్వాహకులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు. అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్, బొగ్గు ధరలు విపరీతంగా పెరిగినందున విద్యుత్ అమ్మకం ధర సీలింగ్ పెంచాలని కోరారు. వారి విజ్ఞప్తి మేరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో యూనిట్ ధరను రూ.50 గా సీఈఆర్సీ సీలింగ్ ప్రకటించింది. దీనిపై డిస్కంలు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశాయి. వేసవిలో అత్యధిక విద్యుత్ అవసరం అవుతున్నందున అంత ఎక్కువ రేటుకు కొనడం ఆర్థికంగా ఇబ్బంది అని కేంద్రానికి మొరపెట్టుకున్నాయి. మరోవైపు ధరలు పెంచినప్పటి నుంచి బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోళ్లు దారుణంగా పడిపోయాయి. దీంతో సీఈఆర్సీ ధరలను భారీగా తగ్గించింది. (చదవండి: పెట్టుబడుల ప్రోత్సాహక విధానం బాగుంది) -
Imran Khan: విద్వేష ప్రసంగం కేసు.. తాత్కాలిక ఊరట
ఇస్లామాబాద్: పాక్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) చైర్మన్ ఇమ్రాన్ ఖాన్కు తాత్కాలిక ఊరట లభించింది. తాజా విద్వేషపూరిత ప్రసంగం కేసులో క్వెట్టా స్థానిక కోర్టు ఒకటి ఆయన మీద అరెస్ట్ వారెంట్ జారీ చేయగా.. దానిని రెండు వారాల పాటు నిలిపివేయాలంటూ బెలూచిస్తాన్ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. విద్వేషపూరిత ప్రసంగం కేసుకు గానూ సదరు స్థానిక కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ క్రమంలో.. క్వెట్టా పోలీసుల బృందం ఒకటి ఖాన్ను అరెస్ట్ చేసేందుకు లాహోర్కు కూడా చేరుకుంది. అయితే ఈలోపే బెలూచిస్తాన్ హైకోర్టు ఆయనకు తాత్కాలిక ఊరట ఇవ్వడం విశేషం. ఇదిలా ఉంటే.. గత ఆదివారం లాహోర్లోని ఆయన నివాసం జమాన్ పార్క్ వద్ద భారీ హైడ్రామా నడిచింది. తోషాఖానా కేసులో కోర్టు విచారణకు గైర్హాజరు అవుతుండడంతో ఆయన్ని అరెస్ట్ చేయాలంటూ కోర్టు ఆదేశించడంతో.. పోలీసులు అక్కడి చేరుకున్నారు. అయితే పీటీఐ కార్యకర్తల నిరసన ప్రదర్శనలతో పోలీసులు వెనక్కి తగ్గారు. ఆ సమయంలోనే పీటీఐ కార్యకర్తలను, జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఖాన్.. పాక్ సర్కార్ను, దర్యాప్తు సంస్థలను, పోలీసులను తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ సంస్థలను విమర్శిస్తూ సంచలన ఆరోపణలు చేసినందుకుగానూ బిజిల్ ఘర్ పోలీస్ స్టేషన్లో ఖాన్పై ఓ కేసు నమోదు అయ్యింది. దీంతో క్వెట్టా స్థానిక కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆ వెంటనే ఖాన్ బెలూచిస్తాన్ హైకోర్టును ఆశ్రయించారు. ఖాన్ ప్రసంగించిన చోటుకి.. బిజిల్ఘర్ స్టేషన్ పరిధికి సంబంధం లేదంటూ ఖాన్ తరపు న్యాయవాది వాదించగా.. కోర్టు ఆ వాదనతో ఏకీభవించింది. లోకల్ కోర్టు జారీ చేసిన వారెంట్ను రెండు వారాలపాటు సస్పెండ్ చేస్తూ(విచారణ రెండు వారాలు వాయిదా వేసింది).. బెలూచిస్తాన్ ఎస్పీకి, బిజిల్ పోలీస్ స్టేషన్ అధికారులకు సమన్లు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. ఇమ్రాన్ ఖాన్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ వ్యాప్తంగా ఇప్పటివరకు 37 కేసులు నమోదు అయ్యియి. వీటిల్లో నేరుగా ఆయన పేరును నిందితుడిగా పేర్కొనడం గమనార్హం. -
థాంక్యూ భారత్! ఎప్పటికీ మనం దోస్తులమే!: టర్కీ రాయబారి
టర్కీలో వచ్చిన భారీ భూకంపం కారణంగా సుమారు 30 వేల మంది దాక చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ 'ఆపరేషన్ దోస్త్'లో భాగంగా టర్కీకి తక్షణ సాయం అందించడమే గాక పలు రెస్క్యూ బృందాలను కూడా పంపించింది. అందులో భాగంగానే భారత్ 23 టన్నులకు పైగా సహాయక సామాగ్రితో మరో ఏడవ ఆపరేషన్ దోస్త్ విమానాన్ని టర్కీకి పంపించింది. ఆ విమానం ఆదివారం భూకంప బాధిత సిరియాకు చేరుకుంది. దీనిని డమాస్కస్ విమానాశ్రయంలోని స్థానిక పరిపాలన, పర్యావరణ డిప్యూటీ మంత్రి మౌతాజ్ డౌజీ అందుకున్నారు. ఈ మేరకు టర్కీ రాయబారి ఫిరత్ సునెల్ సోమవారం తమ దేశానికి మరోసారి సహాయక సామాగ్రిని పంపినందుకు భారతదేశానికి ధన్యవాదాలు తెలిపారు. రాయబారి సునెల్ ట్విట్టర్ వేదికగా.. భారత ప్రజల నుంచి మరో బ్యాచ్ అత్యవసర విరాళాలు టర్కీకి చేరుకున్నాయి. భూకంపం సంభవించిన ప్రాంతానికి ప్రతి రోజు ఎంతో ఉదారంగా ఉచిత సహాయాన్ని అందజేస్తోంది. అందుకు భారతదేశానికి ధన్యావాదాలు. వందల వేల మంది భూకంప నుంచి బయటపడిన వారందరికి ఈ సమయంలో గుడారం, దుప్పటి, స్లీపింగ్ బ్యాగ్ వంటివి చాలా ముఖ్యమైనవి. అలాంటి వాటన్నింటిని ఈ విపత్కర సమయంలో మా ప్రజలకు అందించి ఎంతో మేలు చేసింది. లాంఛనప్రాయంగా ప్రారంభమైన ఈ 'ఆపరేషన్ దోస్త్' మనం ఎప్పటికీ స్నేహితులమని నిరూపించింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింతగా బలోపేతం కావలి అని ట్వీట్ చేశారు. THANK YOU INDIA! 🇮🇳🇮🇳🇮🇳 Each tent, each blanket or sleeping bag are of vital importance for the hundreds of thousands of earthquake survivors. https://t.co/v9rsXtdzjL — Fırat Sunel फिरात सुनेल فرات صونال (@firatsunel) February 13, 2023 (చదవండి: ఉక్రెయిన్ మరితంగా బ్రిటన్ మిటలరీ సాయం..మండిపడుతున్న రష్యా) -
Happy New Year 2023: మెరిసేనా.. ఉరిమేనా?
ఎస్.రాజమహేంద్రారెడ్డి మరో ఇరవై నాలుగు గంటల్లో రెండు వేల ఇరవై రెండు జ్ఞాపకాల పుటల్లోకి వెళ్లిపోతుంది. జ్ఞాపకం ఎప్పుడూ గుర్తుగానే మిగిలిపోతుంది. టైమ్ మెషీన్లో వెనక్కు వెళ్లి అనుభవంలోకి తెచ్చుకోలేము. కొన్ని జ్ఞాపకాలు కంటినుంచి జారిపడ్డ మెరుపుల్లాగా పెదవులపై చిరునవ్వులు వెలిగిస్తాయి. మరికొన్ని కన్నీటి చుక్కల్లా అప్రయత్నంగా ఒలికిపోయి ఘనీభవిస్తాయి. అప్పుడప్పుడు భయపెడతాయి. 2020, 2021 సంవత్సరాలు ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపి మానవాళికి అంతులేని విషాదాన్ని, నిర్వేదాన్ని, మానసిక ఒత్తిడిని మిగిల్చి వెళ్లాయి. 2022 ఆశాజనకంగానే ఆరంభమై భయంభయంగానే అయినా మందహాసంతో మందగమనంగా కొనసాగుతున్న వేళ ఒకరి రాజ్యకాంక్ష యుద్ధ రూపంలో విరుచుకుపడింది. యుద్ధం తాలూకు దుష్పరిణామాలు ప్రపంచాన్ని నిర్దాక్షిణ్యంగా మాంద్యంవైపు నెట్టాయి. ఏడాది చివర్లో కంటికి కనిపించని వైరస్ ఒకటి మరోసారి రాబోయే గడ్డు పరిస్థితులను కళ్లకు కట్టడం మొదలుపెట్టింది. ఉగాది పచ్చడిలా తీపి, చేదులను రుచి చూపించిన 2022 మానవాళికి కొంతలో కొంత ఉపశమనం కలిగించి వెళ్లిపోతోంది. మరి 2023 కొత్త ఆశలకు ఊపిరులూదుతుందా, లేక ఉన్న ఉసురూ తీస్తుందా? చూడాల్సిందే! వెళ్లిపోనున్న ఈ ఏడాది ప్రభావం రానున్న ఏడాదిపై ఎంతమేరకు పడనుందో ఒకసారి చూద్దాం... మాంద్యం... ముంచుకొస్తోంది! రోజురోజుకూ పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో నిత్యావసరాల ధరలు రాకెట్ వేగంతో చుక్కలవైపు దూసుకెళుతున్నాయి. కరోనా భయాలు, ఆంక్షలు రెండేళ్లపాటు ప్రపంచ ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసి వృద్ధి రేటును పాతాళంలోకి నెట్టేశాయి. ఫలితంగా ఈ ఏడాది ద్రవ్యోల్బణం గత దశాబ్దంలోకెల్లా గరిష్టానికి చేరుకుంది. ఇది వచ్చే ఏడాది మరింత పైపైకి ఎగబాకి దాదాపు ప్రపంచాన్ని యావత్తూ మాంద్యంలోకి నెడుతుందని విశ్లేషకుల అంచనా. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఇంకా ఓ కొలిక్కి రాకపోవడం మాంద్యానికి మరింత ఆజ్యం పోస్తుందని వారి విశ్లేషణ. ద్రవ్యోల్బణాన్ని అరికడితే మాంద్యం బారిన పడకుండా బయటపడే అవకాశం ఉంటుందనేది ఆర్థిక నిపుణుల అభిప్రాయం. ఈ దిశగా ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులన్నీ ఈ ఏడాది ఇప్పటికే పలుమార్లు వడ్డీరేట్లు పెంచాయి. వచ్చే ఏడాది కూడా వడ్డీరేట్లు మరింత పెరిగే అవకాశముంది. అమెరికాలో ద్రవ్బోల్బణం ఈ ఏడాది ఒక దశలో గత 40 ఏళ్లలో గరిష్టంగా ఏకంగా 9 శాతానికి ఎగబాకడం ప్రపంచ ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోంది. ఫలితంగా ఆహార పదార్థాల ధరలు పెరగడం సగటు మనిషికి కోలుకోని దెబ్బే. పెట్రో ధరలు పెరగడం మధ్యతరగతి జీవితాలను పెనంమీది నుంచి పొయ్యిలోకి నెట్టింది. ఒకవైపు ద్రవ్యోల్బణం వేడి, మరోవైపు మాంద్యం బూచి పలు కార్పొరేట్ సంస్థలను తీవ్ర ఆలోచనలో పడేయడంతో ఖర్చు తగ్గించుకునేందుకు అవి ఉద్యోగాల కోతవైపు దృష్టి సారించాయి. ఫలితంగా పలు దేశాల్లో నిరుద్యోగిత మరింత పెరిగింది. అమెరికా, బ్రిటన్, పలు యూరప్ దేశాలు ద్రవ్యోల్బణంతో సతమతమవుతుంటే భారత్ పరిస్థితి కొంత మెరుగ్గా ఉండటం గమనార్హం. భారత్లో ద్రవ్యోల్బణం ప్రస్తుతం 5.9 శాతంగా ఉంది. అయితే వచ్చే ఏడాది పరిస్థితి మెరుగవుతుందని ఆశించలేం. అంతో ఇంతో మాంద్యం ఊబిలో చిక్కక తప్పని పరిస్థితులు ఎదురవ్వవచ్చు. వచ్చే ఏడాది బడ్జెట్లో దేశ ఆర్థిక వ్యవస్థను విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ఏ మేరకు సరిచేస్తారో వేచి చూడాల్సిందే. ప్రపంచంలోని మిగతా దేశాల పరిస్థితి కూడా ఊగిసలాటగానే ఉంది. మరీ శ్రీలంకలాగా దిగజారకున్నా వచ్చే ఏడాది అన్ని దేశాలపైనా మాంద్యం కత్తి వేలాడుతూనే ఉంటుంది. వచ్చే ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 100 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఈ ఏడాదంతా ఊదరగొట్టిన అధ్యయన సంస్థలు, అది కొంచెం కష్టమేనని తాజాగా అంగీకరిస్తుండటం గమనార్హం. మాంద్యం భయం అంచనాలనూ తారుమారు చేస్తోంది! యుద్ధం... వెన్ను విరుస్తోంది! నిజం చెప్పాలంటే ఈ ఏడాది జనవరి నెల ఒక్కటే ప్రశాంతంగా గడిచింది. కరోనా రక్కసి పీడ పోయిందని ప్రపంచం ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో యుద్ధం మరో దయ్యంలా దాపురించింది. 2020, 2021ల్లో మానవాళిని కరోనా వెంటాడితే ఈ ఏడాదిని రష్యా అధ్యక్షుడు పుతిన్ రాజ్యకాంక్ష వెంటాడింది. ఫిబ్రవరిలో రష్యా ఉన్నట్టుండి ఉక్రెయిన్పై దండయాత్రకు దిగి తన యుద్ధోన్మాదాన్ని ప్రపంచంపై రుద్దింది. తన అదృశ్య స్నేహితుడు చైనాతో కలిసి రష్యా ఒకవైపు, అమెరికా వత్తాసుతో ఉక్రెయిన్ మరొకవైపు మోహరించాయి. ఇప్పుడు డిసెంబరులో ఉన్నాం. యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. కొత్త సంవత్సరంలోకీ అడుగు పెడుతోంది. ముమ్మరమా.. ముగింపా.. చెప్పలేం! రెండేళ్లుగా తూర్పు ఆఫ్రికాలో కొనసాగుతున్న యుద్ధం దాదాపు ఆరు లక్షల మందిని కబళించినా ఇంకా కొలిక్కి రాలేదు. వస్తుందనే నమ్మకమూ దరిదాపుల్లో లేదు. మరోవైపు సిరియా, యెమన్లలో జరుగుతున్న అంతర్యుద్ధాల పరిస్థితీ ఇదే. వాటి పర్యవసానాలు ఆయా దేశాలకే పరిమితమైనా రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మాత్రం ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చాలా దేశాలు తటస్థంగా ఉన్నప్పటికీ ఈ యుద్ధం ప్రపంచాన్ని రెండు శిబిరాలుగా చీల్చింది. మరోవైపు పెట్రో ధరలపైనా, గోధుమ, మొక్కజొన్న వంటి ఆహార ధాన్యాల ధరలపైనా తీవ్ర ప్రభావం చూపింది. క్రూడాయిల్ ఎగుమతుల్లో రష్యా (14 శాతం), గోధుమ, మొక్కజొన్న ఎగుమతుల్లో రష్యా, ఉక్రెయిన్ (25 శాతం) అగ్ర భాగాన ఉన్న సంగతి తెలిసిందే. వీటిపైనే ఆధారపడ్డ చాలా దేశాలు ఇప్పటికే చమురు కొరతను, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొటున్నాయి. వచ్చే ఏడాది ఇది మరింత తీవ్రతరం కానుంది. ఎందుకంటే యుద్ధాన్ని ఆపాలన్న ఉద్దేశం పుతిన్, జెలెన్స్కీల్లో ఏ కోశానా ఉన్నట్టు కన్పించడం లేదు. యుద్ధం విషాదమే గానీ ఆపే ఉద్దేశం లేదని పుతిన్ ఇటీవలే బాహాటంగా స్పష్టం చేశారు. రష్యా ముందు సాగిలపడటానికి ససేమిరా అంటున్న జెలెన్స్కీ పోరాడితే పోయేదేమీ లేనట్టు ముందుకు సాగుతున్నారు. దౌత్య చర్చలకు మొగ్గు చూపుతూనే అదనపు ఆయుధ సమీకరణకు నాటో మిత్ర దేశాల వైపు చూస్తున్నారు. ఇటీవలే అమెరికా వెళ్లి అధ్యక్షుడు జో బైడెన్తో భేటీ అవడమే గాకుండా తన ఆయుధపొదిలో పేట్రియాటిక్ క్షిపణులను సమకూర్చుకున్నారు. సంధి కోసమో, కనీసం యుద్ధ విరామం కోసమో ప్రయత్నించాల్సిన అమెరికా లాంటి దేశాలు చోద్యం చూస్తూ కూర్చున్నాయే తప్ప ఆ దిశగా ఎలాంటి చొరవా చూపడటం లేదు. మరోవైపు యుద్ధాన్ని రష్యా తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్పై రోజుల తరబడి క్షిపణుల వర్షం కురిపిస్తోంది. గురువారం ఒక్క రోజే 120కి పైగా క్షిపణులను ప్రయోగించిందంటే రాబోయే రోజుల్లో యుద్ధం ఏ దశకు చేరుకోనుందో ఊహించవచ్చు. 2023లోకి అడుగు పెడుతున్న యుద్ధం 2024ను కూడా పలకరించేలా కన్పిస్తోంది. కరోనా... వణికిస్తోంది! గడచి రెండేళ్లు (2020, 2021) కరోనా నామ సంవత్సరాలైతే ఈ ఏడాది (2022) కరోనా ఫ్రీ సంవత్సరమని చెప్పుకోవచ్చు. అయితే అది నవంబర్ వరకే. డిసెంబర్లో చైనా మళ్లీ కొత్త వేరియంట్తో సరికొత్త కరోనా బాంబు పేల్చింది. కరోనా వైరస్ మానవ సృష్టేనన్న వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో కొత్త వేరియంట్ చైనా పాలిట భస్మసుర హస్తమైంది. ప్రతి రోజూ లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు అంటూ చైనా నుంచి వస్తున్న వార్తలు ప్రపంచాన్ని మరోసారి ఉలిక్కిపడేట్టు చేశాయి. చైనాలో వైరస్ ఉనికి కనిపించిన ఒకట్రెండు నెలలకు ప్రపంచానికి వ్యాపించడం, లేదా విస్తరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో చైనాలో ప్రత్యక్షమైన కొత్త వేరియంట్ వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలోగా ఇతర దేశాలకు పాకడం ఖాయమని వైద్య నిపుణుల అంచనా. కరోనాతో సహజీవనం చేసిన చాలా దేశాల్లోని జనాలకు ఈ కొత్త వేరియంట్ ప్రాణాంతకం కాకపోవచ్చు కానీ కొంతమేరకు ఇబ్బంది పెట్టే అవకాశముందని వారి విశ్లేషణ. చైనా ప్రజలు రెండేళ్లుగా కరోనా వైరస్కు అల్లంత దూరాన తమను తాము బందీ చేసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తికి దూరమయ్యారు. ఇప్పడు ఒక్కసారిగా కరోనా ఆంక్షలు ఎత్తేయడంతో వైరస్ ప్రభావం నుంచి తప్పించుకోలేక సతమతమవుతున్నారు. అంతర్జాతీయ ప్రయాణాలపై కూడా తాజాగా చైనా ఆంక్షలు ఎత్తేయడం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు చైనానుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ పరీక్ష తప్పనిసరి చేశాయి. చైనా ప్రపంచానికి వెల్లడించింది ఒక్క వేరియంట్ గురించేనని, నిజానికి అక్కడ మరో డజనుకు పైగా కొత్త వేరియంట్లు పుట్టకొచ్చాయని వార్తలు వినవస్తున్నాయి. అదే నిజమైతే ఏ వైపునుంచి ఏ వేరియంట్ వచ్చి మీద పడుతుందో ఊహించడం కష్టం. టీవీలు, వార్తా పత్రికలు ఊదరగొడుతున్నట్టుగా చైనాలో గడ్డు పరిస్థితులేమీ లేవని, అదంతా పశ్చిమ దేశాల కుట్రేనన్నది మరో వాదన. కరోనా వ్యాక్సీన్లను అమ్ముకోవడానికి ఫార్మా కంపెనీలు అల్లుతున్న కట్టుకథలేనన్నది ఇంకో వాదన. ఎవరి వాదన ఎలా ఉన్నా ఇప్పటికైతే ఇంకా కఠినమైన కరోనా ఆంక్షలేవీ అమల్లోకి రాలేదు. అయితే జనవరి, ఫిబ్రవరి నెలల్లో భారత్లో కూడా కేసులు పెరిగే అవకాశం లేకపోలేదని నిపుణులు అనుమానిస్తున్నారు. అదే జరిగితే వచ్చేది మరో కరోనానామ సంవత్సరమే అవుతుమంది. లేదంటే కరోనా ఫ్రీ ఏడాదిగా అందరి ముఖాలపై ఆనందాన్ని వెలిగిస్తుంది! -
TS: ప్రజలకు ఊరటనిచ్చిన ప్రభుత్వం.. విద్యుత్ చార్జీల పెంపు లేనట్టే!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ముంగిట రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2023–24)లో రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను పెంచకుండా ఇప్పుడున్నట్టుగానే కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రస్తుత రిటైల్ టారిఫ్ను యథాతథంగా కొనసాగించాలంటూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి ఉత్తర/దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎనీ్పడీసీఎల్/ టీఎస్ఎస్పీడీసీఎల్)లు ప్రతిపాదించాయి. ఈ మేరకు 2023–24 ఏడాదికి సంబంధించిన వార్షిక ఆదాయ, అవసరాల నివేదిక (ఏఆర్ఆర్)తోపాటు రిటైల్ టారిఫ్ ప్రతిపాదనలను ఉత్తర, దక్షిణ డిస్కంల డైరెక్టర్లు పి.గణపతి, ఎస్.స్వామిరెడ్డి బుధవారం ఈఆర్సీ చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు, సభ్యులు (టెక్నికల్) ఎం.డి.మనోహర్ రాజుకు సమర్పించారు. ప్రతిపాదనల వివరాలను చైర్మన్ శ్రీరంగారావు మీడియా సమావేశంలో వెల్లడించారు. రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేసేందుకు రూ.2023–24లో రూ.54,060 కోట్ల వ్యయం అవుతుందని.. ప్రస్తుత విద్యుత్ చార్జీలను యథాతథంగా అమలుచేస్తే రూ.43,525 కోట్లు మాత్రమే వస్తాయని రెండు డిస్కంలు అంచనా వేసినట్టు తెలిపారు. రూ.10,535 కోట్ల లోటు వస్తుండగా.. ఆ మేరకు విద్యుత్ సబ్సిడీలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని ఆశిస్తున్నట్టుగా పేర్కొన్నాయని వివరించారు. ఉచిత, రాయితీ పథకాలు యథాతథం రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, ప్రతినెలా ఎస్సీ, ఎస్టీల గృహాలకు 101 యూని ట్లు, క్షౌరశాలలు, లాండ్రీలకు 250 యూని ట్ల వరకు ఉచిత విద్యుత్, పవర్ లూమ్స్, పౌల్ట్రీఫారాలు, స్పిన్నింగ్ మిల్లులకు యూనిట్పై రూ.2 రాయితీ పథకాలు యథాతథంగా వచ్చే ఏడాది అమలు చేస్తామని డిస్కంలు ప్రతిపాదనల్లో తెలిపాయి. పెంచేదీ, తగ్గించేదీ మేమే నిర్ణయిస్తాం: ఈఆర్సీ ప్రస్తుత విద్యుత్ చార్జీలనే వచ్చే ఏడాది కూడా కొనసాగించాలని డిస్కంలు ప్రతిపాదించినా.. వాటి ఆర్థిక పరిస్థితులను పరిశీలించిన తర్వాత అవసరమైన మేర చార్జీల తగ్గింపు లేదా పెంపుపై నిర్ణయం తీసుకుంటామని ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు స్పష్టం చేశారు. డిస్కంల ప్రతిపాదనలను ఈఆర్సీ వెబ్సైట్లో పెట్టి, అన్నివర్గాల వినియోగదారుల నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరిస్తామన్నారు. బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించిన అనంతరం ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు. ప్రార్థన స్థలాలు, ప్రభుత్వ పాఠశాలలకు విద్యుత్ చార్జీలను తగ్గించాలన్న విజ్ఞప్తులు తమ పరిశీలనలో ఉన్నాయని, ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. కాగా.. ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు ప్రజలపై ఉందని శ్రీరంగారావు పేర్కొన్నారు. వ్యవసాయ విద్యుత్ సబ్సిడీలు, ఎత్తిపోతల పథకాల బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో ఉత్తర డిస్కం తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉందని విలేకరుల ప్రశ్నలకు బదులుగా చెప్పారు. కొన్ని డివిజన్లలో విద్యుత్ సాంకేతిక, వాణిజ్య నష్టాల మొత్తం (ఏటీఅండ్సీ) 50శాతానికి మించి ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎఫ్ఎస్ఏ పేరిట యూనిట్కు 30పైసలదాకా వడ్డనకు చాన్స్! బొగ్గు ధరల పెరుగుదలతో పడుతున్న అదనపు విద్యుత్ కొనుగోళ్ల భారాన్ని.. ఇంధన సర్దుబాటు చార్జీ (ఎఫ్ఎస్ఏ)ల రూపంలో ఎప్పటికప్పుడు వసూలు చేసేందుకు డిస్కంలు అనుమతి కోరగా.. అందుకు సంబంధించిన ముసాయిదా నిబంధనలను ప్రకటించినట్టు శ్రీరంగారావు తెలిపారు. ప్రతి నెలా యూనిట్ విద్యుత్పై గరిష్టంగా 30పైసల వరకు ఈ అదనపు చార్జీలు వసూలు చేసేందుకు ఈ నిబంధనలు అనుమతిస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముసాయిదా నిబంధనలను పంపామని, దీనిపై తుది ఉత్తర్వులు జారీచేశాక అమల్లోకి వస్తాయని వివరించారు. డిస్కంల ప్రతిపాదనల్లోని ముఖ్య గణాంకాలివీ.. ► 2023–24లో విద్యుత్ అవసరం అంచనా: 83,113 మిలియన్ యూనిట్లు ► వినియోగదారులకు విద్యుత్ విక్రయ అంచనా: 73,618 మిలియన్ యూని ట్లు (మిగతాది నష్టాలు, ఇతర రూపా ల్లో వినియోగం) ► వార్షిక ఆదాయ అవసరం అంచనా: టీఎస్ఎస్పీడీసీఎల్కు రూ.36,963 కోట్లు, టీఎస్ఎనీ్పడీసీఎల్కు రూ.17, 095 కోట్లు. మొత్తం రూ.54,060 కోట్లు. ► ప్రస్తుత విద్యుత్ చార్జీలతో రానున్న ఆదాయ అంచనా: రూ.43,525 కోట్లు ► ఆదాయ లోటు టీఎస్ఎస్పీడీసీఎల్కు రూ.3,211 కోట్లు, టీఎస్ఎనీ్పడీసీఎల్కు రూ.7,324 కోట్లు. మొత్తం లోటు రూ.10,535 కోట్లు. (ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీగా ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.) ► 2023–24లో సగటున ఒక్కో యూనిట్ విద్యుత్ సరఫరాకు అయ్యే వాస్తవ వ్యయ అంచనా: రూ.7.34 చదవండి: కేసీఆర్.. అసెంబ్లీలో లెంపలేసుకో.. బండి సంజయ్ ధ్వజం.. -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. బీఎల్ సంతోష్కు ఊరట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో బీజేపీ కీలక నేత, కర్ణాటకకు చెందిన సీనియర్ పొలిటీషియన్ బీఎల్ సంతోష్కు ఊరట లభించింది. సిట్ నోటీసులపై తెలంగాణ హైకోర్టు శుక్రవారం స్టే విధించింది. అంతేకాదు.. విచారణను వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసింది. సిట్ నోటీసులను సవాల్ చేస్తూ బీఎల్ సంతోష్ ఇవాళ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన క్వాష్ పిటిషన్లో.. సిట్ నోటీసులను రద్దు చేయాలని కోరారు. రోహిత్రెడ్డి చేసిన ఫిర్యాదులో బీఎల్ సంతోష్ పేరు లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఆయన తరపు న్యాయవాది. అంతేకాదు ఎఫ్ఐఆర్లో పేరు లేనప్పుడు.. ఆయన్ని నిందితుల జాబితాలో ఎలా చేరుస్తారని బీఎల్ సంతోష్ తరపు న్యాయవాది అభ్యంతరం లేవనెత్తారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. సిట్ నోటీసులపై స్టే విధించింది. అంతకు ముందు.. ఫాంహౌజ్ కేసులో మరో దఫా బీఎల్ సంతోష్కు నోటీసులు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. దీంతో.. ఈ నెల 28వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ సిట్ నోటీసులు జారీ చేసింది. -
డ్రగ్స్ టెస్ట్.. ఫిన్లాండ్ ప్రధానికి భారీ ఊరట
హెల్సెంకీ: ఫిన్లాండ్ ప్రధాన మంత్రి సన్నా మారిన్(36)కు భారీ ఊరట కలిగింది. స్నేహితులతో పార్టీ చేసుకున్న ఆమె.. డ్రగ్స్ తీసుకున్నారంటూ ఆరోపణలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో తన నిజాయితీ నిరూపించుకునేందుకు ఆమె డ్రగ్స్ టెస్ట్లకు సిద్ధమయ్యారు. ఆగస్టు 19న ఆమె నుంచి యూరిన్ శాంపిల్స్ సేకరించారు అధికారులు. అయితే డ్రగ్స్ టెస్టుల్లో ఆమె ఎలాంటి మాదకద్రవ్యాలు తీసుకోలేదని తేలిందని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక మద్యం మాత్రం సేవించినట్లు స్వయంగా మారిన్ ఇదివరకే వెల్లడించడం తెలిసిందే. Finland’s Prime Minister @MarinSanna is in the headlines after a video of her partying was leaked today. She has previously been criticized for attending too many music festivals & spending too much on partying instead of ruling. The critics say it’s not fitting for a PM. pic.twitter.com/FbOhdTeEGw — Visegrád 24 (@visegrad24) August 17, 2022 ఇదిలా ఉంటే.. స్నేహితులతో కలిసి సరదాగా పార్టీ చేసుకున్న ఆమె వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. దీంతో ఆ పార్టీలో డ్రగ్స్ ఉపయోగించారనే అనుమానాలు వ్యక్తం చేశాయి ప్రతిపక్షాలు. స్వచ్ఛందంగా డ్రగ్స్ టెస్టులకు ముందుకు రావాలని ఆమెను డిమాండ్ చేశాయి. 2019లో 34 ఏళ్ల వయసులో సన్నా మారిన్ ఫిన్లాండ్కు ప్రధానిగా ఎన్నికయ్యారు. గతంలోనూ అధికారిక భవనంలో పార్టీలు చేసుకుని ఆమె విమర్శలపాలయ్యారు కూడా. ఇదీ చదవండి: ఎట్టకేలకు.. శ్రీలంకను వీడిన చైనా నిఘా నౌక -
లంకలో ఉపశమన కార్యక్రమాలకు శ్రీకారం!... : విక్రమసింఘే
Sri Lanka Acting President To Implement Urgent Food: గోటబయ రాజపక్సే రాజీనామాను పార్లమెంట్ స్పీకర్ అబేవర్ధనే ఆమోదించడంతో శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఆందోళకారుల ఆగ్రహావేశాలు చల్లరే దిశగా ప్రజలకు సత్వరమే సాయం అందించడం పై రణిల్ దృష్టి సారించారు. మొదటగా ఆర్థిక సంక్షోభం కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు తక్షణ అత్యవసర సహాయ కార్యక్రమాలను అమలు చేయాలని రణిల్ నిర్ణయించారు. ఈ సహాయ కార్యక్రమాల ద్వారా ముందుగా ఇంధనం, గ్యాస్, కనీస ఆహర పదార్థాలను అందిచాలని సూచించారు. ఈ మేరకు రణిల్ జులై16న పార్లమెంట్ సభ్యులతో జరిపిన చర్చల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేగాక ఆగస్టులో సమర్పించే రిలీప్ బడ్జెట్లో అదనంగా వచ్చే డబ్బును కూడా ఇందుకోసం వినియోగించాలని నిర్ణయించారు. తొలుత ఆహార భద్రత కార్యక్రం అమలును వేగవంతం చేయాలన్నారు. ప్రధానంగా ఇంధనం, ఎరువులు సక్రమంగా అందించడం పై దృష్టి సారించారు. మరోవైపు వ్యాపారవేత్తలను కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా వ్యాపారాలను నిర్వహించేలా వాతావరణాన్ని సిద్ధం చేసేందుకు ప్రణాళికలను రూపొందించారు. ఈ చర్చల ద్వారా తీసుకున్న ప్రణాళిక శాంతియుత నిరసకారుల కారుల కారణంగా తీసుకున్న గొప్ప ప్రణాళికగా పేరుగాంచుతుందన్నారు. అవినీతిపై పోరాటానికి తీసుకుంటున్న చర్యలను కార్యకర్తలకు తెలియజేస్తామని రణిల్ అన్నారు. ఐతే శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే తన పదవికి రాజీనామా చేసినందున, రాజ్యాంగం ప్రకారం, పార్లమెంటు వచ్చే వారం సమావేశమై కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు చర్యలు తీసుకుంటుందని కూడా తెలిపారు. ఈ క్రమంలో శ్రీలంక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పడం గమనార్హం. ఇదిలావుండగా మాజీ ప్రధాని మహింద రాజపక్సే, మాజీ ఆర్థిక మంత్రి బాసిల్ రాజపక్సేలను కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదంటూ.. శ్రీలంక సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. (చదవండి: శ్రీలంకలో ఇంధన పాస్లకు శ్రీకారం.. రేషన్పై పెట్రోల్ పంపిణీ!) -
రెప్ప వాల్చని ఏపీ సర్కారు.. వలంటీర్ నుంచి ఉన్నతాధికారి వరకు..
(వేలేరుపాడు నుంచి సాక్షి ప్రతినిధులు ఐ.ఉమామహేశ్వరరావు, వీఎస్వీ కృష్ణ కిరణ్): కట్టుబట్టలతో ఉన్న పళంగా అందుబాటులో ఉన్న వస్తువులను మూటలుగా కట్టి నెత్తిన పెట్టుకుని.. చంటి పిల్లల్ని చంక నెత్తుకుని.. ముసలి వారిని వాహనాలపై ఎక్కించుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్న దృశ్యాలు లంక గ్రామాల్లో కనిపిస్తున్నాయి. మూగ జీవాలను సైతం రక్షించుకునేందుకు తాపత్రయ పడుతూ.. ఉన్న ఇంటిని, సొంత ఊరిని వదిలి వేలాది మంది ట్రాక్టర్లు, ఆటోలపై సహాయక శిబిరాలకు, బందువుల ఇళ్లకు వెళ్తున్న దృశ్యాలు ఈ ప్రాంతంలో ఊరూరా కనిపిస్తున్నాయి. ‘వరద ముప్పు పెరుగుతోంది.. ఇల్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలి’ అంటూ వలంటీర్, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది అనుక్షణం అప్రమత్తం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ముందు చూపునకు నిదర్శనం. చదవండి: ఆదుకో.. మావయ్యా.. గమనించిన సీఎం జగన్ కాన్వాయ్ ఆపి.. పోలీస్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని పెద్ద ఎత్తున మోహరించడం, శిబిరాల ఏర్పాటు, బాధితులకు పక్కాగా భోజన ఏర్పాట్లు వరద ప్రభావిత ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. భోజన, వసతి ఏర్పాట్లకు అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకం సిబ్బంది సేవలు ఉపయోగించుకుంటున్నారు. అంటు వ్యాధులు ప్రబలకుండా, అనారోగ్య సమస్యలు దరిచేరకుండా 24 గంటల పాటు వైద్య సిబ్బంది విశేష సేవలు అందిస్తున్నారు. అయినవిల్లి మండలంలో ముంపు నుంచి సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్తున్న వరద బాధితులు ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. నిత్యావసర సరుకులు, టార్పాలిన్, బరకాలు పంపిణీ చేయడం ద్వారా ప్రభుత్వం బాధితులకు అడుగడుగునా భరోసా కల్పించింది. ఆంధ్రప్రదేశ్లో విలీన మండలాలైన వేలేరుపాడు, కుకునూరు పరిధిలోని అనేక ముంపు గ్రామాల్లో శుక్రవారం ఈ వసతి సౌకర్యాలు కనిపించాయి. ప్రభుత్వ యంత్రాంగం.. వలంటీర్ మొదలు కలెక్టర్ వరకు కంటిపై కునుకు లేకుండా సహాయక చర్యల్లో ముమ్మరంగా నిమగ్నమవడం కనిపించింది. బంధువుల ఇళ్లకు వెళ్లిన వారికీ సాయం ♦వేలేరుపాడు మండలంలో 44 గ్రామాలు(ఏడు రెవెన్యూ పంచాయతీలు), కుకునూరు మండలంలో 72 గ్రామాలు(15 రెవెన్యూ పంచాయతీలు) వరద తాకిడికి గురయ్యాయి. ఈ గ్రామాల్లోని వారు చాలా మంది శిబిరాలు, ఎత్తు ప్రాంతంలో ఉండే అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ప్రార్థనా మందిరాల్లో తలదాచుకున్నారు. వరద తాకిడికి సెల్ఫోన్ నెట్వర్క్లన్నీ మూగబోయాయి. ♦వేలేరుపాడు మండలంలో ఏర్పాటు చేసిన శివకాశిపురం, కస్తూరిబా బాలికల హైస్కూల్ పునరావాస శిబిరాల్లో 1050 మందికి, కుకునూరు మండలంలో 13 శిబిరాల్లో 2199 కుటుంబాలకు వసతి సౌకర్యం కల్పించారు. శిబిరాల్లో ఉన్న వారికి ఉదయం గుడ్డుతో పాటు టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి.. కూర, సాంబారు, పప్పుతో భోజనం అక్కడే వండి వడ్డిస్తున్నారు. చిన్న పిల్లలకు పాలు సరఫరా చేస్తున్నారు. ♦బంధువుల ఇళ్లకు వెళ్లిన వారికీ ప్రభుత్వం సహాయం అందిస్తోందని జంగారెడ్డిగూడెం ఆర్డీవో ఎం.ఝాన్సీరాణి, జెడ్పీ సీఈవో కేవీఎస్ రవికుమార్ తెలిపారు. బాధితులకు తక్షణావసరాలకు బియ్యం, నూనె, కందిపప్పు, 8 రకాల కాయగూరలు శుక్రవారం అందించారు. కొయిదా, కట్కూరు గ్రామాలకు హెలికాప్టర్ ద్వారా నిత్యావసరాలు, టార్పాలిన్లు అందించారు. ♦పారిశుధ్యంపై అధికారులు దృష్టి సారించారు. పాము కాటు, గుండెపోటు.. తదితర అత్యవసర మందులు అందుబాటులో ఉంచారు. గర్భిణులు, వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ప్రభుత్వమే కడుపు నింపుతోంది మా కుటుంబం కట్టుబట్టలతో మిగిలింది. నేను పనిపై జంగారెడ్డి గూడెం వెళ్లి వచ్చేలోగా మా ఊరిలోకి నీళ్లు వచ్చేశాయి. ఇంటిలో ఆడవాళ్లు మాత్రమే ఉన్నారు. వాళ్లు ఏం చేయగలరు.. అన్నీ వదిలేసుకుని అధికారులు పెట్టిన ట్రాక్టర్లలో వచ్చి శివకాశీపురంలో తల దాచుకుంటున్నాం. మా ఊరిలో మొత్తం పశువులు అన్నీ పోయాయి. ప్రభుత్వం ఇస్తున్న నిత్యావసరాలతోనే కడుపునింపుకుంటున్నాం. – మడకం బుచ్చయ్య, రేపాకగొమ్ము -
గురువాణి–1: నిన్ను వెలిగించే దీపం... నవ్వు
‘‘నవ్వవు జంతువుల్, నరుడు నవ్వును, నవ్వులు చిత్తవృత్తికిన్/ దివ్వెలు, కొన్ని నవ్వులెటు తేలవు, కొన్ని విషప్రయుక్తముల్,/పువ్వులవోలె ప్రేమరసమున్ వెలిగ్రక్కు/ విశుద్ధమైన లే/నవ్వులు– సర్వదుఃఖ శమనంబులు, వ్యాథులకున్ మహౌషథుల్’’ మహాకవి గుర్రం జాషువా గారి పద్యం ఇది. ఆయన తేటతెలుగులో అనేక రచనలు చేసారు. ఆయన రచనల్లో అంతర్లీనంగా కులమతాలనే సంకుచిత తత్త్వాన్ని ప్రశ్నించారు. అభ్యుదయ భావాలు కలవారు. ఆయన రచనలు చదువుతుంటే ప్రతిదీ మనకు కళ్లముందు కనిపిస్తుంటుంది. ప్రాతఃస్మరణీయులు. ఆయన కవిత్వం చాలా ఇష్టం. నవ్వవు జంతువుల్...సమస్త ప్రాణికోటిలో ఏ జంతువూ నవ్వదు. మనుష్యులు మాత్రమే నవ్వుతారు. నవరసాలు కళ్ళల్లోంచి ఒలికించినట్లే–మన మానసిక స్థితిని, భావోద్వేగాలను మనం మాటల్లో చెప్పకపోయినా మన నవ్వు చెప్పేస్తుంది. ఎవరయినా ముఖం మాడ్చుకుని దిగాలుగా ఉంటున్నారనుకోండి, ఎవ్వరూ దగ్గరకు వెళ్ళరు, పలకరించరు కూడా. ప్రశాంతం గా, సంతోషంగా ఉన్నవాడి చుట్టూ ఎప్పుడూ పదిమంది ఉంటుంటారు. అసలు నవ్వకుండా బతుకుతున్న వాడి బతుకుకన్నా బరువయినా బతుకు మరొకటి ఉండదు. హాయిగా నవ్వడం, అరమరికలు లేకుండా పకపకా నవ్వడం, సంతోషంగా నవ్వడం, అదీ ఇతరులు బాధపడకుండా నవ్వడం ... ఆ నవ్వు దైవానుగ్రహం. ఎవ్వరిదగ్గరికయినా ఉపకారం ఆశించి వెళ్ళితే వెంటనే వారి ముఖకవళికలు మారిపోతాయి. విచిత్రమైన నవ్వు కనిపిస్తుంది. అడిగిన సహాయం చేస్తారో తెలియదు, చేయరో తెలియదు. అలాటి వారిలో కొన్ని నవ్వులు ఎటూ తేలవు. కొంతమంది నవ్వితే ఓ వారం రోజులు అన్నం సయించదు. మనల్ని అంత క్షోభ పెట్టేటట్లు, బాధపెట్టేటట్లు విషపు నవ్వులు నవ్వుతారు. కొంతమంది ఇతరులు బాధపడితే నవ్వుతారు. బాధితుడిని తన బాధకన్నా ఎదుటివాడి నవ్వు మరింత బాధిస్తుంటుంది. ఎదుటివాడు కష్టంలో ఉన్నట్లు తెలిసి కూడా పిచ్చినవ్వులు నవ్వుతుంటారు కొందరు. ఎవరయినా ఏదయినా సాధిస్తే .. నీ బతుక్కి ఇదెలా సాధ్యం... అన్నట్లు వెకిలినవ్వులు నవ్వుతుంటారు. పువ్వులవోలె ప్రేమరసము వెలిగ్రక్కు విశుద్ధములైన లేనవ్వులు సర్వదుఃఖశమనంబులు... వికసించిన పువ్వులను చూస్తుంటే... మెత్తటి, అతి సున్నితమైన రేకులు, కళ్ళకింపైన రంగులు, మధ్యలో కేసరం, పుప్పొడి, మకరందం, వాటి చుట్టూ తిరిగే తుమ్మెదలు ...మనల్ని కొంచెం సేపు మరిపిస్తుంది, మురిపిస్తుంది... ఇదే అనుభూతి పసిపిల్లల నవ్వుల్లో మనకు కనిపిస్తుంటుంది. ప్రేమగా నవ్వే నవ్వుల్లో కూడా ఈ భావన ఉంటుంది. అవి నిష్కల్మషాలు కాబట్టి వాటి శక్తి ఎక్కువ. మనం ఎంతటి బాధలో ఉన్నా ఆ నవ్వులు మనకు ఉపశమనం కలుగచేస్తాయి. మందుల్లా పనిచేస్తాయి. నవ్వు రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. విషపు నవ్వు గుండెల్ని చీలిస్తే, ప్రేమగా నవ్వే ఓ చిర్నవ్వు హృదయాలను పరవశింపచేస్తుంది. చిన్న చిరునవ్వు ఎంత గొప్పదో చెప్పడానికి మూకశంకరులు అమ్మవారి మీద వంద శ్లోకాలుచేస్తూ మందస్మిత శతకం రాసారు. మన విలువను పెంచేది, తెలియని వారికి పరిచయం చేసేది, మనల్ని ప్రపంచానికి దగ్గర చేసేది.. ఓ చిర్నవ్వు...అదెప్పుడూ మన ముఖాన్ని వెలిగిస్తూనే ఉంటుంది, మన వ్యక్తిత్వాన్ని ప్రకాశింపచేస్తూనే ఉంటుంది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
రోజుకు 10 నిమిషాలు నవ్వితే.. ఎన్ని కేలరీల కొవ్వు కరుగుతుందో తెలుసా!
సాక్షి, జడ్చర్ల టౌన్: ‘నవ్వుతూ బతకాలిరా తమ్ముడు.. నవ్వుతూ చావాలిరా.. చచ్చినాక నవ్వలేమురా.. ఎంత ఏడ్చినా బతికిరామురా.. అంటూ ఆచార్య ఆత్రేయ రాసిన గీతం అక్షరసత్యం. అసలు ఈ పాట గురించి ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా.. మీ సందేహం సబబే. ఆదివారం ప్రపంచ నవ్వుల దినోత్సవం అందుకే ఆ ఉపోద్ఘాతం. నవ్వు గురించి చెబుదామనిపించి అలా ఆ గీతంతో మొదలుపెట్టాం. నవ్వడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ప్రజలకు అవగాహన కల్పించడం కోసం నవ్వుల దినోత్సవం ఏర్పాటయ్యింది. నవ్వడం వల్ల మానసికంగా, శారీరకంగా మేలు జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మీరు కాస్త నవ్వుకుంటూ నవ్వు వెనకాల ఉన్న చరిత్రను తెలుసుకుందాం పదండి. నవ్వులకూ ఓ శాస్త్రం నవ్వడం వల్ల శరీరంలో కలిగే ప్రభావాలపై అధ్యయనం చేసేందుకు మానసిక వైద్యశాస్త్రంలో జిలోటాలజి అనే ప్రత్యేక విభాగం కూడా ఉంది. మహబూబ్నగర్, జడ్చర్లలో.. మహబూబ్నగర్, జడ్చర్లలోనూ లాఫింగ్ క్లబ్లు ఉన్నాయి. అయితే కరోనా కారణంగా మూడేళ్లుగా ఈ క్లబ్లు నామమాత్రంగా పనిచేస్తున్నాయి. క్లబ్ సభ్యులు ప్రతిరోజు పరిమితంగా కలుసుకోవడం, హాయిగా జోకులు వేసుకుంటూ నవ్వడం చేస్తున్నారు. నవ్వడం, నవ్వించడం ఓ కళగా క్లబ్ సభ్యులు చెబుతుంటారు. యోగాసనాలు వేశాక చివరగా రెండు నిమిషాలు తప్పనిసరిగా లాఫింగ్ థెరపీ చేస్తుంటారు. తద్వారా అప్పటి వరకు యోగాసనాలతో మానసిక, శారీరకమైన అలసట నుంచి బయట పడేందుకు అలా చేస్తుంటారు. ఇవీ ఆరోగ్య ప్రయోజనాలు ► నవ్వు యోగా కామెడీ కాదని ఆరోగ్య శ్రేయస్సు కోసం నిర్వహించే వ్యాయామ ప్రక్రియగా చెబుతున్నారు. ► నవ్వడం వల్ల శారీరక విశ్రాంతి లభిస్తుంది. హాయిగా నవ్వడం వల్ల అలా నవ్విన వ్యక్తికి 45 నిమిషాలపాటు కండరాలు సడలించబడి ఒత్తిడిని తగ్గిస్తుంది. ► నవ్వడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా ఒత్తిడి హార్మోన్లు తగ్గి రోగనిరోధక కణాలు పెరుగుతాయి. ► నవ్వు రక్తనాళాల పనితీరు మెరుగుపరచడం వల్ల రక్తప్రసరణ పెరిగేలా చేసి గుండెపోటు రాకుండా కాపాడుతుంది. ► రోజుకు 10 నిమిషాలు నవ్వడం వల్ల శరీరంలోని 40 కేలరీల కొవ్వును కరిగిస్తుంది. కోపాన్ని తగ్గింపజేసి ఆయుష్షును పెంచడానికి దోహదపడుతుంది. -
పాత జ్ఞాపకం: ఆ కాలంలో పరీక్షలు
టెన్త్ క్లాస్ పరీక్షలు ఆంధ్రప్రదేశ్లో మొదలయ్యాయి. తెలంగాణలో ఇంకా మొదలుకావాల్సి ఉంది ఈ పరీక్షలు అయ్యేంత వరకూ పిల్లలకు మంచి మార్కుల గురించి తల్లిదండ్రులకు వారి ఆరోగ్యం గురించి టెన్షన్. కాని ఒకప్పుడు పరీక్షలు ఎంతో చిత్ర విచిత్రంగా జరిగేవి. రకరకాల సెంటిమెంట్లు ఉండేవి. ఎన్నో సరదాలు చోటు చేసుకునేవి. ఈనాటి పరీక్షల సందర్భంగా ఆనాటి పరీక్షల రీవిజిట్... కొంచెం రిలీఫ్ కోసం. ఇప్పుడేముంది పిల్లలు ఛాయిస్తో సహా అన్నీ రాసేసేంత చదివేస్తున్నారుగానీ పూర్వం పరీక్షలంటే ప్రాణ హరీక్షలే. టీచర్లు రెడ్ ఇంక్ పెన్ తీసేది ఈ పేపర్లు దిద్దడానికే. సరిగ్గా మధ్యకు మడిచిన ఆన్సర్ షీట్ల కట్టతో సార్లు క్లాసులో అడుగుపెడితే పిల్లల పై ప్రాణాలు పైనే పోయేవి. టీచర్లు, సార్లు కూడా పిల్లల్ని టెన్షన్ పెట్టడంలో సృజనాత్మకత చూపేవారు. మొదట క్లాస్ టాపర్ పేపరు ఇచ్చేవారు. ఆ తర్వాత సెకండ్, థర్డ్ వచ్చినవాళ్ల పేపర్లు. 25కు పదిహేను మార్కులు తెచ్చుకున్నవారందరూ సేఫ్ జోన్లో ఉండేవారు. 15 కంటే తక్కువ వచ్చిన వారి పేపర్లు రాగానే సార్ల చేతిలో బెత్తం ప్రత్యక్షమయ్యేది. 14,13,12... మార్కులు తగ్గేకొద్దీ వీపులు చిట్లుతూ ఉండేది. చివరి పేపర్ వైపు అందరూ బిక్కుబిక్కుమంటూ చూసేవారు. ఆ పేపరు ఒకటో రెండో మార్కులు వచ్చిన స్టూడెంట్ది. ఆ స్టూడెంట్ పెట్టే పెడబొబ్బలను వినలేక స్కూల్ అటెండర్ టంగ్ టంగ్మని బెల్ కొట్టేస్తే తప్ప కోటింగ్ నిలిచేది కాదు. పది మొదలు.. టెన్షన్ మొదలు సరే. పదో క్లాసులో చేరినప్పటి నుంచి ఫైనల్ ఎగ్జామ్స్ టెన్షన్ విద్యార్థుల్లో ఊరూ వాడా దానయ్య దానమ్మ అందరూ ప్రవేశ పెట్టేవారు. టెన్త్ ఫెయిల్ కావడం అవమానం. ఫెయిల్ తప్పక చేసే రెండు సబ్జెక్ట్లు ఇంగ్లిష్, గణితం ఎలాగూ ఉండేవి. ఒకరికి ఇంగ్లిష్ అంటే కోల్డ్ అండ్ ఫీవర్. మరొకరికి లెక్కలంటే వామ్టింగ్స్ అండ్ మోషన్స్. ఆ రోజుల్లో ఎంత పేద తల్లిదండ్రులైనా టెన్త్ క్లాస్కు వచ్చిన తమ పిల్లల్ని ట్యూషన్లో చేర్పించేవారు. లెక్కలు రాకపోతే స్కూల్లో ఎలాగూ దెబ్బలు పడేవి. ట్యూషన్లో కూడా అవే లెక్కలు రావు కనుక అక్కడా దెబ్బలు పడేవి. సాయంత్రం ఆరు నుంచి ఎనిదిన్నర వరకూ వదలకుండా ట్యూబ్లైట్ల వెలుతురులో తెగ చదివించేవారు. వారంలో ఆరురోజులు స్కూల్లో చదివితే ఆదివారం ట్యూషన్లో చదవాల్సి వచ్చేది. ఇంగ్లిష్ పొయెమ్ అప్పజెప్పడం అన్నింటి కంటే పెద్ద టార్చర్. మొదటి రెండు లైన్లు చెప్పాక మూడో లైను దగ్గర ఆగి దిక్కులు చూస్తే చాక్పీస్ ముక్క గురి చూసి వచ్చి ముక్కుకు తగిలేది. చెక్క డస్టర్ నెత్తిని టప్టప్మని తాకేది. వెదురు బెత్తం దూకుడు ఏకుడు మీదుండేది. ట్యూషన్లు కాకుండా పాఠశాల, రాఘవేంద్ర, బూన్ గైడ్లు తల కింద పెట్టుకుని పడుకున్నా ఏమీ ఎక్కేది కాదు. టెన్త్ పాసైతే కాలేజీకి వెళ్లొచ్చు. కాని టెన్త్ పాసవడం చాలా పెద్ద విషయం. 100కి 35 మార్కులు తెచ్చుకోవాలి. ఆ రోజుల్లో విద్యార్థులది 35 మార్కుల కల. పరీక్షలు... క్వశ్చన్ పేపర్లు ఎగ్జామ్స్ మొదలవుతుండగా టెన్త్ చదివే పిల్లల డాబాల మీద, పెరళ్లల్లో బల్బులు లాగి వెలిగించేవారు. రాత్రిళ్లు తల్లులు టీ పెట్టి ఇచ్చేవారు. కంబైన్డ్ స్టడీలో పిల్లలు ఎవరేం చదువుతున్నారో తెలియనంత పెద్దగా చదివేవారు. ఆ తర్వాత హాల్టికెట్లు వస్తే వాటిని దేవుడి దగ్గర తప్ప మరెక్కడా పెట్టేవారు కాదు. దేవుడికి ఇదంతా టెన్షనే. అయితే మెయిన్ పేపర్ కాకుంటే బిట్ పేపర్గా ఆ రోజుల్లో పరీక్షలు సాగేవి. మెయిన్ పేపర్ సరిగ్గా రాయలేకపోయినా వారినీ వీరిని అడిగి బిట్ పేపర్ ఏ, బి, సి, డిలు పెడితే ఎలాగోలా పాస్ అయిపోతామని భావించేవారు. నిజం కూడా. చాలామంది ఇన్విజిలేటర్లు 3 గంటల ఎగ్జామ్లో మొదటి రెండున్నర గంటలు స్ట్రిక్ట్గా ఉండి చివరి అరగంట చూసీ చూడనట్టు ఉండేవారు. అప్పుడు అందరూ బిట్లు చెప్పుకునేవారు. ఈలోపు ఏ గారాలబిడ్డ తండ్రో బిట్ పేపర్ సంపాదించి బయట నుంచి మొత్తం 30 బిట్ల ఆన్సర్ను ఒక చిట్టి మీద రాసి లోపల వేయించేవాడు. అంటే 30కి 30 వచ్చేస్తాయన్నమాట. ఇక సెంటిమెంట్ చొక్కా, సెంటిమెంట్ పెన్, సెంటిమెంట్ ప్యాడ్... ఇవన్నీ తప్పనిసరి. పరీక్షలు జరిగినన్ని రోజులు ‘పేపర్ ఈజీనా టఫ్ఫా’ అనే ప్రశ్న వినబడుతూనే ఉండేది. అందరూ ఈజీగా పరీక్ష రాసేస్తే కొందరు స్టూడెంట్స్కు నచ్చేది కాదు. టఫ్గా వచ్చిన రోజు క్లెవర్లు ముసిముసి గా నవ్వుకుంటూ ఇల్లు చేరేవారు. జీవితంలో మంచి ఉపాధి పొందడం తప్పనిసరి. కాని ఒక నిర్దిష్ట సమయంలో చూపే తెలివితేటలే మన మొత్తం తెలివికి కొలమానాలు కాబోవు. చిన్న చిన్న తప్పొప్పులు పరీక్షల్లో సహజం. కనుక మనకు వచ్చింది హాయిగా రాసి భారం కాలం మీద వేయడమే పరీక్షలు జరిగేన్ని రోజులు చేయవలసిన పని. అందరూ బాగా పరీక్షలు రాయాలని కోరుకుందాం. టెన్త్ బాగా చదివి పాస్ కావడానికి తల్లిదండ్రులు గిఫ్ట్ల ఆశ చూపేవారు. అబ్బాయిలకు సైకిల్ కొనిపెట్టడం చాలా పెద్ద గిఫ్ట్. అమ్మాయిలకు పట్టుపావడ, పాపిట బిళ్ల, కొత్త గజ్జెలు... ఇలాంటి తాయిలాల వరుస ఉండేది. డబ్బున్న తల్లిదండ్రులు ‘నువ్వు పాసైతే వెయ్యి రూపాయలు ఇస్తా’ అనేది ఆ రోజుల్లో రికార్డు మొత్తం లంచం. వీరే కాకుండా మేనత్త మేనమామలు కొత్త బట్టలు కొనిస్తామని, హెచ్ఎంటి వాచీ అని, తిరపతి తీసుకెళతామని... ఉపాధ్యాయులు కూడా మంచి మార్కులు తెచ్చుకున్నవారికి ‘హీరో పెన్’కొనిస్తామని హామీ ఇచ్చేవారు. ఇక లాస్ట్ ఎగ్జామ్ రాసినరోజు సినిమాకు, ఐస్క్రీమ్కు వంద రూపాయలు ఇవ్వడం అనేది కామనాతి కామన్. -
బడ్జెట్ 2022: మధ్యతరగతి వర్గానికి ఒకింత ఊరట!
బడ్జెట్ కసరత్తులో కేంద్రం తలమునకలై ఉంది. జనవరి 31న మొదలయ్యే మొదటి విడత సమావేశాలు.. ఫిబ్రవరి 11 వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఇక బడ్జెట్ వస్తుందంటే.. తమకు ఊరట దక్కుతుందా? అని అన్నివర్గాలు ఆశగా చూస్తుంటాయి. ఈ క్రమంలో మధ్యతరగతికి ఒకింత ఊరట ఇచ్చే అంశాల తెరపైకి వచ్చాయి. రెండు దఫాలుగా జరగనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సారథ్యంలో ‘బడ్జెట్’ ఎలా ఉండబోతుందో అనే అంశంపై జోరుగా ఆర్థిక మేధావుల్లో చర్చ నడుస్తోంది. 2022-23 బడ్జెట్లో కేంద్రం మధ్యతరగతి ప్రయోజనాల దృష్ట్యా.. రెండు రకాల పన్ను ప్రయోజనాలను ప్రకటించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందులో మొదటిది.. స్టాండర్డ్ డిడక్షన్.. ఆదాయం నుంచి ఆ మేరకు మినహాయించి చూపించుకునే వెసులుబాటు. 2005-06 ఆర్థిక సంవత్సరంలో ఎత్తివేసిన ఈ ప్రయోజనాన్ని.. తిరిగి 2018-19 బడ్జెట్లో ప్రవేశపెట్టారు. మొదట రూ.40,000గా ప్రకటించి.. ఆపై 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.50,000కు పెంచింది. ఇప్పుడు దీన్ని మరి కొంత పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో మాదిరే రూ.10,000 పెంచుతారా? మరింత ప్రయోజనం కల్పిస్తారా? అనే దానిపై బడ్జెట్లోనే స్పష్టత రానుంది. వర్క్ఫ్రమ్ హోం కొనసాగుతున్న నేపథ్యంలో.. కొన్ని దేశాలు అమలు చేస్తున్న తరహా ప్రయోజనాల్ని ఆశిస్తున్నారు. పిల్లల చదువు పొదుపు.. ఏటేటా పిల్లల విద్యా ఖర్చు గణనీయంగా పెరిగిపోతోంది. సుకన్య సమృద్ధి యోజన.. అదీ అమ్మాయిలకు తప్పించి మరేయితర ప్రయోజనం చేకూరడం లేదు. ఈ తరుణంలో ‘సెక్షన్ 80-సీ’ కింద స్కూల్ ట్యూషన్ ఫీజులను చూపించుకునే అవకాశం ఉన్నప్పటికీ.. ఇదే మంతప్రయోజనంగా లేదనేది అసలు విషయం. ఎందుకంటే జీవిత బీమా ప్రీమియం, ఈపీఎఫ్, ట్యాక్స్ సేవింగ్స్ ఫండ్స్ అన్నీ సెక్షన్ 80సీ కిందకే వస్తాయి. పైగా పాఠశాల ఉన్నత విద్య, ఇంటర్, ఇంజనీరింగ్ కోర్సుల వ్యయాలు గణనీయంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఉన్నత విద్య కోసం చేసే పొదుపు, పెట్టుబడులకు ప్రత్యేక సెక్షన్ కింద ఆదాయం నుంచి మినహాయింపు ఇవ్వాలన్న డిమాండ్ ఉండగా, దీనిపైనా బడ్జెట్ లో ప్రకటన చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. క్లిక్ చేయండి: ఎస్బీఐ వినియోగదారులకు శుభవార్త.. తక్కువ వడ్డీకే 3 రకాల లోన్స్! -
వస్త్ర పరిశ్రమకు ఊరట
న్యూఢిల్లీ: వస్త్రాలపై (టెక్స్టైల్స్) జీఎస్టీని 5 శాతం నుంచి 12 శాతానికి పెంచాలన్న నిర్ణయాన్ని జీఎస్టీ కౌన్సిల్ నిలిపివేసింది. పలు రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో నిలిపివేస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వాస్తవానికి జనవరి 1 నుంచి నూతన రేటు అమల్లోకి రావాల్సి ఉంది. నిర్ణయాన్ని వాయిదా వేయాలంటూ రాష్ట్రాల నుంచి డిమాండ్లు రావడంతో అత్యవసరంగా జీఎస్టీ మండలి శుక్రవారం భేటీ అయి ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రాష్ట్రాల ఆర్థిక మంత్రుల కమిటీకి ఈ అంశాన్ని అప్పగించి, ఫిబ్రవరి నాటికి పన్ను రేటుపై సిఫారసు చేయాలని కోరినట్టు మంత్రి సీతారామన్ చెప్పారు. పాదరక్షలకు సంబంధించిన ఇదే డిమాండ్కు అంగీకరించలేదన్నారు. రేట్ల హేతుబద్ధీకరణను పరిశీలిస్తున్న రాష్ట్రాల ఆర్థిక మంత్రుల బృందాన్ని.. టెక్స్టైల్స్పై పన్ను రేటును పరిశీలించాలని కోరినట్టు చెప్పారు. ప్రస్తుతం మానవ తయారీ ఫైబర్పై 18 శాతం, మానవ తయారీ యార్న్పై 12 శాతం, ఫ్యాబ్రిక్స్పై 5 శాతం రేటు అమల్లో ఉంది. ఇన్ని రకాల పన్ను రేటు కాకుండా.. రేట్ల వ్యత్యాసానికి ముగింపు పలికి అన్ని రకాల వస్త్రాలపై (కాటన్ మినహా) జనవరి 1 నుంచి 12 శాతం రేటును అమలు చేయాలని సెప్టెంబర్లో జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. అలాగే అన్ని రకాల పాదరక్షలపైనా 12 శాతం రేటును అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. వస్త్రాలపై 12 శాతం రేటుకు సుముఖంగా లేమని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, పశ్చిమబెంగాల్, రాజస్తాన్, తమిళనాడు తదితర రాష్ట్రాలు తెలియజేయడం గమనార్హం. డిమాండ్ల వల్లే.. కౌన్సిల్ సమావేశం అనంతరం మంత్రి సీతారామన్ వివరాలు వెల్లడించారు. ‘‘డిసెంబర్ నుంచి ప్రతిపాదనలు రావడం మొదలైంది. గుజరాత్ ఆర్థిక మంత్రి నుంచి కూడా లేఖ అందింది. దీంతో అత్యవసరంగా భేటీ అయి 12 శాతం రేటుకు వెళ్లకుండా యథాతథ స్థితిని కొనసాగించాలని నిర్ణయించాం. కనుక రేట్ల పరంగా దిద్దుబాటు ఉండదు’’ అని వివరించారు. మంత్రుల ప్యానెల్ ఇచ్చే సిఫారసులపై ఫిబ్రవరి చివర్లో లేదా మార్చి మొదట్లో నిర్వహించే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చర్చిస్తామని చెప్పారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అధ్యక్షతన గల మంత్రుల బృందంలో పశ్చిమబెంగాల్, కేరళ, బిహార్ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉన్నారు. పరిశ్రమ ఒత్తిడి ఉండొచ్చు.. టెక్స్టైల్స్పై రేట్ల హేతుబద్ధీకరణకు అన్ని రాష్ట్రాలు అంగీకరించాయి. కానీ రాత్రికిరాత్రి ఒత్తిడి వెనుక.. ధరలు పెరగడం భారంగా పరిణమిస్తుందంటూ పరిశ్రమలో ఒక వర్గం చెప్పడం వల్ల కావచ్చు. అసంఘటిత రంగం రూపంలో ఒత్తిళ్లు రావచ్చని పరిశ్రమ భావించి ఉంటుంది. కొనుగోలు దారులపై భారం పడుతుందన్న ఆలోచన కూడా ఉంది. అందుకనే ఈ అంశం తిరిగి కమిటీ ముందుకు వెళ్లింది. మరింత లోతైన అధ్యయనం చేసి వివరాలను కౌన్సిల్ ముందు ఉంచుతుంది అని సీతారామన్ చెప్పారు. -
బాంబే హైకోర్టులో ఆర్యన్ ఖాన్కు ఊరట
Aryan Khan Gets Relief From Weekly Attendance At NCB Mumbai Office: క్రూయిజ్ షిప్లో డ్రగ్స్ కేసులో బెయిల్పై విడుదలైన షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్కు ముంబై హైకోర్టులో ఊరట లభించింది. ప్రతి శుక్రవారం ముంబైలోని ఎన్సీబీ కార్యాలయంలో హాజరు కావాలన్న బెయిల్ షరతు నుంచి న్యాయస్థానం మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు బుధవారం జరిగిన విచారణలో బాంబే హైకోర్టు ఆర్యన్కు సంబంధించిన బెయిల్ షరతు నిబంధనల్లో స్వల్ప మార్పులు చేసింది. దీంతో ఇకపై ప్రతి శుక్రవారం ఆర్యన్.. ముంబైలోని ఎన్సీబీ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. అయితే ఢిల్లీ ఎన్సీబీ కార్యాలయం ఎప్పుడు సమన్లు పంపినా 72 గంటల్లోగా హాజరు కావాలని ఆర్యన్కు సూచించింది. అంతేకాకుండా ముంబై వదిలి వెళ్లేటప్పుడు అధికారులకు తప్పకుండా సమాచారం ఇవ్వాలి అని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. -
Coronavirus: ముప్పు తొలగినట్లేనా ?
న్యూఢిల్లీ: రోజుకో కొత్త రకం వేరియంట్తో భారత్ను ముప్పతిప్పలు పెట్టిన కరోనా నుంచి భారత్కు ఉపశమనం లభించినట్లేనా? సెకండ్ వేవ్తో జనజీవనాన్ని ఛిద్రం చేసిన కోవిడ్ మహమ్మారి దేశంలో ఇక తగ్గుముఖం పట్టినట్లేనా? అంటే వైద్య నిపుణులు అవుననే అంటున్నారు. పట్ట పగ్గాల్లేని కరోనా దూకుడుకు ఫుల్స్టాప్ పడినట్లేనన్న ఆరోగ్యరంగ నిపుణుల అంచనాలతో దేశ ఆర్థిక రంగం మళ్లీ పట్టాలెక్కనుందనే శుభసూచనలు కనిపిస్తున్నాయి. దీపావళి పర్వదినం తర్వాత గడచిన మూడు వారాలుగా తగ్గుముఖం పడుతున్న కరోనా కొత్త కేసుల సంఖ్యే ఇందుకు మేలిమి ఉదాహరణ. దసరా, దీపావళి, కాళీపూజ తదితర పండుగల సీజన్ అయిన అక్టోబర్, నవంబర్ కాలంలో వైరస్ విజృంభణతో దేశంలో పరిస్థితి అదుపుతప్పవచ్చని అంతటా భయాందోళనలు పెరిగాయి. అయితే, ఆ గండం నుంచి గట్టేకేశాం. పండుగల సీజన్ ముగిశాక కూడా కొత్త కేసులు అత్యల్ప స్థాయిల్లోనూ నమోద వుతున్నాయి. సెకండ్ వేవ్ కాలంలోనే దేశ జనాభా లో చాలా మంది కరోనా బారిన పడ్డారు. అయితే 98.32 శాతం రికవరీ రేటుతో దాదాపు అందరూ కోలుకున్నారు. కోవిడ్ను జయించిన వీరందరి లోనూ కరోనా యాంటీబాడీలు పెరిగాయి. మరోవైపు భారత్లో కోవిడ్ టీకా కార్యక్రమం జోరందుకుంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 117.63 కోట్ల డోస్లను ప్రభుత్వం అందజేసింది. దీంతో కోవిడ్ టీకా తీసుకున్న కోట్లాది మందిలో కరోనా యాంటీబాడీలు పెరిగాయి. ఒక వైపు కోవిడ్ను జయించి, మరోవైపు వ్యాక్సినేషన్ ద్వారా రెండు రకాలుగానూ వయోజనుల్లో కరోనా యాంటీబాడీలు అభివృద్ధి చెందాయి. కరోనా నుంచి కోలుకున్న వారిలో టీకా తీసుకోకమునుపే ‘హైబ్రిడ్ ’ ఇమ్యూనిటీ పెరుగుతుంది. కరోనా రాని వారు టీకా తీసుకుంటే పెంపొందే యాంటీబాడీల కంటే హైబ్రిడ్ ఇమ్యూనిటీ మరెంతో మెరుగ్గా వైరస్ను ఎదుర్కోగలదు. ఇలా ‘హైబ్రిడ్’ ఇమ్యూనిటీని సంతరించుకున్న భారత్లో కరోనా మూడోవేవ్ పొద్దు పొడవక పోవచ్చని వైద్య నిపుణులు ధీమాగా చెబుతున్నారు. అయితే, కొత్త వేరియంట్ ముప్పు, శీతాకాలంలో దట్టంగా కమ్మేసే చలి వాతావరణం వంటి సవాళ్లు ఎల్లపుడూ సిద్ధంగా ఉంటాయని, సరైన జాగ్రత్తలతో ఆ ప్రమాదాన్ని ముందే నివారించవచ్చని ఆరోగ్యరంగ నిష్ణాతులు హెచ్చరిస్తున్నారు. వారికి గతంలోనే కరోనా సోకింది ‘దేశంలో డెల్టా వేరియంట్ వైరస్ వ్యాప్తి పెరిగాక కూడా తక్కువ కేసులు నమోదయ్యాయంటే ..అప్పటికే జనాభాలో ఎక్కువ మందికి కరోనా సోకి, తగ్గిపోయిందని అర్ధం. దేశవ్యాప్తంగా పలు సీరో సర్వేల్లో తేలింది ఇదే’ అని శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా మండలి(సీఎస్ఐఆర్)– ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్, ఇంటిగ్రేటివ్ బయోలజీ(ఐజీఐబీ) డైరెక్టర్ అనురాగ్ అగర్వాల్ స్పష్టంచేశారు. ప్రస్తుతం భారత ‘పరిస్థితి’ బాగానే ఉందని, భవిష్యత్లో వెలుగుచూసే తేలిగ్గా లొంగని వైరస్ వేరియంట్లతో పరిస్థితిలో ‘మార్పు’లు రావచ్చని ఆయన వ్యాఖ్యానించారు. కోవిడ్ నుంచి కోలుకోవడం, వ్యాక్సినేషన్ వల్లే దేశంలో కోవిడ్ తీవ్రత తగ్గుతోందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ మరో పరిశోధకురాలు వినీతా బాల్ అన్నారు. డిసెంబర్–ఫిబ్రవరిలో అప్రమత్తత అవసరం చుట్టేస్తున్న చలి, కొత్త వేరియంట్లు ఉద్భవిస్తే డిసెంబర్–ఫిబ్రవరి కాలంలో మళ్లీ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని, అయితే సెకండ్ వేవ్ నాటి దుర్భర పరిస్థితులు ఉండబోవని సోనిపట్లోని అశోకా విశ్వవిద్యాలయ బయోలజీ విభాగం ప్రొఫెసర్ గౌతమ్ మీనన్ విశ్లేషించారు. ‘ వ్యాక్సినేషన్ భారీ ఎత్తున కొనసాగుతున్న ఈ తరుణంలో వైరస్ ప్రభావం తీవ్రస్థాయిలో ఉండబోదు. ఆస్పత్రిలో చేరడం, మరణం సంభవించే స్థాయి ప్రమాదకర పరిస్థితులు ఉండవు. కోవిడ్ నుంచి కోలుకున్నాక టీకా తీసుకున్న వారికి రెండోదఫా కోవిడ్ నుంచి గణనీయమైన రక్షణ లభిస్తుంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు. జులైలో ఐసీఎంఆర్ నాలుగో జాతీయ సీరో సర్వే ప్రకారం దేశజనాభాలో 67.6 శాతం మందిలో కోవిడ్ యాంటీబాడీలు ఉన్నాయి. వయోజనుల్లో 82 శాతం మంది తొలి డోస్ తీసుకున్నారు. 43 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది మూడో వేవ్ వచ్చి, వెళ్లింది! చెన్నైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేథమేటికల్ సైన్సెస్ ప్రొఫెసర్ సితభ్ర సిన్హా వాదన మరోలా ఉంది. ‘ యూరప్లోని థర్డ్ వేవ్కు భారత్లోని రెండో వేవ్కు చాలా సారూప్యత ఉంది. నా ఉద్దేశం ప్రకారం భారత్లో మూడో వేవ్ సెప్టెంబర్ మధ్యలోనే వచ్చి, అంతర్థానమైంది’ అని ఆయన అంచనావేశారు. కాగా, ముంబై, పుణె, చెన్నై, కోల్కతా నగరాల్లో ఆర్–వాల్యూ 1 కంటే ఎక్కువగా ఉంటోందని ఆయన హెచ్చరించారు. 543 రోజుల కనిష్టానికి కేసులు దేశంలో గత 24 గంటల్లో అత్యల్పంగా 7,579 కరోనా కొత్త కేసులు నమోద య్యాయి. గత 543 రోజుల్లో ఇంత తక్కువ సంఖ్యలో కేసులు రావడం ఇదే ప్రథమమని కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ప్రకటించింది. కొత్త కేసులతో కలుపుకుని మొత్తం కేసుల సంఖ్య 3,45,26,480కు పెరిగింది. మరో 236 మంది కోవిడ్తో కన్నుమూశారు. దీంతో మొత్తం కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య 4,66,147కు పెరిగింది. ఇప్పటిదాకా 3,39,46,749 మంది కోవిడ్ కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,13,584కు తగ్గింది. ఇంత తక్కువ యా క్టివ్ కేసులుం డటం గత 536 రోజుల్లో ఇదే తొలిసారి. పాజిటివిటీ రేటు 0.79శాతానికి చేరుకుంది. మరణాల రేటు 1.35 శాతంగా నమోదైంది. -
Cyclone Gulab: అప్రమత్తం.. 1358 మందికి పునరావాసం
సాక్షి, శ్రీకాకుళం: జిల్లా వ్యాప్తంగా గులాబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అన్నిరకాల సహాయక చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ పేర్కొన్నారు. తుపాను ప్రభావిత మండలాలైన 13 మండలాల్లో 61 కేంద్రాలను ఏర్పాటు చేసామని చెప్పారు. ఇప్పటికే 38 పునరావాస కేంద్రాల్లోకి 1358 మందిని తరలించి, వారికి వైద్యం, భోజనం, ఇతర ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ వివరించారు. గార మండలంలోని ఎస్.మత్స్యలేశం, మొగదల పాడు, నగిరెడ్లపేట తుపాను సురక్షిత కేంద్రాలతో పాటు బందరువానిపేట జిల్లా పరిషత్ హై స్కూల్ నందు 500 మందికి పునరావాసం కల్పించామని అన్నారు. కవిటి మండలంలోని కుసుమపురం, మాణిక్యపురం, ఎద్దువాణిపాలెం, కవిటి.. ముత్యాలపేట తుపాను సురక్షిత కేంద్రాల్లో 342 మందికి, వజ్రపు కొత్తూరులోని హుకుంపేట, మంచినీళ్లపేట, కె.ఆర్.పేట, బైపల్లి, మెట్టూరు మరియు వజ్రపు కొత్తూరు తుఫాన్ రక్షిత కేంద్రాల్లోకి 182 మందికి ఇప్పటివరకు తరలించామన్నారు. ఇచ్చాపురం మండలంలో డొంకూరు, ఈదుపురం తుపాను రక్షిత కేంద్రాలతో పాటు డొంకూరు జిల్లా పరిషత్ హై స్కూల్ నందు 100 మందికి, సంతబొమ్మాళి మండలంలో ఆర్.సున్నపల్లి తుపాను రక్షిత కేంద్రంలో 100 మందికి, పోలాకిలోని గుప్పిడిపేట, రాజారాంపురం పునరావాస కేంద్రాల్లోకి 54 మందిని తరలించినట్లు కలెక్టర్ చెప్పారు. కంచిలి మండలంలోని కుట్టుమ పునరావాస కేంద్రానికి 30 మందికి, పలాస మండలంలోని అమలకుడియా, సరియాపల్లి, బొడ్డపాడు, రంగోయి కేంద్రాలకు 30 మందికి, సోంపేట మండలంలోని బారువ పునరావాస కేంద్రానికి 20 మందిని మొత్తం 1,358 మందికి పునరావాస కేంద్రాలకు తరలించినట్లు కలెక్టర్ చెప్పారు. గులాబ్ తుపాన్ ప్రభావంతో వీచిన బలమైన గాలులకు కంచిలి మండలంలోని మద్దిపుట్టుగ గ్రామంలో 2 ఎలక్ట్రికల్ పోల్స్ పడిపోగా వాటిని తక్షణమే అధికారులు మరమ్మతులు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. సోంపేట మండలంలోని మాకన్నపురంలో ఒక ఇల్లు, కాశీబుగ్గ హరిజన వీధిలో ఒక ఎలక్ట్రికల్ పోల్ విరిగినట్లు ఇప్పటివరకు అందిన సమాచారమని కలెక్టర్ తెలిపారు. పలుచోట్ల రహదారులకు అడ్డంగా విరిగిన చెట్లను తక్షణమే చెట్లను తొలగించడం జరుగుతుందని చెప్పారు. ఇంకా మిగిలిన ప్రాంతాల నుండి నష్టపోయిన వివరాలు అందాల్సి ఉందని కలెక్టర్ తెలిపారు. -
ఆ జరిమానా చెల్లించడం ఇష్టం లేదు : విజయ్
చెన్నై: తనకు విధించిన రూ.లక్ష జరిమానా ప్రభుత్వ కరోనా నివారణ నిధికి చెల్లించడం ఇష్టం లేదని విజయ్ న్యాయస్తానానికి తెలిపారు. ఈయన ఇంగ్లాండ్లో కొనుగోలు చేసిన రోల్స్రాయిస్ కారుకు సంబంధించిన ట్యాక్స్ విషయంగా ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఎస్ఎం సుబ్రమణియం విజయ్కు రూ.లక్ష జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో విజయ్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన డివిజన్ బెంచ్ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులపై తాత్కాలిక స్టే విధించింది. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్కు విధించిన జరిమానా చెల్లింపునకు సంబంధించి ప్రకటన దాఖలు చేసే విషయంపై ప్రత్యేక న్యాయమూర్తి ఎస్ ఎం సుబ్రమణ్యం సమక్షంలో బుధవారం విచారణ జరిగింది. జరిమానాను ప్రభుత్వ కరోనా నివారణ నిధికి ఎందుకు జమ చేయలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. అందుకు విజయ్ తరఫు న్యాయవాది గత ఏడాది ప్రభుత్వ కరోనా నివారణ నిధికి రూ.25 లక్షలు అందించినట్లు, అందువల్ల రూ.లక్ష జరిమానాను కరోనా నివారణ నిధిగా చెల్లించడం ఇష్టం లేదని తెలియచేశారు. దీంతో విజయ్పై కేసును ముగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. -
చుండ్రుకు చెక్ పెట్టాలనుకుంటున్నారా.. ఇవి పాటించండి..
సరిగ్గా తల స్నానం చేయకపోవడం... ఇంకా కొన్ని ఇతర కారణాల వల్ల తలలో చుండ్రు పేరుకు పోతుంది. అందువల్ల వారానికి కనీసం రెండు మూడుసార్లు తల స్నానం చేయాలి. మిగతా రోజుల్లో ఆయిల్తో మసాజ్ చేసుకుని సాధారణ నీటితో కడగాలి. ఇలా చేస్తూ పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటే చుండ్రు తగ్గుతుంది. ఇవి చేస్తూ కింద చెప్పిన సింపుల్ చిట్కాలు పాటిస్తే డ్యాండ్రఫ్ త్వరగా తగ్గుతుంది. సింపుల్ చిట్కాలు ►అరకప్పు మెంతులు తీసుకుని రాత్రంతా నీటిలో నానపెట్టాలి. నానిన మెంతులను మిక్సీలో మెత్తగా రుబ్బుకుని ఈ పేస్టుని తలకు రాసుకోవాలి. నలభై నిమిషాలు ఆరనిచ్చి కడిగేయాలి. ► ఉసిరి, త్రిఫల చూర్ణాన్ని తలకు రాసుకుని ఇరవై నిమిషాల తరువాత తల స్నానం చేయాలి. ►కప్పు కొబ్బరి పాలలో నాలుగు స్పూన్ల నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తల స్నానం చేసేముందు తలకు పట్టించి పదినిమిషాల తరువాత తలను శుభ్రం చేసుకోవాలి. ►ఐదు స్పూన్ల కొబ్బరి నూనెను వేడి చేసి..దీనిలో నాలుగు స్పూన్ల ఉసిరి పొడి వేసి పేస్టులా కలుపుకోవాలి. ఈ పేస్టును తలకు రాసుకుని మసాజ్ చేసుకోవాలి. ►స్పూను పెసరపొడి, మూడు స్పూన్ల పెరుగు తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమంతో తలంటు పోసుకోవాలి. వీటిలో ఏదైనా ఒకదానిని వారానికి రెండు మూడు సార్లు పాటించడం వల్ల చుండ్రు బాధ తగ్గుతుంది. -
అమ్మో ఎండలు: ఈ ఐడియా అదుర్స్..
సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ: ఎండలు మండిపోతున్నాయి. బయటకు రావాలంటేనే జనం భయపడి పోతున్నారు. ఎండకు ఒక్క నిమిషం కూడా రోడ్డుపై నిలబడే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో విజయవాడ వన్టౌన్ తారాపేటలో వ్యాపారస్తులు ఓ వినూత్న ఆలోచన చేశారు. ఆయా దుకాణాలకు వచ్చే వినియోగదారులకు ఎండ బారి నుంచి తప్పించేందుకు గ్రీన్ షేడ్ పందిళ్లను ఏర్పాటు చేశారు. దీంతో కొనుగోలుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: మాటేసి ఉన్నాం.. మాస్క్ లేకుండా వచ్చారో జాగ్రత్త’’ మహమ్మారికి ‘మాస్క్’ దెబ్బ -
డిస్కంలకు ఊరట
సాక్షి, హైదరాబాద్: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు లేట్ పేమెంట్ సర్చార్జీల నుంచి కొంత ఉపశమనం లభించింది. విద్యుదుత్పత్తి కంపెనీలకు డిస్కంలు బిల్లులు చెల్లించడంలో జాప్యం జరిగితే జరిమానాగా చెల్లించాల్సిన లేట్ పేమెంట్ సర్చార్జీలు కొంతవరకు తగ్గిపోనున్నాయి. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం డిస్కంలు బకాయిపడ్డ బిల్లు మొత్తంపై.. 18 శాతం వడ్డీని లేట్ పేమెంట్ సర్చార్జీగా చెల్లిస్తూ వస్తున్నాయి. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించిన ఎలక్ట్రిసిటీ (లేట్ పేమెంట్ సర్చార్జీ) రూల్స్-2021తో సర్చార్జీలు కొంతమేర తగ్గాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) వార్షిక రుణాలపై వసూలు చేస్తున్న వడ్డీ రేటుపై మరో 5 శాతాన్ని జత చేసి లేట్ పేమెంట్ సర్చార్జీలుగా చెల్లించాలని రూల్స్ పేర్కొంటున్నాయి. ఎస్బీఐ వార్షిక రుణాలపై ప్రస్తుతం 7.59 శాతం వడ్డీరేటు ఉండగా, మరో 5 శాతం జత చేసి 12.59 శాతం సర్చార్జీగా (జరిమానా) ఇకపై చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా విద్యుదుత్పత్తి కంపెనీలకు 45 రోజుల్లోగా డిస్కంలు బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. 45 రోజుల గడువు మించిన తర్వాత తొలి నెల జాప్యానికి 12.59 శాతాన్ని (వడ్డీ రేటు) సర్చార్జీగా చెల్లించాల్సి ఉంటుంది. కొత్త రూల్స్ ప్రకారం... రెండో నెల నుంచి ప్రతి నెలా 0.5 శాతం చొప్పున ఈ సర్చార్జీ పెరుగుతుంది. ఈ పెంపుపై గరిష్ట పరిమితిని 3 శాతంగా నిర్ణయించారు. అంటే ఏడు నెలల జాప్యం జరిగితే సర్చార్జీలు 15.59 శాతానికి చేరి ఆగిపోనున్నాయి. ఆ తర్వాత జరిగే జాప్యానికి అదనంగా వడ్డీరేటు పెరగదు. భారీగా బకాయిలు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ప్రాప్తి (http://praapti.in) పోర్టల్ ప్రకారం విద్యుదుత్పత్తి కంపెనీలకు తెలంగాణ డిస్కంలు గత డిసెంబర్ నాటికి రూ.6,954 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి రూ.2,500 కోట్లు, తెలంగాణ జెన్కోకు రూ.5 వేల కోట్లు సైతం డిస్కంలు చెల్లించాల్సి ఉంది. అన్ని కలిపి విద్యుదుత్పత్తి కంపెనీలకు డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు రూ.15 వేల కోట్లకు పైనే ఉంటాయని ట్రాన్స్కో వర్గాలు పేర్కొంటున్నాయి. రూ.15 వేల కోట్ల బకాయిలపై ప్రతి నెలా చెల్లించాల్సిన లేట్ పేమెంట్ సర్చార్జీలు (జరిమానా) తాజాగా కేంద్రం తీసుకొచ్చిన కొత్త రూల్స్తో 18 శాతం నుంచి 12.59– 15.59 శాతానికి (వడ్డీరేటు) తగ్గనుండడంతో ప్రతి నెలా డిస్కంలకు రూ.కోట్లలో భారం తగ్గుతుందని ట్రాన్స్కో వర్గాలు తెలిపాయి. -
ఎంతకీ తలనొప్పి తగ్గడం లేదా?
కొందరిలో తీవ్రమైన తలనొప్పి నెలల తరబడి కనిపిస్తుంది. మందులు వాడితే తగ్గుతుంది తాత్కాలికంగా.. ఆ తర్వాత మళ్లీ వేధిస్తుంటుంది. అసలు ఆ తలనొప్పి కి కారణాలేమిటో తెలుసుకుంటే చికిత్స చేయడం సులభం అవుతుంది. కంటిచూపు సమస్యలు, చెవి, దంతాల సమస్యలు లేనప్పుడు, మెదడు లో కంతులు, ఇతర వికారాల వంటి జబ్బుల గురించి ఆయా పరీక్షల ద్వారా నిర్ధారించుకోవాలి. ఒకవేళ అలాంటివి లేకపోతే కేవలం క్రియాపరమైన మార్పులే తలనొప్పికి కార ణాలవుతాయి. ఉదాహరణకు మైగ్రేన్, మానసిక ఒత్తిడి, అధిక రక్తపోటు మొదలైనవి. నిద్రమామూలుగా పట్టి, మళ్లీ నిద్రలేవగానే వస్తుంటే అది మానసిక ఉద్వేగం, ఆందోళనలవంటి వత్తిడులుగా భావించవచ్చు. బీపీ, షుగర్ వంటి వ్యాధులుంటే ముందు వాటిని నియంత్రణలో పెట్టుకోవాలి. మానసిక ఒత్తిడిలో లక్షణంగా కూడా తలనొప్పి రావచ్చు. వత్తిడికి కారణాలు: ఆర్థిక సంబంధిత, ఉద్యోగపరమైన, కుటుంబపరమైన, సామాజికపరమైన, అత్యాశతో కూడిన వాంఛలకు సంబంధించిన అంశాలుంటాయి. అప్పుడప్పుడు కొన్ని మందుల వల్ల కూడా వత్తిడి అధికమవుతుంది. వీటిని విశ్లేషించి, సహేతుకంగా దూరం చేసుకోవాలి. రోజూ విరేచనం సాఫీగా అయ్యేట్టు చూసుకోవాలి. పులుపు, ఉప్పు, కారం తక్కువగా ఉండే, పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. తాజాఫలాలు, గ్రీన్ సలాడ్స్, మొలకెత్తిన దినుసులు తీసుకోవాలి. రోజూ రాత్రి పడుకునే ముందు కొబ్బరినూనెతో తలకు మృదువుగా మర్దనా చేయాలి. నిపుణుల పర్యవేక్షణలో శరీరానికంతటికీ మసాజ్, ధారాచికిత్స తీసుకోవడం. తేలికపాటి వ్యాయామం, ప్రాణాయామం, ధ్యానం. శ్రావ్యమైన సంగీతం, పాటలు వినడం. లేనిపోని ఆలోచనలకు దూరంగా ఉండడం... ద్వారా తలనొప్పిని దూరం చేసుకోవచ్చు. -
వొడాఫోన్కు భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ 20,000 కోట్ల పన్ను వివాదంలో అంతర్జాతీయ న్యాయస్ధానంలో విజయం సాధించామని టెలికాం దిగ్గజం వొడాఫోన్ శుక్రవారం ప్రకటించింది. బకాయిలు రూ 12,000 కోట్లతో పాటు, రూ 7900 కోట్ల పెనాల్టీల చెల్లింపుపై అంతర్జాతీయ న్యాయస్ధానంలో ఉపశమనం లభించిందని పేర్కొంది. వాయుతరంగాల వాడకం, లైసెన్స్ ఫీజులకు సంబంధించి తలెత్తిన వివాదంపై వొడాఫోన్ 2016లో సింగపూర్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రాన్ని ఆశ్రయించింది. చదవండి : వొడాఫోన్ కొత్త ‘ఐడియా’ వొడాఫోన్పై భారత ప్రభుత్వం మోపిన పన్ను భారాలు భారత్-నెదర్లాండ్స్ మధ్య కుదిరిన పెట్టుబడి ఒప్పందానికి విరుద్ధమని ట్రిబ్యునల్ రూలింగ్ ఇచ్చిందని వొడాఫోన్ పేర్కొంది. ఇక నష్టాలతో సతమతమవుతున్న టెలికాం సంస్థలకు సుప్రీంకోర్టు ఇటీవల వెల్లడించిన రూలింగ్ ఊరట కల్పించింది. ప్రభుత్వ బకాయిల చెల్లింపును పదేళ్లలోగా పూర్తిచేయాలని సర్వోన్నత న్యాయస్ధానం టెలికాం కంపెనీలకు వెసులుబాటు కల్పించింది. -
వాహన కొనుగోలుదారులకు ఊరట
సాకి, న్యూఢిల్లీ: వాహనదారులకు శుభవార్త. కొత్తగా కారు లేదా బైక్ కొనుగోలు చేయాలని భావిస్తున్నవారికి ఊరట లభించనుంది. నేటి (ఆగస్ట్ 1) నుంచి దేశంలో కొత్త ఇన్సూరెన్స్ నిబంధనలు అమల్లోకి వస్తున్న నేపథ్యంలో వాహన ధరలు దిగి రానున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం వినియోగదారులకు పెను భారంగా మారిన లాంగ్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను ఇన్సూరెన్స్ కంపెనీలు ఉపసంహరించుకోనున్నాయి. దీంతో వినియోగదారులు మూడు లేదా ఐదు సంవత్సరాల దీర్ఘకాలిక బీమా పాలసీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కొత్త నిబంధన 2020 ఆగస్టు 1 తర్వాత కొనుగోలు చేసే వాహనాలకు వర్తిస్తుంది. దీంతో ఇకపై కారు, లేదా బైక్ కొనే వారు మూడేళ్లు లేదా ఐదేళ్లకు కాకుండా ఒక ఏడాదికే వెహికిల్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. అయితే ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఈ పాలసీని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫలితంగా వెహికల్ ఆన్రోడ్ ధర కూడా దిగి వస్తుంది. ఈ నేపథ్యంలో కొత్తగా కారు లేదా టూవీలర్ కొనుగోలు చేసే వారికి తొలి ఏడాది ఇన్సూరెన్స్ భారం తగ్గుతుంది. అంతేకాకుండా, కస్టమర్లు ఎక్కువ కాలం ఒకే బీమా కంపెనీకి కట్టుబడి ఉండాల్సి అవసరం లేదు. ఇతర బీమా సంస్థలకు కూడా మారవచ్చు. కాగా వాహన యజమానులు ద్విచక్ర వాహనాలకు ఐదేళ్లు, నాలుగు చక్రాల వాహనాలకు మూడేళ్లు దీర్ఘకాలిక పాలసీని 2018లో సుప్రీంకోర్టు తప్పనిసరి చేసింది. ఇది భారమవుతోందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో తాజా నిబంధనలను ఐఆర్డీఏఐ తీసుకొచ్చింది. -
హెచ్1బీ వీసా: వారికి భారీ ఊరట
వాషింగ్టన్: హెచ్1బీ, ఇతర వర్క్ వీసాలను రద్దుచేసిన అమెరికా ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సంక్షోభం, లాక్డౌన్ నిబంధనల కారణంగా భారతదేశంలో చిక్కుకున్న హెచ్1బీ వీసా హోల్డర్ల భార్య లేదా భర్త, ఇతర ఆధారితులు ఇండియా నుంచి తిరిగి అమెరికాకు వచ్చేందుకు అనుమతినిచ్చింది. దీనికి సంబంధించి వారు వీసా స్టాంపింగ్ చేసుకోవచ్చని ప్రకటించింది. హెచ్1బీ వీసాదారుని జీవిత భాగస్వామి లేదా బిడ్డలు, తల్లిదండ్రులు తిరిగి అమెరికాకు చేరుకోవచ్చని ప్రకటించి వారికి భారీ ఊరట కల్పించింది. (డాలర్ డ్రీమ్స్పై ట్రంప్ పంజా) హెచ్2బీ, హెచ్4తో సహా వివిధవలసేతర వీసాల నిషేధంపై మినహాయింపు ప్రకటించింది. తాజా ఆదేశాల ప్రకారం ప్రస్తుతం అమెరికాలో ఉన్న హెచ్1బీ, వీసాదారుడి జీవిత భాగస్వాములు, డిపెండెంట్లు (భారతదేశంలో చిక్కుకు పోయిన) తిరిగి అమెరికా వెళ్ళడానికి అనుమతి లభించింది. అర్హులైన వారికి హెచ్4, ఎల్-2 వీసాలను జారీ చేయనుంది. అయితే ఈ వీసాల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు భారతదేశంలో యూస్ ఎంబసీ, కాన్సులేట్లు తెరిచేవరకు వెయిట్ చేయాల్సిందే. అలాగే జూన్ 24 నాటికి చెల్లుబాటు అయ్యే వీసా లేని హెచ్1 బీ, హెచ్ 4, జే1, హెచ్2ఏ వీసాదారులకు డిసెంబర్ 31,2020 వరకు అనుమతి ఉండదని మరోసారి స్పష్టం చేసింది. కాగా కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కారణంగా ఉపాధి ఆధారిత వీసాలను డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. -
జీఎస్టీ చెల్లింపుదారులకు ఊరట!
సాక్షి, న్యూఢిల్లీ : జీఎస్టీ చెల్లింపుదారులకు ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. జీఎస్టీఆర్-3బీ రిటర్న్ దాఖలుకు సంబంధించి ఆలస్య రుసుంను ప్రభుత్వం తగ్గించింది. దీంతో జులై 2017 నుంచి జులై 2020కు సంబంధించిన జీఎస్టీఆర్-3 బీ రిటర్న్స్ను ఈ ఏడాది సెప్టెంబర్ 30లోపు దాఖలు చేస్తే ఆలస్య రుసుం గరిష్టంగా 500 రూపాయలుగానే ఉండనుంది. ఇక పన్ను చెల్లించనవసరం లేని పక్షంలో ఆలస్య రుసుం చెల్లించాల్సిన పని లేదని కేంద్ర పరోక్ష పన్నుల బోర్డ్ (సీబీఐసీ) ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే తగ్గించిన ఆలస్య రుసుం ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకూ దాఖలు చేసిన జీఎస్టీఆర్-3 బీ రిటర్స్న్కు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. చదవండి : మెరుగైన జీఎస్టీ వసూళ్లు -
లాక్డౌన్ సాయంగా రూపాయి విరాళం
సాక్షి, చెన్నై : లాక్డౌన్ కారణంగా కనీస అవసరాలకు ఇబ్బందులను ఎదుర్కొంటున్న లక్షలాది మందిని ఆదుకునేందుకు చాలామంది మందుకువస్తున్నారు. వారికి తోచిన విధంగా సహాయం చేస్తూ.. అభాగ్యులకు ఆదుకుంటున్నారు. ఈ క్రమంలోనే పేద వాళ్లను ఆదుకునేందకు మద్రాస్ హైకోర్టు బార్ కౌన్సిల్ కూడా విరాళాల కోసం న్యాయవాదులకు పిలుపునిచ్చింది. అయితే మద్రాస్ హైకోర్టుకు చెందిన ఇద్దరు లాయర్లు కేవలం చెరో రూపాయి మాత్రమే ఇచ్చారు. మరో ఇద్దరు లాయర్లు ఒక్కొక్కరు పది రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఆ డబ్బును బార్ కౌన్సిల్ ఆఫ్ తమిళనాడు, పుదుచ్చేరీలకు లాక్డౌన్ రిలీఫ్ ఫండ్కు ఆన్లైన్ను ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పటి వరకూ బార్ కౌన్సిల్ రూ.60లక్షల రూపాయలు సేకరించింది. వీటన్నింటినీ లాక్డౌక్ కారణంగా అవస్తలు పడుతున్న వారికి సహాయంగా ఉపయోగించనుంది. అత్యధికంగా విరాళం ఇచ్చిన వారిలో జస్టిస్ ఎస్ఎమ్ సుబ్రహ్మణ్యం రూ.2.5లక్షలు విరాళమిచ్చారు. చాలా మంది లాయర్లు ఒక్కొక్కరు రూ.5లక్షలు చొప్పున ఇచ్చారు. కాగా లాక్డౌన్ రిలీఫ్ ఫండ్ కోసం విరాళాలు ఇచ్చిన వారికి అప్రిసియేషన్ సర్టిఫికేట్ కూడా అందజేయనున్నారు. -
విజయ్ మాల్యాకు భారీ ఊరట
లండన్ : లిక్కర్ కింగ్, ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యాకు భారీ ఉపశమనం లభించింది. మాల్యాను దివాలాదారుడిగా ప్రకటించాలంటూ భారత బ్యాంకుల కన్సార్షియం దాఖలు చేసిన పిటిషన్ను లండన్ కోర్టు తోసి పుచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని భారత ప్రభుత్వ రంగ బ్యాంకుల కన్సార్టియం పిటిషన్ పై విచారణను కోర్టు వాయిదా వేసింది. 114.5 కోట్ల పౌండ్ల రుణాలు విజయ్ మాల్యా ఎగ్గొట్టాడని, బకాయిల వసూలు నిమిత్తం మాల్యాను దివాలాకోరుగా ప్రకటించాలని ఎస్బీఐ సారధ్యంలోని భారత బ్యాంకుల కన్సార్షియం అభ్యర్థించింది. దీన్ని విచారించిన జస్టిస్ మైకేల్ బ్రిగ్స్ భారత సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్లతో పాటు, కర్నాటక హైకోర్టులో మాల్యా పెట్టుకున్న చెల్లింపు ప్రతిపాదన తేలేవరకు మాల్యాకు సమయం ఇవ్వాలని తీర్పు చెప్పారు. బ్యాంకు రుణాలు పూర్తిగా చెల్లించే వరకు సమయం ఇవ్వాలంటూ దివాలా ఉత్తర్వులిచ్చేందుకు తిరస్కరించారు. ఈ సమయంలో ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల బ్యాంకులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని జస్టిస్ బ్రిగ్స్ వ్యాఖ్యానించారు. కోవిడ్-19 వ్యాప్తి అనిశ్చితి కారంగా తేదీని నిర్ణయించడం కష్టమని పేర్కొన్న కోర్టు తరువాతి విచారణను జూన్ 1, 2020 నాటికి వాయిదా వేసింది. కాగా భారతీయ బ్యాంకులకు వేలకోట్ల రూపాయల రుణాలను ఎగవేసి మాల్యా లండన్ కు పారిపోయారు. మోసం, మనీలాండరింగ్ ఆరోపణలపై పలు కేసులు నమోదు చేసిన ఈడీ, సీబీఐ మాల్యాకు సంబంధించిన ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయి. అలాగే మాల్యాను భారత్ కు అప్పగించే అంశంపై యుకె హైకోర్టు తీర్పు పెండింగ్లో ఉంది. మరోవైపు అప్పులను వంద శాతం చెల్లిస్తానని అనుమతి ఇవ్వాలంటూ పలుసార్లు బ్యాంకులకు విజ్ఙప్తి చేసిన మాల్యా, కరోనా సంక్షోభంలోనైనా తన అభ్యర్థనను మన్నించాలంటూ ఇటీవల కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ను అభ్యర్థించిన సంగతి తెలిసిందే. చదవండి: కరోనా సంక్షోభంలోనైనా నా మొర ఆలకించండి కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం కరోనా : భారత సంతతి వైద్యురాలు కీలక నిర్ణయం కరోనా : ఎన్పీఎస్ చందాదారులకు ఊరట -
లాక్డౌన్: వలస కూలీలకు ‘రిలీఫ్’
కర్నూలు(సెంట్రల్): బతుకుదెరువు కోసం జిల్లాకు వలస వచ్చిన వివిధ రాష్ట్రాలకు చెందిన కూలీలకు విశ్రాంతి కేంద్రాలు ఊరట ఇస్తున్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో పనుల్లేక, సొంతూళ్లకు వెళ్లే వీల్లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఈ తరుణంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వలస కూలీల కోసం రిలీఫ్ (నిరాశ్రయ) కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అందులో భాగంగా జిల్లాలో 63 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 3,328 మంది ఆశ్రయం పొందుతున్నారు. రిలీఫ్ కేంద్రాల్లో వలస కూలీలు ఉండేందుకు అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం కలి్పంచింది. అంతేకాక జగనన్న గోరుముద్ద పథకంలో విద్యార్థులకు వడ్డించే మెనూ ప్రకారం భోజన వసతి కలి్పంచారు. జిల్లాలోని రిలీఫ్ కేంద్రాల్లో జార్ఖండ్కు చెందిన 817 మంది, బీహార్ 561, ఉత్తరప్రదేశ్ 259, మధ్యప్రదేశ్ 118, కర్ణాటక 74, రాజస్థాన్ 58, అస్సాం 34, తమిళనాడు 34, ఢిల్లీ 31, తెలంగాణ 24, చత్తీస్ఘడ్ 17, గుజరాత్ 9, పంజాబ్ 8, కేరళ 5, అరుణాచల్ ప్రదేశ్ 3, ఉత్తరాఖండ్కు చెందిన ఒక్కరు ఆశ్రయం పొందుతున్నారు. -
ఎగుమతిదారులకు ఆర్బీఐ ఊరట
ముంబై: ఎగుమతిదారులకు ఆర్బీఐ ఉపశమన చర్యలను ప్రకటించింది. కరోనా వైరస్తో ప్రపంచ దేశాలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో వస్తు, సేవల ఎగుమతిదారులకు ఊరట కల్పించింది. విదేశీ కొనుగోలుదారుల నుంచి చెల్లింపులు స్వీకరించడం, భారత్కు పంపుకునేందుకు 15 నెలల గడువు ఇచ్చింది. ఎగుమతి చేసిన తేదీ నుంచి ఈ గడువు అమల్లోకి వస్తుంది. అది కూడా ఈ ఏడాది జూలై 31 వరకు ఎగుమతి చేసే వాటికి ఇది వర్తిస్తుందని ఆర్బీఐ పేర్కొంది. ఇప్పటి వరకు ఈ గడువు ఎగుమతి చేసిన నాటి నుంచి 9 నెలలుగానే ఉంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ‘వేస్ అండ్ మీన్స్’ కింద తాను ఇచ్చే రుణాల పరిమితిని 30% పెం చాలని నిర్ణయించింది. ప్రభుత్వాల ఆదా యాలు, చెల్లింపుల మధ్య అంతరాన్ని అధి గమించేందుకు వేస్అండ్మీన్స్ కింద తాత్కాలిక రుణాలను ఇస్తుంటుంది. వాస్తవానికి వేస్అండ్మీన్స్ పరిమితిని సమీక్షించేందుకు ఆర్బీఐ ఓ సలహా కమిటీని ఏర్పాటు చేయగా, కమిటీ నుంచి నివేదిక ఇంకా రావాల్సి ఉంది. కౌంటర్ సైక్లికల్ క్యాపిటల్ బఫర్ (సీసీవైబీ)ను ప్రస్తుతం అమలు చేయాల్సిన అవసరం లేదని కూడా ఆర్బీఐ స్పష్టం చేసింది. బ్యాంకులు సమయానుకూలంగా నిర్వహించాల్సిన నగదు నిల్వలను సీసీవైబీగా పేర్కొంటారు. -
టెల్కోలకు ఊరటపై కేంద్రం దృష్టి
న్యూఢిల్లీ: ఏజీఆర్ బాకీల భారంతో సంక్షోభంలో చిక్కుకున్న టెలికం రంగానికి సత్వరం ఊరటనిచ్చే చర్యలపై కేంద్రం దృష్టి సారించింది. కేంద్ర టెలికం శాఖ, ఇతర కీలక శాఖల సీనియర్ అధికారులు ఆదివారం దీనిపై అత్యవసరంగా సమావేశమయ్యారు. దాదాపు గంటకుపైగా సాగిన సమావేశంలో నీతి ఆయోగ్, ఆర్థిక శాఖ అధికారులు కూడా పాల్గొన్నట్లు సమాచారం. టెలికం పరిశ్రమకు తోడ్పాటు అందించేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలపైనా ఇందులో చర్చించినట్లు తెలుస్తోంది. సవరించిన స్థూల ఆదాయ (ఏజీఆర్) లెక్కల ప్రకారం లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల కింద కేంద్రానికి టెలికం సంస్థలు సుమారు రూ. 1.47 లక్షల కోట్లు కట్టాల్సి ఉందని అంచనా. ఇందులో దాదాపు 60 శాతం పైగా భాగం ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలదే ఉంది. బాకీల చెల్లింపులో జాప్యంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో టెల్కోలు కొంత భాగాన్ని ఇప్పటికే జమ చేశాయి. అయితే, ఈ బాకీలు తమపై తీవ్ర భారం మోపుతాయని టెలికం సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై ఎయిర్టెల్ చీఫ్ సునీల్ మిట్టల్, వొడాఫోన్ ఇండియా చైర్మన్ కుమార మంగళం బిర్లా.. గతవారం కేంద్ర ప్రభుత్వ వర్గాలతో ముమ్మరంగా చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో తాజాగా అత్యున్నత స్థాయి సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. (చదవండి : టెల్కోలకు మరిన్ని కష్టాలు) లెక్కింపు విధానం స్థిరంగా ఉండాలి: సీవోఏఐ ఏజీఆర్ బాకీల విషయంలో వ్యత్యాసాలు రాకుండా .. లెక్కింపు విధానం సర్కిళ్లవారీగా మారిపోకుండా స్థిరంగా ఉండేలా టెలికం శాఖ చూడాలని టెల్కోల సమాఖ్య సీవోఏఐ అభిప్రాయపడింది. ఏజీఆర్ బాకీల వసూలు కోసం టెల్కోల బ్యాంక్ గ్యారంటీలను కేంద్రం స్వాధీనం చేసుకుంటే .. అది పరిశ్రమ మనుగడకే ముప్పుగా పరిణమిస్తుందని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ వ్యాఖ్యానించారు. బకాయిల లెక్కింపులో తేడాలేమైనా ఉన్నాయేమో పరిశీలించేందుకు టెలికం శాఖ ప్రతిపాదించిన ’టెస్ట్ చెక్’ విధానం సాధారణంగా జరిగే ఆడిటింగ్ ప్రక్రియేనని ఆయన తెలిపారు. (టెల్కోలకు మరోషాక్: డాట్ డెడ్లైన్) -
వారికి రిలీఫ్లు లేవు: ఆర్టీసీ ఎండీ
సాక్షి, హైదరాబాద్: రెండేళ్లపాటు ఆర్టీసీ యూనియన్ ఎన్నికలు లేవని ప్రభుత్వం తేల్చి చెప్పటంతో కొత్తగా ఏర్పడ్డ డిపో సంక్షేమ మండళ్ల సభ్యులకు రిలీఫ్లు కేటాయించకూడదని ఆర్టీసీ నిర్ణయించింది. రోజువారీ విధులు నిర్వర్తిస్తూనే అదనంగా సిబ్బంది సమస్యల పరి ష్కారం కోసం దృష్టి సారించాలని ఆర్టీసీ ఎండీ సునీల్శర్మ స్పష్టం చేశారు. ఈ సంక్షేమ మండళ్లు అందుబాటులోకి వచ్చి నెలరోజులు గడిచినందున, వాటి నిర్వహణలో ఉన్న ఇబ్బందులు తెలుసుకుని, తగు సూచనలు సలహాలు ఇవ్వడంతో పాటుగా మరింత పకడ్బందీగా వ్యవహరించేందుకు సాధారణ శిక్షణ ఇవ్వాలని ఆర్టీసీ నిర్ణయించింది. బస్భవన్లో మంగళవారం జరిగిన కరీంనగర్ జోన్ పరిధిలోని డిపో మేనేజర్లు, అకౌంట్స్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని సునీల్ శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కొందరు డిపో మేనేజర్లు, సంక్షేమ మండళ్ల సభ్యులు తమకు విధులు లేకుండా రిలీఫ్లు కేటాయించాలని కోరుతున్న విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్రవ్యాప్తంగా 200 మందిని మించి సభ్యులున్నం దున, వారికి రిలీఫ్లు ఇస్తే సంస్థపై ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. రోజు కాసేపు మాత్రమే సిబ్బంది సమస్యలపై దృష్టి సారిస్తే సరిపోతుందని, ఇందుకు పెద్దగా సమయం పట్టనందున ప్రత్యేకంగా రిలీఫ్లు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. -
డ్యూటీ వెసులుబాట్లపై వేటు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెతో కార్మిక సంఘాల నేతలపై రగిలిపోతున్న అధికారులు వారికున్న వెసులుబాట్లపై వేటు వేస్తున్నారు. గుర్తింపు కార్మిక సం ఘం నేతలకు ప్రత్యేక రిలీఫ్లు పొందే వెసులుబాటు ఉంది. రిలీఫ్ అంటే.. వారు విధులకు హాజరు కావాల్సిన పనిలేదు. హాజరుపట్టికలో సంతకం చేస్తే చాలు వేతనం అందుతుంది. ఇలాంటి వాటిని తొలగించాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. వాటికి సంబంధించిన వారందరికీ, ఆయా వెసులుబాట్లు తొలగిస్తున్నట్లు అధికారులు 300 మందికి శ్రీముఖాలు పంపినట్లు తెలిసింది. గత కార్మిక సంఘం ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ విజయం సాధించింది. దీంతో ఈ సంఘం గుర్తింపు సంఘంగా ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర నేతల్లో 20 మందికి పూర్తి రిలీఫ్లు ఉంటాయి. వీరు ఒక్క రోజు కూడా విధులకు హాజరు కావాల్సిన పనిలేదు. ఇక ప్రతి డిపో కార్యదర్శికి యూనియన్ రిలీఫ్ పేరుతో వారానికి ఒక రోజు, రీజినల్ కార్యదర్శికి వారానికి ఒక రోజు ఉంటుంది. గుర్తింపు సంఘానికి సంబంధించి తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో పర్యవేక్షణకు నిత్యం ఆఫ్ డే రిలీఫ్ ఉంటుంది. ఇప్పుడు వీటన్నింటిని రద్దు చేస్తున్నట్లు అధికారులు వారికి పంపిన నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలిసింది. మీడియాపై ఆంక్షలు.. బస్భవన్లోకి మీడియా ప్రతినిధులు రాకుండా అనధికార ఆంక్షలు విధించారు. విలేకరులను లోనికి రానీయవద్దని అధికారులు ఆదేశించారని ప్రధాన గేటు వద్ద ఉండే సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు. రూ.3 వేల కోట్లివ్వండి.. ఆర్టీసీకి వన్టైం సెటిల్మెంట్ కింద రూ.3 వేల కోట్లు ఇస్తే సమస్యలన్నీ పోతాయని, భవిష్యత్లో నష్టాల మాట లేకుండా సంస్థ నడుస్తుందని కార్మిక సంఘం సీనియర్ నేత, ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు అన్నారు. ఈ దిశగా ఆలోచించాలని కోరుతూ సీఎం కార్యాలయానికి కూడా లేఖ రాసినట్టు తెలిపారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు ఆదివారం మానవహారాలు నిర్వహించనున్నారు. ప్రొఫెసర్ జయశంకర్కు, చనిపోయిన ఆర్టీసీ కార్మికులకు నివాళులర్పించి అన్ని డిపోల పరిధిలో మానవహారాలు నిర్వహించాలని శనివారం జరిగిన సమావేశంలో జేఏసీ నిర్ణయించింది. -
‘వాల్తేరు’ ఉద్యోగులకు ఊరట
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్(దక్షిణ కోస్తా) రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను ప్రత్యేకాధికారి ఇటీవలే రైల్వే అందించారు. దానిపై వివిధ వర్గాల సలహాలు, సూచనలు, అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత నాలుగు నెలల్లోగా జోన్ ప్రారంభానికి నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశముంది. కొత్త జోన్ ఏర్పాటు, వాల్తేరు డివిజన్ విభజన జరిగితే తమకు అన్యాయం జరుగుతుందని ఆందోళన చెందుతున్న ఉద్యోగులకు ఉపశమనం కలిగించే పలు అంశాలను సైతం డీపీఆర్లో చేర్చారు. సీనియారిటీ పోతుందనే ఆందోళన.. జోన్ ఏర్పాటుతోనే మనుగడ కోల్పోనున్న వాల్తేరు డివిజన్ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు ఏ డివిజన్ కిందికి వస్తారన్న దానిపై ఇంతవరకు సందిగ్ధత ఉంది. కొత్త డివిజన్లలో తమను విలీనం చేస్తే సీనియారిటీ కోల్పోయి పదోన్నతి అవకాశాలు దూరమవుతాయని ఉద్యోగులు కలత చెందారు. కలాసీలు, ట్రాక్మెన్లు, టెక్నీషియన్లుగా ఉద్యోగాల్లో చేరి ఏళ్ల తరబడి ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న వారు పెద్దసంఖ్యలోనే ఉన్నారు. వారిలో వందలాది కలాసీలతోపాటు మూడేళ్లకు పైగా సర్వీస్ చేసిన సుమారు 300 మంది గ్యాంగ్మెన్లు జేఈ పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు. డివిజన్ విడిపోతే టెక్నీషియన్లు డివిజనల్ సీనియారిటీ, గ్రూప్–డి ఉద్యోగులు యూనిట్ సీనియారిటీ కోల్పోయే ప్రమాదముందని ఉన్నతాధికారులకు విన్నవించుకున్నారు. విభజించినా విశాఖలోనే... ఉద్యోగుల ఆందోళనలకు తెరదించుతూ దక్షిణ కోస్తా జోన్ డీపీఆర్లో కొన్ని మార్గదర్శకాలు పొందుపరిచారు. వాల్తేరు డివిజన్లో ఉన్న ప్రతి ఉద్యోగి జోన్ పరిధిలోనే కొనసాగేలా చర్యలు చేపట్టనున్నారు. ప్రస్తుతం వాల్తేర్ డివిజన్లో 17,985 మంది ఉద్యోగులుండగా వీరిలో 930 మంది డీఆర్ఎం కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. జోన్ ప్రధాన కార్యాలయానికి 1250 మంది ఉద్యోగులు అవసరం. అంటే.. డీఆర్ఎం కార్యాలయంలో ప్రస్తుతం ఉన్న వారికి అదనంగా 320 మంది అవసరం. డీఆర్ఎం కార్యాలయ పరిధిలో పనిచేసే ఉద్యోగులు మినహా.. మిగిలిన వారంతా.. తమ స్థానాల్లోనే కొనసాగుతారు. 930 మందికే ఆప్షన్లతో కూడిన స్థానచలనం ఉంటుంది. మొత్తం ఉద్యోగుల్లో వీరి సంఖ్య 10 శాతానికి మించదు. మూడు ఆప్షన్లు.. పైగా ఏడాది వ్యవధిలోనే.... డీఆర్ఎం కార్యాలయ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులను మాత్రం కొత్త జోన్తో పాటు రాయగడ, విజయవాడ డివిజన్లలో సర్దుబాటు చేయనున్నారు. వీరికి మూడు ఆప్షన్లు ఇస్తారు. జోన్ కేంద్రం.. రాయగడ డివిజన్.. విజయవాడ డివిజన్.. ఈ మూడింటిలో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం ఇస్తారు. ఉద్యోగుల అభిప్రాయానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేయనున్నారు. ఇక్కడి నుంచి బయటకు వెళ్లినా ఉద్యోగులు కొత్త జోన్ పరిధిలోకే వస్తారు. ఫలితంగా వారి సీనియారిటీలో మార్పులేకుండా ప్రమోషన్లు పొందేలా విధివిధానాలు రూపొందించారు. కొత్తగా ఏర్పడనున్న రాయగడ డివిజన్కు వెళ్లిన వారికి అదనపు వెసులుబాటు కల్పించాలని నిర్ణయించారు. కొత్త డివిజన్లో ఏడాది కాలం పని చేశాక.. ఎక్కడికి కావాలంటే అక్కడికి బదిలీ కోరే సౌకర్యం కల్పించనున్నారు. కాగా ఏ చిన్న పనికైనా విజయవాడ డివిజన్ కేంద్రానికి వెళ్లాల్సి వస్తుందన్న ఆందోళనకు కూడా పరిష్కారం సూచిస్తున్నారు. ఈ తరహా ఇబ్బందులను పరిహరించేందుకు వీలుగా ప్రత్యేక యాప్, వెబ్సైట్ రూపొందించనున్నారు. మొత్తంగా.. వాల్తేరు డివిజన్ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా డీపీఆర్ని రూపొందించినట్లు రైల్వే ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. -
కాలాన్ని కవర్ చేద్దాం
ఎండవేడిమి చర్మం, శిరోజాల మీద అధిక ప్రభావం చూపుతుంది. విరుగుడుగా మనమే కొన్ని జాగ్రత్తలను పాటించి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఎండకాలం తీవ్రతను కవర్ చేసేయొచ్చు. కమిలిన చర్మానికి కలబంద ఎండకు కమిలిన చర్మానికి కలబంద మంచి ఉపశమనం ఇస్తుంది. కలబంద రసాన్ని ఐస్ట్రేలో పోసి ప్రీజర్లో సిద్ధంగా ఉంచాలి. కలబంద క్యూబ్తో కమిలిన చర్మం మీద మృదువుగా రబ్ చేయాలి. ఇది వెంటనే రిలీఫ్ ఇవ్వడంతో పాటు ట్యాన్ తగ్గిస్తుంది. తాజాదనానికి రోజ్వాటర్ ఇంట్లో రోజ్వాటర్ని ఫ్రిజ్లో సిద్ధంగా ఉంచుకోండి. బయటకు వెళ్లి వచ్చినప్పుడు దూది ఉండను చల్లని రోజ్వాటర్లో ముంచి, దాంతో ముఖమంతా తుడవండి. కళ్ల చుట్టూ మరోమారు తుడవాలి. దీంతో మీకు అలసట తీరిపోయి ఫ్రెష్గా కనిపిస్తారు. పొడి జుట్టుకు తేనె తేనె, కొబ్బరినూనె సమపాళ్లలో తీసుకోవాలి. జుట్టుకు, మాడుకు పట్టించాలి. షవర్క్యాప్తో జుట్టునంతా కవర్ చేయాలి. 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే పొడిజుట్టుకు మంచి కండిషనింగ్ లభిస్తుంది. కాలిమడమలకు సముద్రపు ఉప్పు బంగాళదుంపను సగానికి కట్ చేసి, దానిని ఉప్పుతో రుద్ది కాలి మడమల భాగంలో రబ్ చేయాలి. తర్వాత వాజెలిన్ రాసి, సాక్స్లు వేసుకోవాలి. రాత్రి పడుకునేముందు ఈ విధంగా చేయాలి. కొన్నిరోజుల్లోనే మీ పాదాల పగుళ్లు తగ్గి, చర్మం మృదువుగా అవుతుంది. చిట్లిన వెంట్రుకలకు ఆలివ్ ఆయిల్ వేసవిలో స్విమ్మింగ్ చేసేవారికి తలవెంట్రుకులు బాగా పొడిబారడం, చిట్లడం వంటì సమస్యలు ఎదురవుతుంటాయి. దీనికి విరుగుడుగా.. స్విమ్మింగ్ చేయడానికి ముందు ఆలివ్ ఆయిల్తో మసాజ్ చేసుకోవాలి. దీని వల్ల వెంట్రుకల కండిషన్ దెబ్బతినదు. జుట్టు దురద పెడుతుంటే చల్లటి పెరుగును జుట్టుకు పట్టించి 10 నిమిషాలు సేదదీరండి. తర్వాత శుభ్రపరుచుకోండి. దురద తగ్గడమే కాకుండా జుట్టుకు పెరుగు మంచి కండిషనర్లా పనిచేస్తుంది. -
గజ తుఫాన్ బాధితులకు ఆది పినిశెట్టి సాయం
దక్షిణ భారతాన్ని వరుస తుఫాన్లు వణికిస్తున్నాయి. ఇప్పటికీ తిత్లీ తుఫాన్ నుండి ఆంధ్రప్రదేశ్ పూర్తిగా తేరుకోకముందే గజ తుఫాన్ తమిళనాడును జలమయం చేసేసింది. బాదితులను ఆదుకునేందుకు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ తారలు తుఫాను ప్రభావిత ప్రాంతాలను ఆదుకునేందుకు విరాళాలను ప్రకటించారు. తాజాగా మరో యంగ్ హీరో ముందుకొచ్చాడు. హీరో ఆది పినిశెట్టి గజ తుఫాన్ బాధితులకు తన వంతు తాను సాయం అందించడానికి ముందుకొచ్చాడు. ఆది పినిశెట్టి తన టీమ్ తో కలిసి హెల్ప్ చేయడానికి కాస్త సమస్యగా ఉన్న కొన్ని ఏరియాలను గుర్తించి.. అక్కడికి వెళ్లి సుమారు 5 టన్నుల రిలీఫ్ మెటీరియల్.. ఫుడ్, మెడిసన్, బెడ్ షీట్స్, సోలార్ లైట్స్, దోమ తెరలు అంధించారు. 4 గ్రామాల్లో దాదాపు 520 కుటుంబాలకు, వారి వారి రేషన్ కార్డులని పరిశీలించి చేయూతనందించారు. అంతేకాకుండా...ఈ తుఫాన్ బాధితులను ఆదుకోవడానికి ప్రతిఒక్కరూ ముందుకు రావాలని, వారిని ఆదుకోవాలని ఆది పినిశెట్టి కోరారు. -
మీటూ: మాజీ ప్రపంచ సుందరికి భారీ ఊరట
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి, మాజీ ప్రపంచ సుందరి సుస్మితా సేన్కు భారీ ఊరట లభించింది. కోకా కోలా కంపెనీ నుంచి పరిహారంగా లభించిన మొత్తంపై పన్ను చెల్లింపుపై ఇన్కం టాక్స్ అప్పెల్లా ట్రిబ్యునల్ (ఐటీఏటి) ఉపశమనం కల్పించింది. నష్టపరిహారంగా వచ్చిన ఆదాయంగా చూడలేమని దీనిపై పన్నుచెల్లించాల్సిన అవసరంలేదని ట్రిబ్యునల్ తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో సుస్మితా సేన్కు లైంగిక వేధింపుల కేసులో నష్టపరిహారంగా వచ్చిన రూ.95లక్షలు ఆదాయం కిందికి రాదని వెల్లడించింది. కాబట్టి పన్నుకట్టనక్కలేదంటూ ఆమెపై విధించిన రూ. 35 లక్షల జరిమానాను కొట్టి వేసింది. ఆదాయపు పన్ను చట్టం, 1961 సెక్షన్ 28ప్రకారం , 2(24) పరిహారాన్ని ఆదాయంగా పేర్కొనలేమని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. కోకా కోలా ఇండియా ఉద్యోగిపై లైంగిక ఆరోపణ కేసులో 2003-04లో, సుస్మితా సేన్క కంపెనీ రూ. 1.45 కోట్లు చెల్లించింది. ఇందులో 50లక్షల రూపాయల ఆదాయపన్ను కింద మినహాయించి రూ. 95 లక్షల నష్టపరిహారాన్ని సుస్మితా అందుకున్నారు. అయితే దీన్ని సుస్మితా సేన్ ఐటీ ఫైలింగ్లో ప్రకటించలేదంటూ ఆదాయన పన్నుశాఖ పెనాల్టీ విధించింది. -
సగటు జీవికి ఊరట..
సాక్షి, న్యూఢిల్లీ : భగ్గుమంటున్న ఇంధన ధరలు ఆదివారం వరుసగా రెండోరోజు స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటర్కు 25 పైసలు తగ్గి రూ 81.74 పలికింది. డీజిల్ ధర లీటర్కు 17 పైసలు పతనమై రూ 75.19గా నమోదైంది. హైదరాబాద్లో పెట్రోల్ ధర స్వల్పంగా దిగివచ్చి రూ 86.90కి తగ్గింది. ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ లీటర్కు 25 పైసలు తగ్గి రూ 87.21గా నమోదైంది. డీజిల్ ధర లీటర్కు 18 పైసలు దిగివచ్చి రూ 78.82కు తగ్గింది. కాగా గతవారం అంతర్జాతీయ, దేశీయ దిగ్గజ చమురు కంపెనీల టాప్ ఎగ్జిక్యూటివ్లతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం నేపథ్యంలో ఇంధన ధరలు దిగిరావడం గమనార్హమని ఇంధన నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు మండుతున్న ఇంధన ధరలను నియంత్రించేందుకు పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని ఈనెల 4న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తగ్గించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఇంధన ధరలపై పన్ను భారాన్ని తగ్గించాలని ఆయన కోరారు. -
మందారం
మహర్షులు మనకు మార్గదర్శనం చేసిన దేవతా వృక్షాలలో మందారం ఒకటి. దీనిని సంస్కృతంలో జపాపుష్పమనీ, రుద్రపుష్పమనీ, అర్కప్రియ అనీ, తెలుగులో దాసాని అనీ అంటారు. లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన పుష్పాలలో మందార కూడా ఒకటి. మందారలో చాలా రకాలున్నప్పటికీ, ఎర్రమందారం లేదా ముద్దమందారమే ఎక్కువగా కనిపిస్తుంది. సూర్యుడి శరీర రంగుని మందారపువ్వుతో పోల్చారంటే మందార పుష్పం ఎంత ప్రాచీనకాలం నుంచి ఉన్నదో, ఎంత ప్రాశస్త్యమైనదో తెలుసుకోవచ్చు. జాతకంలో రాహు, కుజ దోషాలతో బాధపడుతూ వివాహానికి ఆటంకాలు ఎదురవుతున్నవారు అమ్మవారిని, ఆంజనేయస్వామినీ మందారపూలతో అర్చించడం ద్వారా ఆయా దోషణ నివారణ జరిగి, తొందరగా వివాహం అవుతుందని శాస్త్రోక్తి. కేవలం అలంకరణకు, పూజకు మాత్రమే ఉపయోగించడం గాదు, మందారంతో ఆయుర్వేద ఔషధాలను కూడా తయారు చేస్తారు. మందారపూలను రుబ్బి, రసం తీసి, నువ్వులనూనె లేదా కొబ్బరినూనెలో కలిపి సన్నటి సెగ మీద వేడి చేసి, నూనె మాత్రమే మిగిలేదాకా ఉంచి, చల్లారిన తర్వాత సీసాలో పోసి భద్రపరుచుకుని తలకు రాసుకుంటే కురులు నల్లగా, దృఢంగా, నిగనిగలాడతాయని పెద్దలు చెబుతారు. -
కార్తీ చిదంబరానికి ఊరట
సాక్షి, చెన్నై : విదేశీ ఆస్తులను వెల్లడించలేదనే ఆరోపణలపై ఆదాయ పన్ను శాఖ మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి వారెంటు జారీ చేసిన క్రమంలో మద్రాస్ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కార్తీపై ఆదాయ పన్ను శాఖ నల్లధనానికి సంబంధించిన కేసులో జారీ చేసిన వారెంట్పై ఆదివారం అర్థరాత్రి చేపట్టిన విచారణలో మద్రాస్ హైకోర్టు ఆయనకు ఊరట కల్పించింది. కార్తీ విదేశాల నుంచి తిరిగివచ్చే వరకూ ఆయనపై జారీ చేసిన వారెంట్ను పక్కనపెట్టాలని ఐటీ శాఖను ఆదేశించింది. ఐటీ వారెంట్ నేపథ్యంలో కార్తీ అరెస్ట్ను నివారించేందుకు ఆయన న్యాయవాదులు ఏఆర్ఎల్ సుందరేశన్, సతీష్ పరాశరన్లు ఆదివారం రాత్రి మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ అధికారిక నివాసాన్ని ఆశ్రయించారు. అయితే ముందస్తు బెయిల్ పిటిషన్తో సంబంధిత న్యాయమూర్తిని ఆశ్రయించాలని వారికి ప్రధాన న్యాయమూర్తి సూచించారు. -
బాబుకు ఆస్తమా తగ్గుతుందా?
ఆస్తమా కౌన్సెలింగ్ మా బాబుకు ఐదేళ్లు. వాడికి తరచూ ఆస్తమా వస్తూ ఉంటుంది. డాక్టర్ను సంప్రదిస్తే కొన్ని మందులు ఇచ్చారు. మాది చాలా రూరల్ ఏరియా. మా బాబుకు ఆస్తమా తగ్గుతుందా? దయచేసి వివరించండి. – నిహారిక, తల్లాడ చిన్నపిల్లల్లో ఆస్తమా వస్తే వారు పెరిగే కొద్దీ... అంటే టీన్స్లోకి ప్రవేశిస్తున్నప్పుడు లేదా యుక్తవయస్కులుగా మారుతున్నప్పుడు ఆ ఆస్తమా లక్షణాలు క్రమంగా తగ్గిపోవచ్చు. అయితే కొంతమందిలో కొన్నాళ్లు కనిపించకుండా పోయిన ఆ లక్షణాలు కొంతకాలం తర్వాత మళ్లీ కనిపించవచ్చు. చిన్నప్పుడు మరీ తీవ్రమైన ఆస్తమా వస్తే అది పెద్దయ్యాక కూడా తగ్గకపోవచ్చు. అయితే మీవాడి తీవ్రత తక్కువే అని మీ లేఖను బట్టి తెలుస్తోంది కాబట్టి అది తగ్గే అవకాశమే ఉంది. బాధపడకండి. మీ బాబు ఆస్తమాకు రెండు రకాల చికిత్స అవసరమవుతుంది. అది... ∙దీర్ఘకాలంలో మళ్లీ రాకుండా నివారించేందుకు అవసరమైన ప్రివెంటివ్ చికిత్స. ఇందులో భాగంగా ఇచ్చే ఇన్హేలర్ను ప్రతిరోజూ తీసుకోవాల్సి ఉంటుంది. ∙తక్షణ ఉపశమనం కోసం తీసుకోవాల్సిన చికిత్స. ఆస్తమా వచ్చినప్పుడు వాయునాళాల వాపు తగ్గించి, హాయిగా శ్వాస తీసుకోవడాని దోహదపడేందుకు ఉపయోగించే మందులు దీనికోసం వాడాల్సి ఉంటుంది. వీటినే రెస్క్యూ మెడికేషన్ అనీ, క్విక్ రిలీఫ్ మెడికేషన్ అని కూడా అంటారు. ఇది ఆస్తమా అటాక్ ఉన్నప్పుడు చేసే స్వల్పకాలిక చికిత్స. కొందరు పిల్లల్లో ఆటలు లేదా వ్యాయామానికి ముందు కూడా ఈ చికిత్సను డాక్టర్లు సిఫార్సు చేస్తుంటారు. మీ బాబు వయసు ఐదేళ్లు కాబట్టి ఇలాంటి పిల్లల్లో స్పేసర్తో ఇన్హేలర్ ఉపయోగించాలి. మీరు మీకు దగ్గర్లోని పెద్దసెంటర్లో ఉన్న నిపుణులను సంప్రదించండి. పిల్లల్లోని ఆస్తమాకు డాక్టర్లు సూచించినట్లు మందులు వాడితే ఇప్పుడు చాలామందిలో అది పెద్దయ్యేనాటికి తప్పక తగ్గుతుంది. చలవ పదార్థాలతో ఆస్తమా వస్తుందా? నా వయసు 37 ఏళ్లు. నాకు చాలాకాలంగా ఆస్తమా ఉంది. అయితే కొందరు చల్లటి పదార్థాలు తినకూడదు, చలవ పదార్థాల వల్ల ఆస్తమా వస్తుందని అంటున్నారు. నిజమేనా? – ఆర్. రామచంద్రరావు, కాకినాడ సాధారణంగా ఆస్తమాను చాలా అంశాలు ప్రేరేపిస్తుంటాయి. నిర్దిష్టంగా ఏ పదార్థం ఆస్తమాను ప్రేరేపిస్తుందో దాన్ని అలర్జెన్ అంటారు. అదే పదార్థం అందరిలోనూ అదేవిధంగా ఆస్తమాను కలిగించదు. అలెర్జన్లు వ్యక్తి నుంచి వ్యక్తికి మారతాయి. కొందరిలో పుప్పొడి, మరికొందరిలో దుమ్ము, ధూళి, ఇంకొందరిలో పొగ... ఇలా రకరకాల పదార్థాలు ఆస్తమాకు కారణం కావచ్చు. అయితే చాలామందిలో ఏదో ఒక తినే పదార్థం సరిపడక ఆస్తమా రావచ్చు. ఉదాహరణకు... కొందరిలో సముద్రపు ఆహారం (సీఫుడ్స్), కొన్ని రకాల నట్స్, పల్లీలు, పులుపు ఎక్కువగా ఉండే పండ్లు, పులుసుకూరలు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలు, ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి వాడే ప్రిజర్వేటివ్స్ కలిపిన ఆహారాలు, నెయ్యికి బదులుగా మార్జరిన్ వంటి నూనెలు ఉపయోగించిన నిల్వసరుకులతో ఆస్తమా రావచ్చు. ఇలా సరిపడని ఆహారం వల్ల ఆస్తమా వచ్చే సందర్భాల్లో అసలు రోగికి సరిపడని ఆహారం ఏదో గుర్తించి దాన్ని మాత్రమే నివారించాలి. అది మినహా వ్యాధి తగ్గడానికి, రోగనిరోధక శక్తి పెంపొందడానికి విటమిన్లు, ఖనిజలవణాలు, పోషకాలు పుష్కలంగా ఉన్న మిగతా ఆహారాలన్నింటినీ యథావిధిగా తీసుకోవచ్చు. ఆకకూరలు, ఒమెగా ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉండే మంచినీటి చేపలు అలర్జీలను కలిగించవు. ఇలా సరిపడని ఆహారం మినహా ఆరోగ్యకరమైన అన్ని రకాల ఆహారాలూ తీసుకోవచ్చు. అంతేగానీ... ఫలానా చలవచేసే ఆహారాలే ఆస్తమాను తీసుకొస్తాయన్నది సరికాదు. ఎందుకంటే చలవగా భావించే చాలా పదార్థాలు ఆస్తమా ఉన్నవారికీ ఒకవేళ సరిపడితే... అవి రోగికి ఆస్తమాను ఎంతమాత్రమూ ప్రేరేపించలేవు. స్వీయ ప్రయత్నం మీద తమకు ఏ పదార్థం సరిపడటం లేదో రోగి గుర్తించి, దానికి మాత్రమే దూరంగా ఉంటే చాలు. ఈసీజన్లో నా ఆయాసానికి కారణం ఆస్తమాయేనా? నా వయసు 69 ఏళ్లు. గతంలో ఆస్తమా ఉంది. కానీ వేసవిలో ఎప్పుడూ వచ్చేది కాదు. అయితే ఇటీవల ఇంత వేసవి తీవ్రతలోనూ బాగా ఆయాసపడ్డాను. ఇది నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. నేను కాస్త లావుగానే ఉంటాను. నా స్థూలకాయం వల్లనే ఇలా జరిగిందా? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. – ఎమ్. సుదర్శన్రావు, భీమవరం స్థూలకాయం నేరుగా ఆçస్తమాను కలగజేయదు. కానీ ఒక్కోసారి స్థూలకాయం వల్ల వచ్చిన ఒళ్లు కారణంగా మనిషి ఆయాసపడుతున్నట్లు కనిపించడం సాధారణం. ఇందువల్ల స్థూలకాయం ఆస్తమాను ప్రేరేపిస్తుందనే అపోహ కొందరిలో ఉంటుంది. అయితే పూర్తిగా ఇది వాస్తవం కాకపోయినా... స్థూలకాయం ఉండటం వల్ల శరీరంలోని జీవప్రక్రియల్లో జరిగే ఆక్సిడేషన్ స్ట్రెస్, ప్రాంతంలోని గాలిగొట్టాలు సన్నబారడం, స్థూలకాయం కారణంగా స్లీప్ఆప్నియా (గురక) వచ్చి ఊపిరి అందకపోవడం వంటి పరోక్ష కారణాల వల్ల కూడా ఒక్కోసారి ఆయాసం రావచ్చు. మీ వయసు వారిలో ఇటీవల ఆస్తమా కేసులు పెరుగుతున్నాయి. దాంతో పాటు ఆ వయసులో ఆస్తమా రావడం వల్ల శారీరకంగా తట్టుకోలేని పరిస్థితులు ఏర్పడి అవి ఒక్కోసారి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీయవచ్చు. వృద్ధాప్యంలో వచ్చిన శారీరక మార్పుల వల్ల మన రోగనిరోధకశక్తి స్పందించే తీరు మారుతుంది. ఈ మార్పు కారణంగా ఏవైనా యాంటిజెన్స్కు (సరిపడని పదార్థాల కారణంగా శరీరంలో ఉత్పత్తి అయ్యే ద్రవాలు లేదా పదార్థాలు), ఇరిటెంట్స్ (శరీరాన్ని చికాకు పరిచే జీవపదార్థాల)కూ శరీరం అతిగా స్పందించడం వల్ల కూడా ఆస్తమా రావచ్చు. మీరు ఒకసారి వైద్యనిపుణులను కలిసి ఏ కారణం వల్ల ఆయాసం వచ్చిందో పరీక్షించుకోండి. వైద్యపరీక్షల్లో వచ్చిన ఫలితాలను బట్టి డాక్టర్లు మీకు చికిత్స సూచిస్తారు. డాక్టర్ ఎ. జయచంద్ర సీనియర్ ఇంటర్వెన్షనల్, పల్మునాలజిస్ట్, సెంచరీ హాస్పిటల్స్, రోడ్ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్ -
కిడ్నీ వ్యాధిగ్రస్తులకు భరోసా
ఎంజీఎం : వరంగల్ మహాత్మా గాంధీ మెమోరియల్ ఆస్పత్రిలో పేద రోగులను సేవలను మెరుగు పర్చేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే సర్జరీ విభాగంలో మరో 30 పడకల సేవలను అందుబాటులోకి తెస్తున్నారు. అంతేకాకుండా నేషనల్ అకిడేషన్ బోర్డు ఫర్ సర్టిఫికేషన్ లక్ష్యంగా ముందుకెళ్తూ.. రూ.15 లక్షలతో కొనుగోలు చేసిన మెకానైజ్జ్ లాండ్రి పరికరాన్ని సైతం అందుబాటులోకి తెస్తున్నారు. ఈ 6న వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఎంజీఎం సూపరింటెండెంట్ దొడ్డ రమేశ్ తెలిపారు. గతంలో బీబ్రా కంపెనీతో కుదిరిన పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ పద్ధతిన కొనసాగతున్న 14 డయాలసిస్ యూనిట్ ఒప్పందన ముగిసినా.. క్రమంలో మరో 14 యూనిట్ల డీ మేడ్ కంపెనీ పీపీపీ పద్ధతిన ఒప్పందం నూతన సేవలను అందుబాటులోకి తేనున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో ఎంజీఎం ఆస్పత్రిలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సేవలు మెరగపడనున్నట్లు ఆయన తెలిపారు. ‘ఆరోగ్యశ్రీ’ లేకున్నా సేవలు.. గతంలో ఎంజీఎంతో పాటు ప్రైవేట్ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ కార్డు ఉంటేనే డయాలసిస్ సేవలు ఉచితంగా చేసేవారు. 6వ తేదీ నుంచి అందుబాటులోని రానున్న నూతన డయాలసిస్ యూనిట్లతో ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా.. లేకున్నా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ సేవలను అందుబాటులోకి తేనున్నట్లు సూపరిండెంట్ రమేశ్ పేర్కొన్నారు. గతంలో బీ బ్రాన్ యూనిట్తో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం మేరకు ఆరోగ్యశ్రీ రోగులకు మాత్రమే డయాలసిస్ సేవలు అందేవి, అయితే ఆ కంపెనీతో గత ఏడాదిలోనే ఒప్పందం ముగిసిన నేపథ్యంలో డయాలసిస్ను ఎంజీఎం ఆస్పత్రి వైద్యాధికారులే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా 14 యూనిట్ల డీ మేడ్ కంపెతో ఒప్పందం కుదుర్చుకోగా ఈ యూనిట్లలో ఆరోగ్యశ్రీ సేవలందిస్తూ, ఎంజీఎంలో కొనసాగతున్న డయాలసిస్ యూనిట్లతో పేద రోగులకు సేవలందించనున్నట్లు సూపరిండెంట్ తెలిపారు. ఎన్ఏబీహెచ్లో మొదటి అడుగు... ఎంజీఎం ఆస్పత్రికి నేషనల్ అకిడేషన్ బోర్డు సర్టిఫికేషన్ లక్ష్యంగా వైద్యాధికారులు కృషి చేస్తూ ముందుకు సాగుతున్నారు. రూ.15 లక్షలతో కొనుగోలు చేసిన నూతన మెకానైజ్డ్ లాండ్రి పరికరాన్ని 6న ప్రారంభించనున్నారు. 60 కేజీల ఈ పరికరం 250 పడకల బెడ్ షీట్లను శుభ్రం చేసేందుకు ఉపయోగపడుతుంది. అతి త్వరలోనే మరో 60 కేజీల లాండ్రి పరికరాన్ని సైతం అందుబాటులోకి తేనున్నారు. సర్జరీలో విభాగంలో... ఎంజీఎం సర్జరీ విభాగంలో ఏడో యూనిట్ నూతన భవనం ద్వారా మరో 30 పడకల నూతన సేవలు అందుబాటులోకి రానున్నట్లు సూపరింటెండెంట్ రమేశ్ తెలిపారు. వైద్య నిబంధనల ప్రకారం ఈ భవనంలో అందుబాటులోకి రావడం పేద ప్రజలకు సేవలు మెరుగపడనున్నట్లు పేర్కొన్నారు. 6న ప్రారంభోత్సవం ఎంజీఎం ఆస్పత్రిలో డయాలసిస్ యూనిట్తో పాటు ఆస్పత్రిలోని నూతన భవనాలను 6న వైదారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చేతుల మీదుగా ప్రారంభించనున్నాం. ఈ వేడుకలకు జిల్లాలోని వివిధ ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. – దొడ్డ రమేష్, ఎంజీఎం సూపరింటెండెంట్ -
కలిపి చుడితే కలదు సుఖం
హై హీల్స్ నడకకు అందాన్నిస్తాయి. కొంచెం నొప్పిగా కూడా అనిపిస్తాయి. ఈ నొప్పి.. హీల్స్ సరిపడకపోవడం వల్ల కాదు. పాదాల్లోని నరాలపై పడే ఒత్తిడి వల్ల! ఇది తెలిసిన విషయమే. తెలుసుకోవలసిన విషయం ఏంటంటే.. చిన్న టెక్నిక్తో నొప్పిని తప్పించుకుని హై హీల్స్తో ఈ భూమిని ఏలేందుకు అమ్మాయిలు సిద్ధం కావచ్చని! ఈ గొడవంతా ఎందుకు? చక్కగా చెప్పల్స్ లేదా స్లిప్పర్స్ వేసుకుంటే సుఖం కదా అనుకోవచ్చు. సుఖమే.. కానీ హై హీల్స్ హైïß ల్సే! ఒక్కసారి వేసుకుని చూడండి. ‘చూడండి’.. అంటే మిమ్మల్ని మీరు చూసుకొమ్మని కాదు. హై హీల్స్ వేసుకుని మీరు నడుస్తున్నప్పుడు మిమ్మల్ని చూసేవాళ్లను చూడండీ అని. ఎంత ఆరాధన ఆ కళ్లల్లో! ఉండదా మరి? మీరేం తక్కువగా కనిపిస్తారా! ఏ దేశపు యువరాణిగారో మీలోకి ప్రవేశిస్తారు. తన హొయలును మీ కదలికల్లో అనువణువునా ఒలికిస్తారు. కానీ హై హీల్స్తో ఆ కాసేపు మీరు పడే బాధ మీకు మాత్రమే తెలుస్తుంది. పాదాలు నొప్పెడతాయి. కొంతమందికైతే నడుము నొప్పి కూడా వస్తుంది. రోజూ హై హీల్స్ వేసుకునేవారికైతే పర్వాలేదు కానీ, కొత్తల్లో కాస్త ఇబ్బందే. ఆ ఇబ్బందిని ఈ స్మాల్ టిప్పుతో భలేగా తప్పించుకోవచ్చు. ఎలాగంటే... చిన్న టేప్ తీసుకోండి. అడ్హెసివ్ టేప్, స్కాచ్ టేప్, న్యూడ్ కలర్ మెడికల్ టేప్.. ఏదైనా సరే. అవన్నీ లైట్గా, ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. అతికించడానికి, అతికించాక తొలగించడానికీ అవి తేలిగ్గా ఉంటాయి. ఆ టేప్తో బొటన వేళ్ల పక్కన ఉండే రెండు వేళ్లను కలిపి గట్టిగా చుట్టేయండి. (ఫొటోలో చూపిన విధంగా). తర్వాత మెల్లిగా మీ పాదాలను హై హీల్స్లోకి దూర్చేయండి. ఆ తర్వాత నడవండి. వెంటనే మీకు ఆశించినంత సౌఖ్యం కలగకపోవచ్చు. నమ్మండి. కొద్దిరోజుల్లోనే మీ హై హీల్స్ మీకు మంచి ఫ్రెండ్స్ అవుతాయి. ఏమిటీ మాయ? మాయ కాదు, మంత్రం కాదు. బొటనవేలి తర్వాతి రెండు, మూడు వేళ్ల మధ్య ఒక నరం ఉంటుంది. హై హీల్స్ వల్ల ఆ నరం నొక్కుకుపోయి, నొప్పికలుగుతుంది. ఆ నొప్పి ఎక్కువైతే నడుము వరకు పాకుతుంది. అలా కాకుండా ఉండేందుకే రెండు వేళ్లకూ కలిపి టేపు చుట్టేయడం! ఇలా చుట్టడం వల్ల ఆ నరం మీద ఒత్తిడి తగ్గి హై హీల్స్ వేసుకుని నడుస్తున్నప్పుడు నొప్పి అనిపించదు. అయితే హై హీల్స్ వల్ల భవిష్యత్తులో రాగల అవకాశం ఉన్న ఆరోగ్య సమస్యలకు మాత్రం ఈ టేపు టిప్పు ఔషధంలా పనిచేయదు. ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. అప్పటికప్పుడు అనుకోకుండా పార్టీకి రెడీ అయినప్పుడు సరదాగా కొద్దిసేపు హై హీల్స్తో నొప్పి లేకుండా నడిచేందుకు టేప్ చుట్టుకుని వెళ్లొచ్చు. -
డీఈడీ అభ్యర్థులకు ఊరట
సాక్షి, హైదరాబాద్: డిగ్రీలో కనీస అర్హత మార్కులు లేవన్న కారణంతో ఉపాధ్యాయ నియామకపు పరీక్ష(టీఆర్టీ)కు అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలు చేసిన పలువురు డీఈడీ అభ్యర్థులకు ఊరట లభించింది. వారి పిటిషన్లపై ఉమ్మడి హైకోర్టు సానుకూలంగా స్పందించింది. డిగ్రీలో 45 శాతం మార్కులు సాధించిన ఓసీ, 40 శాతం మార్కులు సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగ వర్గాలకు చెందిన డీఈడీ అభ్యర్థుల దరఖాస్తులను స్వీకరించి, టీఆర్టీ పరీక్షకు అనుమతించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్తో కూడిన ధర్మాసనం ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. డీఈడీ చేసిన అభ్యర్థుల్లో ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు డిగ్రీలో 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగ అభ్యర్థులు 45 శాతం మార్కులు సాధించి ఉంటేనే టీచర్ పోస్టులకు అర్హులని అధికారులు నోటిఫికేషన్లలో పేర్కొన్నారు. అయితే, టీఆర్టీకి దరఖాస్తు చేసుకున్న పలువురి దరఖాస్తులను, డిగ్రీలో కనీస మార్కులు లేవన్న కారణంతో అధికారులు తిరస్కరించారు. దీనిపై వారు హైకోర్టును ఆశ్రయించగా ఊరట లభించింది. -
ఆదర్శ్ స్కాం.. మాజీ సీఎంకు భారీ ఊరట
సాక్షి, ముంబై : ఆదర్శ్ కుంభకోణంలో మాజీ ముఖ్యమత్రి అశోక్ చవన్కు భారీ ఊరట లభించింది. ఆయన్ని ప్రాసెక్యూట్ చేయాలన్న రద్దు చేస్తూ బాంబే హైకోర్టు తీర్పు వెలువరించింది. దర్యాప్తులో సీబీఐ సాక్ష్యాలు సమర్పించకపోవటంతో ఆయన్ని తిరిగి విచారించేందుకు అనుమతి ఇస్తూ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ చవన్ హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు శుక్రవారం ఆ ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మాజీ సీఎం తరహా వ్యక్తులను విచారణ చేపట్టాలంటే అందుకు సంబంధించి ఉత్తర్వులు ప్రత్యేకంగా జారీ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్తో చర్చించాకే గవర్నర్ ఈ ఉత్తర్వులను వెలువరించారు. అయినా న్యాయస్థానం మాత్రం అందుకు అంగీకరించకపోవటం విశేషం. కాగా, 2010లో ఆదర్శ్ హౌజింగ్ సోసైటీ స్కాం వెలుగులోకి రాగా.. చవన్ రాజీనామా చేసి ఆ స్థానంలో పృథ్వీరాజ్ సీఎంగా పగ్గాలు చేపట్టాడు. ఆపై జరిగిన ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన విషయం విదితమే. -
కండోమ్ యాడ్లపై ఆంక్షలు.. స్వల్ప ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : అశ్లీలతను ప్రేరేపించేలా ఉన్నందున కండోమ్ యాడ్లపై కేంద్ర సమాచార & ప్రసార శాఖ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే దానికి సడలింపు ఇస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అశ్లీలత రహిత, మహిళలను కించపరిచే విధంగా లేని యాడ్లను ఏ సమయంలోనైనా ప్రదర్శించుకోవచ్చంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. రాజస్థాన్ హైకోర్టు జారీ చేసిన నోటీసులకు స్పందించిన కేంద్రం ఈ మేరకు సడలింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. పిల్లలపై సదరు యాడ్లు తీవ్ర ప్రభావం చూపుతున్నాయంటూ కొందరు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సాంకేతిక ప్రచార శాఖ ఆదేశాలనుసారం డిసెంబర్ 11 నుంచి నిబంధనను అమలులోకి తీసుకురాగా.. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటలలోపే యాడ్లను బుల్లితెరపై ప్రదర్శించాలని అందులో ఆదేశించింది. -
ఆర్కాంకు భారీ ఉపశమనం
సాక్షి,ముంబై: అప్పుల ఊబిలో చిక్కుకోవడం, టవర్ బిజినెస్ విక్రయం తదితర పరిణామాలతో ఇటీవల భారీగా పతనమైన రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్కామ్) గత రెండు రోజులుగా లాభాలను నమోదు చేస్తోంది. అనిల్ అంబానీ నేతృత్వంలోని ఆర్కాంకు రుణ ఉపశమనం లభించనుండటంతో ఇన్వెస్టర్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. మంగళవారం దాదాపు 12శాతానికిపైగా లాభపడిన ఆర్ కాం కౌంటర్ నేడు 5శాతం లాభాలతో కొనసాగుతోంది. ఢిల్లీ, చెన్నైలలో ఆర్కామ్కు గల ఆస్తుల విక్రయానికి రుణదాతలు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కెనడాకు చెందిన బ్రూక్ఫీల్డ్ కంపెనీ ఈ రియల్ ఎస్టేట్ ఆస్తులను విక్రయించేందుకు అనిమితినిచ్చిందని రిపోర్టులు వెలువెడ్డాయి. దీంతో రూ. 801 కోట్లవరకూ సమకూర్చుకోనుంది. ఈ నిధులను రుణాల చెల్లింపునకు వినియోగించనున్నట్లు అంచనా. దీంతో ఇప్పటికే భారీ రుణాలు, నష్టాలతో కుదేలైన అనిల్ అంబానీ గ్రూప్ టెలికం సంస్థ ఆర్కామ్కు ఇది కొంతమేర రిలీఫ్నిచ్చే వీలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. -
అనారోగ్యం... అశాంతి!?
కొందరి ఇళ్లలో ఏదో తెలియని అశాంతి నెలకొని ఉంటుంది. అలాంటి ఇళ్లలోని చిన్నారులు తరచు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. నిష్కారణంగా భయపడుతూఉంటారు. ఇంట్లోని పెద్దలకు మనశ్శాంతి లోపిస్తుంది. ఏదో తెలియని చింతతో లోలోపలే కుమిలిపోతూ ఉంటారు. దృష్టిదోషాల వల్ల, పితృదోషాల వల్ల ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయి. వీటికి కొన్ని పరిహారాలు... సోమవారం రుద్రాభిషేకం జరిపించి, పాశుపత మంత్రంతో అభిమంత్రించిన దశముఖ రుద్రాక్షను మెడలో ధరించాలి. దీనివల్ల దోషాలు తొలగిపోతాయి.సాయంత్రం చీకటి పడిన తర్వాత మట్టిమూకుడులో ఆవుపేడతో చేసిన పిడకలకు నిప్పుపెట్టి, వాటిపై ఎండిన వేపాకులను వేసి మండించాలి. ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత నిత్యపూజకు ఉపక్రమించే ముందు గోరోచనం, కుంకుమపువ్వు, పసుపు నూరి ముద్దగా చేసి తిలకంగా ధరించండి. పిల్లలకు కూడా పెట్టండి. చిన్నారులు ఊరకే భయపడుతున్నట్లయితే, వారికి సాయంత్రం వేళ ఒక నిమ్మకాయతో ఏడుసార్లు దిష్టి తీయాలి. ఆ నిమ్మకాయను నాలుగు ముక్కలుగా తరిగి, నాలుగు రోడ్ల కూడలి వద్ద వాటిని నాలుగు దిక్కులకు విసిరి పారేయాలి. పేద అమ్మాయిల పెళ్లికి శక్తివంచన లేకుండా ఆర్థిక సాయం చేయండి. వీలుంటే స్వయంగా కన్యాదాన కార్యక్రమాన్ని నిర్వహించండి. దీనివల్ల పితృదోషాలు తొలగుతాయి. – పన్యాల జగన్నాథ దాసు -
బదిలీ పరీక్ష
రిలీవర్ రాక అవస్థలు బదిలీ అయినప్పటికీ మారని స్థానం జిల్లా సరిహద్దు మండలాల్లో వింత పరిస్థితి 280 మంది ఉపాధ్యాయుల నిరీక్షణ ఏళ్ల తరబడి మగ్గినా లభించిన మోక్షం అడ్డంకిగా మారిన జీఓ 30 అనంతపురం ఎడ్యుకేషన్: కనీస రవాణా సౌకర్యం లేని సరిహద్దు మండలాల్లోని పాఠశాలల్లో కొన్నేళ్లుగా మగ్గుతున్న ఉపాధ్యాయులు ఇప్పటికీ చుక్కలు చూడాల్సి వస్తోంది. కుటుంబాలకు దూరంగా పడరాని పాట్లు పడుతున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులైతే ఇక వారి పరిస్థితి వర్ణనాతీతం. ఈ పరిస్థితుల్లో ఎట్టకేలకు బదిలీ సాధించినా.. నిబంధనల అడ్డంకితో ఆ సంబరం కాస్తా ఆవిరవుతోంది. ఇన్నేళ్ల కష్టానికి ఫలితం దక్కిందనుకునే సమయంలో ఆశలు అడియాశలవుతున్నాయి. రిలీవర్ రాని కారణంగా పాత స్కూళ్లలోనే నిరీక్షించాల్సి వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే జిల్లాలో తొలుత కౌన్సెలింగ్ పూర్తి కావడంతో బాధిత టీచర్లు ఒక్కొక్కరుగా ముందుకొచ్చి తమ సమస్యను ఏకరువు పెడుతున్నారు. ఉన్నత పాఠశాలల్లోనే సమస్య తప్పనిసరి బదిలీ అయినా స్కూల్లో కనీసం 50 శాతం మంది ఉంటేనే రిలీవ్ చేయాలంటూ ప్రభుత్వం 30 జీఓ జారీ చేసింది. ఈ ప్రకారం ముగ్గురు పని చేస్తుండే చోట ఒకరిని మాత్రం రిలీవ్ చేయొచ్చు. ప్రాథమిక పాఠశాలల్లో ఇది పెద్ద సమస్య కాకపోయినా.. ఉన్నత పాఠశాలల్లో కష్టతరమవుతోంది. చాలా స్కూళ్లలో ఒకే పోస్టు ఉంది. అలాంటి చోట పని చేస్తూ బదిలీ అయిన వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వారికి రిలీవర్ వస్తే తప్పే అక్కడి నుంచి పంపే పరిస్థితి లేదు. ఈ సమస్య ప్రధానంగా మడకశిర, గుడిబండ, రొళ్ల, అగళి, అమరాపురం, శెట్టూరు, బ్రహ్మసముద్రం, డీ.హీరేహాల్, బొమ్మనహాల్ మండలాల్లో ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో పలువురు టీచర్లు డీఈఓను కలిసి తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. మా చేతుల్లో ఏమీ లేదు 30 జీఓ ప్రకారం ఆయా స్కూళ్లలో కనీసం 50 శాతం మంది ఉపాధ్యాయులు ఉండాలి. రిలీవ్ చేసేసి అక్కడ టీచరు లేకుండా అయితే అందుకు హెచ్ఎంలదే బాధ్యత. రిలీవర్లు వచ్చిన తర్వాత బదిలీ అయిన వారిని రిలీవ్ చేయాలి. జిల్లా సరిహద్దు మండలాల టీచర్లు ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసు. మా చేతుల్లో ఏమీ లేదు. నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే. – లక్ష్మీనారాయణ, డీఈఓ -
ఇన్ఫోసిస్కు భారీ ఊరట
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో అనేక సమస్యలు, విమర్శలతో చిక్కుల్లో పడిన దేశీయ రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్కు భారీ ఊరట లభించింది. అమెరికా ఆధారిత సంస్థ పనయ కొనుగోలు విషయంలో నెలకొన్న వివాదంలో ఇన్ఫోసిస్ అంతర్గత ఆడిట్ కమిటీ క్లీన్ ఇచ్చింది. పనయా ఒప్పందంలో అసంబద్ధతలపై ఆరోపణలకు మద్దతు ఇచ్చే ఆధారాలేవీ దర్యాప్తు సంస్థకు లభించలేదని ఇన్ఫోసిస్ పేర్కొంది. ఎలాంటి అక్రమాలు జరగలేదని తేలిందని ఇన్ఫీ శుక్రవారం ప్రకటించింది. కాగా 2015 ఫిబ్రవరి లో, ఇన్ఫోసిస్ ఇజ్రాయిల్ ఆటోమేషన్ టెక్నాలజీ సంస్థను 200 మిలియన్ డాలర్లు లేదా రూ .1,250 కోట్లు నగదుకు కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించింది. దీంతో వాస్తవ విలువ కంటే 25 శాతం అదనంగా ఈ కంపెనీని కొనుగోలు చేశారంటూ సెబీకి అజ్ఞాత మెయిల్ ద్వారా ఫిర్యాదులు అందాయి. అయితే పనయ కంపెనీ కొనుగోలుపై ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోలేదని ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ విశాల్ సిక్కా వివరణ ఇచ్చారు. అనంతరం గిబ్సన్ డన్ అండ్ కంట్రోల్ రిస్క్స్ ద్వారా అంతర్గత దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే. -
తింటే తాటిముంజలే తినాలి
-
జగతి పబ్లికేషన్స్కు హైకోర్టు ఊరట
ఈ నెల 17 వరకు అభియోగాల నమోదు వద్దంటూ సీబీఐ కోర్టుకు ఆదేశం సాక్షి, హైదరాబాద్: జగతి పబ్లికేషన్స్కు ఉమ్మడి హైకోర్టులో ఊరట లభించింది. జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసుల్లో ఈ నెల 17వ తేదీ దాకా ఎలాంటి అభియోగాల నమోదు ప్రక్రియా చేపట్టొద్దని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని హైకోర్టు ఆదేశించింది. న్యాయమూర్తి జస్టిస్ ఎం.సీతారామమూర్తి ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. సీబీఐ నమోదు చేసిన కేసుల్లో ఒకేసారి అభియోగాల నమోదు చేపట్టేందుకు నిరాకరిస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ జగతి పబ్లికేషన్స్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే. వీటిపై న్యాయమూర్తి గురువారం మరోసారి విచారణ జరిపారు. వేర్వేరుగా అభియోగాల నమోదు ప్రక్రియ చేట్టడం వల్ల తమకు కలిగే నష్టాన్ని జగతి పబ్లికేషన్స్ తరఫున సీనియర్ న్యాయవాదులు టి.నిరంజన్రెడ్డి, డి.వి.సీతారామ్మూర్తి ఈ సందర్భంగా న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. తరువాత సీబీఐ తరఫు న్యాయవాది పి.కేశవరావు వాదనలు వినిపిస్తూ ఈ వ్యాజ్యాలకు విచారణార్హత లేదన్నారు. ఈ వ్యాజ్యాలపై విచారణకు సమయం పడుతున్నందున వారం పాటు అభియోగాల నమోదు ప్రక్రియను నిలిపేస్తే అభ్యంతరమేమైనా ఉందా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. వారం పాటైతే అభ్యంతరం లేదని కేశవరావు పేర్కొనడంతో 17 వరకు అభియోగాల నమోదు ప్రక్రియ చేపట్టవద్దని ఆదేశించారు. విచారణను ఈ నెల 14కు వాయిదా వేశారు. వ్యాజ్యాలన్నింటినీ రెగ్యులర్ కోర్టు ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. -
నాట్కో, అలెంబిక్లకు లైన్ క్లియర్
పేటెంట్ ఔషధాలను ఎగుమతి చేయొచ్చు: ఢిల్లీ హైకోర్టు తీర్పు న్యూఢిల్లీ: ప్రముఖ ఔషధ కంపెనీలు నాట్కో, అలెంబిక్ కంపెనీలకు ఢిల్లీ హైకోర్టు ఊరట కల్పించింది. జర్మన్ ఔషధ కంపెనీ బేయర్స్కు చెందిన రెండు పేటెంట్ ఔషధాలను ఈ సంస్థలు తయారు చేసి క్లినికల్ పరీక్షల కోసం, విదేశీ నియంత్రణ సంస్థల ఆమోదం కోసం ఎగుమతి చేసేందుకు కోర్టు అనుమతిస్తూ హైకోర్టు బుధ వారం తీర్పు జారీ చేసింది. దేశీయ జనరిక్ ఔషధ తయారీ దారులు పేటెంట్ రక్షణలో ఉన్న ఔషధాలను నియంత్రణ సంస్థల ఆమోదం కోసం, క్లినికల్ పరీక్షల కోసం వాటిని తయారు చేసి, విక్రయించి, ఎగుమతి చేసే ప్రాథమిక హక్కును కలిగి ఉన్నాయని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఇందుకు పేటెంట్స్ చట్టంలోని సెక్షన్ 107ఏ వీలు కల్పిస్తోందని కోర్టు ఉదహరించింది. ఈ ప్రాథమిక హక్కుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(జి) రక్షణ కూడా కల్పిస్తోందని... చట్టం చెబితే తప్ప ఔషధ విక్రయాలను అడ్డుకోలేరని జస్టిస్ రాజీవ్ సహాయ్ ఎండ్లా స్పష్టం చేశారు. కాగా, ఔషధాలకున్న పేటెంట్ హక్కులను పరిగణనలోకి తీసుకోవాలని, సెక్షన్ 107ఏలో పేర్కొన్న మేరకు మినహా ఇతర అవసరాలకు పేటెంట్ రక్షణలో ఉన్న వాటిని ఎగుమతి చేయరాదని నాట్కో, అలెంబిక్ కంపెనీలను కోర్టు ఆదేశించింది. పేటెంట్ ఉల్లంఘన కాదు... బేయర్స్ కేన్సర్ ఔషధమైన సోరాఫెనిబ్ను నెక్సావర్ పేరుతో మార్కెట్ చేస్తోంది. దీనికి పేటెంట్ రక్షణ ఉంది. దీనికి జనరిక్ వెర్షన్ అయిన సోర్ఫెనట్ను నాట్కో ఎగుమతి చేసింది. అలాగే, బేయర్స్కు చెందిన రక్తాన్ని పలుచన చేసే రివరోక్సాబాన్ జనరిక్ రూపాన్ని అలెంబిక్ కంపెనీ ఎగుమతి చేసింది. దీంతో నాట్కో, అలెంబిక్ పేటెంట్ ఉల్లంఘనకు పాల్పడ్డాయని ఆరోపిస్తూ బేయర్స్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను కోర్టు కొట్టివేస్తూ 107 సెక్షన్ఏలో పేర్కొన్న అవసరాలకు పేటెంట్ ఔషధాలను ఎగుమతి చేయడం ఉల్లంఘనకు పాల్పడినట్టు కాదని, దీన్ని అడ్డకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా, పేటెంట్ ఔషధాన్ని నియంత్రణ సంస్థల అవసరాల కోసమంటూ ఎగుమతి చేసేం దుకు ఒక్కసారి అనుమతిస్తే, ఆ అవసరాలకే వాటిని వినియోగించేలా కోర్టు హామీ ఇవ్వలేదని బేయర్స్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీన్ని కూడా కోర్టు తిరస్కరించింది. -
పిల్లలకి వెట్టిచాకిరి నుంచి విముక్తి
-
పీఆర్కే రావుకు హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: చెక్కు బౌన్స్ వ్యవహారం లో అరకు పార్లమెంట్ సభ్యురాలు కొత్తపల్లి గీత భర్త, విశ్వేశ్వర ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ పరుచూరి రామకోటేశ్వరరావు (పీఆర్కె రావు)కు ఉమ్మడి హైకోర్టులో ఊరట లభించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) నుంచి రూ.25 కోట్ల రుణం తీసుకుని దాని చెల్లింపు నిమిత్తం ఇచ్చిన చెక్కు బౌన్స్ కావడంతో ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష, రూ.25.24 కోట్ల జరిమానా విధిస్తూ ఆర్థిక నేరాల ప్రత్యేక న్యాయస్థానం కమ్ 8వ అదనపు ఎంఎస్జే కోర్టు ఇచ్చిన తీర్పు అమలును హైకోర్టు నిలిపేసింది. రామకోటేశ్వరరావుకు బెయిల్ మంజూరు చేసింది. రూ.10వేల చొప్పున రెండు పూచీ కత్తులు సమర్పించాలని ఆయన్ని ఆదేశిం చింది. అంతేకాక జరిమానాగా విధించిన రూ.25.24 కోట్ల వసూలును కూడా నిలిపేసింది. అయితే ఆ మొత్తంలో 6వ వంతును కింది కోర్టులో డిపాజిట్ చేయాలని పీఆర్కే రావును ఆదేశించింది. ఒకవేళ ఆ మొత్తం చెల్లించకుంటే దానిని వారెంట్ జారీ చేసి రావు నుంచి చట్ట ప్రకారం వసూలు చేసుకోవాలని కింది కోర్టుకు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకర రావు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. చెక్కు బౌన్స్ కేసులో మేజిస్ట్రేట్ కోర్టు తీర్పును, ఆపై సెషన్స్కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పీఆర్కే రావు హైకోర్టులో రివిజన్ పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి ఇటీవల విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది నవీన్కుమార్ వాదనలు వినిపించారు. వీటితో ఏకీభవించిన హైకోర్టు, పీఆర్కె రావుకు కింది కోర్టు విధించిన జైలుశిక్ష, జరిమానా అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యాజ్యంపై తుది తీర్పు వెలువడేంత వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని న్యాయ మూర్తి తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. -
ఆరోగ్యం కోసం నడుం కట్టు..!
యోగా అర్ధ చంద్రాసన సమస్థితిలో నిలబడి కుడివైపునకు వంగి కుడి చేతిని ఫొటోలో చూపిన విధంగా కుర్చీ సీటు భాగంలో ఉంచాలి. కుడికాలుని స్ట్రయిట్గా భూమికి 90 డిగ్రీల కోణంలో ఉంచి, శ్వాస వదులుతూ ఎడమకాలుని పైకి తీసుకెళ్లి రెండో కుర్చీ బ్యాక్రెస్ట్ మీద భూమికి సమాంతరరేఖలో ఉంచాలి. శ్వాస తీసుకుంటూ ఎడమ చెవికి దగ్గరగా భుజాన్ని ఉంచుతూ ఎడమ కాలుకి సమాంతర రేఖలో ఎడమచేతిని కూడా స్ట్రెచ్ చేయాలి. 3 లేదా 5 శ్వాసల తర్వాత తిరిగి శ్వాస వదులుతూ, ఎడమ చేతిని పై నుంచి పక్కకి ఎడమ కాలుని కిందకు తీసుకువచ్చి సమస్థితిలోకి రావాలి. తిరిగి రెండోవైపున కూడా ఇదేలా చేయాలి. ఉపయోగాలు: లోయర్బ్యాక్ పెయిన్, వెన్నెముకలో ఉన్న అసమానతల్ని తొలగించడానికి, ఛాతీ, భుజాలు వ్యాకోచత్వంలో ఉండడానికి, చీలమండలు, మోకాలు, కాళ్లు బలోపేతం కావడానికి, బ్యాలెన్సింగ్కి ఉపకరిస్తుంది. జీర్ణవ్యవస్థకి పనికొ స్తుంది. యాంగ్జయిటీ, డిప్రెషన్, స్ట్రెస్ల నుంచి రిలీఫ్ను ఇస్తుంది. కటి చక్రాసన సమస్థితిలో నిలబడి కుర్చీని ఫొటోలో చూపిన విధంగా అమర్చాలి. కుర్చీ చేతి మీదుగా ఎడమ కాలుని తీసుకుని పాదాన్ని 90 డిగ్రీల్లో కుర్చీ సీటు మీద ఉంచాలి. ఎడమ మోచేతిని ఎడమ మోకాలి మీద సపోర్ట్గా ఉంచి శ్వాస తీసుకుంటూ కుడి అరచేతులు ఆకాశం వైపు చూపుతూ పక్క నుంచి పైకి తీసుకు వె ళ్లి కుడి భుజాన్ని కుడి చెవికి దగ్గరగా తీసుకుని పైకి సాగదీస్తూ కుడివైపు నడుం భాగాన లాగడాన్ని గమనిస్తూ వీలైనంత వరకూ ఎడమకి వంగాలి. 3 లేక 5 సాధారణ శ్వాసల తర్వాత కుడి అరచేతిని భూమి వైపు చూపిస్తూ కుడి మణికట్టుని లూజ్గా వదిలి, కుడి చేతిని పక్క నుంచి కిందకు తీసుకురావాలి. సమస్థితిలో నిలబడి రెండోవైపు కూడా అదే విధంగా చేయాలి. ఉపయోగాలు: కుడివైపు నడుం దగ్గర బాగా స్ట్రెచ్ కావడం వల్ల పక్క కండరాలకు మంచి టోనింగ్ జరుగుతుంది. ఎడిపోజ్ టిస్యూలో నడుం పక్కన కొవ్వు కరగడానికి ఉపకరిస్తుంది. కుడి, ఎడమ రెండు వైపులా చేయడం వల్ల స్పైన్ ఎలైన్మెంట్కి, షోల్డర్జామ్, స్పాండిలైటిస్ సంబంధిత సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. పరివృత్త కటి చక్రాసన వేరియంట్ 2 పైన చెప్పినట్టు గానే కుడిచేయి పైకి స్ట్రెచ్ చేసిన తర్వాత చేతిని వెనకకు తీసుకుని ఎడమచేతిని ఎడమ కాలు కింద నుంచి వెనకకు తీసుకెళ్లి (శరీరాన్ని ముందుకు వంచి చేసినట్లయితే వెనుక రెండు చేతుల్నీ సులభంగా ఇంటర్లాక్ చేయగలుగుతారు) చేతులు ఇంటర్లాక్ చేసిన తర్వాత ఛాతీని ముందుకూ, నడుమును పక్కలకీ స్ట్రెచ్ చేస్తూ పైకి చూసే ప్రయత్నం చేయాలి. 3 లేదా 5 శ్వాసల తర్వాత వెనుకకు, కటి చక్రాసనలోకి వచ్చి సమస్థితిలోకి రావాలి. తిరిగి రెండోవైపున కూడా ఇదే విధంగా చేయాలి. ఉపయోగాలు: పై ఆసనం వల్ల కలిగే అన్ని లాభాలతో పాటు నడుమును ట్విస్ట్ చేయడం వల్ల దిగువ వెన్నెముక భాగానికి, చేతులు రెండూ ఇంటర్లాక్ చేయడం వల్ల షోల్డర్ బ్లేడ్స్కి మంచి వ్యాయామం జరుగుతుంది. సమన్వయం సత్యబాబు -
హెల్త్టిప్స్
గ్యాస్ట్రైటిస్ సమస్యను తగ్గించడంలో కాకర జ్యూస్ బాగా పనిచేస్తుంది. అర్థపావు కప్పు కాకరకాయ జ్యూస్ను భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి. ఇలా రోజుకు రెండు పూటలు తీసుకుంటే సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంద {పతిరోజు పరగడుపున చిటికెడు జీలకర్ర పొడి తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. ఉదయం ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ తేనె, రెండు టీ స్పూన్ల నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల కొవ్వు కరగడమే కాకుండా గొంతులో జీర కూడా పోతుంది. ఒక గ్లాస్ నీటిలో కొన్ని తులసి ఆకులు, కొన్ని పుదీనా ఆకుల్ని వేసి మరిగించాలి. తరువాత ఆ నీటిని వడకట్టి తాగితే దగ్గు, జలుబు తగ్గుముఖం పడతాయి. -
ముంపు ప్రాంతాల బాధితులకు ఉపశమనం
-
వరద సహాయకచర్యల్లో ఎన్డీఆర్ఎఫ్
-
వరద సహాయకచర్యల్లో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్
హైదరాబాద్: భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న భాగ్యనగరంలో వరద సహాయక చర్యల కోసం ఆర్మీ రంగంలోకి దిగింది. మరి కొన్నిరోజులు వర్షాలు పడే అవకాశం ఉండటంతో వరద తగ్గే వరకూ సహకారం అందించాలని ప్రభుత్వం ఆర్మీకి విజ్ఞప్తి చేయడంతో.. నాలుగు ఆర్మీ బృందాలు బేగంపేట్, నిజాంపేట, హకింపేట, అల్వాల్ ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు చేపడుతున్నాయి. జీహెచ్ఎంసీ సమన్వయంతో ఆర్మీ సహాయకచర్యలు చేపడుతోంది. ఆర్మీతో సమన్వయం చేసుకునేందుకు జీహెచ్ఎంసీ తరఫున ముగ్గురు అధికారులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆర్మీ సిబ్బంది ఇప్పటికే ఆల్వాల్లో పర్యటించి అక్కడి వరద ప్రభావిత ప్రాంతంలో అందించడానికి మెడికల్ కిట్లతో పాటు ఇతర సామాగ్రిని సిద్ధం చేసింది. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సైతం రాష్ట్రంలో సహాయకార్యక్రమాలు చేపడుతున్నాయి. ప్రస్తుతం నాలుగు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయని.. మరో రెండు బృందాలు పుణె నుంచి వస్తున్నాయని ఉన్నతాధికారులు మధుసూధన్రెడ్డి, సెల్వం వెల్లడించారు. శనివారం హైదరాబాద్లో రెవెన్యూ శాఖ కార్యదర్శి కె. ప్రదీప్ చంద్రను వారు కలిశారు. అనంతరం వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఎన్డీఆర్ఎఫ్ అధికారులు మధుసూదన్రెడ్డి, సెల్వం మాట్లాడుతూ... ఓ బృందాన్ని మెదక్ జిల్లాకు, మరో బృందాన్ని నిజామాబాద్ పంపిస్తున్నట్లు తెలిపారు. మరో రెండు బృందాలు హైదరాబాద్లో పని చేస్తాయని వారు చెప్పారు. -
వరద సహాయకచర్యల్లో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్
-
హమ్మయ్య... వానలొచ్చాయి
మచిలీపట్నం : ముఖం చాటేసిన వరుణులు ఎట్టకేలకు కరుణించాడు. వేసవిని తలపించిన ఎండలు, సెగల నుంచి ఉపశమనం లభించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రెండురోజులుగా జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అల్పపీడనం ప్రభావంతో మరో రెండురోజుల పాటు జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. భారీ వర్షం కురవటంతో మచిలీపట్నం, పెడన, కృత్తివెన్ను, బంటుమిల్లి తదితర ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. శనివారం ఉదయం 8గంటల వరకు జిల్లాలో సగటు వర్షపాతం 9.7 మిల్లీమీటర్లుగా నమోదైంది. కోడూరులో అత్యధికంగా 54.6 మిల్లీమీటర్లు, కంకిపాడులో అత్యల్పంగా 1.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాలువలకు నీరు సక్రమంగా రాని నేప«థ్యంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు వ్యవసాయ పనులకు ఎంతగానో ఉపయోగపడతాయని రైతులు చెబుతున్నారు. వర్షాలతో వరినాట్లు కొంతమేర ఊపందుకున్నాయి. పశ్చిమకృష్ణాలో సాగు చేసిన పత్తికి ఈ వర్షాలు మేలు చేస్తాయని రైతులు చెబుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. జిల్లాలో వర్షపాతం వివరాలు జగ్గయ్యపేట 42.4 మిల్లీమీటర్లు, వత్సవాయి 7.6, పెనుగంచిప్రోలు 12.0, నందిగామ 15.4, చందర్లపాడు 45.6, కంచికచర్ల 10.4, వీరులపాడు 6.6, ఇబ్రహీంపట్నం 1.2, ఎ.కొండూరు 8.8, గంపలగూడెం 17.8, తిరువూరు 6.2, విస్సన్నపేట 13.4, విజయవాడ రూరల్, అర్బన్ 23.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెనమలూరు 7.5 మిల్లీమీటర్లు, తోట్లవల్లూరు 5.0, నూజివీడు 1.2, ఉయ్యూరు 3.2, మొవ్వ 1.2, చల్లపల్లి 3.6, మోపిదేవి 3.2, అవనిగడ్డ 11.2, నాగాయలంక 16.4, గూడూరు 15.2, పామర్రు 10.0, గుడ్లవల్లేరు 5.6, పెడన 4.8, బంటుమిల్లి 51.2, ముదినేపల్లి 8.2, కైకలూరు, కలిదిండి 3.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
బదిలీలకు సై
రెండేళ్లుగా ఎదురు చూస్తున్న వారికి ఊరట సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ లపై సర్కారు నిషేధం ఎత్తివేసింది. గత రెండేళ్లుగా ఎప్పుడెప్పుడు బదిలీలు జరుగుతాయా అని ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వ నిర్ణయం ఊరటనిచ్చింది. ఉద్యోగుల పంపకంలో భాగంగా కమలనాథన్ కమి టీ చేస్తున్న కసరత్తుకు ఇబ్బంది కలగకుండా జూన్ 2, 2014 నుంచి బదిలీలు నిర్వహించలేదు. తాజాగా ఉద్యోగుల పంపకం పూర్తికావడంతో రాష్ట్ర ప్రభుత్వం బదిలీల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈమేరకు మంగళవారం బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక, జిల్లా, జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగులందరికీ బదిలీ అవకాశాన్ని కల్పించింది. అయితే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను మాత్రం ఇంకా విడుదల చేయలేదు. ప్రత్యేక బదిలీలకు బ్రేక్.. రెండేళ్లుగా ప్రభుత్వం బదిలీల ప్రక్రియ చేపట్టలేదు. ఈక్రమంలో సుదీర్ఘకాలంగా ఓకే చోట పనిచేస్తున్న ఉద్యోగులకు ఈప్రక్రియ కొంత ఇబ్బంది కలిగించింది. ఈక్రమంలో కొందరు పైస్థాయిలో ప్రయత్నాలు చేసి ప్రత్యేక కేటగిరీలో బదిలీ ఉత్తర్వులు తెచ్చుకున్నారు. కొందరైతే కోరిన చోటుకు బదిలీ చేయించుకున్నారు. ఇలాంటి బదిలీలు పదుల సంఖ్యలో జరిగాయి. మరికొన్నిచోట్ల పరిపాలన విభాగం కింద ఉన్నతాధికారులు అత్యుత్సాహంతో బదిలీలు చేశారు. తాజాగా ఇలాంటి బదిలీలకు బ్రేక్ పడింది. ఉద్యోగులందరికీ నిర్దిష్ట గడువును విధిస్తూ బదిలీలకు అవకాశం కల్పించింది. ఒకట్రెండు రోజుల్లో మార్గదర్శకాలు వచ్చిన వెంటనే ఆయా శాఖాధిపతులు బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. -
బ్యాంకులకు ఆర్బీఐ ఊరట!
♦ మొండిబకాయిలపై ప్రొవిజనింగ్ నిబంధనలు సడలింపు ♦ డిఫాల్ట్ రిస్కు కంపెనీల జాబితా కుదింపు... ♦ తొలగించిన జాబితాలో జేపీ అసోసియేట్స్ సహా 24 సంస్థలు ♦ ఈ చర్యలతో బ్యాంకు షేర్ల దూకుడు ముంబై: మొండిబకాయిల(ఎన్పీఏ) సమస్యతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న దేశీ బ్యాంకింగ్ రంగానికి రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) కాస్త ఉపశమనం కలిగించింది. డిఫాల్ట్ రిస్కులున్న కంపెనీల రుణ బకాయిలకు కూడా కేటాయింపులు(ప్రొవిజనింగ్) జరపాల్సిందిగా గతంలో ఇచ్చిన ఆదేశాలకు కాస్త వెసులుబాటు ఇచ్చింది. డిసెంబర్లో పేర్కొన్న 150 ఇటువంటి కంపెనీల జాబితా నుంచి ఇప్పుడు సుమారు 24 కంపెనీలను తొలగిస్తున్నట్లు ఆర్బీఐ బ్యాంకులకు సమాచారం అందించింది. బుధవారం పొద్దుపోయాక ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దీంతో జనవరి-మార్చి త్రైమాసికం(2015-16, క్యూ4)లో ఆయా కంపెనీలకు (జాబితా నుంచి తొలగించిన కంపెనీలు) చెందిన రుణ బకాయిలపై బ్యాంకులు ప్రొవిజనింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా బ్యాంకుల క్యూ4 ఫలితాల్లో లాభదాయకత పెరిగేందుకు అవకాశం ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా కార్పొరేట్లకు అత్యధికంగా రుణాలిచ్చిన ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్బీ)ల క్యూ4 ఫలితాలు అంచనాలను మించవచ్చనేది వారి అభిప్రాయం. డిఫాల్ట్ రిస్కులున్న కంపెనీల జాబితా నుంచి ఆర్బీఐ తొలగించిన సంస్థల్లో జైప్రకాశ్ అసోసియేట్స్, కోస్టల్ ఎనర్జెన్ వంటివి ఉన్నాయి. జాబితాలోని కొన్ని కంపెనీలు తమ రుణ భారాన్ని తగ్గించుకోవడం కోసం చేపట్టిన కొన్ని చర్యల(ఆస్తుల విక్రయం ఇతరత్రా) కారణంగానే ఆర్బీఐ తాజా నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు. కొన్ని కంపెనీలను జాబితా నుంచి తొలగించిన ఆర్బీఐ కొత్తగా ఏ కంపెనీని కూడా ఇందులో చేర్చలేదని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక బ్యాంకర్ వెల్లడించారు. ‘తాజా ఆదేశాల్లో కంపెనీలకు ఇచ్చిన రుణాలను ఆర్బీఐ రెండు విభాగాలుగా చేసిందని, ఒకటి స్టాండర్డ్ ఖాతాలుగా తిరిగి మార్చవలసిన కంపెనీలు.. మిగతావి మార్చి కార్టర్లోనూ కేటాయింపులు జరపాల్సినవి’ అని బ్యాంకర్ చెప్పారు. గతేడాది ఆదేశాలు ఇవి... కార్పొరేట్ల మొండిబకాయిలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో ఎన్పీఏ రిస్కులు ఉన్న 150 కంపెనీల జాబితాను ఆర్బీఐ అసెట్ క్వాలిటీ రివ్యూ(ఏక్యూఆర్)లో ప్రకటించింది. వాటి రుణ బకాయిలకు కూడా ప్రొవిజనింగ్ చేయాలని బ్యాంకులను ఆదేశించింది. వాటిలో ఎస్సార్ గ్రూప్, భూషణ్ స్టీల్ తదితర సంస్థలు ఉన్నాయి. దీంతో డిసెంబర్ క్వార్టర్లో తప్పనిసరిగా వాటి లాభనష్టాల ఖాతాలో భారీ కేటాయింపులు చేయాల్సి రావడంతో పలు పీఎస్బీలు నష్టాలను ప్రకటించాల్సి వచ్చింది. ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.1,505 కోట్లు, ఐడీబీఐ బ్యాంక్ రూ.2,183 కోట్లు, ఐఓబీ రూ.1,425 కోట్ల చొప్పున నష్టాలను చవిచూశాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా పూర్తిగా డిసెంబర్ క్వార్టర్లోనే వీటికి కేటాయింపులు చేయడంతో రూ. 3,342 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. కొన్ని బ్యాంకులు మార్చి క్వార్టర్లోనూ కేటాయింపులు చేయనున్నాయి. మొత్తం మీద రూ.70,000 కోట్లకు పైగానే ఈ ప్రొవిజనింగ్ ఉండొచ్చని అంచనా. అయితే, ఆర్బీఐ ఈ జాబితాను కాస్త తగ్గించడంతో బ్యాంకులపై కాస్త ఒత్తిడి తగ్గనుంది. జాబితా నుంచి తొలగిన జేపీ అసోసియేట్స్ ఇటీవలే మెజారిటీ సిమెంట్ వ్యాపారాన్ని అల్ట్రాటెక్కు రూ.15,900 కోట్లకు విక్రయించడం తెలిసిందే. ఈ కంపెనీ మొత్తం రుణ భారం రూ.75,000 కోట్లుగా అంచనా. 11 బ్యాంకులకు నష్టాలు... కాగా, పీఎస్బీల స్థూల ఎన్పీఏలు గతేడాది మార్చి నాటికి 5.43 శాతం(దాదాపు రూ.2,67,065 కోట్లు) నుంచి డిసెంబర్ నాటికి 7.3 శాతానికి(రూ.3,61,731 కోట్లు) ఎగబాకాయి. దీనికి ఆర్బీఐ కొత్త నిబంధనలు కూడా ఒక కారణమే. డిసెంబర్ క్వార్టర్లో మొత్తం 11 పీఎస్బీలు రూ.12,867 కోట్ల నష్టాలను ప్రకటించాయి. బ్యాంకింగ్ పరిశ్రమలో అత్యధిక త్రైమాసిక నష్టాన్ని ప్రకటించిన పీఎస్బీగా బీఓబీ నిలిచింది కూడా. నేడు బీబీబీ సమావేశం ఎన్పీఏలు, మూలధన సమీకరణపై చర్చ న్యూఢిల్లీ: కొత్తగా ఏర్పాటైన బ్యాంక్ బోర్డు బ్యూరో (బీబీబీ) శుక్రవారం రెండవసారి సమావేశం కానున్నది. ఇందులో మొండిబకాయిలు(ఎన్పీఏ), మూలధన సమీకరణ వంటి తదితర అంశాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశముంది. బడ్జెట్ ప్రొవిజన్ కాకుండా ప్రభుత్వ రంగ బ్యాంకుల మూలధన అవసరాలపై బ్యూరో ప్రధానంగా దృష్టి కేంద్రీకరించవచ్చని ఒక సీనియర్ అధికారి తెలిపారు. వివిధ బ్యాంకుల్లో బోర్డు స్థాయిలో ఖాళీగా ఉన్న పోస్టుల భ ర్తీ అంశంపై కూడా బీబీబీ ఒక నిర్ణయానికి రానున్నదని చెప్పారు. బీబీబీ తొలి సమావేశం ఏప్రిల్ 8న జరిగింది. దీనికి ఆర్బీఐ గవర్నర్ రాజన్, ఆర్థిక సహాయ మంత్రి జయంత్ సిన్హా సహా బ్యూరో సభ్యులు హాజరయ్యారు. బ్యాంకు షేర్ల పరుగు... ఆర్బీఐ తాజా ఊరట నిర్ణయంతో క్యూ4లో లాభదాయకత పెరుగుతుందన్న అంచనాల కారణంగా బ్యాంకింగ్ షేర్లు దూసుకెళ్లాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు 3-5 శాతం మేర ఎగబాకాయి. పీఎన్బీ 5 శాతం ర్యాలీ జరిపింది. ఎస్బీఐ, బీఓబీ 3.68 శాతం చొప్పున లాభపడ్డాయి. ఇక ప్రైవేటు రంగంలోని ఐసీఐసీఐ బ్యాంక్ సెన్సెక్స్లో అత్యధికంగా 6.26 శాతం ఎగసింది. యాక్సిస్ కూడా 2 శాతం లాభపడింది. ముఖ్యంగా కార్పొరేట్లకు ఈ రెండు ప్రైవేటు బ్యాంకులూ అత్యధికంగా రుణాలివ్వడమేకాకుండా, ఆర్బీఐ 150 కంపెనీల జాబితా ప్రకారం గత క్వార్టర్లో భారీగా కేటాయింపులు చేశాయి. జేపీ అసోసియేట్స్కు ఐసీఐసీఐ బ్యాంక్ రుణాలు భారీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ కంపెనీ ఆర్బీఐ జాబితా నుంచి తొలగడంతో ఐసీఐసీఐ బ్యాంక్ షేరు రివ్వుమంది. -
చల్లని ఉపశమనం
వేసవిలో వాతావరణంలో మార్పుల వల్ల గాలిలో తేమ తగ్గిపోయి చమటపట్టి చల్లదనం కోరుకుంటాం. ఇంట్లోనూ, ఒంట్లోనూ చల్లదనంతో ఉపశమనం పొందాలంటే... ♦ ఎండవేళలో చాలామంది పదే పదే ఫ్రిజ్ డోర్ తీసి చల్లని నీళ్లు తీసుకుంటూ ఉంటారు. దీంతో ఫ్రిజ్ మోటార్పై మరింత భారం పడుతుంది. మిగతా కాలాలతో పోల్చితే ఎండాకాలం నీళ్లు, పదార్థాలు చల్లబడటానికి ఎక్కువ సమయం పడుతుంది. పదే పదే డోర్ తీయడం వల్ల విద్యుత్ కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. ♦ వేడి తక్కువ ఉండే ఉదయం, సాయంత్రాలు వంటలు చేయడం ముగించాలి. స్టౌ, ఓవెన్లు పగటి వేళలో ఉపయోగిస్తే ఇంట్లో వేడి శాతం పెరుగుతుంది. గ్రిల్, బొగ్గుల కుంపటి వంటివాటి మీద వండాలంటే బయట ఖాళీ స్థలాన్ని ఎంచుకోవాలి. ♦ కిటికీలు, రూఫ్ మీద సోలార్ స్క్రీన్లను ఏర్పాట్లు చేసుకుంటే ఇంట్లో విద్యుత్ వాడకం తగ్గుతుంది. చల్లదనమూ పెరుగుతుంది. ♦ బయటివైపు కిటికీల మీద నుంచి ఏటవాలుగా ప్లాస్టిక్, కలప వంటి షీట్స్ను ఏర్పాటు చేసుకోవాలి. దీని వల్ల సూర్య కిరణాలు నేరుగా ఇంటిలోకి రాకుండా అడ్డుకోవచ్చు. -
జేసీకి ఊరట
♦ తెలంగాణకే ఆమ్రపాలి కేటాయింపు ♦ టీఎస్ కేడర్లో కొనసాగింపునకు క్యాట్ అనుమతి కేడర్ అలాట్మెంట్పై తుది నిర్ణయం వెలువడింది. ఇకపై రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తా. - ఆమ్రపాలి, జేసీ -2 సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జాయింట్ కలెక్టర్-2 కాట ఆమ్రపాలికి ఊరట లభించింది. తెలంగాణ కేడర్లో ఆమె కొనసాగడానికి క్యాట్ (సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్) అనుమతి ఇచ్చింది. రాష్ర్ట విభజనలో భాగంగా అఖిల భారత సర్వీసుల అధికారులను విభజించిన ప్రత్యూష్ సిన్హా కమిటీ ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్ కేడర్ను ఖరారు చేసింది. అయితే, తెలంగాణలో పనిచేసేందుకు ఆసక్తిచూపిన ఆమె.. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ క్యాట్ను ఆశ్రయించారు. గతేడాది మార్చి 5న ఆమ్రపాలి పిటిషన్ను విచారించిన క్యాట్.. తుది నిర్ణయం వెల్లడించేవరకు ఆమెను తెలంగాణ లోనే కొనసాగించాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే మంగళవారం ఆమెకు తెలంగాణ కేడర్ను కేటాయించడానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో గత 14 నెలలుగా జిల్లాలో సేవలందిస్తున్న ఆమెకు క్యాట్ తాజా నిర్ణయం సంతోషాన్ని కలిగించింది. -
ఇన్ సైడర్ ట్రేడింగ్ లో రిలయన్స్ కు ఊరట
తాజా ఉత్తర్వులో స్పష్టం చేసిన సెబీ న్యూఢిల్లీ: ఐపీసీఎల్(ఇండియన్ పెట్రోకెమికల్స్ కార్పొ) కేసులో మకేశ్ అంబానీ రిలయన్స్ గ్రూప్కు చెందిన రిలయన్స్ పెట్రోఇన్వెస్ట్మెంట్స్(ఆర్పీఐఎల్)కు ఊరట లభించింది. 9 ఏళ్ల ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో ఆర్పీఐఎల్ ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనలు ఉల్లంఘించిందనడానికి తగిన ఆధారాల్లేవంటూ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కేసును కొట్టివేసింది. ఇదే కేసులో 2013 మేలో ఆర్పీఐఎల్పై సెబీ రూ.11 కోట్ల జరిమానా విధించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఐపీసీఎల్ విలీనం, డివిడెండ్లకు సంబంధించిన సమాచారాన్ని ఐసీసీఎల్ యాజమాన్య సంస్థగా ఆర్పీఐఎల్ ముందుగానే తెలుసుకొని స్టాక్ మార్కెట్లో ఐపీసీఎల్ షేర్లను కొనుగోలు చేసిందని సెబీ పేర్కొంది. ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ కారణంగా ఆర్పీఐఎల్ రూ.3.82 కోట్లు లాభపడిందని భావించిన సెబీ ఆర్పీఐఎల్పై రూ 11 కోట్ల జరిమానాను విధించింది. సెబీ జరిమానాకు వ్యతిరేకంగా ఆర్పీఐఎల్ సెక్యూరిటీస్ అప్పిల్లేట్ ట్రిబ్యూనల్(శాట్)ను ఆశ్రయించింది. ఈ జరిమానాను గత ఏడాది డిసెంబర్లో శాట్ కొట్టేసింది. అంతే కాకుండా ఈ కేసును సెబీ తాజాగా విచారించాలని, మూడు నెలల్లో నిర్ణయాన్ని వెలువరించాలని ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఈ కేసు విచారణ చేపట్టిన సెబీ, ఆర్పీఐఎల్, ఆర్ఐఎల్లు ఒకే గ్రూప్కు చెందిన కంపెనీలైనప్పటికీ, ఐపీసీఎల్ షేర్లకు సంబంధించి ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. ఐపీసీఎల్ ప్రభుత్వ రంగ సంస్థ. డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియలో భాగంగా ఈ కంపెనీని ప్రభుత్వం రిలయన్స్ ఇండస్ట్రీస్కు విక్రయించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్కు అనుబంధ సంస్థగా కొనసాగి ఆ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్లో విలీనమైంది. ఆ తర్వాత స్టాక్ ఎక్స్ఛేంజ్ల నుంచి డీలిస్ట్ అయింది. -
103 మంది బాల కార్మికులకు విముక్తి
సుల్తానాబాద్(కరీంనగర్ జిల్లా): సుల్తానాబాద్ మండల పరిధిలో 103 మంది బాల కార్మికులకు పోలీసులు విముక్తి కల్పించారు. ఒడిషాకి చెందిన వీరంతా సుల్తానాబాద్ చుట్టుపక్కల ఉన్న ఇటుకల బట్టీల్లో పనిచేస్తున్నారు. బాలలను పనుల్లో పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీనివాసరావు హెచ్చరించారు. బాలలను దగ్గర్లోని సంక్షేమ కార్యాలయానికి తరలించనున్నట్లు ఐసీడీఎస్ అధికారిణి పర్వీన్ సుల్తానా తెలిపారు. -
ఏపీ ఆరోగ్యమిత్రలకు హైకోర్టులో ఊరట
-
రత్నప్రభకు హైకోర్టులో ఊరట
ఏసీబీ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: రహేజా సంస్థకు భూముల కేటాయింపు వ్యవహారంలో సీనియర్ ఐఏఎస్ అధికారి, కర్ణాటక ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రత్నప్రభకు హైకోర్టులో ఊరట లభించింది. రత్నప్రభకు ఏసీబీ ప్రత్యేక కోర్టు జారీ చేసిన సమన్లతో పాటు తదుపరి చర్యలన్నింటినీ హైకోర్టు నిలుపుదల చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. రహేజా సంస్థకు జరిపిన భూ కేటాయింపుల్లో ఏపీఐఐసీ వాటాను 11 శాతం నుంచి 0.55 శాతానికి తగ్గించారని, అధికారుల చర్య వల్ల ప్రభుత్వానికి రూ.600 కోట్ల మేర నష్టం వాటిల్లిందంటూ న్యాయవాది శ్రీరంగారావు ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐఏఎస్ అధికారులు బీపీ ఆచార్య, రత్నప్రభ, ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఐపీఎస్ అధికారి గోపికృష్ణ, రహేజా సంస్థ ఎండీ నీల్ రహేజా తదితరులకు గత నెల 30న ఏసీబీ ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఫిబ్రవరి 12న కోర్టు ఎదుట హాజరు కావాలని పేర్కొంది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రత్నప్రభ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రత్నప్రభ తరఫు న్యాయవాది వై.శ్రీనివాసమూర్తి వాదనలు వినిపిస్తూ.. 2014 సెప్టెంబర్లో ఏసీబీ అధికారులు సమర్పించిన నివేదికను పరిగణలోకి తీసుకుని కోర్టు ఈ కేసును 2014 అక్టోబర్లో మూసేసిందని, ఈ కేసుతో రత్నప్రభకు ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఏసీబీ ప్రత్యేక కోర్టు జారీ చేసిన సమన్లతో పాటు, తదుపరి చర్యలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. -
కీళ్లనొప్పులకు మోకాళ్ల నొప్పులకు... చిన్ముద్ర... అపాన ముద్ర...
యోగ ముద్రల ద్వారా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. క్రమంగా ఆ నొప్పి నుంచి బయట పడవచ్చు. అందుకు ఏం చేయాలి? మీరు ఏ వయసు వారైనా కావచ్చు. పద్మాసనంలోకాని, సుఖాసనంలోకాని అదీ వీలు లేకపోతే కుర్చీలో కాని కూర్చోండి.వెన్ను నిటారుగా పెట్టాలి. ఇది తప్పని సరి.ఇప్పుడు రెండు చేతుల చూపుడు వేలును బొటన వేలును సుతారంగా తాకించండి. ఇదే చిన్ముద్ర. ఈ ముద్రలో ఉన్న చేతులను తొడల మీద ఉంచి సుతారంగా గాలి పీల్చుతూ దీర్ఘ ఉఛ్వాసను దీర్ఘ నిశ్వాసను తీసుకోండి. ఇలా పదిహేను నిమిషాలు చేయండి.ఆ తర్వాత ముద్రను మార్చండి. ఈసారి బొటనవేలికి మధ్య వేలును ఉంగరం వేలును తాకించండి. దీనినే అపాన ముద్ర అంటారు.ఈ ముద్రలో కూడా వెన్ను నిటారుగా పెట్టి దీర్ఘ ఉఛ్వాసను దీర్ఘ నిశ్వాసను తీసుకోండి. ఇలా పదిహేను నిమిషాలు చేయండి. ఇలా రోజూ చేస్తూ ఉంటే తప్పకుండా మలినాలు తొలగి కీళ్ల నొప్పుల నుంచి మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందుతారు. -
ఆస్ట్రేలియాలో అదానీకి ఊరట
► పోర్టు విస్తరణ ప్రణాళికకు ఆమోదం మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో వివాదాస్పద ప్రాజెక్టులకు సంబంధించి అదానీ గ్రూప్నకు మరో ఊరట లభించింది. అదానీకి చెందిన 6.5 బిలియన్ డాలర్ల కార్మైఖల్ బొగ్గు గనితో పాటు ఇతర ప్రాజెక్టులకు ఆసరాగా నిలిచే బొగ్గు రవాణా పోర్టు విస్తరణకు అక్కడి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ అబాట్ పాయింట్ పోర్టు విస్తరణ కారణంగా ప్రపంచంలోనే అతిపెద్ద కోరల్ రీఫ్ వ్యవస్థ అయిన గ్రేట్ బ్యారియర్ రీఫ్కు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పర్యావరణవేత్తల నుంచి తీవ్ర ఆందోళనలు, హెచ్చరికలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. పోర్టు విస్తరణ కోసం చేపట్టే డ్రెడ్జింగ్లో భాగంగా తవ్వితీసే మడ్డి(సెడిమెంట్)ని ఏవిధంగా, ఎక్కడికి తరలిస్తారన్నది తేల్చడంతోపాటు ఇతరత్రా కఠిన షరతులకు కట్టుబడితేనే ఈ ప్రాజెక్టుపై ముందుకెళ్లాలని తాజాగా ఇచ్చిన అనుమతుల్లో ప్రభుత్వం స్పష్టీకరించింది. కాగా ప్రభుత్వ ప్రకటనను అదానీ స్వాగతించింది. తమ బొగ్గు గనుల ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల ఉద్యోగాలతో పాటు ప్రభుత్వానికి రాయల్టీలు, పన్నుల రూపంలో 22 బిలియన్ డాలర్ల ఆదాయం కూడా లభిస్తుందని అదానీ పేర్కొంది. అనేక ప్రతిబంధకాల తర్వాత కార్మైఖల్ బొగ్గు గని ప్రాజెక్టుకు రెండు నెలల క్రితం ప్రభుత్వం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. కాగా, క్వీన్స్ల్యాండ్లోని గలిలీ బేసిన్లో బొగ్గు గనుల ప్రాజెక్టులు ఉన్న భారతీయ సంస్థల్లో అదానీతో పాటు జీవీకేకు కూడా తాజా అనుమతులతో ప్రయోజనం చేకూరనుదని బ్రిస్బేన్ టైమ్స్ వ్యాఖ్యానించింది. -
కాల్ డ్రాప్లపై టెల్కోలకు జనవరి 6 దాకా ఊరట
న్యూఢిల్లీ: కాల్ డ్రాప్స్కి పరిహారం విషయంలో టెల్కోలకు కొంత ఊరట లభించింది. తదుపరి విచారణ తేది జనవరి 6 దాకా ఈ అంశానికి సంబంధించి ఆపరేటర్లను ఒత్తిడి చేసే చర్యలు తీసుకోబోమని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ మంగళవారం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. అయితే, ఇందుకు సంబంధించిన నిబంధనలు మాత్రం ముందుగా నిర్ణయించినట్లు జనవరి 1 నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. నెట్వర్క్ సమస్యల వల్ల కాల్ డ్రాప్ అయిన పక్షంలో యూజర్లకు రూ. 1 పరిహారంగా చెల్లించాలన్న ట్రాయ్ నిబంధనలను సవాలు చేస్తూ టెల్కోలు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వొడాఫోన్, ఎయిర్టెల్, ఆర్కామ్ తదితర 21 టెల్కోలు ఇందులో ఉన్నాయి. భౌతిక శాస్త్రం ప్రకారం నూటికి నూరుపాళ్లు కాల్ డ్రాప్ సమస్య ఉండని నెట్వర్క్ ఏర్పాటు అసాధ్యమని తెలిసీ ట్రాయ్ పరిహారం నిర్ణయం తీసుకుందని ఆపరేటర్ల తరఫు లాయర్ హరీశ్ సాల్వే పేర్కొన్నారు. అయితే, సంబంధిత వర్గాలన్నింటి అభిప్రాయాలు తీసుకున్న మేరకే అక్టోబర్ 16న నిబంధనలను ప్రకటించడం జరిగిందని, టెల్కోల స్థూల ఆదాయంలో పరిహార భారం కేవలం ఒక్క శాతం కన్నా తక్కువే ఉండొచ్చని జస్టిస్ రోహిణి, జస్టిస్ జయంత్ నాథ్లతో కూడిన బెంచ్కి అడిషనల్ సొలిసిటర్ జనరల్ పీఎస్ నరసింహ తెలిపారు. వాదోపవాదాలు విన్న మీదట కేసు తదుపరి విచారణను బెంచ్ జనవరి 6 దాకా వాయిదా వేసింది. -
హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్కు ఊరట
-
'కరువు' ప్రతిపాదనలు పంపండి
ఏపీ, తెలంగాణ సహా 6 రాష్ట్రాలకు కేంద్రం సూచన సాక్షి, న్యూఢిల్లీ: ఖరీఫ్ సీజన్ సహా రబీ ప్రారంభం వరకు వర్షాభావ పరిస్థితుల కారణంగా దేశంలో కరువు పరిస్థితి నెలకొన్న దృష్ట్యా కరువుపై సాయం కోరేందుకు సంబంధిత వివరాలతో అభ్యర్థన పంపాలని కేంద్రం పలు రాష్ట్రాలకు సూచించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలకు ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ సమాచారం పంపింది. ఆయా రాష్ట్రాల్లో కరువు ప్రభావిత జిల్లాల సంఖ్యను పంపాలని, వాటిని కరువు జిల్లాలుగా ప్రకటించాలో వద్దో తెలుపుతూ వెంటనే సమాచారాన్ని పంపాలని సూచించింది. అంతేకాకుండా జాతీయ కరువు సహాయక నిధి(ఎన్డీఆర్ఎఫ్) నుంచి సాయం కోసం ఆర్థిక వివరాలతో కూడిన అభ్యర్థన పంపాలని సూచించింది. సంబంధిత వివరాలు వచ్చాక కేంద్ర బృందాలు ఆయా ప్రాంతాల్లో పర్యటించి అవసరమైన సాయాన్ని అంచనా వేస్తాయని వ్యవసాయ శాఖ తెలిపింది. ఇప్పటివరకు కరువు సహాయ నిధుల కోసం కర్ణాటక, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి అభ్యర్థనలు వచ్చాయని తెలిపింది. -
అమెరికా కోర్టులో సహారా గ్రూప్కు ఊరట
న్యూయార్క్: చైర్మన్ సుబ్రతా రాయ్ బెయిల్కి నిధులు సమీకరించడంలో తలమునకలైన సహారా గ్రూప్కి అమెరికా కోర్టులో ఊరట లభించింది. అమెరికాలో అమ్మకానికి పెట్టిన సహారా గ్రూప్ రెండు హోటల్స్ను తమకు స్వాధీనం చేయాలంటూ తాజాగా హాంకాంగ్కి చెందిన జేటీఎస్ ట్రేడింగ్ అమెరికా కోర్టులో దావా వేసిన విషయం తెలిసిందే. న్యూయార్క్లోని రెండు హోటల్స్తో పాటు లండన్లోని గ్రాస్వీనర్ హోటల్ రీఫైనాన్సింగ్కి డీల్ కుదర్చాల్సిన టీమ్లో దుబాయ్కి చెందిన ట్రినిటీ వైట్ సిటీ వెంచర్స్తో తాము జతకట్టినట్లు జేటీఎస్ పేర్కొంది. అయితే, సహారా గ్రూప్, ట్రినిటీ, స్విస్ బ్యాంక్ యూబీఎస్ కలిసి మధ్యలోనే తమ సంస్థను పక్కన పెట్టేశాయని, దీనివల్ల తమకు భారీగా నష్టం జరిగిందని తెలియజేసింది. ఇందుకు పరిహారంగా మూడు సంస్థలూ కలిసి 350 మిలియన్ డాలర్లు చెల్లించాలంటూ జేటీఎస్ దావా వేసింది. మరోవైపు, ట్రినిటీ వైట్ సిటీకి జేటీఎస్కి మధ్య లావాదేవీల విషయం తమకు తెలియదని, తమకి ఏమాత్రం సంబంధం లేని కేసులోకి అన వసరంగా లాగుతున్నారని సహారా గ్రూప్ తెలిపింది. దీనిపై విచారించిన అమెరికా ఉన్నత న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం.. హాంకాంగ్కి చెందిన జేటీఎస్ ట్రేడింగ్ వేసిన దావాను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. -
పండ్లతో క్లెన్సింగ్...
- రెండు ద్రాక్ష పండ్లను తీసుకొని సగానికి కోయాలి. ఆ ముక్కలతో ముఖం, మెడ, భుజాలను రబ్ చేయాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇది మంచి క్లెన్సర్గా పనిచేస్తుంది. ఎండవేడి నుంచి ఉపశమనం లభించడమే కాదు, రక్తప్రసరణ మెరుగవుతుంది. ఫలితంగా చర్మకాంతి పెరుగుతుంది. - పుచ్చకాయ ముక్కలు కప్పు, రెండు టేబుల్ స్పూన్ల నీరు కలిపి బ్లెండ్ చేయాలి. తర్వాత వడకట్టుకోవాలి. దూదిని ఈ రసంలో ముంచి ముఖమంతా రాసుకొని ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. మేకప్ చేసుకోవడానికి ముందు పుచ్చకాయ రసం రాసుకుంటే చర్మానికి మంచి క్లెన్సింగ్లా ఉపయోపడుతుంది. ముఖం ఎక్కువ సేపు తాజాగా కనిపిస్తుంది. - కివీ(సూపర్మార్కెట్లో లభిస్తుంది) పండు గుజ్జులో టేబుల్ స్పూన్ పెరుగు, టీ స్పూన్ బాదం నూనె, టీ స్పూన్ తేనె, రెండు చుక్కల ఆరెంజ్ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని మెడకు, ముఖానికి రాసుకోవాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ మలినాలను తొలగిస్తుంది. చర్మకాంతిని మెరుగుపరుస్తుంది. - పసుపులో ఆరెంజ్ జ్యూస్ కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని మృదువుగా మసాజ్ చేయాలి. పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. మృతకణాలు, మురికి తొలగిపోయి చర్మకాంతి పెరుగుతుంది. మొటిమలు, మచ్చల నివారణకు కూడా ఇది మేలైన ప్యాక్. -
భవాని.. మరో ‘ప్రత్యూష’
-
భవాని.. మరో ‘ప్రత్యూష’
వేధింపులకు గురిచేస్తున్న అన్నావదినలు బాలల హక్కుల సంఘం చొరవతో విముక్తి హైదరాబాద్: సవతితల్లి చేతిలో తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూష ఘటనను ఇంకా మరవక ముందే హైదరాబాద్ నేరేడ్మెట్ ప్రాంతంలో ఇలాంటి ఘటనే ఆలస్యంగా వెలుగు చూసింది. అన్న, వదినల దాష్టీకానికి చిత్రహింసలకు గురైన యువతికి చివరకు బాలల హక్కుల సంఘం చొరవ తీసుకోవడంతో విముక్తి లభించింది. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఉప్పులూరి ఏసు, తిరుపతమ్మ దంపతుల ఏకైక సంతానం భవాని (18). తల్లిదండ్రులిద్దరూ ఎనిమిదేళ్ల కిందట చనిపోయారు. దీంతో ఎవరూ పోషించలేని స్థితిలో యువతి మహబూబ్నగర్లోనే ఓ హాస్టల్లో చేరింది. కాగా, సైనిక్పురిలోని టెలికం కాలనీలో నివాసముంటున్న భవాని పెద్దనాన్న కుమారుడు (వరసకు అన్న) శ్రీనివాస్, వదిన లక్షీ్ష్మలు తాము పోషించుకుంటామని చెప్పి యువతిని హాస్టల్ నుంచి తీసుకొచ్చారు. ఇంటికి రాగానే భవానికి ఇంటిపని అప్పజెప్పారు. సమయానికి కడుపునిండా భోజనం పెట్టకుండా చిత్రహింసలకు గురిచేసేవారు. కాల్చిన గరిటెతో ఒంటిపై వాతలు కూడా పెట్టేవారు. కొన్నాళ్లుగా భవాని అనుభవిస్తున్న బాధలు చూడలేక స్థానికులు కొందరు బాలల హక్కుల సంఘానికి సమాచారం అందజేశారు. వెంటనే స్పందించిన బాలల హక్కుల సంఘం ప్రతినిధులు అచ్యుతరావు, అనురాధారావు పోలీసుల సహాయంతో భవానికి ఆ ఇంటి నుంచి విముక్తి కల్పించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పరారీలో ఉన్న అన్న, వదినలపై పోలీసులు కేసు నమోదు చేశారు. చికిత్స కోసం యువతను స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తరలించారు. కోలుకున్న తర్వాత ఆమెను విద్యానగర్లోని దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్టల్కు తీసుకెళ్లనున్నట్లు అచ్యుతరావు తెలిపారు. -
పరువు నష్టం కేసులో రాహుల్కు ఊరట
న్యూఢిల్లీ: పరువు నష్టం కేసులో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీకి సుప్రీంకోర్టులో ఊరటలభించింది. ఈ కేసులో తదుపరి చర్యలపై న్యాయస్థానం స్టే విధించిం ది. మహాత్మాగాంధీ హత్యకు ఆరెస్సెస్సే కారణమంటూ రాహుల్ గతంలో చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్రలోని భీవండి మేజిస్ట్రియల్ కోర్టులో క్రిమినల్ పరువు నష్టం కేసు నమోదైంది. తదుపరి విచారణ వరకు ఈ కేసులో ప్రొసీడింగ్స్ను నిలుపుదల చేస్తున్నట్లు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ పీసీ పంత్లతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు చెప్పింది. దీనిపై నాలుగు వారాల్లో స్పందన తెలపాల్సిందిగా రాహుల్పై కేసు దాఖలు చేసిన ఆరెస్సెస్ కార్యకర్త రాజేశ్ కుంతేతోపాటు కేంద్రానికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను జూలై 8కి వాయిదా వేసింది. అలాగే క్రిమినల్ పరువు నష్టం కేసుకు సంబంధించి ఐపీసీలోని సెక్షన్ 499, 500ల రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ రాహుల్ వేసిన పిటిషన్ను కూడా సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. -
హైకోర్టు స్టేతో ఈము రైతులకు ఊరట
హైదరాబాద్: ఈము పక్షుల పెంపకం ప్రారంభించి తీవ్ర నష్టాలపాలైన ఇద్దరు రైతులకు చెందిన ఆస్తుల జోలికి వెళ్లొద్దంటూ ఉమ్మడి హైకోర్టు ఇటీవల మధ్యంతర స్టే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దశాబ్దం కిందట ఏపీ, తెలంగాణలోని సుమారు 400 మంది రైతులు నాబార్డు, బ్యాంకుల నుంచి రుణం తీసుకుని ఈము పక్షుల పెంపకం చేపట్టారు. అయితే ప్రాసెసింగ్, మార్కెటింగ్ సదుపాయాలు కరువై వారు తీవ్ర నష్టాలపాలయ్యారు. మరోవైపు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణంపై వడ్డీలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో తమ రుణాలు రద్దు చేయాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఈము బాధిత రైతుల సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు కంతేటి వెంకటరాజు, కంతేటి రంగరాజు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం, తదుపరి ఆదేశాలిచ్చేంత వరకు ఈ ఇద్దరి ఆస్తుల జోలికి వెళ్లొద్దని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. -
రాజధాని వీధుల్లో ఆ విద్యార్థులు
న్యూఢిల్లీ: వారంతా నేపాల్ విద్యార్థులు. హాయిగా చదువుకుని సాయం కాలంలో స్నేహితులతో కలిసి సరదాగా గడిపేవారు. కానీ. ఇప్పుడు మాత్రం భారత రాజధాని వీధుల్లో కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతున్నారు. ఎందుకని అనుకుంటున్నారా.. భారీ భూకంపం పంజా విసరడంతో సర్వం కోల్పోయి విలవిళ్లాడుతున్న తమవారికి సాయం చేసేందుకు. ఉదయం చదువుకుని సాయంత్రం పూట దాతృత్వ విరాళాలు సేకరించేందుకు ఢిల్లీ నగర వీధులను చుట్టేస్తున్నారు. గత శనివారం భారీ భూకంపం సంభవించి నేపాల్ భారీ స్థాయిలో నష్టాన్ని చవి చూసిన విషయం తెలిసిందే. దాని దెబ్బకి అక్కడి ప్రజల గూడు చెదిరి గుండెపగిలి చివరికి కూడు కూడా కరువైంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలు సాయం చేస్తున్నట్లుగానే తమవారిని ఆదుకునేందుకు తమ వంతుగా ఢిల్లీలోని ఓ కాలేజీలో చార్టెడ్ అకౌంటెంట్ విద్యను అభ్యసిస్తున్న ప్రజ్వల్ బాస్నెట్ అనే విద్యార్ధి మరో ఆరుగురి సాయంతో ఓ గ్రూపుగా ఏర్పడి మొత్తం 500 మంది విద్యార్థులను స్వచ్ఛందంగా చేర్చుకొని విరాళాలు నగదు రూపంలో వస్తువుల రూపంలో, ఆహార పదార్థాల రూపంలో సేకరిస్తున్నారు. ఇప్పటికే మొదటి దఫా సాయాన్ని అందించారు కూడా. -
అథ్లెట్ దుతీ చంద్కు ఊరట
న్యూఢిల్లీ: అంతర్జాతీయ అమెచ్యూర్ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) నుంచి నిషేధం ఎదుర్కొంటున్న భారత స్ప్రింటర్ దుతీ చంద్కు కాస్త ఊరట లభించింది. జూన్లో చైనాలో జరిగే ఆసియా చాంపియన్షిప్లో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్లోని క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు ఆమెకు అనుమతిచ్చింది. ప్రమాణాలకు మించి టెస్టోస్టెరాన్ హార్మోన్ను కలిగి ఉండడంతో మహిళల విభాగంలో పాల్గొనేందుకు ఆమె అనర్హురాలంటూ... గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ నుంచి ఆమెను హఠాత్తుగా తప్పించారు. తుది తీర్పు వచ్చేదాకా అంతర్జాతీయ ఈవెంట్స్లో ఆమె పోటీపడరాదంటూ ఐఏఏఎఫ్ అప్పట్లో తేల్చింది. -
కుష్బుకు ఊరట
రుద్రాక్ష వ్యవహారంలో విముక్తి పిటిషన్ తిరస్కరణ రుద్రాక్షతో మంగళ సూత్రం ధరించిన వ్యవహారం నుంచి కాంగ్రెస్ నాయకురాలు, నటి కుష్బుకు విముక్తి కల్గింది. పిటిషన్ను తోసి పుచ్చుతూ కుంబకోణం న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వడంతో ఆమెకు ఊరట లభించింది. సాక్షి, చెన్నై: కుష్బు వాక్ చాతుర్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే, సంస్కృతి సంప్రదాయాలకు వ్యతిరేకంగా, పాశ్చాత్య ఒరవడికి అనుగుణంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, పాదరక్షలతో ఆలయంలోకి వెళ్లడం తదితర వ్యవహారాలు ఆమెకు కొన్ని సందర్భాల్లో కష్టాలు తెచ్చిపెట్టాయి. ఈ వ్యవహారాల్లో ఆమె మీద కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసిన సందర్భాలు అనేకం. ఇటీవల ఓ వార పత్రికలో రుద్రాక్షను మంగళ సూత్రంలో కలిపి ఆమె ధరించడం వివాదానికి దారి తీసింది. ఏకంగా ఓ వ్యక్తి కుంబకోణం కోర్టును ఆశ్రయించాడు. వార పత్రికకు కుష్బు ఇచ్చిన ఫోజును చూసిన కుంభకోణం సమీపంలోని ఉమామహేశ్వర పురం శంకర సారంగపాణి పేటకు చెందిన బాల కోర్టును ఆశ్రయించాడు. రుద్రాక్ష అన్నది పవిత్రమైనదని, నిత్యం శివనామస్మరణతో దేవుడ్ని పూజించే వాళ్లు, భక్తులు వాటిని ధరించాలని వివరించారు. రుద్రాక్షలో 24 ముఖాలు ఉన్నాయని వివరిస్తూ, కుష్బు ధరించిన రుద్రాక్ష మూడు ముఖాలుగా ఉందని పేర్కొన్నారు. ఈ రుద్రాక్షను శివుడి మీద భక్తితో నిత్యం పూజాధి కార్యక్రమాలు నిర్వహించే వాళ్లే ధరించాలని, అయితే, హిందూ సంప్రదాయాలకు వ్యతిరేకంగా కుష్బు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుద్రాక్షను మాంగళ సూత్రంతో కలిపి ధరించడానికి వీలు లేదని పేర్కొన్నారు. సంప్రదాయాల్ని మంట కలిపే విధంగా పలు సందర్భాల్లో ఆమె వ్యవహరించారని ఉదాహరణకు గతంలో జరిగిన కొన్ని సంఘటనలను వివరించారు. తాజాగా రుద్రాక్ష ధరించి శివ భక్తులకు వ్యతిరేకంగా వ్యవహరించిన కుష్బుపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు. కుంభకోణం రెండవ అదనపు కోర్టులో న్యాయమూర్తి శరవణభవన్ ముందు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. మంగళవారం విచారణ సమయంలో పిటిషనర్ను న్యాయమూర్తి పలు రకాల ప్రశ్నల్ని సంధించారు. సంప్రదాయాల్ని మంట గలుపుతున్నారని పేర్కొన్నారుగా, ప్రత్యక్షంగా చూశారా? ఆమె రుద్రాక్ష మాలను ధరించి ఉండటాన్ని తమరేమైనా ప్రత్యక్షంగా చూశారా? , ఓ వార పత్రికలో వచ్చిన ఫొటో ఆధారంగా పిటిషన్ వేయడాన్ని ఏకీభవించబోమని స్పష్టం చేశారు. ఆధార రహితంగా ఈ పిటిషన్ దాఖలు చేసిన దృష్ట్యా, విచారణయోగ్యం కాదని పరిగణించి తోసి పుచ్చారు. దీంతో ఈ వ్యవహారం నుంచి కుష్బుకు ఊరట లభించినట్టు అయింది. -
ఉరి నుంచి ఊరికి!
చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాడు ప్రజలు శుక్రవారం ఆనందంలో మునిగిపోయూరు. మత్స్యకారుల కుటుంబాల్లో సంతోషం కట్టలు తెంచుకుంది. శ్రీలంక చెర నుంచి విముక్తి పొందిన ఐదుగురు జాలర్లు చెన్నై చేరుకున్నారు. విమానాశ్రయంలో వారికి ఘన స్వాగ తం లభించింది. రాష్ట్రంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యూయి. రామనాథపురం జిల్లా రామేశ్వరం సమీపం తంగచ్చిమండపానికి చెందిన ఎనిమిది మంది జాల్లర్లు హెరాయిన్ మత్తుపదార్థాలను చేరవేస్తుండగా తాము అరెస్ట్ చేసినట్లు 2011 నవంబర్ 28న శ్రీలంక గస్తీదళాలు ప్రకటించాయి. ఈ కేసుపై 35 నెలల తర్వాత వాదోపవాదాలు ముగియగాపట్టుబడిన 8 మంది తమిళ జాలర్లలో అగస్టస్, ఎవర్సన్, లింగ్లెట్, ప్రసాద్, విల్సన్ అనే ఐదుగురు మత్స్యకారులకు ఉరిశిక్ష విధిస్తూ గత నెల 30వ తేదీన శ్రీలంక కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పువెలువడిన వెం టనే రాష్ట్రం యావత్తు గగ్గోలు పెట్టగా, ఆ వేడి కేంద్రప్రభుత్వానికి తాకింది. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనలు నిర్వహించాయి. దీని ఫలితంగా శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేతో ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 9వ తేదీన టెలిఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపారు. ఈ నేపథ్యంలో రాజపక్సే ఐదుగురు జాలర్లకు క్షమాభిక్ష పెట్టారు. గురవారం రాత్రి వారందరినీ సురక్షితంగా ఢిల్లీకి చేర్చారు. అక్కడి నుంచి చెన్నైకి చేరుకున్నారు. బీజేపీ, అన్నాడీఎంకే పోటాపోటీ: మత్స్య కారులను విడిపించిన ఘనతను చాటుకునేందుకు భారతీయ జనతా పార్టీ, అన్నాడీఎంకే పోటీపడ్డాయి. రెండుపార్టీలూ విమానాశ్రయంలో హైడ్రామా సృష్టించాయి. షెడ్యూలు ప్రకారం విమానం గురువారం రాత్రి 12.40 గంటలకు చెన్నైకి చేరుకోవాల్సి ఉంది. జాలర్లకు ఘనస్వాగతం పలికేందుకు కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ తదితర 300 మంది విమానాశ్రయానికి చేరుకున్నారు. మరోవైపు రాష్ట్ర మంత్రి వలర్మతి తదితరులు మరోవైపు సిద్ధమయ్యూరు. జాలర్లు విమానం నుంచి దిగగానే స్వాగతం, మీడియాతో సమావేశం తరువాత వారి స్వస్థలాకు చేర్చేందుకు బీజేపీ వారు వాహనాలు సైతం సిద్ధం చేశారు. అయితే అన్నాడీఎంకే బృందం విమానాశ్రయంలోకి వెళ్లి జాలర్లను మరో మార్గం గుండా రోడ్డుపైకి తీసుకువచ్చి బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించింది. దీంతో విస్తుపోయిన బీజేపీ నేతలు వెనుదిరిగారు. బీజేపీ, అన్నాడీఎంకేల మధ్య గంటపాటు విమానాశ్రయంలో హైడ్రామా నడిచింది. కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ జాల్లర విడుదల అంశాన్ని అడ్డుపెట్టుకుని తాము రాజకీయ లబ్ధిపొందేందుకు ప్రయత్నించడం లేదన్నారు. లబ్ధి ఆలోచనే ఉంటే జాలర్లు ఢిల్లీ చేరగానే ప్రధాని నరేంద్రమోదీ వద్దకు తీసుకువెళ్లేవారమని అన్నారు. ఇదిలా ఉండగా మూడేళ్లుగా ఇళ్లు విడిచి వెళ్లిన జాలర్లు జీవితంలో నిలదొక్కుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది. వ్యవసాయం లేదా వ్యాపారం చేసుకుని ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు తలా రూ.3 లక్షలు అందజేస్తున్నట్లు ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం శుక్రవారం ప్రకటించారు. జాలర్లకు బ్రహ్మరథం: జాలర్ల విడుదలతో బీజేపీ నేతలు ప్రత్యేకంగా సంబరాలు చేసుకున్నారు. శుక్రవారం ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం కావడం, ఇదే రోజున జాలర్లు విడుదల చేయడంతో బీచ్ రోడ్డులో ‘మీన్ ఉనవు ఉన్నుం విళా’ పేరుతో సందడి చేశారు. ఎనిమిది రకాల చేపలతో తయారుచేసిన వంటకాలను ప్రజలకు పంచిపెట్టారు. ప్రధాని మోదీ, సుష్మాస్వరాజ్కు అభినందన సభ నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయించింది. ఇదిలా ఉండగా ఉదయం 9 గంటకు రామనాథపురం, మధ్యాహ్నం 12 గంటలకు తంగచ్చిమండంకు చేరకున్న ఐదుగురు జాలర్లకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇంటికి చేరుకోగానే వారి భార్యాబిడ్డలు, తల్లిదండ్రులు ఆలింగనం చేసుకుని ఆనందబాష్పాలు రాల్చారు. ఇదిలావుండగా జాలర్లకు ఉరిశిక్షపై క్షమాభిక్ష ప్రసాదించామేగానీ హెరాయిన్ అక్రమరవాణా కేసులను కొట్టివేయలేదని శ్రీలంక మంత్రి సెంథిల్ తొండమాన్ రెండురోజుల క్రితం ప్రకటించారు. ఐదుగురు జాలర్లను ఖైదీలుగానే అప్పగిస్తున్నామని అన్నారు. శ్రీలంక మంత్రి వ్యాఖ్యలతో మళ్లీ జాలర్లను భారత్ జైళ్లలో పెడతారేమోననే సందేహం బయలుదేరింది. అయితే ఎట్టకేలకు వారంతా సురక్షితంగా ఇళ్లకు చేరడంతో అందరూ ఆనందపడ్డారు. -
మాజీ క్రికెటర్ అతుల్ శర్మకు ఊరట!
ముంబై: మాజీ క్రికెటర్ అతుల్ శర్మ స్టానిక కోర్టులో ఊరట లభించింది. తనను, తన కూతుర్ని చంపుతానంటూ బెదిరించారని అతుల్ శర్మపై టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో లియాండర్ పేస్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన ముంబై స్థానిక కోర్టు... అతుల్ శర్మను నవంబర్ 27 తేది వరకు అరెస్ట్ చేయవద్దని తీర్పునిచ్చింది. గతంలో రియాపిళ్లై,లియాండర్ పేస్ లిద్దరూ సహజీవనం చేశారు. వీరిద్దరి మధ్య కొంతకాలంగా కోర్టులో వివాదాలు నడుస్తున్నాయి. రియాపిళ్లై తో అతుల్ శర్మ సన్నిహితంగా ఉంటున్నట్టు మీడియాలో రూమర్లు చెలరేగుతున్నాయి. -
ఈదర హరిబాబుకు హైకోర్టులో ఊరట
-
సాయం చేయాలంటే సాక్ష్యం కావాలి:బాబు
-
సాయం చేయాలంటే సాక్ష్యం కావాలి: చంద్రబాబు
తుఫాను బాధితులకు సాయం చేయాలంటే వాళ్లకు జరిగిన నష్టానికి సాక్ష్యం కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. విశాఖపట్నంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే అన్ని ప్రాంతాలకు ఎన్యుమరేషన్ బృందాలను పంపామని, వాళ్లు పంపిన వివరాలు సరికావనుకుంటే బాధితులు కూడా నేరుగా వెబ్సైట్లో అప్లోడ్ చేయొచ్చని ఆయన అన్నారు. అధికారులు ఇంకా పూర్తిస్థాయిలో పనిచేయాల్సి ఉందని, వాళ్ల పని నూరుశాతం పూర్తయ్యేవరకు వాళ్లను అభినందించేది లేదని చంద్రబాబు అన్నారు. ఇంకా ఆయన ఏం మాట్లాడారంటే.. ''జరిగిన నష్టం చాలా ఎక్కువ. బాధితులకు ఇవ్వడానికి సరుకులు వేర్వేరు చోట్ల కొనాలి, ప్యాకింగ్ చేయాలి. నూనె, పంచదార అన్నీ ఇవ్వాలి. కూరగాయలు వేర్వేరు ప్రాంతాల నుంచి తెప్పించాలి. ఉల్లిపాయలు కర్నూలు నుంచి రావాలి. బంగాళాదుంపలు పశ్చిమబెంగాల్ నుంచి రావాలి. రవాణా సమస్యలు ఉండటం వల్ల కూడా సహాయం అందించడం ఆలస్యం అవుతోంది. సామర్థ్యం పెంచుకోవాలని అందరికీ చెబుతున్నాను. అధికారులంతా అందుకు ప్రయత్నిస్తున్నారు. విశాఖపట్నం తీవ్రంగా ప్రభావితమైంది. దీనిపక్కన 50 శాతం కంటే ఎక్కువ ప్రభావితమైన గ్రామాలు కూడా ఉన్నాయి. వాటికో ప్యాకేజి, అంతకంటే తక్కువ ఉన్నవాటికి 10 కిలోల బియ్యం, కిలో చొప్పున పప్పు, ఉప్పు, చక్కెర, లీటరు నూనె, అర కిలో కారం ప్యాకేజిగా ఇస్తాం. కరెంటు లేదు, చెట్లు పడిపోయి ట్రాఫిక్ జామ్ అయింది, ఉపాధి కూడా లేదు కాబట్టే తుఫాను ప్రభావం లేని ప్రాంతాల్లో కూడా సాయం అందజేస్తున్నాం. సర్వే కోసం అధికారులు బయల్దేరుతున్నారు. వాళ్లు ఫొటోలు, వీడియోలు తీసుకుని అక్కడికక్కడే రికార్డు చేసి ఆన్లైన్లోకి అప్లోడ్ చేయాలి. వాళ్లు ఎన్యుమరేట్ చేసిన తర్వాత అది సరికాదనుకుంటే ఎవరైనా బాధితులు వాళ్లే ఫొటోలు, వీడియోలు తీసి వెబ్సైట్లో అప్లోడ్ చేయచ్చు. దాన్నయినా కూడా మేం అనుమతిస్తాం. మేం అందించే సాయం నేరుగా వాళ్ల బ్యాంకు ఖాతాలకు వెళ్తుంది. ఆన్లైన్లో వెళ్తుంది కాబట్టి, మధ్యలో ఎవరి ప్రమేయం ఉండబోదు. చేసిన సాయం మొత్తం బాధితులకు చేరుకుంటుంది'' అని ఆయన చెప్పారు. -
మాఫీ కాదు.. ఏకంగా విముక్తి చేస్తాం!
-
అరెస్టుకు ముందే దేవయానికి ‘దౌత్య’ మినహాయింపు!
న్యూఢిల్లీ/వాషింగ్టన్: వ్యక్తిగత అరెస్టు, నిర్బంధం వంటి ఏవైతే చర్యల నుంచి ఇప్పుడు మినహాయింపు ఇవ్వాలనుకుంటున్నారో... ఈనెల 12న భారత సీనియర్ దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడేను అమెరికా పోలీసులు అరెస్టు చేసేటప్పటికే ఆమె పూర్తిస్థాయిలో ఆ మినహాయింపు కలిగి ఉన్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది. నాడు న్యూయార్క్లో డిప్యూటీ కాన్సుల్ జనరల్గా ఉన్న ఆమె ఐరాసలోని భారత శాశ్వత బృందానికి సలహాదారుగా కూడా ఉన్నారు. ఇందుకుగాను ఐరాస సాధారణ సభ ఆమెకు ఇచ్చిన ‘గుర్తింపు’ డిసెంబర్ 31 వరకు వర్తిస్తుంది. ఈ ప్రకారం చూస్తే డిసెంబర్ 12న దేవయానిని అరెస్టు చేయడం ఆమె హోదాకు భంగకరమని పరిశీలకులు చెబుతున్నారు. ఇదే వాదనను భారత్ అమెరికా విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లింది. -
అల్లర్ల కేసులో మోడీకి ఊరట
మోడీకి సిట్ ఇచ్చిన క్లీన్చిట్ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ కొట్టివేత ఆ నివేదికను ఆమోదిస్తూ తీర్పు వెలువరించిన స్థానిక మెట్రోపాలిటన్ కోర్టు అహ్మదాబాద్: గుజరాత్లో 2002లో జరిగిన గోధ్రానంతర మత కల్లోలాల కేసులో బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి ఊరట లభించింది. అప్పుడు జరిగిన అల్లర్లు, ఊచకోతలో మోడీ పాత్ర లేదంటూ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సమర్పించిన తుది నివేదికను వ్యతిరేకిస్తూ జాకియా జాఫ్రీ వేసిన పిటిషన్ను స్థానిక మెట్రోపాలిటన్ కోర్టు గురువారం కొట్టివేసింది. సిట్ తుది నివేదికను ఆమోదిస్తూ స్థానిక మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ బీజే గణత్ర తీర్పునిచ్చారు. ‘పరిస్థితిని అదుపులో ఉంచే చర్యల్లో భాగంగా సైన్యాన్ని దింపాలంటూ అభ్యర్థించి ముఖ్యమంత్రి నరేంద్రమోడీ, ఆయన కేబినెట్ అప్రమత్తంగా వ్యవహరించారు. ఆ విషయంలో కుట్ర కోణాన్ని రుజువు చేయలేం. సబర్మతి ఎక్స్ప్రెస్ దహనం ఘటన తరువాత హిందువులకు తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కే అవకాశమివ్వాలంటూ పోలీసు ఉన్నతాధికారుల సమావేశంలో మోడీ ఆదేశించారనడానికి సరైన ఆధారాలు లేవు’ అని ఆయన తీర్పులో పేర్కొన్నారు. అల్లర్ల సమయంలో విధి నిర్వహణను మోడీ కావాలనే అలక్ష్యం చేశారని కూడా చెప్పలేమన్నారు. తన రాజకీయ జీవితంలో మాయని మచ్చలా మిగిలిన గోధ్రానంతర అల్లర్లకు సంబంధించి.. నరేంద్ర మోడీకి సిట్ ఇచ్చిన క్లీన్చిట్ను ఈ తీర్పు ద్వారా కోర్టు సమర్థించినట్లైంది. గుజరాత్ అల్లర్లకు సంబంధించి మోడీని నిందితుడిగా పేర్కొన్న ఏకైక పిటిషన్ ఇదే కావడం విశేషం. తీర్పు విన్న జాకియా(74) కన్నీటిపర్యంతమయ్యారు. ఈ తీర్పును నెల రోజుల్లోపల ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేస్తామని ప్రకటించారు. తీర్పు అనంతరం ‘సత్యమేవ జయతే’ అంటూ మోడీ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. తీర్పు వల్ల సిట్ ఇచ్చిన నిష్పక్షపాత దర్యాప్తు నివేదికకు కోర్టు ఆమోదముద్ర లభించిందని సిట్ తరఫు న్యాయవాది ఆర్ఎస్ జామూర్ పేర్కొన్నారు. కేసు పూర్వాపరాలు: 2002 అల్లర్లలో గుల్బర్గ్ సొసైటీ ఊచకోత సందర్భంగా 2002 ఫిబ్రవరి 28న జాకియా జాఫ్రీ భర్త, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ఎహసాన్ జాఫ్రీ సహా 68 మంది దారుణ హత్యకు గురయ్యారు. ఆ అల్లర్లు, ఊచకోతలో ముఖ్యమంత్రి మోడీ, ఆయన మంత్రివర్గ సహచరులు సహా 63 మంది పాత్ర ఉందని ఎహసాన్ జాఫ్రీ భార్య జాకియా జాఫ్రీ 2006లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దాంతో సుప్రీంకోర్టు సీబీఐ మాజీ డెరైక్టర్ ఆర్కే రాఘవన్ నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేసి, జాకియా ఆరోపణల నిగ్గు తేల్చమని ఆదేశించింది. దర్యాప్తు ప్రారంభించిన సిట్.. 2010 మార్చిలో మోడీని కూడా దాదాపు పదిగంటల పాటు ప్రశ్నించి సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. ఆ నివేదికను పరిశీలించిన కోర్టు.. రాజు రామచంద్రన్ను అమికస్ క్యూరీగా నియమించి, సిట్ దర్యాప్తుపై స్వతంత్ర విచారణ జరపాలంటూ ఆదేశించింది. ఆ నివేదిక అందిన తరువాత.. రెండు నివేదికలను పరిశీలించి తుది నివేదికను అహ్మదాబాద్లోని మెట్రోపాలిటన్ కోర్టులో సమర్పించాలని 2011 సెప్టెంబర్ 12న సిట్ను ఆదేశించింది. ఆ మేరకు 2012 ఫిబ్రవరి 8న సిట్ తమ తుది నివేదికను స్థానిక కోర్టుకు అందించింది. -
జగన్ రాకతో ఆ ముగ్గురికి రిలీఫ్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,కడప లోక్సభ సభ్యుడు జగన్మోహన రెడ్డి బెయిలుపై విడుదల కావడంతో ముఖ్యంగా ముగ్గురు మహిళలకు ఎంతో రిలీఫ్ లభించింది. ఆయన విడుదల కావడంతో రాష్ట్రంలో అత్యధికులు ఆనందం వ్యక్తం చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు అందరూ సంతోషించారు. అయితే అందరికంటే ముఖ్యంగా ఆ ముగ్గురు మహిళల సంతోషానికి అవధులులేవు. ఆయన జైలుకు వెళ్లినప్పటి నుంచి ఆ ముగ్గురిపైనే అధిక భారం పడింది. ఒకరు రాజకీయ భారం మోస్తే, మరొకరు వ్యాపార బాధ్యతలు నిర్వహించారు. ఇంకొకరు ఆయన బాటలో నడిచి బాధలలో ఉన్న ప్రజలను ఓదార్చారు. వారిలో ఒకరు జగన్ తల్లి విజయమ్మ కాగా, రెండవ వారు ఆయన సతీమణి భారతి, మూడవ వారు చెల్లి షర్మిల. విజయమ్మ: జగన్ జైలుకు వెళ్లడంతో విజయమ్మ అనివార్యంగా రాజకీయ బాధ్యతలు స్వీకరించవలసి వచ్చింది. పార్టీ గౌరవాధ్యక్షురాలిగా రైతులు, చేనేత కార్మికుల సమస్యలపైన, విద్యుత్ సమస్యపైన పోరాడారు. దీక్షలు చేశారు. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశారు. ముఖ్య నేతల సహకారంతో పార్టీని నడిపించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీకి సారధ్యం వహించి ఆశించిన స్థాయిలో విజయం సాధించారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ గుంటూరులో అమరణ నిరాహారదీక్ష చేశారు. ఆ తరువాత ఆ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. రాష్ట్రాన్ని విభజించవద్దని ప్రధానికి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలకు లేఖలు రాశారు. ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రిని, రాష్ట్రపతిని కలిసి వినతి పత్రాలు సమర్పించారు. రాష్ట్ర విభజన వల్ల తలెత్తే సమస్యలను వివరించారు. రాష్ట్రాన్ని విడగొట్టవద్దని కోరారు. షర్మిల: ప్రపంచంలో ఏ మహిళ చేయని విధంగా షర్మిల 3 వేల కిలోమీటర్లకుపైగా సుదీర్ఘ పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించారు. ఇంటిని, కుటుంబాన్ని, పిల్లలను వదిలి తండ్రి, అన్న ఆశయాల కోసం జనం వద్దకు వెళ్లారు. వారికి ధైర్యం చెప్పారు. ఎండనక, వాననక, కాలికి గాయం అయినా లెక్కచేయకుండా శస్త్ర చికిత్స చేయించుకొనిమరీ ఆమె దీర్ఘకాలం నడిచారు. మహిళలు శక్తిస్వరూపిణులుగా, సంకల్ప బలంగలవారుగా నిరూపించారు.14 జిల్లాలలో, 107 శాసనసభ నియోజకవర్గాలలో 17 వందలకు పైగా గ్రామాలలో ఆమె నడిచారు. కోట్ల మంది ప్రజలను కలిశారు. రైతులు, కూలీలు, చేనేత కార్మికులు, అన్ని రకాల చేతి వృత్తుల వారిని, విద్యార్థులను, వృద్ధులను, గృహిణులను.... కలుసుకొని వారి బాధలను, సమస్యలను తెలుసుకున్నారు. జగనన్న ముఖ్యమంత్రి అవుతారని, మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని, పేదలందరికీ మళ్లీ మంచిరోజులు వస్తాయని భరోసా ఇచ్చారు. ఆ తరువాత సమైక్యాంధ్ర కోసం బస్సు యాత్ర చేశారు. సమన్యాయం చేయలేనప్పుడు విడగొట్టే హక్కులేదని కేంద్రానికి చెప్పారు. సమైక్యవాదులకు అండగా నిలిచారు. భారతి: జగన్ వ్యాపార బాధ్యతలన్నీ ఆమె అనివార్యంగా స్వీకరించారు. ఎంబిఏ పూర్తి చేసిన భారతి వ్యాపార వ్యవహారాలను ఎంతో దైర్యంగా, సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. ఒక వైపు పిల్లల సంరక్షణ చూసుకుంటూనే ఆమె సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ, ఇతర వ్యాపార లావాదేవీలను చూస్తున్నారు. క్లిష్ట పరిస్థితులలో కూడా ఆమె ధైర్యం సడలలేదు. జన సంక్షేమం కోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని హెచ్ఎం టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారతి చెప్పారు. జగన్ జైలులో ఉండి కూడా రాష్ట్రం కోసం ఆమరణ దీక్ష చేశారు. ఆ సమయంలో ఆయన ఆరోగ్యం క్షీణించిన తరువాత ఆస్పత్రిలో చేర్చిన సమయంలో ఆమె ఎంత బాధపడ్డారో ఆమెకే తెలియాలి. అయినా ధైర్యంగా నిలిచారు. నేరం రుజువు కాకుండానే జగన్ 485 రోజులు జైలులో ఉన్నారు. ఆయనకు బెయిల్ రాకుండా ప్రతిసారీ కాంగ్రెస్, టిడిపి నేతలు ఏదో ఒక ఆటంకం కల్పించారు. అడ్డుకుంటూ వచ్చారు. వారు ఎన్ని చేసి, ఎంతకాలం జైలులో ఉంచగలరు? దేవుడు జగన్ పక్షాన నిలిచాడు. న్యాయం జగన్ పక్షాన ఉంది. ఆలస్యంగా అయినా న్యాయమే గెలుస్తుందని రుజువైంది. 16 నెలల తర్వాత ఈ నెల 23న ఆయనకు బెయిల్ మంజూరైంది. ఎట్టకేలకు జగన్ 24న విడుదలయ్యారు. జగన్ రాత్రి 9.30 గంటలకు లోటస్పాండ్లోని తన నివాసానికి వెళ్లినప్పుడు ఆ ఆనంద క్షణాలలో ఆ ముగ్గురి కళ్లలోని ఆనందం చూసి తీరవలసిందే. -
సూడాన్లో వరదల వల్ల లక్షన్నర మంది నిరాశ్రయులు
గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సూడాన్ను వరదలు ముంచెత్తాయి. ఆ వరదల వల్ల ఆచూకీ తెలియకుండా పోయిన వారి సంఖ్య ఇంకా స్పష్టంగా తెలియలేదని ఐక్యరాజ్యసమితికి చెందిన భాగస్వామ్య సంస్థలు మంగళవారం వెల్లడించాయి. ఆ వరదల కారణంగా దాదాపు లక్షన్నర మంది ప్రజలు నిరాశ్రయులైయ్యారని పేర్కొంది. అయితే వరదల్లో చికుక్కున్న వారిని సహాయక చర్యల్లో భాగంగా పునారావాస కేంద్రాలకు తరలించినట్లు తెలిపాయి. పునరావాస కేంద్రాల్లో బాధితులకు మొబైల్ ఆరోగ్య కేంద్రాలు, పారిశుద్ధ్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పాయి. స్థానికంగా ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా వివిధ చర్యలు చేపట్టినట్లు వివరించింది. కాగా వరద బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నాయి. ఈ నెల ఆరంభం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఎనిమిది రాష్ట్రాల్లోని పాతికవేలకుపైగా ఇళ్లు పూర్తిగా దెబ్బతియన్నాయి. రానున్న రోజుల్లో వర్షాలు ఎడతెరిపిలేకుండా కురుస్తాయని ఐక్యరాజ్యసమితికి చెందిన భాగస్వామ్య సంస్థలు వివరించాయి.