ఆటోమొబైల్ విడిభాగాల తయారీ కంపెనీ భారత్ ఫోర్జ్ తాజాగా ఫ్రాన్స్కి చెందిన మెకానిక్ జనరల్ లాంగ్రోయిజ్ (ఎంజీఎల్) సంస్థను కొనుగోలు చేసింది.
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ విడిభాగాల తయారీ కంపెనీ భారత్ ఫోర్జ్ తాజాగా ఫ్రాన్స్కి చెందిన మెకానిక్ జనరల్ లాంగ్రోయిజ్ (ఎంజీఎల్) సంస్థను కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 11.8 మిలియన్ యూరోలు (దాదాపు రూ. 90 కోట్లు). జర్మనీలోని తమ అనుబంధ సంస్థ సీడీపీ భారత్ ఫోర్జ్ ద్వారా ఈ కొనుగోలు జరిగినట్లు వివరించింది.
చమురు, గ్యాస్, విద్యుత్ రంగ సంస్థలకు అవసరమైన ఉత్పత్తుల తయారీ సామర్థ్యాలు మరింత మెరుగుపడగలవని సంస్థ పేర్కొంది.