రియల్టీ బుకింగ్స్‌ జోరు | Properties worth Rs 1. 17 lk cr sold by 18 listed realty firms in FY24 | Sakshi
Sakshi News home page

రియల్టీ బుకింగ్స్‌ జోరు

Published Mon, Jun 10 2024 6:25 AM | Last Updated on Mon, Jun 10 2024 8:02 AM

Properties worth Rs 1. 17 lk cr sold by 18 listed realty firms in FY24

రూ. 1.17 లక్షల కోట్లకు విలువ 

గతేడాది 18 లిస్టెడ్‌ కంపెనీల స్పీడ్‌ 

జాబితాలో గోద్రెజ్, ప్రెస్జీజ్, డీఎల్‌ఎఫ్‌ 

న్యూఢిల్లీ: రియల్టీ రంగ దిగ్గజాలు ప్రాపరీ్టల అమ్మకాలలో గత ఆర్థిక సంవత్సరం(2023–24) స్పీడందుకున్నాయి. 18 లిస్టెడ్‌ కంపెనీలు మొత్తం రూ. 1.17 లక్షల కోట్ల విలువైన బుకింగ్స్‌ను సాధించాయి. ఈ జాబితాలో గోద్రెజ్‌ ప్రాపరీ్టస్, ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్, డీఎల్‌ఎఫ్, మాక్రోటెక్‌ డెవలపర్స్, సిగ్నేచర్‌ గ్లోబల్‌ తదితరాలు అగ్రపథంలో నిలిచాయి. గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ రూ. 25,527 కోట్ల విలువైన అమ్మకాల బుకింగ్స్‌ సాధించి తొలి స్థానాన్ని పొందింది. అంతక్రితం ఏడాది(2022–23)తో పోలిస్తే కొద్దిపాటి కంపెనీలను మినహాయిస్తే ప్రధాన సంస్థలన్నీ అమ్మకాల బుకింగ్స్‌లో జోరు చూపాయి. ఇందుకు ప్రధానంగా రెసిడెన్షియల్‌ ప్రాపర్టీలకు పుట్టిన పటిష్ట డిమాండ్‌ కారణమైంది. ప్రధాన నగరాలలో ప్రత్యేకంగా విలాసవంత గృహాలకు భారీ డిమాండ్‌ కనిపించడం తోడ్పాటునిచి్చంది! 

శోభా, బ్రిగేడ్, పుర్వంకారా.. 
రియల్టీ రంగ లిస్టెడ్‌ దిగ్గజాలలో గతేడాది ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌ రూ. 21,040 కోట్ల అమ్మకాల బుకింగ్స్‌తో రెండో ర్యాంకులో నిలిచింది. ఇక డీఎల్‌ఎఫ్‌ రూ. 14,778 కోట్లు,  లోధా బ్రాండ్‌ మాక్రోటెక్‌ రూ. 14,520 కోట్లు, గురుగ్రామ్‌ కంపెనీ సిగ్నేచర్‌ గ్లోబల్‌ రూ. 7,270 కోట్లు చొప్పున ప్రీసేల్స్‌ సాధించి తదుపరి స్థానాల్లో నిలిచాయి. ఈ బాటలో బెంగళూరు సంస్థ శోభా లిమిటెడ్‌ రూ. 6,644 కోట్లు, బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ రూ. 6,013 కోట్లు, పుర్వంకారా రూ. 5,914 కోట్లు, ముంబై కంపెనీ ఒబెరాయ్‌ రియల్టీ రూ. 4,007 కోట్లు, కోల్టే పాటిల్‌ రూ. 2,822 కోట్లు, మహీంద్రా లైఫ్‌సై్పస్‌ రూ. 2,328 కోట్లు, కీస్టోన్‌ రియల్టర్స్‌ రూ. 2,266 కోట్లు, సన్‌టెక్‌ రియల్టీ రూ. 1,915 కోట్లు చొప్పున అమ్మకాల బుకింగ్స్‌ నమోదు చేశాయి. ఇదేవిధంగా ఏషియానా హౌసింగ్‌ రూ. 1,798 కోట్లు, అరవింద్‌ స్మార్ట్‌స్పేసెస్‌ రూ. 1,107 కోట్లు, అజ్మీరా రియల్టీ అండ్‌ ఇన్‌ఫ్రా రూ. 1,017 కోట్లు, ఎల్డెకో హౌసింగ్‌ రూ. 388 కోట్లు, ఇండియాబుల్స్‌ రియల్టీ రూ. 280 కోట్లు చొప్పున బుకింగ్స్‌ అందుకున్నాయి. అయితే ఒమాక్సే తదితర కొన్ని కంపెనీల వివరాలు వెల్లడికావలసి ఉంది.  

ఇతర దిగ్గజాలు.. 
ఇతర దిగ్గజాలలో టాటా రియల్టీ అండ్‌ ఇన్‌ఫ్రా, అదానీ రియలీ్ట, పిరమల్‌ రియల్టీ, హీరానందానీ గ్రూప్, ఎంబసీ గ్రూప్, కే రహేజా గ్రూప్‌ తదితరాలు నాన్‌లిస్టెడ్‌ కంపెనీలుకావడంతో త్రైమాసిక, వార్షిక బుకింగ్స్‌ వివరాలు వెల్లడించని సంగతి తెలిసిందే. కాగా.. కోవిడ్‌–19 తదుపరి సొంత ఇంటికి ప్రాధాన్యత పెరగడంతో హౌసింగ్‌ రంగం ఊపందుకున్నట్లు రియల్టీ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో పటిష్టస్థాయిలో ప్రాజెక్టులను పూర్తిచేసే కంపెనీల ప్రాపరీ్టలకు డిమాండు పెరిగినట్లు తెలియజేశారు. వెరసి బ్రాండెడ్‌ గృహాలవైపు కన్జూమర్‌ చూపుసారించడం లిస్టెడ్‌ కంపెనీలకు కలసి వస్తున్నట్లు తెలియజేశారు. గతంలో యూనిటెక్, జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ తదితరాల హౌసింగ్‌ ప్రాజెక్టులు పూర్తికాకపోగా.. విఫలంకావడంతో గృహ కొనుగోలుదారులు ధర అధికమైనా రిస్‌్కలేని వెంచర్లకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు.

33 శాతం వృద్ధి
బలమైన కన్జూమర్‌ డిమాండ్‌ నేపథ్యంలో గతేడాది దేశీ రియల్టీ రంగంలో రికార్డ్‌ ప్రీసేల్స్‌ నమోదయ్యాయి. ఆయా కంపెనీల సమాచారం ప్రకారం లిస్టెడ్‌ రియల్టీ కంపెనీలు ఉమ్మడిగా రూ. 1,16,635 కోట్ల సేల్స్‌ బుకింగ్స్‌ను సాధించాయి. 2022–23లో నమోదైన రూ. 88,000 కోట్ల బుకింగ్స్‌తో పోలిస్తే ఇది 33 శాతం అధికం. జాబితాలో శోభా, బ్రిగేడ్, పుర్వంకారా, ఒబెరాయ్‌ రియలీ్ట, మహీంద్రా లైఫ్‌స్పేస్, కోల్టేపాటిల్, సన్‌టెక్, కీస్టోన్‌ రియల్టర్స్‌ తదితరాలు చేరాయి. పటిష్ట బ్రాండ్‌ గుర్తింపు, డైవర్సిఫైడ్‌ పోర్ట్‌ఫోలియో, పెట్టుబడుల సులభ సమీకరణ కారణంగా లిస్టెడ్‌ రియల్టీ కంపెనీలు ఆకర్షణీయ పనితీరు చూపగలుగుతున్నట్లు హౌసింగ్‌.కామ్, ప్రాప్‌టైగర్‌ సీఈవో ధ్రువ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. దీనికితోడు ఆధునిక టెక్నాలజీలతో మార్కెటింగ్, అమ్మకాలు చేపట్టడం, మెరుగైన కస్టమర్‌ సరీ్వసులు తదితరాల ద్వారా మార్కెట్‌ వాటాను కైవసం చేసుకుంటున్నట్లు తెలియజేశారు. వెరసి నాన్‌లిస్టెడ్‌ లేదా చిన్న కంపెనీలకంటే పైచేయి సాధించగలుగుతున్నట్లు వివరించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement