DLF
-
భారత్కు టెస్లా.. ఢిల్లీలో షోరూం కోసం అన్వేషణ!
ఎలాన్ మస్క్కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా భారత్లో ఉనికిని నెలకొల్పడానికి ప్రయత్నాలను పునఃప్రారంభించింది. దేశ రాజధాని ఢిల్లీలో షోరూమ్ స్థలం కోసం ఎంపికలను అన్వేషిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో భారత్లో తన పెట్టుబడి ప్రణాళికలకు బ్రేక్ ఇచ్చిన టెస్లా మళ్లీ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లుగా తెలుస్తోంది.భారత్లోకి ప్రవేశించే ప్రణాళికలను టెస్లా గతంలో విరమించుకుంది. గత ఏప్రిల్లో మస్క్ పర్యటించాల్సి ఉండగా అది రద్దయింది. ఆ పర్యటనలో ఆయన 2-3 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటిస్తారని భావించారు. అదే సమయంలో అమ్మకాలు మందగించడంతో టెస్లా తన శ్రామిక శక్తిని 10 శాతం తగ్గించుకోవాలని నిర్ణయించింది.రాయిటర్స్ రిపోర్ట్ ప్రకారం.. టెస్లా ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో షోరూమ్, ఆపరేషనల్ స్పేస్ కోసం దేశంలో అతిపెద్ద ప్రాపర్టీ డెవలపర్ అయిన డీఎల్ఎఫ్తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. సంస్థ దక్షిణ ఢిల్లీలోని డీఎల్ఎఫ్ అవెన్యూ మాల్, గురుగ్రామ్లోని సైబర్ హబ్తో సహా పలు ప్రదేశాలను అన్వేషిస్తోంది.వాహన డెలివరీలు, సర్వీసింగ్ సదుపాయంతో పాటు కస్టమర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు కోసం 3,000 నుండి 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్థలం కోసం టెస్లా చూస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికీ ఏదీ ఖరారు కాలేదని, ఇందు కోసం కంపెనీ ఇతర డెవలపర్లతో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.భారత్లోకి టెస్లా ప్రవేశం సవాళ్లతో నిండి ఉంది. ముఖ్యంగా దిగుమతి సుంకాల విషయంలో ఇబ్బందులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టెస్లా.. 100 శాతం వరకు ఉన్న అధిక పన్ను రేటుతో దిగుమతులను కొనసాగిస్తుందా లేదా నిర్దిష్ట ఈవీ దిగుమతులపై 15 శాతం తగ్గింపు సుంకాలను అనుమతించే ప్రభుత్వ కొత్త విధానాలను ఉపయోగించుకుంటుందా అనేది అస్పష్టంగా ఉంది. -
లగ్జరీ ప్రాపర్టీలకు డిమాండ్.. డీఎల్ఎఫ్ లాభం డబుల్
న్యూఢిల్లీ: లగ్జరీ ప్రాపర్టీలకు డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో సెప్టెంబర్ త్రైమాసికంలో రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్ నికర లాభం రెండు రెట్లు పెరిగి రూ. 1,381 కోట్లకు చేరింది. గత క్యూ2లో ఇది రూ. 622 కోట్లు.సమీక్షాకాలంలో మొత్తం ఆదాయం 48 శాతం పెరిగి రూ. 1,476 కోట్ల నుంచి రూ. 2,181 కోట్లకు చేరింది. ప్రథమార్ధంలో నికర లాభం రూ. 1,150 కోట్ల నుంచి రూ. 2,027 కోట్లకు ఎగిసింది. మొత్తం ఆదాయం రూ. 2,998 కోట్ల నుంచి రూ. 3,910 కోట్లకు చేరింది.మార్కెట్ క్యాపిటలైజేషన్లో డీఎల్ఎఫ్ దేశంలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ.ఇది ప్రాథమికంగా రెసిడెన్షియల్ ప్రాపర్టీల అభివృద్ధి, విక్రయాలతోపాటు కమర్షియల్, రిటైల్ ప్రాపర్టీల అభివృద్ధి, లీజింగ్ వ్యాపారంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. -
రియల్టీ బుకింగ్స్ జోరు
న్యూఢిల్లీ: రియల్టీ రంగ దిగ్గజాలు ప్రాపరీ్టల అమ్మకాలలో గత ఆర్థిక సంవత్సరం(2023–24) స్పీడందుకున్నాయి. 18 లిస్టెడ్ కంపెనీలు మొత్తం రూ. 1.17 లక్షల కోట్ల విలువైన బుకింగ్స్ను సాధించాయి. ఈ జాబితాలో గోద్రెజ్ ప్రాపరీ్టస్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, డీఎల్ఎఫ్, మాక్రోటెక్ డెవలపర్స్, సిగ్నేచర్ గ్లోబల్ తదితరాలు అగ్రపథంలో నిలిచాయి. గోద్రెజ్ ప్రాపర్టీస్ రూ. 25,527 కోట్ల విలువైన అమ్మకాల బుకింగ్స్ సాధించి తొలి స్థానాన్ని పొందింది. అంతక్రితం ఏడాది(2022–23)తో పోలిస్తే కొద్దిపాటి కంపెనీలను మినహాయిస్తే ప్రధాన సంస్థలన్నీ అమ్మకాల బుకింగ్స్లో జోరు చూపాయి. ఇందుకు ప్రధానంగా రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు పుట్టిన పటిష్ట డిమాండ్ కారణమైంది. ప్రధాన నగరాలలో ప్రత్యేకంగా విలాసవంత గృహాలకు భారీ డిమాండ్ కనిపించడం తోడ్పాటునిచి్చంది! శోభా, బ్రిగేడ్, పుర్వంకారా.. రియల్టీ రంగ లిస్టెడ్ దిగ్గజాలలో గతేడాది ప్రెస్టీజ్ ఎస్టేట్స్ రూ. 21,040 కోట్ల అమ్మకాల బుకింగ్స్తో రెండో ర్యాంకులో నిలిచింది. ఇక డీఎల్ఎఫ్ రూ. 14,778 కోట్లు, లోధా బ్రాండ్ మాక్రోటెక్ రూ. 14,520 కోట్లు, గురుగ్రామ్ కంపెనీ సిగ్నేచర్ గ్లోబల్ రూ. 7,270 కోట్లు చొప్పున ప్రీసేల్స్ సాధించి తదుపరి స్థానాల్లో నిలిచాయి. ఈ బాటలో బెంగళూరు సంస్థ శోభా లిమిటెడ్ రూ. 6,644 కోట్లు, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ రూ. 6,013 కోట్లు, పుర్వంకారా రూ. 5,914 కోట్లు, ముంబై కంపెనీ ఒబెరాయ్ రియల్టీ రూ. 4,007 కోట్లు, కోల్టే పాటిల్ రూ. 2,822 కోట్లు, మహీంద్రా లైఫ్సై్పస్ రూ. 2,328 కోట్లు, కీస్టోన్ రియల్టర్స్ రూ. 2,266 కోట్లు, సన్టెక్ రియల్టీ రూ. 1,915 కోట్లు చొప్పున అమ్మకాల బుకింగ్స్ నమోదు చేశాయి. ఇదేవిధంగా ఏషియానా హౌసింగ్ రూ. 1,798 కోట్లు, అరవింద్ స్మార్ట్స్పేసెస్ రూ. 1,107 కోట్లు, అజ్మీరా రియల్టీ అండ్ ఇన్ఫ్రా రూ. 1,017 కోట్లు, ఎల్డెకో హౌసింగ్ రూ. 388 కోట్లు, ఇండియాబుల్స్ రియల్టీ రూ. 280 కోట్లు చొప్పున బుకింగ్స్ అందుకున్నాయి. అయితే ఒమాక్సే తదితర కొన్ని కంపెనీల వివరాలు వెల్లడికావలసి ఉంది. ఇతర దిగ్గజాలు.. ఇతర దిగ్గజాలలో టాటా రియల్టీ అండ్ ఇన్ఫ్రా, అదానీ రియలీ్ట, పిరమల్ రియల్టీ, హీరానందానీ గ్రూప్, ఎంబసీ గ్రూప్, కే రహేజా గ్రూప్ తదితరాలు నాన్లిస్టెడ్ కంపెనీలుకావడంతో త్రైమాసిక, వార్షిక బుకింగ్స్ వివరాలు వెల్లడించని సంగతి తెలిసిందే. కాగా.. కోవిడ్–19 తదుపరి సొంత ఇంటికి ప్రాధాన్యత పెరగడంతో హౌసింగ్ రంగం ఊపందుకున్నట్లు రియల్టీ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో పటిష్టస్థాయిలో ప్రాజెక్టులను పూర్తిచేసే కంపెనీల ప్రాపరీ్టలకు డిమాండు పెరిగినట్లు తెలియజేశారు. వెరసి బ్రాండెడ్ గృహాలవైపు కన్జూమర్ చూపుసారించడం లిస్టెడ్ కంపెనీలకు కలసి వస్తున్నట్లు తెలియజేశారు. గతంలో యూనిటెక్, జేపీ ఇన్ఫ్రాటెక్ తదితరాల హౌసింగ్ ప్రాజెక్టులు పూర్తికాకపోగా.. విఫలంకావడంతో గృహ కొనుగోలుదారులు ధర అధికమైనా రిస్్కలేని వెంచర్లకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు.33 శాతం వృద్ధిబలమైన కన్జూమర్ డిమాండ్ నేపథ్యంలో గతేడాది దేశీ రియల్టీ రంగంలో రికార్డ్ ప్రీసేల్స్ నమోదయ్యాయి. ఆయా కంపెనీల సమాచారం ప్రకారం లిస్టెడ్ రియల్టీ కంపెనీలు ఉమ్మడిగా రూ. 1,16,635 కోట్ల సేల్స్ బుకింగ్స్ను సాధించాయి. 2022–23లో నమోదైన రూ. 88,000 కోట్ల బుకింగ్స్తో పోలిస్తే ఇది 33 శాతం అధికం. జాబితాలో శోభా, బ్రిగేడ్, పుర్వంకారా, ఒబెరాయ్ రియలీ్ట, మహీంద్రా లైఫ్స్పేస్, కోల్టేపాటిల్, సన్టెక్, కీస్టోన్ రియల్టర్స్ తదితరాలు చేరాయి. పటిష్ట బ్రాండ్ గుర్తింపు, డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో, పెట్టుబడుల సులభ సమీకరణ కారణంగా లిస్టెడ్ రియల్టీ కంపెనీలు ఆకర్షణీయ పనితీరు చూపగలుగుతున్నట్లు హౌసింగ్.కామ్, ప్రాప్టైగర్ సీఈవో ధ్రువ్ అగర్వాల్ పేర్కొన్నారు. దీనికితోడు ఆధునిక టెక్నాలజీలతో మార్కెటింగ్, అమ్మకాలు చేపట్టడం, మెరుగైన కస్టమర్ సరీ్వసులు తదితరాల ద్వారా మార్కెట్ వాటాను కైవసం చేసుకుంటున్నట్లు తెలియజేశారు. వెరసి నాన్లిస్టెడ్ లేదా చిన్న కంపెనీలకంటే పైచేయి సాధించగలుగుతున్నట్లు వివరించారు. -
మూడు రోజుల్లో 795 ఫ్లాట్లు అమ్మిన డీఎల్ఎఫ్.. ఎక్కడంటే..
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ డీఎల్ఎఫ్ మూడు రోజుల్లోనే గురుగ్రామ్లో రూ.5,590 కోట్ల విలువైన 795 లగ్జరీ ఫ్లాట్లు విక్రయించింది. కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం..డీఎల్ఎఫ్ గురుగ్రామ్లో 'డీఎల్ఎఫ్ ప్రివానా వెస్ట్' అనే కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించింది. ఇందులో భాగంగా లగ్జరీ ఫ్లాట్లను నిర్మించారు.ఫ్లాట్ల అమ్మకాలు ప్రారంభించిన మూడు రోజుల్లోనే మొత్తం 795 ఫ్లాట్లు విక్రయించారు. వాటి విలువ రూ.5,590 కోట్లుగా ఉంది. ఈ ప్రాజెక్ట్ను 116 ఎకరాల డీఎల్ఎఫ్ టౌన్షిప్లో భాగంగా 12.57 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ సంస్థ గతంలో ప్రివానా సౌత్లో నిర్మించిన 1,113 ఫ్లాట్లను మూడురోజుల్లో విక్రయించి రూ.7,200 కోట్లు సమకూర్చుకుంది.ఇదీ చదవండి: సిక్ లీవ్ తీసుకున్న ఉద్యోగుల తొలగింపుడీఎల్ఎఫ్ హోమ్ డెవలపర్స్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఆకాష్ ఓహ్రి మాట్లాడుతూ..ఫ్లాట్ల విక్రయానికి సంబంధించి వినియోగదారుల నుంచి మంచి స్పందన వచ్చినట్లు సంతృప్తి వ్యక్తం చేశారు. వీటిని ఎక్కువగా ఎన్ఆర్ఐలే కొనుగోలు చేసినట్లు తెలిపారు. -
ఒక్క ఫ్లాట్.. రిజిస్ట్రేషన్ ఖర్చులే రూ.5 కోట్లు! ఎవరీ బిజినెస్ లేడీ?
Gurugram Property Deal : దేశ రియల్ ఎస్టేట్లో ఖరీదైన డీల్స్లో ఒకటి తాజాగా జరిగింది. ఇటీవల గురుగ్రామ్లోని అపార్ట్మెంట్ రూ.95 కోట్లకు అమ్ముడుపోయింది. దీనికి రిజిస్టేషన్ ఖర్చులే రూ.5 కోట్లకు పైగా అయినట్లు తెలుస్తోంది. ఈ ఖరీదైన ఫ్లాట్ను ఓ బిజినెస్ లేడీ కొనుగోలు చేశారు. ఇంతకీ ఎవరీమె.. ఆ డీల్ విశేషాల్లేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. వెస్బాక్ లైఫ్స్టైల్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్, వీ బజార్ సీఎండీ హేమంత్ అగర్వాల్ సతీమణి స్మితి అగర్వాల్ గురుగ్రామ్లోని డీఎల్ఎఫ్ ది కామెలియాస్లో అపార్ట్మెంట్ను 95 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు. రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ అయిన సీఆర్ఈ మ్యాట్రిక్స్ సంపాదించిన పత్రాల ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. స్మితి అగర్వాల్ పేరు మీద సేల్ డీడ్ 2024 జనవరి 18న ఖరారైంది. లావాదేవీలో భాగంగా ఆమె రూ. 4.75 కోట్ల స్టాంప్ డ్యూటీని, రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 50,003 చెల్లించారు. పత్రాల ప్రకారం.. 10,813 చదరపు అడుగుల అపార్ట్మెంట్ డీఎల్ఎఫ్ ది కామెలియాస్లో ఉంది. ఇది గురుగ్రామ్లోని గోల్ఫ్ కోర్స్ రోడ్, డీఎల్ఎఫ్ ఫేజ్ 5లో ఉన్న ఒక ఉన్నత స్థాయి లగ్జరీ కండోమినియం. అదనంగా అపార్ట్మెంట్లో ఐదు పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. ఈ ప్రాపర్టీని చదరపు అడుగు రూ.87,857.20 చొప్పున విక్రయించారు. గురుగ్రామ్ ఉన్న ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో అనేక ఖరీదైన, లగ్జరీ ఆస్తి లావాదేవీలు జరిగాయి. ఇటీవలి డీల్స్ గురుగ్రామ్ గోల్ఫ్ కోర్స్ రోడ్లోని డీఎల్ఎఫ్ ది కామెలియాస్ వద్ద 2023 అక్టోబరు3లో 11,000 చదరపు అడుగుల అపార్ట్మెంట్ను రీసేల్ చేయడం ద్వారా రూ. 100 కోట్లకుపైగా లభించింది. అదే నెలలో మేక్మైట్రిప్ గ్రూప్ సీఈవో రాజేష్ మాగో గురుగ్రామ్లోని డీఎల్ఎఫ్ మాగ్నోలియాస్లోని 6,428 చదరపు అడుగుల అపార్ట్మెంట్ను రూ. 33 కోట్లకు కొనుగోలు చేశారు. అలాగే జెన్పాక్ట్ మానవ వనరుల అధిపతి పీయూష్ మెహతా అదే కాంప్లెక్స్లో 6,462 చదరపు అడుగుల ఫ్లాట్ను రూ. 32.60 కోట్లకు కొనుగోలు చేశారు. 2023 ఫిబ్రవరిలో భారత మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సతీమణి వసుధ రోహత్గీ ఢిల్లీలోని ప్రతిష్టాత్మకమైన గోల్ఫ్ లింక్స్ ప్రాంతంలో 2,100 చదరపు గజాల బంగ్లాను రూ. 160 కోట్లకు కొనుగోలు చేశారు. -
Gachibowli: ఆర్టీసీ బస్సు కిందపడి టెక్కీ దుర్మరణం
హైదరాబాద్: బైక్ అదుపు తప్పి ఆర్టీసీ బస్సు వెనక చక్రాల కింద పడి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి చెందిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ శోభన్ బాబు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ, ఆటోనగర్కు చెందిన ఆకుల సాయికృష్ణ(26) గచ్చిబౌలి జనార్దన్హిల్స్లోని సునీతా రెడ్డి లగ్జరీ మెన్స్ హాస్టల్లో ఉంటూ గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం అతను బైక్పై డీఎల్ఎఫ్ వైపు వెళుతుండగా, రాయదుర్గం నుంచి డీఎల్ఎఫ్ వైపు వస్తున్న హెచ్సీయూ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేసే క్రమంలో బైక్ అదుపు తప్పి కిందçపడ్డాడు. బస్సు వెనుక చక్రాలు అతడి తలమీదుగా వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
డీఎల్ఎఫ్ పనితీరు ఫర్వాలేదు
న్యూఢిల్లీ: ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ డీఎల్ఎఫ్ డిసెంబర్ త్రైమాసికానికి మెరుగైన పనితీరును నమోదు చేసింది. కన్సాలిడేటెడ్ లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 27 శాతం వృద్ధితో రూ.666 కోట్లుగా నమోదైంది. ఆదాయం 6 శాతం వృద్ధితో రూ.1,643 కోట్లకు చేరింది. వ్యయాలు మాత్రం రూ.1,152 కోట్ల నుంచి రూ.1,132 కోట్లకు పరిమితం అయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.518 కోట్లు, ఆదాయం రూ.1,560 కోట్ల చొప్పున ఉన్నాయి. ఢిల్లీలోని కంపెనీ కార్యాలయ భవనం ‘డీఎల్ఎఫ్ సెంటర్’ను గ్రూపు సంస్థ డీఎల్ఎఫ్ సైబర్ సిటీ డెవలపర్స్ (డీసీసీడీఎల్)కు రూ.825 కోట్లకు విక్రయించేందుకు బోర్డ్ ఆమోదం తెలిపింది. ‘‘రెంటల్ వ్యాపారాన్ని (అద్దె ఆదాయాన్నిచ్చే ఆస్తులు) స్థిరీకరించే వ్యూహంలో భాగంగా డీఎల్ఎఫ్ సెంటర్ విక్రయ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్టు సంస్థ వివరణ ఇచి్చంది. డీసీసీడీఎల్ అనేది డీఎల్ఎఫ్, సింగపూర్ సావరీన్ వెల్త్ ఫండ్ జీఐఎస్ జాయింట్ వెంచరీ కావడం గమనార్హం. ఇందులో డీఎల్ఎఫ్కు 67 శాతం వాటా ఉంది. ఒక త్రైమాసికంలో అత్యధిక విక్రయాలు (బుకింగ్లు) రూ,9,407 కోట్లు నమోదైనట్టు డీఎల్ఎఫ్ ప్రకటించింది. గురుగ్రామ్లో కొత్త ప్రాజెక్టు ఆరంభించిన మూడు రోజుల్లోనే 1,113 లగ్జరీ అపార్ట్మెంట్లు రూ.7,200 కోట్లకు అమ్ముడుపోయినట్టు తెలిపింది. బీఎస్ఈలో డీఎల్ఎఫ్ షేరు ఒక శాతం లాభంతో రూ.747 వద్ద ముగిసింది. -
‘హౌస్’ ఫుల్! రూ.7,200 కోట్ల ఇళ్లు మూడు రోజుల్లో కొనేశారు..
దేశంలో లగ్జరీ ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్కు నిదర్శనం ఇది. దేశ రాజధాని న్యూఢిల్లీకి సమీపంలో ఓ రియల్ ఎస్టేట్ డెవలపర్ చేపట్టిన రూ.7,200 కోట్ల విలువైన ప్రాజెక్ట్లోని మొత్తం 1,113 లగ్జరీ అపార్ట్మెంట్లు మూడు రోజుల్లోనే అమ్ముడైపోయాయి. అది కూడా నిర్మాణం ప్రారంభం కాకముందే.. శాటిలైట్ సిటీలో.. దేశంలో అతిపెద్ద రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన డీఎల్ఎఫ్ లిమిటెడ్ (DLF Ltd.) గురుగ్రామ్లోని 1,113 విలాసవంతమైన నివాసాలను కేవలం మూడు రోజుల్లో విక్రయించింది. ఇందులో పావు వంతు ఇళ్లను ప్రవాస భారతీయులు కొనడం విశేషం. డీఎల్ఎఫ్ ప్రివానా సౌత్ ప్రాజెక్ట్లోని ఏడు టవర్లలో అన్ని నాలుగు-పడక గదుల ఫ్లాట్లు, పెంట్హౌస్ యూనిట్లు అమ్ముడయ్యాయని డీఎల్ఎఫ్ తమ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో తెలిపింది. గూగుల్, అమెరికన్ ఎక్స్ప్రెస్తో సహా అనేక మల్టీనేషనల్ కంపెనీలకు నిలయమైన శాటిలైట్ సిటీలో 116 ఎకరాల్లో ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ విస్తరించి ఉంది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో పెరుగుతున్న ఆదాయ స్థాయిలతో విలాసవంతమైన కార్ల నుంచి ఖరీదైన నివాసాల వరకు గణనీయంగా అమ్మడవుతున్నాయి. ప్రీమియం అపార్ట్మెంట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్ ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి కీలక నగరాల్లో ఇలాంటి మరిన్ని ప్రాజెక్టులను ప్రారంభించేందుకు బిల్డర్లను ప్రేరేపిస్తోంది. గతేడాదిలోనూ.. కాగా గత సంవత్సరంలోనూ డీఎల్ఎఫ్ ఇదేవిధంగా కేవలం మూడు రోజుల్లో సుమారు రూ.100 కోట్ల విలువైన 1,100 అపార్ట్మెంట్లను విక్రయించింది. మరొక అగ్ర డెవలపర్ గోద్రెజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ కూడా ఢిల్లీ సమీపంలోని ప్రాజెక్ట్లలో సుమారు రూ.5వేల కోట్ల విలువైన విలాసవంతమైన నివాసాలను విక్రయించింది. -
డీఎల్ఎఫ్ ఫుడ్ కోర్టుల్లో తనిఖీలు.. విస్తుపోయే అంశాలు
కుళ్లిపోయిన పండ్లతో జ్యూసులు.. నాసిరకం పన్నీరుతో రకరకాల వంటకాలు.. కూరలు, గ్రేవీల్లో నాసిరకం మసాలాలు.. కలర్ కలిపిన టీ పొడితో ఛాయ్.. వంటనూనె నాణ్యతలోనూ లేని కనీస ప్రమాణాలు.. ఇక శుభ్రత సంగతి అంటారా? బాబోయ్.. ఇవీ హైదరాబాద్ డీఎల్ఎఫ్ ఫుడ్ కోర్టుల్లో తాజాగా ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో బయటపడ్డ విషయాలు. అర్ధరాత్రి దాకా కూడా వేడి వేడి ఆహారం కోసం ఐటీ ఉద్యోగులు సహా ఆహార ప్రియుల సందడి కనిపిస్తుంటుందక్కడ. రేటు ఎంతైనా ఫర్వాలేదనుకునే జనాలే ఎక్కువ కనిపిస్తారక్కడ. వాళ్లకు తగ్గట్లే పుట్టగొడుగుల్లా ఫుడ్కోర్టులు వెలిశాయి. కానీ, ఆ డిమాండ్ను క్యాష్ చేసుకునేందుకు వెంపర్లాడుతున్న ఫుడ్ కోర్ట్ సెంటర్ నిర్వాహకులు, కనీస నాణ్యతా ప్రమాణాలు మాత్రం పాటించడం లేదు. న్యూస్ పేపర్లో ఫుడ్ను అందించొద్దనే నిబంధనల నుంచి.. కంప్లయింట్ కోసం ఉద్దేశించిన టోల్ ఫ్రీ నెంబర్ను సైతం ప్రస్తావించకుండా వ్యవహరిస్తున్నారు. తాజాగా.. డీఎల్ఎఫ్ ఫుడ్ కోర్టులలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కుళ్లిపోయిన పళ్లతో రసాలు చేసి విక్రయిస్తుండడం.. అలాగే నాసిరకం మసాలాలతో ఆహార పదార్థాల తయారీ, టీ పొడిలో కలర్ గ్రాన్యూల్స్ కలిపి టీ విక్రయాలు(ఇది క్యాన్సర్కు దారి తీయొచ్చని ప్రచారం నిపుణులు చెబుతుంటారు). డీఎల్ఎఫ్ సమీపంలో ఫుడ్ కోర్టుల్లో ఆహార నాణ్యతపై ట్విటర్లో అందించిన ఫిర్యాదు మేరకే ఈ తనిఖీలు జరిగినట్లు తెలుస్తోంది. డీఎల్ఎఫ్ వద్ద సుమారు 150 ఫుడ్ కోర్టులు ఉండగా.. అందులో చాలావాటికి అనుమతులు లేవు. దీంతో ఆయా యజమానులకు నోటీసులు జారీ చేశారు. -
దాతృత్వ హీరోల్లో నీలేకని, కామత్..
న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, డీఎల్ఎఫ్ గౌరవ చైర్మన్ కేపీ సింగ్, జిరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ వంటి దిగ్గజాలు సంపదను సమాజ శ్రేయస్సు కోసం కూడా గణనీయంగా ఉపయోగిస్తున్నారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన 17వ ఆసియా దాతృత్వ హీరోల జాబితా (15 మంది)లో వారు చోటు దక్కించుకున్నారు. తాను విద్యాభ్యాసం చేసిన ఐఐటీ బాంబేకి 1999 నుంచి ఇప్పటివరకు నీలేకని రూ.400 కోట్లు విరాళంగా ఇచ్చారు. 2020లో డీఎల్ఎఫ్ చైర్మన్ హోదా నుంచి తప్పుకున్న సింగ్ (92 ఏళ్లు).. కంపెనీలో నేరుగా ఉన్న వాటాలను విక్రయించగా వచి్చన రూ.730 కోట్లను దాతృత్వ కార్యకలాపాలకు కేటాయించారు. జిరోధా కామత్ (37 ఏళ్లు) ‘డబ్ల్యూటీఎఫ్ ఈజ్’ పేరిట వ్యాపార దిగ్గజాలతో నిర్వహించే యూట్యూబ్ పాడ్కాస్ట్ సిరీస్ ద్వారా స్వచ్ఛంద సేవా సంస్థలకు రూ. కోటి వరకు విరాళాలు అందచేస్తున్నారు. -
డీఎల్ఎఫ్లో ఈడీ సోదాలు... ఎందుకంటే?
రియల్టీ రంగ దిగ్గజ సంస్థ అయిన డీఎల్ఎఫ్ కార్యాలయంలో ఈడీ సోదాలు జరిగినట్లు మీడియా కథనాల ద్వారా తెలిసింది. మనీలాండరింగ్ కేసులో డీఎల్ఎఫ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది. నోయిడాలోని ప్రాజెక్ట్లను పూర్తి చేయకుండా గురుగ్రామ్లో ఆస్తులు కొనుగోలు చేయడానికి సూపర్టెక్ గ్రూప్ నిధులు సేకరించింది. సంస్థ ఛైర్మన్ రామ్ కిషోర్ అరోరా గృహ కొనుగోలుదారులు, బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.638 కోట్లను మళ్లించారని ఈడీ జూలైలో పేర్కొంది. అయితే సూపర్టెక్ గ్రూప్తో డీఎల్ఎఫ్ సంస్థకు సంబంధం ఉండడంతో ఈడీ సోదాలు చేసినట్లు సమాచారం. ఈ సోదాలు శనివారం ఉదయం ముగిశాయని, ఈ సందర్భంగా ఈడీ అధికారులు కొన్ని పత్రాలను పరిశీలించారని చెప్పారు. అయితే సూపర్టెక్కు సంబంధించి డీఎల్ఎఫ్ ఏ మేరకు సహకరించింది, ఎలాంటి ఆధారాలు లభ్యమయ్యాయో వివరించలేదు. ఇదీ చదవండి: సాయంత్రం 5 దాటితే కష్టాలే.. ఆ నగరాల్లో దారుణమైన ట్రాఫిక్! ఈ కేసులో ఇప్పటివరకు సుమారు రూ.638.93 కోట్లు నిధులు మళ్లించారని ఈడీ తెలిపింది. దీన్ని సూపర్టెక్ గ్రూప్, దాని ప్రమోటర్లు/ డైరెక్టర్లు తమ గ్రూప్ కంపెనీల ద్వారా తక్కువ ధర ఉన్న భూమిని కొనుగోలు చేసేందుకు ఈ డబ్బును వినియోగించినట్లు ఈడీ వివరించింది. 2013-14లో సర్వ్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని కొనుగోలు చేయడానికి కస్టమర్లు, బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణం మొత్తం రూ.444 కోట్లు వినియోగించారని ఈడీ తెలిపింది. -
డీఎల్ఎఫ్ షేర్లు విక్రయించిన సింగ్
న్యూఢిల్లీ: బిలియనీర్ కేపీ సింగ్సహా.. ప్రమోటర్ సంస్థలు మల్లికా హౌసింగ్ కంపెనీ, బెవర్లీ బిల్డర్స్.. రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్ షేర్లను విక్రయించాయి. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా రూ. 1,087 కోట్ల విలువైన వాటాను మంగళవారం అమ్మివేశాయి. మల్లికా హౌసింగ్లో సింగ్ కుమార్తెలు పియా సింగ్, రేణుకా తల్వార్ ప్రధాన వాటాదారులుకాగా.. బెవర్లీ బిల్డర్స్లో సింగ్ ప్రధాన వాటాదారుగా ఉన్నారు. డీఎల్ఎఫ్లో 0.24 శాతం వాటాకు సమానమైన 60 లక్షల షేర్లను మల్లికా హౌసింగ్, 0.04 శాతం వాటాకు సమానమైన 10.99 లక్షల షేర్లను బెవర్లీ బిల్డర్స్ విక్రయించాయి. బీఎస్ఈ గణాంకాల ప్రకారం కేపీ సింగ్ దాదాపు 1.45 కోట్ల షేర్ల(0.59 శాతం వాటా)ను విక్రయించారు. షేరుకి రూ. 504.21 ధరలో విక్రయించిన వీటి విలువ రూ. 1,087 కోట్లు. జూన్కల్లా కంపెనీలో ప్రమోటర్లు 74.95 శాతం వాటా కలిగి ఉన్నారు. బల్క్ డీల్స్ వార్తల నేపథ్యంలో డీఎల్ఎఫ్ షేరు బీ ఎస్ఈలో 1% నీరసించి రూ. 494 వద్ద ముగిసింది. -
రియల్టీ కింగ్.. డీఎల్ఎఫ్ సింగ్.. లిస్ట్లో తెలుగువారు!
న్యూఢిల్లీ: దేశీ రియల్ ఎస్టేట్ రంగంలో రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్ చైర్మన్ రాజీవ్ సింగ్ అత్యంత సంపన్నుడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. రూ. 59,030 కోట్ల సంపదతో మరోసారి నంబర్వన్ స్థానాన్ని దక్కించుకున్నారు. 2023కి గాను దేశీ రియల్టీ కుబేరులతో కిచెన్, బాత్రూమ్ ఫిట్టింగ్స్ సంస్థ గ్రోహె, రీసెర్చ్ సంస్థ హురున్ ఇండియా సంయుక్తంగా ఈ లిస్టును రూపొందించింది. 16 నగరాలకు చెందిన 67 కంపెనీలకు సంబంధించి 100 మంది సంపన్నులకు ర్యాంకింగ్ ఇచ్చింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి 10 మంది చోటు దక్కించుకున్నారు. జీఏఆర్ కార్పొరేషన్ వ్యవస్థాపక చైర్మన్ జీ అమరేందర్ రెడ్డి కుటుంబం (రూ. 15,000 కోట్లు) పదో స్థానంలో నిల్చింది. మంగళవారం విడుదల చేసిన సంపన్నుల జాబితా ప్రకారం.. రూ. 42,270 కోట్ల సంపదతో మంగళ్ ప్రభాత్ లోధా కుటుంబం (మాక్రోటెక్ డెవలపర్స్ – లోధా గ్రూప్) రెండో స్థానంలో, రూ. 37,000 కోట్ల సంపదతో ఆర్ఎంజెడ్ కార్ప్ అర్జున్ మెండా కుటుంబం మూడో స్థానంలో ఉన్నాయి. ఈసారి లిస్టులో 25 మందికి కొత్తగా చోటు దక్కగా, 36 మంది సంపద తగ్గింది. ఇతర వివరాలు.. రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్రలో అత్యధికంగా 37 మంది రియల్టీ కుబేరులు ఉన్నారు. ఢిల్లీ (23), కర్ణాటక (18) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణలో 9 మంది, ఆంధ్రప్రదేశ్లో ఒక్కరు ఉన్నారు. నగరాలవారీగా చూస్తే ముంబై (29 మంది), న్యూఢిల్లీ (23), బెంగళూరు (18) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. టాప్ 10లో చోటు దక్కించుకునేందుకు కనీస సంపద 2017లో రూ. 3,350 కోట్లుగా ఉండగా ప్రస్తుతం రూ. 15,000 కోట్లకు ఎగిసింది. అలాగే టాప్ 50లో చోటు దక్కించుకునేందుకు కనీస సంపద రూ. 660 కోట్ల నుంచి రూ. 1,330 కోట్లకు చేరింది. టాప్ 100 మంది ఔత్సాహిక వ్యాపారవేత్తల మొత్తం సంపద గతేడాదితో పోలిస్తే 4% పెరిగి రూ. 4,72,330 కోట్లుగా (57 బిలియన్ డాలర్లు) ఉంది. ఇందులో టాప్ 10 కుబేరుల వాటా 60%గా ఉంది. డీఎల్ఎఫ్కు చెందిన పియా సింగ్, రేణుకా తల్వార్ అత్యంత సంపన్న మహిళలుగా ఉన్నారు. ఇదీ చదవండి: Income Tax Return: అందుబాటులోకి ఐటీఆర్ 1, 4 ఫారమ్లు.. గడువు తేదీ గుర్తుందిగా.. -
మూడు రోజుల్లో రూ.8,000 కోట్లు
న్యూఢిల్లీ: రియల్టీ రంగ సంస్థ డీఎల్ఎఫ్ సరికొత్త రికార్డు సృష్టించింది. కంపెనీ గురుగ్రామ్లో ఓ లగ్జరీ ప్రాజెక్టును చేపట్టింది. ప్రీలాంచ్లో ఫిబ్రవరి 15–17 మధ్య కంపెనీ మొత్తం 1,137 ఫ్లాట్స్ను విక్రయించింది. వీటి విలువ రూ.8,000 కోట్లకుపైమాటే. ఒక్కో ఫ్లాట్ రూ.7 కోట్లకుపైగా ఖరీదు చేస్తున్నాయి. భారత రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ రంగంలో ఇదొక చరిత్ర, రికార్డు అని డీఎల్ఎఫ్ సీఈవో అశోక్ త్యాగి వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం రూ.15,000 కోట్ల వ్యాపారం నమోదు చేస్తుందని చెప్పారు. 2021–22లో ఇది రూ.7,273 కోట్లుగా ఉందన్నారు. పదేళ్ల విరామం తర్వాత గురుగ్రామ్ సెక్టార్ 63లో ‘ద ఆర్బర్’ పేరుతో గ్రూప్ హౌజింగ్ ప్రాజెక్టును ఫిబ్రవరిలో ప్రీలాంచ్ చేసింది. ఫిబ్రవరి 24న ఈ ప్రాజెక్టును ఆవిష్కరించాల్సి ఉండగా వారం ముందుగానే మొత్తం ఫ్లాట్స్ను మూడు రోజుల్లో విక్రయించడం విశేషం. అతిపెద్ద కంపెనీగా.. ఫ్లాట్స్ కొనుగోలుకై సుమారు 3,600 మంది ఆసక్తి చూపగా లాటరీ ద్వారా కస్టమర్లను ఎంపిక చేసినట్టు డీఎల్ఎఫ్ తెలిపింది. వినియోగదార్ల నుంచి రూ.800 కోట్లు ఇప్పటికే సమకూరిందని వెల్లడించింది. కార్పొరేట్ కంపెనీల్లో పనిచేస్తున్న ఉన్నతోద్యోగులే 90 శాతం ఫ్లాట్స్ను దక్కించుకున్నారు. ఎన్నారైల వాటా 14 శాతం. వచ్చే నాలుగేళ్లలో 25 ఎకరాల విస్తీర్ణంలోని ఆర్బర్లో 38–39 అంతస్తుల్లో అయిదు టవర్లను నిర్మిస్తారు. ఒక్కొక్కటి 3,950 చదరపు అడుగుల్లో 4 బీహెచ్కే ఫ్లాట్స్ రానున్నాయి. మార్కెట్ క్యాప్లో భారతదేశపు అతిపెద్ద రియల్టీ సంస్థ అయిన డీఎల్ఎఫ్.. ఈ ఆర్థిక సంవత్సరంలో బుకింగ్స్ పరంగా కూడా అతిపెద్ద కంపెనీగా అవతరించనుంది. -
లగ్జరీ ఫ్లాట్లకు ఇంత డిమాండా? మూడు రోజుల్లో రూ. 8 వేల కోట్లతో కొనేశారు!
న్యూఢిల్లీ: లగ్జరీ అపార్టుమెంట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.దేశీయ అతిపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ డీఎల్ఎఫ్ దూసుకుపోతోంది. తాజాగా మూడు రోజుల్లో రూ. 8వేల కోట్లకుపైగా విలువైన లగ్జరీ ఫ్లాట్లను విక్రయించింది. లాంచింగ్ ముందే వీటిని విక్రయించడం విశేషం. (రిలయన్స్ అధినేత అంబానీ కళ్లు చెదిరే రెసిడెన్షియల్ ప్రాపర్టీస్) ప్రీ-ఫార్మల్ లాంచ్ సేల్స్లో భాగంగా గురుగ్రామ్లోని సెక్టార్ 63లో గోల్ఫ్ కోర్స్ ఎక్స్టెన్షన్ వద్ద నిర్మించిన ‘ది అర్బర్’ డీఎల్ఎఫ్ ప్రాజెక్ట్ ఈ ఫీట్ సాధించింది. లాంచింగ్కు మూడు రోజుల ముందుగానే పూర్తి సేల్స్ను నమోదు చేసింది. 25 ఎకరాల్లో నిర్మించిన ఈ ప్రాజెక్ట్లో ఐదు టవర్లు, 38/39 అంతస్తులున్నాయి. ఇందులో 4 BHK 1137 ఫ్లాట్స్ ఉన్నాయి. వీటి ధరలు యూనిట్కు రూ. 7 కోట్ల నుండి ప్రారంభం. (‘నాటు నాటు’ జోష్ పీక్స్: పలు బ్రాండ్స్ స్టెప్స్ వైరల్, ఫ్యాన్స్ ఫుల్ ఫిదా!) తమ ప్రాజెక్ట్కు అద్భతమైన స్పందన లభించిందనీ, డీఎల్ఎఫ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఆకాష్ ఓహ్రి సంతోషం ప్రకటించారు. లగ్జరీ గృహాలు, జీవనశైలి సౌకర్యాలకు పెరుగుతున్న ఆదరణకు ఇది సంకేతమన్నారు. 75 ఏళ్లుగా కస్టమర్ల ఆకాంక్షలకనుగుణంగా శ్రద్ధ, నిబద్ధతతో అందిస్తున్న సేవలు, కొనుగోలుదారుల విశ్వాసం నేపథ్యంలో ప్రాజెక్ట్ కోసం అధిక స్పందన లభిస్తోందన్నారు. ముఖ్యంగా, 95 శాతం మంది కొనుగోలు దారులు తమ తుది వినియోగం కోసం కొనుగోలు చేశారన్నారు.గురుగ్రామ్లో అర్బర్ నిస్సందేహంగా తమకొక మైలురాయి లాంటిదన్నారు. -
ఆ ఇళ్లపై ఇదేం పిచ్చి.. ఎన్ని కోట్లయినా కొనేస్తున్నారు!
విలాసవంతమైన ఇళ్లపై సంపన్నులకు మోజు తగ్గడం లేదు. ధర ఎన్ని కోట్లయినా కొనడానికి వెనకాడటం లేదు. అందుకే అత్యంత విలాసవంతమైన రెసిడెన్సియల్ ప్రాజెక్ట్లను కంపెనీలు ఒకదానికొకటి పోటీ పడి ఏర్పాటు చేస్తున్నాయి. ఇవీ చదవండి: ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్! రూ.295 కట్ అవుతోందా? ఎందుకో తెలుసుకోండి.. హారిబుల్ ఎక్స్పీరియన్స్: జొమాటో మరో నిర్వాకం వెలుగులోకి! గత నెలలో డీఎల్ఎఫ్ గురుగ్రామ్లో 72 గంటల్లో రూ. 8 వేల కోట్లకుపైగా విలువైన 1,137 ఫ్లాట్లను విక్రయించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ సంగతి మరవకముందే గోద్రెజ్ ప్రాపర్టీస్ ఢిల్లీలో రూ.24,575 కోట్ల విలువైన లగ్జరీ ఇళ్లను అమ్మకానికి పెట్టింది. అది కూడా ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే. గోద్రేజ్ సంస్థ ఢిల్లీలోని ఓ ప్రముఖ హోటల్లో కొనుగోలుదారులను ఆహ్వానించి వారికి ప్రాజెక్ట్కు సంబంధించిన త్రీడీ మోడల్ను, వీడియోలను ప్రదర్శించింది. అందులో ఉన్న విలాసవంతమైన సౌకర్యాలను చూపించింది. వీటిలో వేడినీటి కొలను (హాట్ పూల్) వంటి అత్యంత విలాసవంతమైన సౌకర్యాలు ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటి వరకు 160 ఎంపిక చేసిన కస్టమర్లను ఈ ఫ్లాట్లను సందర్శించేందుకు ఆహ్వానించగా ఎనిమిది అంతస్తుల ప్రాజెక్ట్లో 46 ఫ్లాట్లలో 17 అమ్ముడుపోయాయి. తాము విలాసవంతమైన నివాసాలను మాత్రమే విక్రయించడం లేదని, శక్తివంతమైన సమాజాన్ని నిర్మిస్తున్నామని గోద్రెజ్ సేల్స్ మేనేజర్ యువరాజ్ మంచందా పేర్కొన్నారు. తమ అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్లను మిలియనీర్లు, బిలియనీర్లు కొనుగోలు చేస్తారని చెప్పారు. కాగా గురుగ్రామ్లో గతనెల అమ్ముడైన ఫ్లాట్లకు సంబంధించిన పేపర్ వర్క్ ఇటీవలె పూర్తయింది. ఇదీ చదవండి: ఎయిర్టెల్ యూజర్లకు బిగ్ న్యూస్: ఇక మరింత ఫాస్ట్గా ఇంటర్నెట్! -
91 ఏళ్ల వయసులో.. ఎనర్జిటిక్ షీనా లవ్లో బిజినెస్ టైకూన్
సాక్షి, ముంబై: రియల్ ఎస్టేట్ గ్రూప్ డీఎల్ఎఫ్ ఎమెరిటస్ చైర్మన్ కుశాల్ పాల్ సింగ్ (91) మళ్లీ ప్రేమలో పడ్డారు. తనకు ప్రేమ లభించిందంటూ సీఎన్బీసీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. 2018లో కేన్సర్తో తన భార్య చనిపోయిన తరువాత ఒకటి రెండేళ్లు ఒంటరితనంతో బాధపడ్డానని కానీ ఆ తరువాత చాలా గొప్ప వ్యక్తిని కలుసుకోవడం అదృష్టమంటూ తన కొత్త ప్రేమను పరిచయం చేయడం బిజినెస్ వర్గాల్లో విశేషంగా నిలిచింది. 65 ఏళ్ల తరువాత భార్య ఇందిర క్యాన్సర్తో చనిపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని ఒంటరి తనం కుదిపేసిందని చెప్పుకొచ్చారు. ఆమెతో అద్భుతమైన వైవాహిక జీవితాన్ని గడిపాను. ఆమె భార్య మాత్రమే కాదు, స్నేహితురాలు కూడా. కానీ ఆమెను రక్షించు కోలేకపోయాం. అయితే చని పోవడానికి ఆరు నెలల ముందు, జీవితాన్ని వదులు కోవద్దని కోరిందనీ, తన జీవితం ఎలాగూ తిరిగి రాదు.. కానీ మీ జీవితం ఇంకా చాలా ఉంది.. దాన్ని వదులుకోవద్దంటూ తనతో వాగ్దానం చేయించు కుందని గుర్తు చేసుకున్నారు. నిజానికి ఈ మాటలు నాతోనే ఉండిపోయాయన్నారు. కానీ ఈ విషయంలో తాను అదృష్టంతుడినని, ప్రస్తుతం షీనాతో కలిసి జీవిస్తున్నానని వెల్లడించారు. షీనా చాలా ఎనర్జిటిక్. అందుకే తానెఫ్పుడైనా డల్గా ఉన్నా యాక్టివ్గా మార్చేస్తుంది. ఆమెకు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్నేహితులు ఆమెకు ఉన్నారని ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమె చాలా ప్రేరణ నిస్తుంది. తన జీవితంలో ముఖ్య భాగమైన షీనా అండతో తానిపుడు చలాకీగా పనిలో నిమగ్నమయ్యానని చెప్పడం విశేషం. దీంతో పాటు కరియర్ ప్రారంభలో తన అనుభవాలను కూడా పంచుకున్నారు. కాగా ఫోర్బ్స్ ప్రకారం సింగ్ నికర విలువ 8.81 బిలియన్ డాలర్లు. 1946లో తన మామగారు ప్రారంభించిన డీఎల్ఎఫ్ అనే కంపెనీలో చేరడానికి ముందు 1961లో ఆర్మిలో పనిచేశారు. ఆ తరువాత రైతుల నుండి భూమిని సేకరించడం ద్వారా ఢిల్లీ శివార్లలో తన షోపీస్ టౌన్షిప్ గుర్గావ్లో డీఎల్ఎఫ్ సిటీని నిర్మించారు. ఐదు దశాబ్దాలకు పైగా ఆ పదవిలో ఉన్న ఆయన జూన్ 2020లో చైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. ఇపుడు ఆయన కుమారుడు రాజీవ్ చైర్మన్గా ఉన్నారు. -
ఇళ్లు కొనేందుకు ఎగబడ్డారు.. ఒక్కోటి రూ.7 కోట్లు!
ఇళ్లు ఉచితంగా ఇస్తే జనం ఎగబడటం చూశాం. కానీ ఒక్కో ఇల్లు రూ.7 కోట్లు పెట్టి మరీ కొనేందుకు ఎగబడ్డారు. ఎంతలా అంటే మూడు రోజుల్లో ఏకంగా 1,137 ఇళ్లు అమ్మడుపోయాయి. దీనికి సంబంధించి ఇళ్లు కొనేందుకు వచ్చిన జనం అంటూ ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్ ఆర్బర్ పేరుతో గురుగ్రామ్లో ఓ కొత్త ప్రాజెక్ట్ చేపట్టింది. ఈ లగ్జరీ ప్రాజెక్ట్లో ఫ్లాట్లను అమ్మకానికి ప్రకటించగా కంపెనీ కార్యాలయానికి జనం తండోపతండాలుగా తరలివచ్చారంటూ జనం కిక్కిరిసి ఉన్న ఓ ఫొటోను వీకెండ్ఇన్వెస్టింగ్ అనే సంస్థ అధినేత అలోక్ జైన్ ట్విటర్లో షేర్ చేశారు. (నెలకు రూ.4 లక్షలు: రెండేళ...కష్టపడితే, కోటి...కానీ..!) Just checked with a DLF broker...says entire project of 1137 flats at 7 cr a piece has been sold out in 3 days 🤐 Mind gone numb 😲 https://t.co/UpvNnsH0H3 — Alok Jain ⚡ (@WeekendInvestng) February 21, 2023 డీఎల్ఎఫ్ కొత్త ప్రాజెక్ట్లో ఒక్కో ఫ్లాట్ ధర రూ.7 కోట్లని, మొత్తం 1,137 ఫ్లాట్లు మూడు రోజుల్లోనే అమ్ముడుపోయాయని తనకు డీఎల్ఎఫ్ బ్రోకర్ ఒకరు తెలియజేసినట్లు అలోక్ జైన్ పేర్కొన్నారు. దీనికి పలువురు ట్విటర్ యూజర్లు పలు విధాలుగా స్పందించారు. ఇది ఇన్వెస్టర్లు, బ్రోకర్ల మాయాజాలం అని, అన్నీ వాళ్లే కొనుక్కొని ఉంటారని కామెంట్లు పెట్టారు. అయితే దీన్ని డీఎల్ఎఫ్ సంస్థ ధ్రువీకరించాల్సి ఉంది. (ఇదీ చదవండి: UIDAI Factcheck: ఆధార్ జిరాక్స్లు ఇవ్వకూడదా?) -
అదానీ- హిండెన్బర్గ్ వివాదం.. డీఎల్ఎఫ్ చైర్మన్ కేపీ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భారత్ వృద్ధి గాధపై అమెరికా షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్, అదానీ గ్రూప్ వివాద ప్రభావమేమీ ఉండబోదని రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్ చైర్మన్ కేపీ సింగ్ స్పష్టం చేశారు. ఇది కేవలం ఒక కార్పొరేట్ గ్రూప్నకు మాత్రమే పరిమితమైన విషయమే తప్ప, దీనితో అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు భారత్పై నమ్మకమేమీ సడలబోదని పేర్కొన్నారు. పైస్థాయి నుంచి వచ్చిన ఒత్తిళ్ల కారణంగానే అదానీ గ్రూప్నకు బ్యాంకులు రుణాలు ఇచ్చి ఉంటాయనే అభిప్రాయాలను సింగ్ తోసిపుచ్చారు. అయితే అధిక వృద్ధి బాటలో ముందుకెళ్లాలంటే అదానీ గ్రూప్ రుణభారాన్ని తగ్గించుకుని, పెట్టుబడిని పెంచుకోవాలని సూచించారు. భారీగా షేర్ల విక్రయాల సమయంలో కొందరు బ్లాక్మెయిలర్లు నివేదికలతో బైటికొస్తుంటారని చెప్పారు. -
డీఎల్ఎఫ్కు షాక్: అదానీ చేతికి ‘ధారావి’ ప్రాజెక్టు
ముంబై: ప్రపంచంలోనే అతిపెద్ద మురికివాడగా పేరొందిన, ముంబైలోని ధారావి పునర్నిర్మాణ ప్రాజెక్ట్ కాంట్రాక్టు అదానీ గ్రూప్ చేతికి వెళ్లనుంది. రూ.5,069 కోట్లను కోట్ చేసి అత్యధిక బిడ్డర్గా నిలిచింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ డీఎల్ఎఫ్ రూ.2,025 కోట్లకు కోట్ చేసింది. ఈ వివరాలను ప్రాజెక్టు సీఈవో ఎస్వీఆర్ శ్రీనివాస్ వెల్లడించారు. ‘‘259 హెక్టార్ల పరిధిలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. కాంట్రాక్టు పొందిన సంస్థ ఏడేళ్లలో 6.5 లక్షల మందికి ఆవాసం సమకూర్చాల్సి ఉంటుంది. వీరంతా ఇప్పుడు ధారావిలో 2.5 చదరపు కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్నారు. ఈ ప్రాజెక్టు విలువ రూ.20,000 కోట్లు. (టాటా దూకుడు: ఏవియేషన్ మార్కెట్లో సంచలనం) తొలి దశలో అదానీ గ్రూపు రూ.5,069 కోట్లను ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపించింది. దీన్ని ఏడేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది’’ అని శ్రీనివాస్ తెలిపారు. వివరాలను ప్రభుత్వానికి పంపిస్తున్నామని, పరిశీలన అనంతరం తుది అనుమతి ఇస్తుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు కాంట్రాక్టు పొందిన సంస్థ 6.5 లక్షల మందికి నివాసం ఏర్పాటు చేయడంతోపాటు, మిగిలిన స్థలంలోని నివాస గృహాలను అధిక ధరలకు విక్రయించు కోవచ్చు. అలాగే, వాణిజ్య స్థలం కూడా అందుబాటులోకి వస్తుంది. (టయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్పర్సన్ హఠాన్మరణం) ఇదీ చదవండి: నైకా ఫల్గుణి సంచలనం: తగ్గేదేలే అంటున్న బిజినెస్ విమెన్ -
పెరిగే వడ్డీ రేట్లతో ఇళ్ల డిమాండ్కు సవాళ్లు
న్యూఢిల్లీ: పెరిగే వడ్డీ రేట్లతో ఇళ్ల డిమాండ్కు సమీప కాలంలో సవాళ్లు నెలకొన్నాయని డీఎల్ఎఫ్ చైర్మన్ రాజీవ్సింగ్ పేర్కొన్నారు. అయినా పరిశ్రమపై గణనీయమైన ప్రభావం ఉండకపోవచ్చన్నారు. నివాస గృహాలకు డిమాండ్ పరంగా గడిచిన రెండేళ్లలో నిర్మాణాత్మక రికవరీ కనిపిస్తోందని.. పరిశ్రమలో స్థిరీకరణ కారణంగా నమ్మకమైన సంస్థలు మార్కెట్ వాటాను పెంచుకుంటున్నట్టు తెలిపారు. కంపెనీ వాటాదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇళ్లకు ఉన్న డిమాండ్, దేశ ఆర్థిక వ్యవస్థ బలం ఈ రంగానికి మద్దతునిస్తాయన్నారు. ఆర్బీఐ గడిచిన మూడు నెలల్లో మూడు విడతలుగా 1.40 శాతం మేర రెపో రేటును పెంచడం తెలిసిందే. దీంతో బ్యాంకులు సైతం వెంటనే రుణ రేట్లను పెంచేశాయి. 6.5-7 శాతం మధ్య ఉన్న గృహ రుణ రేట్లు 8-8.5 శాతానికి చేరాయి. డిమాండ్కు అనుగుణంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కొత్త ఉత్పత్తులను అందిస్తున్నట్టు రాజీవ్సింగ్ చెప్పారు. దీంతో కొత్త ఇళ్ల బుకింగ్లలో మెరుగైన వృద్ధిని నమోదు చేస్తామన్న ఆశాభావాన్ని తెలిపారు. డీఎల్ఎఫ్ సేల్స్ బుకింగ్లు 2021-22లో రూ.7,273 కోట్లకు పెరగ్గా.. అంతకు ముందు సంవత్సరంలో ఇవి రూ.3,084 కోట్లుగానే ఉన్నాయి. జూన్తో ముగిసిన త్రైమాసికంలో బుకింగ్లు రెట్టింపై రూ.2,040 కోట్లుగా నమోదయ్యాయి. -
భారీ విస్తరణ దిశలో రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్!
న్యూఢిల్లీ: రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్ భారీ విస్తరణ దిశగా అడుగులేస్తోంది. నూతన మాల్స్ ఏర్పాటు ద్వారా రిటైల్ విభాగాన్ని అయిదేళ్లలో రెండింతలకు చేయాలని లక్ష్యంగా చేసుకుంది. రిటైల్ రంగంలో ప్రస్తుతం సంస్థ ఖాతాలో 42 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 8 మాల్స్, షాపింగ్ సెంటర్స్ ఉన్నాయి. 30 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో అన్ని విభాగాల్లో కలిపి 150కిపైగా ప్రాజెక్టులను సంస్థ ఇప్పటికే పూర్తి చేసింది. అద్దె కింద 4 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణం ఉంది. 21.5 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో గృహ, వాణిజ్య భవనాల నిర్మాణానికి అవసరరమైన స్థలం కంపెనీ చేతిలో ఉంది. గృహ, కార్యాలయ ప్రాజెక్టులను సైతం కొత్తగా అభివృద్ధి చేస్తామని డీఎల్ఎఫ్ చైర్మన్ రాజీవ్ సింగ్ వాటాదార్లకు ఇచ్చిన సందేశంలో వెల్లడించారు. ‘ఆఫీస్, మాల్స్ అద్దె వ్యాపారం క్రమంగా సాధారణ స్థితికి వస్తోంది. షాపింగ్ మాల్స్లో కస్టమర్ల రాక మహమ్మారి పూర్వ స్థాయికి స్థిరంగా చేరుతోంది’ అని వివరించారు. కాగా, నూతన బుకింగ్స్ 2021–22లో రెండింతలై రూ.7,273 కోట్లు నమోదైంది. గురుగ్రామ్, గోవాలో రెండు షాపింగ్ మాల్స్ నిర్మాణానికి రూ.2,000 కోట్లు పెట్టుబడి చేస్తున్నట్టు కంపెనీ ఈ ఏడాది మార్చిలో ప్రకటించింది. -
దేశంలోనే అత్యంత సంపన్నులు! తెలుగులో రియల్ ఎస్టేట్ కింగ్లు ఎవరంటే!
న్యూఢిల్లీ: డీఎల్ఎఫ్ చైర్మన్ రాజీవ్ సింగ్ రియల్ ఎస్టేట్ రంగంలో దేశంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. రూ.61,220 కోట్ల సంపద ఆయనకు ఉన్నట్టు ‘గ్రోహ్ హరూన్ ఇండియా రియల్ ఎస్టేట్ రిచ్ లిస్ట్’ ఐదో ఎడిషన్ తెలిపింది. మాక్రోటెక్ డెవలపర్స్ (లోధా) ప్రమోటర్ ఎంపీ లోధా రూ.52,970 కోట్ల సంపదతో రెండో స్థానంలో ఉన్నారు. రియల్టీలోని టాప్ 100 సంపన్నుల వివరాలతో ఈ నివేదిక రూపొందించింది. రియల్టీ వ్యాపారాల్లో వాటాల ఆధారంగా 2021 డిసెంబర్ 31 నాటికి ఉన్న వివరాలను పరిగణనలోకి తీసుకుంది. టాప్ –10లో వీరు.. ►డీఎల్ఎఫ్ రాజీవ్ సింగ్ సంపద 2021లో 68% పెరిగింది. ► ఎంపీ లోధా, ఆయన కుటుంబ సభ్యుల సంపద 20 శాతం పెరిగింది. ► కే రహేజా కార్ప్నకు చెందిన చంద్రు రహేజా, ఆయన కుటుంబ సభ్యుల సంపద రూ.26,290 కోట్లుగా ఉంది. వీరు 3వ స్థానంలో ఉన్నారు. ► ఎంబసీ గ్రూపు ప్రమోటర్ జితేంద్ర విర్వాణి రూ.23,620 కోట్లతో 4వ స్థానంలో నిలిచారు. ►ఒబెరాయ్ రియల్టీ అధినేత వికాస్ ఒబెరాయ్ రూ.22,780 కోట్లు, నిరంజన్ హిరనందాని (హిరనందన్ కమ్యూనిటీస్) రూ.22,250 కోట్లు, బసంత్ బన్సాల్ అండ్ ఫ్యామిలీ (ఎం3ఎం ఇండియా) రూ.17,250 కోట్లతో వరుసగా తర్వాతి స్థానాలో ఉన్నారు. ►రాజా బగ్మానే (బగ్మానే డెవలపర్స్) రూ.16,730 కోట్లు, జి.అమరేందర్ రెడ్డి, ఆయన కుటుంబం రూ.15,000 కోట్లు, రున్వా ల్ డెవలపర్స్కు చెందిన సుభాష్ రున్వాల్ అండ్ ఫ్యామిలీ రూ.11,400 కోట్లతో ఈ జాబితాలో టాప్–10లో చోటు సంపాదించుకున్నారు. ►14 పట్టణాల నుంచి 71 కంపెనీలకు చెందిన 100 మంది ఈ జాబితాలో ఉన్నారు. ►జాబితాలోని 81 శాతం మంది సంపద 2021లో పెరిగింది. 13% మంది సంపద తగ్గింది. కొత్తగా 13 మంది జాబితాలోకి వచ్చారు. తెలుగులో రియల్టీ కుబేరులు ఎవరంటే -
Lalu Prasad Yadav: లంచం కేసులో లాలూకి క్లీన్ చీట్?
సాక్షి, న్యూఢిల్లీ: డీఎల్ఎఫ్ గ్రూప్ లంచం కేసులో మాజీమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్కి సీబీఐ క్లీన్ చీట్ ఇచ్చినట్టు సమాచారం. లాలూ ప్రసాద్ యాదవ్కి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో సీబీఐ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఈ కేసు విచారణలో ఇప్పటికే మూడున్నరేళ్లు లాలూ జైలులో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ క్లీన్ చీట్ ఇచ్చినా... ఇన్కంటాక్స్ డిపార్ట్మెంట్ తమ విచారణ కొనసాగించనుంది. రైల్వే ప్రాజెక్ట్లులో ... యూపీఏ 2 ప్రభుత్వ హయంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో ముంబై, ఢిల్లీలలో రైల్వే ప్రాజెక్టులు దక్కించుకునేందుకు రియల్ ఎస్టేట్ కంపెనీ డీఎల్ఎఫ్ లాలూకి లంచం ఇచ్చిందనేది ప్రధాన ఆరోపణ. డీఎల్ఎఫ్కి లబ్ధి చేకూర్చినందుకు 2007లో దక్షిణ ఢిల్లీలో రూ. 30 కోట్లు విలువ చేసే స్థలాన్ని లాలుకి కట్టబెట్టారని, ఆ తర్వాత 2011లో లాలూ కుటుంబ సభ్యులకు నామమాత్రపు ధరకే విలువైన షేర్లు అందించారనే ఆరోపణలు వచ్చాయి. మూడేళ్ల విచారణ లంచం తీసుకుని డీఎల్ఎఫ్ సంస్థకు అనుకూలంగా లాలూ తన పవర్స్ దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై 2018 జనవరిలో కేసు నమోదు చేసింది సీబీఐ, ఆర్థిక నేరాల విభాగం. కేసు నమోదైన కొత్తలో పూర్వపు స్టాంపు పేపర్లు ఫోర్జరీ చేశారని, లాలూ కుటుంబ సభ్యులు ఆయాచితంగా లబ్ధి పొందారని... ఇలా అనేక ఆధారాలు ఆయనకి వ్యతిరేకంగా తమ వద్ద ఉన్నాయంటూ బెయిల్కి నిరాకరించింది. దాదాపు రెండున్నరేళ్ల పాటు విచారించిన తర్వాత ఆరోపణలకు తగ్గట్టు సరైన ఆధారాలు సంపాదించలేక పోయింది సీబీఐ. దీంతో లాలూకి క్లీన్చీట్ ఇచ్చింది. డీఎల్ఎఫ్ లంచం కేసులో 2008 జనవరి నుంచి 2021 ఏప్రిల్ వరకు లాలూ జైలులోనే ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో బెయిల్ రావడంతో లాలూ బయటకు వచ్చారు. -
ఎన్నికల నోటిఫికేషన్ జారీచేయొద్దు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: డీఎల్ఎఫ్ భూవ్యవహారంలో అక్రమాలు జరిగాయంటూ ఎంపీ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన ప్రజాహితవ్యాజ్యంపై కౌంటర్ దాఖలు చేయాలంటూ హైకోర్టు బుధవారం ప్రతివాదులను ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో ఏపీఐఐసీకి చెందిన ఐటీ పార్క్లో డీఎల్ఎఫ్ సంస్థ 31.35 ఎక రాలను రూ.580 కోట్లకు కొనుగోలు చేసిన వ్యవహారంలో అక్రమాలు జరిగాయంటూ ఎంపీ రేవంత్రెడ్డి ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రతివాదులుగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శులతోపాటు టీఎస్ఐఐసీ, ఎస్బీఐ, డీఎల్ఎఫ్, మై హోం కన్స్ట్రక్షన్స్, ఆర్ఎంజడ్ కార్ప్ సంస్థలను పేర్కొన్నారు. ఈ మేరకు వీరు కౌంటర్ దాఖలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డితో కూడిన ధర్మాసనం ఆదేశించింది. నిబంధనల మేరకే ఈ భూమి కొనుగోలు ప్రక్రియ జరిగిందని, ఆక్వా స్పేస్ డెవలపర్స్ తరఫున జె.శ్యామ్రాం బుధవారం కౌంటర్ దాఖలు చేశారు. కాగా, 2013లో డీఎల్ఎఫ్కు ఏపీఐఐసీ భూమి రిజిస్ట్రేషన్ చేయడం, తర్వాత ఆ భూమిని ఆక్వా స్పేస్ పేరుతో బదలాయించడాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించాలని, భవన నిర్మాణం కోసం జీహెచ్ఎంసీ ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని రేవంత్రెడ్డి పిటిషన్లో కోరారు. (చదవండి: విక్రమ్కు ఎంబీబీఎస్ అడ్మిషన్ ఇవ్వండి ) జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీకి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో ఓట్ల నమోదులో అనేక అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు స్పందించింది. ఆరోపణలపై తుది తీర్పు ఇచ్చే వరకూ కార్యవర్గం ఎన్నికకు నోటిఫికేషన్ జారీచేయరాదని, ఎన్నికలు నిర్వహించరాదని రాష్ట్ర కోఆపరేటివ్ ఎన్నికల అధికారిని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచందర్రావు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. -
ఐసీఐసీఐ, డీఎల్ఎఫ్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ జూమ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ, రియల్టీ రంగ బ్లూచిప్ కంపెనీ డీఎల్ఎఫ్ లిమిటెడ్, ఎన్బీఎఫ్సీ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి ఒడిదొడుకుల మార్కెట్లోనూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఐసీఐసీఐ బ్యాంక్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభం ఆరు రెట్లు ఎగసి రూ. 4,251 కోట్లను తాకింది. స్టాండెలోన్ ప్రాతిపదికన నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 16 శాతం పెరిగి రూ. 9,366 కోట్లకు చేరింది. అయితే నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) 3.64 శాతం నుంచి 3.57 శాతానికి స్వల్పంగా బలహీనపడ్డాయి. ఈ కాలంలో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 6.37 శాతం నుంచి 5.17 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు సైతం 1.6 శాతం నుంచి 1 శాతానికి వెనకడుగు వేశాయి. దీంతో ఎన్ఎస్ఈలో ఐసీఐసీఐ బ్యాంక్ షేరు ప్రస్తుతం 7.3 శాతం జంప్చేసి రూ. 421 వద్ద ట్రేడవుతోంది. డీఎల్ఎఫ్ లిమిటెడ్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో డీఎల్ఎఫ్ లిమిటెడ్ టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. క్యూ2లో రూ. 236 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2019-20) క్యూ2లో రూ. 72 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం సైతం మూడు రెట్లు పెరిగి రూ. 1,723 కోట్లకు చేరింది. ఇబిటా రూ. 100 కోట్ల నుంచి రూ. 576 కోట్లకు ఎగసింది. క్యూ2లో నికర అమ్మకాల బుకింగ్స్ రూ. 152 కోట్ల నుంచి రూ. 853 కోట్లకు పెరిగినట్లు కంపెనీ పేర్కొంది. ఈ నేపథ్యంలో డీఎల్ఎఫ్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 5.3 శాతం జంప్చేసి రూ. 167 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 171 వరకూ లాభపడింది. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ రూ. 985 కోట్ల నికర లాభం ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం రూ. 2,022 కోట్లుగా నమోదైంది. ఇవి గతేడాది క్యూ2తో పోలిస్తే స్వల్పంగా తగ్గినప్పటికీ అంచనాలకంటే మెరుగైన ఫలితాలేనని విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ కాలంలో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 8 శాతం నుంచి 6.42 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు సైతం 5.1 శాతం నుంచి 3.64 శాతానికి వెనకడుగు వేశాయి. నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) 4.8 శాతం ఎగసి రూ. 1.13 ట్రిలియన్లను తాకాయి. ఈ నేపథ్యంలో శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 9 శాతం జంప్చేసి రూ. 755 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 763 వరకూ దూసుకెళ్లింది. -
డీఎల్ఎఫ్ చైర్మన్ బాధ్యతలకు సింగ్ వీడ్కోలు
న్యూఢిల్లీ: ఓ సాధారణ రియల్టీ కంపెనీని దేశంలోనే దిగ్గజ సంస్థగా నిలిపిన డీఎల్ఎఫ్ చైర్మన్ కుషాల్పాల్ సింగ్ గురువారం తన పదవీ బాధ్యతలకు విరమణ చెప్పారు. 90 ఏళ్ల సింగ్ 60 ఏళ్ల పాటు డీఎల్ఎఫ్ కోసమే కష్టపడ్డారు. ఢిల్లీ ల్యాండ్ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్ (డీఎల్ఎఫ్) అనే కంపెనీని 1946లో కుషాల్పాల్ సింగ్ మామయ్య స్థాపించారు. 1961లో ఆర్మీలో ఉద్యోగ బాధ్యతలకు స్వస్తి చెప్పిన కుషాల్పాల్ సింగ్ డీఎల్ఎఫ్లో చేరి కంపెనీ భవిష్యత్తును కొత్తపుంతలు తొక్కించారు. గురువారం జరిగిన డీఎల్ఎఫ్ బోర్డు సమావేశంలో.. కుషాల్పాల్ సింగ్ను గౌరవ చైర్మన్గా, ఆయన కుమారుడు రాజీవ్ను నూతన చైర్మన్గా నియమిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. గురుగ్రామ్ అభివృద్ధికి ఆద్యుడు: దేశంలో గురుగ్రామ్ ప్రముఖ పట్టణమని తెలిసిందే. ఢిల్లీకి సమీపంలోనే ఉండే ఈ ప్రాంతానికి చక్కని భవిష్యత్తు ఉందని కుషాల్పాల్సింగ్ 1979లోనే ప్రణాళికలు వేసుకున్నారు. అప్పట్లో చిన్న గ్రామంగా ఉన్న గురుగ్రామ్ను సింగపూర్ మాదిరిగా ఢిల్లీకి శాటిలైట్ టౌన్షిప్గా అభివృద్ధి చేసి అంతర్జాతీయ కంపెనీలను రప్పించాలన్న ప్రణాళిక ఆయనకు ఉండేది. కానీ, దురదృష్టవశాత్తూ దీన్ని సాకారం చేయలేకపోయినట్టు సింగ్ ఓ వార్తా సంస్థతో చెప్పారు. తాను ఊహించినట్టుగా గురుగ్రామ్ను అభివృద్ధి చేయలేకపోయినట్టు పేర్కొన్నారు. డీఎల్ఎఫ్ నష్టాలు రూ.1,857 కోట్లు డీఎల్ఎఫ్కు గత ఆర్థిక సంవత్సరం (2019–20) మార్చి క్వార్టర్లో రూ.1,858 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. డిఫర్డ్ ట్యాక్స్ అసెట్స్ (డీటీఏ) రివర్సల్ కారణంగా ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2018–19) ఇదే క్వార్టర్లో రూ.437 కోట్ల నికర లాభం వచ్చిందని డీఎల్ఎఫ్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.2,661 కోట్ల నుంచి రూ.1,874 కోట్లకు తగ్గిందని పేర్కొంది. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2018–19లో రూ.1,319 కోట్ల నికర లాభం రాగా గత ఆర్థిక సంవత్సరంలో రూ.583 కోట్ల నికర నష్టాలు వచ్చాయని తెలిపింది. మొత్తం ఆదాయం రూ.9,029 కోట్ల నుంచి రూ.6,884 కోట్లకు తగ్గిందని పేర్కొంది. -
11వ అంతస్థు నుంచి దూకేశాడు..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ‘బాయ్స్ లాకర్ రూం’ వివాదం నేపథ్యంలో 14 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది. గురుగ్రామ్లోని విలాసవంత ప్రాంతమైన డీఎల్ఎఫ్ ఫేజ్ 5లో ఈ ఘటన జరిగింది. డీఎల్ఎఫ్ కార్ల్టన్ ఎస్టేట్ అపార్ట్మెంట్లోని 11వ అంతస్థు నుంచి దూకి అతడు ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. మహిళలు, బాలికలను లైంగికంగా వేధింపులకు గురిచేసిన ఇన్స్టాగ్రామ్ ‘బాయ్స్ లాకర్ రూం’ గ్రూప్తో అతడికి ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎటువంటి సూసైడ్ నోట్ దొరకలేదని, అతడి ఫోన్లోని సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మృతుడి ఫోన్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్టు వెల్లడించారు. బాయ్స్ లాకర్ రూం (BoysLockerRoom) వ్యవహారంలో పోలీసులు ప్రశ్నిస్తారని తోటి విద్యార్థులు భయపెట్టడంతో సదరు బాలుడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. మృతుడి సోషల్ మీడియా ఖాతాలను సైబర్ క్రైమ్ సెల్ జల్లెడ పడుతోంది. బాలుడి ఆత్మహత్యపై ఫిర్యాదు చేయడానికి తల్లిదండ్రులు నిరాకరించడంతో పోలీసులు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 174 కింద కేసు విచారణ ప్రారంభించారు. శవపరీక్ష నిర్వహించిన ఫోరెన్సిక్ నిపుణుడు దీపక్ మాథుర్ మాట్లాడుతూ.. ‘తలకు గాయం సహా పలు గాయాలు ఉన్నాయి. ఇది మరణానికి కారణమైంద’ని వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా మృతుడి సహ విద్యార్థులతో పాటు ‘బాయ్స్ లాకర్ రూం’ వేధింపులను వెలుగులోకి తెచ్చిన బాలికను ప్రశ్నిస్తామని పోలీసులు తెలిపారు. పోలీసుల అదుపులో ‘బాయ్స్ లాకర్ రూం’ సభ్యుడు -
డీఎల్ఎఫ్ లాభం 76% అప్
న్యూఢిల్లీ: రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం(2018–19) నాలుగో క్వార్టర్లో 76 శాతం ఎగసింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) క్యూ4లో రూ.248 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.437 కోట్లకు పెరిగిందని డీఎల్ఎఫ్ తెలిపింది. అమ్మకాల బుకింగ్స్ దాదాపు రెట్టింపై రూ.2,435 కోట్లకు పెరగడంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని వివరించింది. మొత్తం ఆదాయం రూ.1,846 కోట్ల నుంచి రూ.2,661 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఏడాది లాభం.. రూ.1,319 కోట్లు.... పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.4,464 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,319 కోట్లకు తగ్గిందని డీఎల్ఎఫ్ తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో రెంటల్ ఆదాయాన్ని విక్రయించడం వల్ల అప్పుడు విశేషమైన లాభాలు వచ్చాయని, దీంతో పోల్చితే గత ఆర్థిక సంవత్సరంలో నికర లాభం తగ్గిందని వివరించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.7,664 కోట్ల నుంచి రూ.9,029 కోట్లకు పెరిగిందని తెలిపింది. నికర అమ్మకాలు రూ.1,000 కోట్ల నుంచి రూ.2,435 కోట్లకు పెరిగాయని పేర్కొంది. రెసిడెన్షియల్ సెగ్మెంట్లో అమ్మకాలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయని వివరించింది. ప్రీమియమ్, లగ్జరీ సెగ్మెంట్లలో నివసించడానికి సిద్ధంగా ఉన్న ఫ్లాట్లను విక్రయించడం ఆరంభించామని పేర్కొంది. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్(క్యూఐపీ) ద్వారా రూ.3,173 కోట్ల నిధులను విజయవంతంగా సమీకరించామని కంపెనీ తెలిపింది. ప్రమోటర్లు రూ.11,250 కోట్ల మేర పెట్టుబడులు అందించారని వివరించింది. మెరుగైన ఫలితాలతో బీఎస్ఈలో డీఎల్ఎఫ్ షేర్ 1.5% లాభంతో రూ.173 వద్ద ముగిసింది. -
డీఎల్ఎఫ్ షేర్లను విక్రయించిన సింగపూర్ ప్రభుత్వం
న్యూఢిల్లీ: రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్లో సింగపూర్ ప్రభుత్వం 6.8 కోట్ల షేర్లను విక్రయించింది. దీంతో డీఎల్ఎఫ్ షేర్ 8 శాతం వరకూ నష్టపోయింది. బ్లాక్డీల్ విలువ రూ.1,298 కోట్లు డీఎల్ఎఫ్ కంపెనీలో సింగపూర్ ప్రభుత్వానికి గత ఏడాది చివరి నాటికి 4.11 శాతం వాటాకు సమానమైన 7.32 కోట్ల ఈక్విటీ షేర్లున్నాయి. దీంట్లో 6.8 కోట్ల ఈక్విటీ షేర్లను ఓపెన్ మార్కెట్ లావాదేవీ ద్వారా సింగపూర్ప్రభుత్వం సోమవారం విక్రయించింది. ఒక్కో షేర్ సగటు విక్రయ విలువ రూ.191 ప్రకారం ఈ మొత్తం షేర్ల విక్రయ విలువ రూ.1,298 కోట్లుగా ఉంది. ఈ షేర్లను ఫ్రాన్స్కు చెందిన ఇన్వెస్ట్మెంట్ ఫండ్ సొసైటీ జనరల్, హెచ్ఎస్బీసీ, ఇతర ఇన్వెస్టర్లు కొనుగోలు చేశారని సమాచారం. ఇటీవలి డీఎల్ఎఫ్ రూ.3,200 కోట్ల క్యూఐపీ ఇష్యూలో పాలు పంచుకున్న హెచ్ఎస్బీసీ, ఇతర సంస్థలు ఈ ఓపెన్ మార్కెట్ లావాదేవీలో కూడా డీఎల్ఎఫ్ షేర్లను కొనుగోలు చేశాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ బ్లాక్డీల్ నేపథ్యంలో డీఎల్ఎఫ్ షేర్ భారీగా పతనమైంది. బీఎస్ఈలో 8.4 శాతం నష్టంతో రూ.185 వద్ద ముగిసింది. -
డీఎల్ఎఫ్కు రూ.13,500 కోట్ల నిధులు
న్యూఢిల్లీ: డీఎల్ఎఫ్ డైరెక్టర్ల బోర్డ్ సమావేశం వచ్చే నెల 1న జరగనున్నది. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్(క్విప్) విధానంలో నిధుల సమీకరణ, ప్రమోటర్లకు వారంట్లు, డిబెంచర్ల జారీ తదితర అంశాలను ఈ సమావేశంలో చర్చిస్తారు. వారంట్లు, డిబెంచర్ల ద్వారా ప్రమోటర్లు ఈ కంపెనీలో రూ.10,500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నారు. క్విప్ ద్వారా రూ.3,000 కోట్లు సమీకరించనున్నారు. మొత్తం 13,500 కోట్లు పెట్టుబడులు డీఎల్ఎఫ్కు రానున్నాయి. ఈ నిధులను భారీగా పేరుకుపోయిన రూ.27,000 కోట్ల నికర రుణ భారాన్ని తగ్గించుకోవడానికి వినియోగించుకోవాలని కంపెనీ యోచిస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో డీఎల్ఎఫ్ ప్రమోటర్లు.. డీఎల్ఎఫ్ సైబర్ సిటీ డెవలపర్స్(ఇది డీఎల్ఎఫ్ రెంటల్ విభాగం)లో 40 శాతం వాటాను రూ.11,900 కోట్లకు విక్రయించారు. ఈ నిధులనే ఇప్పుడు వారంట్లు, డిబెంచర్ల ద్వారా డీఎల్ఎఫ్లో పెట్టుబడులు పెడుతున్నారు. -
డీఎల్ఎఫ్ లాభం 91 శాతం డౌన్
న్యూఢిల్లీ: రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 91 శాతం క్షీణించింది. గత క్యూ2లో రూ.199 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.18 కోట్లకు తగ్గిందని డీఎల్ఎఫ్ వివరించింది. మొత్తం ఆదాయం రూ.2,226 కోట్ల నుంచి 21 శాతం తగ్గి రూ.1,751 కోట్లకు చేరిందని పేర్కొంది. ఇక ఆరు నెలల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెప్టెంబర్ కాలానికి రూ.460కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ.128 కోట్లకు తగ్గిందని వివరించింది. మొత్తం ఆదాయం రూ.4,251 కోట్ల నుంచి రూ.3,963 కోట్లకు చేరిందని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో డీఎల్ఎఫ్ షేర్ 1.9 శాతం నష్టపోయి రూ. 208 వద్ద ముగిసింది. -
వాటా విక్రయించనున్న డీఎల్ఎఫ్ ప్రమోటర్లు
న్యూఢిల్లీ: డీఎల్ఎఫ్ కంపెనీ ప్రమోటర్లు, తమ రెంటల్ విభాగంలో 40 శాతం వాటాను విక్రయించనున్నారు. తమ రెంటల్ విభాగం, డీసీసీడీఎల్(డీఎల్ఎఫ్ సైబర్ సిటీ డెవలపర్స్ లిమిటెడ్)లో 40 శాతం వాటాను సింగపూర్కు చెందిన జీఐసీకు ప్రమోటర్లు విక్రయించనున్నట్లు డీఎల్ఎఫ్ తెలిపింది. డీల్ విలువ రూ.12,000–13,000 కోట్ల రేంజ్లో ఉండొచ్చని అంచనా. జీఐసీతో ఒప్పందం మరో రెండు, మూడు నెలల్లో కుదరగలదని డీఎల్ఎఫ్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్ఓ) అశోక్ త్యాగి చెప్పారు. వాటా విక్రయ ప్రక్రియ ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా పూర్తవగలదని అంచనాలున్నాయని వివరించారు. డీఎల్ఎఫ్కు నికర రుణ భారం రూ.24,000 కోట్లుగా ఉంది. ఈ రుణభారం తగ్గించుకోవడానికి డీఎల్ఎఫ్ ప్రమోటర్లు ప్రయత్నిస్తున్నారు. -
డీఎల్ఎఫ్కు ఊరట
న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద కమర్షియల్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ డీఎల్ఎఫ్కు సుప్రీంకోర్టులో కొంత ఊరట లభించింది. చండీఘడ్ లోని పంచకుల ప్రాజెక్టులోని అపార్ట్ మెంట్ల కేటాయింపు వివాదాన్ని శుక్రవారం విచారించిన సుప్రీం ఈ మేరకు తీర్పు వెలువరించింది. డీఎల్ఎఫ్కు గతంలో ఎన్ సీడీఆర్ సీ విధించిన 12 శాతం వడ్డీని 9 శాతానికి తగ్గించింది. ఆయా కొనుగోలు దార్లకు నవంబర్30 లోపు స్వాధీనం చేయాలని తీర్పు చెప్పింది. లేదంటే పెనాల్టీ కట్టాల్సిందేనని అల్టిమేటం జారీ చేసింది. ఫ్లాట్ల కేటాయింపులో జరిగిన ఆలస్యానికి గాను 2014 నుంచి 9 శాతం వడ్డీని చెల్లించాలని ఆదేశించింది. దాదాపు 50 మంది కొనుగోలుదారులకు ఈ చెల్లింపులు చేయాలని డీఎల్ఎఫ్ ను కోరింది. పంచకుల ప్రాజెక్టులో భాగంగా 50 మంది కొనుగోలుదారులకు ఫ్లాట్లను ఇవ్వడంలో ఆలస్యం చేస్తుండటంతో అత్యున్నత వినియోగదారుల కమిషన్ ఆశ్రయించారు. 2013లో తమ చేతికి రావాల్సిన ఫ్లాట్స్ రాలేదని ఆరోపిస్తూ జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కర కమిషన్(ఎన్ సీడీఆర్ సీ) లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసును విచారించిన కమిషన్ రియల్ సంస్థపై చీటింగ్ వ్యవహారం కింద పెనాల్టీ విధించింది. ఏడాదికి 12 శాతం జరిమానా చెల్లించాలని పేర్కొంది. కంపెనీ ప్రతిపాదించిన సమయం లోపు ఫ్లాట్లను ఇవ్వాలని, ఇవ్వని పక్షంలో రోజుకు రూ.5వేల జరిమానా ఫిర్యాదుదారులకు చెల్లించాలని బెంచ్ ఆదేశించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ డీఎల్ ఎఫ్ ను సుప్రీం ను ఆశ్రయించింది. మరోవైపు ఢిల్లీ శివారుల్లో ఘజియాబాద్ ఒక నివాస ప్రాజెక్ట్ కు సంబంధించి 70మంది ఫ్లాట్ కొనుగోలుదారులకు ఇళ్లను కేటాయించడంలో విఫలమైన మరో రియల్ సంస్థ పార్వ్శనాధ్ డెవలపర్స్ ను , వారికి తిరిగి డబ్బులు చెల్లించే ప్రక్రియపై సమాధానం చెప్పాల్సిందిగా కోరింది. -
లేట్ చేస్తే.. రోజుకు రూ.5 వేలు ఫైన్!
న్యూఢిల్లీ : భారత్ లో అతిపెద్ద కమర్షియల్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ డీఎల్ఎఫ్కు మొట్టికాయలు పడ్డాయి. హర్యానాలోని పంచకుల ప్రాజెక్టులో భాగంగా 50 మంది కొనుగోలుదారులకు ఫ్లాట్లను ఇవ్వడంలో ఆలస్యం చేస్తుండటంతో అత్యున్నత వినియోగదారుల కమిషన్ చీటింగ్ కింద పెనాల్టీ విధించింది. ఏడాదికి 12 శాతం జరిమానా చెల్లించాలని పేర్కొంది. జస్టిస్ జేఎమ్ మాలిక్ నేతృత్వంలోని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కర కమిషన్(ఎన్ సీడీఆర్ సీ) బెంచ్ ఈ మేరకు తీర్పునిచ్చింది. కంపెనీ ముందుగా చెప్పిన సమయానికే కొనుగోలుదారులకు అపార్ట్మెంట్లు ఇవ్వాలని, ఇవ్వని పక్షంలో ప్రాజెక్టు ముగిసేవరకు రోజుకు రూ.5 వేల చొప్పున జరిమానా కట్టాలని డీఎల్ఎఫ్ను ఆదేశించింది. 50మంది ఫిర్యాదుదారులను వేధించినందుకు డీఎల్ఎఫ్ నష్టపరిహారం కింద ప్రతి ఒక్కరికి రూ.30 వేలు చెల్లించాలని బిల్డర్ కు ఆదేశాలు జారీచేసింది. అలాట్మెంట్ తేదీ నుంచి మూడేళ్లలోగా డీఎల్ఎఫ్ కొనుగోలుదారులకు ఫ్లాట్లు ఇవ్వాల్సి ఉంది. 2013లో కొనుగోలుదారులకు ఈ ఫ్లాట్లు ఇవ్వాలి. కానీ తన ప్రతిపాదించిన సమయాన్ని డీఎల్ఎఫ్ బ్రేక్ చేసింది. కొనుగోలుదారులకు ఫ్లాట్లు ఇవ్వకుండా ఆలస్యం చేస్తోంది. దీంతో ఫిర్యాదుదారులు వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు. ఇప్పటివరకూ ఫ్లాట్లు ఇవ్వకుండా కొనుగోలుదారులను వేధించినందుకు డీఎల్ఎఫ్ వడ్డీ చెల్లించాలని, ప్రస్తుతం కంపెనీ ప్రతిపాదించిన సమయం లోపు ఫ్లాట్లను ఇవ్వాలని, ఇవ్వని పక్షంలో రోజుకు రూ.5వేల జరిమానా ఫిర్యాదుదారులకు చెల్లించాలని బెంచ్ తెలిపింది. -
చట్ట ప్రకారమే విదేశాల్లో ఇన్వెస్ట్ మెంట్స్
స్పష్టం చేసిన ‘పనామా పేపర్స్’ కంపెనీలు న్యూఢిల్లీ: భారత ప్రభుత్వ చట్టాల ప్రకారమే విదేశాల్లో ఇన్వెస్ట్ చేశామని, ఎలాంటి చట్ట ఉల్లంఘనలకు పాల్పడలేదని ‘పనామా పేపర్స్’లో పేర్లున్న కార్పొరేట్ కంపెనీలు స్పష్టం చేశాయి. పన్నులు ఎగ్గొట్టి విదేశాల్లో నల్లధనాన్ని దాచుకున్నామని తమపై వచ్చిన వార్తలు సరికాదని డీఎల్ఎఫ్, అపోలో టైర్స్, ఇండియాబుల్స్ సంస్థలు స్పష్టం చేశాయి. ఆర్బీఐ పరిమితికి లోబడే ఇన్వెస్ట్మెంట్స్... ఆర్బీఐ, ఫెమా, ఆదాయపు పన్ను శాఖ నియమ నిబంధనల ప్రకారమే విదేశాల్లో ఇన్వెస్ట్ చేశామని డీఎల్ఎఫ్ సీఈఓ రాజీవ్ తల్వార్ చెప్పారు. డీఎల్ఎఫ్ ప్రమోటర్ కుటుంబం బ్రిటిష్ వర్జిన్ దీవుల్లో కొన్ని కంపెనీలు ఏర్పాటు చేశాయని, కోటి డాలర్ల వరకూ నల్లధనాన్ని పోగేసుకున్నాయని ఇండియన్ ఎక్స్ప్రెస్ పేర్కొంది. 2004లో ప్రభుత్వం తెచ్చిన ఎల్ఆర్ఎస్ స్కీమ్ ప్రకారమే విదేశాల్లో ఇన్వెస్ట్ చేశామని రాజీవ్ తల్వార్ పేర్కొన్నారు. ఎలాంటి చట్ట ఉల్లంఘనలు జరగలేదని, బ్రిటిష్ వర్జిన్ దీవుల్లో తమ ప్రమోటర్ గ్రూప్లు ఒక్క కంపెనీని కూడా ఏర్పాటు చేయలేదని తెలిపారు. వివరాలన్నీ ప్రతి ఏటా ఆదాయపు పన్ను విభాగానికి నివేదిస్తునే ఉన్నామని, డీఎల్ఎఫ్ వార్షిక నివేదికలోనూ పొందుపరుస్తామని వివరించారు. అంతా నిబంధనల ప్రకారమే... విదేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతించే చట్టాల ప్రకారమే అపోలో టైర్స్ గ్రూప్ చైర్మన్ ఓంకార్ కన్వర్, ఆయన కుటుంబ సభ్యులు విదేశాల్లో ఇన్వెస్ట్ చేశారని అపోలో గ్రూప్ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ విషయంలో ఎలాంటి చట్ట ఉల్లంఘన జరగలేదని వివరించారు. అపోలో గ్రూప్ చైర్మన్ కుటుంబ సభ్యులు చాలా మంది ఎన్నారైలని, ఇతర దేశాల చట్టాల ప్రకారమే వారు పెట్టుబడులు పెట్టారని వివరించారు. భారత దేశ ఆదాయపు పన్ను చట్టం, ఆర్బీఐ నియమనిబంధనలు, ఆంక్షలు వారికి వర్తించవని స్పష్టం చేశారు. భారత్లో పూర్తిగా పన్నులు చెల్లించిన తర్వాతనే విదేశాల్లో ఇన్వెస్ట్ చేశామని ముంబైకి చెందిన ఇండియాబుల్స్ సంస్థలకు చెందిన సమీర్ గెహ్లాట్ పేర్కొన్నారు. -
డీఎల్ఎఫ్ లాభం 24 శాతం అప్
న్యూఢిల్లీ: భారత్లో అతి పెద్ద రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్ నికర లాభం (కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 24 శాతం పెరిగింది. గత క్యూ3లో రూ.132 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.164 కోట్లకు పెరిగిందని డీఎల్ఎఫ్ తెలిపింది. ఆదాయం రూ.1,957 కోట్ల నుంచి 44 శాతం వృద్ధితో రూ.2,828 కోట్లకు పెరిగిందని వివరించింది. ఇతర ఆదాయం రూ.123 కోట్ల నుంచి రూ.153 కోట్లకు ఎగసిందని పేర్కొంది. గత క్యూ3లో రూ.8 కోట్లుగా ఉన్న పన్ను వ్యయాలు ఈ క్యూ3లో రూ.211 కోట్లకు పెరిగాయని, అలాగే వడ్డీ భారం రూ.648 కోట్ల నుంచి రూ.672 కోట్లకు ఎగసిందని వివరించింది. స్టాక్ మార్కెట్ ముగిసిన తర్వాత కంపెనీ ఫలితాలు వెలువడ్డాయి. పలితాల నేపథ్యంలో డీఎల్ఎఫ్ షేర్ 3.5 శాతం నష్టపోయి రూ.94 వద్ద ముగిసింది. -
డీఎల్ఎఫ్ లాభం 132 కోట్లు
వ్యయాలు తగ్గడంతో పెరిగిన లాభం న్యూఢిల్లీ: రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్ నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 21 శాతం వృద్ధి చెంది రూ.132 కోట్లకు పెరిగింది. అమ్మకాలు తగ్గినా, తక్కువ వ్యయాల కారణంగా నికర లాభం పెరిగిందని డీఎల్ఎఫ్ తెలిపింది. గత క్యూ2లో రూ.109 కోట్ల నికర లాభం వచ్చిందని పేర్కొంది. అయితే గత క్యూ2లో రూ.2,013 కోట్లుగా ఉన్న కార్యకలాపాల ఆదాయం మాత్రం ఈ క్యూ2లో 7 శాతం క్షీణించి రూ.1,865 కోట్లకు తగ్గిందని వివరించింది. అలాగే మొత్తం ఆదాయం రూ.2,136 కోట్ల నుంచి 6 శాతం క్షీణించి రూ.1,997 కోట్లకు తగ్గిందని కంపెనీ సీఎఫ్ఓ అశోక్ త్యాగి చెప్పారు. మొత్తం వ్యయాలు రూ.1,357 కోట్ల నుంచి రూ.1,071 కోట్ల కు తగ్గాయన్నారు. వడ్డీ వ్యయాలు రూ.603 కోట్ల నుంచి రూ.706 కోట్లకు పెరిగాయని, పన్ను భారంరూ.43 కోట్ల నుంచి రూ.78 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. నిధులు తగినంతగా లభ్యంకాకపోవడం, దీంతో పలు ప్రాజెక్టులు సగం సగం మాత్రమే పూర్తికావడం, వినియోగదారుల్లో కొనగోళ్ల ఆసక్తి లేకపోవడం, మౌలిక రంగ సమస్యలు, వివిధ అనుమతులు పొందడంలో జాప్యం, పెట్టుబడులపై వడ్డీ భారం.. ఈ అంశాలన్నీ రియల్టీ రంగంపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయని చెప్పారు. డీఎల్ఎఫ్కు 30 కోట్ల చదరపుటడుగుల ల్యాండ్ బ్యాంక్ ఉంది. దీంట్లో 5 కోట్ల చదరపుటడుగుల భూమి వివిధ ప్రాజెక్టుల కింద నిర్మాణంలో ఉంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఈ కంపెనీ షేరు బీఎస్ఈలో 1.2 శాతం వృద్ధితో రూ.120 వద్ద ముగిసింది. -
డీఎల్ఎఫ్ నికర లాభం 5 శాతం డౌన్
రూ. 128 కోట్ల నుంచి రూ. 122 కోట్లకు వడ్డీ భారం రూ. 558 కోట్ల నుంచి రూ. 604 కోట్లకు... ఆదాయం రూ. 2,346 కోట్లు న్యూఢిల్లీ : రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్ నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో 5 శాతం క్షీణించింది. గత క్యూ1లో రూ.128 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.122 కోట్లకు తగ్గిందని డీఎల్ఎఫ్ పేర్కొంది. నిర్వహణ ఆదా యం మాత్రం రూ.1,725 కోట్ల నుంచి 2,231 కోట్లకు పెరిగిందని తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,852 కోట్ల నుంచి రూ.2,346 కోట్లకు పెరిగిందని వివరించింది. వడ్డీ భారం రూ.558 కోట్ల నుంచి రూ.604 కోట్లకు ఎగసిందని పేర్కొంది. స్టాండ్ఎలోన్ ప్రాతిపదికన చూస్తే గత క్యూ1లో రూ.73 కోట్ల నికర లాభంరాగా, ఈ క్యూ1లో రూ.102 కోట్ల నష్టాలు వచ్చాయి. -
పీవీఆర్ చేతికి డీఎల్ఎఫ్ డీటీ సినిమాస్
డీల్ విలువ రూ.500 కోట్లు... న్యూఢిల్లీ: డీఎల్ఎఫ్కు చెందిన డీటీ సినిమాస్ను పీవీఆర్ రూ.500 కోట్లకు కొనుగోలు చేసింది. డీఎల్ఎఫ్కు చెందిన డీఎల్ఎఫ్ యుటిలిటిస్ సంస్థ సినిమా ఎగ్జిబిషన్ బిజినెస్ను డీటీ సినిమాస్ పేరుతో నిర్వహిస్తోంది. ఈ సంస్థ 6,000 సీటింగ్ కెపాసిటి ఉన్న 29 స్క్రీన్లతో ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. పీవీఆర్ సినిమాస్ సంస్థ 43 నగరాల్లో 467 స్క్రీన్లను నిర్వహిస్తోంది. డీటీ సినిమాస్ కొనుగోలుతో పీవీఆర్ సంస్థ 44 నగరాల్లో 506 స్క్రీన్లను నిర్వహించే స్థాయికి చేరుతుంది. భారత వినియోగదారులకు ప్రపంచ స్థాయి సినిమా అనుభూతిని అందించే లక్ష్యంలో భాగంగా డిటీ సినిమాస్ను కొనుగోలు చేశామని పీవీఆర్ సీఎండీ అజయ్ బిజిలీ చెప్పారు. -
హైదరాబాద్ డీఎల్ఎఫ్ టవర్కు లీడ్ సర్టిఫికెట్
న్యూఢిల్లీ: రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్కు చెందిన మూడు ఆఫీస్ భవనాలకు అమెరికా గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ లీడ్ గోల్డ్ సర్టిఫికెట్లను ఇచ్చింది. కోల్కతాలోని రెండు ఐటీ పార్క్ టవర్స్కు, హైదరాబాద్లోని ఒక ఐటీ పార్క్ టవర్కు ఈ గోల్డ్ సర్టిఫికెట్లు వచ్చాయి. వీటితో మొత్తం 17 డీఎల్ఎఫ్ ఆఫీస్ భవనాలకు (గుర్గావ్ లోని 12 ఆఫీస్ భవనాలతో కలిపి) లీడ్ సర్టిఫికెట్లు వచ్చినట్లు అవుతుంది. నిర్మాణం, నాణ్యత, నిర్వహణలో ఉత్తమ పద్ధతులను అవలంబించే భవనాలకు మాత్రమే గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ లీడ్ సర్టిఫికెట్లను ఇస్తుంది. ఈ లీడ్ సర్టిఫికేషన్ వల్ల తమ డిమాండ్ మరింత పెరుగుతుందని డీఎల్ఎఫ్ డెరైక్టర్ రాజీవ్ తల్వార్ పేర్కొన్నారు. డీఎల్ఎఫ్కు భవనాలను అద్దెకు ఇవ్వడం ద్వారా వచ్చే వార్షిక ఆదాయం రూ.2 వేల కోట్లకు పైగా ఉంది. చెన్నైలోని ఐటీ పార్క్ ప్రాజెక్టుకు కూడా లీడ్ సర్టిఫికెట్ తీసుకురావడానికి ప్రయత్నిస్తామని డీఎల్ఎఫ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గౌతమ్ డాయ్ తెలిపారు. -
22 శాతం తగ్గిన డీఎల్ఎఫ్ నికర లాభం
న్యూఢిల్లీ: రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్ కన్సాలిడేటెడ్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 22 శాతం తగ్గింది. ఇతర ఆదాయం బాగా పడిపోవడం, అధిక పన్ను వ్యయాల కారణంగా నికర లాభం తగ్గిందని డీఎల్ఎఫ్ తెలిపింది. 2013-14 క్యూ4లో రూ.220 కోట్లుగా ఉన్న నికర లాభం 2014-15 క్యూ4లో రూ.172 కోట్లకు తగ్గిందని వివరించింది. ఆదాయం రూ.1,969 కోట్ల నుంచి రూ.1,954 కోట్లకు పడిపోయిందని పేర్కొంది. ఇతర ఆదాయం రూ.552 కోట్ల నుంచి రూ.147 కోట్లకు తగ్గిందని, పన్ను చెల్లింపులు మాత్రం రూ.68 కోట్ల నుంచి రూ.77 కోట్లకు పెరిగాయని వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో డీఎల్ఎఫ్ షేర్ ఎన్ఎస్ఈలో 0.7 శాతం క్షీణించి రూ.123 వద్ద ముగిసింది. -
స్టాక్స్ వ్యూ
డీఎల్ఎఫ్ బ్రోకరేజ్ సంస్థ: రెలిగేర్ ప్రస్తుత మార్కెట్ ధర: రూ.160 టార్గెట్ ధర: రూ.250 ఎందుకంటే: ప్రమోటర్ల దగ్గరున్న కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్లు(సీసీపీఎస్) కన్వర్షన్ను ఒక ఏడాది కాలం పాటు వాయిదా వేసింది. దీంతో నిధుల సమీకరణకు కంపెనీకి వెసులుబాటు లభిస్తుంది. ఈ నెల 19న జరగాల్సిన ఈ కన్వర్షన్ ఏడాది కాలం పాటు వాయిదా పడింది. మరోవైపు ఈ సీసీపీఎస్లపై చెల్లించాల్సిన కూపన్ రేటు 9 శాతం నుంచి 0.01 శాతానికి తగ్గించారు. దీని వల్ల డివిడెండ్గా చెల్లించాల్సిన 144 కోట్లు కంపెనీకి ఆదా అవుతాయి. మరోవైపు డీఎల్ఎఫ్ ప్రమోటర్లు మార్కెట్లో మూడేళ్ల పాటు కార్యకలాపాలు నిర్వహించరాదన్న సెబీ ఉత్తర్వులను సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్(శాట్) ఆరు నెలలకు తగ్గించింది. శాట్ తాజా ఉత్తర్వు కారణంగా కంపెనీ నిధుల సమీకరణకు అడ్డం కులు దాదాపుగా తొలగినట్లే. కంపెనీ అమ్మకాలు పుంజుకునేదాకా రీట్, క్విప్ల ద్వారా నిధులు సమీకరించడం షేర్ ధరపై సానుకూల ప్రభావమే చూపవచ్చు. అమ్మకాలు పుంజుకుంటే, నగదు నిల్వలు పుష్కలంగా కంపెనీకి అందుబాటులోకి వస్తాయి. దీంతో మిడ్-ఇన్కం ప్రాజెక్ట్లను కంపెనీ ప్రారంభించగలుగుతుందని అంచనా. బ్రోకరేజ్ సంస్థ: నొముర ప్రస్తుత మార్కెట్ ధర: రూ.1,382 టార్గెట్ ధర: రూ.1,930 ఎందుకంటే: ఈ కంపెనీలో 35 శాతం దాకా వాటాలు ఉన్న ప్రైవేట్ ఈక్విటీ (పీఈ)ఇన్వెస్టర్లు తమ వాటాను తగ్గించుకుంటున్నారని, త్వరలో ప్రారంభం కానున్న సెర్చ్ప్లస్(ఆన్లైన్ మార్కెట్ప్లేస్) వ్యాపారంపై ప్రకటనల వ్యయం అంచనాలను మించి పెరిగిపోవచ్చని, తదితర అంశాల కారణంగా ఈ షేర్ ధర ఇటీవల కాలంలో 25 శాతం వరకూ క్షీణించింది. నాలుగేళ్లలో లోకల్ సెర్చ్ బిజినెస్ 26 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తుందని యాజమాన్యం భావిస్తోంది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న సెర్చ్ ప్లస్ వ్యాపారం ఆదాయం 2018-19 కల్లా కంపెనీ రాబడిలో 14 శాతం వరకూ ఉండొచ్చని అంచనా. ఇ-టెయిలింగ్లో ప్రవేశించడం వంటి కారణాల వల్ల కంపెనీ ఆదాయం 31 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించగలదని అంచనా వేస్తున్నాం. అలాగే నాలుగేళ్లలో ఈపీఎస్ 39 శాతం చొప్పున చక్రగతిన పెరుగుతుందని భావిస్తున్నాం. త్వరలో జేడీ క్యాష్ పేరుతో వాలెట్ సర్వీసునూ అందించనున్నది. జేడీ క్యాష్ డెవలప్మెంట్ దాదాపు పూర్తయిందని, త్వరలో ఈ సర్వీస్ను అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. సమ్ ఆఫ్ ద పార్ట్స్(ఎస్ఓటీపీ) ప్రాతిపదికన టార్గెట్ ధరను రూ.1,930గా నిర్ణయించాం. -
డీఎల్ఎఫ్కు ‘శాట్’ ఊరట
సెబీ మూడేళ్ల నిషేధం ఆదేశాల కొట్టివేత న్యూఢిల్లీ: ఐపీవో అవకతవకలకు గాను మూడేళ్ల పాటు మార్కెట్ లావాదేవీలు జరపకుండా నిషేధాన్ని ఎదుర్కొంటున్న రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్కు ఊరట లభించింది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ విధించిన నిషేధాన్ని త్రిసభ్య సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్(శాట్) ‘మెజారిటీ ఆర్డరు’తో కొట్టి వేసింది. అలాగే, కంపెనీ చైర్మన్ కేపీ సింగ్ సహా ఆరుగురు అధికారులపై నిషేధాన్ని కూడా ఎత్తివేసింది. శుక్రవారం నాటకీయ పరిణామాల మధ్య ఇందుకు సంబంధించిన ఆదేశాలు వెలువడ్డాయి. సెబీ నిషేధాన్ని తోసిపుచ్చుతూ శాట్లో ఇద్దరు సభ్యులు (జోగ్ సింగ్, ఏఎస్ లాంబా) మెజారిటీ ఆర్డరు ఇచ్చారు. కానీ, అందుకు భిన్నంగా నిషేధాన్ని మూడేళ్ల నుంచి ఆరు నెలలకు తగ్గిస్తూ శాట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ జేపీ దేవధర్ ఆదేశాలు ఇచ్చారు. నిషేధం తొలగింపుపై భిన్నాభిప్రాయాల కారణంగా మెజారిటీ ఉత్తర్వులపై నాలుగు వారాల స్టే విధించాలన్న దేవధర్ సూచనను మిగతా ఇద్దరు సభ్యులూ తోసిపుచ్చారు. ఏడేళ్ల క్రితం రూ. 9,000 కోట్ల ఐపీవో విషయంలో కీలకమైన అంశాలను ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టి ఉంచారన్న ఆరోపణలపై డీఎల్ఎఫ్ కంపెనీతో పాటు చైర్మన్ సహా ఆరుగురిపై 2014లో సెబీ మూడేళ్ల నిషేధం, రూ. 86 కోట్ల జరిమానా విధించింది. కంపెనీకి చెందిన ముగ్గురు ఉద్యోగుల భార్యలతో షేర్ల కొనుగోళ్లు జరిపించడం ద్వారా మోసపూరిత లావాదేవీలకు తెరతీసిందని ఆరోపించింది. దీన్నే సవాలు చేస్తూ డీఎల్ఎఫ్ శాట్ను ఆశ్రయించగా తాజా ఆదేశాలు వెలువడ్డాయి. మరోవైపు, శాట్ ఉత్తర్వులను డీఎల్ఎఫ్ స్వాగతించింది. శాట్ నుంచి అనుకూల ఆదేశాలతో శుక్రవారం బీఎస్ఈలో డీఎల్ఎఫ్ షేరు 6 శాతం ఎగిసి రూ. 157.5 వద్ద ముగిసింది. -
డీఎల్ఎఫ్కు రూ.86 కోట్ల జరిమానా!
ముంబై: మోసపూరిత, అనుచిత వ్యాపార విధానాలను అనుసరించినందుకు గాను రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్, దాని చైర్మన్ కె.పి.సింగ్ సహా సంస్థకు చెందిన ఏడుగురిపై స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రూ.52 కోట్ల జరిమానా విధించింది. ఒక సంస్థపై సెబీ ఈ స్థాయి జరిమానా విధించటం ఇదే ప్రథమం. డీఎల్ఎఫ్కు చెందిన 33 సంస్థలపై మూడు సంస్థలపై ఇదే నేరానికి గాను మరో రూ.34 కోట్ల జరిమానా కూడా విధించింది. 2007లో పబ్లిక్ ఇష్యూకు వచ్చిన ఈ సంస్థ కీలకమైన సమాచారాన్ని వెల్లడించకుండా తొక్కిపట్టిందంటూ ఆ నేరానికి గాను డీఎల్ఎఫ్ను, సంస్థకు చెందిన ఆరుగురు ఉన్నతస్థాయి ఎగ్జిక్యూటివ్లను మూడేళ్ల పాటు స్టాక్ మార్కెట్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా గతేడాది అక్టోబర్లో నిషేధించటం తెలిసిందే. దానికి కొనసాగింపుగా ఈ 86 కోట్ల జరిమానా విధిస్తూ గురువారం సంస్థ నిర్ణయం తీసుకుంది. కాగా ఈ ఉత్తర్వులను అప్పిలేట్ ట్రిబ్యునల్లో సవాల్ చేస్తామని డీఎల్ఎఫ్ పేర్కొంది. -
రూ.3,000 కోట్లు సమీకరించనున్న డీఎల్ఎఫ్
న్యూఢిల్లీ: రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండు రీట్స్(రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్)ను ఏర్పాటు చేస్తోంది. అంతేకాకుండా వాటా విక్రయం, జాయింట్ వెంచర్ల ద్వారా రూ.3,000 కోట్లు సమీకరించనున్నది. రుణ భారం తగ్గించుకోవడానికి, నగదు నిల్వల పరిస్థితి మెరుగుపరచుకోవడానికి ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని డీఎల్ఎఫ్ పేర్కొంది. గత ఏడాది డిసెంబర్ 31 నాటికి కంపెనీ రుణభారం రూ.20,236 కోట్లుగా ఉంది. సీసీఐ కొరడా: కాగా డీఎల్ఎఫ్పై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) మంగళవారం మరోసారి కొరడా ఝులిపించింది. మార్కెట్లో అగ్రస్థానంలో ఉన్న ఈ కంపెనీ దానిని దుర్వినియోగం చేసేలా ప్రవర్తించిందని, దీనికి ప్రాథమికంగా ఆధారాలున్నాయని, ఈ విషయమై సమగ్రంగా దర్యాప్తు జరపాలని, 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీసీఐ ఆదేశాలిచ్చింది. డీఎల్ఎఫ్ యూనివర్శల్కు చెందిన గుర్గావ్లోని స్కైకోర్ట్ రెసిడెన్షియల్ ప్రాజెక్టుకు సంబంధించి సీసీఐ ఈ ఆదేశాలిచ్చింది. డీఎల్ఎఫ్పై సీసీఐ ఇలాంటి ఆదేశాలివ్వడం రెండు రోజుల్లో ఇది రెండోసారి. గుర్గావ్లోనే ఉన్న డీఎల్ఎఫ్ గార్డెన్ సిటీ ప్రాజెక్ట్కు సంబంధించి సీసీఐ సోమవారం కూడా ఇదే తరహా దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది. కొన్ని కేసుల్లో డీఎల్ఎఫ్దే తప్పంటూ ఇప్పటికే సీసీఐ డీఎల్ఎఫ్పై సీసీఐ రూ.630 కోట్ల జరిమానా విధించింది. దీనికి సంబంధించిన కేసు సుప్రీం కోర్టు విచారణలో ఉంది. -
డీఎల్ఎఫ్-వాద్రా కేసు పత్రాలు మాయం!
-
''మైహోంకి భూ కేటాయింపు టి- ప్రభుత్వ హయాంలో''
-
భట్టి విక్రమార్కతో ఏకీభవిస్తున్నా: రేవంత్రెడ్డి
కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాతే డీఎల్ఎఫ్ భూముల బదలాయింపు జరిగిందన్న భట్టి విక్రమార్క వాదనతో తాను ఏకీభవిస్తున్నట్లు టీడీఎల్పీ ఉపనేత రేవంత్రెడ్డి చెప్పారు. అసెంబ్లీలో భూబాగోతాన్ని లేవనెత్తిన తనను అధికారపక్షం మాట్లాడనివ్వలేదని ఆయన అన్నారు. డీఎల్ఎఫ్ నుంచి అర్హతలు లేని మరో కంపెనీకి భూమిని బదలాయించి, దానికి ప్రతిగా డీఎల్ఎఫ్కు ఖరీదైన భూములు ఇచ్చేశారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ నిర్ణయం వల్ల మైహోం కంపెనీ అధినేత రామేశ్వరరావుకు రూ. 300 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. సీఎం కేసీఆర్ విచారణ జరిపిస్తే ఇది కుంభకోణమని తాను నిరూపిస్తానని రేవంత్ సవాలు చేశారు. ఆపరేషన్ బ్లూస్టార్ పేరుతో తన గొంతు నొక్కి, ప్రాణాలు హరించాలని చూస్తే ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. అవినీతి బాగోతం బయటపడుతుందనే అధికారపక్షం మాట్లాడకుండా సభ నుంచి పారిపోయిందని ఎద్దేవా చేశారు. చర్చ ముగిసిపోయిన తర్వాత ఈ వ్యవహారంపై ఫైళ్లను స్పీకర్ వద్ద ఉంచితే ఏం ప్రయోజనం ఉంటుందని ప్రశ్నించారు. ప్రభుత్వం తప్పు చేసిందన్న తమ వాదనను కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క నిరూపించారని రేవంత్ రెడ్డి చెప్పారు. -
9 గంటలకే అసెంబ్లీకి చేరుకోండి: కేసీఆర్
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర శాసన సభ సమావేశాల్లో డీఎల్ఎఫ్ భూ కేటాయింపులపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. శుక్రవారం జరిగే అసెంబ్లీ సమావేశాల్లో డీఎల్ఎఫ్ భూ కేటాయింపుల అంశాన్ని ప్రధానంగా చర్చించనున్నారు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో భూ కేటాయింపులపై ఎదురుదాడికి అధికారపక్షం కూడా సిద్ధమవుతోంది. ఉదయం తొమ్మిది గంటలకే అసెంబ్లీకి చేరుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఇదిలా ఉండగా శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశం. అసెంబ్లీ సమావేశాల పొడిగింపుపై చర్చించనున్నారు. -
భూముల బదలాయింపులపై అసెంబ్లీలో చర్చ
-
'కొందరు నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలే..'
-
'కొందరు నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలే..'
హైదరాబాద్ : డీఎల్ఎఫ్ భూముల బదలాయింపులపై ముఖ్యమంత్రి కేసీఆర్ గురవారం శాసనసభలో ప్రకటన చేశారు. డీఎల్ఎఫ్ భూముల బదలాయింపులపై చర్చ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ డీఎల్ఎఫ్ సంస్థ రూ.580 కోట్లతో 31.31 ఎకరాల భూమిని కొనుగోలు చేసిందని తెలిపారు. డీఎల్ఎఫ్కు ప్రత్యామ్నాయ భూములు రాయదుర్గం వద్ద కేటాయించినట్లు కేసీఆర్ వెల్లడించారు. సెప్టెంబర్ 2013లో భూములు రిజిస్ట్రేషన్ అయినట్లు ఆయన తెలిపారు. శేరిలింగంపల్లిలోని 471 ఎకరాలను ఏపీఐఐసీకి అప్పగించారని కేసీఆర్ పేర్కొన్నారు. అందులో కొంత భూమిని ఏపీఐఐసీ విక్రయించి ప్రభుత్వానికి నిధులు ఇచ్చిందన్నారు. సభలో వ్యక్తులు తమ స్థాయిని బట్టి విమర్శలు చేయాలని....అంతేకానీ ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేయటం సరికాదని కేసీఆర్ అన్నారు. కొందరు నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ఏపీఐఐసీ భూములు అమ్మవద్దని ఎన్నోసార్లు ఆందోళన చేశామని కేసీఆర్ తెలిపారు. తమది ఎవరో నామినేట్ చేస్తే వచ్చిన ప్రభుత్వం కాదని, ఎన్నికల్లో గెలిచి వచ్చిన పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. -
డీఎల్ఎఫ్పై నిషేధంతో ఫండ్స్లో అయోమయం
ముంబై: రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్పై సెబీ నిషేధం... మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్) సంస్థలను అయోమయానికి గురిచేస్తున్నాయి. 2007లో ఐపీఓ సందర్భంగా కంపెనీకి సంబంధించిన కొంత సమాచారాన్ని వెల్లడించకుండా దాచిపెట్టిందన్న కారణంగా డీఎల్ఎఫ్, దాని వ్యవస్థాప చైర్మన్ కేపీ సింగ్తోపాటు మరో అయిదుగురు ఎగ్జిక్యూటివ్లపై సెబీ మూడేళ్లపాటు నిషేధం విధించడం తెలిసిందే. దీనివల్ల డీఎల్ఎఫ్ సుమారు రూ.2,500 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్ యూనిట్లను విక్రయించడానికి వీల్లేని పరిస్థితి నెలకొంది. ఎంఎఫ్లకూ సెబీ నియంత్రణ సంస్థే. అయితే, స్టాక్ మార్కెట్లకు సంబంధించి నిర్ణయాలన్నింటినీ ఫండ్స్పైనా రుద్దకూడదని ఒక ఎంఎఫ్ సంస్థకు చెందిన సీఈఓ అభిప్రాయపడ్డారు. కాగా, సెబీ నిషేధ ఆదేశాలను సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్(శాట్)లో సవాలు చేసిన డీఎల్ఎఫ్... ఫండ్స్ యూనిట్ల విక్రయంతోపాటు దేశీయంగా రూ.5,000 కోట్ల నిధుల సమీకరణకు వీలుగా మధ్యంతర ఉపశమనం కల్పించాలని కూడా విజ్ఞప్తి చేసింది. డీఎల్ఎఫ్ పిటిషన్ను ఈ నెల 30న శాట్ విచారించనుంది. -
కుప్పకూలిన డీఎల్ఎఫ్ షేరు
ముంబై: నాలుగేళ్ల దర్యాప్తు తరువాత మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మూడేళ్లపాటు స్టాక్ మార్కెట్ కార్యకలాపాల నుంచి డీఎల్ఎఫ్ను నిషేధించడంతో ఇన్వెస్టర్లు షాక్తిన్నారు. ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీతోపాటు, బీఎస్ఈ-100 సూచీలో భాగమైన ఒక షేరుపై సెబీ ఈ స్థాయిలో విరుచుకుపడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో డీఎల్ఎఫ్ షేర్లను వొదిలించుకోవడానికి ఇన్వెస్టర్లు క్యూ కట్టారు. వెరసి బీఎస్ఈలో డీఎల్ఎఫ్ షేరు ఒక్కసారిగా 28% కుప్పకూలింది. రూ. 105 వద్ద ముగిసింది. ఒక దశలో అమ్మకాలు వెల్లువెత్తడంతో 30% వరకూ దిగజారి రూ. 103 వద్ద కనిష్టాన్ని సైతం చవిచూసింది. ఇది చరిత్రాత్మక కనిష్టంకాగా, ఎన్ఎస్ఈలోనూ ఇదే స్థాయిలో పతనమై రూ. 105 వద్ద నిలిచింది. ఒక్క రోజులో కంపెనీ మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్) రూ. 7,439 కోట్లమేర ఆవిరైంది. ఫలితంగా కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 18,701 కోట్లకు పరిమితమైంది. రెండు ఎక్స్ఛేంజీలలోనూ కలిపి దాదాపు 10 కోట్ల షేర్లు ట్రేడ్కావడం విశేషం! రియల్టీ షేర్లు విలవిల: డీఎల్ఎఫ్ ప్రభావంతో బీఎస్ఈలో రియల్టీ ఇండెక్స్ ఏకంగా 9% పడిపోయింది. హెచ్డీఐఎల్, యూనిటెక్, డీబీ రియల్టీ, గోద్రెజ్ ప్రాపర్టీస్, అనంత్ రాజ్ 5-1% మధ్య నష్టపోయాయి. 2007లో చేపట్టిన ఐపీవోలో భాగంగా దాఖలు చేసిన ప్రాస్పెక్టస్లో ఇన్వెస్టర్లను తప్పుదారి పట్టించే విధంగా సమాచారాన్ని దాచిపెట్టిందంటూ డీఎల్ఎఫ్ను మూడేళ్లపాటు స్టాక్ మార్కెట్ కార్యకలాపాల నుంచి సెబీ నిషేధించింది. అంతేకాకుండా ప్రమోటర్, చైర్మన్ కేపీ సింగ్, కుమారుడు రాజీవ్ సింగ్(వైస్చైర్మన్), కూతురు పియా సింగ్(హోల్టైమ్ డెరైక్టర్)లతోసహా ఆరుగురు అత్యున్నత అధికారులను సైతం క్యాపిటల్ మార్కెట్ కార్యకలాపాల నుంచి నిషేధిస్తూ ఆదేశాలను జారీ చేయడంతో షేరు కుప్పకూలింది. కాగా, అక్రమ బిజినెస్ నిర్వహణకు సంబంధించి కాాంపిటీషన్ కమిషన్ విధించిన రూ. 630 కోట్లను మూడు నెలల్లోగా జమ చేయాల్సిందిగా సుప్రీం కోర్టు ఆగస్ట్ చివర్లో డీఎల్ఎఫ్ను ఆదేశించిన విషయం విదితమే. మరోవైపు గుర్గావ్లో ప్రభుత్వం డీఎల్ఎఫ్కు కేటాయించిన 350 ఎకరాల భూమిని రద్దు చేస్తూ పంజాబ్, హర్యానా హైకోర్టు గత నెలలో ఆదేశాలు జారీ చేసింది కూడా. -
డీఎల్ఎఫ్పై సెబీ మూడేళ్ల నిషేధం
ప్రమోటర్ కేపీ సింగ్,టాప్ ఎగ్జిక్యూటివ్లపై కూడా * స్టాక్ మార్కెట్ కార్యకలాపాలకు చెక్ * ఐపీవోలో తప్పుడు సమాచార ఫలితం ముంబై: రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్తోపాటు, ప్రమోటర్, చైర్మన్ కేపీ సింగ్ తదితర ఆరుగురు అత్యున్నత అధికారులపై నిషేధం వేటు పడింది. మూడేళ్లపాటు క్యాపిటల్ మార్కెట్లలో ఎలాంటి కార్యకలాపాలూ చేపట్టడానికి వీలులేకుండా నిషేధిస్తూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశాలు జారీచేసింది. పబ్లిక్ ఆఫర్ సమయంలో ఇన్వెస్టర్లను తప్పుదారి పట్టించే విధంగా కంపెనీ అవకతవకల సమాచారాన్ని ప్రకటించడమే దీనికి కారణమని సెబీ జీవితకాల సభ్యులు రాజీవ్ అగర్వాల్ తెలిపారు. నిషేధానికి గురైన ఎగ్జిక్యూటివ్లలో కేపీ సింగ్ కుమారుడు రాజీవ్ సింగ్(డీఎల్ఎఫ్ వైస్చైర్మన్), కుమార్తె పియా సింగ్ (హోల్టైమ్ డెరైక్టర్) సహా టీసీ గోయల్(ఎండీ), కామేశ్వర్ స్వరూప్(అప్పటి సీఎఫ్వో), రమేష్ శంకా(అప్పటి ఈడీ, లీగల్) సైతం ఉన్నారు. సెబీ నిషేధంవల్ల వాటాల విక్రయం, కొనుగోలు, నిధుల సమీకరణ వంటి కార్యక్రమాలు చేపట్టేందుకు వీలుండదు. ప్రమోటర్లకు కంపెనీలో దాదాపు 75% వాటా ఉంది. నిబంధనల ఉల్లంఘన...: వివరాల వెల్లడి, ఇన్వెస్టర్ల రక్షణ(డీఐపీ) మార్గదర్శకాలతోపాటు, మోసం, అవకతవకల కార్యకలాపాల నిరోధం(పీఎఫ్యూటీపీ) వంటి సెబీ నిబంధనలను డీఎల్ఎఫ్ టాప్ ఎగ్జిక్యూటివ్లు ఉల్లంఘించారని రాజీవ్ పేర్కొన్నారు. ఈ కేసులో జరిగిన నిబంధనల ఉల్లంఘన వల్ల సెక్యూరిటీల మార్కెట్ రక్షణ, విలువలపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. కిమ్సుక్ కృష్ణ సిన్హా అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టు, సెబీకి సైతం కంపెనీపై ఫిర్యాదు చేయడంతో 2010లో సెబీ డీఎల్ఎఫ్పై దర్యాప్తు మొదలుపెట్టింది. 2007లో పబ్లిక్ ఇష్యూ పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు సెబీ వద్ద డీఎల్ఎఫ్ 2007 జనవరిలో ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఆపై 2007 మే నెలలో చేపట్టిన ఇష్యూ ద్వారా రూ. 9,187 కోట్లను సమీకరించింది. స్టాక్ ఎక్స్ఛేం జీలలో జూలై 2007లో లిస్టయ్యింది. కాగా, ఈ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో డీఎల్ఎఫ్ షేరు 3.7% పతనమై రూ. 147 వద్ద ముగిసింది. సెబీ నుంచి నోటీస్ అందుకున్నామని, ఈ అంశాన్ని న్యాయ సలహాదారులతో సమీక్షిస్తున్నామని డీఎల్ఎఫ్ బీఎస్ఈకి తెలిపింది. తాము ఎలాంటి చట్టాలను ఉల్లంఘించలేదని ఒక ప్రకటనలో పేర్కొంది. -
'ప్రధాని అనే విషయాన్ని మోడీ మర్చిపోతున్నారు'
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు కేటాయించిన భూముల వ్యవహారంపై ప్రధాని నరేంద్రమోడీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ ధీటుగా జవాబిచ్చింది. సోమవారం హర్యానాలోని ఓ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ.. డీఎల్ఎఫ్, వాద్రా మధ్య జరిగిన వివాదస్పద భూకేటాయింపులకు హర్యానా ప్రభుత్వం అనుమతివ్వడంపై ఎన్నికల కమిషన్ తగిన చర్యలు తీసుకోవాలని మోడీ అన్నారు. మోడీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ నేత సాల్మన్ ఖుర్షీద్ ధీటుగా స్పందించారు. మోడీ ప్రధాని అనే విషయాన్ని మర్చిపోతున్నారు. మద్దతుదారులకు ఆయన ప్రసంగం ఉత్తేజం కలిగించేలానే ఉంది. అయితే జాగ్రత్తగా ప్రధాని మాట్లాడాలి అని ఖుర్షీద్ అన్నారు. వాద్రా, డీఎల్ఎఫ్ ల మధ్య జరిగిన 58 కోట్ల భూకేటాయింపులు 2012 అక్టోబర్ లో రద్దు చేశారు. -
‘మెట్రో’ స్థలం మార్చలేదు
ఆక్వా స్పేస్ డెవలపర్స్కు అనుకూలంగా వ్యవహరించలేదు: టీఎస్ఐఐసీ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు గతంలో కేటాయించిన 15 ఎకరాల స్థలాన్ని మార్చలేదని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ) స్పష్టం చేసింది. ఆక్వా స్పేస్ డెవలపర్స్ కోసం ఎటువంటి ఆశ్రీత పక్షపాతం చూపలేదని పేర్కొంది. ఈ మేరకు టీఎస్ఐఐసీ వీసీ, ఎండీ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2007లో రూ. 580.50 కోట్లను చెల్లించి రాయదుర్గంలోని ఏపీఐఐసీ భూమిని డీఎల్ఎఫ్ (ప్రస్తుతం ఆక్వా స్పేస్ డెవలపర్స్) కొనుగోలు చేసిందని అందులో పేర్కొన్నారు. ఆ సొమ్ము ప్రభుత్వ ఖజానాలో జమ అయిందని తెలిపారు. అయితే ఆ భూమిలో వారసత్వ సంపద (పురాతన శిలా ఫలకాలు) ఉన్నందున ప్రత్యామ్నాయ స్థలాన్ని ఆ సంస్థకు కేటాయించామని తెలిపారు. అదేవిధంగా వేలంలో కొన్న భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ. 2.90 కోట్లను, రూ. 31.92 కోట్ల స్టాంపు డ్యూటీని 2013 సెప్టెంబర్లోనే ఆ సంస్థ చెల్లించిందని ఆ ప్రకటనలో వెల్లడించారు. మొత్తంగా ఏడేళ్ల తర్వాత 2014 ఆగస్ట్లో ఆ సంస్థతో ఎక్స్ఛేంజ్ డీడ్ కుదుర్చుకున్నామన్నారు. సంస్థ పేరు మార్పునకు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) కూడా అంగీకరించిందని.. పేరు మార్పు పూర్తిగా చట్టపరమైనదని, ఇందులో ఎటువంటి తప్పు లేదని వివరించారు. -
'కేసీఆర్ సొంత వ్యవహారంగా చూడటం సరికాదు'
హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రోపై విపక్షాలు విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. మెట్రో పనుల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత వ్యవహారంగా చూడటం సరికాదని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి అన్నారు. ప్రాజెక్ట్పై అనుమానాలన్నింటినీ కేసీఆర్ నివృత్తి చేయాలని ఆయన గురురవామిక్కడ డిమాండ్ చేశారు. డీఎల్ఎఫ్కు కేటాయించిన 31 ఎకరాలు 'మైహోం'కు బదలాయించటం నిబంధనలకు విరుద్ధమన్నారు. ఇదే అంశంపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ మెట్రో ప్రాజెక్టు వివాదాస్పదం కావటం దురదృష్టకరమన్నారు. మెట్రో సమస్యలపై కేసీఆర్ సమీక్షించకపోవటం సరికాదన్నారు. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామంటున్న కేసీఆర్ దీనిపై చిత్తశుద్ధితో వ్యవహరించాలని సూచించారు. త్వరలోనే తెలంగాణ పీసీసీ పునర్ వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు పొన్నాల తెలిపారు. -
డీఎల్ఎఫ్కు సుప్రీం షాక్
న్యూఢిల్లీ: రియల్టీలో గుత్తాధిపత్యం ప్రదర్శిస్తూ... అక్రమ వ్యాపార విధానాలను అనుసరించిందన్న కేసులో ఆ రంగంలో దిగ్గజ సంస్థ డీఎల్ఎఫ్కు అత్యున్నత న్యాయస్థానం బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ఫెయిర్ ట్రేడ్ రెగ్యులేటర్ కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీఐఐ) గతంలో విధించిన రూ.630 కోట్ల జరిమానాను అత్యున్నత న్యాయస్థానం రిజిస్ట్రీ వద్ద డిపాజిట్ చేయాలని డీఎల్ఎఫ్ను ఆదేశించింది. మూడు వారాల్లో రూ.50 కోట్లను, మొత్తం డబ్బును మూడు నెలల్లో తన రిజిస్ట్రీ వద్ద డిపాజిట్ చేయాలని నిర్దేశించింది. తద్వారా సీఐఐ, అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన రూలింగ్పై స్టేకు ససేమిరా అంది. విచారణకు మాత్రం డీఎల్ఎఫ్ అప్పీల్ను అడ్మిట్ చేసింది. అప్పీల్ పెండింగ్లో ఉండగా రూ.630 కోట్లు డిపాజిట్ చేయాల్సిన డీఎల్ఎఫ్, ఒకవేళ అప్పీల్లో తనకు వ్యతిరేకంగా తీర్పువచ్చే మొత్తం నిధులపై 9 శాతం వడ్డీని కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి అండర్టేకింగ్ ఇవ్వాలని సూచించింది. ఈ మేరకు జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్, జస్టిస్ ఎన్వీ రమణలతో కూడిన ధర్మాసనం కీలక మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 2011, నవంబర్ 9వ తేదీన సీఐఐ ఈ కేసులో తన ఉత్తర్వులు వెలువరించినప్పటి నుంచి వడ్డీ చెల్లింపు వర్తిస్తుంది. డిపాజిట్ను చెల్లించడానికి ఆరు నెలల సమయం ఇవ్వాలని డీఎల్ఎఫ్ కోరినప్పటికీ, దీనిని సుప్రీం తిరస్కరించింది. డీఎల్ఎఫ్ డిపాజిట్ చేసిన మొత్తాన్ని జాతీయ బ్యాంకు ఎందులోనైనా ఇన్వెస్ట్ చేయవచ్చని కూడా అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వివరాలు ఇవీ... ఈ కేసులో సుప్రీంలో రెస్పాండెంట్లుగా రెసిడెంట్స్ అసోసియేషన్తో పాటు హర్యానా ప్రభుత్వం, హర్యానా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్యూడీఏ) ఉన్నాయి. గుర్గావ్లోని బెలైరీ ఓనర్స్ అసోసియేషన్ (కొనుగోలుదారుల అసోసియేషన్) 2010 మేలో డీఎల్ఎఫ్పై ఒక ఫిర్యాదుచేసింది. వ్యాపారంలో గుత్తాధిపత్య ధోరణిని ప్రదర్శిస్తూ, నిబంధనలను సంస్థ పట్టించుకోలేదని కొనుగోలుదారులు పేర్కొన్నారు. అపార్ట్మెంట్స్ కేటాయింపుల్లో పూర్తి ఏకపక్ష ధోరణిని సంస్థ అవలంబించిందనీ, అసమంజస, అర్థంలేని నిబంధనలను విధించిందని బెలైరీ ఓనర్స్ అసోసియేషన్ తన ఫిర్యాదులో పేర్కొంది. ఇవి కొనుగోలుదారుల హక్కులకు పూర్తిగా విఘాతం కలుగజేసినట్లు అసోసియేషన్ సీఐఐకి విన్నవించింది. 2013-14లో డీఎల్ఎఫ్ ఆదాయం రూ.8,298 కోట్లు. ఈ మొత్తంలో రూ.630 కోట్లు 7.5 శాతానికి సమానం. మెరిట్స్పై విశ్వాసం: డీఎల్ఎఫ్ సుప్రీంకోర్టు ఆదేశాలను శిరసా పాటిస్తామని డీఎల్ఎఫ్ పేర్కొంది. ఈ కేసులో మెరిట్స్ పట్ల తనకు పూర్తి విశ్వాసముందని సైతం పేర్కొంది. సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల కాపీ కోసం ఎదురుచూస్తున్నట్లు బీఎస్ఈకి సమర్పించిన ఒక ఫైలింగ్లో తెలిపింది. నష్టాల్లో కంపెనీ షేరు... సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో డీఎల్ఎఫ్ షేరు బుధవారం భారీ నష్టాన్ని చవిచూసింది. బీఎస్ఈలో కంపెనీ షేరు ధర క్రితం ముగింపుతో పోల్చితే 4.44 శాతం (రూ.8.50) దిగజారి, రూ.183.05 వద్ద ముగిసింది. -
ఆ 600కోట్ల జరినామా సబబే!
-
డీఎల్ఎఫ్ కు 630 కోట్ల జరిమానా!
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ కంపెనీ డీఎల్ఎఫ్ కు సుప్రీం కోర్టు బుధవారం భారీ జరిమానా విధించింది. గుర్గావ్ లోని మూడు ప్రాజెక్టుల్లో తన కస్టమర్లను మోసగించారనే ఆరోపణలపై డీఎల్ఎఫ్ కంపెనీకి 630 కోట్ల జరిమానాను విధిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా 630 కోట్ల రూపాయలపై 170 కోట్ల రూపాయల వడ్డీని కూడా చెల్లించాలని జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్, ఎన్ వీ రమణలు తీర్పు నిచ్చారు. మూడు వారాల్లోగా 50 కోట్లు, మిగితా 580 కోట్ల రూపాయలను మూడు నెలల్లోగా డిపాజిట్ చేయాలని ఆదేశించింది. జరిమానా మొత్తాన్ని జాతీయ బ్యాంకులో ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలని రిజిస్త్రీకి కోర్టు సూచించింది. -
అనుమతులు ఉపసంహరణ, డీఎల్ఎఫ్ కు ఎదురుదెబ్బ!
తిరువనంతపురం: ప్రతిపక్షాల ఆందోళనకు తలవొంచిన కేరళ ప్రభుత్వం డీఎల్ఎఫ్ ప్రాజెక్ట్ కు మంగళం పాడింది. నిబంధనలకు విరుద్దంగా కోచి లో డీఎల్ఎఫ్ చేపట్టిన కాంప్లెక్స్ నిర్మాణ పనులు రద్దు చేయాలని ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టారు. కేవలం లబ్ది పొందడానికే కాంగ్రెస్, యూడీఎఫ్ ప్రభుత్వం డీఎల్ఎఫ్ కు అనుమతిచ్చిందని ప్రతిపక్ష ఎల్ డీఎఫ్ ఆరోపణలు చేసింది. దాంతో ఈ ప్రాజెక్ట్ పనులను రద్దు చేస్తూ కేరళ ప్రభుత్వం ఉత్దర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు సంబంధమున్న కంపెనీకి లబ్ది చేకూర్చడానికే డీఎల్ఎఫ్ ప్రాజెక్ట్ కు అనుమతిచ్చారని ఎల్ డీఎఫ్ ఆరోపించింది. ఈ ప్రాజెక్ట్ పనుల్లో అవినీతి చోటు చేసుకుందని, రాజకీయంగా లబ్ది పొందడానికే డీఎల్ఎఫ్ కు నిబంధనలకు వ్యతిరేకంగా అనుమతిచ్చారని ఎల్ డీఎఫ్ ధర్నా నిర్వహించింది. గత ఏప్రిల్ లో పర్యావరణ శాఖ ఇచ్చిన క్లియరెన్స్ మేరకే ఈ ప్రాజెక్ట్ కు అనుమతిచ్చామని ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ, పర్యావరణ శాఖ రాధాకృష్ణన్ నోటిసులకు సమాధానమిచ్చారు. ఈ వ్యవహరంపై ఐదు రోజులుగా రిపోర్టు సిద్ధం చేయాలని ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి చాందీ కోరారు. -
విద్యుత్ కోతలతో వెతలు
గుర్గావ్: విద్యుత్ సంక్షోభం కారణంగా గత రెండు వారాలుగా నగరవాసులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ఆవాస, వాణిజ్య ప్రాంతాలకు రోజుకు 12 గంటలపాటు విద్యుత్ సరఫరాలో కోత విధిస్తున్నారు. విద్యుత్ సరఫరాలో కోతలకు వేళాపాళా లేకుండాపోయింది. ఈ విషయమై నగరంలోని ఆర్డీ సిటీ ప్రాంత నివాసి టీఎన్ కౌల్ మాట్లాడుతూ తమ ప్రాంతంలో గంటకోసారి కరెంట్ పోతోందన్నారు. రోజంతా ఇదే పరిస్థితి కొనసాగుతోందన్నారు. ఒక్కోసారి ఆరు నుంచి ఎనిమిది గంటలవరకూ కరెంట్ రావడం లేదన్నారు. కాగా నగరంలోని డీఎల్ఎఫ్-3, 4, సుశాంత్ లోక్, ఉద్యోగ్ విహార్, ఐఎంటీ మనేసార్లలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ కోతలతో విసిగిపోయిన గుర్గావ్ సిటిజన్స్ కౌన్సిల్ (జీసీసీ) దీనిపై న్యాయపోరాటానికి దిగాలని యోచిస్తోంది. ఈ విషయాన్ని ఆ సంస్థ అధ్యక్షుడు ఆర్.ఎస్.రథీ వెల్లడించారు. ఆయా కాలనీవాసులు దక్షిణ్ హర్యానా బిజిలీ వితరణ్ నిగం (డీహెచ్బీవీఎన్)పై దాఖలు చేసిన పిటిషన్ను పరిశీలిస్తున్నామని, అదే బాటలో తాము కూడా పయనిస్తామని చెప్పారు. త్వరలో జరగనున్న రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆర్డబ్ల్యూఎస్) సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తుతామని ఆయన వివరించారు. కాగా కొద్దిరోజుల క్రితం నగరంలో పెనుగాలిదుమారం వీచిన సంగతి విదితమే. దీని ధాటికి డీహెచ్బీవీఎన్)కు చెందిన ట్రాన్స్మిషన్ లైన్లు ధ్వంసమయ్యాయి. దీంతో అనేక ప్రాంతాలకు విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా మారిపోయింది. విద్యుత్ సరఫరాలో కోత ప్రభావం నగరంలో నీటి సరఫరాకు కూడా తీవ్ర విఘాతం కలిగించింది. దీంతో నగరవాసులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. మూడురోజులుగా నగరంలోని అనేక ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. ఈ విషయమై డీఎల్ఎఫ్ అధికార ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడుతూ మూడు రోజులుగా చుక్క నీరు రావడం లేదు. బసాయి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఈ పరిస్థితి తలెత్తింది’ అని అన్నారు. ఈ విషయమై డీహెచ్బీవీఎన్కు చెందిన ఉన్నతాధికారి మాట్లాడుతూ విద్యుత్ సంక్షోభం తలెత్తితే దాని ప్రభావం నీటి సరఫరాపై కూడా సహజంగానే పడుతుందన్నారు. అందువల్ల బసాయి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కు ప్రత్యేకంగా ఓ సబ్స్టేషన్ను నిర్మించాలని కోరుతూ ఎంసీజీతోపాటు హుడాకు ఓ లేఖ రాశామన్నారు. ఇదొక్కటే నీటి సరఫరాలో కోతకు శాశ్వత పరిష్కారమన్నారు. మరో అధికారి సంజీవ్ చోప్రా మాట్లాడుతూ దౌలతాబాద్, బాద్షాపూర్ సబ్స్టే షన్లలో సాంకేతిక సమస్యల ప్రభావం నగరంపై తీవ్రంగా పడిందన్నారు. పెనుదుమారం కారణంగా దెబ్బతిన్న ఫీడర్లను వీలై నంత త్వరగా పునరుద్ధరిస్తామన్నారు. వాస్తవానికి విద్యుత్ కొరత సమస్య అనేదే లేదని, అయితే సాంకేతిక అవరోధాల వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన వివరించారు. సిబ్బంది కొరతతో సమస్య జటిలం గుర్గావ్: ట్రాన్స్మిషన్ లైన్లలో తలెత్తిన సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు డిస్కం వద్ద తగి నంత సిబ్బంది లేరు. ఇది విద్యుత్ సంక్షోభాన్ని మరింత జటిలం చేస్తోంది. వాస్తవానికి తమకు 1,500 మంది సిబ్బంది అవసరమని, ప్రస్తుతం 500 మంది మాత్రమే ఉన్నారని దక్షిణ్ హర్యానా బిజిలీ వితరణ్ నిగం (డీహెచ్బీవీఎన్) జనరల్ మేనేజర్ సంజీవ్ చోప్రా వెల్లడించారు.తమ సర్కిల్లో చివరిసారిగా 30 ఏళ్ల క్రితం నియామకాలు జరిగాయన్నారు. అప్పట్లో తమ సర్కిల్ పరిధిలోని వినియోగదారుల సంఖ్య లక్షమంది మాత్రమేనన్నారు. అయితే ప్రస్తుతం వారి సంఖ్య నాలుగు లక్షలకు చేరుకుందన్నారు. వినియోగదారుల సంఖ్య బాగా పెరిగిపోయినప్పటికీ సిబ్బంది సంఖ్యలో ఎంతమాత్రమూ మార్పు లేదన్నారు. అప్పట్లో ఒకటి లేదా రెండు సబ్స్టేషన్లు మాత్రమే ఉన్నాయన్నారు. తమ సర్కిల్ పరిధిలో తలెత్తే సమస్యలను పరిష్కరించాలంటే కనీసం 1,500 మంది సిబ్బంది అవసరమన్నారు. ప్రతి ఏడాది తమ సర్కిల్ పరిధిలో వినియోగదారుల సంఖ్య ప్రతి ఏడాది కనీసం 2,000 చొప్పున పెరుగుతోందన్నారు. తమ బాధ్యతలను మరింత బాధ్యతాయుతంగా, సమర్థంగా నిర్వర్తిచాలంటే వినియోగదారుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నందువల్ల సిబ్బంది సంఖ్య కూడా పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇక వర్షాకాలంలో అయితే బ్రేక్డౌన్లు అత్యంత సహజమన్నారు.దీంతోపాటు అనేకరకాల సాంకేతిక సమస్యలు అత్యంత సహజంగా తలెత్తుతాయన్నారు. ఎక్కడైనా సాంకేతిక సమస్య తలెత్తితే అక్కడికి పంపేందుకు తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో పరిష్కారమయ్యేందుకు చాలా సమయం పడుతోందన్నారు. ఒక్కోసారి అనేక ప్రాంతాల్లో ఒకేసారి బ్రేక్డౌన్ సమస్య కూడా తలెత్తుతుం టుందన్నారు. వేసవి ఆరంభం నుంచేవేసవి కాలం ఆరంభం నుంచే నగరంలో విద్యుత్ సరఫరాలో కోత విధిస్తున్నారని పలు కాలనీలు, సెక్టార్ల వాసులు ఆరోపిస్తున్నారు. దానికి కూడా వేళాపాళా ఉండదన్నారు. ఇష్టారాజ్యంగా కోత విధిస్తున్నారంటూ వాపోయారు. ఎన్నో పర్యాయాలు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఇదిలావుంచితే వడగాడ్పులు, ఉక్కపోతలను తట్టుకునేందుకు బిల్డర్లకు చెందిన జనరేటర్లపై ఆధారపడుతున్నారు. -
డీఎల్ఎఫ్కు సీబీఐ క్లీన్చిట్!
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్కు నిర్మాణ అనుమతుల కేసులో సీబీఐ క్లీన్చిట్ ఇచ్చింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్కు సమీపంలోని స్థలంలో డీఎల్ఎఫ్ లగ్జరీ అపార్ట్మెంట్ సముదాయాన్ని నిర్మించడానికి అనుమతులివ్వడంపై దుమారం చెలరేగడం, భదత్రపరమైన ఆందోళనలు నెలకొనటంతో సీబీఐ దీనిపై ప్రాథమిక దర్యాప్తు (పీఈ) చేపట్టింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు (సీవీసీ) అందిన ఫిర్యాదుతో పట్టణాభివృద్ధి శాఖకు చెందిన కొందరు అధికారులపై గతేడాది జూలైలో సీబీఐ విచారణ ఆరంభించింది. ముఖ్యంగా డెయిరీ ఫార్మింగ్ కోసం ఉద్దేశించిన ఈ స్థలాన్ని అపార్ట్మెంట్ల నిర్మాణం కోసం మార్చుకునేలా నిబంధనలకు విరుద్ధంగా అనుమతులిచ్చారనేది ఆరోపణ. అయితే, ఈ కేసులో ఎలాంటి నేరపూరిత అంశాలూ లేవని తేలినట్లు సీబీఐ అత్యున్నత స్థాయి వర్గాలు మంగళవారం వెల్లడించాయి. దీంతో విచారణను ముగిస్తున్నట్లు కూడా పేర్కొన్నాయి. డీఎల్ఎఫ్ పదేళ్ల క్రితం ఈకేఎస్పీఎల్ అనే సంస్థను కొనుగోలు చేసింది. దీంతో ఈకేఎస్పీఎల్కు రాష్ట్రపతి భవన్ సమీపంలో ఉన్న 22.9 ఎకరాల డెయిరీ ఫార్మ్ స్థలం కూడా డీఎల్ఎఫ్కు దక్కింది. ఈ స్థలంలో నాలుగంతస్తుల లగ్జరీ అపార్ట్మెంట్లను నిర్మించడానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది. దీనిపై నమోదైన కేసులో ఢిల్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం కూడా కంపెనీకి అనుకూలంగా తీర్పిచ్చింది. ప్రభుత్వానికి మార్పిడి చార్జీల కింద రూ.1,200 కోట్ల మొత్తాన్ని డిపాజిట్ చేయడంతో గ్రీన్ సిగ్నల్ లభించింది. మరోపక్క, ఈ కేసుకు సంబంధించి మరింత లోతుగా దర్యాప్తు జరిపించేందుకు ప్రత్యేక దర్యాప్తు బందాన్ని(సిట్) ఏర్పాటు చేయటంపై దృష్టి సారించాలని బీజేపీ నాయకుడు సుబ్రమణ్యం స్వామి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. -
అమన్ రిసార్ట్స్ విక్రయం: డీఎల్ఎఫ్
న్యూఢిల్లీ: ఆతిథ్య రంగానికి చెందిన విలాసవంత హోటళ్ల చైన్ ‘అమన్ రిసార్ట్స్’ను రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్ విక్రయించింది. అమన్ రిసార్ట్స్ను తొలిసారిగా ఏర్పాటు చేసిన మొట్టమొదటి ప్రమోటర్ అడ్రియన్ జెకాకే వీటిని అమ్మివేసినట్లు డీఎల్ఎఫ్ పేర్కొంది. డీల్ విలువను రూ. 35.8 కోట్ల డాలర్లు(రూ. 2,200 కోట్లు)గా ప్రకటించింది. ప్రధాన వ్యాపారాలకు సంబంధంలేని బిజినెస్లను విక్రయించడం ద్వారా సమీకరించే నిధులను రుణ భారాన్ని తగ్గించుకునేందుకు డీఎల్ఎఫ్ వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి 2012 డిసెంబర్లో 30 కోట్ల డాలర్లకు అమన్ రిసార్ట్స్ను విక్రయించేందుకు జెకాతో డీఎల్ఎఫ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే 2013 జూన్లోగా డీల్ పూర్తికాకపోవడంతో ఒప్పందం రద్దయ్యింది. ఆపై మరోసారి అమన్ అమ్మకం కోసం జెకాతోపాటు వివిధ సంస్థలతో డీఎల్ఎఫ్ చర్చలు నిర్వహిస్తూ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 25 హోటళ్లను కలిగిన అమన్ రిసార్ట్స్... చివరికి జెకా చేతికే చిక్కింది. కాగా, ఢిల్లీలోని లోధీ హోటల్ను డీల్ నుంచి మినహాయించినట్లు డీఎల్ఎఫ్ పేర్కొంది. -
రియాల్టీకి ఊపుతెచ్చిన ర్యాపిడ్ మెట్రో
గుర్గావ్: జాతీయరాజధానితో గుర్గావ్ను అనుసంధానించే ర్యాపిడ్ మెట్రో మార్గం మరోమారు రియల్ వ్యాపారానికి ఊపుతెచ్చింది. గుర్గావ్లోని ఎంజీ రోడ్డు, డీఎల్ఎఫ్ పేజ్-2, ఫేజ్-3, ఎంజీ రోడ్డు వాసులకు రవాణా సుగమమైంది. డీఎల్ఎఫ్ సైబర్ సీటీకి వ్యాపార స్థలాలకు డిమాండ్ పెరిగింది. 2010లో ర్యాపిడ్ మెట్రో నిర్మాణం ప్రారంభమవడంతోనే ఎంజీ రోడ్డు, డీఎల్ఎఫ్లలో ఆస్తుల విలువ 35 నుంచి 100 శాతం పెరిగింది. ర్యాపిడ్ మెట్రో మార్గంలో ఉన్న బెల్వెదెర్ టవర్స్లో చదరపు అడుగు ఏడు వేల రూపాయలు పలికింది. ప్రస్తుతం ర్యాపిడ్ మెట్రో ప్రారంభం కావడంతో ధర చదరపు అడుగు 13,500 రూపాయలకు ఎగబాకింది. బెల్వెదర్ పార్కు, గార్డెన్ ఎస్టేట్లలోనూ ధరలు ఇదే స్థాయిలో పెరిగాయని కుష్మన్ వేక్ఫీల్డ్ సంస్థల కన్సల్టెంట్ తెలిపారు. డీఎల్ఎఫ్ సైబర్ సిటీలో కార్యాలయాల అద్దెలు గత మూడు సంవత్సరాల్లో 40 శాతం పెరిగాయి. ఇప్పుడు మెట్రోతో అనుసంధానమైన తరువాత చదరపు అడుగు అద్దె రూ. 80 నుంచి 140 వరకు పెరిగాయని స్థిరాస్తి వ్యాపార కన్సల్టెంట్ అక్సీయన్ తెలిపింది. సీ అండ్ డబ్ల్యూ కన్సల్టెంట్ మాట్లాడుతూ ర్యాపిడ్ మెట్రో ఈ ప్రాంతంలోని కార్యాలయాలకు రవాణా సదుపాయమే కాకుండా అనేక రకాలుగా మిగులు సమకూర్చింది. నిర్వహణ ఖర్చులు తగ్గడం వలన ఈ సదుపాయం సమకూరింది. సైబర్ సిటీ తన ఉద్యోగులకు మెట్రో ట్రావెల్ కార్డులు ఇవ్వడం ద్వారా రవాణా మీద ఒక్కొక ఉద్యోగిపై 2,500 నుంచి 3,000 రూపాయలను ఆదా చేసుకుంటోంది. దీని ప్రకారం ఒక వర్క్ స్టేషన్ చదరపు గజానికి రూ. 20 తగ్గుతున్నట్లులెక్క. ఇది ఈ వాణిజ్య సముదాయాలకు మరింత లబ్ది చేకూరుస్తుంది. అక్సియన్ లాండ్బేస్ ప్రైవేట్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ సీనియర్ బ్రోకర్ రాజేశ్ షరాఫ్ మాట్లాడుతూ‘‘ర్యాపిడ్ మెట్రో మార్గానికి అనుకుని ఉన్న ప్రాంతంలో ఆస్తులకు ప్రథమ ప్రాధాన్యమిచ్చింది. కొత్త రవాణా సదుపాయం అందుబాటులోకి రావడంతో ఇక మీదట ట్రాఫిక్ జామ్లు, రద్దీ గొడవ ఉండదు. ఇక ఢిల్లీ మెట్రోతో అనుసంధానం మరింత అదనపు ఆకర్షణ అని వివరించారు. 5.1 ఒక కిలోమీటరు పొడవున విస్తరించి ఉన్న ర్యాపిడ్ మెట్రో మార్గాన్ని రోజుకు 50 వేల మంది వినియోగించుకుంటారని నిపుణుల అంచనా. ఈ మార్గంలో ఉన్న ఆరు స్టేషన్లు సైబర్ సిటీ, సికిందర్పూర్ల మధ్యనే ఉన్నాయి. ఇది రియల్ వ్యాపారానికి మరింత కలిసివచ్చే అంశం. -
డీఎల్ఎఫ్ ఆజీవన్ సమృద్ధి
ప్రైవేటురంగ జీవిత బీమా కంపెనీ డీఎల్ఎఫ్ ప్రమెరికా లైఫ్ హోల్లైఫ్ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ‘ఆజీవన్ సమృద్ధి’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ పాలసీలో 99 ఏళ్ల వరకు జీవిత బీమా రక్షణ ఉండటం అనేది ప్రధానమైన ఆకర్షణ. అలాగే ప్రీమియం పరిమిత కాలానికి చెల్లిస్తే సరిపోతుంది. ప్రీమియం కనీసం 15 నుంచి గరిష్టంగా 20 ఏళ్లపాటు చెల్లిస్తే చాలు 99 ఏళ్ల వరకు బీమా రక్షణ ఉంటుంది. పాలసీదారునికి 65 ఏళ్లు పూర్తయితే పాలసీ మొత్తం, గ్యారంటీ ఎడిషన్, బోనస్ చెల్లిస్తారు. ఆ తర్వాత కూడా బీమా రక్షణ కొనసాగుతుంది. ఆ తర్వాత క్లెయిమ్ జరిగితే పాలసీ మొత్తం, ఇతర బోనస్లు ఏమైనా ఉంటే అవి కలిపి నామినీకి చెల్లిస్తారు. ఈ పాలసీని 8 నుంచి 50 ఏళ్ల లోపు వారు తీసుకోవచ్చు.