డీఎల్‌ఎఫ్‌కు రూ.13,500 కోట్ల నిధులు | DLF plans Rs3,500 crore QIP, board meet on 1 December | Sakshi
Sakshi News home page

డీఎల్‌ఎఫ్‌కు రూ.13,500 కోట్ల నిధులు

Published Thu, Nov 30 2017 1:17 AM | Last Updated on Thu, Nov 30 2017 1:17 AM

DLF plans Rs3,500 crore QIP, board meet on 1 December - Sakshi

న్యూఢిల్లీ:  డీఎల్‌ఎఫ్‌ డైరెక్టర్ల బోర్డ్‌ సమావేశం వచ్చే నెల 1న జరగనున్నది. క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌(క్విప్‌) విధానంలో నిధుల సమీకరణ, ప్రమోటర్లకు వారంట్లు, డిబెంచర్ల జారీ తదితర అంశాలను ఈ సమావేశంలో చర్చిస్తారు. వారంట్లు, డిబెంచర్ల ద్వారా ప్రమోటర్లు ఈ కంపెనీలో రూ.10,500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నారు. క్విప్‌ ద్వారా రూ.3,000 కోట్లు సమీకరించనున్నారు. మొత్తం 13,500 కోట్లు పెట్టుబడులు డీఎల్‌ఎఫ్‌కు రానున్నాయి. ఈ నిధులను భారీగా పేరుకుపోయిన రూ.27,000 కోట్ల నికర రుణ భారాన్ని తగ్గించుకోవడానికి వినియోగించుకోవాలని కంపెనీ యోచిస్తోంది.  ఈ ఏడాది ఆగస్టులో డీఎల్‌ఎఫ్‌ ప్రమోటర్లు.. డీఎల్‌ఎఫ్‌ సైబర్‌ సిటీ డెవలపర్స్‌(ఇది డీఎల్‌ఎఫ్‌ రెంటల్‌ విభాగం)లో 40 శాతం వాటాను రూ.11,900 కోట్లకు విక్రయించారు. ఈ నిధులనే ఇప్పుడు వారంట్లు, డిబెంచర్ల ద్వారా డీఎల్‌ఎఫ్‌లో పెట్టుబడులు పెడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement