Automobile
-
టాటా కార్లకు బ్రాండ్ అంబాసిడర్గా ‘ఛావా’ హీరో
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ను బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకున్నట్లు ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ వెల్లడించింది. తమ ప్యాసింజర్, ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణి ప్రచారానికి ఆయన తోడ్పడనున్నట్లు తెలిపింది.ఐపీఎల్ సీజన్ సందర్భంగా కొత్త టాటా కర్వ్ ప్రచార కార్యక్రమంతో ఈ భాగస్వామ్యం ప్రారంభమవుతుందని వివరించింది. ఇందుకోసం 20 సెకన్ల నిడివితో ‘టేక్ ది కర్వ్’ పేరిట ప్రకటనలు రూపొందించినట్లు సంస్థ పేర్కొంది.ఈ నేపథ్యంలో టాటా మోటర్స్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక రీల్ను కూడా పోస్ట్ చేసింది. ఇందులో కౌశల్ కంపెనీ తాజా కారు కర్వ్ను ప్రమోట్ చేస్తూ కనిపించాడు. ఈ పోస్ట్ లో "ఉత్తమ కథలు ట్విస్ట్ లతో నిండి ఉంటాయి.. విక్కీ కౌశల్తో టాటా మోటార్స్ కొత్త శకానికి స్వాగతం'' అంటూ రాసుకొచ్చింది. -
టెస్లా కీలక నిర్ణయం: వేలాది కార్లపై ఎఫెక్ట్
అమెరికన్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా (Tesla).. తన 'సైబర్ ట్రక్' కార్లకు రీకాల్ ప్రకటించింది. ఇప్పటి వరకు డెలివరీ చేసిన అన్ని సైబర్ ట్రక్కులలోనూ సమస్య ఉందని గుర్తించడంతో ఈ రీకాల్ ప్రకటించింది. ఈ ప్రభావానికి 46,000 కంటే ఎక్కువ కార్లు ప్రభావితమయ్యాయి.డ్రైవింగ్ చేస్తున్నప్పుడు.. బాహ్య ప్యానెల్ విడిపోతుందనే ఆందోళనల కారణంగా ఈ రీకాల్ ప్రకటించడం జరిగింద 'నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్' (NHTSA) వెల్లడించింది. మే 19 నుంచి వాహన యజమానులకు మెయిల్ ద్వారా రీకాల్ విషయాన్ని కంపెనీ తెలియజేయనుంది.టెస్లా సైబర్ ట్రక్ వెలుపలి భాగంలో ఉన్న స్టెయిన్లెస్ స్టీల్ ట్రిమ్ ప్యానెల్ విడిపోయే అవకాశం ఉంది. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించడానికి కంపెనీ సన్నద్ధమైంది. దీనికోసం వాహనదారులు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. సంస్థ సర్వీస్ సెంటర్లలో ఉచితంగా భర్తీ చేస్తామని ఆటోమేకర్ కస్టమర్లకు హామీ ఇచ్చింది.టెస్లా.. తన సైబర్ ట్రక్ కోసం రీకాల్ ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు. యాక్సిలరేటర్ పెడల్ ఇరుక్కుపోవడం, డ్రైవ్ పవర్ కోల్పోవడం, లోపభూయిష్ట విండ్షీల్డ్ వైపర్లు, ఎలక్ట్రిక్ ఇన్వర్టర్ సమస్య వంటి కారణాలతో 15 నెలల్లో పలుమార్లు రీకాల్ ప్రకటించింది. ఇప్పుడు తాజాగా మరోమారు ఈ రీకాల్ ప్రకటించడం గమనార్హం. -
టెస్లా కార్లకు సప్లయర్ ‘టాటా’నే!
ప్రపంచంలోనే అత్యంత విలువైన ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) కంపెనీ టెస్లాకు గ్లోబల్ సప్లయర్గా టాటా గ్రూప్ నిలిచింది. ఈమేరకు ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ఈ భాగస్వామ్యం ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన రంగంలో పెరుగుతున్న భారత్ పాత్రను, అధునాతన తయారీ, సాంకేతికతలో టాటా గ్రూప్ నైపుణ్యాన్ని నొక్కి చెబుతోంది.ఈ నివేదిక ప్రకారం.. టాటా ఆటోకాంప్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), టాటా టెక్నాలజీస్ , టాటా ఎలక్ట్రానిక్స్తో సహా అనేక టాటా గ్రూప్ కంపెనీలు ఇప్పుడు టెస్లా సరఫరా గొలుసులో భాగంగా ఉన్నాయి. కీలకమైన భాగాలు, సేవలను అందిస్తున్నాయి. ఈ టాటా సంస్థలు ఇప్పటికే టెస్లాతో అంతర్జాతీయ ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, వివిధ విడిభాగాలు, సేవలను సరఫరా చేస్తున్నాయని ఈటీ నివేదించింది. ముఖ్యంగా టెస్లా భారత్లో తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తే వారి భాగస్వామ్యం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.టెస్లా సీనియర్ ప్రొక్యూర్మెంట్ అధికారులు నిర్దిష్ట విడిభాగాల తయారీ గురించి భారతీయ సరఫరాదారులతో చర్చలు జరుపుతున్నారని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ఈటీ పేర్కొంది. వీటిలో కాస్టింగ్స్, ఫోర్జింగ్స్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాబ్రికేషన్ భాగాలు ఉన్నాయి. టెస్లాకు భారతీయ సప్లయర్ల సహకారం ఇప్పటికే గణనీయంగా ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో భారతీయ కంపెనీలు టెస్లాకు దాదాపు 2 బిలియన్ డాలర్ల విలువైన విడిభాగాలను సరఫరా చేశాయి. టెస్లా తన సరఫరా గొలుసును వైవిధ్యపరచాలని చూస్తున్న క్రమంలో భారత్ నుంచి దాని సోర్సింగ్ పెరుగుతుందని భావిస్తున్నారు.టాటా కంపెనీలు ఏం సరఫరా చేస్తున్నాయంటే..ఈటీ కథనం ప్రకారం.. వివిధ టాటా గ్రూప్ కంపెనీలు టెస్లాకు ప్రత్యేక ఉత్పత్తులు, సేవలను అందిస్తున్నాయి. వాటిలో టాటా ఆటోకాంప్ ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఇంజనీరింగ్ ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. టాటా టెక్నాలజీస్ ఎండ్-టు-ఎండ్ ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అందిస్తోంది. టీసీఎస్ సర్క్యూట్ బోర్డు టెక్నాలజీని అందిస్తోంది.టెస్లా తయారీ యూనిట్ ఇక్కడ ఏర్పాటయ్యాక టాటా ఎలక్ట్రానిక్స్ సెమీకండక్టర్ చిప్లను సరఫరా చేస్తుందని భావిస్తున్నారు. ఇక బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్, మోటార్ కంట్రోలర్ యూనిట్లు, డోర్ కంట్రోల్ మెకానిజమ్కు కీలకమైన ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లింగ్స్ (పీసీబీఏ) కోసం టెస్లా టాటా ఎలక్ట్రానిక్స్ వైపు చూడవచ్చు. -
తాజా ఆటోమొబైల్ అప్డేట్స్
హ్యుందాయ్, హోండా కార్స్ వాహన ధరల పెంపుఏప్రిల్ నుంచి కొత్త ధరలు అమల్లోకి ముంబై: వాహన ధరల పెంపు కంపెనీల జాబితాల్లో హ్యుందాయ్ మోటార్ ఇండియా(హెచ్ఎంఐఎల్), హోండా కార్స్ చేరాయి. ‘‘పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, ఇన్పుట్ వ్యయాలను కొంత భర్తీ చేయడానికి ధరలను సవరించాల్సి వస్తుంది. అందుకే వాహన ధరలను ఏప్రిల్ నుంచి 3% వరకు పెంచుతున్నాము’’ అని హెచ్ఎంఐఎల్ డైరెక్టర్, సీఓఓ తరుణ్ గార్గ్ తెలిపారు. అమేజ్, సిటీ, సిటీ ఈ:హెచ్ఈవీ, ఎలివేట్తో సహా వేరియంట్, మోడల్ బట్టి ధరల పరిధి మారుతుందని హోండా కార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కునాల్ బెహ్ తెలిపారు. మారుతీ సుజుకీ ఇండియా, కియా ఇండియా, టాటా మోటార్స్లు తమ వాహన ధరలు వచ్చే నెల నుంచి పెంచే యోచనలతో ఉన్నట్లు ఇప్పటికే తెలిపారు. టఫే వైస్చైర్మన్గా లక్ష్మీ వేణున్యూఢిల్లీ: ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ (టఫే) వైస్ చైర్మన్గా లక్ష్మీ వేణు నియమితులయ్యారు. ఇప్పటికే ఆమె సంస్థ డైరెక్టరుగా వ్యవహరిస్తున్నారు. లక్ష్మీకి ట్రాక్టర్లు, ఆటో విడిభాగాల పరిశ్రమలో గణనీయంగా అనుభవం, వ్యాపార నిర్వహణ సామర్థ్యాలు ఉన్నట్లు సంస్థ చైర్మన్ మల్లికా శ్రీనివాసన్ తెలిపారు. వ్యూహాత్మక లక్ష్యాల సాధనలో టఫే, ఐషర్ ట్రాక్టర్స్ బృందాలతో కలిసి పని చేయనున్నట్లు లక్ష్మీ తెలిపారు. బిజినెస్ టుడే ‘వ్యాపారంలో అత్యంత శక్తివంతమైన మహిళలు‘, ఎకనమిక్ టైమ్స్ ‘యంగ్ లీడర్స్ – 40 అండర్ 40‘ జాబితాల్లో లక్ష్మీ చోటు దక్కించుకున్నారు. ఆమె సుందరం–క్లేటన్ ఎండీగా వ్యవహరిస్తున్నారు. ఉబెర్ టూవీలర్ రైడర్లకు మరింత భద్రతన్యూఢిల్లీ: టూ–వీలర్ డ్రైవర్లు, రైడర్లకు మరింత భద్రత కలి్పంచే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు రైడ్–õÙరింగ్ సంస్థ ఉబెర్ వెల్లడించింది. ఇందులో భాగంగా ఢిల్లీలోని ఉబెర్ మోటో డ్రైవర్లకు సేఫ్టీ కిట్లను అందించింది. వీటిలో హెల్మెట్లు, సేఫ్టీ స్టిక్కర్లు మొదలైనవి ఉన్నాయి. ఉబెర్ మోటో యాప్లో హెల్మెట్లు ధరించాలంటూ ప్రయాణికులకు కూడా కోరే విధంగా ఫీచర్లు ఉంటాయని సంస్థ వివరించింది. ట్రాఫిక్లోను సులభంగా వెళ్లగలిగే వెసులుబాటు, సౌకర్యం, తక్కువ ఖర్చు వంటి అంశాలు బైక్ ట్యాక్సీలకు సానుకూలాంశాలుగా ఉంటున్నాయని పేర్కొంది.ఇదీ చదవండి: ఎన్విడియాతో ఐటీ దిగ్గజాల జత -
పెరగనున్న కార్ల ధరలు: ఎప్పటి నుంచి అంటే?
భారతదేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ 'మారుతి సుజుకి' (Maruti Suzuki) ఏప్రిల్ 2025 నుంచి తన వాహనాల ధరలను 4 శాతం పెంచే ప్రణాళికలను సోమవారం ప్రకటించింది. పెరుగుతున్న ఇన్పుట్ ధరలు, నిర్వహణ ఖర్చులు కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది.మోడల్ను బట్టి ధరల పెంపు జరుగుతుంది. అయితే కొత్త ధరలు వచ్చే నెలలో అధికారికంగా వెల్లడవుతాయి. ఖర్చులను ఆప్టిమైజ్ చేయడానికి.. వినియోగదారులపై ప్రభావాన్ని పరిమితం చేయడానికి కృషి చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే.. కొన్ని తప్పని పరిస్థితులలో పెరుగుతున్న ధరల ప్రభావం కొంత వినియోగదారులపై కూడా పడుతుందని సంస్థ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: తగ్గుతూనే ఉన్న బంగారం రేటు: నేటి ధరలు ఇవే..మారుతి సుజుకి తమ వాహన ధరలను పెంచడం ఇదే మొదటిసారి కాదు. 2025 ఫిబ్రవరిలో కూడా కంపెనీ ఎంపిక చేసిన మోడల్ ధరలను రూ. 1500 నుంచి రూ. 32,000 వరకు పెంచింది. ఈ సారి కూడా ఈ స్థాయిలోనే ధరలు పెరిగే అవకాశం ఉంటుందని సమాచారం. పెరిగిన ధరలు త్వరలోనే అధికారికంగా వెల్లడవుతాయి. -
Ola Flash Sale: ఓలా స్కూటర్లు కొనేవారికి ‘పండగ’
ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తన పాపులర్ ఎస్ 1 శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్లపై గణనీయమైన డిస్కౌంట్లను అందిస్తూ ప్రత్యేక హోలీ ఫ్లాష్ సేల్ను ప్రారంభించింది. ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో కంపెనీ ఈ విషయాన్ని ప్రకటించింది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నవారు అద్భుతమైన ఆఫర్ను వినియోగించుకోవచ్చు.ఈ లిమిటెడ్ టైమ్ ప్రమోషన్ లో భాగంగా ఓలా కస్టమర్లు ఎస్ 1 ఎయిర్ పై రూ.26,750 వరకు, ఎస్ 1 ఎక్స్ ప్లస్ (జెన్ 2) ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.22,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇప్పుడు ఎస్ 1 ఎయిర్ ధర రూ .89,999, ఎస్ 1 ఎక్స్ ప్లస్ (జెన్ 2) రూ .82,999 అని ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. అంతేకాకుండా, తాజా ఎస్ 1 జెన్ 3 మోడళ్లతో సహా మిగిలిన ఎస్ 1 శ్రేణిపై రూ .25,000 వరకు డిస్కౌంట్లను అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.తగ్గింపు తర్వాత ఓలా ఎలక్ట్రిక్ ఎస్ 1 శ్రేణి స్కూటర్ల ధరలు రూ .69,999 నుంచే ప్రారంభమవుతాయి. గరిష్టంగా రూ .1,79,999 ఉంటుంది. కాగా ఎస్ 1 జెన్ 2 స్కూటర్ల కొత్త కొనుగోలుదారులకు కూడా అదనపు ప్రయోజనాలను అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. వీరు రూ .2,999 విలువైన మూవ్ ఓఎస్ + కు ఒక సంవత్సరం ఉచిత సబ్ స్క్రిప్షన్, కేవలం రూ .7,499 లకే రూ .14,999 విలువైన ఎక్స్టెండెడ్ వారంటీని పొందవచ్చు.ఎస్ 1 జెన్ 3 పోర్ట్ ఫోలియోలో ఫ్లాగ్ షిప్ ఎస్ 1 ప్రో ప్లస్ 5.3 కిలోవాట్, 4 కిలోవాట్ బ్యాటరీ ఆప్షన్లను కలిగి ఉంది. వీటి ధరలు వరుసగా రూ .1,85,000, రూ .1,59,999. ఎస్ 1 జెన్ 3 శ్రేణిలోని ఇతర మోడళ్లలో ఎస్ 1 ప్రో (4 కిలోవాట్, 3 కిలోవాట్ బ్యాటరీ వేరియంట్లలో లభ్యం) ధరలు వరుసగా రూ .1,54,999, రూ .1,29,999. ఇక 2 కిలోవాట్, 3 కిలోవాట్, 4 కిలోవాట్ ఆప్షన్లలో లభించే ఎస్ 1 ఎక్స్ శ్రేణి ధరలు వరుసగా రూ.89,999, రూ.1,02,999, రూ.1,19,999 కాగా, 4 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన ఎస్ 1 ఎక్స్ ప్లస్ ధర రూ.1,24,999. మునుపటి ఎస్ 1 జెన్ 2 స్కూటర్లపై ఆసక్తి ఉన్నవారి కోసం ఓలా ఎలక్ట్రిక్ ఎస్ 1 ప్రో, ఎస్ 1 ఎక్స్ వంటి మోడళ్లను 2 కిలోవాట్ల నుండి 4 కిలోవాట్ల వరకు బ్యాటరీ ఎంపికలతో అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఎస్ 1 ప్రో రూ .1,49,999. ఎస్ 1 ఎక్స్ (2 కిలోవాట్) రూ .84,999 నుండి ప్రారంభమవుతుంది. ఈ పేర్కొన్న ధరలు ఎక్స్-షోరూమ్వి, అలాగే ఫేమ్ ఇండియా ప్రోత్సాహకాల వర్తింపు తుది ధరలని ఓలా ఎలక్ట్రిక్ వివరణ ఇచ్చింది. -
మూడేళ్ళలో.. రెండు లక్షల మంది కొన్న కారు ఇది
అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందిన కియా కారెన్స్ (Kia Carens) అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. దాని విభాగంలో అత్యంత వేగంగా అమ్ముడవుతున్న వాహనాలలో ఒకటిగా అవతరించిన ఈ కారు.. ప్రీమియం ఫీచర్స్, కొత్త డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది.కియా ఇండియా.. కారెన్స్ కారును లాంచ్ చేసినప్పటి నుంచి, అంటే 36 నెలల్లో ఏకంగా 2,00,000 అమ్మకాల మైలురాయిని దాటేసింది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. దేశీయ మార్కెట్లో మాత్రమే కాకుండా.. కంపెనీ 70 కంటే ఎక్కువ దేశాల్లో 24064 యూనిట్ల కారెన్స్ కార్లను విక్రయించిందని స్పష్టం చేసింది.మొత్తం అమ్మకాలలో కారెన్స్ పెట్రోల్ వేరియంట్లు 58 శాతం వాటాను కలిగి ఉండగా, 42 శాతం కస్టమర్లు డీజిల్ వెర్షన్ను ఎంచుకున్నారు. 32% కొనుగోలుదారులు ఆటోమేటిక్, iMT ట్రాన్స్మిషన్లను ఎంచుకుంటున్నారు. 28 శాతం మంది కస్టమర్లు సన్రూఫ్తో కూడిన వేరియంట్లను ఎంచుకున్నారు.ఇదీ చదవండి: 48 గంటల్లో 20000 బుకింగ్స్.. మొదటి 50వేల మందికి..కియా కారెన్స్ ధరలు ఇండియన్ మార్కెట్లో రూ. 12.92 లక్షల నుంచి రూ. 19.95 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ కారు మల్టిపుల్ వేరియంట్లలో, వివిధ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. కాబట్టి ఎక్కువమంది దీనిని కొనుగోలు చేయడానికి ఎగబడుతుంటారు.నెలవారీ (ఫిబ్రవరి) అమ్మకాల్లో సోనెట్ (7,598 యూనిట్లు), సెల్టోస్ (6,446 యూనిట్లు) మంచి వృద్ధిని సాధించాయి. కారెన్స్ గత నెలలో 5318 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. కంపెనీ మొత్తం సేల్స్.. 2024 ఫిబ్రవరి కంటే 23.8 శాతం ఎక్కువ. దీన్నిబట్టి చూస్తుంటే.. కియా కార్లకు ఇండియన్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని స్పష్టమవుతోంది. -
48 గంటల్లో 20000 బుకింగ్స్
మార్చి 5న అల్ట్రావయొలెట్ కంపెనీ తన టెస్సెరాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. సంస్థ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించిన 48 గంటల్లో రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ స్వీకరించింది.అల్ట్రావయొలెట్ టెస్సెరాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ 48 గంటల్లో 20,000 కంటే ఎక్కువ ప్రీ-బుకింగ్లను పొందింది. ఈ విషయాన్ని సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే ప్రారంభ పరిచయ ధరను (రూ. 1.20 లక్షలు) 10000 నుంచి 50000 యూనిట్లకు పెంచింది. అంటే మొదటి 50వేలమందికి మాత్రమే ఆ ధర వర్తిస్తుంది. ఆ తరువాత దీని ధర రూ. 1.45 లక్షలకు (ఎక్స్ షోరూమ్) చేరుకుంటుంది.అల్ట్రావయొలెట్ టెస్సెరాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు 2026 మొదటి త్రైమాసికంలో ప్రారంభమవుతాయి. దీనిని రూ. 999 కు ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. ఇది ఒక ఫుల్ ఛార్జితో 261 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. కేవలం 100 రూపాయలతో రెండుసార్లు ఛార్జ్ చేయడం ద్వారా 500 కిలోమీటర్ల పరిధిని సాధించగలదని అల్ట్రావయోలెట్ పేర్కొంది.ఇదీ చదవండి: ఎక్కువమంది కొంటున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదంటే?టెస్సెరాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఆన్బోర్డ్ నావిగేషన్తో కూడిన 7 ఇంచెస్ టచ్స్క్రీన్ TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రెండు డాష్క్యామ్లు (ముందు, వెనుక), వైర్లెస్ ఛార్జింగ్, హ్యాండిల్బార్ కోసం హాప్టిక్ ఫీడ్బ్యాక్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, డ్యూయల్ డిస్క్లు, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటివి పొందుతుంది.టెస్సెరాక్ట్ అనేది రాడార్ బేస్డ్ ADAS టెక్నాలజీతో కూడిన భారతదేశపు మొట్టమొదటి స్కూటర్. ఇది బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, ఓవర్టేక్ అలర్ట్, కొలిజన్ అలర్ట్, లేన్ చేంజ్ అసిస్ట్ వంటి ఫీచర్స్ పొందుతుంది. ఈ స్కూటర్ ఫ్లోటింగ్ డీఆర్ఎల్, ఎల్ఈడీ టెయిల్ల్యాంప్లతో కూడిన డ్యూయల్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ ల్యాంప్ పొందుతుంది. దీని అండర్ సీట్ స్టోరేజ్ 34 లీటర్లు. -
భారత్లో ఖరీదైన స్కూటర్ లాంచ్: రేటు ఎంతంటే?
బీఎండబ్ల్యూ మోటొరాడ్ (BMW Motorrad) ఇండియన్ మార్కెట్లో.. 'సీ 400 జీటీ' స్కూటర్ లేటెస్ట్ వెర్షన్ లాంచ్ చేసింది. రూ. 11.50 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభించే ఈ స్కూటర్, దాని మునుపటి మోడల్ కంటే అప్డేట్స్ పొందుతుంది. కాబట్టి దీని ధర స్టాండర్డ్ మోడల్ కంటే రూ. 25000 ఎక్కువ. దీంతో ఇండియన్ మార్కెట్లో లభిస్తున్న స్కూటర్లలో ఇది ఒకటిగా చేరింది.బీఎండబ్ల్యూ సీ 400 జీటీ స్కూటర్.. సాధారణ ప్రయాణానికి మాత్రమే కాకుండా, దూర ప్రయాణాలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందులోని 350 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 7500 rpm వద్ద 34 Bhp పవర్, 5750 rpm వద్ద 35 Nm టార్క్ అందిస్తుంది. ఈ స్కూటర్ లీన్-సెన్సిటివ్ బ్రేకింగ్ అసిస్ట్, డైనమిక్ బ్రేక్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్తో కూడిన ఏబీఎస్ వంటి రైడర్ అసిస్ట్ ఫీచర్లను పొందుతుంది.సీ 400 జీటీ స్కూటర్.. పెద్ద విండ్షీల్డ్ పొందుతుంది. ఇది బ్లాక్స్టార్మ్ మెటాలిక్, డైమండ్ వైట్ మెటాలిక్ పెయింట్ స్కీమ్లలో లభిస్తుంది. ఇందులో 10.25 ఇంచెస్ TFT డిస్ప్లే ఉంది. ఇది హై రిజల్యూషన్ ఇంటర్ఫేస్తో నావిగేషన్, మీడియా అండ్ స్మార్ట్ఫోన్ ఇంటిగ్రేషన్ వంటి వాటిని మెరుగుపరుస్తుంది. అండర్ సీట్ కంపార్ట్మెంట్ 37.6 లీటర్లు. కాబట్టి ఇది అన్ని విధాలా రైడర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది. -
బెస్ట్ సీఎన్జీ కార్లు: ధర రూ.10 లక్షల కంటే తక్కువే..
పెట్రోల్ ధరలు పెరగడం, సీఎన్జీ రీఫ్యూయలింగ్ స్టేషన్లు అందుబాటులోకి రావడం అన్నీ జరుగుతున్నాయి. ఈ తరుణంలో చాలామంది పెట్రోల్ కార్ల స్థానంలో సీఎన్జీ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కథనంలో రూ. 10 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే ఉత్తమ సిఎన్జీ కార్లను గురించి తెలుసుకుందాం.మారుతి సుజుకి ఆల్టో కే10 సీఎన్జీప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన సీఎన్జీ కార్లలో ఒకటి 'మారుతి సుజుకి ఆల్టో కే10'. ఎల్ఎక్స్ఐ (ఓ), వీఎక్స్ఐ (ఓ) వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఈ కారు ధరలు రూ. 5.8 లక్షలు, రూ. 6.04 లక్షలు. ఇందులోని 998 సీసీ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 5300 rpm వద్ద 56 Bhp పవర్, 3400 rpm వద్ద 82.1 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ పొందుతుంది. ఈ కారు 33.85 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుందని సమాచారం.మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో సీఎన్జీఇది కూడా ఎల్ఎక్స్ఐ (ఓ), వీఎక్స్ఐ (ఓ) అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. దీని ధరలు వరుసగా రూ. 5.91 లక్షలు, రూ. 6.11 లక్షలు. ఈ కారులో 998 సీసీ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 56 Bhp పవర్, 82.1 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఇది 32.73 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది.టాటా టియాగో సీఎన్జీటాటా టియాగో సీఎన్జీ ధరలు రూ. 6 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. ఇందులో ట్విన్ సిలిండర్ CNG ట్యాంక్ ఉంటుంది. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన సీఎన్జీ కారుగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ కారు ఐదు మాన్యువల్, మూడు ఆటోమాటిక్ వేరియంట్లలో లభిస్తుంది. మాన్యువల్ ధరలు రూ. 5.99 లక్షల నుంచి రూ. 8.19 లక్షల మధ్య ఉన్నాయి. ఆటోమాటిక్ ధరలు రూ. 7.84 లక్షల నుంచి రూ. 8.74 లక్షల మధ్య ఉన్నాయి.మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ సీఎన్జీమారుతి సుజుకి వ్యాగన్ ఆర్ సీఎన్జీ.. ఎల్ఎక్స్ఐ (ఓ), విఎక్స్ఐ (ఓ) అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 6.54 లక్షల నుంచి రూ. 6.99 లక్షల వరకు ఉంటాయి. ఇది 998 సీసీ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ ద్వారా 5300 ఆర్పీఎమ్ వద్ద 56 బిహెచ్పీ పవర్ఉ.. 3400 ఆర్పీఎమ్ వద్ద 82.1 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో లభిస్తుంది. దీని మైలేజ్ 33.47 కిమీ/కేజీ వరకు ఉంది.ఇదీ చదవండి: అమ్మకాల్లో టాప్ కంపెనీలు.. ఎక్కువమంది కొంటున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే!మారుతి సుజుకి సెలెరియో సీఎన్జీమారుతి సుజుకి సెలెరియో సీఎన్జీ.. భారతదేశంలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే సీఎన్జీ కార్లలో ఒకటి. దీని ధర రూ. 6.90 లక్షలు. ఇది 34 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది. ఈ కారులోని 998 సీసీ ఇంజిన్ 5300 rpm వద్ద, 55.92 Bhp పవర్ & 3400 rpm వద్ద 82.1 Nm టార్క్ అందిస్తుంది. -
ఖరీదైన కారు కోసం బుకింగ్స్ షురూ..
లెక్సస్ కంపెనీ తన 'ఎల్ఎక్స్ 500డీ' కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండే ఈ కారు ప్రారంభ ధరలు రూ. 3 కోట్లు (ఎక్స్ షోరూమ్, ఇండియా).కొత్త లెక్సస్ ఎల్ఎక్స్ 500డీ గంభీరమైన డిజైన్ పొందుతుంది. ఈ కారు ముందు భాగంలోని స్పిండిల్ గ్రిల్ ఎల్ షేప్ ఎల్ఈడీ సిగ్నేచర్లతో పెద్ద, యాంగ్యులర్ హెడ్లైట్లను పొందుతుంది. 22 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగిన ఈ కారు వెనుక భాగంలో కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్లు, చంకీ క్లాడింగ్ వంటివి ఉన్నాయి.లెక్సస్ ఎల్ఎక్స్ 500డీ.. 12.3 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, 7 ఇంచెస్ డ్రైవ్ మోడ్ డిస్ప్లే, త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, హెడ్స్-అప్ డిస్ప్లే, ఫ్రంట్ సీట్ మసాజ్ ఫంక్షన్స్, హీటెడ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ & రియర్ సీట్లు, 4 జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, వైర్డు ఆండ్రాయిడ్ ఆటో, వెనుక ప్రయాణీకుల కోసం రెండు 11.6 ఇంచెస్ ఎంటర్టైన్మెంట్ డిస్ప్లేలు, సింగిల్ పేన్ సన్రూఫ్, 25 స్పీకర్ 3డీ మార్క్ లెవిన్సన్ సౌండ్ సిస్టమ్ మొదలైనవన్నీ ఉన్నాయి.బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, ప్రీ-కొలిషన్ సిస్టమ్, లేన్ డిపార్చర్, ట్రేస్ అసిస్ట్, సేఫ్ ఎగ్జిట్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, అడాప్టివ్ హై బీమ్స్, 10 ఎయిర్బ్యాగ్లు, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్, ట్రైలర్ స్వే కంట్రోల్ మొదలైన సేఫ్టీ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.ఇదీ చదవండి: నెలకు 10 రోజులు: టెక్ కంపెనీ కొత్త రూల్!లెక్సస్ ఎల్ఎక్స్ 500డీ 3.3 లీటర్ ట్విన్-టర్బో డీజిల్ వీ6 ఇంజిన్ పొందుతుంది. 304 హార్స్ పవర్, 700 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 10 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పొందుతుంది. ఇది ఆల్-వీల్ డ్రైవ్, యాక్టివ్ హైట్ కంట్రోల్, స్టాండర్డ్ సెంటర్ డిఫరెన్షియల్ లాక్ మరియు అడాప్టివ్ సస్పెన్షన్ను పొందుతుంది. -
రెండు లక్షలమంది కొన్న కారు: ఇప్పుడు కొత్త ఎడిషన్లో..
భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందిన.. మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) కంపెనీకి చెందిన ''స్కార్పియో ఎన్'' అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. కంపెనీ 2,00,000 యూనిట్ల అమ్మకాలను సాధించింది. బిగ్ డాడీ ఆఫ్ ఎస్యూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా సంస్థ స్కార్పియో-N కార్బన్ ఎడిషన్ లాంచ్ చేసింది. దీని ధరలు రూ. 19.19 లక్షల నుంచి రూ. 24.89 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి.మహీంద్రా స్కార్పియో ఎన్ కార్బన్ ఎడిషన్ పటిష్టమైన డిజైన్.. అప్డేటెడ్ ఫీచర్స్ కలిగిన మహీంద్రా స్కార్పియో ఎన్ ప్రీమియం లెథరెట్ సీట్లు, కాంట్రాస్ట్ డెకో-స్టిచింగ్తో.. స్మోక్డ్ క్రోమ్ ఫినిషింగ్ పొందుతుంది. డార్క్ ట్రీట్మెంట్, స్మోక్డ్ క్రోమ్ యాక్సెంట్లు, బ్లాక్ అల్లాయ్ వీల్స్, డార్క్ గాల్వానో ఫినిష్డ్ రూఫ్ రెయిల్స్ వంటివి దీనిని మరింత ఆకర్షణీయంగా చేస్తాయి. ఈ కొత్త ఎడిషన్ Z8, Z8L సెవెన్-సీటర్ వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది.స్కార్పియోదశాబ్దాల చరిత్ర కలిగిన మహీంద్రా స్కార్పియో.. ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందుతూనే ఉంది. ఇందులో భాగంగానే స్కార్పియో ఎన్ లాంచ్ అయింది. ఇప్పుడు స్కార్పియో ఎన్ కార్బన్ వేరియంట్ లాంచ్ అయింది.ఇదీ చదవండి: తగ్గిన బెంచ్ టైమ్.. ఐటీ ఉద్యోగులకు ఊరట!స్కార్పియో ఎన్ సేఫ్టీ విషయంలో 5 స్టార్ రేటింగ్ సాధించింది. మంచి డిజైన్, కొత్త ఫీచర్స్, లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల.. ఈ కారును చాలామంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఇప్పటికే రెండు లక్షల మంది ఈ కారును కొనుగోలు చేసారంటే.. దీనికున్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
అల్ట్రావయొలెట్ తొలి స్కూటర్ వచ్చేసింది..
ఎలక్ట్రిక్ బైక్లు తయారు చేసే అల్ట్రావయొలెట్ ఆటోమోటివ్ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్సెరాక్ట్ (Ultraviolette Tesseract) విడుదలతో ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్లోకి బోల్డ్ ఎంట్రీ ఇచ్చింది. బెంగళూరులో జరిగిన కంపెనీ "ఫాస్ట్ ఫార్వర్డ్ ఇండియా" కార్యక్రమంలో తమ తొలి ఎలక్ట్రిక్ స్కూటర్తోపాటు అడ్వెంచర్-ఫోకస్డ్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ‘షాక్ వేవ్’ను ఆవిష్కరించింది.ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ స్కూటర్అల్ట్రావయోలెట్ టెస్సెరాక్ట్ ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ స్కూటర్. మొదటి 10,000 కొనుగోలుదారులకు మాత్రమే రూ .1.20 లక్షలకు (ప్రారంభ ధర) లభిస్తుంది. ఆ తర్వాత రూ .1.45 లక్షలు పెట్టి కొనాల్సి ఉంటుంది. టెస్సరాక్ట్ అత్యాధునిక ఫీచర్లు, ఆకట్టుకునే పనితీరును కలిగి ఉంటుందని కంపెనీ చెబుతోంది. 20.1 బీహెచ్నీ పవర్ మోటార్ తో నడిచే ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 125 కిలోమీటర్ల వేగాన్ని అందిస్తుంది. కేవలం 2.9 సెకన్లలో 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 261 కి.మీ.ల రేంజ్ అందిస్తుంది.7 అంగుళాల టీఎఫ్టీ టచ్ స్క్రీన్ డిస్ప్లే, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లను టెస్సెక్ట్ కలిగి ఉంది. రాడార్ అసిస్టెడ్ కొలిషన్ అలర్ట్స్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, ఓవర్ టేక్ అలర్ట్స్ వంటి సెగ్మెంట్ ఫస్ట్ టెక్నాలజీలను ఇందులో పొందుపరిచారు. ఈ స్కూటర్లో విశాలమైన 34-లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ ఇచ్చారు. యుద్ధ హెలికాప్టర్ల ప్రేరణతో దీని సొగసైన డిజైన్ను రూపొందించారు.షాక్వేవ్.. తొలి ఎలక్ట్రిక్ ఎండ్యూరో బైక్టెస్సెరాక్ట్ తో పాటు అల్ట్రావయోలెట్ భారతదేశపు మొట్టమొదటి రోడ్-లీగల్ ఎలక్ట్రిక్ ఎండ్యూరో మోటార్ సైకిల్ అయిన షాక్ వేవ్ (Ultraviolette Tesseract) ను కూడా లాంచ్ చేసింది. మొదటి 1,000 కొనుగోలుదారులు రూ .1.50 లక్షలకు (ఆ తర్వాత రూ .1.75 లక్షలు) దీన్ని సొంతం చేసుకోవచ్చు. అడ్వెంచర్ ఔత్సాహికుల కోసం ఈ బైక్ను రూపొందించారు. 4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉన్న ఈ బైక్ 165 కిలోమీటర్ల రేంజ్ను అందిస్తుంది. గంటకు గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లవచ్చు. ఈ బైక్ 2.9 సెకన్లలోనే 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.షాక్వేవ్ కఠినమైన డిజైన్ లాంగ్-ట్రావెల్ సస్పెన్షన్, వైర్-స్పోక్ వీల్స్, డ్యూయల్-పర్పస్ టైర్లను కలిగి ఉంది. ఆఫ్-రోడ్తోపాటు పట్టణ భూభాగాలకు అనుకూలంగా ఉంటుంది. స్విచబుల్ డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, నాలుగు ట్రాక్షన్ కంట్రోల్ మోడ్లు, ఆరు లెవల్స్ రీజనరేటివ్ బ్రేకింగ్ వంటి అధునాతన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. -
టీవీఎస్ జూపిటర్ కొత్త బండి లాంచ్
టీవీఎస్ మోటార్ కంపెనీ 2025 టీవీఎస్ జూపిటర్ 110 స్కూటర్ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ తాజా ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. అధునాతన ఎమిషన్ టెక్నాలజీలను ఇందులో టీవీఎస్ వినియోగించింది. కొత్త టీవీఎస్ జూపిటర్ 110 బేస్ డ్రమ్ వేరియంట్ ప్రారంభ ధరను రూ .76,691గా (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) కంపెనీ నిర్ణయించింది.వేరియంట్లు.. ధరలు2025 టీవీఎస్ జూపిటర్ 110 విభిన్న కస్టమర్ ప్రాధాన్యతలను తీర్చడానికి నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ప్రారంభ డ్రమ్ వేరియంట్ ధర రూ.76,691. ఇది అన్నింటిలో కాస్త తక్కువ ఖరీదు మోడల్. డ్రమ్ అల్లాయ్ వేరియంట్ ధర రూ.82,441. ఇది మెరుగైన లుక్, మన్నిక కోసం అల్లాయ్ వీల్స్ ను అందిస్తుంది. డ్రమ్ ఎస్ఎక్స్సీ వేరియంట్ ధర రూ.85,991. ఇందులో అదనపు స్టైలింగ్, కన్వీనియన్స్ ఫీచర్లు ఉన్నాయి. డిస్క్ ఎస్ఎక్స్సి వేరియంట్ రూ .89,791 ధరతో మెరుగైన బ్రేకింగ్ పనితీరు కోసం ఫ్రంట్ డిస్క్ బ్రేక్తో వస్తుంది.OBD-2B ప్రయోజనాలుOBD-2B (ఆన్-బోర్డ్ డయాగ్నస్టిక్స్) టెక్నాలజీ అనేది సరికొత్త అప్ గ్రేడ్. ఇది క్లిష్టమైన ఇంజిన్ ఉద్గార పారామీటర్ల రియల్ టైమ్ మానిటరింగ్ చేస్తుంది. అధునాతన సెన్సార్లతో కూడిన టీవీఎస్ జూపిటర్ 110 థ్రోటిల్ రెస్పాన్స్, ఎయిర్-ఫ్యూయల్ రేషియో, ఇంజిన్ టెంపరేచర్, ఫ్యూయల్ క్వాంటిటీ, ఇంజిన్ వేగాన్ని ట్రాక్ చేయగలదు. ఇంజిన్ కంట్రోల్ యూనిట్ (ECU) సరైన పనితీరు, మెరుగైన మన్నిక, తక్కువ ఉద్గారాలను ధృవీకరించడానికి ఈ డేటాను రియల్ టైమ్ లో ప్రాసెస్ చేస్తుంది. ఇది స్కూటర్ ను దాని జీవితచక్రం అంతటా క్లీనర్గా, మరింత పర్యావరణ అనుకూలమైనదిగా చేస్తుంది.ఇంజిన్, పనితీరుకొత్త టీవీఎస్ జూపిటర్ 110 స్కూటర్లో 113.3సీసీ, సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్ ఇంజన్ ఇచ్చారు. ఇది 6,500 ఆర్పీఎం వద్ద 5.9 కిలోవాట్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ అసిస్ట్ తో 5,000 ఆర్పీఎం వద్ద 9.8 ఎన్ఎం టార్క్, 5,000 ఆర్పీఎం వద్ద 9.2 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్మూత్ యాక్సిలరేషన్, ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. సౌకర్యవంతమైన, స్థిరమైన రైడ్ కోసం రూపొందించిన ఈ స్కూటర్లో 1,275 మిమీ వీల్ బేస్, 163 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది.ఇదీ చదవండి: నిస్సాన్ మాగ్నైట్ సరికొత్త మైలురాయిడిజైన్, ఫీచర్లుటీవీఎస్ జూపిటర్ 110లో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, డీఆర్ఎల్లతో కూడిన ఎల్ఈడీ హెడ్లైట్లు, కాల్ అండ్ ఎస్ఎంఎస్ అలర్ట్స్, నావిగేషన్, ఐగో అసిస్ట్, హజార్డ్ ల్యాంప్స్, వాయిస్ అసిస్టెన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది రెండు వైపులా 12-అంగుళాల వీల్స్ ఉంటాయి. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు , వెనుక భాగంలో మోనో-షాక్ ను కలిగి ఉంది. రెండు వీల్స్కు డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ లు అధిక ట్రిమ్ లలో లభిస్తాయి. -
నిస్సాన్ మాగ్నైట్ సరికొత్త మైలురాయి
నిస్సాన్ మోటార్ ఇండియా తన పాపులర్ కాంపాక్ట్ ఎస్యూవీ నిస్సాన్ మాగ్నైట్లో ఒక ముఖ్యమైన మైలురాయిని ప్రకటించింది. స్వచ్ఛమైన, మరింత స్థిరమైన ఇంధన ఎంపికల కోసం భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి అనుగుణంగా ఈ వాహనం ఇప్పుడు పూర్తిగా ఈ20 అనుకూలమైనదిగా మారింది. అదేకాకుండా మాగ్నైట్ అద్భుతమైన ఎగుమతి మైలురాయిని సాధించింది, 2020 లో లాంచ్ అయినప్పటి నుండి 50,000 యూనిట్లను దాటింది.ఈ20 కంపాటబిలిటీనిస్సాన్ మాగ్నైట్ 1.0-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ బీఆర్ 10 పెట్రోల్ ఇంజన్ ను ఈ20 కంప్లైంట్ గా అప్ గ్రేడ్ చేశారు. ఇది ఇప్పటికే ఈ20 కంపాటబుల్ గా ఉన్న 1.0-లీటర్ టర్బోఛార్జ్ డ్ పెట్రోల్ ఇంజిన్ కు జతయింది. 20% ఇథనాల్, 80% గ్యాసోలిన్ కలిగి ఉన్న ఈ20 ఇంధనం.. కర్బన ఉద్గారాలు, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి భారత్ విస్తృత వ్యూహంలో భాగం. న్యాచురల్ ఆస్పిరేటెడ్ ఇంజన్ 71బీహెచ్పీ పవర్, 96ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. టర్బోఛార్జ్ డ్ ఇంజన్ 98బీహెచ్పీ పవర్, 160ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్ కోసం ట్రాన్స్మిషన్ ఎంపికలలో 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్, 5-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (ఏఎంటీ) ఉన్నాయి. టర్బోఛార్జ్డ్ ఇంజన్ ఐదు-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ లేదా కంటిన్యూయస్ వేరియబుల్ ట్రాన్స్మిషన్ (సీవీటీ) తో లభిస్తుంది.ఎగుమతి మైలురాయిమాగ్నైట్ విడుదల చేసినప్పటి నుండి 50,000 యూనిట్ల ఎగుమతి మార్కును అధిగమించిందని నిస్సాన్ మోటార్ ఇండియా నివేదించింది. జనవరిలో మాగ్నైట్ లెఫ్ట్-హ్యాండ్ డ్రైవ్ వేరియంట్ను ఎగుమతి చేయడం ప్రారంభించింది. చెన్నైలోని కామరాజర్ పోర్ట్ నుండి లాటిన్ అమెరికన్ మార్కెట్లకు దాదాపు 2,900 యూనిట్లను రవాణా చేసింది. ఫిబ్రవరి నాటికి, లాటిన్ అమెరికా, మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా, ఆసియా పసిఫిక్ ప్రాంతాలలోని మార్కెట్లకు 10,000 యూనిట్లకు పైగా మాగ్నైట్ ఎగుమతి అయింది. -
పెరుగుతున్న నష్టాలు.. ముప్పులో 1,000 ఉద్యోగాలు
దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులలో ఒకటైన ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (Ola Electric) నష్టాలతో సతమతమవుతోంది. పెరుగుతున్న నష్టాలను తగ్గించుకునే ప్రయత్నాలలో భాగంగా 1,000 మందికి పైగా ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులను తొలగించాలని (Lay off) యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పెరిగిన పోటీ, నియంత్రణ పరిశీలన, నిర్వహణ వ్యయాలతో కంపెనీకి సవాలుతో కూడిన ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటోంది.ఇదీ నేపథ్యం..ప్రొక్యూర్మెంట్, ఫుల్ ఫిల్ మెంట్, కస్టమర్ రిలేషన్స్, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సహా పలు విభాగాలపై ఈ ఉద్యోగ కోతలు ప్రభావం చూపే అవకాశం ఉంది. 2023 నవంబర్లో ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే 500 మంది ఉద్యోగులను తొలగించింది. 2024 మార్చి నాటికి ఓలా ఎలక్ట్రిక్ మొత్తం 4,000 మంది ఉద్యోగులు ఉండగా ఇందులో నాలుగో వంతుకు పైగా తాజా తొలగింపుల ప్రభావానికి గురికానున్నారు. అయితే కంపెనీ బహిరంగ వెల్లడిలో భాగం కాని కాంట్రాక్ట్ కార్మికులను చేర్చడం వల్ల ఖచ్చితమైన ప్రభావం అస్పష్టంగా ఉంది.ఆర్థిక ఇబ్బందులుఓలా ఎలక్ట్రిక్ గణనీయమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ నష్టాలు 50% పెరిగాయి. ఆగస్టు 2023 లో బలమైన ఐపీఓ అరంగేట్రం తరువాత కంపెనీ స్టాక్ గరిష్ట స్థాయి నుండి 60 శాతానికి పైగా పడిపోయింది. ఉద్యోగుల తొలగింపు వార్తలు కంపెనీ షేరును మరింత ప్రభావితం చేశాయి. ఇది 5% పడిపోయి 52 వారాల కనిష్టాన్ని తాకింది.ఇదీ చదవండి: గూగుల్ ఉద్యోగులూ.. 60 గంటలు కష్టపడితేనే.. కోఫౌండర్ పిలుపువ్యూహాత్మక పునర్నిర్మాణంపునర్నిర్మాణ ప్రయత్నాలలో భాగంగా ఓలా ఎలక్ట్రిక్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, ఖర్చులను తగ్గించడానికి కస్టమర్ అనుభవాన్ని పెంచడానికి తన కస్టమర్ సర్వీస్ కార్యకలాపాలలో కొన్ని విభాగాలను ఆటోమేట్ చేస్తోంది. ఖర్చులను తగ్గించుకోవడానికి కంపెనీ తన లాజిస్టిక్స్, డెలివరీ వ్యూహాలను పునరుద్ధరిస్తోంది. ఓలా షోరూమ్లు, సర్వీస్ సెంటర్లలో ఫ్రంట్ ఎండ్ సేల్స్, సర్వీస్, వేర్హౌస్ సిబ్బంది తొలగింపుతో ప్రభావితమయ్యారు.మార్కెట్ స్థానం.. పోటీఒకప్పుడు భారతదేశంలో అగ్రగామి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థగా ఉన్న ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు ప్రత్యర్థుల చేతిలో పరాజయం పాలవుతోంది. డిసెంబర్ లో బజాజ్ ఆటో లిమిటెడ్ ఓలా ఎలక్ట్రిక్ ను అధిగమించి అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్ గా టీవీఎస్ మోటార్ కంపెనీ తరువాత మూడవ స్థానానికి చేరుకుంది. వాహన రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వ డేటా ప్రకారం 2023 చివరి నాటికి దేశంలోని టాప్ 10 ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లలో తొమ్మిదింటిలో ఓలా ఎలక్ట్రిక్ తన నాయకత్వ స్థానాన్ని కోల్పోయింది.భవిష్యత్తు కోసం ప్రయత్నాలుసవాళ్లు ఉన్నప్పటికీ, ఓలా ఎలక్ట్రిక్ తన మార్కెట్ ఉనికిని బలోపేతం చేసుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. తన పరిధిని విస్తరించడానికి, సర్వీస్ నాణ్యత గురించి వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించడానికి కంపెనీ ఇటీవల 2023 డిసెంబర్లో 3,200 కొత్త అవుట్లెట్లను ప్రారంభించింది. ఏదేమైనా అధిక మొత్తంలో కస్టమర్ ఫిర్యాదులు, ఎబిటాను చేరుకోవడానికి దాని అమ్మకాల లక్ష్యాలను సాధించాల్సిన అవసరంతో సహా కంపెనీ గట్టి అడ్డంకులను ఎదుర్కొంటోంది. -
సింగిల్ ఛార్జ్తో 800 కిమీ రేంజ్: ఈ కారు ధర ఎంతంటే..
చైనా ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ 'షియోమీ' (Xiaomi) గురువారం తన లగ్జరీ ఎలక్ట్రిక్ సెడాన్ 'ఎస్యూ7' (SU7) అల్ట్రా ధరలను ప్రకటించింది. ఈ కారు కోసం బుకింగ్స్ అక్టోబర్ చివరి నాటికి ప్రారంభమవుతాయని వెల్లడించింది.కంపెనీ తన షియోమీ ఎస్యూ7 అల్ట్రా ధరలను 529900 యువాన్స్ (సుమారు రూ. 63 లక్షల కంటే ఎక్కువ)గా ప్రకరించింది. సంస్థ ఇప్పటికే మార్చి నెలలో.. చైనాలో ఈ కారు డెలివరీలను ప్రారంభించింది. దీనికి అక్కడ మంచి ఆదరణ కూడా లభించిందని సంస్థ వెల్లడించింది.షియోమీ ఎస్యూ7 ఎలక్ట్రిక్ కారు రెండు వేరియంట్లలో లభిస్తుంది. బేస్ వేరియంట్ ఒక ఛార్జ్పై 668 కిమీ రేంజ్ అందిస్తే.. టాప్ వేరియంట్ 800 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుంది. ఈ కారు సూపర్ ఎలక్ట్రిక్ మోటార్ టెక్నాలజీని పొందుతుంది. కాబట్టి అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.చూడటానికి బీవైడీ సీల్ మాదిరిగా ఉండే ఈ కారు.. ఏరోడైనమిక్ డిజైన్ పొందుతుంది. కాబట్టి ఇది మినిమలిస్టిక్ లేఅవుట్తో ఒక పెద్ద టచ్స్క్రీన్ సెంటర్ స్టేజ్, ఒక డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, పెద్ద హెడ్స్-అప్ డిస్ప్లే, పనోరమిక్ రూఫ్ వంటివి పొందుతుంది. గత ఏడాది గ్లోబల్ మార్కెట్లో అరంగేట్రం చేసిన కొత్త ఎస్యూ7 ఎలక్ట్రిక్ సెడాన్ను.. షియోమీ భారతదేశంలో తన 10వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ప్రదర్శించింది. -
ఈవీ ఆఫర్.. రూ.40,000 క్యాష్బ్యాక్!
దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ మేకర్లలో ఒకటైన ప్యూర్ ఈవీ (PURE EV) తమ ఉత్పత్తుల అమ్మకాలను మరింత పెంచుకునేందుకు సరికొత్త ఆఫర్ను ప్రకటించింది. రాబోయే పండుగ సీజన్లో కస్టమర్లను ఆకట్టుకునేందుకు 'ప్యూర్ పర్ఫెక్ట్ 10' (PURE Perfect 10) రిఫరల్ ప్రోగ్రామ్ను ప్రారంభించినట్లు కంపెనీ వెల్లడించింది.ప్రోగ్రామ్ వివరాలుప్యూర్ పర్ఫెక్ట్ 10 రిఫరల్ ప్రోగ్రామ్ ఇప్పటికే ఉన్న ప్యూర్ ఈవీ కస్టమర్లందరితోపాటు మార్చి 31 నాటికి లేదా సంబంధిత అవుట్లెట్లలో స్టాక్స్ ఉన్నంత వరకూ ప్యూర్ ఈవీ వాహనాన్ని కొనుగోలు చేసే కొత్త కస్టమర్లకు కూడా అందుబాటులో ఉంటుంది. ఈ స్కీమ్ కింద కస్టమర్లు ఈవీ వాహనాన్ని కొనుగోలు చేసే తమ స్నేహితులు, కుటుంబ సభ్యులకు రెఫర్ చేయడం ద్వారా రూ.40,000 వరకు క్యాష్ బ్యాక్ రివార్డులను పొందవచ్చు.ఇది ఎలా పనిచేస్తుందంటే..ఇప్పటికే ఉన్న కొత్త ప్యూర్ ఈవీ వినియోగదారులతోపాటు కొత్త కస్టమర్లకు వారి రిజిస్టర్డ్ వాట్సాప్ నంబర్ ద్వారా 10 ప్రత్యేక రిఫరల్ కోడ్లు అందుతాయి. రిఫరర్ కొనుగోలుకు దారితీసే ప్రతి విజయవంతమైన రిఫరెన్స్ కు రూ.4,000 చొప్పున క్యాష్ బ్యాక్ వోచర్లను అందుకుంటారు. ఇలా గరిష్టంగా పది మందికి రెఫర్ చేసి వారు వాహనాన్ని కొనుగోలు చేస్తే రూ.40,000 వరకూ క్యాష్ బ్యాక్ వోచర్లు లభిస్తాయి.రిఫరల్స్ ద్వారా సంపాదించిన క్యాష్ బ్యాక్ వోచర్లను భవిష్యత్ సర్వీస్, స్పేర్ పార్ట్స్ అవసరాల కోసం ఉపయోగించవచ్చు. అలాగే వాహన అప్గ్రేడ్లు, ఎక్చ్సేంజ్, బ్యాటరీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ల కోసం కూడా వీటిని వినియోగించుకోవచ్చు. లేదా తమవారెవరైనా ప్యూర్ ఈవీ వాహనం కొనుగోలు చేసినప్పుడు ప్రత్యక్ష నగదు డిస్కౌంట్లను పొందవచ్చు."మా ప్రతి ప్రయత్నంలోనూ కస్టమర్లు మా హృదయంలో ఉంటారు. ఈ ప్రత్యేక రిఫరల్ కార్యక్రమంతో వారి పండుగ వేడుకలకు మరింత ఆనందాన్ని జోడించాలనుకుంటున్నాము. ఈ చొరవ మా కస్టమర్ల విశ్వాసం, విశ్వసనీయతకు ప్రతిఫలం ఇవ్వడమే కాకుండా ప్యూర్ ఈవీ అనుభవాన్ని వారి ప్రియమైనవారితో పంచుకోవడానికి వీలు కల్పిస్తుంది" అని ప్యూర్ ఈవీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో రోహిత్ వడేరా పేర్కొన్నారు. -
తక్కువ ధర.. ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్: ఇదిగో బెస్ట్ కార్లు
తక్కువ ధరలో.. ఎక్కువ ఫీచర్స్, మంచి డిజైన్ కలిగిన కార్లను కొనుగోలు చేయాలనుకునే వారు.. భద్రతకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగానే దాదాపు ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ ఉన్న కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కథనంలో ఆరు ఎయిర్బ్యాగ్లు కలిగిన బెస్ట్ కార్ల గురించి తెలుసుకుందాం.మారుతి సుజుకి సెలెరియోప్రారంభంలో సెలెరియో కారులో మారుతి సుజుకి కేవలం రెండు ఎయిర్బ్యాగ్లను మాత్రమే అందించింది. ఆ తరువాత కాలంలో ఈ హ్యాచ్బ్యాక్లో ఆరు ఎయిర్బ్యాగ్లు అందించడం మొదలు పెట్టింది. అయితే ఆరు ఎయిర్బ్యాగ్లు ఉన్న కారు ధర.. స్టాండర్డ్ వేరియంట్ ధర కంటే కొంత ఎక్కువ. ఈ కారు ధరలు రూ. 5.64 లక్షల నుంచి రూ. 7.37 లక్షల మధ్య ఉన్నాయి.హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కారులో కూడా కంపెనీ ఆరు ఎయిర్బ్యాగ్లను అందిస్తోంది. ఎయిర్బ్యాగ్లు మాత్రమే కాకుండా.. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రియర్ పార్కింగ్ కెమెరా, హిల్ అసిస్ట్ కంట్రోల్ వంటి ఫీచర్స్ కూడా ఉందులో ఉన్నాయి. ఈ కారు ధరలు రూ. 5.98 లక్షల నుంచి రూ. 8.38 లక్షలు. ఇది 1.2 లీటర్ గ్యాసోలిన్ ఇంజిన్ ద్వారా 82 హార్స్ పవర్, 113.8 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.నిస్సాన్ మాగ్నైట్మార్కెట్లో ఎక్కువ అమ్ముడవుతున్న కార్ల జాబితాలో నిస్సాన్ మాగ్నైట్ ఒకటి. రూ. 6.12 లక్షల నుంచి రూ. 11.72 లక్షల మధ్య ధరలో అందుబాటులో ఉన్న ఈ కారు ఆరు ఎయిర్బ్యాగ్లతో పాటు.. 360 డిగ్రీ కెమెరా, హిల్ స్టార్ట్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఏబీఎస్ విత్ ఈబీడీ, త్రీ పాయింట్ సీట్ బెల్ట్ వంటివి కూడా ఉన్నాయి.హ్యుందాయ్ ఎక్స్టర్2023లో అత్యధిక అమ్మకాలు పొందిన హ్యుందాయ్ ఎక్స్టర్.. ఆరు ఎయిర్బ్యాగులు, రియర్ పార్కింగ్ కెమెరా, ఐసోఫిక్స్ సీట్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ మొదలైనవి పొందుతుంది. దీని ధరలు రూ. 6 లక్షల నుంచి రూ. 9.48 లక్షల మధ్య ఉన్నాయి.మారుతి సుజుకి స్విఫ్ట్ఆరు ఎయిర్బ్యాగులు, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, రియర్ పార్కింగ్ కెమెరా, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఐసోఫిక్స్ సీట్లు వంటి సేఫ్టీ ఫీచర్స్ కలిగిన మారుతి స్విఫ్ట్ ధర రూ. 6.49 లక్షల నుంచి రూ. 9.50 లక్షల మధ్య ఉంది. ఇది పెట్రోల్, CNG రూపంలో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమాటిక్ గేర్బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది.ఇదీ చదవండి: భారత్లోని బెస్ట్ అడ్వెంచర్ బైకులు ఇవే!.. ధరలు ఎలా ఉన్నాయంటే?సిట్రోయెన్ సీ3ఫ్రెచ్ వాహన తయారీ సంస్థ అయిన.. సిట్రోయెన్ తన సీ3 కారులో కూడా ఆరు ఎయిర్బ్యాగ్స్ అందిస్తోంది. రూ. 6.16 లక్షల ప్రారంభ ధర వద్ద లభించే ఈ కారు.. ఏబీఎస్ విత్ ఈబీడీ, హిల్ హోల్డ్ అసిస్ట్, డే - నైట్ ఐఆర్వీఎమ్ వంటి వాటిని పొందుతుంది. తక్కువ ధరలో.. మంచి సేఫ్టీ ఫీచర్స్ కలిగిన కార్ల జాబితాలో సిట్రోయెన్ సీ3 ఒకటి. -
బీఎండబ్ల్యూ స్టైలిష్ బైక్.. లాంచ్ ఎప్పుడంటే?
ప్రముఖ బైక్స్ తయారీ సంస్థ.. 'బీఎండబ్ల్యూ మోటోరాడ్' కంపెనీ దేశీయ మార్కెట్లో 'ఎఫ్ 450 జీఎస్'ను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. 2024 ఈఐసీఎమ్ఏ ఎడిషన్లో కనిపించిన ఈ బైక్ 2025 చివరి నాటికి రోడ్డు మీదకి రానుంది.బీఎండబ్ల్యూ ఎఫ్ 450 జీఎస్.. బైక్ 450 సీసీ ట్విన్ సిలిండర్ ఇంజిన్ కలిగి ఉంటుంది. కాబట్టి ఇది మంచి పనితీరును అందిస్తుందని తెలుస్తోంది. ఈ బైక్ ముందు భాగంలో ఫుల్లీ అడ్జస్టబుల్ అప్సైడ్-డౌన్ ఫోర్క్, వెనుక భాగంలో మోనో-షాక్ అబ్జార్బర్ వంటివి ఉన్నాయి. రెండు చివర్లలో డిస్క్ బ్రేక్లు ఉన్నాయి.సింగిల్ పీస్ సీటు కలిగిన ఈ బైక్.. డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ సెటప్ కలిగి ఉండి, మధ్యలో GS బ్యాడ్జింగ్ పొందుతుంది. 6.5 ఇంచెస్ TFT డిస్ప్లే, క్రాస్-స్పోక్ వీల్స్ కూడా ఇందులో ఉన్నాయి. 175 కేజీల బరువున్న బీఎండబ్ల్యూ ఎఫ్ 450 జీఎస్ ఆఫ్ రోడింగ్ చేయడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.ఇదీ చదవండి: రోజుకు రూ.27 కోట్లు విరాళం ఇచ్చిన వ్యక్తి.. ఈయన గురించి తెలుసా? -
ఆ కార్లలో సాఫ్ట్వేర్ సమస్య.. కంపెనీ కీలక నిర్ణయం
కొరియన్ కంపెనీ కియా మోటార్స్.. ఈవీ 6 కార్లకు రీకాల్ ప్రకటించిన తరువాత, జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ (Mercedes Benz).. సీ-క్లాస్, ఈ-క్లాస్ కార్లకు రీకాల్ ప్రకటించింది.రీకాల్ ప్రకటించిన కార్ల జాబితాలో.. 2022 ఏప్రిల్ 29 నుంచి 2024 ఆగస్టు 20 మధ్య తయారైన 2,543 యూనిట్ల E-క్లాస్ కార్లు & 2021 ఆగస్టు 31 నుంచి 2021 అక్టోబర్ 31 మధ్య తయారైన 3 యూనిట్ల సీ-క్లాస్ కార్లు ఉన్నాయి. ఈ కార్లలో ఇంజిన్ కంట్రోల్ యూనిట్ (ECU) సాఫ్ట్వేర్ సమస్యను పరిష్కరించడానికి కంపెనీ ఈ రీకాల్ ప్రకటించింది.ఈసీయూ సాఫ్ట్వేర్ సమస్య కారణంగా.. ఎటువంటి హెచ్చరిక లేకుండా కారు ప్రొపల్షన్ కోల్పోయే అవకాశం ఉంది. అప్పుడు ప్రమాదాలు జరుగుతాయి. పెట్రోల్ వేరియంట్లలో మాత్రమే ఈ సమస్య ఉన్నట్లు కంపెనీ ధ్రువీకరించింది. కాబట్టి దీనిని సంస్థ ఉచితంగానే పరిష్కరిస్తుంది. -
కియా రీకాల్.. వందలాది ఈవీ6 కార్లు వెనక్కి
ప్రముఖ వాహన తయారీ సంస్థ.. కియా మోటార్స్ (Kia Motors) తన 'ఈవీ6' (EV6) కోసం స్వచ్చందంగా రీకాల్ ప్రకటించింది. 2022 మార్చి 3 నుంచి 2023 ఏప్రిల్ 14 మధ్య తయారైన మొత్తం 1,380 యూనిట్లలో సమస్య ఉన్నట్లు గుర్తించి ఈ రీకాల్ ప్రకటించడం జరిగింది.కియా ఈవీ6 ఎలక్ట్రిక్ కార్లలో.. ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్ (ICCU)లో 12వీ బ్యాటరీ పనితీరును ప్రభావితం చేసే లోపం కారణంగా రీకాల్ పరకటించింది. ఈ సమస్య కారణంగా.. 2024లో కూడా కంపెనీ 1138 యూనిట్లకు రీకాల్ ప్రకటించింది. ఇప్పుడు మరోమారు రీకాల్ జారీచేసింది.ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్ (ICCU)లోని సాఫ్ట్వేర్ అప్డేట్ 12వీ బ్యాటరీ ఛార్జింగ్.. పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది కారులోని లైట్స్, వైపర్లు, మ్యూజిక్ సిస్టమ్ వంటి వాటికి శక్తిని ఇస్తుంది. కార్లలో ఈ లోపాన్ని కంపెనీ ఉచితంగానే పరిష్కరిస్తుంది. అయితే సంబంధిత వాహనాల యజమానులను నేరుగా సంప్రదించి వాటిని అప్డేట్ చేస్తామని కంపెనీ పేర్కొంది.ఇదీ చదవండి: భారత్లోని బెస్ట్ అడ్వెంచర్ బైకులు ఇవే!.. ధరలు ఎలా ఉన్నాయంటే?ప్రభావిత వాహనాల కస్టమర్లు అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకోవడానికి.. సంబంధిత కియా డీలర్షిప్లను సంప్రదించవచ్చు, లేదా ఇతర వివరాల కోసం టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయవచ్చు. కియా రీకాల్ గురించి రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) కు కూడా సమాచారం అందించింది. -
భారత్లోని బెస్ట్ అడ్వెంచర్ బైకులు ఇవే!.. ధరలు ఎలా ఉన్నాయంటే?
ఇండియన్ మార్కెట్లో రోజువారీ వినియోగానికి ఉపయోగపడే బైకులకు మాత్రమే కాకుండా.. అడ్వెంచర్ బైకులకు కూడా మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు సంస్థలు దేశీయ విఫణిలో సరికొత్త అలాంటి బైకులను లాంచ్ చేస్తున్నాయి. ఈ కథనంలో రూ. 3 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే ఐదు బెస్ట్ అడ్వెంచర్ మోటార్ సైకిళ్ళ గురించి తెలుసుకుందాం.సుజుకి వీ-స్ట్రోమ్ ఎస్ఎక్స్ (Suzuki V-Strom SX)సుజుకి వీ-స్ట్రోమ్ ఎస్ఎక్స్ దేశీయ విఫణిలో ఎక్కువ మందిని ఆకర్శించిన బైక్. దీని ధర రూ. 2.16 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ కొనుగోలుపై కంపెనీ ఇప్పుడు (ఫిబ్రవరి) రూ. 15,000 తగ్గింపును అందిస్తోంది. ఈ బైక్ 249 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా 9300 rpm వద్ద, 26.1 Bhp పవర్, 7300 rpm వద్ద 22.2 Nm టార్క్ అందిస్తుంది. ఈ బైక్ పొడవైన విండ్స్క్రీన్, బీక్ స్టైల్ ఫ్రంట్ ఫెండర్, మస్క్యులర్ ఫ్యూయెల్ ట్యాంక్తో మంచి డిజైన్ పొందుతుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్లైట్, బ్లూటూత్ ఎనేబుల్డ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, USB ఛార్జింగ్ స్లాట్ వంటివన్నీ ఉన్నాయి.హీరో ఎక్స్పల్స్ 210 (Hero XPulse 210)ఈఐసీఎంఏ 2024లో కనిపించిన హీరో ఎక్స్పల్స్ 210 అనేది.. అడ్వెంచర్ లైనప్లో తాజా వెర్షన్. ఇది ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ ఎక్స్పోలో లాంచ్ అయింది. దీని ధర రూ. 1.75 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైకులోని 210 సీసీ ఇంజిన్ 9250 rpm వద్ద, 24.2 Bhp పవర్, 7250 rpm వద్ద 20.7 Nm టార్క్ అందిస్తుంది. కొత్త డిజైన్ కలిగిన ఈ బైక్.. మంచి ఆఫ్ రోడ్ అనుభూతిని కూడా అందిస్తుంది.కేటీఎమ్ 250 అడ్వెంచర్ (KTM 250 Adventure)అడ్వెంచర్ బైక్ అంటే.. అందరికీ ముందుగా గుర్తొచ్చేది కేటీఎమ్ బైకులే. కాబట్టి రూ. 3 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బైకుల జాబితాలో 'కేటీఎమ్ 250 అడ్వెంచర్' ఉంది. దీని ధర రూ. 2.59 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). ఇందులోని 249 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్.. 9250 rpm వద్ద 30.5 Bhp పవర్, 7250 rpm వద్ద 24 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.యెజ్డీ అడ్వెంచర్ (Yezdi Adventure)రూ. 2.09 లక్షల ప్రారంభ ధర వద్ద లభించే.. యెజ్డీ అడ్వెంచర్ కూడా మన జాబితాలో చెప్పుకోదగ్గ బైక్. ఇది 334 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా 8000 rpm వద్ద 29.1 Bhp పవర్, 6500 rpm వద్ద 29.8 Nm టార్క్ అందిస్తుంది. ఇది రౌండ్ ఎల్ఈడీ హెడ్లైట్, పొడవైన విండ్స్క్రీన్, స్ప్లిట్ సీట్లు, వైర్-స్పోక్ వీల్స్ వంటివి పొందుతుంది. కాబట్టి మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.ఇదీ చదవండి: ఫాస్ట్ట్యాగ్ కొత్త రూల్స్: ఆ టోల్ ప్లాజాలకు వర్తించదురాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ (Royal Enfield Himalayan)అడ్వెంచర్ చేసేవారికి ఇష్టమైన బైకులలో చెప్పుకోదగ్గ మోడల్ ''రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్''. ఇది 452 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా.. 8000 rpm వద్ద 39.4 Bhp పవర్, 5500 rpm వద్ద 40 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైకులో రౌండ్ TFT డిస్ప్లే, ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్, రైడ్-బై-వైర్, మల్టిపుల్ రైడింగ్ మోడ్లు, లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. దీని ధర రూ. 2.85 లక్షలు (ఎక్స్ షోరూమ్). -
హ్యుందాయ్ తయారీ కేంద్రంగా భారత్
పొరుగు దేశాలతో పాటు ఆఫ్రికా తదితర వర్ధమాన మార్కెట్లకు ఎగుమతులు చేసేందుకు భారత్ను తయారీ హబ్గా మార్చుకోనున్నట్లు ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ (Hyundai) మోటర్ ఇండియా ఎండీ అన్సూ కిమ్ తెలిపారు. దేశీయంగా కార్యకలాపాలను విస్తరించనున్నట్లు వివరించారు.ఆఫ్రికా, మెక్సికో, లాటిన్ అమెరికా మార్కెట్లన్నింటిలోనూ అమ్మకాలు పెరుగుతున్నాయని వివరించారు. రిస్కులను తగ్గించుకునేందుకు ఇతర మార్కెట్లపై కూడా దృష్టి పెట్టనున్నట్లు వివరించారు. నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక లాంటి పొరుగు దేశాలకు కూడా ఎగుమతులు పెంచుకోనున్నట్లు పేర్కొన్నారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో హ్యుందాయ్ వాహన ఎగుమతులు 43,650 యూనిట్ల నుంచి 40,386 యూనిట్లకు తగ్గాయి. 2024 క్యాలెండర్ సంవత్సరంలో హ్యుందాయ్ మొత్తం 1,58,686 యూనిట్లను ఎగుమతి చేసింది. గతేడాది సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, మెక్సికో, చిలీ, పెరూ అతి పెద్ద ఎగుమతి మార్కెట్లుగా నిలిచాయి.పేద విద్యార్థులకు సాయంహ్యుందాయ్ మోటార్ ఇండియా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు అండగా నిలుస్తోంది. హ్యుందాయ్ హోప్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ పేరిట స్కాలర్షిప్లను ఇస్తోంది. తాజాగా ఆ కంపెనీ మొత్తం రూ.3.38 కోట్ల స్కాలర్షిప్ను అందించింది. దేశంలని 23 రాష్ట్రాల నుండి దరఖాస్తులు వచ్చాయి. 783 మంది ప్రతిభావంత విద్యార్థులు ఈ స్కాలర్షిప్లు అందుకున్నారు. వీరిలో 440 మంది విద్యార్థులు సివిల్ సర్వీసెస్ పరీక్ష, క్టాట్కి సిద్ధమవుతున్నారు. 343 మంది విద్యార్థులు ఐఐటీల నుండి వచ్చారు. హ్యుందాయ్ ఈ కార్యక్రమాన్ని 2024 ఆగస్టులో ప్రారంభించింది. -
ఎన్ఎక్స్200 vs ఎక్స్పల్స్ 200 4వీ: ఏది బెస్ట్ బైక్?
భారతదేశంలో ప్రముఖ టూ-వీలర్ తయారీ సంస్థ అయిన.. హోండా మోటార్సైకిల్ (Honda Motorcycle) తన సీబీ200ఎక్స్ స్థానంలో 'ఎన్ఎక్స్200'ను లాంచ్ చేసింది. కంపెనీ దీనిని అడ్వెంచర్ టూరర్ అని పిలిచింది. ఈ బైక్ టూరింగ్ కోసం ఎక్కువమంది కొనుగోలు చేస్తున్నప్పటికీ.. ఇది హీరో ఎక్స్పల్స్ 200 4Vకి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ రెండు బైకుల మధ్య వ్యత్యాసం ఏంటో ఇక్కడ చూద్దాం.ధర: హోండా ఎన్ఎక్స్200 ఒక వేరియంట్లో మాత్రమే రూ. 1.68 లక్షలకు అందుబాటులో ఉంది. కాగా హీరో ఎక్స్పల్స్ 200 4వీ స్టాండర్డ్, ప్రో, ప్రో డాకర్ ఎడిషన్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు రూ. 1.51 లక్షల నుంచి రూ. 1.67 లక్షల (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.ఫీచర్స్: హోండా ఎన్ఎక్స్200.. హీరో ఎక్స్పల్స్ 200 4వీ రెండూ కూడా బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, ఎల్ఈడీ హెడ్లైట్, టెయిల్లైట్, టర్న్ ఇండికేటర్లు, USB ఛార్జింగ్ పోర్ట్ వంటి వాటిని పొందుతాయి. ఎక్స్పల్స్ 200 4వీ టర్న్-బై-టర్న్ నావిగేషన్ పొందుతుంది, ఎన్ఎక్స్200 ట్రాక్షన్ కంట్రోల్ పొందుతుంది.ఇదీ చదవండి: బీవైడీ సీలియన్ 7 వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?హీరో ఎక్స్పల్స్ 200 4వీ, హోండా ఎన్ఎక్స్200 కంటే ఎత్తుగా, పొడవుగా, వెడల్పుగా ఉంటుంది. డిజైన్ కూడా భిన్నంగా ఉంటుంది. హోండా ముందు భాగంలో అప్సైడ్డౌన్ ఫోర్కే పొందుతుంది. కానీ హీరో దాని సస్పెన్షన్ సెటప్ కోసం ఫుల్లీ అడ్జస్టబుల్ పొందుతుంది.పవర్ట్రెయిన్: హీరో ఎక్స్పల్స్ 200 4వీ.. 199.6 సీసీ సింగిల్ సిలిండర్, ఆయిల్ - కూల్డ్ ఇంజిన్ కలిగి 8,500 rpm వద్ద 18.9 Bhp & 6,500 rpm వద్ద 17.35 Nm టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఇక హోండా ఎన్ఎక్స్200 బైక్ 184.4 సీసీ సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ద్వారా 17.03 bhp పవర్, 15.9 Nm టార్క్ అందిస్తుంది. ఇందులో కూడా 5-స్పీడ్ గేర్బాక్స్ ఉంటుంది. రెండూ కూడా ఉత్తమ పనితీరును అందిస్తాయి. -
కొనాలన్నా.. ఈ రెండు కార్లు దొరకవు!
ఇండియన్ మార్కెట్లో అధిక ప్రజాదరణ పొందిన.. ఆడి (Audi) కంపెనీ రెండు కార్లను వెబ్సైట్ నుంచి తొలగించింది. ఇందులో ఏ8ఎల్, ఆర్ఎస్ 5 స్పోర్ట్బ్యాక్ ఉన్నాయి. ఈ రెండు కార్లు భారతదేశానికి సీబీయూ (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారానే వచ్చాయి. ఆడి ఏ8 ఎల్ భారతదేశంలో 2020లో లాంచ్ అయింది, ఆర్ఎస్5 స్పోర్ట్బ్యాక్ 2021 నుంచి అమ్మకానికి ఉంది. వీటి ధరలు వరుసగా రూ. 1.63 కోట్లు, రూ. 1.13 కోట్లు (ఎక్స్ షోరూమ్, ఇండియా).నాల్గవ తరం ఆడి ఏ8 ఎల్ 2017 నుంచి గ్లోబల్ మార్కెట్లో అందుబాటులో ఉంది. అయితే 2020లో భారతదేశానికి వచ్చింది. ఆ తరువాత 2022లో ఫేస్లిఫ్ట్ వెర్షన్ రూపంలో లాంచ్ అయింది. ఏ8 ఎల్ నాలుగు, ఐదు సీట్ల కాన్ఫిగరేషన్లలో.. సౌకర్యవంతమైన రియర్ సీటు పొందుతుంది. ఇందులోని 3.0 లీటర్ TFSI వీ6 టర్బో పెట్రోల్ ఇంజిన్.. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో లభిస్తుంది.ఇక ఆడి ఆర్ఎస్5 స్పోర్ట్బ్యాక్ విషయానికి వస్తే.. ఇది ఆగస్టు 2021లో ఇండియన్ మార్కెట్లో ప్రారంభమైంది. ఇందులోని 2.9 లీటర్ ట్విన్ టర్బో వీ6 ఇంజిన్ 450 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఏ8 మాదిరిగానే ఇది కూడా వెబ్సైట్ నుంచి కనుమరుగైంది. కాగా కంపెనీ ఫిబ్రవరి 17న భారతదేశంలో RS Q8 ఫేస్లిఫ్ట్ లాంచ్ చేసే అవకాశం ఉంది.ఇదీ చదవండి: బుకింగ్స్లో కనీవినీ ఎరుగని రికార్డ్!: ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే? -
డొనాల్డ్ ట్రంప్ మరో ప్రకటన.. ఏప్రిల్ 2 నుంచి అమలు!?
జనవరి 20న పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' (Donald Trump) కీలక నిర్ణయాలను తీసుకుంటూ.. మిత్ర దేశాలను, శత్రుదేశాలను భయానికి గురిచేస్తున్నారు. పన్నుల విషయంలో తగ్గేదే లే అన్నట్లు.. సంచలన ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా దిగుమతి చేసుకున్న కార్లపై సుంకాలను ప్రకటించాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు.కార్ల మీద మాత్రమేనా.. ఆటోమొబైల్ ఉత్పత్తుల మీద కూడా సుంకాలను విధిస్తారా? అనే విషయం తెలియాల్సి ఉంది. ఆదాయాన్ని పెంచడానికి, వాణిజ్య అసమానతలను పరిష్కరించడానికి సుంకాలు విధించడం అవసరమని ట్రంప్ పేర్కొన్నారు.అమెరికాలో అమ్ముడవుతున్న కార్లలో దాదాపు 50 శాతం ఆ దేశంలోనే తయారవుతున్నాయి. దిగుమతులలో సగం మెక్సికో.. కెనడా నుంచి వస్తున్నాయి. మిగిలిన సగం జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, బ్రిటన్, ఇటలీ, స్వీడన్ దేశాలు దిగుమతి చేస్తున్నాయి.ఉక్కు, అల్యూమినియం దిగుమతి మీద 25 శాతం సుంకం ప్రకటించినప్పుడు.. ఫోర్డ్ సీఈఓ జిమ్ ఫర్లీ విమర్శించారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం కార్ల ధరలను విపరీతంగా పెంచుతుందని, మా సరఫరా గొలుసులకు కూడా అంతరాయం కలిగిస్తుందని అన్నారు. ట్రంప్ పరిపాలనలోనే చర్చలు జరిపిన యునైటెడ్ స్టేట్స్-మెక్సికో-కెనడా ఒప్పందానికి (USMCA) కూడా ప్రతికూలత కలుగుతుందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: నేనో ఇడియట్లా ఫీలయ్యా.. నిఖిల్ కామత్ ఇన్స్టా పోస్ట్ వైరల్మార్చి 12 నుంచి ప్రారంభమయ్యే అన్ని ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై సుంకాలకు సంబంధించిన ప్రణాళికలను అధ్యక్షుడు ఇటీవల నిర్ధారించారు. అయితే డెట్రాయిట్ ఆటోమేకర్లు జనరల్ మోటార్స్, ఫోర్డ్, స్టెల్లాంటిస్ వంటి వాటికి ప్రాతినిధ్యం వహిస్తున్న అమెరికన్ ఆటోమోటివ్ పాలసీ కౌన్సిల్.. మెక్సికో & కెనడాపై ప్రతిపాదిత సుంకాలను తగ్గించాలని ట్రంప్కు పిలుపునిచ్చింది. -
హోండా కొత్త బైక్.. మార్కెట్లోకి ఎన్ఎక్స్200
దేశంలో అడ్వెంచర్ టూరర్ మార్కెట్ వృద్ధి చెందుతోంది. హై సెట్ బైక్లకు పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా కంపెనీలు సరికొత్త లాంచ్లతో ముందుకువస్తున్నాయి. ఈ క్రమంలోనే హోండా కొత్త ఎన్ఎక్స్ 200 (Honda Nx200)ను మార్కెట్లో లాంచ్ చేసింది. దీని ధర రూ. 1.68 లక్షలుగా (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) కంపెనీ నిర్ణయించింది. ఎన్ఎక్స్ 200 అనేది రీబ్రాండెడ్ సీబీ200ఎక్స్.ఈ కొత్త చేరికతో హోండా భారత్లో విక్రయించే ఎన్ఎక్స్ శ్రేణి బైక్లు రెండుకు చేరతాయి. ఈ రేంజ్లో ఎన్ఎక్స్500ను ఇప్పటికే హోండా ఇక్కడ విక్రయిస్తోంది. భారత్లో ఎన్ఎక్స్కు మెరుగైన బ్రాండ్ రీకాల్, విలువ ఉన్న నేపథ్యంలో సీబీ200ఎక్స్ను ఎన్ఎక్స్200గా రీబ్రాండ్ చేయాలని హోండా నిర్ణయించినట్లు కనిపిస్తోంది.స్టైలింగ్ పరంగా ఎన్ఎక్స్200 కొన్ని చిన్న డిజైన్ జోడింపులు చేశారు. అయితే మొత్తంగా స్టైలింగ్లో పెద్దగా మార్పులు లేవు. కానీ మోటార్సైకిల్పై కొన్ని ప్రధాన ఫీచర్ అప్గ్రేడ్లు కనిపిస్తున్నాయి. అందులో డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, బ్లూటూత్ ఇంటిగ్రేషన్తో టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ప్రధానంగా ఉన్నాయి.ఎన్ఎక్స్200 అదే 184సీసీ సింగిల్-సిలిండర్ ఇంజిన్తో వచ్చింది. కానీ ఇప్పుడు ఓబీడీ2బీ కాంప్లియన్స్తో వచ్చింది. ఇది 17 ps శక్తిని, 16.1 nm పీక్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కాకుండా స్లిప్పర్ క్లచ్తో 5 స్పీడ్ గేర్బాక్స్ను ఈ బైక్లో జత చేశారు. హోండా ఎన్ఎక్స్200ను కంపెనీ ప్రీమియం డీలర్షిప్ల ద్వారా విక్రయిస్తారు. ఇది మూడు రంగుల్లో లభిస్తుంది. బుకింగ్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మార్చి నుండి డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. -
అమ్మకాల్లో తగ్గేదేలే.. మార్కెట్లో విండ్సర్ హవా!
భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని 'ఎంజీ మోటార్' (MG Motor) కొత్త 'విండ్సర్' (Windsor) లాంచ్ చేసింది. కంపెనీ ఈ కారును మార్కెట్లో లాంచ్ చేసినప్పటి నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. 2024 అక్టోబర్ నుంచి 3000 యూనిట్లకు తగ్గకుండా కంపెనీ విండ్సర్ కార్లను విక్రయిస్తోంది.ఎంజీ మోటార్ ఇండియా.. జనవరి 2025లో 3,277 యూనిట్ల విండ్సర్లను విక్రయించింది. డిసెంబర్ 2024లో 3,785 యూనిట్లు, నవంబర్ 2024లో 3,144 యూనిట్లు, అక్టోబర్ 2024లో 3,116 యూనిట్ల అమ్మకాలు సాధించినట్లు వెల్లడించింది. ఈ కారు ఎక్సైట్, ఎక్స్క్లూజివ్, ఎసెన్స్ అనే వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 13.99 లక్షలు, రూ. 14.99 లక్షలు, రూ. 15.99 లక్షలు (ఎక్స్ షోరూమ్).ఎంజీ విండ్సర్ కారును బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) కింద కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ విధంగా కొనుగోలు చేస్తే.. ధరలు చాలా తగ్గుతాయి. ఈ ఎలక్ట్రిక్ కారు 38kWh లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీతో కూడిన మాగ్నెట్ సింక్రోనస్ మోటారును పొందుతుంది. ఒక ఫుల్ ఛార్జిపై ఇది 332 కిమీ రేంజ్ అందిస్తుంది.ఎంజీ విండ్సర్ ప్రకాశవంతమైన లోగో, ఎల్ఈడీ లైట్లు, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ఏరో లాంజ్ సీట్లు, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ప్లేతో 15.6 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ టెయిల్గేట్, పనోరమిక్ సన్రూఫ్ వంగతి ఫీచర్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో 36 కంటే ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్, 80 కంటే ఎక్కువ కనెక్టెడ్ కార్ ఫీచర్స్ ఉన్నాయి. -
బజాజ్ ఆటో నుంచి త్వరలోనే ఈ-రిక్షా
బజాజ్ ఆటో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి (మార్చి) ఈ–రిక్షా విభాగంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటి వరకు అసంఘటితంగా ఉన్న ఈ విభాగంలో గణనీయమైన వాటాపై దృష్టి సారించింది. ప్రస్తుత త్రైమాసికం చివరికి అనుమతులు రావచ్చని, నెలవారీ రూ.45,000 యూనిట్ల విక్రయ అంచనాతో ఉన్నట్టు బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేశ్ శర్మ తెలిపారు.‘‘ఆధునిక ‘ఈ–రిక్’ను ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఆవిష్కరించే ఉద్దేశ్యంతో ఉన్నాం. ఈ విభాగంలో ఇది కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తుంది. అటు యజమానులు, ఇటు ప్రయాణికులకు సంతోషాన్నిచ్చే విధంగా ఉత్పత్తి ఉంటుంది’’అని రాకేశ్ శర్మ వివరించారు. ఆటో విభాగం స్థాయిలోనే ఈ–రిక్ విభాగం కూడాఉంటుందని చెప్పారు.కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ గురించి మాట్లాడుతూ.. బజాజ్ ఆటో కొత్తగా ప్రవేశపెట్టిన అధిక రేంజ్, అధునాతన డిస్ప్లేలు, వేగవంతమైన ఛార్జింగ్, అత్యుత్తమ బూట్ స్పేస్ అందించే బజాజ్ చేతక్ 35 సిరీస్ ద్వారా ఎలక్ట్రిక్ టూ వీలర్ సెగ్మెంట్లో మార్కెట్ వాటాను పెంచుకోవాలనుకుంటున్నట్లు రాకేశ్ శర్మ పేర్కొన్నారు."ఇప్పటికే ప్రవేశపెట్టిన రెండు వేరియంట్లు ఈ ఈవీ విభాగంలో అధిక మార్కెట్ వాటా కోసం బలమైన పాత్ర పోషిస్తున్నాయి. కొత్త సిరీస్ కూడా దిగువ శ్రేణిపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది" అని రాకేశ్ శర్మ ఆశాభావం వ్యక్తం చేశారు. -
స్కోడా ఈవీ వస్తోంది.. అదిరిపోయే రేంజ్!
వాహన తయారీ సంస్థ స్కోడా ఇండియా (Skoda) నుంచి తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఈ ఏడాదే వస్తోంది. సెప్టెంబర్ కల్లా భారతీయ రోడ్లపై స్కోడా ఎన్యాక్ (Skoda Enyaq) పరుగు తీయనుంది. తొలుత పూర్తిగా తయారైన కారును భారత్కు దిగుమతి చేస్తారు. 63, 82 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్స్తో రూపుదిద్దుకుంది.పర్ఫార్మెన్స్, రేంజ్ఎన్యాక్ అధునాతన ఎలక్ట్రిక్ మోటార్లతో థ్రిల్లింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలు తక్షణ టార్క్ను అందిస్తాయి. ఎన్యాక్ ఆకట్టుకునే రేంజ్ కలిగి ఉంది. ఒకసారి చార్జింగ్తో బ్యాటరీని బట్టి 439–597 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. టాప్ స్పీడ్ గంటకు 180 కిలోమీటర్లు. గంటకు 100 కి.మీ. వేగాన్ని 6.7 సెకన్లలో అందుకుంటుంది. 30 ని. చార్జింగ్ 10 నుంచి 80 శాతానికి చేరుతుంది.డిజైన్, స్టైల్ఎన్యాక్ దృఢమైన లైన్లు, ఉల్లాసమైన ఆకారాలను కలిగి ఉంటుంది. సిగ్నేచర్ స్కోడా గ్రిల్, ఎలక్ట్రిక్ ఓరియెంటెడ్ రీమేక్ అయినప్పటికీ, ఇప్పటికీ దాని ఐకానిక్ ఫీచర్ను కలిగి ఉంది. సొగసైన ఎల్ఈడీ హెడ్లైట్లు, వంపులు ఆధునిక లుక్ అందిస్తాయి. -
సరికొత్త ఫీచర్లతో.. వచ్చేస్తోంది యాక్టివా 7జీ
భారతదేశంలో అధిక ప్రజాదరణ పొందిన 'హోండా యాక్టివా' స్కూటర్.. '7జీ' వెర్షన్లో లాంచ్ కావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే 6జీ వెర్షన్లో అమ్మకానికి ఉన్న ఈ స్కూటర్.. త్వరలోనే మరిన్ని ఆధునిక హంగులతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది కూడా గొప్ప సేల్స్ పొందే అవకాశం ఉందని సమాచారం.కస్టమర్ల ఊహలకు లేదా అంచనాలను 7జీ యాక్టివా దగ్గరగా ఉంటుందని సమాచారం. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండే అవకాశం ఉంటుంది. ఇది రైడర్ల అవసరమైన సమాచారాన్ని వీక్షించడానికి మాత్రమే కాకుండా.. స్మార్ట్ఫోన్ను యాక్సెస్ చేయడానికి కూడా అనుమతిస్తుంది. దీని ద్వారా నావిగేషన్, కాల్ అలర్ట్లు, మ్యూజిక్ కంట్రోల్స్ వంటి మెరుగైన ఫీచర్లు డాష్బోర్డ్లో కనిపిస్తాయి.కంపెనీ 7జీ యాక్టివాకు సంబంధించిన చాలా వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఇది 109.51 సీసీ సింగిల్ సిలిండర్ బీఎస్6 ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజిన్ పొందుతుందని సమాచారం. ఇది 7.79 పీఎస్ పవర్, 8.84 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ స్కూటర్ 68 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.హోండా యాక్టివా 7జీ స్కూటర్.. కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్స్ (CBS) లేదా యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్స్ (ABS) వంటి సేఫ్టీ ఫీచర్లతో పాటు.. స్టాండర్డ్ లేదా ఆప్షనల్ అప్గ్రేడ్స్ పొందే అవకాశం ఉందని సమాచారం. వీటితోపాటు ఇందులో జియో-ఫెన్సింగ్ ఫీచర్ వంటి లేటెస్ట్ టెక్నాలజీ కూడా ఉండే అవకాశం ఉంది. ఈ స్కూటర్ ఎప్పుడు లాంచ్ అవుతుంది? ధర ఎంత ఉంటుందనే వివరాలను కూడా కంపెనీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. -
ఆటోకి మూడు చక్రాలే ఎందుకు?.. కారణం తెలుసా!
దశాబ్దాల చరిత్ర ఉన్న.. ఆటో రిక్షా ఎన్ని అప్డేట్స్ పొందినా మూడు చక్రాలతోనే వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే కాకుండా.. పట్టణ ప్రాంతాల్లో కూడా విరివిగా అందుబాటులో ఉన్న ఆటోలకు ఇతర వాహనాలకు మాదిరిగా ఎందుకు నాలుగు చక్రాలు ఉండవు?, మూడు చక్రాలు ఉండటానికి కారణం ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.బ్యాలెన్స్ చేయడం సులభంనాలుగు చక్రాల వాహనాల కంటే.. మూడు చక్రాల వాహనాలను బ్యాలెన్స్ చేయడం కొంత సులభం అని ఓ ఐఐటీ ప్రొఫెసర్ వివరించారు. అంతే కాకుండా.. దీనిని రూపొందించడానికి అయ్యే ఖర్చు కూడా తక్కువని అన్నారు.ఖర్చు మాత్రమే కాకుండా.. ఇంజినీరింగ్ వర్క్ కూడా తక్కువే. నాలుగు చక్రాల వాహనం కన్నా మూడు చక్రాల వాహనం చిన్నదిగా రూపొందుతుంది. అలాంటప్పుడు ఎటువంటి ఇరుకు ప్రాంతంలో ప్రయాణించడానికైనా, కొద్దిపాటి ప్రాంతంలో పార్క్ చేయడానికైనా అనువుగా ఉంటుంది. ఎప్పుడూ రద్దీగా ఉండే పట్టణాల్లో ఆటోలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.మూడు చక్రాల వాహనం వలన ఇంధన వినియోగం కూడా భారీగా అవదు. ఆటోను నడిపించేందుకు ఇంజనుకు తక్కువ శక్తి సరిపోతుంది. కాబట్టి ఆటోలను నడిపేవారు కూడా దీని నిర్వహణకు ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మొత్తం మీద ఈ కారణాల వల్లనే ఆటో మూడు చక్రాలను మాత్రమే కలిగి ఉంటుంది. -
ఓలా ఎలక్ట్రిక్ 'నష్ట' కష్టాలు..
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన(ఈ2డబ్ల్యూ) కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ (Ola Electric) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(Q3)లో నికర నష్టం భారీగా పెరిగి రూ. 564 కోట్లకు చేరింది. ఆదాయం నీరసించడం, తీవ్రతర పోటీ, సర్వీస్ సవాళ్లతో పెరిగిన వ్యయాలు ప్రభావం చూపాయి.గతేడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 376 కోట్ల నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం సైతం రూ. 1,296 కోట్ల నుంచి రూ. 1,045 కోట్లకు క్షీణించింది. మొత్తం వ్యయాలు రూ. 1,597 కోట్ల నుంచి రూ. 1,505 కోట్లకు తగ్గాయి. ఈ కాలంలో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 3.33 లక్షల యూనిట్ల ఈ2డబ్ల్యూ రిజిస్ట్రేషన్లు నమోదైనట్లు ఓలా వెల్లడించింది. గతేడాది క్యూ3తో పోలిస్తే ఇవి 37 శాతంపైగా అధికమని తెలియజేసింది. సర్వీసింగ్ సమస్యల పరిష్కారానికి రూ. 110 కోట్లు వెచ్చించినట్లు పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో ఓలా షేరు ఎన్ఎస్ఈలో 2.4 శాతం నీరసించి రూ. 70 వద్ద ముగిసింది.ఎంఅండ్ఎం లాభం స్పీడ్ఆటో రంగ దేశీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 20 శాతం జంప్చేసి రూ. 3,181 కోట్లకు చేరింది. గతేడాది ఇదే కాలంలో రూ. 2,658 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 17 శాతం ఎగసి రూ. 41,470 కోట్లను తాకింది. గత క్యూ3లో రూ. 35,299 కోట్ల టర్నోవర్ నమోదైంది.ఆటో విభాగంలో అమ్మకాలు 16 శాతం పుంజుకుని 2,45,000కు చేరగా.. యూవీ విక్రయాలు 1,42,000 యూనిట్లను తాకాయి. ఈ విభాగం ఆదాయం 21 శాతం జంప్చేసి రూ. 23,391 కోట్లకు చేరింది. నికర లాభం 20 శాతం బలపడి రూ. 1,438 కోట్లయ్యింది. వ్యవసాయ పరికరాల విభాగం నికర లాభం 11 శాతం పుంజుకుని రూ. 996 కోట్లను తాకింది. ఫలితాల నేపథ్యంలో ఎంఅండ్ఎం షేరు ఎన్ఎస్ఈలో 1.7 శాతం లాభంతో రూ. 3,193 వద్ద ముగిసింది. -
రూ.8.95 కోట్ల కొత్త రోల్స్ రాయిస్ కారు ఇదే.. చూశారా?
రోల్స్ రాయిస్ (Rolls Royce) కంపెనీ.. ఇప్పుడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఘోస్ట్ సిరీస్ II' (Ghost Series II)ను భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ కొత్త వెర్షన్ దాని మునుపటి మోడల్లో అందుబాటులో లేని కొత్త ఇంటీరియర్ ఫినిషింగ్లు, ఫీచర్లను పొందిందని సంస్థ వెల్లడించింది.రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్లో.. మూడు వెర్షన్స్ ఉన్నాయి. అవి ఘోస్ట్ సిరీస్ II, ఘోస్ట్ ఎక్స్టెండెడ్ సిరీస్ II, బ్లాక్ బ్యాడ్జ్ ఘోస్ట్ సిరీస్ II. వీటి ధరలు వరుసగా రూ. 8.95 కోట్లు, 10.19 కోట్లు,10.52 కోట్ల ఎక్స్-షోరూమ్ ధరలకు అందుబాటులో ఉన్నాయి. ఈ కారు కోసం చెన్నై, న్యూఢిల్లీ షోరూమ్లలో బుక్ చేసుకోవచ్చు.రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ II కారు 6.75 లీటర్, ట్విన్ టర్బోచార్జ్డ్ వీ12 ఇంజిన్ను పొందుతుంది, ఇది వరుసగా 600 హార్స్ పవర్, 900 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 8 స్పీడ్ గేర్బాక్స్ ద్వారా అత్యద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.ఘోస్ట్ సిరీస్ II మెరుగైన రైడ్ స్టెబిలిటీ కోసం ప్లానార్ సస్పెన్షన్ సిస్టమ్, రోడ్డు పరిస్థితికి అనుగుణంగా సస్పెన్షన్లను అడ్జెస్ట్ చేయడానికి కెమెరాల సహాయంతో ఫ్లాగ్ బేరర్ సిస్టమ్ వంటి టెక్నాలజీ అప్గ్రేడ్లను పొందుతుంది. ఇది మెరుగైన ఆడియో సిస్టమ్, ఇంటర్నెట్ కనెక్టివిటీ, వీడియో స్ట్రీమింగ్ ఫంక్షన్లను కూడా పొందుతుంది. -
రూ.10 వేలకంటే తక్కువే.. ఇదిగో బెస్ట్ స్మార్ట్ఫోన్స్
-
మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ, బీఈ6: బుకింగ్స్.. డెలివరీ వివరాలు
దేశీయ వాహన తయారీ సంస్థ 'మహీంద్రా & మహీంద్రా' (M&M) దేశీయ విఫణిలో లాంచ్ చేసిన ఎక్స్ఈవీ 9ఈ (XEV 9e), బీఈ 6 (BE 6) ఎలక్ట్రిక్ కార్ల కోసం బుకింగ్స్ స్వీకరించడానికి సన్నద్దమైంది. కంపెనీ ఫిబ్రవరి 14 నుంచి బుకింగ్స్ ప్రారంభించనుంది. డెలివరీకి సంబంధించిన వివరాలను కూడా సంస్థ వెల్లడించింది.ఫిబ్రవరి 14న మహీంద్రా కంపెనీ బుకింగ్లను స్వీకరిస్తే డెలివరీలు 2025 ఆగష్టు నాటికి పూర్తవుతాయి. సంస్థ అన్ని వేరియంట్లకు బుకింగ్స్ స్వీకరించనుంది.మహీంద్రా BE 6 ఐదు వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర రూ. 18.90 లక్షల నుంచి రూ. 26.90 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. మహీంద్రా XEV 9e నాలుగు వేరియంట్లలో ఉంటుంది. దీని ధర రూ. 21.90 లక్షల నుంచి రూ. 30.50 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.మహీంద్రా BE 6 ఎక్స్-షోరూమ్ ధరలుప్యాక్ వన్ (59 kWh): రూ. 18.90 లక్షలుప్యాక్ వన్ అబోవ్ (59 kWh): రూ. 20.50 లక్షలుప్యాక్ టూ (59 kWh): రూ. 21.90 లక్షలుప్యాక్ త్రీ సెలెక్ట్ (59 kWh): రూ. 24.50 లక్షలుప్యాక్ త్రీ (79 kWh): రూ. 26.90 లక్షలుమహీంద్రా XEV 9e ఎక్స్-షోరూమ్ ధరలుప్యాక్ వన్ (59 kWh): రూ. 21.90 లక్షలుప్యాక్ వన్ ఎబౌ (59 kWh): NAప్యాక్ టూ (59 kWh): రూ. 24.90 లక్షలుప్యాక్ త్రీ సెలెక్ట్ (59 kWh): రూ. 27.90 లక్షలుప్యాక్ త్రీ (79 kWh): రూ. 30.50 లక్షలు -
రూ. 458 కోట్ల 70ఏళ్ల నాటి బెంజ్ కారు ఇదే - ఫోటోలు
-
70 ఏళ్ల నాటి కారు: ధర రూ. 458 కోట్లు
1954 నాటి మెర్సిడెస్ బెంజ్ కారు (Mercedes-Benz W196 R Stromlinienwagen) ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కార్లలో ఒకటిగా.. సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఈ కారు ఫిబ్రవరి 1, 2025న జర్మనీలోని స్టుట్గార్ట్లోని మెర్సిడెస్ బెంజ్ మ్యూజియంలో ఆర్ఎమ్ సోథెబీ నిర్వహించిన వేలంలో 51 మిలియన్ యూరోలకు లేదా సుమారు 458 కోట్లకు అమ్ముడైంది. దీంతో ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫార్ములా 1 కారుగా నిలిచింది.బెంజ్ డబ్ల్యు196 ఆర్ అనేది ఫ్యాక్టరీ నిర్మిత స్ట్రీమ్లైన్డ్ బాడీవర్క్తో కలిగిన నాలుగు మోడల్లలో ఒకటి. అయితే ఈ కారును ఎవరు కొనుగోలు చేసారు అనేదానికి సంబంధించిన వివరాలు ప్రస్తుతానికి వెల్లడికాలేదు. అయితే ఈ కారు 1955 మెర్సిడెస్ 300 ఎస్ఎల్ఆర్ ఉహ్లెన్హాట్ కూపే తర్వాత ప్రపంచంలోనే రెండవ అత్యంత విలువైన కారు. ఇది (ఉహ్లెన్హాట్ కూపే) 2022లో సుమారు రూ. 1,266 కోట్లకు వేలం అమ్ముడైంది.సర్ స్టిర్లింగ్ మోస్ 1955 ఇటాలియన్ గ్రాన్ ప్రిక్స్లో W196 Rతో అత్యంత వేగవంతమైన ల్యాప్ను రికార్డ్ చేశాడు. ఇది డైరెక్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్తో 2.5-లీటర్ స్ట్రెయిట్ ఎయిట్ ఇంజన్ను కలిగి.. 290 హార్స్ పవర్ ఉత్పత్తి చేస్తుంది. దీనిని ఇండియానాపోలిస్ మోటార్ స్పీడ్వే మ్యూజియమ్కు 1965లో విరాళంగా ఇచ్చింది. అప్పటి నుంచి ఆ కారు బెంజ్ మ్యూజియంలోనే ఉంది. -
ఖండాంతరాలు దాటుతున్న మేడ్ ఇన్ ఇండియా కారు: ఇదే..
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'నిస్సాన్' (Nissan) బ్రాండ్ కారు 'మాగ్నైట్' (Magnite) సరికొత్త ఫేస్లిఫ్ట్ రూపంలో అక్టోబర్ 2024లో లాంచ్ అయింది. ఈ మోడల్ ఇప్పుడు ఖండాంతరాలు దాటడానికి సిద్ధమైంది. ఇండియాలో తయారైన అప్డేటెడ్ నిస్సాన్ మాగ్నైట్ త్వరలో లాటిన్ అమెరికా దేశాల్లో అమ్ముడవుతాయి.నిస్సాన్ ఇండియా జనవరి చివరిలో చెన్నై నుంచి దాదాపు 2,900 యూనిట్ల ఎల్హెచ్డి (లెఫ్ట్ హ్యండ్ డ్రైవ్) వేరియంట్ల మొదటి షిప్మెంట్ను ప్రారంభించింది. మరో 7,100 కార్లు త్వరలోనే ఎగుమతి అవుతాయని సమాచారం. మొత్తం మీద కంపెనీ భారత్ నుంచి 10,000 మాగ్నైట్ కార్లను ఎగుమతి చేయనుంది. ఈ కార్లు అర్జెంటీనా, బొలీవియా, బ్రెజిల్, సెంట్రల్ అమెరికా, చిలీ, కొలంబియా, మెక్సికో, పెరూ, ఉరుగ్వే వంటి దేశాలకు వెళతాయి.ఆటోమొబైల్ మార్కెట్ రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది. ఈ రంగంలో భారత్ కూడా దూసుకెళుతోంది. కాబట్టి చాలా దేశాల్లో మేడ్ ఇన్ ఇండియా కార్లను కోరుకుంటున్నారు. ఈ కారణంగా భారత్ ఎగుమతులకు కూడా కేంద్రం అయింది. ఇప్పటికే పలు కంపెనీలు దేశంలో తయారైన కార్లను విదేశాలకు తరలిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే.. రాబోయే రోజుల్లో ప్రపంచంలోని చాలా దేశాలు ఇండియన్ బ్రాండ్ కార్లను వినియోగించనున్నాయి.నిస్సాన్ కంపెనీ ఎగుమతి చేయడానికి సిద్ధం చేసిన మాగ్నైట్ కార్లు 'లైఫ్ హ్యాండ్ డ్రైవ్' ఆప్షన్ కలిగి ఉంటాయి. ఎందుకంటే.. ప్రపంచంలోని చాలా దేశాలలో ఉపయోగిస్తున్న కార్లు లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ ఆప్షన్ పొందాయి. కాబట్టి మన దేశంలో ఎగుమతికి సిద్ధం చేసిన కార్లను కూడా ప్రత్యేకంగా రూపొందించారు.నిస్సాన్ మాగ్నైట్ఇండియన్ మార్కెట్లో అక్టోబర్ 2024లో లాంచ్ అయిన నిస్సాన్ మాగ్నైట్ కారు ధరలు రూ. 5.99 లక్షల నుంచి రూ. 11.50 లక్షల మధ్య ఉన్నాయి. మల్టిపుల్ వేరియంట్లలో లభించే ఈ కారు 16 ఇంచెస్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఎల్ఈడీ హెడ్ల్యాంప్, బూమరాంగ్ ఆకారపు డీఆర్ఎల్ వంటి వాటితో పాటు అప్డేటెడ్ గ్రిల్ కూడా ఈ కారులో చూడవచ్చు. ఫీచర్స్ కూడా చాలా వరకు అప్డేట్ పొందాయి.ఫేస్లిఫ్టెడ్ మాగ్నైట్ 8 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ప్లే, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 4 కలర్ యాంబియంట్ లైటింగ్, 7 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే వంటి ఫీచర్స్ ఎన్నో ఉన్నాయి.ఇదీ చదవండి: తక్కువ ధరకే ఎలక్ట్రిక్ వెహికల్స్!మాగ్నైట్లో 1.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ (72 పీఎస్ పవర్, 96 ఎన్ఎమ్ టార్క్) లేదా 1.0 లీటర్ టర్బో పెట్రోల్ (100 పీఎస్ పవర్, 160 న్యూటన్ మీటర్ టార్క్) ఇంజన్స్ ఉన్నాయి. ఇవి రెండూ 5 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ ఆప్షన్స్ పొందుతాయి. కాబట్టి మంచి పనితీరును అందిస్తుంది.ఫేస్లిఫ్టెడ్ నిస్సాన్ మాగ్నైట్ కారులో 6 ఎయిర్బ్యాగ్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఆటో డిమ్మింగ్ IRVM, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, 360 డిగ్రీ కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. -
అలాంటి కార్లు టోల్ గేట్ దాటితే భారీ జరిమానా
ఇన్సూరెన్స్ లేని వాహనాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. చాలామంది, వెహికల్ ఇన్సూరెన్స్ (Vehicle Insurance) తీసుకోకుండా కార్లను వినియోగిస్తుంటారు. అలాంటి వారివల్ల ప్రమాదాలు జరిగితే.. ఆ ప్రభావం ఇతరుల మీద కూడా పడుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఒడిశా స్టేట్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఓ కొత్త రూల్ తీసుకు వచ్చింది. ఇది తప్పకుండా వాహనదారులు తమ కార్లకు ఇన్సూరెన్స్ తీసుకునేలా చేస్తుందని సమాచారం.వెహికల్ ఇన్సూరెన్స్ లేని, ఏ వాహనమైన టోల్ గేట్ దాటితే.. అలాంటి వాహనదారులకు ఈ చలాన్ జారీ చేయనున్నట్లు ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నియమం 2025 ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి వచ్చింది. తప్పకుండా ఈ విషయాన్ని వాహన వినియోగదారులు గుర్తుంచుకోవాలి.కారు ఇన్సూరెన్స్ లేకుంటే..టోల్ గేట్లపై అమర్చిన ఈ-డిటెక్షన్ సిస్టమ్ల ద్వారా.. ఇన్సూరెన్స్ లేని వాహనాలను గుర్తిస్తారు. అలాంటి వాహనాలకు ఆటోమాటిక్ చలాన్ జారీ చేస్తారు. ఇన్సూరెన్స్ లేకుండా మొదటిసారి టోల్ గేట్ దాటితే వారికు రూ. 2,000 జరిమానా విధిస్తారు. ఇదే రెండోసారి పునరావృతమైతే.. వారు రూ. 4,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. జరిమానా కాకుండా.. మూడు నెలలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో చలానా, జైలు శిక్ష రెండూ పడొచ్చు. కాబట్టి 1988లోని సెక్షన్ 146 ప్రకారం.. పబ్లిక్ రోడ్లపై నడిచే ప్రతి మోటారు వాహనం తప్పనిసరిగా ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి.ఆటోమేటిక్ ఈ-డిటెక్షన్ సిస్టమ్ప్రైవేట్, వాణిజ్య వాహనాలు చెల్లుబాటు అయ్యే బీమా లేకుండా రోడ్లపై నడుపుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీనిని పరిగణలోకి తీసుకుని ఒడిశా (Odisha) స్టేట్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ కొత్త రూల్ కింద ఆటోమేటిక్ ఈ-డిటెక్షన్ సిస్టమ్ తీసుకొచ్చింది.నిజానికి ఆటోమేటిక్ ఈ-డిటెక్షన్ సిస్టమ్ అనేది కొత్తేమీ కాదు. కొన్ని నెలల క్రితం, బీహార్ ప్రభుత్వం పొల్యూషన్ సర్టిఫికెట్లు లేని వాహనాలను గుర్తించేందుకు.. రాష్ట్రంలోని 32 టోల్ ప్లాజాలలో ఈ-డిటెక్షన్ సిస్టమ్ను ప్రారంభించింది. పీయూసీ లేకుండా పట్టుబడితే.. వాహనానికి రూ. 10వేలు జరిమానా విధిస్తారు. ఈ సిస్టం ట్రయల్స్ ప్రారంభించిన కేవలం రెండు రోజుల్లోనే 5,000కు పైగా ఈ చలాన్లు జారీ చేశారు. కాబట్టి ఇదే సిస్టం త్వరలో.. పాట్నా, ముజఫర్పూర్, భాగల్పూర్, ఇతర స్మార్ట్ సిటీలలో కూడా ప్రారంభించనున్నట్లు బీహార్ ప్రభుత్వం వెల్లడించింది.త్వరలో ఇతర రాష్ట్రాలకు..ప్రస్తుతం ఈ డిటెక్షన్ సిస్టం కేవలం ఒడిశా, బీహార్ రాష్ట్రాల్లో మాత్రమే అమలులో ఉంది. ఈ విధానం త్వరలోనే దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సిస్టం ప్రారంభమైతే.. జరిమానాలు లేదా జైలు శిక్షకు భయపడి వాహనదారులు తప్పకుండా నియమానాలకు అనుగుణంగా నడుచుకునే అవకాశం ఉందని భావిస్తున్నాము.టోల్ కలెక్షన్ కోసం శాటిలైట్ విధానంమారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ మారుతోంది. ఈ టెక్నాలజీని ఉపయోగించి హైవేల మీద టోల్ గేట్స్ లేకుండా చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. టోల్ గేట్స్ మొత్తం తొలగించి.. శాటిలైట్ విధానం ద్వారా టోల్ ఫీజు వసూలు చేయనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే వాహనదారులు హైవే మీద ఎక్కడా ఆగాల్సిన పనిలేదు.ఇదీ చదవండి: కొత్త కారు కొంటున్నారా?: ఇలా చేస్తే.. ట్యాక్స్లో 50 శాతం తగ్గింపుగ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS) ద్వారా టోల్ కలెక్షన్ చాలా సులభం. ఈ విధానాన్ని కర్ణాటకలోని బెంగళూరు-మైసూర్ నేషనల్ హైవే275 & హర్యానాలోని పానిపట్-హిసార్ నేషనల్ హైవే709 మధ్యలో శాటిలైట్ విధానం ద్వారా టోల్ వసూలు చేయడానికి సంబంధించిన ట్రైల్ కూడా విజయవంతంగా పూర్తయిందని గడ్కరీ గతంలోనే పేర్కొన్నారు. -
కొత్త ఏడాది.. మంచి బోణీ మారుతీ సుజుకీదే..
మారుతీ సుజుకీ (Maruti Suzuki) కొత్త ఏడాది జనవరిలో మొత్తం 2,12,251 వాహనాలు విక్రయించింది. గడిచిన ఏడాది ఇదే జనవరి అమ్మకాలు 1,99,364 యూనిట్లతో పోలిస్తే ఇవి 6% అధికం. ఇందులో దేశీయ ప్రయాణికుల వాహన అమ్మకాలు క్రితం ఏడాదితో పోలిస్తే 1,66,802 యూనిట్ల నుంచి 1,73,599 యూనిట్లకు చేరాయి.విదేశాలకు ఎగుమతులు 23,921 యూనిట్లకు 27,100 యూనిట్లకు ఎగిశాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా వాహన విక్రయాలు 3% తగ్గి 57,115 వాహనాలకు చేరాయి. ఇందులో దేశీయంగా 54,003 వాహన అమ్మకాలు జరగ్గా.., విదేశాలకు ఎగుమతులు 11,600 యూనిట్లుగా ఉన్నాయి. కాగా 2024 జనవరిలో 67,615 యూనిట్ల విక్రయాలు అమ్ముడయ్యాయి.టాటా మోటార్స్ అమ్మకాలు 86,125 యూనిట్ల నుంచి 80,304 యూనిట్లకు పరిమితమయ్యాయి. టయోటా కిర్లోస్కర్ మోటార్ అమ్మకాలు 24,609 నుంచి 19% పెరిగి 29,371కు చేరాయి. మహీంద్రాఅండ్మహీంద్రా విక్రయాలు 16% పెరిగి 85,432 యూనిట్లకు చేరాయి. -
తక్కువ ధరకే ఎలక్ట్రిక్ వెహికల్స్!
యూనియన్ బడ్జెట్ 2025-26 లిథియం బ్యాటరీలు.. సంబంధిత రంగాల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి గణనీయమైన పన్ను మినహాయింపులను ప్రకటించింది. స్థానిక తయారీని మెరుగుపరచడం మాత్రమే కాకుండా.. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం పన్నులు తగ్గించింది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్ ధరలు తగ్గుముఖం పడతాయి.కోబాల్ట్, లిథియం అయాన్ బ్యాటరీ స్క్రాప్, సీసం, జింక్, 12 ఇతర కీలకమైన ఖనిజాల వంటి అవసరమైన పదార్థాలపై కూడా కేంద్రం ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని (BCD) తొలగించింది. బ్యాటరీలు, సెమీకండక్టర్లు, పునరుత్పాదక శక్తి పరికరాల తయారీకి ఈ పదార్థాలు చాలా ముఖ్యమైనవి. కాబట్టి ఎలక్ట్రిక్ వాహనాలకు, క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ తయారీలో ఈ పదార్థాలపై ఆధారపడే పరిశ్రమలకు ఖర్చులను తగ్గిస్తుంది.ఈవీ బ్యాటరీ ఉత్పత్తిలో ఉపయోగించే 35 అదనపు వస్తువులు, మొబైల్ ఫోన్ బ్యాటరీ తయారీకి 28 వస్తువులపై ట్యాక్స్ తగ్గించడం వల్ల.. కంపెనీలు అదనపు పన్నులు లేకుండా బ్యాటరీ ఉత్పత్తికి అవసరమైన యంత్రాలను, సాధనాలను దిగుమతి చేసుకోవచ్చు. టాటా, ఓలా ఎలక్ట్రిక్, రిలయన్స్ వంటి కంపెనీలను భారతదేశంలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రోత్సహించడం లక్ష్యంగా దీనిని ప్రవేశపెట్టడం జరిగింది.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్కేంద్రప్రభుత్వ చర్య వల్ల.. ఈవీ బ్యాటరీలు కొంత తక్కువ ధరకే లభిస్తాయి. ఇది ఉత్పత్తి ఖర్చులను తగ్గించి.. దేశీయ తయారీని పెంచుతుంది. ఇది చైనా, ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. ఇవన్నీ క్లీన్ ఎనర్జీ వృద్ధికి.. భారతదేశ పునరుత్పాదక ఇంధన లక్ష్యాలకు సహాయపడుతుంది. -
ఓలా కొత్త స్కూటర్లు.. 320 కి.మీ.రేంజ్!
ప్రముఖ విద్యుత్ ద్విచక్రవాహన సంస్థ ఓలా (Ola) తమ మూడో తరం ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణిని భారత్ మార్కెట్లో తాజాగా విడుదల చేసింది. వీటిలో ఎంట్రీ-లెవల్ మోడల్ ధర రూ.79,999 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమై అగ్రశ్రేణి వేరియంట్ ధర రూ.1,69,999 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఈ శ్రేణిలో ఎస్1 ప్రో (S1 Pro), ఎస్1 ప్రో+ (S1 Pro+), ఎస్1 ఎక్స్ (S1 X), ఎస్1 ఎక్స్+ (S1 X+) ఉన్నాయి.పేటెంట్ పొందిన 'బ్రేక్ బై వైర్' సాంకేతికతను ఓలా Gen 3 లైనప్కు జోడించింది. ఈ సిస్టమ్ బ్రేక్ ప్యాడ్, మోటర్ నిరోధకతను సమతుల్యం చేయడానికి బ్రేక్ లివర్పై సెన్సార్లను ఉపయోగిస్తుంది. ఇది రేంజ్ను 15% పెంచడమే కాకుండా బ్రేక్ ప్యాడ్ మన్నికను రెట్టింపు చేస్తుంది. ఇక మెరుగైన భద్రత కోసం ప్రతి స్కూటర్లోనూ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) అమర్చారు.బ్యాటరీ ఆప్షన్స్.. రేంజ్ఓలా మూడో తరం స్కాటర్లలో వివిధ బ్యాటరీ ఎంపికలు ఉన్నాయి. ఎస్1 ప్రో మోడల్ 3kWh, 4kWh బ్యాటరీలను కలిగి ఉంటుంది. ప్రో+ వేరియంట్ 4kWh, 5.3kWh బ్యాటరీ ప్యాక్లను అందిస్తుంది. ఇక ఎంట్రీ-లెవల్ ఎస్1 ఎక్స్ 2kWh, 3kWh, 4kWh బ్యాటరీ ఎంపికలతో అందుబాటులో ఉంది. అయితే ఎస్1 ఎక్స్+ మాత్రం ప్రత్యేకంగా 4kWh బ్యాటరీతో వస్తుంది. ఫ్లాగ్షిప్ ఎస్1 ప్రో+ మోడల్ 320 కిమీ రేంజ్ని, 141 కి.మీ.గరిష్ట వేగాన్ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.ధరలుమోడల్బ్యాటరీ కెపాసిటీధరఓలా ఎస్1 ఎక్స్2 kWh రూ.79,999ఓలా ఎస్1 ఎక్స్ 3 kWh రూ.89,999ఓలా ఎస్1 ఎక్స్ 4 kWh రూ.99,999ఓలా ఎస్1 ఎక్స్+ 4 kWh రూ.1,07,999ఓలా ఎస్1 ప్రో 3 kWh రూ.1,14,999ఓలా ఎస్1 ప్రో 4 kWh రూ.1,34,999ఓలా ఎస్1 ప్రో+ 4 kWh రూ.1,54,999ఓలా ఎస్1 ప్రో+ 5.3 kWh రూ.1,69,999 -
జపాన్కు మేడ్ ఇన్ ఇండియా కారు
భారతదేశంలో తయారవుతున్న వాహనాలకు.. విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే పలు వాహనాలు మన దేశం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా 'మారుతి సుజుకి' (Maruti Suzuki) కంపెనీకి చెందిన 'జిమ్నీ' (Jimny) జపాన్కు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. ఈ కారుకు జపాన్లో కూడా అభిమానులు ఉన్నట్లు తెలుస్తోంది.2023లో జరిగిన ఆటో ఎక్స్పోలో కనిపించిన మారుతి జిమ్నీ.. ప్రస్తుతం 5 డోర్ వెర్షన్ రూపంలో కూడా అమ్మకానికి ఉంది. ఇదే ఇప్పుడు జపాన్లో విక్రయానికి సిద్ధమైంది. అంతే కాకుండా 2024-25 ఆర్థిక సంవత్సరంలో మారుతి సుజుకి అత్యధికంగా ఎగుమతి చేసిన వాహనాల్లో ఇది రెండో మోడల్ అని తెలుస్తోంది.జిమ్నీ 5 డోర్ కారు హర్యానాలోని గురుగ్రామ్లో.. మారుతి సుజుకి తయారీ కేంద్రంలో ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇది గ్లోబల్ ఆఫ్ రోడర్గా ప్రసిద్ధి చెందింది. ఇప్పటికే ఈ కారును కంపెనీ దాదాపు 100 దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఇప్పుడు జపాన్కు కూడా తరలించింది. మొత్తం మీద కంపెనీ ఇప్పటి వరకు 3.5 లక్షల కంటే ఎక్కువ జిమ్నీ కార్లు గ్లోబల్ మార్కెట్లో అమ్ముడయ్యాయి.జిమ్నీ 5 డోర్ మోడల్ జపాన్లో ప్రారంభమైన సందర్భంగా మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ హిసాషి టకేయుచి (Hisashi Takeuchi) మాట్లాడుతూ.. జపాన్లో 'మేడ్ ఇన్ ఇండియా' జిమ్నీ 5-డోర్ను ప్రవేశపెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఆగష్టు 2004లో కంపెనీ అత్యధికంగా ఎగుమతిచేసిన కార్లలో 'ఫ్రాంక్స్' తరువాత.. జిమ్నీ ఉంది. మెక్సికో, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి మార్కెట్లలో అమ్మకాల పరంగా ఇది గొప్ప విజయం సాధించిందని అన్నారు.జిమ్నీ 5 డోర్రూ. 12.47 లక్షల ప్రారంభ ధర వద్ద మార్కెట్లో లాంచ్ అయిన మారుతి జిమ్నీ.. ప్రత్యేకంగా ఆఫ్ రోడింగ్ విభాగంలో ఓ పాపులర్ మోడల్. కొత్త డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన జిమ్నీ 5 డోర్ మోడల్ 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 105 హార్స్ పవర్, 134 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 4 స్పీడ్ టార్క్ కన్వర్టర్ వంటివి పొందుతుంది. -
ఎలక్ట్రిక్ కార్గో విభాగంలోకి టీవీఎస్!
కోల్కతా: వాహన తయారీ దిగ్గజం 'టీవీఎస్ మోటార్' (TVS Motor) కంపెనీ ఎలక్ట్రిక్ కార్గో విభాగంలోకి ప్రవేశించాలని నిర్ణయించింది. కంపెనీ తాజాగా ఎలక్ట్రిక్ త్రీవీలర్ను కోల్కతా, యూపీ, బీహార్, జమ్ము, కాశ్మీర్తోపాటు ఢిల్లీలో విడుదల చేసింది.డిసెంబర్ నాటికి ఎలక్ట్రిక్ కార్గో రోడ్డెక్కనుందని టీవీఎస్ మోటార్ కమర్షియల్ మొబిలిటీ బిజినెస్ హెడ్ 'రజత్ గుప్తా' వెల్లడించారు. ప్రస్తుతం ప్రత్యామ్నాయ ఇంధన (సీఎన్జీ, ఎల్పీజీ, ఎలక్ట్రిక్) విభాగంలో కంపెనీ వాటా 10 శాతం ఉందని అన్నారు. తమిళనాడులోని హోసూర్ ప్లాంట్కు నెలకు 5,000 యూనిట్ల త్రిచక్ర వాహనాలను తయారు చేసే సామర్థ్యం ఉందని తెలిపారు. ఈ కేంద్రాన్ని మరింత విస్తరించవచ్చని వివరించారు. కొరియా నుంచి బ్యాటరీ సెల్స్ను దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. వీటిని భారతీయ భాగస్వామి తయారు చేస్తోందని తెలిపారు. -
కొత్త కారు కొంటున్నారా?: ఇలా చేస్తే.. ట్యాక్స్లో 50 శాతం తగ్గింపు
వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించాలంటే.. కాలుష్య కారకాలను తగ్గించాలి. దీనిని దృష్టిలో ఉంచుకుని రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ఓ కీలక ప్రకటన చేసింది. పాత వాహనాలను స్క్రాప్ చేసి, కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తే ట్యాక్స్లో గరిష్టంగా 50 శాతం తగ్గింపు లభించనున్నట్లు వెల్లడించింది.ప్రస్తుతం పాత వాహనాలను రద్దు (స్క్రాపేజ్) చేసి కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తే.. వాహన పన్నులో 25 శాతం తగ్గింపు, వాణిజ్య వాహనాల విషయంలో 15 శాతం తగ్గింపు ఉంది. కానీ దీనిని 50 శాతానికి పెంచుతూ.. జనవరి 24న విడుదల చేసిన ముసాయిదా నోటిఫికేషన్లో మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.బిఎస్ 4 వాహనాల విక్రయాలు ఎప్పుడో ఆగిపోయాయి. ప్రస్తుతం బిఎస్ 6 వాహనాలు అందుబాటులో ఉన్నాయి. అయితే 2000లో వాహనాలకు బిఎస్ 1 ఉద్గార ప్రమాణాలు తప్పనిసరి. ఆ తరువాత బిఎస్ 2 ప్రమాణాలు 2002లో అమలులోకి వచ్చాయి.దేశంలో పాత వాహనాల సంఖ్య ఎక్కువ కావడం వల్ల కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని రవాణా మంత్రిత్వ శాఖ వాలంటరీ వెహికల్ మోడరనైజేషన్ ప్రోగ్రామ్ లేదా వెహికల్ స్క్రాపింగ్ పాలసీని ప్రారంభించింది. అంతే కాకుండా వెహికల్స్ స్క్రాపేజ్ కోసం వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీలను, ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లకు అనుమతిచ్చింది.ఇదీ చదవండి: అదే జరిగితే.. బంగారం రేటు మరింత పైకి!ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో స్కాపేజ్ స్టేషన్స్ ఉన్నాయి. వీటి ద్వారా మీ వాహనాన్ని స్కాపేజ్ చేసి, సర్టిఫికెట్ తీసుకుంటే.. కొత్త కారు కొనుగోలుపై పలు రాయితీలను పొందవచ్చు. ఇది కొత్త కారు కొనుగోలు చేయడానికి కొంత ఆర్థికంగా కూడా ఉపయోగపడుతుంది. -
80వేల కియా కార్లకు రీకాల్: కారణం ఇదే..
ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా మోటార్స్.. యూఎస్ఏలో ఏకంగా 80,000 కంటే ఎక్కువ వాహనాలకు రీకాల్ ప్రకటించింది. ముందు ప్రయాణీకుల సీటు కింద వైరింగ్ దెబ్బతినడం వల్ల.. ఎయిర్బ్యాగ్లు, సీట్ బెల్ట్లు సరిగ్గా పనిచేయకపోవచ్చు. ఈ కారణంగానే కియా అమెరికా రీకాల్ ప్రకటించింది.సీటు కింద వైరింగ్ దెబ్బతినడం వల్ల అనుకోకుండా ఎయిర్బ్యాగ్లు ఓపెన్ అయ్యే అవకాశం ఉందని.. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్కి దాఖలు చేసిన పత్రాలలో కియా అమెరికా స్పష్టం చేసింది. కంపెనీ రీకాల్ ప్రకటించిన కార్ల జాబితాలో 2023 నుంచి 2025 మధ్య తయారైన నీరో ఈవీ, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్లు ఉన్నట్లు తెలుస్తోంది.కంపెనీ మొత్తం 80,225 కార్లకు రీకాల్ ప్రకటించింది. కార్లలోని సమస్యను గుర్తించి.. వాటిని ఉచితంగానే పరిష్కరించనున్నట్లు కియా అమెరికా వెల్లడించింది. అంతే కాకుండా వైరింగ్ కవర్లను కూడా ఉచితంగానే భర్తీ చేయనున్నట్లు సంస్థ పేర్కొంది. కాగా కార్ల యజమానులకు మార్చిలో ఈ మెయిల్ ద్వారా తెలియజేయనుంది.ఈ రీకాల్ అనేది అమెరికాలోని కియా కార్లకు మాత్రమే పరిమితం. కాబట్టి ఈ రీకాల్ ప్రభావం భారతదేశంలోని కియా కార్లపై ఎటువంటి ప్రభావం చూపదు. కాబట్టి దేశంలోకి కియా కార్ల యజమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.ఇదీ చదవండి: ఇల్లుగా మారిన ఇన్నోవా.. ఇదో డబుల్ డెక్కర్!: వైరల్ వీడియో -
Automobile: భారత్లో ఆటోమొబైల్స్ పరుగులు
ఒకరికి బతుకు బండి.. మరొకరికి హోదా.. ఇంకొందరికి వ్యాపారం.. మరి కొద్దిమందికి విహారం.. టూవీలర్, ఆటో, కారు, ట్రాక్టర్, వ్యాన్ , ట్రక్, బస్.. పేరు ఏదైనా, వాడకం ఏదైనా బండి చక్రాలు పరుగెడుతూనే ఉండాలి. ఆ పరుగే అన్నం పెడుతోంది. ఆ పరుగే వృద్ధి ‘ఇంజన్ ’ అవతారంలో భారత ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమై దూసుకెళుతోంది. ఆటోమొబైల్ రంగంలో అత్యంత కీలకమైన మార్కెట్గా రూ.22 లక్షల కోట్లతో మూడవ స్థానంలో నిలిచి ప్రపంచ దిగ్గజ సంస్థలను భారత్ ఊరిస్తోంది. ఇంతటి ప్రాముఖ్యత గల భారతావనిలో ఎన్ని బండ్లు రోడ్డెక్కుతున్నాయో తెలుసా? నిమిషానికి 49.53 యూనిట్లు. 2024లో 2,61,07,679 యూనిట్ల వాహనాలు వినియోగదారుల చేతుల్లోకి వెళ్లాయి. 2023లో ఈ సంఖ్య 2,39,28,293 యూనిట్లు. గత ఏడాది కొత్త వాహనాల రాక 9.11 శాతం పెరిగిందని ‘వాహన్ ’ గణాంకాలు చెబుతున్నాయి. పెరుగుతున్న అవసరాలు..ఉద్యోగం, వ్యాపారం, షాపింగ్, ప్రయాణాలు, విహార యాత్రలు, డెలివరీ సేవలు.. అవసరం ఏదైనా చేతిలో బండి ఉండాల్సిందే! గడియారంలోని సెకన్ల ముల్లుతో పోటీపడుతూ పరుగు తీయాలంటే బండి రోడ్డెక్కాల్సిందే! అంతలా దైనందిన జీవితంలో వాహనం భాగమైపోయింది. అందుకే వాహనాల అమ్మకాలు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. ఇక 2030 నాటికి మెగా సిటీల సంఖ్య 87కు చేరనుందని ప్రభుత్వం చెబుతోంది. అంటే ఒక్కో మెగా సిటీలో జనాభా 10 లక్షల పైచిలుకు ఉంటుందన్నమాట! ఇంతమందికి సేవలు అందించడానికి ప్రజా రవాణా వ్యవస్థ సరిపోదు. వ్యక్తిగత వాహనాలపై ఆధారపడాల్సిందే! అలాగే ఆరేళ్లలో వర్కింగ్ ఏజ్ గ్రూప్లో 100 కోట్ల మంది చేరతారని అంచనా. అంటే ఆ సమయానికి మొత్తం జనాభాలో వీరి వాటా 60 శాతం ఉంటుంది. ఈ అంశం కూడా వాహన వినియోగం పెరిగేందుకు దోహదం చేయనుంది. మారుతున్న ధోరణులుభారత మార్కెట్లో ధర అత్యంత సున్నిత అంశం. డబ్బుకు తగ్గ విలువ చూసే కస్టమర్లే అధికం. మైలేజీ ఒక్కటే సరిపోదు. డిజైన్ సైతం ఆకట్టుకోవాలి. అటు భద్రతకు పెద్దపీట వేయాలి. ఎక్కువ ఫీచర్లు ఉండాలి. మారుతున్న వినియోగదార్ల అభిరుచులకు తగ్గట్టుగా మోడళ్లకు రూపకల్పన చేసేందుకు వందల కోట్ల పెట్టుబడులతో ఏళ్ల తరబడి కంపెనీలు కసరత్తు చేస్తుంటాయి. సరికొత్త మోడళ్లే కాదు సక్సెస్ అయిన మోడల్స్లో ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్లను, అప్గ్రేడ్స్ను ప్రవేశపెట్టాల్సిందే. హైబ్రిడ్స్, ఈవీలు క్రమంగా పుంజుకుంటున్నాయి. కొత్త ట్రెండ్ ఏమంటే ప్యాసింజర్ కార్ల మార్కెట్లో ప్రస్తుతం ఎస్యూవీ, యూవీల హవా నడుస్తోంది. మొత్తం పీవీల విక్రయాల్లో వీటి వాటా 60 శాతం దాటిందంటే మారుతున్న ధోరణులకు అద్దం పడుతోంది. కార్ల అమ్మకాల్లో 2,02,031 యూనిట్లతో టాప్ సెల్లింగ్ మోడల్గా కాంపాక్ట్ ఎస్యూవీ టాటా పంచ్ నిలిచింది. మరోవైపు చిన్న కారు చిన్నబోతోంది. 3.6 మీటర్ల లోపు ఉండే ఎంట్రీ లెవెల్ చిన్న కార్ల వాటా 2 శాతం కంటే తక్కువగా ఉంది. అమ్ముడవుతున్న రెండు త్రిచక్ర వాహనాల్లో ఒకటి ఈ–త్రీవీలర్ ఉంటోంది. ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ఐసీఈ) విభాగాన్ని ఏలుతున్న దిగ్గజ కంపెనీలే ఈవీ సెగ్మెంట్నూ గుప్పిట్లోకి తెచ్చుకుంటున్నాయి. 350 సీసీ, అంత కంటే అధిక సామర్థ్యంగల ఇంజన్ ్స విభాగంలో రాయల్ ఎన్ ఫీల్డ్ దూసుకెళుతోంది. ఈ కంపెనీ గత ఏడాది 4.26 శాతం వృద్ధితో 8,57,378 యూనిట్లను విక్రయించి రాయల్గా నిలిచింది. కొత్త వ్యాపారాల రాకతో..వ్యక్తిగత అవసరాలకే కాదు.. కొత్త వ్యాపారాల రాక కూడా వాహనాల అమ్మకాలకు ఆజ్యం పోస్తోంది. ఊబర్, ఓలా, రాపిడో వంటి అగ్రిగేటర్లు, అమెజాన్ , ఫ్లిప్కార్ట్ తదితర ఈ–కామర్స్ సంస్థలు, స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్స్, బిగ్బాస్కెట్, జెప్టో, బ్లింకిట్, డంజో తదితర క్విక్ కామర్స్ కంపెనీలు.. ఇలా ఒకటేమిటి. ఉత్పత్తుల తయారీ, డెలివరీ సేవల కంపెనీలు వాహన వినియోగం పెరిగేందుకు దోహదం చేస్తున్నాయి. అటు సులభ వాయిదాల్లో వాహనం కొనుగోలుకు రుణ లభ్యత పెరిగింది. ఇంకేముంది వాయిదాలు చెల్లించగలిగే స్తోమత ఉంటే చాలు, స్థాయికి మించిన విలువైన వాహనం కొనేందుకూ కస్టమర్లు వెనుకంజ వేయడం లేదు. లగ్జరీ.. తగ్గేదేలే!దేశంలో లగ్జరీ కార్ల దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. రూ.50 లక్షలకుపైగా ఖరీదు చేసే లగ్జరీ కార్లు 2024లో గంటకు దాదాపు ఆరు (5.83 యూనిట్లు) అమ్ముడయ్యాయి. అయిదేళ్ల క్రితం గంటకు రెండు లగ్జరీ కార్లే రోడ్డెక్కాయంటే ప్రస్తుత భారత మార్కెట్ తీరుతెన్నులను అర్థం చేసుకోవచ్చు. 2024లో మొత్తం 51,200 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. 50 వేల మార్కును చేరుకోవడం ఇదే తొలిసారి. ఈ ఏడాది రెండు డజన్లకుపైగా నూతన మోడళ్లు కొలువుదీరనున్నాయి. ఊరిస్తున్న కొత్త మోడళ్లు, సంపన్నులు పెరుగుతుండడంతో 2025లో ఈ సెగ్మెంట్లో 54,000లకుపైగా యూనిట్లు అమ్ముడవుతాయని పరిశ్రమ ధీమాగా ఉంది. 2030 నాటికి లగ్జరీ కార్ల అమ్మకాలు ఏటా 1,00,000 దాటుతుందని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. మొత్తం ప్యాసింజర్ వాహన పరిశ్రమలో లగ్జరీ వాటా 1 శాతంపైగా ఉంది. 2020లో 20,500 యూనిట్ల లగ్జరీ కార్లు అమ్ముడయ్యాయి. మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్లు్య, ఆడి, వోల్వో, మినీ, జేఎల్ఆర్, లెక్సస్ టాప్ బ్రాండ్స్గా ఉన్నాయి. సూపర్ ప్రీమియం లంబోర్గీని, పోర్ష్ కార్లకూ డిమాండ్ ఉంది. నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ 2024 ప్రకారం దేశంలో అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్ సంఖ్య 2028 నాటికి 19,908కి చేరనుంది. 2023లో ఈ సంఖ్య 13,263 ఉంది. ప్రపంచవ్యాప్తంగా అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్ సంఖ్యలో భారత్ భారీ పెరుగుదలను నమోదు చేస్తుందని నివేదిక అంచనా వేసింది. ఈవీతో పోటీగా సీఎన్ జీ.. ఆశ్చర్యకర విషయం ఏమంటే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్ జీ) ఆధారిత వాహనాల డిమాండ్ ఊహకు అందడం లేదు. ఈ విభాగంలో గత ఏడాది 7,15,213 కార్లు అమ్ముడయ్యాయి. 2023తో పోలిస్తే వృద్ధి ఏకంగా 35 శాతం నమోదు కావడం విశేషం. మారుతీ సుజుకీ ఇండియా అత్యధికంగా 2024లో ఈ విభాగంలో 5,12,155 యూనిట్లతో 71.60 శాతం వాటా దక్కించుకుంది. సీఎన్జీ వాటా ప్యాసింజర్ వెహికిల్స్లో 18 శాతం, త్రీవీలర్స్ అమ్మకాల్లో 28 శాతం ఉంది. బజాజ్ ఆటో ఒక అడుగు ముందుకేసి దేశంలో తొలిసారిగా సీఎన్ జీ బైక్ ‘ఫ్రీడమ్’ను పరిచయం చేసింది. దేశవ్యాప్తంగా 5,500లకు పైగా సీఎన్ జీ ఫిల్లింగ్ స్టేషన్ ్స ఉన్నాయి. 2026 నాటికి ఈ సంఖ్య 8,000 దాటనుంది. సంప్రదాయ పెట్రోల్, డీజిల్తో పోలిస్తే సీఎన్ జీ వ్యయం తక్కువ కావడంతో కస్టమర్లు వీటికి మళ్లుతున్నారు. వాహన విడిభాగాలు ఇలా..2023–24లో వాహన విడిభాగాల పరిశ్రమ 9.8 శాతం వృద్ధితో 74.1 బిలియన్ డాలర్ల వ్యాపారం నమోదు చేసింది. 2017–18లో ఇది 51 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక ప్రపంచంలో తయారవుతున్న వాహన విడిభాగాల్లో భారత్ వాటా 3.5 శాతం. భారత జీడీపీలో ఈ రంగం వాటా 3.5 శాతం. తయారీ జీడీపీలో ఈ విభాగం 25 శాతం సమకూర్చింది. 50 లక్షల మందికిపైగా ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారు. విడిభాగాల ఎగుమతులతో అయిదేళ్లలో 88 బిలియన్ డాలర్ల విదేశీ మారకం సమకూరింది. ఆటోమోటివ్ కాంపొనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏసీఎంఏ) ప్రకారం భారత వాహన విడిభాగాల పరిశ్రమ 2030 నాటికి 200 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఎగుమతులు 21 బిలియన్ డాలర్ల నుంచి 100 బిలియన్ డాలర్లకు పెరుగుతాయని ఏసీఎంఏ ధీమాగా ఉంది. ఐదేళ్లలో తొలి స్థానం..!భారత ఆటోమోటివ్ పరిశ్రమ విలువ రూ.22 లక్షల కోట్లు. దేశ జీడీపీకి ఈ రంగం 7 శాతం సమకూరుస్తోంది. మొత్తం వసూలు అవుతున్న జీఎస్టీలో 14–15 శాతం ఆటోమొబైల్ రంగం అందిస్తోందంటే ఆశ్చర్యం వేయకమానదు. వచ్చే ఐదేళ్లలో భారత ఆటోమొబైల్ పరిశ్రమ ప్రపంచంలో తొలి స్థానానికి చేరుతుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ధీమా వ్యక్తం చేశారు. తాను అధికారం చేపట్టిన నాటి నుంచి భారతీయ వాహన పరిశ్రమ రూ.7 లక్షల కోట్ల నుంచి రూ.22 లక్షల కోట్లకు దూసుకెళ్లిందని చెప్పారు. ‘రూ.78 లక్షల కోట్లతో తొలి స్థానంలో యూఎస్ఏ, రూ.47 లక్షల కోట్లతో రెండవ అతిపెద్ద ఆటోమొబైల్ పరిశ్రమగా చైనా నిలిచింది. ఐదేళ్లలో భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నంబర్–1గా మార్చాలనుకుంటున్నాం. ప్రఖ్యాత అంతర్జాతీయ ఆటోమొబైల్ బ్రాండ్స్ భారత్లో ఉండడం దేశ సామర్థ్యాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది’ అని మంత్రి వివరించారు. ప్రభుత్వం ఏం చేస్తోందంటే..సంప్రదాయ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ఐసీఈ) నుంచి ఈవీ, ఫ్లెక్స్ ఫ్యూయల్ వంటి నూతన సాంకేతికతలవైపు వాహన పరిశ్రమ మళ్లేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఆటోమొబైల్, ఆటో కాంపొనెంట్స్ రంగానికి వెన్నుదన్నుగా నిలిచేందుకు రూ.25,938 కోట్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను ప్రకటించింది. అడ్వాన్ ్సడ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ స్టోరేజ్ రంగానికి రూ.18,100 కోట్లు, పీఎం ఈ–డ్రైవ్ స్కీమ్కు రూ.10,900 కోట్ల విలువైన ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఈవీ రంగంలో విదేశీ సంస్థలను ఆకట్టుకోవడానికి ఆటోమేటిక్ రూట్లో 100 శాతం ఎఫ్డీఐలకు ప్రభుత్వం తివాచీ పరిచింది. కనీసం 50 కోట్ల డాలర్ల పెట్టుబడితో తయారీ కేంద్రాలు నెలకొల్పే సంస్థలు పూర్తిగా తయారైన ఎలక్ట్రిక్ వాహనాలను దిగుమతి చేసుకుంటే పన్ను 70–100 శాతం నుంచి కొత్త ఈవీ పాలసీలో 15 శాతానికి కుదించారు. లిథియం అయాన్ బ్యాటరీలపై పన్నును 21 నుంచి 13 శాతానికి చేర్చారు. 2030 నాటికి ఈవీ, చార్జింగ్ మౌలిక వసతులు, బ్యాటరీస్ విభాగంలో 200 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అలాగే ఆరేళ్లలో ఈవీ పరిశ్రమ ప్రపంచంలో తొలి స్థానంలో నిలుస్తుందని అంచనా. పాత వాహనాలను తుక్కుగా మార్చేందుకు స్క్రాప్ పాలసీకి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రయాణికుల భద్రత, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని నాణ్యత, సేఫ్టీ ప్రమాణాలను నిర్దేశిస్తూ, తప్పనిసరి చేస్తోంది. గ్లోబల్ ఎన్ సీఏపీకి దీటుగా భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ (ఎన్ సీఏపీ) పరిచయం చేసింది. 2030 నాటికి కొత్తగా అమ్ముడయ్యే వాహనాల్లో ఈవీల వాటా 30 శాతం ఉండాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది.మీకు తెలుసా? వాహనాల తయారీ, విక్రయాల పరంగా భారత్ పేరిట పలు ప్రపంచ రికార్డులు ఉన్నాయి. రూ.22 లక్షల కోట్లతో భారత మార్కెట్ ప్రపంచంలో మూడవ స్థానంలో నిలిచింది. 7 శాతం వార్షిక వృద్ధితో 2022–23లో 33.2 బిలియన్ డాలర్ల విలువైన 47.6 లక్షల యూనిట్ల వాహనాలు భారత్ నుంచి వివిధ దేశాలకు ఎగుమతి అయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 45 లక్షల యూనిట్లు దాటింది. రెండు దశాబ్దాల్లో 25 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐలు వెల్లువెత్తాయి. ఒక్క ఈవీ రంగంలోనే 2022–23లో 3.6 బిలియన్ డాలర్ల ఫండింగ్ వచ్చి చేరింది. వోల్వో, దైమ్లర్ వంటి 60కిపైగా దిగ్గజాలు భారత్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీ) నెలకొల్పాయి. ట్రాక్టర్ల తయారీలో మహీంద్రా, త్రీవీలర్ల ఉత్పత్తిలో బజాజ్ ప్రపంచంలో తొలి స్థానంలో నిలిచాయి.ఆటోమోటివ్ రంగం పరిశ్రమను కొత్తపుంతలు తొక్కించే దిశగా వెళుతోంది. వృద్ధిలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకుంటూనే గ్రీన్ మొబిలిటీకి మారడం సవాలే. ఈవీలు, హైబ్రిడ్స్, హైడ్రోజన్ లేదా ఇతర ఇంధన విభాగాలైనా సరైన సాంకేతికతను అవలంబించడం కూడా సవాలుగానే ఉంటుంది. వృద్ధిని నిర్ధారిస్తూనే ఆటోమోటివ్ కంపెనీలు మారుతున్న పరివర్తనను ఎలా నిర్వహిస్తాయో అన్న అంశాన్ని ఈ రెండేళ్లు పరిశీలించాల్సి ఉంటుంది.∙వి.రిషి కుమార్, ఆటో ఎక్స్పర్ట్. ప్యాసింజర్ వాహన పరిశ్రమలో 60 శాతంపైగా వాటాతో ఎస్యూవీలు రూల్ చేస్తున్నాయి. రియల్ సూపర్ స్టార్గా సీఎన్ జీ నిలిచింది. 3.6 మీటర్ల లోపు ఉండే ఎంట్రీ లెవెల్ కార్ల వాటా ప్రస్తుతం 2 శాతంలోపు వచ్చి చేరింది. ∙అరుణ్ మల్హోత్రా, మాజీ ఎండీ, నిస్సాన్ ఇండియామార్కెట్ రికవరీ, తయారీ సంస్థల నుంచి వ్యూహాత్మక మద్దతు, విధాన స్థాయి స్పష్టత.. వెరసి ఆటోమోటివ్ రిటైల్ పరిశ్రమ 2025లో మెరుగ్గా ఉంటుంది. ఈ ఏడాది వృద్ధి ఉంటుందని 66.41 శాతం డీలర్లు అంచనా వేస్తున్నారు. స్థిరంగా ఉంటుందని 26.72 శాతం, తిరోగమన వృద్ధి నమోదవుతుందని 6.87 శాతం మంది డీలర్లు అభిప్రాయపడ్డారు.∙సి.ఎస్. విఘ్నేశ్వర్,,ప్రెసిడెంట్, ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ్స (ఎఫ్ఏడీఏ) -
2024లో లంబోర్ఘిని కార్లను ఇంతమంది కొన్నారా?
ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ 'లంబోర్ఘిని' (Lamborghini) భారతదేశంలో గణనీయమైన విక్రయాలను పొందుతోంది. 2024లో కంపెనీ 113 కార్లను సేల్ చేసింది. దీంతో సంస్థ విక్రయాల్లో సరికొత్త రికార్డును నమోదు చేసింది.2023తో పోలిస్తే 2024లో లంబోర్ఘిని విక్రయాలు 10 శాతం పెరిగాయి. కాగా ప్రపంచ వ్యాప్తంగా కంపెనీ 10,687 కార్లను విక్రయించింది. ఇందులో అధిక భాగం రెవెల్టో హైబ్రిడ్ స్పోర్ట్స్ కారు ఉంది. అంతకు ముందు ఏడాదిలో హురాకాన్ మంచి అమ్మకాలను పొందింది. ఈ ఏడాది కంపెనీ ఉరుస్ ఎస్ఈ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కారును లాంచ్ చేసే అవకాశం ఉంది.గత ఏడాది అన్ని ప్రధాన మార్కెట్లలో కంపెనీ మంచి వృద్ధిని సాధించింది. లంబోర్ఘిని.. యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలలో 4,227 కార్లను విక్రయించింది. అమెరికాలో 3,712 యూనిట్లు, ఆసియా - పసిఫిక్ ప్రాంతంలో 2,748 యూనిట్లను విక్రయించింది. ఈ ఏడాది కూడా కంపెనీ మంచి అమ్మకాలను పొందే అవకాశం ఉంటుంది. -
అమ్మకాల్లో అరుదైన రికార్డ్: సియామ్ రిపోర్ట్
న్యూఢిల్లీ: తయారీ కంపెనీల నుంచి డీలర్లకు చేరిన (హోల్సేల్) వాహనాల సంఖ్య 2024లో 11.6 శాతం పెరిగి 2,54,98,763 యూనిట్లకు చేరుకుందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) తెలిపింది. వినియోగదారుల నుంచి సానుకూల సెంటిమెంట్ నేపథ్యంలో ద్విచక్ర వాహనాలకు బలమైన డిమాండ్ ఈ వృద్ధికి దోహదం చేసిందని సియామ్ తెలిపింది.2023లో హోల్సేల్గా అమ్ముడైన మొత్తం వాహనాల సంఖ్య 2,28,39,130 యూనిట్లు. ‘2024 ఆటో పరిశ్రమకు సహేతుకంగా మంచిదే. వినియోగదారుల సానుకూల సెంటిమెంట్, దేశ స్థూల ఆర్థిక స్థిరత్వం అన్ని వాహన విభాగాలలో వృద్ధిని అందించడంలో సహాయపడింది. భారత ప్రభుత్వ స్థిర విధాన పర్యావరణ వ్యవస్థ కొన్నేళ్లుగా కొనసాగడం 2024లో పరిశ్రమకు కలిసి వచ్చింది.భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో ద్వారా సానుకూల సెంటిమెంట్తో కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ఈ ఊపు 2025లో వృద్ధిని మరింత ముందుకు తీసుకువెళుతుంది’ అని సియామ్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర తెలిపారు.విభాగాలవారీగా ఇలా.. ద్విచక్ర వాహన విభాగం హోల్సేల్లో గత ఏడాది 14.5 శాతం దూసుకెళ్లి 1,95,43,093 యూనిట్లు నమోదైంది. స్కూటర్స్ విక్రయాలు 20 శాతం అధికమై 66,75,231 యూనిట్లు, మోటార్సైకిల్స్ 12 శాతం ఎగసి 1,23,52,712 యూనిట్లకు చేరుకున్నాయి.ప్యాసింజర్ వెహికిల్స్ 4 శాతం ఎగసి 43 లక్షల యూనిట్లు, త్రీవీలర్స్ 7 శాతం పెరిగి 7.3 లక్షల యూనిట్లను తాకాయి. ప్యాసింజర్ వెహికిల్స్, త్రీవీలర్స్ ఒక ఏడాదిలో ఈ స్థాయిలో హోల్సేల్ అమ్మకాలు నమోదు కావడం ఇదే తొలిసారి. వాణిజ్య వాహనాల విక్రయాలు 3 శాతం క్షీణించి 9.5 లక్షల యూనిట్లకు చేరాయి.ఇదీ చదవండి: ఇల్లుగా మారిన ఇన్నోవా.. ఇదో డబుల్ డెక్కర్!: వైరల్ వీడియో -
అంబానీ కొత్త కారు.. తొలి బుల్లెట్ ప్రూఫ్ రోల్స్ రాయిస్!
ఆసియాలోనే అపర కుబేరుడు ముఖేష్ అంబానీ (Mukesh Ambani). అత్యంత సంపన్నులుగా ఐశ్వర్యానికి, హోదాకు పేరుగాంచిన అంబానీ కుటుంబం (Ambani family) దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ కార్ల సేకరణను కూడా కలిగి ఉంది. జియో గ్యారేజ్లో ఉన కార్ల ఖచ్చితమైన లెక్క తెలియదు కానీ దేశంలోనే అత్యధిక సంఖ్యలో రోల్స్-రాయిస్ కల్లినన్ ఎస్యూవీలు (Rolls-Royce Cullinan) వీరి వద్దే ఉన్నాయి. ఇలాంటి కార్లు వీరి వద్ద కనీసం పది ఉంటాయని చెబుతారు. ఇప్పుడు మరో కొత్త రోల్స్ రాయిస్ కారు చేరింది. ఇది సాధారణ కుల్లినన్ కారు కాదు. ఇది భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ ప్రూఫ్ రోల్స్ రాయిస్ కల్లినన్.జియో గ్యారేజ్కి ప్రత్యేక అతిథిఅంబానీ ఫ్యామిలీ కొత్త కారు అంటూ ఈ ప్రత్యేకమైన రోల్స్ రాయిస్ కల్లినన్ ఫొటోలు ఆన్లైన్లో కనిపించాయి. ఆటోమొబిలి ఆర్డెంట్ ఇండియా వారి ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా ఇవి షేర్ అయ్యాయి. బుల్లెట్ఫ్రూఫింగ్ కార్లలో ప్రత్యేకత కలిగిన చండీగఢ్ వర్క్షాప్లో అద్భుతమైన సిల్వర్ ఎస్యూవీ కనిపించింది. ‘తమ వద్ద ఉన్న కుల్లినన్లతోపాటు అంబానీ కుటుంబం బుల్లెట్ప్రూఫ్ను కలిగి ఉండాల్సిన సమయం ఆసన్నమైందని నిర్ణయించుకున్నారు. అంబానీ ఫ్లీట్ నుండి అందమైన సిల్వర్ రోల్స్ రాయిస్ కల్లినన్ ఇదే’ ఆ పోస్ట్లో పేర్కొన్నారు.ఫొటోల్లో కల్లినన్ సిరీస్ I మోడల్గా కనిపిస్తోంది. ఇది ఇప్పటికే అంబానీ ఫ్యామిలీ కార్ల కలెక్షన్లో భాగమై ఉండవచ్చు. దాన్నే బుల్లెట్ప్రూఫ్ చేయిస్తుండవచ్చు. ముఖేష్ అంబానీ సాధారణంగా భారీ భద్రత కలిగిన మెర్సిడెస్ బెంజ్ ఎస్ 680 (Mercedes-Benz S 680) గార్డ్ సెడాన్లలో ప్రయాణిస్తూ కనిపిస్తారు. అయితే భారతదేశంలో ఎస్యూవీలకు పెరుగుతున్న ప్రాధాన్యత కారణంగా బుల్లెట్ ప్రూఫ్ కల్లినన్ తమ అవసరాలకు బాగా సరిపోతుందని కుటుంబం భావించి ఉండవచ్చు.అల్ట్రా లగ్జరీ ఎస్యూవీరోల్స్ రాయిస్ కల్లినన్ అత్యంత లగ్జరీ కారు. 6.75-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V12 ఇంజన్ 563 Bhp, 850 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. విస్తృతమైన కస్టమైజేషన్ ఆప్షన్స్కు ఇది ప్రసిద్ధి చెందింది. బెస్పోక్ ఫీచర్ల ఆధారంగా కుల్లినన్ ధర ఉంటుంది. ఇప్పుడు ఆర్మ్డ్ బాడీవర్క్ కోసం వర్క్షాప్కు పంపిన నేపథ్యంలో దీని తుది ధరను అంచనా వేయడం సవాలుగా మారింది.అంబానీ రోల్స్ రాయిస్ కలెక్షన్రాయిస్ కలెక్షన్ కల్లినన్ కార్లతో అంబానీ ఫ్యామిలీ అనుబంధం 2019 నాటిది. భారతదేశంలో మొట్ట మొదటగా ఈ మోడల్ను కొనుగోలు చేసింది అంబానీ కుటుంబమే. రిచ్ బ్రౌన్ షేడ్ వాహనం మొదటి కల్లినన్ కాగా ఆ తర్వాత 2021లో ఆర్కిటిక్ వైట్ కలర్ కార్ వచ్చింది.మూడవ కల్లినన్ను వారి కుమార్తె ఇషా అంబానీ ఉపయోగించారు. దాదాపు రూ. 1 కోటి విలువైన టస్కాన్ సన్ కల్లినన్ కూడా ఈ కలెక్షన్లో ఉంది. దీపావళి సందర్భంగా నీతా అంబానీకి బహుమతిగా ఇచ్చిన ప్రీమియం మోడల్ బ్లాక్ బ్యాడ్జ్ కల్లినన్. పెబుల్ ప్యారడిసో బ్లాక్ బ్యాడ్జ్ కల్లినన్ను అనంత్ అంబానీ పెళ్లికి ముందు కొనుగోలు చేశారు. సిరీస్ II కల్లినన్ తాజాగా ఫ్లీట్లో చేరింది. వీటితో పాటు విదేశాల్లోనూ కులినన్ వాహనాలు అంబానీ ఫ్యామిలీకి ఉన్నాయి. -
తక్కువ ధర.. మంచి మైలేజ్: ఇదిగో టాప్ 5 స్కూటర్స్
చాలామంది తక్కువ ధర వద్ద ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు ఈ తరహా వాహనాలను మార్కెట్లో లాంచ్ చేశాయి. ఈ కథనాల్లో రూ. 1 లక్ష కంటే తక్కువ ధర వద్ద లభించే.. మంచి మైలేజ్ ఇచ్చే స్కూటర్లను గురించి తెలుసుకుందాం.యమహా రే జెడ్ఆర్ 125 (Yamaha Ray ZR 125)యమహా కంపెనీ మార్కెట్లో లాంచ్ చేసిన 'రే జెడ్ఆర్ 125' రూ.1 లక్ష కంటే తక్కువ ధర వద్ద లభించే స్కూటర్లలో ఒకటి. దీని ప్రారంభ ధర రూ. 87,800 (ఎక్స్ షోరూమ్). 52 కిమీ / లీ మైలేజ్ ఇచ్చే ఈ స్కూటర్ 125 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ద్వారా 8.2 పీఎస్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. 5.2 లీటర్ కెపాసిటీ కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ ఇందులో ఉంటుంది.సుజుకి బర్గ్మన్ స్ట్రీట్ 125 (Suzuki Burgman Street 125)రూ. 96,800 ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉన్న.. సుజుకి బర్గ్మన్ స్ట్రీట్ 125 ఒక లీటరుకు 50 కిమీ మైలేజ్ అందిస్తుంది. ఇందులో 124 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ 8.7 పీఎస్ పవర్ అందిస్తుంది. మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉన్న బర్గ్మన్ స్ట్రీట్ 125 ఏకంగా 5.5 లీటర్ కెపాసిటీ కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ పొందుతుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇది మార్కెట్లోని ఇతర స్కూటర్ల కంటే భిన్నంగా ఉంటుంది.యమహా ఫాసినో 125 (Yamaha Fascino 125)యమహా ఫాసినో 125 ధర రూ. 83000 నుంచి రూ. 97500 (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఆరు వేరియంట్లలో లభించే ఈ స్కూటర్ 49 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఇందులోని 125 సీసీ ఇంజిన్ 6500 rpm వద్ద 8.2 పీఎస్ పవర్ అందిస్తుంది. రోజువారీ వినియోగానికి ఉపయోగపడే స్కూటర్లలో ఇది కూడా ఒకటి.హీరో ప్లెజర్ ప్లస్ (Hero Pleasure Plus)హీరో ప్లెజర్ ప్లస్ ధర రూ. 70,500 నుంచి రూ. 74,000 (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుంది. 50 కిమీ / లీ మైలేజ్ అందించే ఈ స్కూటర్ 4.8 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ పొందుతుంది. 110 సీసీ ఇంజిన్ ద్వారా ఇది 8.15 పీఎస్ పవర్ అందిస్తుంది. సింపుల్ డిజైన్ కలిగిన ఈ స్కూటర్.. రైడర్లకు కావలసిన ఫీచర్స్ కలిగి ఉంటుంది.సుజుకి అవెనిస్ 125 (Suzuki Avenis 125)మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లలో సుజుకి అవెనిస్ 125 ఒకటి. ఇది 49.6 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. దీని ధర రూ. 94,500 నుంచి రూ. 95,300 (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఈ స్కూటర్ 124 సీసీ ఇంజిన్ కలిగి 8.7 పీఎస్ పవర్ అందిస్తుంది. కాబట్టి ఇది ఉత్తమ పనితీరును అందిస్తుంది. -
ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్: బజాజ్ ప్లాటినా 100 vs హోండా షైన్
రోజువారీ వినియోగానికి లేదా ఎక్కువ మైలేజ్ కావాలని కోరుకునేవారు బజాజ్ ప్లాటినా 100, హోండా షైన్ వంటి బైకులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఇవి రెండూ.. సింపుల్ డిజైన్, ఫీచర్స్ కలిగి ఉండటం మాత్రమే కాకుండా మంచి రైడింగ్ అనుభూతిని కూడా అందిస్తాయి. ఈ కథనంలో ఈ రెండు బైకుల గురించి వివరంగా తెలుసుకుందాం.బజాజ్ ఆటో లాంచ్ చేసే బైకులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇందులో ప్లాటినా 100 కూడా ఉంది. ఇందులో 102 సీసీ ఫోర్ స్ట్రోక్ డీటీఎస్-ఐ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 7.9 పీఎస్ పవర్, 8.3 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 90 కిమీ/లీ మైలేజ్ ఇస్తుందని సమాచారం.హోండా షైన్ విషయానికి వస్తే.. ఇది 123.94 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 10.74 పీఎస్ పవర్, 11 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 75 కిమీ/లీ మైలేజ్ అందించే ఈ బైక్.. సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ వంటి ఫీచర్స్ కూడా పొందుతుంది.ఇదీ చదవండి: హోండా యాక్టివా ఈ vs సుజుకి ఈ యాక్సెస్: ఏది బెస్ట్?డిజైన్, ఫీచర్స్ పరంగా బజాజ్ ప్లాటినా 100, హోండా షైన్.. రెండూ చాలా అనుకూలంగా ఉంటాయి. ఇతర బైకులతో పోలిస్తే.. ఈ రెండు బైకులు మంచి మైలేజ్ అందించడం వల్ల, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కూడా వీటిని ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. బజాజ్ ప్లాటినా 100 ప్రారంభ ధరలు రూ. 68,685 కాగా.. హోండా షైన్ ధర రూ. 84151 (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఇండియా). -
కొత్త కారును ఆవిష్కరించిన టెస్లా (ఫొటోలు)
-
కార్ కొనేవారికి అలర్ట్.. మారుతి సుజుకి ధరల పెంపు
ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (Maruti Suzuki) ధరలను పెంచింది. పెరుగుతున్న ముడి సరుకుల ధరలు, నిర్వహణ ఖర్చుల కారణంగా పలు మోడళ్లలో ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ధరల (Car Prices) పెరుగుదల ఫిబ్రవరి 1 నుండి అమలులోకి వస్తుంది. ఈ పెంపు సెలెరియో మోడల్పై ఎక్కువ ప్రభావం చూపుతుంది. దీని ధర రూ. 32,500 వరకు పెరుగుతుందని ఎక్స్ఛేంజీలకు మారుతి సుజుకి ఒక ప్రకటనలో తెలిపింది. అధిక ఇన్పుట్ ఖర్చులు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల ప్రభావం వల్ల ధరలు పెరిగాయని మారుతి సుజుకి వివరించింది. ఖర్చులను ఆప్టిమైజ్ చేయడానికి, వినియోగదారులపై ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ కొన్ని మోడళ్లపై ధరలు పెంచక తప్పలేదని పేర్కొంది.ముడిసరుకు, లాజిస్టిక్స్, ఉత్పత్తి ఖర్చులు పెరగడం వల్ల వాహన తయారీదారులు అధిక ఇన్పుట్ ఖర్చులను ఎదుర్కొంటున్నారు. గ్లోబల్ సప్లయి చైన్లో అంతరాయాలు, పెరుగుతున్న డిమాండ్లే ముడిసరుకు ధరల పెరుగుదల కారణమని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఎస్&పీ గ్లోబల్ అభిప్రాయపడింది. యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో కొత్త సుంకాల అవకాశం కూడా అనిశ్చితిని జోడించింది. ఇది పరిశ్రమలో ఖర్చు ఒత్తిడిని మరింత పెంచుతుంది.ఏ కారు ఎంతెంత పెరుగుతాయి?సెలెరియో అత్యధికంగా రూ. 32,500 వరకు, ఇన్విక్టో రూ. 30,000 వరకు, గ్రాండ్ విటారా రూ. 25,000 వరకు పెరుగుతాయి. ఇక బాలెనో ధర పెంపు రూ. 20,500 వరకు ఉంటుంది. ఆల్టో కె10 ధర రూ. 19,500 వరకు పెరుగుతుంది. ఎర్టిగా ధర రూ.15,000 వరకు, ఎస్-క్రాస్ ధర రూ.12,500 వరకు, ఎక్స్ఎల్6 ధర రూ.11,000 వరకు పెరగనుంది.డిజైర్ రూ. 10,550 వరకు, సూపర్ క్యారీ రూ. 10,000 వరకు, బ్రెజ్జా రూ. 9,000 వరకు, వ్యాగన్-ఆర్ రూ. 8,000 వరకు పెరగనున్నాయి.అదే సమయంలో, ఇగ్నిస్ రూ. 6,000 వరకు, ఫ్రాంక్స్ రూ. 5,500 వరకు, స్విఫ్ట్, ఎస్-ప్రెస్సో రెండూ రూ. 5,000 వరకు పెరగనున్నాయి. సియాజ్, జిమ్నీ స్వల్పంగా రూ. 1,500 వరకు పెరుగుతాయని కంపెనీ పేర్కొంది. -
నితిన్ గడ్కరీ కొత్త ఆలోచన
భారతీయ ఆటోమొబైల్ రంగం దినదినాభివృద్ది చెందుతోంది. కానీ ట్రాఫిక్ ఓ సమస్యగా మారిపోయింది. నగరాల్లో ప్రయాణం చేయాలంటే చాలా కష్టమైపోతోంది. ఈ తరుణంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ దేశ ఆర్ధిక రాజధానిలో వాహనాల రద్దీ తగ్గించడానికి.. రాయ్గఢ్ జిల్లాలో రాబోయే నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవడానికి ఓ కొత్త ఆలోచన చేసారు. ఇందులో భాగంగానే.. 10,000 వాటర్ ట్యాక్సీలు ప్రవేశపెట్టనున్నట్లు.. వీటి కోసం 'ఫైబర్ రీయిన్ఫోర్స్డ్ ప్లాస్టిక్స్' (FRP) వినియోగించనున్నట్లు వెల్లడించారు.ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్ ఆన్ రీయిన్ఫోర్స్డ్ ప్లాస్టిక్స్ (ICERP) 2025 సమావేశంలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో.. ఇప్పటికే వాటర్ ట్యాక్సీల కోసం జెట్టీలను నిర్మించాము. మార్చి 2025 నాటికి ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని గడ్కరీ వెల్లడించారు.ముంబై.. థానే చుట్టూ ఉన్న విస్తారమైన సముద్ర మార్గాలను ఉపయోగించడం ద్వారా రోడ్డుపై ట్రాఫిక్.. కాలుష్యం రెండూ కూడా తగ్గుతాయి. టాక్సీల కోసం కంపోజిట్ మెటీరియల్ (మిశ్రమ ముడి పదార్థాలు) ఉపయోగించడం వల్ల, అవి ఎక్కువ మన్నికైనవిగా ఉంటాయి. అంతే కాకుండా.. స్థానిక ముడిపదార్థాలని ఉపయోగించడం వల్ల.. 25 నుంచి 30 శాతం విదేశీ దిగుమతులు తగ్గుతాయి. దీంతో దేశ ఆర్ధిక వృద్ధి కూడా పెరుగుతుందని గడ్కరీ అన్నారు.కాంపోజిట్ మెటీరియల్స్.. రక్షణ, ఆటోమోటివ్, షిప్పింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కన్స్ట్రక్షన్, ఏరోస్పేస్ వంటి వాటిలో ఉపయోగపడతాయి. 2024 చివరి నాటికి ఈ మిశ్రమ ముడి పదార్థాల మార్కెట్ 1.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దేశీయ మిశ్రమ పదార్థాల పరిశ్రమ 7.8 శాతం వృద్ధి చెందుతూ 2030 నాటికి 2.8 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఎఫ్ఆర్పీ ఇన్స్టిట్యూట్ వెల్లడించింది.ఇదీ చదవండి: 2030 నాటికి ఈ రంగంలో 2.5 కోట్ల ఉద్యోగులు: నితిన్ గడ్కరీఐసీఈఆర్పీ (ICERP) 2025 సమావేశానికి అధ్యక్షత వహించిన 'పియా ఠక్కర్' మాట్లాడుతూ.. భారతదేశ భవిష్యత్తును రూపొందించడంలో కాంపోజిట్లు కీలక పాత్ర పోషిస్తాయనే విషయాన్ని హైలైట్ చేశారు. ఇండియన్ కాంపోజిట్స్ ఇండస్ట్రీ ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇది భారతదేశం ఆర్థికంగా ఎదగడానికి కూడా ఉపయోగపడుతుందని అన్నారు. -
ఆటో ఎక్స్పో.. స్పందన అదరహో
దేశ రాజధానిలోని భారత్ మండపంలో నిర్వహిస్తున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో తమ ఫేవరెట్ కొత్త కార్లు, బైక్లను చూసేందుకు వాహన ప్రియులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఆదివారం నుంచి సాధారణ ప్రజానీకాన్ని కూడా అనుమతిస్తుండటంతో ఎంట్రీ పాయింట్లు, సెక్యురిటీ చెక్ పాయింట్ల దగ్గర ప్రజలు బారులు తీరారు. సమీప ప్రాంతాల నుంచి కూడా వాహన ప్రియులు పెద్ద సంఖ్యలో వస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. భారీ జన సందోహాన్ని ఊహించిన కంపెనీలు కూడా డిస్ప్లే ఏరియాల్లో మరింత మంది సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నాయి. పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు వాహనాల తయారీ సంస్థల సమాఖ్య డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ తెలిపారు.అత్యవసర పరిస్థితుల్లో సత్వరం స్పందించేందుకు పెద్ద ఎత్తున ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్లు, వైద్య సదుపాయాలు మొదలైనవి ఏర్పాటు చేసినట్లు వివరించారు. జనవరి 17 నుంచి 22 వరకు జరిగే ఆటో ఎక్స్పోలో తొలి రెండు రోజులు మీడియా, వ్యాపార వర్గాలకు కేటాయించగా.. మిగతా రోజుల్లో సందర్శకులను అనుమతిస్తున్నారు. ఆటోమొబైల్ కంపెనీలు తొలి రెండు రోజుల్లో 90 పైచిలుకు కొత్త వాహనాలను ఆవిష్కరించాయి. పలు కాన్సెప్ట్లు, సరికొత్త ఆటోమోటివ్ టెక్నాలజీల మొదలైన వాటిని కూడా ప్రదర్శిస్తున్నాయి.ఇదీ చదవండి: స్మాల్క్యాప్ ఫండ్ పరిమాణం పెరిగితే..?భారత్లో తయారీకి సిద్ధం: బీవైడీఅన్నీ కలిసి వస్తే భారత్లో తయారీ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చైనాకి చెందిన బీవైడీ ఇండియా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల విభాగం హెడ్ రాజీవ్ చౌహాన్ తెలిపారు. ప్రణాళికలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని వివరించారు. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో తమ ప్రీమియం ఎలక్ట్రికి ఎస్యూవీ సీలయన్7ను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. భారత్లో తమకు ప్రస్తుతం ఏ కంపెనీతోనూ తయారీ కాంట్రాక్టులు లేవని ఆయన చెప్పారు. దేశీయంగా కంపెనీ కార్యకలాపాలు సాగించడానికి సంబంధించి చైనీయులపై భారత్ వీసా ఆంక్షల ప్రభావమేదేనా ఉందా అనే ప్రశ్నకు స్పందిస్తూ.. అలాంటిదేమీ లేదని చౌహన్ చెప్పారు. -
60 కిమీ మైలేజ్: రూ. లక్ష కంటే తక్కువే..
భారతదేశంలో ఇంధన ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ తరుణంలో చాలామంది ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాలను ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కథనంలో లక్ష రూపాయల కంటే తక్కువ ధరలో లభించే.. అధిక మైలేజ్ ఇచ్చే స్కూటర్లను గురించి తెలుసుకుందాం.టీవీఎస్ జుపీటర్ 125 (TVS Jupiter 125)మార్కెట్లో అధిక అమ్మకాలను పొందుతూ.. ఎందోమందిని ఆకర్షిస్తున్న టీవీఎస్ జుపీటర్ 125 ఎక్కువ మైలేజ్ ఇచ్చే స్కూటర్ల జాబితాలో ఒకటి. దీని ప్రారంభ ధర రూ. 96000 (ఎక్స్ షోరూమ్). ఇది 60 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ 124.8 సీసీ ఇంజిన్ ద్వారా 8.15 Bhp పవర్, 10.5 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇందులో స్టోరేజ్ స్పేస్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ప్రత్యేకించి రోజువారీ వినియోగానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.యమహా ఫాసినో 125 (Yamaha Fascino 125)రూ.79990 ప్రారంభ ధర వద్ద లభించే యమహా ఫాసినో 125 సీసీ ఇంజన్తో పాటు ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంది. కాబట్టి ఇది పెట్రోల్, విద్యుత్ రెండింటిలోనూ నడుస్తుంది. ఇది 66 కిమీ / లీ మైలేజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఇది మంచి డిజైన్, రైడర్లకు కావలసిన ఫీచర్స్ పొందుతుంది.ఇదీ చదవండి: రూ. 22.95 లక్షల బీఎండబ్ల్యూ బైక్హోండా యాక్టివా 6జీ (Honda Activa 6G)భారతదేశంలో యాక్టివా 6జీ అనేది హోండా మోటార్సైకిల్ బెస్ట్ సెల్లింగ్ స్కూటర్లలో ఒకటిగా ఉంది. ఇది 109.51 సీసీ ఇంజిన్ ద్వారా 7.73 Bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ స్కూటర్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 5.3 లీటర్లు. దీని టాప్ స్పీడ్ గంటకు 85 కిమీ. 106 కేజీల బరువున్న ఈ స్కూటర్ 60 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ ధర రూ. 78000 నుంచి రూ. 84000 (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. -
రూ. 22.95 లక్షల బీఎండబ్ల్యూ బైక్ ఇదే
ఖరీదైన బైకులను తయారు చేసే బీఎండబ్ల్యూ మోటోరాడ్ (BMW Motorrad) భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో తన 'ఆర్ 1300 జీఎస్ఏ' (R 1300 GSA) లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 22.95 లక్షలు. ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా 12 కేజీలు తక్కువ బరువును కలిగి ఉంది.సుమారు 30 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కలిగిన బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ఏ 1300 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 7750 rpm వద్ద 145 హార్స్ పవర్, 6500 rpm వద్ద 149 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఆటోమేటెడ్ షిఫ్ట్ అసిస్టెంట్ కలిగిన ఈ బైక్ క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటి ఫీచర్స్ కూడా పొందుతుంది.ఇదీ చదవండి: సరికొత్త బెంజ్ కారు లాంచ్.. ధర ఎంతంటే?బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ఏ బైక్.. ట్రిపుల్ బ్లాక్, జీఎస్ ట్రోఫీ, ఆప్షన్ 719 కారాకోరం అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. కంపెనీ ఇందులోనే మరో కొత్త వేరియంట్ను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది.Unleash your potential with the all-new BMW R 1300 GS Adventure.Starting at an introductory ex-showroom price of INR 22.95 Lakhs*.To know more, head over to the link below 👇 https://t.co/gsXc9UFriJ#BMWR1300GSAdventure #BMWMotorradIndia #R1300GSAdventure #PriceLaunch pic.twitter.com/oU0WWBuRNF— BMWMotorrad_IN (@BMWMotorrad_IN) January 18, 2025 -
బ్లేడ్ బ్యాటరీ బస్సు.. బుల్లి కారు..
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో (Bharat mobility expo 2025)వివిధ కంపెనీల నుంచి నూతన ఎలక్ట్రిక్ వాహనాలు కొలువుదీరాయి. వియత్నాంకు చెందిన విన్ఫాస్ట్ ఆటో భారత్కు ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించింది. వీఎఫ్–7, వీఎఫ్–6 ఎలక్ట్రిక్ ఎస్యూవీలను ఆవిష్కరించింది. ఈ ఏడాది చివరినాటికి వీటిని మార్కెట్లోకి తేనున్నట్టు తెలిపింది. తమిళనాడులోని ట్యూటికోరిన్ వద్ద 500 మిలియన్ డాలర్ల పెట్టుబడితో తయారీ కేంద్రం స్థాపించనున్నట్టు వెల్లడించింది. ఈ ఏడాది రెండవ అర్ద భాగంలో ఈ ప్లాంటు రెడీ అవుతుందని విన్ఫాస్ట్ ఆసియా సీఈవో పామ్ సాన్ ఛావ్ తెలిపారు.హ్యుండై టీవీఎస్ జోడీహ్యుండై మోటార్ కంపెనీ, టీవీఎస్ మోటార్ కంపెనీ చేతులు కలిపాయి. అధునాతన ఎలక్ట్రిక్ త్రీ–వీలర్లు, చిన్న ఫోర్–వీలర్లను అభివృద్ధి చేసే లక్ష్యంతో భాగస్వామ్యాన్ని అన్వేషించనున్నట్లు ప్రకటించాయి. ఈ సందర్భంగా హ్యుండై తన మైక్రో మొబిలిటీ కాన్సెప్ట్ ఈవీలను ఆవిష్కరించింది. ఈ భాగస్వామ్యం కార్యరూపం దాలిస్తే డిజైన్, ఇంజనీరింగ్, సాంకేతిక నైపుణ్యాన్ని అందించాలని హ్యుండై యోచిస్తోంది. అయితే భారత్లో ఈ వాహనాల తయారీ, మార్కెటింగ్పై టీవీఎస్ దృష్టి పెడుతుంది.కొలువుదీరిన ఎంజీ మోడళ్లుజేఎస్డబ్లు్య ఎంజీ మోటార్ ఇండియా మజెస్టర్ పేరుతో మధ్యస్థాయి ఎస్యూవీని ఆవిష్కరించింది. కాంపాక్ట్ కార్స్ కంటే పెద్దగా, పూర్తి స్థాయి కార్స్ కంటే చిన్నగా ఉంటుందని కంపెనీ తెలిపింది. అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న ఐఎం5, ఐఎం6, ఎంజీ హెచ్ఎస్, ఎంజీ7 ట్రోఫీ ఎడిషన్ మోడళ్లను సైతం కంపెనీ ప్రదర్శించింది. మోంట్రా ఎలక్ట్రిక్ కొత్త మోడళ్లుమురుగప్ప గ్రూప్ కంపెనీ మోంట్రా ఎలక్ట్రిక్ రెండు కొత్త వాహనాలను లాంచ్ చేసింది. ఈవియేటర్ పేరుతో చిన్న తరహా వాణిజ్య వాహనాన్ని, సూపర్ కార్గో పేరుతో త్రీవీలర్ను ఆవిష్కరించింది. ఒకసారి చార్జింగ్తో ఈవియేటర్ 245 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఢిల్లీ ఎక్స్షోరూంలో ధర రూ.15.99 లక్షలు. సూపర్ కార్గో ఈ–త్రీవీలర్ 200 కిలోమీటర్లపైగా పరుగెడుతుంది. పూర్తి ఛార్జింగ్ కోసం 15 నిమిషాలు సమయం తీసుకుంటుంది. ఢిల్లీ ఎక్స్షోరూంలో ధర రూ.4.37 లక్షలు. కంపెనీ 55 టన్నుల హెవీ కమర్షియల్ ఎలక్ట్రిక్ ట్రక్ రైనో సైతం ప్రదర్శించింది. బీవైడీ సీలయన్–7..చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం బీవైడీ భారత్లో సీలయన్–7 కూపే–ఎస్యూవీ ఆవిష్కరించింది. కంపెనీ నుంచి ఇది భారత మార్కెట్లో నాల్గవ మోడల్గా నిలవనుంది. 82.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్ చేస్తే వేరియంట్నుబట్టి 542–567 కిలోమీటర్లు పరుగెడుతుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని పర్ఫామెన్స్ వేరియంట్ 4.5 సెకన్లలో, ప్రీమియం వేరియంట్ 6.7 సెకన్లలో అందుకుంటుంది.ఒలెక్ట్రా బ్లేడ్ బ్యాటరీ ఛాసీ..హైదరాబాద్ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్టెక్ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో వేదికగా 12 మీటర్ల పొడవున్న బ్లేడ్ బ్యాటరీ ఛాసీని ఆవిష్కరించింది. 9 మీటర్ల పొడవున్న సిటీ బస్, 12 మీటర్ల పొడవుతో కోచ్ బస్ సైతం ప్రదర్శించింది. బ్లేడ్ బ్యాటరీ ఒకసారి చార్జింగ్తో 500 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. 2024 సెప్టెంబర్ 30 నాటికి 2,200లకుపైగా యూనిట్ల ఎలక్ట్రిక్ బస్లను సరఫరా చేసి ప్రజా రవాణా రూపు రేఖలను మార్చినట్టు ఒలెక్ట్రా సీఎండీ కె.వి.ప్రదీప్ తెలిపారు. అశోక్ లేలాండ్ సాథీవాణిజ్య వాహనాలు, బస్ల తయారీ దిగ్గజం అశోక్ లేలాండ్ సాథి పేరుతో తేలికపాటి చిన్న వాణిజ్య వాహనాన్ని ఆవిష్కరించింది. అత్యాధునిక ఎల్ఎన్టీ సాంకేతికతతో తయారైంది. 45 హెచ్పీ పవర్, 110 ఎన్ఎం టార్క్ అందిస్తుంది. 1,120 కిలోల బరువు మోయగలదు. ధర రూ.6.49 లక్షలు. అలాగే మల్టీ యాక్సెల్, ఫ్రంట్ ఇంజన్, 15 మీటర్ల పొడవున్న గరుడ్–15 ప్రీమియం బస్ సైతం కొలువుదీరింది. 42 స్లీపర్ బెర్తులను ఈ బస్లో ఏర్పాటు చేశారు. కాగా, ఈ–టిరాన్ పేరుతో ఎలక్ట్రిక్ పోర్ట్ టెర్మినల్ ట్రాక్టర్ను సైతం కంపెనీ ఆవిష్కరించింది. మైక్రో మొబిలిటీతో బజాజ్?స్విట్జర్లాండ్కు చెందిన మైక్రో మొబిలిటీ సిస్టమ్స్లో వాటాను కొనుగోలు చేయడంతో సహా ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిళ్లను ఉత్పత్తి, ఎగుమతి చేయడానికి వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం బజాజ్ ఆటో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. మైక్రోలీనో పేరుతో రెండు సీట్ల ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిల్ను, అలాగే మైక్రోలెటా పేరుతో మూడు చక్రాల ఎలక్ట్రిక్ స్కూటర్ను మైక్రో మొబిలిటీ తయారు చేస్తోంది. నగరాల్లో తక్కువ దూరం ప్రయాణానికి అనువైన వాహనాల తయారీలో మైక్రో మొబిలిటీ సిస్టమ్స్కు పేరుంది.జేబీఎం ఎలక్ట్రిక్ కొత్త వాహనాలుజేబీఎం ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఎక్స్పో వేదికగా గెలాక్సీ లగ్జరీ కోచ్, ఎక్స్ప్రెస్ ఇంటర్సిటీ బస్, లో ఫ్లోర్ మెడికల్ మొబైల్ యూనిట్ ఈ–మెడిలైఫ్, దేశంలో తొలిసారిగా 9 మీటర్ల పొడవున్న టార్మాక్ కోచ్ ఈ–స్కైలైఫ్ను విడుదల చేసింది. లిథియం–అయాన్ బ్యాటరీలు కలిగిన ఈ వాహనాలకు ఆల్ట్రా ఫాస్ట్ చార్జింగ్ సదుపాయం ఉంది. ఇప్పటికే కంపెనీ భారత్తోపాటు యూరప్, పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాల్లో 1,800 ఎలక్ట్రిక్ బస్లను విక్రయించింది. 10,000 పైచిలుకు ఈ–బస్లకు ఆర్డర్ బుక్ ఉందని జేబీఎం గ్రూప్ వైస్ చైర్మన్ నిశాంత్ ఆర్య తెలిపారు. -
సరికొత్త బెంజ్ కారు లాంచ్.. ధర ఎంతంటే?
బీఎండబ్ల్యూ ఇండియా (BMW India) తన నాల్గవ తరం ఎక్స్3 (X3)ని ఆటో ఎక్స్పో 2025లో లాంచ్ చేసింది. ఇది పెట్రోల్, డీజిల్ వేరియంట్ల రూపంలో మార్కెట్లో అందుబాటులో ఉంది. వీటి ధరలు వరుసగా రూ. 75.80 లక్షలు, రూ. 77.80 లక్షలు (ఎక్స్ షోరూమ్). కంపెనీ ఈ మోడల్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు ఏప్రిల్లో ప్రారంభమవుతాయి.2025 బీఎండబ్ల్యూ ఎక్స్3 రెండు మోడల్స్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతాయి. పెట్రోల్ మోడల్ 190 హార్స్ పవర్, 310 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. డీజిల్ వెర్షన్ 197 హార్స్ పవర్, 400 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.లేటెస్ట్ డిజైన్ కలిగిన బీఎండబ్ల్యూ ఎక్స్3 కారు.. స్లిమ్ హెడ్లైట్స్, కిడ్నీ గ్రిల్, కొత్త అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఇందులో 12.3 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ టచ్స్క్రీన్, 14.9 ఇంచెస్ డ్రైవర్ డిస్ప్లే వంటివి ఉంటాయి. హీటెడ్ స్పోర్ట్స్ సీట్లు, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, పార్క్ అసిస్ట్, పనోరమిక్ సన్రూఫ్, వెంటిలేషన్ ఫంక్షన్తో కూడిన పవర్డ్ ఫ్రంట్ సీట్లు, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, రిక్లైనింగ్ రియర్ బెంచ్ వంటి ఫీచర్స్ ఇందులో ఉంటాయి. -
కళ్లుచెదిరే కొత్త కార్లు.. భళా నయా బైక్లు..
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో (Bharat Mobility Global Expo 2025) కనులపండువగా సాగుతోంది. ఢిల్లీలోని భారత్ మండపంలో ఏర్పాటు చేసిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025(రెండో ఎడిషన్)ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ ఆటోమొబైల్ ఎక్స్ పో వేదికగా పలు కార్లు, టూవీలర్ కంపెనీలు తమ నూతన ఉత్పత్తులను ఆవిష్కరిస్తున్నాయి.హీరో మోటోకార్ప్ నాలుగు కొత్త మోడళ్లు హీరో మోటోకార్ప్ (Hero Motocorp) భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో వేదికగా నాలుగు ద్విచక్ర వాహన మోడళ్లను ఆవిష్కరించింది. ఎక్స్ట్రీమ్ 250ఆర్, ఎక్స్ప్లస్ 210 పేరుతో రెండు మోటార్స్ బైకులు లాంచ్ చేసింది. స్కూటర్ల పోర్ట్ఫోలియోలో ఎక్స్మ్ 125, ఎక్స్మ్ 160 రెండు సరికొత్త వేరియంట్లను అందుబాటులోకి తెచ్చింది. కొత్త ఆవిష్కరణలతో ప్రీమియం బ్రాండ్లు ఎక్స్ట్రీం, ఎక్స్ప్లస్లు మరింత బలోపేతమయ్యాయని కంపెనీ సీఈఓ నిరంజన్ తెలిపారు. వీటి బుకింగ్స్ ఫిబ్రవరిలో ప్రారంభమవుతాయి. మార్చి నుంచి డెలీవరి ఉంటుంది. యమహాయమహా (Yamaha) తమ పెవిలియన్లో RX- 100, RD-350 వంటి లెజెండరీ మోటార్సైకిళ్లతోపాటు ప్రీమియం శ్రేణి మొదటి తరం మోడళ్లను ప్రదర్శించింది. ఇందులో ప్రముఖ YZF-R15, మస్కులర్ FZ సిరీస్లు ఉన్నాయి.హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ హ్యుండై మోటార్ ఇండియా క్రెటా ఎలక్ట్రిక్ను (Hyundai CRETA Electric) విడుదల చేసింది. పరిచయ ఆఫర్లో ధర రూ.17.99 లక్షలు ఉంది. ఆరు వేరియంట్లలో లభిస్తుంది. ఒకసారి చార్జింగ్తో 42 కిలోవాట్ అవర్ బ్యాటరీతో 390 కిలోమీటర్లు, 51.4 కిలోవాట్ అవర్ బ్యాటరీతో 473 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. కియా ఈవీ6 అప్గ్రేడెడ్ వర్షన్ దక్షిణ కొరియాకు చెందిన వాహన తయారీ సంస్థ కియా తాజాగా ఈవీ6 అప్గ్రేడెడ్ వర్షన్ను (Kia EV6) పరిచయం చేసింది. 84 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్తో 650 కిలోమీటర్లకుపైగా పరుగెడుతుందని కంపెనీ ప్రకటించింది. 350 కిలోవాట్ ఫాస్ట్ చార్జర్తో 10 నుంచి 80 శాతం చార్జింగ్ 18 నిముషాల్లో అవుతుంది. ఇప్పటి వరకు ఈ మోడల్కు 77.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ వాడారు. బీఎండబ్ల్యూ మేడిన్ ఇండియా ఈవీ జర్మనీ లగ్జరీ కార్ల తయారీలో ఉన్న బీఎండబ్ల్యూ (BMW) భారత్లో తయారైన ఎలక్ట్రిక్ వెహికిల్ ఐఎక్స్1 లాంగ్ వీల్బేస్ ఆల్ ఎలక్ట్రిక్ను విడుదల చేసింది. ధర రూ.49 లక్షలు. 66.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్తో 531 కిలోమీటర్లు పరుగెడుతుంది.మైబహ్ కొత్త ఈవీ మెర్సిడెస్ బెంజ్ భారత్లో లగ్జరీ ఎలక్ట్రిక్ ఈక్యూఎస్ మైబహ్ ఎస్యూవీ (Mercedes-Benz Maybach EQS SUV) 680 నైట్ సిరీస్ను విడుదల చేసింది. ధర రూ.2.63 కోట్లు. గరిష్ట వేగం 210 కిలోమీటర్లు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 4.4 సెకన్లలో చేరుకుంటుంది. మైబహ్ జీఎల్ఎస్ 600 నైట్ సిరీస్లో కొత్త వేరియంట్ను రూ.3.71 కోట్ల ధరతో ప్రవేశపెట్టింది. అలాగే సీఎల్ఏ క్లాస్ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ను ఆవిష్కరించింది.టాటా మోటార్స్భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో టాటా మోటార్స్ పలు కొత్త మోడళ్లను ప్రదర్శించింది. వీటిలో హ్యారియర్ ఈవీ, అవిన్యా ఎక్స్ కాన్సెప్ట్, టాటా సియర్రా ఎస్వీ, టాటా ఇంట్రా వాహనాలున్నాయి.టయోటా టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) తమ అద్భుతమైన ఉత్పత్తులను, అధునాతన సాంకేతికతలను ఆటో ఎక్స్పోలో ప్రదర్శించింది. -
ప్రైవేట్ వాహనాలకు పాస్లు!: నితిన్ గడ్కరీ
జాతీయ రహదారులపై ఉన్న టోల్ గేట్స్ వద్ద రద్దీని తగ్గించడానికి కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ప్రైవేట్ వాహనదారులకు నెలవారీ, వార్షిక టోల్ పాస్లను మంజూరు చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇది వాహనదారులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. టోల్ వసూళ్లు అత్యధికంగా కమర్షియల్ వాహనాల నుంచి (74 శాతం) వస్తోంది. అయితే మిగిలిన 26 శాతం మాత్రమే ప్రైవేట్ వాహనాల నుంచి వస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 2025 జనవరి 16న ఈ నిర్ణయం తీసుకున్నారు.ప్రతిపాదనలో ముఖ్య ముఖ్యాంశాలునెలవారీ & వార్షిక పాస్లు: జాతీయ రహదారులపై ప్రయాణించే ప్రైవేట్ కార్ల యజమానులు నెలవారీ లేదా సంవత్సరానికి పాస్లు తీసుకోవచ్చు. ఇది ఖర్చును కొంత తగ్గించడం మాత్రమే కాకుండా.. సమయాన్ని కూడా అదా చేస్తుంది.అవరోధం లేని టోల్ సేకరణ: పాస్ సిస్టమ్తో పాటు గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జీఎన్ఎస్ఎస్) ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్ను కూడా ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. లేటెస్ట్ టెక్నాలజీతో టోల్ల చెల్లింపుకు ఇది సరైన మార్గం. ఈ శాటిలైట్ సిస్టం అమలులోకి వచ్చిన తరువాత ప్రత్యేకంగా టోల్ గేట్స్ అవకాశం ఉండదు.గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ మారుతోంది. ఈ టెక్నాలజీని ఉపయోగించి హైవేల మీద టోల్ గేట్స్ లేకుండా చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. టోల్ గేట్స్ మొత్తం తొలగించి.. శాటిలైట్ విధానం ద్వారా టోల్ ఫీజు వసూలు చేయనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే వాహనదారులు హైవే మీద ఎక్కడా ఆగాల్సిన పనిలేదు.గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS) ద్వారా టోల్ కలెక్షన్ చాలా సులభం. ఈ విధానాన్ని కర్ణాటకలోని బెంగళూరు-మైసూర్ నేషనల్ హైవే275 & హర్యానాలోని పానిపట్-హిసార్ నేషనల్ హైవే709 మధ్యలో శాటిలైట్ విధానం ద్వారా టోల్ వసూలు చేయడానికి సంబంధించిన ట్రైల్ కూడా విజయవంతంగా పూర్తయిందని గడ్కరీ పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఐస్క్రీమ్ బాలేదు.. రూ.1200 నాకిచ్చేయండి: స్విగ్గీపై ఎంపీ ఫైర్ఇప్పటికే ప్రయోగాత్మకంగా నిర్వహించిన శాటిలైట్ టోల్ కలెక్షన్ విజయవంతమవ్వడంతో.. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా త్వరలోనే ఈ సిస్టమ్ అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ విధానం గురించి వాహన వినియోగదారులలో అవగాహన కల్పించడానికి ఓ వర్క్షాప్ కూడా ఏర్పాటు చేసినట్లు గడ్కరీ పేర్కొన్నారు. మొత్తం మీద దేశంలో టోల్ గేట్స్ త్వరలోనే కనుమరుగయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.శాటిలైట్ విధానం ద్వారా టోల్ కలెక్షన్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అమలులోకి వచ్చిన తరువాత టోల్ ఫీజు చెల్లించడానికి ప్రత్యేకంగా.. వాహనాలను ఆపాల్సిన అవసరం లేదు. వాహనం ప్రయాణించిన దూరాన్ని శాటిలైట్ లెక్కగట్టి వ్యాలెట్ నుంచి అమౌట్ కట్ చేసుకుంటుంది. అయితే ఈ సిస్టమ్ కోసం వాహనదారులు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) చిప్ కల్గిన ఫాస్ట్ట్యాగ్ను వాహనానికి అతికించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ప్రయాణించిన దూరానికి అయ్యే మొత్తాన్ని ఆటోమాటిక్గా చెల్లించడానికి సాధ్యమవుతుంది.. -
ఆటో ఎక్స్పో 2025: ఆకట్టుకున్న ఈ విటారా
మారుతి సుజుకి (Maruti Suzuki) భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో తన మొట్ట మొదటి ఎలక్ట్రిక్ వెహికల్ ఈ విటారా (e Vitara)ను లాంచ్ చేసింది. Heartect-e ప్లాట్ఫామ్ ఆధారంగా నిర్మితమైన ఈ కారు.. విశాలమైన క్యాబిన్, దృఢమైన నిర్మాణం కలిగి ఉంటుంది. దీని ఉత్పత్తిని కంపెనీ గుజరాత్ ప్లాంట్లో త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది.సరికొత్త మారుతి సుజుకి ఈ విటారా ట్విన్ డెక్ ఫ్లోటింగ్ కన్సోల్తో కూడిన డిజిటల్ కాక్పిట్, కొత్త స్టీరింగ్ వీల్, ఫిక్స్డ్ గ్లాస్ సన్రూఫ్, మల్టీ కలర్ యాంబియంట్ లైటింగ్తో కూడిన సాఫ్ట్ టచ్ డ్యూయల్ టోన్ మెటీరియల్స్ వంటివి పొందుతుంది. వీటితో పాటు ఈ కారులో 10.1 ఇంచెస్ డిజిటల్ డిస్ప్లే, 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10-వే పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వెనుక సీటులోని ప్రయాణికుల కోసం 40:20:40 స్ప్లిట్ కాన్ఫిగరేషన్, రిక్లైనింగ్ అండ్ స్లైడింగ్ ఫంక్షనాలిటీ మొదలైనవన్నీ ఉన్నాయి.ఇదీ చదవండి: Auto Expo 2025: ఒక్క వేదికపై లెక్కలేనన్ని వెహికల్స్ఈ విటారా రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ పొందనుంది. అవి 49 కిలోవాట్, 61 కిలోవాట్ బ్యాటరీ. పెద్ద బ్యాటరీ ఆల్-వీల్-డ్రైవ్ (AWD) సిస్టమ్తో కూడా అందుబాటులో ఉంది. మారుతి ఖచ్చితమైన రేంజ్ వివరాలను అధికారికంగా వెల్లడించనప్పటికీ, పెద్ద బ్యాటరీ ప్యాక్ 500కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని సమాచారం. ధరలు కూడా కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే దీని ప్రారంభ ధర రూ. 17 లక్షలు ఉండే అవకాశం ఉంది.Get Ready to witness your dream car Maruti Suzuki’s Electric SUV e VITARA https://t.co/WNFuX1hGsM— Maruti Suzuki (@Maruti_Corp) January 17, 2025 -
Auto Expo 2025: ఒక్క వేదిక.. ఎన్నో వెహికల్స్
రెండేళ్లకు ఒకసారి జరిగే 'ఆటో ఎక్స్పో 2025' (Auto Expo 2025) కార్యక్రమాన్ని దేశ ప్రధానమంత్రి 'నరేంద్ర మోదీ' (Narendra Modi) ప్రారంభించారు. ఈ ఈవెంట్కు దిగ్గజ వాహన తయారీ సంస్థలు హాజరవుతాయి. ఇది ఈ రోజు (జనవరి 17) నుంచి 22వ తేదీ వరకు జరుగుతాయి. కాగా ఆటో ఎక్స్పో మొదటిరోజు లాంచ్ అయిన టూ వీలర్స్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.హోండా యాక్టివా ఈ (Honda Activa e)హోండా మోటార్సైకిల్ కంపెనీ గత ఏడాది మార్కెట్లో ఆవిష్కరించిన కొత్త 'యాక్టివా ఈ' (Activa e) ధరలను 'భారత్ మొబిలిటీ ఆటో ఎక్స్పో 2025' వేదికపై ప్రకటించింది. ఈ స్కూటర్ 1.17 లక్షల నుంచి రూ. 1.52 లక్షల మధ్య ఉంది. ఈ స్కూటర్ 1.5 కిలోవాట్ స్వాపబుల్ బ్యాటరీ పొందుతుంది. ఇది ఒక సింగిల్ ఛార్జితో 102 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. దీని టాప్ స్పీడ్ 80 కిమీ/గం. కాగా ఇది 7.3 సెకన్లలో 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది.హోండా క్యూసీ1 (Honda QC1)ఆటో ఎక్స్పోలో కనిపించిన టూ వీలర్లలో హోండా క్యూసీ1 కూడా ఒకటి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 90,000. ఇందులో 1.5 కిలోవాట్ బ్యాటరీ 80 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ 50 కిమీ/గం. ఈ స్కూటర్ 330 వాట్స్ ఛార్జర్ ద్వారా ఫుల్ ఛార్జ్ కావడానికి పట్టే సమయం 6:50 గంటలు. ఇది 9.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.టీవీఎస్ అపాచీ ఆర్టీఎక్స్ 300 (TVS RTX 300)టీవీఎస్ కంపెనీ కూడా భారత్ మొబిలిటీ ఆటో ఎక్స్పో 2025లో ఆర్టీఎక్స్ 30 బైకును ఆవిష్కరించింది. పలుమార్లు ఈ బైకును టెస్ట్ చేసిన తరువాత ఈ రోజు (జనవరి 17) అధికారికంగా ప్రదర్శించింది. ఇది బ్రాండ్ మొట్టమొదటి అడ్వెంచర్ బైక్. ఇందులోని 299 సీసీ ఇంజిన్ 35 హార్స్ పవర్, 27 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. కాబట్టి పనితీరు పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుందని సమాచారం.ఇదీ చదవండి: ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ పయనంటీవీఎస్ జుపీటర్ సీఎన్జీ (Bajaj Jupiter CNG)టీవీఎస్ కంపెనీ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో తన జుపీటర్ సీఎన్జీ ప్రదర్శించింది. ఈ స్కూటర్ ఫ్రీడమ్ 125 బైక్ మాదిరిగానే పెట్రోల్, సీఎన్జీతో పనిచేస్తుంది. కాబట్టి మంచి పనితీరును అందించడమే కాకుండా.. ఎక్కువ మైలేజ్ కూడా అందిస్తుందని సమాచారం. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇది దాదాపు స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. దీని ధర రూ. 1 లక్ష నుంచి రూ. 1.10 లక్షల మధ్య ఉంటుందని సమాచారం.టీవీఎస్, బజాజ్ బ్రాండ్ వెహికల్స్ మాత్రమే కాకుండా.. ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ, హీరో మోటోకార్ప్, రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలు కూడా ఈ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో తమ కొత్త వాహనాలను, రాబోయే వాహనాలను ప్రదర్శించే అవకాశం ఉందని తెలుస్తోంది. -
మార్కెట్లోకి హీరో కొత్త స్కూటర్
ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్రవాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (Hero MotoCorp).. న్యూ డెస్టినీ 125 (New Destini 125) స్కూటర్ను విడుదల చేసింది. దీంతో 125సీసీ స్కూటర్ మార్కెట్లో విస్తృత మార్పులకు శ్రీకారం చుట్టింది. అత్యాధునిక సాంకేతికత, అసాధారణమైన మైలేజ్, టైమ్లెస్ డిజైన్ను మిళితం చేస్తూ పట్టణ వాహనదారుల కోసం దీన్ని రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది.హీరో న్యూ డెస్టినీ 125 స్కూటర్.. డెస్టిని 125 వీఎక్స్, డెస్టిని 125 జెడ్ఎక్స్, డెస్టిని 125 జెడ్ఎక్స్ ప్లస్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ప్రారంభ ధరలు (ఢిల్లీ ఎక్స్-షోరూమ్) వరుసగా రూ.80,450, రూ.89,300, రూ.90,300.ప్రత్యేకంగా పట్టణ వాహనదారుల అవసరాలను తీర్చడానికి రూపొందించిన న్యూ డెస్టినీ 125.. వాహనదారుల భద్రత, సౌలభ్యం కోసం 30 పేటెంట్ అప్లికేషన్లతోపాటు ఇల్యూమినేటెడ్ స్టార్ట్ స్విచ్లు, ఆటో-కాన్సల్ వింకర్ల వంటి సరికొత్త ఫీచర్లతో వచ్చింది.‘హీరో డెస్టిని 125 అనేది మా ఆవిష్కరణ-ఆధారిత విధానానికి, పర్యావరణ అనుకూల చైతన్యాన్ని అందించడంలో మా నిబద్ధతకు నిదర్శనం. 59 కి.మీ మైలేజ్, అధునాతన ఫీచర్లతో ఈ స్కూటర్ ఆధునిక రైడర్లకు గేమ్-ఛేంజర్’ హీరో మోటోకార్ప్ ఇండియా బిజినెస్ యూనిట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రంజీవ్జిత్ సింగ్ పేర్కొన్నారు. -
మరింత పెరిగిన ఎప్రిలియా ఆర్ఎస్ 457 ధర
ఎప్రిలియా భారతదేశంలోని తన ఆర్ఎస్ 457 బైక్ ధరను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు రూ. 4.10 లక్షల ధర వద్ద లభించే ఈ మోటార్సైకిల్ ధర రూ. 4.20 లక్షలు (ఎక్స్ షోరూమ్) చేరింది. దీన్నిబట్టి చూస్తే దీని ధర మునుపటికంటే రూ.10,000 ఎక్కువని తెలుస్తోంది.డిసెంబర్ 2023లో ప్రారంభమైన ఆర్ఎస్ 457 బైక్ భారతదేశంలో ఉత్పత్తి అయినా మొదటి ఎప్రిలియా మోటార్సైకిల్. ఇది మహారాష్ట్రలోని బారామతిలో పియాజియో గ్రూప్ ఫెసిలిటీలో తయారైంది. చూడటానికి అద్భుతంగా కనిపించే ఈ బైక్ మూడు రైడింగ్ మోడ్లు, త్రీ లెవెల్ స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ పొందుతుంది.ఏప్రిలియా ఆర్ఎస్ 457 బైక్ 457 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజన్ పొందుతుంది. ఇది 47 బిహెచ్పి పవర్ అవుట్పుట్, 48 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ను అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్తో లభిస్తుంది. ఈ బైక్ మంచి పనితీరును అందిస్తుంది. కాబట్టి దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.ఏప్రిలియా ట్యూనో 457ఏప్రిలియా ఇప్పుడు ఆర్ఎస్ 457 నేక్డ్ కౌంటర్పార్ట్.. ట్యూనో 457ని లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఈ స్ట్రీట్ఫైటర్ EICMA 2024లో వెల్లడైంది. అయితే కంపెనీ బైక్కి సంబంధించిన ధరలు రాబోయే నెలల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఈ బైక్ కూడా ఆర్ఎస్ 457 వలె అదే ఇంజిన్ పొందుతుంది. కాబట్టి అదే పర్ఫామెన్స్ అందిస్తుందని సమాచారం. -
కొత్త లుక్లో ఎలివేట్ బ్లాక్ ఎడిషన్: రేటెంతో తెలుసా?
హోండా కంపెనీ.. ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 15.51 లక్షలు. కాగా ఎలివేట్ సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్ ధరలు రూ. 15.71 లక్షలు (ఎక్స్ షోరూమ్). బ్లాక్ ఎడిషన్ ఎలివేట్ టాప్-ఆఫ్-ది-లైన్ ZX గ్రేడ్ ఆధారంగా తయారైంది. ఇది మాన్యువల్, సీవీటీ గేర్బాక్స్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది.బ్లాక్ ఎడిషన్ కొత్త క్రిస్టల్ బ్లాక్ పెర్ల్ కలర్ పొందింది. ఇది బ్లాక్ అల్లాయ్ వీల్స్ & నట్లను పొందుతుంది. ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ ఎగువ గ్రిల్, సిల్వర్ ఫినిషింగ్ ఫ్రంట్ అండ్ రియర్ స్కిడ్ గార్నిష్లు, లోయర్ డోర్ గార్నిష్.. రూఫ్ రైల్స్పై క్రోమ్ యాక్సెంట్లను కలిగి ఉంది. వెనుకవైపు ప్రత్యేక 'బ్లాక్ ఎడిషన్' చిహ్నం ఉండటం చూడవచ్చు.సిగ్నేచర్ ఎడిషన్లో ఫ్రంట్ అప్పర్ గ్రిల్, ఫ్రంట్ అండ్ రియర్ స్కిడ్ గార్నిష్లు, రూఫ్ రెయిల్లు, డోర్ లోయర్ గార్నిష్ నలుపు రంగులో పూర్తయ్యాయి. ఇది ఫ్రంట్ ఫెండర్పై 'సిగ్నేచర్ ఎడిషన్' చిహ్నం ఉంది.రెండు ఎడిషన్లు ఆల్ బ్లాక్ ఇంటీరియర్ థీమ్ను కలిగి ఉన్నాయి. బ్లాక్ ఎడిషన్లో బ్లాక్ స్టిచింగ్తో బ్లాక్ లెథెరెట్ సీట్లు, బ్లాక్ డోర్ ప్యాడ్లు, ఆర్మ్రెస్ట్లు పీవీసీ, ఆల్ బ్లాక్ డ్యాష్బోర్డ్తో చుట్టి ఉంటాయి. సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్ అదనంగా రిథమిక్ 7 కలర్ యాంబియంట్ లైటింగ్ను పొందుతుంది.ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, లెథెరెట్ సీటింగ్, సింగిల్ పేన్ సన్రూఫ్, కెమెరా బేస్డ్ ఏడీఏఎస్, ఆటో హెడ్లైట్లు, వైపర్లు, సెమీ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్,7.0 ఇంచెస్ TFT డిస్ప్లే మాత్రమే కాకుండా ఆరు ఎయిర్బ్యాగ్లు ఉన్నాయి.హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ కూడా అదే 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా 121 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మాన్యువల్ లేదా CVT ఆటోమేటిక్ గేర్బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. భారతదేశంలోని హోండా డీలర్షిప్లలో ఈ కారు బుకింగ్లు ప్రారంభమయ్యాయి. సీవీటీ వేరియంట్ డెలివరీలు జనవరి నుంచి ప్రారంభమవుతాయి. మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్ డెలివరీలు ఫిబ్రవరి నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.ఇదీ చదవండి: భారత్లోని బెస్ట్ క్రూయిజర్ బైకులు ఇవే!హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ ఇండియన్ మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్, ఎంజీ ఆస్టర్ బ్లాక్స్టార్మ్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా బ్లాక్ ఎడిషన్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. అంతే కాకుండా ఇది హోండా ఎలివేట్ క్రెటా, సెల్టోస్, గ్రాండ్ విటారా, హైరిడర్, కుషాక్, టైగన్ వంటి వాటికి అమ్మకాల పరంగా పోటీ ఇస్తుంది.హోండా, నిస్సాన్ విలీనంజపాన్ ఆటోమొబైల్ దిగ్గజాలు హోండా, నిస్సాన్ విలీనం కానున్నట్లు ప్రకటించాయి. ఇందుకు సంబంధించి ఇరు సంస్థలు ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. నిస్సాన్కు వాటాలున్న మిత్సుబిషి మోటార్స్ కూడా తన వ్యాపారాన్ని విలీనం చేసే చర్చల్లో భాగమయ్యేందుకు అంగీకరించినట్లు కంపెనీలు వెల్లడించాయి. ఈ డీల్తో విలీన సంస్థ.. అమ్మకాలపరంగా ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆటోమొబైల్ కంపెనీగా ఆవిర్భవించనుంది. -
టీవీఎస్ జూపిటర్.. 70 లక్షల స్కూటర్లు
టీవీఎస్ మోటార్ కంపెనీ మరో ఘనతను సాధించింది. కంపెనీ తయారీ జూపిటర్ స్కూటర్ (TVS Jupiter) 70 లక్షల యూనిట్ల మార్కును చేరుకుంది. హోల్సేల్గా కంపెనీ 2024 నవంబర్ నాటికి 71,40,927 యూనిట్లను విక్రయించింది. 2013 సెప్టెంబర్ నుంచి సంస్థ మొత్తం 1.14 కోట్ల స్కూటర్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇందులో జూపిటర్ వాటా ఏకంగా 62 శాతం ఉంది.స్కూటర్స్ విభాగంలో సెగ్మెంట్లో దేశంలో రెండవ స్థానంలో ఉన్న జూపిటర్ 110, 125 సీసీ ఇంజన్ సామర్థ్యంలో లభిస్తోంది. 2024 మార్చి నాటికి 80,000 జూపిటర్ స్కూటర్లను కంపెనీ ఎగుమతి చేసింది. 2016 జూన్ నాటికి 10 లక్షల యూనిట్ల మార్కును సాధించింది. 2017 సెప్టెంబర్ నాటికి 20 లక్షల యూనిట్ల అమ్మకాలను సాధించింది. 2022 సెప్టెంబర్ నాటికి 50 లక్షల యూనిట్లను తాకింది.మరో 10 లక్షల యూనిట్లకు ఏడాది, ఆ తర్వాతి 10 లక్షలకు 14 నెలల సమయం తీసుకుంది. భారత స్కూటర్స్ పరిశ్రమలో రెండవ స్థానం దక్కించుకున్న టీవీఎస్కు 25 శాతం వాటా ఉంది. 2023–24లో 8,44,863 జూపిటర్ స్కూటర్స్ రోడ్డెక్కగా.. 2024–25 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–నవంబర్లో ఈ సంఖ్య 7,01,360 యూనిట్లు ఉంది. ప్రస్తుతం 110 సీసీలో నాలుగు, 125 సీసీలో మూడు వేరియంట్లలో జూపిటర్ లభిస్తోంది.సుజుకీ యాక్సెస్ 60 లక్షలు ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకీ మోటార్సైకిల్ ఇండియా కూడా ఇటీవల సరికొత్త రికార్డు సాధించింది. సుజుకీ యాక్సెస్ 125 (suzuki access 125) మోడల్లో కంపెనీ 60 లక్షల స్కూటర్ల తయారీ మార్కును దాటింది. ఈ ఘనతను సాధించడానికి సంస్థకు 18 ఏళ్లు పట్టింది. సుజుకీ మోటార్సైకిల్ ఇండియా నుంచి అత్యధికంగా అమ్ముడు అవుతున్న మోడల్ కూడా ఇదే.దీర్ఘకాలిక మన్నిక, మెరుగైన పనితీరు, మైలేజీ, నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండడంతో యాక్సెస్ 125 స్కూటర్కు కస్టమర్ల నుంచి దేశ విదేశాల్లో మంచి స్పందన ఉంది. భారత్తోపాటు అంతర్జాతీయంగా కస్టమర్ల నమ్మకానికి ఈ గణాంకాలే నిదర్శనమని కంపెనీ ఎండీ కెనిచి ఉమేద తెలిపారు. యాక్సెస్ 125 తొలిసారిగా భారత్లో 2006లో అడుగుపెట్టింది. భారత రోడ్లపై 125 సీసీ ఇంజన్ సామర్థ్యంతో పరుగెత్తిన తొలి స్కూటర్ కూడా ఇదే కావడం విశేషం.మూడవ స్థానంలో కంపెనీ..దేశవ్యాప్తంగా 2024 ఏప్రిల్–నవంబర్ మధ్య వివిధ కంపెనీలకు చెందిన 47,87,080 స్కూటర్లు రోడ్డెక్కాయి. ఇందులో సుజుకీ మోటార్సైకిల్ ఇండియా 14 శాతం వాటాతో మూడవ స్థానంలో ఉంది. గతేడాదితో పోలిస్తే 2024 ఏప్రిల్–నవంబర్లో కంపెనీ 18 శాతం దూసుకెళ్లి 6,84,898 యూనిట్ల స్కూటర్ల అమ్మకాలను సాధించింది. సుజుకీ ఎకో పెర్ఫార్మెన్స్ టెక్నాలజీతో 125 సీసీ ఎయిర్కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్తో ఇది రూపుదిద్దుకుంది.5,500 ఆర్పీఎం వద్ద 10 ఎన్ఎం గరిష్ట టార్క్ అందిస్తుంది. బ్లూటూత్ ఆధారిత డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఏర్పాటు చేశారు. కాల్స్, ఎస్ఎంఎస్, వాట్సాప్ అలర్ట్స్, మిస్డ్ కాల్ అలర్ట్స్ అందుకోవచ్చు. స్పీడ్ వార్నింగ్, ఫోన్ బ్యాటరీ లెవెల్ డిస్ప్లే, గమ్యస్థానానికి చేరుకునే సమయం వంటివి తెలుసుకోవచ్చు. 22.3 లీటర్ల స్టోరేజ్, ఈజీ స్టార్ట్ కీ సిస్టమ్, పొడవైన సీటు వంటివి అదనపు హంగులు. -
భారత్లోని బెస్ట్ క్రూయిజర్ బైకులు ఇవే!
మార్కెట్లో సాధారణ బైకులకు మాత్రమే కాకుండా.. క్రూయిజర్ మోటార్సైకిళ్లకు కూడా జనాదరణ లభిస్తోంది. దీంతో చాలామంది ఈ బైకులను కొనొగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కథనంలో భారతదేశంలో అమ్మకానికి ఉన్న టాప్ 5 బెస్ట్ క్రూయిజర్ బైకుల గురించి వివరంగా తెలుసుకుందాం.కవాసకి డబ్ల్యు175 (Kawasaki W175)భారతదేశంలో అత్యంత సరసమైన క్రూయిజర్ బైకులలో కవాసకి డబ్ల్యు175 ఒకటి. దీని ప్రారంభ ధర రూ. 1.22 లక్షలు. ఈ బైకులోని 177 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 12.8 హార్స్ పవర్, 12.2 ఏంఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 45 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. మంచి డిజైన్, స్పోక్డ్ రిమ్స్.. అల్లాయ్ వీల్స్ కలిగిన ఈ బైక్ సస్పెన్షన్, బ్రేకింగ్ సిస్టమ్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి.టీవీఎస్ రోనిన్ (TVS Ronin)చూడగానే ఆకర్శించే డిజైన్ కలిగిన టీవీఎస్ రోనిన్ ధరలు రూ. 1.35 లక్షల నుంచి రూ. 1.72 లక్షల మధ్య ఉన్నాయి. ఇందులోని 225.9 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 20.1 హార్స్ పవర్, 19.93 Nm టార్క్ అందిస్తుంది. ఇది 42.95 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. ఈ బైకులో లేటెస్ట్ ఫీచర్స్.. సస్పెన్షన్ సిస్టమ్ వంటివన్నీ ఉన్నాయి. ఇది నగరంలో, హైవేపై రైడింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.బజాజ్ అవెంజర్ 220 (Bajaj Avenger 220)మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ క్రూయిజర్ బైకులలో బజాజ్ అవెంజర్ 220 కూడా ఒకటి. దీని ధర రూ. 1.45 లక్షలు. ఇందులో 18.76 హార్స్ పవర్, 17.55 న్యూటన్ మీటర్ టార్క్ అందించే 220 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. 40 కిమీ / లీ మైలేజ్ అందించే ఈ బైక్ రెట్రో డిజైన్ కలిగి ట్విన్ షాక్ రియర్ సస్పెన్షన్ సెటప్ పొందుతుంది. కాబట్టి ఇది లాంగ్ రైడ్ చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.క్యూజే ఎస్ఆర్సీ 250 (QJ SRC 250)మార్కెట్లో అందుబాటులో ఉన్న క్యూజే ఎస్ఆర్సీ 250 బైక్ ప్రారంభ ధర రూ. 1.49 లక్షలు. 50 కిమీ / లీ మైలేజ్ అందించే ఈ బైక్ 249 సీసీ ట్విన్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 17.4 హార్స్ పవర్, 17 Nm టార్క్ అందిస్తుంది. ఈ బైక్ రోజు వారీ వినియోగానికి మాత్రమే కాకుండా లాంగ్ రైడ్ చేయడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ఇదీ చదవండి: ఆరు నెలల్లో 40000 మంది కొన్న బైక్ ఇదిరాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 (Royal Enfield Hunter 350)రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీకి చెందిన సరసమైన బైక్ ఈ హంటర్ 350. దీని ప్రారంభ ధర రూ. 1.49 లక్షలు. ఇందులో 349 సీసీ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ 20.2 హార్స్ పవర్, 27 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 36 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. అత్యంత ఆకర్షణీయమైన క్రూయిజర్ బైకులలో ఒకటైన హంటర్ 350 మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. -
మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 450 లాంచ్: ధర ఎంతంటే?
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్' (Mercedes Benz) మార్కెట్లో 'ఈక్యూఎస్ 450' (EQS 450) లాంచ్ చేసింది. దీని ధర ఇప్పటికే అమ్మకానికి అందుబాటులో ఉన్న ఈక్యూఎస్ కంటే తక్కువ. ఇది 5 సీటర్ మోడల్.. కేవలం సింగిల్ మోటార్ సెటప్తో వస్తుంది. ఈ కారు డెలివరీలు ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.రూ. 1.28 కోట్ల ధర వద్ద లాంచ్ అయిన కొత్త మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 450 చూడటానికి దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే కనిపిస్తుంది. కానీ ఇందులో కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ గమనించవచ్చు. ఈ కారు రేంజ్ కూడా దాని 580 మోడల్ కంటే 11 కిమీ కంటే ఎక్కువ. రేంజ్ కొంత ఎక్కువ ఉంది కాబట్టి మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉందని తెలుస్తోంది.కొత్త మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 450 ఎలక్ట్రిక్ కారు.. ముందు బంపర్, అల్లాయ్ వీల్స్ వంటి వాటిలో కొన్ని చిన్న మార్పులు చూడవచ్చు. ఇంటీరియర్ కూడా కొంత అప్డేట్స్ పొందుతుంది. ఇందులో MBUX హైపర్స్క్రీన్ చూడవచ్చు. లోపల గమనించాల్సిన అతిపెద్ద మార్పు మూడో వరుస సీట్లు లేకపోవడం. అయితే రెండవ వరుస సీట్లు పవర్ అడ్జస్టబుల్గా కొనసాగుతాయి. ఎక్కువ సౌలభ్యం కోసం స్లైడ్ అండ్ రిక్లైన్ రెండూ చేయవచ్చు.ఈ కొత్త లగ్జరీ కారులో 360 డిగ్రీ కెమెరా, ఎయిర్ వెంట్స్, 4 జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సాఫ్ట్ క్లోజ్ డోర్లు, పుడ్ ల్యాంప్స్, ఇల్యూమినేటెడ్ రన్నింగ్ బోర్డ్లతో పాటు లెవల్ 2 ఏడీఏఎస్, తొమ్మిది ఎయిర్బ్యాగ్లు మొదలైనవి ఉన్నాయి.బెంజ్ ఈక్యూఎస్ 450 ఎలక్ట్రిక్ కారు వెనుక యాక్సిల్పై సింగిల్ మోటార్ సెటప్ ఉంటుంది. ఇది 355 Bhp పవర్, 800 Nm టార్క్ అందిస్తుంది. ఈ కారు 6.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేహవంతం అవుతుంది. ఇందులోని 122 కిలోవాట్ బ్యాటరీ.. సింగిల్ ఛార్జీతో 671 కిమీ రేంజ్ అందిస్తుంది.ఇదీ చదవండి: భారత్లోని బెస్ట్ డీజిల్ కార్లు.. ధర కూడా తక్కువే!ఈక్యూఎస్ 450 ఎలక్ట్రిక్ కారు 200 కేడబ్ల్యు డీసీ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేయడానికి 31 నిమిషాల సమయం పడుతుంది. అయితే 22 కేడబ్ల్యు వాల్ ఛార్జర్ ద్వారా 0 నుంచి 100 శాతం ఛార్జ్ కావడానికి పట్టే సమయం 6.25 గంటలు. ఈ కారు డెలివరీలు కూడా ఫిబ్రవరిలోనే జరుగుతాయి.ఇండియన్ మార్కెట్లో బెంజ్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ.. ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ లాంచ్ చేస్తోంది. ఇందులో భాగంగానే మెర్సిడెస్ బెంజ్ జీ క్లాస్ ఎలక్ట్రిక్ కారును కూడా లాంచ్ చేసింది. దీని ధర రూ. 3 కోట్ల కంటే ఎక్కువ. ఇది ఒక సింగిల్ చార్జితో 473 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. -
2025లో బెస్ట్ డీజిల్ కార్లు.. ధర కూడా తక్కువే!
భారతదేశంలో డీజిల్ కార్ల ఉత్పత్తి, వినియోగం బాగా తగ్గిపోయింది. దీనికి కారణం కఠినమైన ఉద్గార నిబంధనలు. అయితే కొంతమంది ఇప్పటికి కూడా డీజిల్ కార్లను ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి ఈ కథనంలో రూ. 10 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బెస్ట్ మోడల్స్ గురించి తెలుసుకుందాం.టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz)దేశీయ వాహన తయారీ సంస్థ 'టాటా మోటార్స్'కు చెందిన 'ఆల్ట్రోజ్' ప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో ఉన్న చౌకైన డీజిల్ వెహికల్. దీని ప్రారంభ ధర రూ. 8.69 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులో 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 90 హార్స్ పవర్, 200 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది.మహీంద్రా బొలెరో (Mahindra Bolero)మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన 'బొలెరో' గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువమందికి ఇష్టమైన కారు. ఇది 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ కలిగి.. 76 హార్స్ పవర్, 210 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్బాక్స్ ఎంపికలో లభిస్తుంది. బీఎస్ 4 బొలెరో డీజిల్ వెర్షన్ ప్రారంభ ధర రూ. 9.79 లక్షలు (ఎక్స్ షోరూమ్).కియా సోనెట్ (Kia Sonet)కియా సోనెట్ అనేది కూడా 10 లక్షల లోపు ధర వద్ద లభించే బెస్ట్ డీజిల్ కారు. ఇందులోని 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇది 115 హార్స్ పవర్, 253 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సోనెట్ డీజిల్ వెర్షన్ ప్రారంభ ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్ షోరూమ్).మహీంద్రా బొలెరో నియో (Mahindra Bolero Neo)మహీంద్రా బొలెరో నియో 100 హార్స్పవర్ & 210 ఎన్ఎమ్ టార్క్ అందించే 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ పొందుతుంది. ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్బాక్స్ ద్వారా ఉత్తమ పనితీరును అందిస్తుంది. మహీంద్రా బొలెరో నియో ప్రారంభ ధర రూ. 9.94 లక్షలు (ఎక్స్ షోరూమ్).మహీంద్రా XUV 3ఎక్స్ఓXUV 3XO కూడా మన జాబితాలో చెప్పుకోదగ్గ డీజిల్ వెర్షన్. రూ. 9.98 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభించే ఈ కారు 115 హార్స్ పవర్, 300 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ ఆటోమాటిక్ గేర్బాక్స్ లేదా మాన్యువల్ గేర్బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. కాబట్టి ఇది మంచి పనితీరును అందిస్తుంది.ఇదీ చదవండి: అప్పుడు కల కనింది: ఇప్పుడు కొనేసింది.. వీడియో చూశారా?డీజిల్ కార్లకు తగ్గిన డిమాండ్కఠినమైన ఉద్గార ప్రమాణాలు అమలులోకి వచ్చిన తరువాత డీజిల్ కార్లకు డిమాండ్ క్రమంగా తగ్గింది. అంతే కాకుండా కాలుష్య నివారణను దృష్టిలో ఉంచుకుని కూడా ప్రభుత్వం డీజిల్ కార్ల వినియోగాన్ని నిషేధిస్తోంది. ఇవి మాత్రమే కాకుండా.. పెట్రోల్ కార్ల ధరల కంటే కూడా డీజిల్ కార్ల ధరలు కొంత ఎక్కువగా ఉండటం కూడా ఈ కార్ల డిమాండ్ తగ్గిపోవడానికి కారణమైంది. -
వాహన రిటైల్ విక్రయాల్లో 9 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 2024లో ఆటోమొబైల్ రిటైల్ అమ్మకాలు 2,61,07,679 యూనిట్లు నమోదైంది. 2023తో పోలిస్తే విక్రయాలు గతేడాది 9 శాతం పెరిగాయని డీలర్ల సంఘం ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) మంగళవారం తెలిపింది. సవాళ్లతో కూడిన వ్యాపార వాతావరణం మధ్య ద్విచక్ర, ప్యాసింజర్ వాహనాలకు బలమైన డిమాండ్ నేపథ్యంలో ఈ వృద్ధి నమోదైందని ఫెడరేషన్ వెల్లడించింది. ప్యాసింజర్ వెహికిల్స్ అమ్మకాలు 2023తో పోలిస్తే 5 శాతం వృద్ధితో గతేడాది 40,73,843 యూనిట్లుగా ఉన్నాయి. ద్విచక్ర వాహనాల విక్రయాలు 11 శాతం దూసుకెళ్లి 1,89,12,959 యూనిట్లకు చేరుకున్నాయి. త్రీవీలర్స్ రిజిస్ట్రేషన్లు 11 శాతం ఎగసి 12,21,909 యూనిట్లను తాకాయి. ట్రాక్టర్ల అమ్మకాలు 3 శాతం వృద్ధితో 8,94,112 యూనిట్లకు చేరాయి. వాణిజ్య వాహనాల విక్రయాలు 10,04,856 యూనిట్ల వద్ద స్థిరంగా ఉన్నాయి. నిలకడగా పరిశ్రమ.. వేడిగాలులు, కేంద్రం, రాష్ట్ర స్థాయిలలో ఎన్నికలు, అసమాన రుతుపవనాలతో సహా పలు ఎదురుగాలులు ఉన్నప్పటికీ వాహన రిటైల్ పరిశ్రమ 2024లో నిలకడగా ఉందని ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ సి.ఎస్.విఘ్నేశ్వర్ తెలిపారు. ‘మెరుగైన సరఫరా, తాజా మోడళ్లు, బలమైన గ్రామీణ డిమాండ్ ద్విచక్ర వాహన విభాగంలో వృద్ధిని పెంచాయి. అయినప్పటికీ ఆర్థిక పరిమితులు, ఎలక్ట్రిక్ విభాగం నుంచి పెరుగుతున్న పోటీ సవాళ్లను కలిగిస్తూనే ఉన్నాయి. ప్యాసింజర్ వెహికల్ (పీవీ) విభాగం బలమైన నెట్వర్క్ విస్తరణ, ఉత్పత్తి లాంచ్ల నుండి ప్రయోజనం పొందింది. అధిక ఇన్వెంటరీ కారణంగా లాభాలపై ఒత్తిళ్లు ఏర్పడి ద్వితీయార్థంలో డిస్కౌంట్ల యుద్ధానికి దారితీసింది. ఎన్నికల ఆధారిత అనిశ్చితి, తగ్గిన మౌలిక సదుపాయాల మధ్య వాణిజ్య వాహనాల విభాగం పనితీరు స్తబ్ధుగా ఉంది’ అని వివరించారు. -
ఈ టూవీలర్స్ అమ్మకాలు.. వీటిదే ఆధిపత్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో డిసెంబర్ నెలలో 'బజాజ్ చేతక్' (Bajaj Chetak) తొలి స్థానంలోకి దూసుకొచ్చింది. గత నెలలో 18,276 యూనిట్లతో బజాజ్ ఆటో 25 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది. 2020 జనవరిలో ఎలక్ట్రిక్ చేతక్ ద్వారా స్కూటర్స్ రంగంలోకి బజాజ్ రీ-ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. ఈ-టూ వీలర్స్ విభాగంలో దేశంలో ఒక నెల అమ్మకాల్లో తొలి స్థానాన్ని కైవసం చేసుకోవడం సంస్థకు ఇదే తొలిసారి. డిసెంబర్ నెలలో 17,212 యూనిట్లతో టీవీఎస్ మోటార్ కంపెనీ రెండవ స్థానంలో నిలిచింది.నవంబర్ వరకు తొలి స్థానంలో కొనసాగిన ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) గత నెలలో అతి తక్కువగా 13,769 యూనిట్లతో 19 శాతం వాటాతో మూడవ స్థానానికి పరిమితమైంది. 2024లో కంపెనీకి అతి తక్కువ విక్రయాలు నమోదైంది డిసెంబర్ నెలలోనే కావడం గమనార్హం. అక్టోబర్లో 41,817 యూనిట్ల అమ్మకాలు సాధించిన ఓలా ఎలక్ట్రిక్ నవంబర్లో 29,252 యూనిట్లను నమోదు చేసింది.హోండా ఎలక్ట్రిక్ (Honda Electric) టూ వీలర్లు రోడ్డెక్కితే ఈ ఏడాది మార్కెట్ మరింత రసవత్తరంగా మారడం ఖాయంగా కనపడుతోంది. సంప్రదాయ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ఐసీఈ) ఆధారత టూవీలర్ రంగాన్ని ఏలుతున్న దిగ్గజాలే ఎలక్ట్రిక్ విభాగాన్ని శాసిస్తాయనడంలో అతిశయోక్తి లేదు. ప్రతి నెల నమోదవుతున్న అమ్మకాలే ఇందుకు నిదర్శనం.రెండింటిలో ఒకటి ఈవీ..భారత త్రిచక్ర వాహన రంగంలో ఎలక్ట్రిక్ త్రీవీలర్లు దూకుడుమీదున్నాయి. భారత ఈవీ రంగంలో టూవీలర్ల తర్వాత త్రీవీలర్లు రెండవ స్థానంలో నిలిచాయి. 2024లో దేశవ్యాప్తంగా మొత్తం 6,91,011 యూనిట్ల ఈ-త్రీవీలర్స్ రోడ్డెక్కాయి. భారత్లో గతేడాది ఎలక్ట్రిక్, ఐసీఈ, సీఎన్జీ, ఎల్పీజీ విభాగాల్లో కలిపి మొత్తం 12,20,925 యూనిట్ల త్రిచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. ఇందులో ఎలక్ట్రిక్ వాటా ఏకంగా 56 శాతం ఉంది. అంటే అమ్ముడవుతున్న ప్రతి రెండింటిలో ఒకటి ఎలక్ట్రిక్ కావడం విశేషం.ఎలక్ట్రిక్ త్రీవీలర్స్లో నాయకత్వ స్థానాన్ని కొనసాగిస్తున్న మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ 10 శాతం వాటా సాధించింది. వేగంగా దూసుకొచ్చిన బజాజ్ ఆటో 6 శాతం వాటాతో మూడవ స్థానాన్ని కైవసం చేసుకుంది. 2023లో అమ్ముడైన 5,83,697 యూనిట్ల ఎలక్ట్రిక్ త్రీవీలర్లతో పోలిస్తే 2024 విక్రయాల్లో 18 శాతం వృద్ధి నమోదైంది.2023లో సగటున ఒక నెలలో 48,633 యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళితే గతేడాది ఈ సంఖ్య నెలకు 57,584 యూనిట్లకు ఎగసింది. ఐసీఈ, సీఎన్జీ, ఎల్పీజీ ఆప్షన్స్తో పోలిస్తే నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండడం వల్లే ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లకు డిమాండ్ పెరుగుతోంది. మెరుగైన రుణ లభ్యత, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, అందుబాటులోకి విభిన్న మోడళ్లు, సరుకు రవాణాకై లాజిస్టిక్స్ కంపెనీల నుంచి డిమాండ్ ఇందుకు మరింత ఆజ్యం పోస్తోంది. త్రీవీలర్స్లో సీఎన్జీ విభాగానికి 28 శాతం వాటా కాగా, డీజిల్కు 11, ఎల్పీజీ 3, పెట్రోల్కు ఒక శాతం వాటా ఉంది.పోటీలో నువ్వా నేనా..రెండవ స్థానంలో ఉన్న టీవీఎస్ మోటార్ కంపెనీతో నువ్వా నేనా అన్నట్టు పోటీపడుతూ.. 2024 సెప్టెంబర్లో 19,213 యూనిట్లతో తొలిసారిగా బజాజ్ ఆటో రెండవ స్థానాన్ని పొంది టీవీఎస్ను మూడవ స్థానానిని నెట్టింది. అక్టోబర్, నవంబర్లో టీవీఎస్కు గట్టి పోటీ ఇచ్చిన బజాజ్ ఆటో మూడవ స్థానానికి పరిమితమైంది.ఇక 2020 జనవరి నుంచి 2023 నవంబర్ వరకు బజాజ్ ఆటో మొత్తం 1,04,200 యూనిట్ల అమ్మకాలను సాధించింది. తొలి లక్ష యూనిట్లకు కంపెనీకి 47 నెలల సమయం పట్టింది. 2024లో ఏకంగా 2 లక్షల యూనిట్ల విక్రయాలకు చేరువైంది. గతేడాది సంస్థ మొత్తం 1,93,439 యూనిట్ల అమ్మకాలతో భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో మూడవ స్థానంలో ఉంది. ఓలా ఎలక్ట్రిక్ 4,07,547 యూనిట్లతో మొదటి, టీవీఎస్ మోటార్ కో 2,20,472 యూనిట్లతో రెండవ స్థానంలో నిలిచాయి. -
ఓలాకు బజాజ్ గట్టి దెబ్బ
ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న ఓలా ఎలక్ట్రిక్కు (Ola Electric) బజాజ్ (Bajaj Auto) గట్టి దెబ్బ కొట్టింది. 2024 డిసెంబర్లో ఓలా ఎలక్ట్రిక్ని అధిగమించి ఎలక్ట్రిక్ టూ-వీలర్ (Electric Two-Wheeler) మార్కెట్లో కొత్త లీడర్గా అవతరించింది. వాహన్ పోర్టల్లోని రిటైల్ సేల్స్ డేటా ప్రకారం.. బజాజ్ ఇప్పుడు 25% మార్కెట్ వాటాను కలిగి ఉంది. మునుపటి నెల కంటే 3 శాతం వాటాను పెంచుకుంది.మరోవైపు తీవ్రమైన పోటీలో ఓలా ఎలక్ట్రిక్ వెనుకబడిపోయింది. 2024 డిసెంబర్లో కంపెనీ మార్కెట్ వాటా 19%కి పడిపోయింది. అంతకుముందు నెలతో పోల్చితే ఇది 5% క్షీణించింది. దీంతో మూడో స్థానానికి పరిమితమైంది. ఇక టీవీఎస్ (TVS) మోటార్స్ 23% మార్కెట్ వాటాతో రెండవ అతిపెద్ద ప్లేయర్గా తన స్థానాన్ని నిలుపుకొంది.బజాజ్ విజయానికి కారణాలుబజాజ్ ఆటో వృద్ధికి దాని చేతక్ 35 సిరీస్ వ్యూహాత్మక లాంచ్ కారణమని చెప్పవచ్చు. ఫీచర్-రిచ్ స్కూటర్లను తక్కువ ఉత్పత్తి ఖర్చుతో దాని మునుపటి మోడళ్ల కంటే 45% తక్కువకే టీవీఎస్ అందిస్తోంది. ఇది తక్కువ ధరలో ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్లను కోరుకునే వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంది.తీవ్ర పోటీఎలక్ట్రిక్ టూవీలర్లకు ఆదరణ పెరుగుతుండటంతో ఈ మార్కెట్లో ప్రస్తుతం పోటీ తీవ్రంగా మారింది. భిన్న వ్యూహాలతో కంపెనీలు వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. టీవీఎస్ వివిధ బ్యాటరీ సామర్థ్యాలతో (2-4 kWh) స్కూటర్లను అందించడం ద్వారా తన పోర్ట్ఫోలియోను విస్తరించింది. ముఖ్యంగా కంపెనీ ఫ్లాగ్షిప్ ఐ-క్యూబ్ (I-Qub) 250 ప్రత్యేక ఈవీ అవుట్లెట్లతో సహా దాదాపు 4,000 స్టోర్లలో అందుబాటులో ఉంది.మరో కంపెనీ ఏథర్ ఎనర్జీ తన ఫ్యామిలీ-ఓరియెంటెడ్ రిజ్టా స్కూటర్ను విడుదలతో ముఖ్యంగా గుజరాత్, మహారాష్ట్ర వంటి బలమైన ఈవీ మార్కెట్లను ఆకట్టుకుంది. అంతేకాకుండా ఉత్తర భారతదేశమంతటా తన ఉనికిని విస్తరించడంపై కూడా కంపెనీ దృష్టి సారిస్తోంది.ఓలాకు సవాళ్లుఒకప్పుడు ఈవీ మార్కెట్లో ఆధిపత్యం చెలాయించిన ఓలా ఎలక్ట్రిక్.. ఇప్పుడు పెరిగిన పోటీ, ధరల సవాళ్ల కారణంగా మార్కెట్ వాటాలో తిరోగమనాన్ని చవిచూసింది. ఎస్1 (Ola S1) స్కూటర్ స్వాపింగ్ బ్యాటరీ వెర్షన్ను రూ.59,999కే ప్రారంభించడం, తమ నెట్వర్క్ను 800 నుండి 4,000 స్టోర్లకు విస్తరించడం వంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కంపెనీ తన ఆధిక్యాన్ని కొనసాగించలేకపోయింది. -
హార్లే - హీరో సరికొత్త బైక్: త్వరలో..
మార్కెట్లో అప్డేటెడ్ బైకులు పెరుగుతున్న తరుణంలో.. కొత్త వెర్షన్స్ను పరిచయం చేసేందుకు అమెరికన్ బ్రాండ్ 'హార్లే డేవిడ్సన్'తో సహకారాన్ని విస్తరించినట్టు హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) తెలిపింది.హీరో మోటోకార్ప్ & హార్లే డేవిడ్సన్ మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగానే.. కొత్త వెర్షన్ హార్లే డేవిడ్సన్ ఎక్స్440 (Harley Davidson X440) బైక్ రానుంది. ఈ రెండు కంపెనీల సహకారంతో తయారైన తొలి మోడల్ 'ఎక్స్ 440'. ఇది గతేడాది మార్కెట్లో అడుగుపెట్టింది. మంచి అమ్మకాలను కూడా పొందుతోంది.హీరో మోటోకార్ప్.. హార్లే డేవిడ్సన్ మధ్య భాగస్వామ్యం 2020 అక్టోబరులో జరిగింది. ఆ తరువాత దేశంలో హార్లే డేవిడ్సన్ బ్రాండ్ ప్రీమియం మోటార్సైకిళ్లను అభివృద్ధి చేసి హీరో మోటోకార్ప్ విక్రయిస్తుంది. సర్వీస్, విడిభాగాల సరఫరా బాధ్యత కూడా హీరో మోటోకార్ప్ చేపట్టింది. -
అడవుల్లో సైతం అవలీలగా వెళ్లే వెహికల్ ఇదే (ఫోటోలు)
-
త్వరలో అతిపెద్ద మోటార్సైకిల్ వేలం: కనిపించనున్న అరుదైన వాహనాలు ఇవే (ఫోటోలు)
-
మూడేళ్లలో మూడింతల ఆదాయం
న్యూఢిల్లీ: కార్ సర్వీసెస్ (Car service), రిపేర్ (Car repair) ప్లాట్ఫామ్ గోమెకానిక్ (GoMechanic) మూడేళ్లలో నికర ఆదాయం మూడింతలకుపైగా అధికమై రూ.700 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తోంది. ఆ తర్వాత పబ్లిక్ లిస్టింగ్కు (IPO) వెళ్తామని కంపెనీ కో–ఫౌండర్, సీఈవో హిమాన్షు అరోరా తెలిపారు. ప్రస్తుతం 3 శాతం మార్కెట్ వాటా కలిగి ఉన్నామని, మూడేళ్లలో దీనిని 10 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ద్విచక్ర, ఎలక్ట్రిక్ వెహికిల్స్ సర్వీసెస్ విభాగంలోకి ప్రవేశిస్తామన్నారు.‘కంపెనీ ప్రస్తుతం 125 నగరాల్లో 800 గరాజ్ల ద్వారా సేవలను అందిస్తోంది. 2027 నాటికి 500 నగరాల్లో 2,500 గరాజ్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం’ అని వివరించారు. గతంలో ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు బయటపడడంతో కంపెనీని ఇన్వెస్టర్లు అమ్మకానికి పెట్టారు. లైఫ్లాంగ్ గ్రూప్ అనుబంధ కంపెనీ సర్వీజ్జీ 2023 మార్చిలో గోమెకానిక్ను కొనుగోలు చేసింది. 8 లక్షల మంది కస్టమర్లు.. గోమెకానిక్ 2023–24లో రూ.210 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్లో రూ.85 కోట్లు నమోదు చేసింది. ‘విడిభాగాలు, ఉపకరణాల అమ్మకాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. వీటి విక్రయాలు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.432 కోట్లు నమోదయ్యే అవకాశం ఉంది. నికర రాబడి దాదాపు రూ.200 కోట్లకు చేరుకుంటాం’ అని అరోరా చెప్పారు. యాక్టివ్ కస్టమర్లు నెలకు 8 లక్షలు ఉన్నారని గోమెకానిక్ కో–ఫౌండర్, సీవోవో ముస్కాన్ కక్కర్ వివరించారు. నిర్వహణ లాభం నమోదు చేస్తున్నామని, 2027 నాటికి నికరలాభం అందుకుంటామని ఆమె వెల్లడించారు. కంపెనీ రోల్స్పై 550 మంది, ఫ్రాంచైజీ నెట్వర్క్లో 4,000 మంది పనిచేస్తున్నారని వివరించారు. -
రూ.8.89 లక్షల కొత్త ట్రయంఫ్ బైక్ ఇదే..
ప్రముఖ వాహన తయారీ సంస్థ 'ట్రయంఫ్ మోటార్సైకిల్' (Triumph Motorcycle).. భారతదేశంలో రూ. 8.89 లక్షల (ఎక్స్ షోరూమ్) విలువైన 'స్పీడ్ ట్విన్ 900' (Speed Twin 900) లాంచ్ చేసింది. ఇది దాను మునుపటి అన్ని మోడల్స్ కంటే కూడా కొంత ఎక్కువ అప్డేట్స్ పొందినట్లు తెలుస్తోంది.ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ 900 బైకులో 900 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజన్ ఉంటుంది. ఇది 65 హార్స్ పవర్, 80 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఈ అప్డేటెడ్ బైక్ లేటెస్ట్ యూరో 5 ప్లస్ నిబంధనలకు అనుగుణంగా ఉంది.కొత్త ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ 900 ఇప్పుడు ఎక్కువ బ్లాక్ అవుట్ ఎలిమెంట్స్ పొందుతుంది. ఇచ్చి చూడటానికి స్పీడ్ ట్విన్ 1200ని పోలి ఉంటుంది. అయితే ఇందులో యూఎస్డీ ఫ్రంట్ ఫోర్క్, బ్రాండెడ్ రేడియల్ కాలిపర్ను కలిగి ఉంది. ఈ బైక్ సీటు ఎత్తు 900 మిమీ వరకు ఉంది. సింగిల్-పాడ్ డిజి-అనలాగ్ డిస్ప్లే స్థానంలో TFT యూనిట్ ఉంటుంది.ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ 900 బైక్ ఇప్పుడు మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని డెలివరీలు 2025 జనవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. స్పీడ్ ట్విన్ 900 పర్ఫామెన్స్ కూడా ఉత్తమంగా ఉంటుందని భావిస్తున్నారు.Your journey to making every ride exceptional begins here. The new Speed Twin 900 is priced from ₹ 8 89 000* /- Ex showroom Delhi.Discover more: https://t.co/AUDQTKfjrc#SpeedTwin900 #MeetTheNewOriginal #MakeEveryRideExceptional #TriumphMotorcycles #ForTheRide pic.twitter.com/gMiAku7wtS— TriumphIndiaOfficial (@IndiaTriumph) December 23, 2024 -
సెల్ఫీ కొట్టు.. స్కూటర్ పట్టు: ఎలా అంటే?
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric).. సరికొత్త ఎస్1 ప్రో 'సోనా' లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్ను తీసుకు వస్తున్నట్లు వెల్లడించింది. ఈ స్కూటర్ ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఇతర స్కూటర్ల కంటే కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఈ స్కూటర్ సొంతం చేసుకోవాలంటే డబ్బు చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. ఇంకెలా ఈ స్కూటర్ సొంతం చేసుకోవచ్చో ఈ కథనంలో తెలుసుకుందాం.ఓలా ఎలక్ట్రిక్ పరిచయం చేసిన కొత్త ఎస్1 ప్రో 'సోనా' లిమిటెడ్ ఎడిషన్ గోల్డ్ కలర్ ఎలిమెంట్స్ పొందుతుంది. కాబట్టి వీల్స్, మిర్రర్స్ వంటివన్నీ కూడా బంగారు రంగులో ఉండటం చూడవచ్చు. ఈ స్కూటర్ డ్యూయెల్ టోన్ డిజైన్ థీమ్తో పెర్ల్ వైట్, గోల్డ్ రంగులను పొందుతుంది.ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లిమిటెడ్ ఎడిషన్ ఆఫర్లో మరింత పర్సనలైజ్డ్ అనుభవం కోసం రూపొందించిన ప్రత్యేక ఫీచర్లతో వస్తోంది. ఇందులో మూవ్ ఓఎస్ సాఫ్ట్వేర్ కూడా లభిస్తుంది. ఈ మోడల్ గోల్డ్ థీమ్ యూజర్ ఇంటర్ఫేస్, కస్టమైజ్డ్ మూవ్ఓఎస్ డ్యాష్బోర్డ్ని పొందుతుంది. వ్యక్తిగత ప్రాధాన్యతలకు అనుగుణంగా పర్సనలైజ్డ్ చేసుకునేందుకు మరింత సూక్ష్మమైన, ప్రీమియం చిమ్స్ ఇందులో ఉన్నాయి.ఈ స్కూటర్ను ఎలా సొంతం చేసుకోవచ్చంటే?ఓలా ఎలక్ట్రిక్ ఎంపిక చేసిన కస్టమర్లకు ఓలా సోనా కాంటెస్ట్ ద్వారా ఎస్1 ప్రో సోనా లిమిటెడ్ ఎడిషన్ను గెలుచుకునే అవకాశం ఉంది. ఇందులో పాల్గొనాలకునేవారు ఓలా ఎస్1తో రీల్ పోస్ట్ చేయాలి లేదా బ్రాండ్ స్టోర్ వెలుపల ఒక ఫోటో లేదా సెల్ఫీ తీసుకుని #OlaSonaContest అనే హ్యాష్ట్యాగ్తో ఓలా ఎలక్ట్రిక్ను ట్యాగ్ చేయాలి. డిసెంబర్ 25న ఓలా స్టోర్లలో జరిగే పోటీలో విజేతను ప్రకటిస్తారు. -
భారత్లో రూ.13.49 లక్షల బైక్ లాంచ్: బుకింగ్స్ షురూ
కవాసకి దేశీయ మార్కెట్లో 2025 నింజా 1100ఎస్ఎక్స్ లాంచ్ చేసింది. దీని ధర రూ.13.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ కోసం బుకింగ్స్ ప్రారంభమైనప్పటికీ.. డెలివరీలు వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం.నింజా 1100ఎస్ఎక్స్ బైక్ లిక్విడ్ కూల్డ్, 1099సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 9000 rpm వద్ద, 136 హార్స్ పవర్ & 7600 rpm వద్ద 113 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్ పొందుతుంది. కాబట్టి ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా ఉత్తమ పనితీరును అందిస్తుందని భావిస్తున్నాము.చూడటానికి కవాసకి నింజా దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. ఇది కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. ఇందులో ట్విన్ ఎల్ఈడీ హెడ్ల్యాంప్లు, షార్ప్ అండ్ అగ్రెసివ్ ఫ్రంట్ ఫెయిరింగ్ వంటివన్నీ ఉన్నాయి. ఇందులో 4.3 ఇంచెస్ TFT డిస్ప్లే ఉంటుంది. ఇది కాల్స్, ఎస్ఎమ్ఎస్ అలర్ట్ వంటి వాటిని చూపిస్తుంది. అంతే కాకుండా ఈ బైకులో క్రూయిజ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, మల్టిపుల్ పవర్ మోడ్లు, హ్యాండిల్బార్ మౌంటెడ్ USB ఛార్జింగ్ పోర్ట్ వంటివి కూడా ఉన్నాయి.ఇదీ చదవండి: రూ.5 లక్షలు పెరిగిన ధర.. ఇప్పుడు ఈ కారు రేటెంతో తెలుసా?మార్కెట్లో లాంచ్ అయిన కొత్త కవాసకి నింజా 1100ఎస్ఎక్స్ బైకుకు ప్రత్యక్ష ప్రత్యర్థులు లేదు. అయితే ధర పరంగా ట్రయంఫ్ రోడ్-బియాస్డ్ టైగర్ 900 జీటీ పోటీపడుతోంది. కాగా ఈ బైక్ కోసం కవాసకి డీలర్షిప్లలో రూ. 50,000 టోకెన్ మొత్తంతో బుక్ చేసుకోవచ్చు. -
రూ.5 లక్షలు పెరిగిన ధర.. ఇప్పుడు ఈ కారు రేటెంతో తెలుసా?
భారతీయ మార్కెట్లో '2025 రేంజ్ రోవర్ స్పోర్ట్' రూ.1.45 కోట్ల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ అయింది. దేశీయ విఫణిలో తయారైన ఈ కారు ధర రూ.5 లక్షలు పెరిగింది. బ్రాండ్ ఇప్పుడు డైనమిక్ ఎస్ఈ వేరియంట్ను నిలిపివేసి.. స్థానికంగా తయారైన 'డైనమిక్ హెచ్ఎస్ఈ' వేరియంట్తో భర్తీ చేశారు.2025 రేంజ్ రోవర్ స్పోర్ట్ డైనమిక్ హెచ్ఎస్ఈ.. 3.0 లీటర్ 6 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది 400 హార్స్ పవర్ అందిస్తుంది. ఇందులోని 3.0 లీటర్ 6 సిలిండర్ డీజిల్ ఇంజిన్ 351 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇవి ఆటోమేటిక్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతాయి.సాంటోరిని బ్లాక్, వారెసిన్ బ్లూ, ఫుజి వైట్, ఛారెంటే గ్రే, జియోలా గ్రీన్ అనే కలర్ ఆప్షన్లలో లభించే ఈ కారు ఆటో పార్కింగ్ అసిస్ట్, ఎయిర్ సస్పెన్షన్, అడాప్టివ్ ఆఫ్ రోడ్ క్రూయిజ్ కంట్రోల్, మెరిడియన్ సౌండ్ సిస్టమ్, పవర్డ్ అండ్ హీటెడ్ రియర్ సీట్లు వంటి వాటిని పొందుతుంది.కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ డైనమిక్ హెచ్ఎస్ఈ అడాప్టివ్ ఫ్రంట్ లైటింగ్, లో స్పీడ్ మ్యాన్యువరింగ్ లైట్లు, డిజిటల్ ఎల్ఈడీ హెడ్లైట్లను పొందుతుంది. కాబట్టి ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అత్యుత్తమ పనితీరును అందిస్తుందని సమాచారం. -
కియా కొత్త కారు 'సిరోస్' ఇదే.. ఫోటోలు చూశారా?
-
రూ.15 లక్షలుంటే చాలు.. ఇందులో ఓ కారు మీ సొంతం!
కరోనా మహమ్మారి వ్యాపించిన తరువాత చాలామంది సొంతగా కారు ఉంటే బాగుంటుందని భావించారు. ఆ తరువాత కొంతమంది కార్లను కొనుగోలు చేయడం ప్రారంభించారు. అయితే ఇందులో కొందరు రూ. 10 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే కార్లను కొనుగోలు చేస్తే.. మరికొందరు రూ. 20 లక్షల లోపు ధర వద్ద లభించే కార్లను కొనుగోలు చేయడానికి మక్కువ చూపించారు. మనం ఈ కథనంలో రూ.15 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే కార్లు ఏవి? వాటి వివరాలు ఏమిటనే విషయాలను తెలుసుకుందాం.హోండా సిటీహోండా అంటే ముందుగా గుర్తొచ్చే కారు 'సిటీ'. ఈ కారు ప్రారంభ ధర రూ. 11.82 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా 117 Bhp పవర్, 145 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పొందుతుంది.ఫీచర్స్ విషయానికి వస్తే.. హోండా సిటీ 8.0 ఇంచెస్ టచ్స్క్రీన్, వైర్లెస్ ఛార్జింగ్, ఎలక్ట్రిక్ సన్రూఫ్, ఎయిర్ ప్యూరిఫైయర్తో స్మార్ట్ఫోన్ ఇంటిగ్రేషన్ వంటి వాటితో పాటు.. ఆరు ఎయిర్బ్యాగ్లు, ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఐసోఫిక్స్ యాంకర్స్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.స్కోడా స్లావియాస్కోడా స్లావియా ప్రారంభ ధర రూ.10.50 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారు రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో 8 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ క్లస్టర్తో పాటు.. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లేకు సపోర్ట్ చేసే 10 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇందులో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, ఆటో క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రిక్ సన్రూఫ్ కూడా ఉన్నాయి.ఫోక్స్వ్యాగన్ వర్టస్ఫోక్స్వ్యాగన్ కంపెనీకి చెందిన వర్టస్ కారు కూడా రూ.15 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభిస్తున్న ఉత్తమ మోడల్. ఈ కారు ప్రారంభ ధర రూ.10 .89 లక్షలు. ఇది కూడా రెండు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇందులో 8 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, 10 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, వైర్లెస్ ఛార్జింగ్, ఆటో క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రిక్ సన్రూఫ్ మొదలైన ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ కారు.. అత్యాధునిక సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. కాబట్టి ఇది క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ సాధించింది. దీంతో మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా నిలిచింది.హ్యుందాయ్ వెర్నారూ. 11 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభిస్తున్న హ్యుందాయ్ వెర్నా కూడా మన జాబితాలో చెప్పుకోదగ్గ మోడల్. ఇది 1.5 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్స్ పొందుతుంది. ఈ కారు కూడా క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ సాధించి.. అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా నిలిచింది.ఇదీ చదవండి: భారత్లోని 5 బెస్ట్ ఫ్యామిలీ కార్లు ఇవే!మారుతి సుజుకి సియాజ్2014లో మొదటిసారి దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన మారుతి సుజుకి కంపెనీకి చెందిన 'సియాజ్' ఆ తరువాత కాలంలో అనేక అప్డేట్స్ పొందింది. ప్రస్తుతం ఈ కారు ధర రూ.9.40 లక్షల నుంచి రూ.12.30 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. సియాజ్ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన 1.5 లీటర్ కే15 పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా 4 స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో లభిస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. -
భారత్లోని 5 బెస్ట్ ఫ్యామిలీ కార్లు ఇవే!
త్వరలో న్యూ ఇయర్ వచ్చేస్తోంది, ఆ తరువాత సంక్రాతి సెలవులు రానున్నాయి. సెలవుల్లో చాలామంది ఫ్యామిలీతో కలిసి లాంగ్ డ్రైవ్ వెళ్లాలనుకుంటారు. అలాంటి వాళ్ళు ఒకవేలా కొత్త కారు కొనాలంటే.. ఎలాంటి మోడల్ ఎందుకోవాలి? దాని ధర ఎంత? ఇతర వివరాలు ఏంటనేది ఇక్కడ తెలుసుకుందాం.ఎంజీ హెక్టర్ఎంజీ మోటార్ కంపెనీ లాంచ్ చేసిన కార్లలో ఎక్కువ ప్రజాదరణ పొందిన మోడల్ హెక్టర్. రూ.13.99 లక్షల ప్రారంభ ధర వద్ద లభించే ఈ కారు ఏకంగా 587 లీటర్ల బూట్ స్పేస్ పొందుతుంది. ఇందులో 14 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, వైర్లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లతో డిజిటల్ బ్లూటూత్ కీ, 75 కంటే ఎక్కువ కనెక్టెడ్ కార్ ఫీచర్లు, పనోరమిక్ సన్రూఫ్ మొదలైనవన్నీ ఉన్నాయి.ఎంజీ విండ్సర్ఇటీవలే మార్కెట్లో లాంచ్ అయిన ఎంజీ విండ్సర్ ఎలక్ట్రిక్ కారు కూడా.. లాంగ్ డ్రైవ్ వెళ్ళడానికి ఉత్తమంగా ఉంటుంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 13.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). 604 లీటర్ బూట్ స్పేస్ కలిగిన ఈ కారు ఏరోడైనమిక్ డిజైన్ పొందుతుంది. ఇది సింగిల్ ఛార్జితో 332 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ కారులోని లేటెస్ట్ ఫీచర్స్ వాహన వినియోగదారులకు బెస్ట్ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.హోండా సిటీరూ.11.88 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభించే హోండా సిటీ.. 506 లీటర్ బూట్ స్పేస్ పొందుతుంది. ఇది మంచి డిజైన్ కలిగి.. ఉత్తమ ఇంటీరియర్ ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు రోజు వారీ వినియోగానికి మాత్రమే కాకుండా.. లాంగ్ డ్రైవ్ చేయడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. హోండా కంపెనీ ఎక్కువగా విక్రయించిన కార్ల జాబితాలో సిటీ సెడాన్ చెప్పుకోదగ్గ మోడల్.రెనాల్ట్ కైగర్మార్కెట్లో ఎక్కువ మంది ఇష్టపడి కొనుగోలు చేస్తున్న కార్ల జాబితాలో రెనాల్ట్ కైగర్ కూడా ఒకటి. దీని ధరలు రూ.6 లక్షల నుంచి రూ. 11.23 లక్షల మధ్య ఉన్నాయి. ఈ కారులోని బూట్ స్పేస్ 405 లీటర్లు. ఎక్కువ లగేజ్ తీసుకెళ్లాలనుకునే వారికి ఇది అనుకూలంగా ఉంటుంది. సింపుల్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ కారు ఉత్తమ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉండటం వల్ల నగర ప్రయాణానికి మాత్రమే కాకుండా.. గ్రామీణ ప్రాంతాలలో డ్రైవ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది.మహీంద్రా స్కార్పియో ఎన్మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన 'స్కార్పియో ఎన్' కూడా ఫ్యామిలీతో కలిసి ప్రయాణించడానికి అనుకూలంగా ఉండే ఓ బెస్ట్ మోడల్. 460 లీటర్ల బూట్ స్పేస్ కలిగిన ఈ కారు ప్రారంభ ధర రూ. 13.85 లక్షలు (ఎక్స్ షోరూమ్). దృఢమైన నిర్మాణం కలిగిన ఈ కారు అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందింది. కాబట్టి ఇది క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ పొందింది. ఈ కారులోని ఫీచర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే.. ఇందులో వాహన వినియోగదారులకు కావాల్సిన దాదాపు అన్ని ఫీచర్స్ ఉన్నాయి. -
టాప్ 5 బెస్ట్ 400సీసీ బైకులు: తక్కువ ధర.. ఎక్కువ పర్ఫామెన్స్
భారతదేశంలో 400సీసీ బైకులకు కూడా డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీ ఈ విభాగంలో కూడా బైకులు లాంచ్ చేశాయి. ఈ బైకులు ధరలు సాధారణ బైక్ ధరల కంటే కొంత ఎక్కువగానే ఉంటాయి. అయితే ఈ కథనంలో కొంత తక్కువ ధర వద్ద లభించే టాప్ 5 బెస్ట్ 400సీసీ బైకుల గురించి తెలుసుకుందాం.బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 400జెడ్400 సీసీ విభాగంలోని సరసమైన బైకుల జాబితాలో బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 400జెడ్ ఒకటి. దీని ధర రూ. 1.84 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైకులో ఎల్ఈడీ హెడ్ల్యాంప్, డీఆర్ఎల్, బ్లూటూత్ కనెక్టివిటీ, రైడింగ్ మోడ్స్ వంటి అనేక ఫీచర్స్ ఉన్నాయి. ఇందులోని 373 సీసీ ఇంజిన్ 39 Bhp పవర్, 35 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ స్లిప్పర్ అండ్ అసిస్ట్ క్లచ్తో 6 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో లభిస్తుంది.ట్రయంఫ్ స్పీడ్ టీ4మార్కెట్లో అందుబాటులో ఉన్న ట్రయంఫ్ స్పీడ్ టీ4 ధర రూ. 1.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది ట్రయంఫ్ లైనప్లో అత్యంత సరసమైన 400సీసీ బైక్. ఇందులో హజార్డ్ ల్యాంప్స్, ఎల్ఈడీ హెడ్లైట్స్, టెయిల్లైట్స్ వంటివి ఉన్నాయి. ఈ బైకులోని 398 సీసీ ఇంజిన్ 30 Bhp పవర్, 36 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో లభిస్తుంది.రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 411400 సీసీ విభాగంలో ఎక్కువమంది ఇష్టపడే బైకులలో ఒకటి 'రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 411'. దీని ధర రూ.2.05 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బైకులో అనలాగ్ స్పీడోమీటర్లు, హజార్డ్ ల్యాంప్ వంటివన్నీ ఉన్నాయి. ఇందులోని 411 సీసీ ఇంజిన్ 24 Bhp పవర్, 32 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో లభిస్తుంది.బజాజ్ డామినార్ 400బజాజ్ డామినార్ 400 కూడా 400 సీసీ విభాగంలో లభిస్తున్న ఓ సరసమైన బైక్. దీని ధర రూ. 2.26 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులోని 373 సీసీ ఇంజిన్ 39 Bhp పవర్, 35 Nm టార్క్ అందిస్తుంది. 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్బాక్స్తో లభించే ఈ బైక్ డ్యూయల్ డిస్ప్లేలు, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ వంటివన్నీ పొందుతుంది.ఇదీ చదవండి: అప్పు కంటే ఎక్కువ రికవరీ చేశారు: విజయ్ మాల్యా ట్వీట్ వైరల్హార్లే డేవిడ్సన్ ఎక్స్440హార్లే డేవిడ్సన్ అంటే ధరల భారీగా ఉంటాయని అందరికీ తెలుసు. కానీ ఈ బ్రాండ్ అంటే ఇష్టపడే కస్టమర్ల కోసం కంపెనీ ఎక్స్440 బైక్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 2.39 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులోని 440 సీసీ ఇంజిన్ 27 Bhp పవర్, 38 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్తో లభిస్తుంది. ఈ బైక్ మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. -
2025లో లాంచ్ అయ్యే ఎలక్ట్రిక్ కార్లు ఇవే (ఫోటోలు)
-
వెచ్చగా ఉంచే ‘ఊలీ’ క్యాంపర్ వ్యాన్
-
హోండా, నిస్సాన్ విలీనం.. టయోటాకు గట్టిపోటీ తప్పదా?
ఆటోమొబైల్ పరిశ్రమలో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రెండు దిగ్గజ కంపెనీలు విలీనం దిశగా అడుగులు వేస్తున్నాయి. జపాన్లో రెండు, మూడో స్థానాల్లో ఉన్న హోండా మోటార్ , నిస్సాన్ మోటార్ సంస్థలు విలీనాన్ని అన్వేషిస్తున్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఇది వాస్తవ రూపం దాల్చితే జపనీస్ ఆటోమోటివ్ పరిశ్రమ పూర్తీగా మారిపోతుంది. టయోటా మోటార్ కార్పొరేషన్కు గట్టి పోటీ తప్పదని భావిస్తున్నారు.బ్లూమ్బెర్గ్ రిపోర్ట్ ప్రకారం.. ఇరు కంపెనీల మధ్య చర్చలు ప్రాథమిక స్థాయిలో ఉన్నాయి. పూర్తీగా విలీనం చేయాలా లేదా మూలధనాన్ని పంచుకోవాలా లేదా హోల్డింగ్ కంపెనీని ఏర్పాటు చేయాలా అని యోచిస్తున్నాయి. చర్చల నివేదికలు వెలువడిన తర్వాత హోండా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ షింజీ అయోమా స్పందిస్తూ కంపెనీ పలు వ్యూహాత్మక అవకాశాలను పరిశీలిస్తోందని, అందులో ఈ విలీనం ప్రతిపాదన కూడా ఉందని ధ్రువీకరించారు.అంతర్గత వర్గాల సమాచారం మేరకు.. విలీనం తర్వాత రెండు సంస్థల సంయుక్త కార్యకలాపాలను నిర్వహించడానికి కొత్త హోల్డింగ్ కంపెనీని స్థాపించడం అనేది పరిశీలనలో ఉన్న ఒక ప్రతిపాదన. నిస్సాన్తో ఇప్పటికే మూలధన సంబంధాలను కలిగి ఉన్న మిత్సుబిషి మోటార్స్ కార్ప్ని కూడా ఈ డీల్లో చేర్చవచ్చు. అయితే దీనికి సంబంధించిన చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ఇది పూర్తి స్థాయి ఒప్పందంగా మారుతుందా లేదా అన్నది అస్పష్టంగా ఉంది.ఈ ఒప్పందం కార్యరూపం దాల్చితే, అది జపాన్ ఆటో రంగాన్ని రెండు ఆధిపత్య సమూహాలుగా ఏకీకృతం చేస్తుంది. హోండా, నిస్సాన్, మిత్సుబిషి ఒక గ్రూప్గా, టయోటా, దాని అనుబంధ సంస్థలు మరో సమూహంగా ఉంటాయి. ఈ ఏకీకరణ విలీన సంస్థ ప్రపంచ పోటీతత్వాన్ని బలోపేతం చేయగలదు. బ్యాటరీలు, సాఫ్ట్వేర్పై హోండా, నిస్సాన్ మధ్య ఇది వరకే సహకారం కుదిరిన విషయం తెలిసిందే. విలీన చర్చల వార్తల తరువాత బుధవారం ప్రారంభ ట్రేడింగ్లో నిస్సాన్ షేర్లు 24% వరకు పెరిగగా హోండా షేర్లు 3.4% తగ్గాయని బ్లూమ్బెర్గ్ నివేదిక పేర్కొంది. -
టాటా మోటార్స్కు భారీ ఆర్డర్
వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ తాజాగా ఉత్తర్ ప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (యూపీఎస్ఆర్టీసీ) నుండి భారీ ఆర్డర్ను దక్కించుకుంది. ఇందులో భాగంగా యూపీఎస్ఆర్టీసీకి 1,297 బస్ ఛాసిస్లను కంపెనీ సరఫరా చేయనుంది. ఒక ఏడాదిలో యూపీఎస్ఆర్టీసీ నుండి ఆర్డర్ అందుకోవడం టాటా మోటార్స్కు ఇది మూడవది.మొత్తం ఆర్డర్ పరిమాణం 3,500 యూనిట్లకుపైమాటే. పోటీ ఈ–బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఆర్డర్ గెలుచుకున్నట్టు టాటా మోటార్స్ తెలిపింది. పరస్పరం అంగీకరించిన నిబంధనల ప్రకారం బస్ ఛాసిస్లను దశలవారీగా డెలివరీ చేస్తామని వివరించింది. టాటా ఎల్పీవో 1618 డీజిల్ బస్ ఛాసిస్ నగరాల మధ్య, సుదూర ప్రయాణాల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు.‘ఈ ఆర్డర్ మెరుగైన మొబిలిటీ పరిష్కారాలను అందించడంలో సంస్థ నిబద్ధతకు శక్తివంతమైన ధృవీకరణ. స్థిర పనితీరు, అభివృద్ధి చెందుతున్న యూపీఎస్ఆర్టీసీ రవాణా అవసరాలను తీర్చగల సామర్థ్యం.. ప్రజా రవాణా పర్యావరణ వ్యవస్థలో కంపెనీ సాంకేతిక నైపుణ్యం, విశ్వసనీయతను ప్రదర్శిస్తాయి’ అని టాటా మోటార్స్ వైస్ ప్రెసిడెంట్, కమర్షియల్ ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ హెడ్ ఎస్.ఆనంద్ తెలిపారు.టాటా ఎల్పీవో 1618 బస్టాటా ఎల్పీవో 1618 డీజిల్ బస్సు బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా తయారైంది. ఇందులోని కమ్మిన్స్ 5.6L ఇంజన్ 180 బీహెచ్పీ, 675 ఎన్ఎం గరిష్ట టార్క్ను అందిస్తుంది. ఇది 6 ఇంజన్ ఎంపికలతో వస్తుంది. ఫేస్ కౌల్ రకం ఛాసిస్ 10,700 కిలోల వరకు మోయగలదు. -
ఇది కదా అసలైన రికార్డ్!.. ఒక ఏడాదిలో 20 లక్షల కార్లు
ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) మొదటిసారి ఒక సంవత్సరంలో 2 మిలియన్స్ (20 లక్షలు) వాహనాలను ఉత్పత్తి చేసినట్లు వెల్లడించింది. ఇది కంపెనీ చరిత్రలోనే గొప్ప రికార్డ్. ప్యాసింజర్ వెహికల్ ఉత్పత్తిలో ఈ మార్కును సాధించిన భారతదేశంలోని ఏకైక బ్రాండ్ మారుతి సుజుకి కావడం గమనార్హం.ఈ ఏడాది ఉత్పత్తి అయిన 20 లక్షల కారుగా ఎర్టిగా నిలిచింది. ఇది హర్యానాలోని మనేసర్ ప్లాంట్లో ఈ కారు తయారైనట్లు సమాచారం. కంపెనీ తాయారు చేసిన రెండు మిలియన్ యూనిట్లలో 60 శాతం హర్యానాలోని గురుగ్రామ్, మనేసర్ సౌకర్యాలలో తయారయ్యాయి. మిగిలినవి గుజరాత్లోని హన్సల్పూర్ ప్లాంట్లో తయారైనట్లు కంపెనీ వెల్లడించింది.మారుతి సుజుకి మూడు ప్లాంట్లు 2.35 మిలియన్ యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. కాగా కంపెనీ హర్యానాలోని ఖర్ఖోడాలో మరో ప్లాంట్ ప్రారభించడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ కూడా ఉత్పత్తి ప్రారంభమైతే.. కంపెనీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 4 మిలియన్ యూనిట్లకు చేరుకుంటుంది.మారుతి సుజుకి తన కార్లను ఇండియన్ మార్కెట్లో మాత్రమే కాకుండా.. 100 ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఇందులో సుమారు 17 మేడ్ ఇన్ ఇండియా కార్లు ఉన్నట్లు సమాచారం. మారుతి ఫ్రాంక్స్, జిమ్నీ, బాలెనో, డిజైర్, స్విఫ్ట్ వంటి కార్లను ఎక్కువగా ఎగుమతి చేస్తున్నట్లు సమాచారం. -
సెకెండ్ హ్యాండ్ వాహనాలపై భారీ పన్ను?
పాత, వాడిన ఎలక్ట్రిక్ వాహనాలు (EV), తేలికపాటి పెట్రోల్, డీజిల్ వాహనాలపై వస్తు సేవల పన్ను (GST) పెరిగే అవకాశం ఉంది. జీఎస్టీ కౌన్సిల్ ఫిట్మెంట్ కమిటీ సిఫార్సు ఆధారంగా పన్ను రేటు 12 శాతం నుండి 18 శాతానికి పెంచవచ్చని సీఎన్బీసీ టీవీ 18 రిపోర్ట్ పేర్కొంది. రాజస్థాన్లోని జైసల్మేర్లో డిసెంబర్ 20-21 తేదీలలో జరగనున్న కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రతిపాదనను చర్చించనున్నట్లు తెలుస్తోంది.ఈ ప్రతిపాదన అమలు చేస్తే.. సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారి సంఖ్య తగ్గే అవకాశం ఉంది. గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహించడానికి ప్రస్తుతం ప్రభుత్వం కొత్త ఈవీలకు రాయితీపై 5 శాతం జీఎస్టీ మాత్రమే విధిస్తోంది. అలాగే పాత, వాడిన విద్యుత్ వాహనాలపై 12 శాతం పన్ను అమలవుతోంది. దీన్ని 18 శాతానికి తీసుకెళ్లాలని తద్వారా రీసేల్ మార్కెట్ సౌలభ్యాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. పాత, సెకెండ్ హ్యాండ్ వాహనాలపై విధించే జీఎస్టీ సరఫరాదారు మార్జిన్కు మాత్రమే వర్తిస్తుంది.ప్రస్తుత విధానంలో 1200 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం, 4000 ఎంఎం కంటే ఎక్కువ పొడవు కలిగిన పెట్రోల్ వాహనాలపై 18 శాతం జీఎస్టీ అమలవుతోంది. అదేవిధంగా 1500 సీసీ పైగా ఎక్కువ ఇంజన్ సామర్థ్యం, 4000 ఎంఎం కంటే ఎక్కువ పొడవు కలిగిన డీజిల్ వాహనాలు, అలాగే 1500 సీసీ కంటే ఎక్కువ ఇంజన్లు కలిగిన ఎస్యూవీలపై కూడా 18 శాతం పన్ను విధిస్తున్నారు.ఇదీ చదవండి: ఈ-టూవీలర్స్లోనూ పెద్ద కంపెనీలే..ఇక ఈవీలు, చిన్న కార్లతో సహా అన్ని ఇతర వాహనాలు ప్రస్తుతం 12 శాతం పన్ను పరిధిలోకి వస్తాయి. ఈవీలతో సహా 12 శాతం కేటగిరీలోని అన్ని వాహనాలకూ 18 శాతం పన్ను విధించాలని ఫిట్మెంట్ కమిటీ సిఫార్సు చేసింది. జీఎస్టీ కౌన్సిల్ తదుపరి సమావేశంలో ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఇది ఆమోదం పొందితే అన్ని పాత, సెకెండ్ హ్యాండ్ వాహనాలపై ఏకరీతిలో 18 శాతం పన్ను అమలవుతుంది. -
సూపర్ స్టైలిష్ బైకులు.. కాలేజ్ స్టూడెంట్స్ కోసం!
భారతదేశంలో లాంగ్ రైడ్ చేయడానికి, రోజువారీ ప్రయాణానికి, మహిళలు కోసం, కాలేజ్ స్టూడెంట్స్ కోసం.. ఇలా వివిధ రకాల టూ-వీలర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ కథనంలో ప్రత్యేకించి కాలేజ్ స్టూడెంట్లకు అనువైన ఐదు బెస్ట్ బైకుల గురించి తెలుసుకుందాం.యమహా ఎంటీ-15యమహా అంటే ముందగా గుర్తొచ్చేది స్టైల్. కాబట్టి ఇవి యువతను ఒక్క చూపుతోనే ఆకట్టుకుంటాయి. కాలేజ్ స్టూడెంట్లు బాగా ఇష్టపడే యమహా బైకులలో ఒకటి.. ఏంటీ-15. రూ.1.78 లక్షల ప్రారంభ ధర వద్ద లభించే ఈ బైక్ మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులోని 155 సీసీ ఇంజిన్ ఉత్తమ పర్ఫామెన్స్ అందిస్తుంది.కేటీఎం 125 డ్యూక్యువత ఎక్కువగా ఇష్టపడి కొనుగోలు చేసే బైకులతో ప్రధానంగా చెప్పుకోదగ్గ బైక్ బ్రాండ్ కేటీఎం. ఈ కంపెనీకి చెందిన 125 డ్యూక్ కాలేజ్ విద్యార్థులకు కూడా మొదటి ఎంపిక. దీని ధర రూ.1.78 లక్షలు. ఈ బైకులో 124.7 సీసీ ఇంజిన్ ఉంటుంది. రోజువారీ వినియోగానికి, లాంగ్ రైడ్ చేయడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.బజాజ్ పల్సర్ ఎన్ఎస్200రూ.1.40 లక్షల ప్రారంభ ధర వద్ద లభించే 'బజాజ్ పల్సర్ ఎన్ఎస్200' బైక్ కూడా కాలేజ్ స్టూడెంట్లకు నచ్చిన బైకులలో ఒకటి. మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ బైక్ 199.5 సీసీ ఇంజిన్ పొందుతుంది. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉత్తమ రైడింగ్ అందించే ఈ బైకును స్టూడెంట్స్ మాత్రమే కాకుండా.. సాధారణ ప్రజలు కూడా ఇష్టంగా కొనుగోలు చేస్తారు.రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీకి చెందిన హంటర్ 350 మంచి డిజైన్ కలిగి ఉండటం వల్ల.. సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా, కాలేజ్ స్టూడెంట్స్ కూడా విరివిగా కొనుగోలు చేస్తున్నారు. దీని ప్రారంభ ధర రూ. 1.49 లక్షలు మాత్రమే. ఇది స్టైలిష్ స్ట్రీట్ బైక్. ఇందులో 349.34 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 20.2 Bhp, 27 Nm టార్క్ అందిస్తుంది.ఇదీ చదవండి: రూ.2 లక్షల కంటే తక్కువ ధర.. ఇవిగో బెస్ట్ బైకులు!హీరో ఎక్స్ట్రీమ్ 125ఆర్రూ. 96,781 ప్రారంభ ధర వద్ద లభించే బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్ హీరో మోటోకార్ప్ కంపెనీకి చెందిన 'ఎక్స్ట్రీమ్ 125ఆర్'. ఇందులోని 124.7 సీసీ ఇంజిన్ ఉత్తమ పనితీరును అందిస్తుంది. చూడటానికి స్టైలిష్గా కనిపించే ఈ బైక్ 124.7 సీసీ ఇంజిన్ పొందుతుంది. తద్వారా బెస్ట్ పర్ఫామెన్స్ అందిస్తుంది. -
ఆస్టన్ మార్టిన్ ఫస్ట్ హైబ్రిడ్ కారు 'వల్హల్లా' ఇదే (ఫోటోలు)
-
ఈ-టూవీలర్స్లోనూ పెద్ద కంపెనీలే..
హీరో మోటోకార్ప్, హోండా, టీవీఎస్, బజాజ్, సుజుకీ, యమహా.. భారత ద్విచక్ర వాహన మార్కెట్లో ఈ కంపెనీలదే రాజ్యం. మారుమూల పల్లెల్లోనూ ఈ బ్రాండ్ల వాహనాలే దర్శనమిస్తాయి. సువిశాల భారతావని అంతటా ఇవి తమ నెట్వర్క్ను దశాబ్దాలుగా పెంచుకున్నాయి. విక్రయ శాలలే కాదు సర్వీసింగ్ను కూడా కస్టమర్లకు చేరువ చేశాయి. మాస్ మార్కెట్ను పూర్తిగా ఇవి చేతుల్లోకి తీసుకున్నాయంటే ఆశ్చర్యంవేయక మానదు.- హైదరాబాద్, బిజినెస్ బ్యూరోఇంత బలమున్న ఈ దిగ్గజాలు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలోనూ పాగా వేస్తాయనడంలో సందేహం లేదు. ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ బజాజ్, టీవీఎస్ తమ సత్తా చాటుతున్నాయి. హీరో మోటోకార్ప్ క్రమక్రమంగా వేగం పెంచి నవంబర్లో టాప్–5 స్థానానికి ఎగబాకింది. పెద్ద కంపెనీలే ఈ–టూవీలర్స్లోనూ అడ్డా వేస్తాయని గణాంకాలు చెబుతున్నాయి. భారత ఈ–టూవీలర్స్ పరిశ్రమ ఈ ఏడాది నవంబర్ 11 నాటికే 10,00,000 యూనిట్ల మైలురాయిని దాటింది. మళ్లీ హమారా బజాజ్.. 2024 డిసెంబర్ తొలి వారంలో అమ్ముడైన ఎలక్ట్రిక్ టూ వీలర్స్లో టాప్–4 కంపెనీల వాటా ఏకంగా 82 శాతం ఉందంటే భవిష్యత్ ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. మిగిలిన 18 శాతం వాటా కోసం దేశవ్యాప్తంగా 200లకుపైగా బ్రాండ్లు పోటీపడుతున్నాయి. భారత స్కూటర్స్ మార్కెట్లో ఒకప్పుడు రారాజులా వెలుగొందిన బజాజ్.. ఇప్పుడు ఎలక్ట్రిక్ చేతక్ రూపంలో స్కూటర్స్ విభాగంలోకి రీఎంట్రీ ఇచ్చి హమారా బజాజ్ అనిపించుకుంటోంది.డిసెంబర్ తొలివారంలో బజాజ్ 4,988 యూనిట్లతో తొలి స్థానంలో నిలిచింది. టీవీఎస్ మోటార్ కంపెనీ 3,964 యూనిట్లతో రెండవ స్థానంలో ఉంది. ప్రస్తుతం ఈ రెండు కంపెనీల మధ్యే పోటీ తీవ్రంగా ఉంది. ఓలా 3,351, ఏథర్ ఎనర్జీ 2,523 యూనిట్లతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఓలా అమ్మకాలు అక్టోబర్లో 41,775 యూనిట్ల నుంచి నవంబర్లో 29,191 యూనిట్లకు పడిపోయింది. దేశవ్యాప్తంగా ఈ కంపెనీ వాహనాల నాణ్యతపై ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడం గమనార్హం. పెద్ద కంపెనీల మధ్యే పోటీ.. తదుపరితరం చేతక్ను డిసెంబర్ 20న ప్రవేశపెట్టేందుకు బజాజ్ రెడీ అయింది. 2019–20లో కేవలం 212 యూనిట్లు విక్రయించిన బజాజ్.. 2020–21లో 1,395 యూనిట్లు, ఆ తర్వాతి ఏడాది 8,187, 2022–23లో 36,260 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది. ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరంలో 1,15,702 యూనిట్లను సాధించింది. 2024–25 ఏప్రిల్–నవంబర్లో 1,34,167 యూనిట్లు రోడ్డెక్కాయి. టీవీఎస్ మోటార్ కంపెనీ 2023 జనవరిలో 10,465 యూనిట్ల సేల్స్ నమోదు చేసింది. ఏడాదిలోనే ఈ సంఖ్య 47 శాతం పెరిగింది.2024 నవంబర్లో ఈ కంపెనీ 26,971 యూనిట్ల అమ్మకాలను దక్కించుకుంది. ఈ నెలలోనే విదా వీ2 మోడల్ను ఆవిష్కరించిన హీరో మోటోకార్ప్ క్రమక్రమంగా ఈ–టూవీలర్స్లో పట్టు సాధిస్తోంది. ఈ కంపెనీ 2023 జనవరిలో 157 యూనిట్లు విక్రయించింది. 2024 జనవరిలో ఈ సంఖ్య 1,495కు చేరుకుంది. నవంబర్లో ఏకంగా 7,309 యూనిట్ల అమ్మకాలను సాధించి టాప్–5 స్థానాన్ని అందుకుంది. క్యూలో మరిన్ని దిగ్గజాలు.. 2025 తొలి త్రైమాసికం నుంచి నేను సైతం అంటూ హోండా మోటార్సైకిల్, స్కూటర్ ఇండియా రెడీ అవుతోంది. యాక్టివా–ఈ, క్యూసీ1 మోడళ్లను కంపెనీ భారత మార్కెట్లో ఇటీవలే ఆవిష్కరించింది. 2025 జనవరి 1 నుంచి బుకింగ్స్ స్వీకరిస్తారు. ఫిబ్రవరి నుంచి డెలివరీలు ప్రారంభం అవుతాయని కంపెనీ ప్రకటించింది. సంస్థకు దేశవ్యాప్తంగా 6,000 పైచిలుకు సేల్స్, సర్వీస్ టచ్పాయింట్స్ ఉన్నాయి.2025లో 1,00,000 యూనిట్ల ఈ–స్కూటర్స్ తయారు చేయాలని లక్ష్యంగా చేసుకుందంటే కంపెనీకి ఉన్న ధీమా అర్థం చేసుకోవచ్చు. మరోవైపు సుజుకీ, యమహా ఎంట్రీ ఇస్తే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన పరిశ్రమ సరికొత్త రికార్డుల దశగా దూసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. యమహా ఇప్పటికే హైబ్రిడ్ టూ వీలర్స్ తయారు చేస్తోంది. సుజుకీ నియో ఎలక్ట్రిక్ టూ వీలర్ కొద్ది రోజుల్లో రంగ ప్రవేశం చేయనుంది. -
రూ.2 లక్షల కంటే తక్కువ ధర.. ఇవిగో బెస్ట్ బైకులు!
మంచి స్టైల్, అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కోరుకునేవారు.. కొంత ఎక్కువ డబ్బు వెచ్చించి బైక్ కొనాలని చూస్తారు. అలాంటి వారి కోసం ఈ కథనంలో రూ.2 లక్షల కంటే తక్కువ ధరలో లభించే బైకుల గురించి తెలుసుకుందాం.హీరో కరిజ్మా ఎక్స్ఎమ్ఆర్ప్రముఖ బైక్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ దేశీయ మార్కెట్లో 'కరిజ్మా ఎక్స్ఎమ్ఆర్' విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బైక్ ధర రూ. 1.79 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులోని 210 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ 9250 rpm వద్ద 25.1 Bhp పవర్, 7250 rpm వద్ద 20.4 Nm టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్బాక్స్తో అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.హీరో కరిజ్మా ఎక్స్ఎమ్ఆర్ బైక్.. స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, గ్యాస్-ఛార్జ్డ్ మోనోషాక్ వంటి వాటితో పాటు టర్న్-బై-టర్న్ న్యావిగేషన్, ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యూఎస్బీ పోర్ట్ వంటి ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇవన్నీ రైడర్లకు ఉత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.యమహా ఆర్15 వీ4రూ.1.82 లక్షల నుంచి రూ.1.87 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ధర వద్ద లభించే 'యమహా ఆర్15 వీ4' మన జాబితాలో చెప్పుకోడదగ్గ బైక్. ఈ బైకులోని 155 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 10,000 rpm వద్ద 18.1 Bhp పవర్, 7500 rpm వద్ద 14.2 Nm టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది.యమహా ఆర్15 వీ4 బైక్ 282 మిమీ ఫ్రంట్ డిస్క్, 220 మిమీ రియర్ డిస్క్ వంటివి పొందుతుంది. అంతే కాకుండా ఇది మంచి రైడింగ్ అనుభూతిని అందించడానికి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రెండు రైడింగ్ మోడ్లు, ట్రాక్షన్ కంట్రోల్ వంటివి కూడా కలిగి ఉంది.బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200బజాజ్ అంటే అందరికీ గుర్తొచ్చేది పల్సర్. ఈ బైక్ మార్కెట్లో అధిక అమ్మకాలను పొందుతోంది. బజాజ్ ఆర్ఎస్ 200 ధర రూ. 1.74 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ 200 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఈ ఇంజిన్ 24.1 Bhp పవర్, 18.7 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎల్ఈడీ లైటింగ్ వంటివి పొందుతుంది.కేటీఎమ్ ఆర్సీ 125రూ.2 లక్షల కంటే తక్కువ ధర వద్ద కేటీఎమ్ బైక్ కావాలనుకునేవారికి.. ఆర్సీ 125 బెస్ట్ ఆప్షన్. ఈ బైకులోని 124.7 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ద్వారా 9250 rpm వద్ద 14.34 Bhp పవర్, 8000 rpm వద్ద 12 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్, అడ్జస్టబుల్ హ్యాండిల్బార్, ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్స్ కలిగిన ఈ బైక్ ఎక్కువమందికి ఇష్టమైన మోడల్. -
ఈ బైక్ కొనుగోలుపై రూ.45000 డిస్కౌంట్
2024 ముగుస్తోంది. ఈ తరుణంలో చాలా వాహన తయారీ సంస్థలు తమ ఉత్పత్తులపైన డిస్కౌంట్స్ అందిస్తున్నాయి. ఇందులో టూ వీలర్ బ్రాండ్ 'కవాసకి' కూడా ఉంది. ఈ కంపెనీ ఇప్పుడు నింజా 500కొనుగోలుపైన రూ.15,000, నింజా 650 బైక్ కొనుగోలుపై రూ.45,000 తగ్గింపు ప్రకటించింది. ఈ డిస్కౌంట్ డిసెంబర్ 31 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.కవాసకి నింజా 650 బైకులో 649 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ ఉంటుంది. ఇది 8000 rpm వద్ద 67 Bhp పవర్, 6700 rpm వద్ద 64 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్ పొందుతుంది. ఈ బైక్ ఎల్ఈడీ లైట్స్, టీఎఫ్టీ డిస్ప్లే, ట్రాక్షన్ కంట్రోల్, ఏబీఎస్, స్మార్ట్ఫోన్ కనెక్టివిటీ వంటి అనేక ఫీచర్స్ ఉన్నాయి.నింజా 650 బైక్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, మోనోషాక్ వంటివి పొందుతుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ఇది 300 మిమీ డ్యూయల్ ఫ్రంట్, 220 మిమీ రియర్ సింగిల్ డిస్క్ సెటప్ పొందుతుంది. ఈ బైక్ ముందు భాగంలో 120/70, వెనుక 160/60 టైర్లు ఉన్నాయి. ఇవి 17 ఇంచెస్ వీల్స్ పొందుతాయి. కాబట్టి ఇది రైడర్లకు ఉత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.ఇదీ చదవండి: బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూటర్లు.. చవక మాత్రమే కాదు! -
బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూటర్లు.. చవక మాత్రమే కాదు!
ప్రస్తుతం మార్కెట్లో లక్ష రూపాయల స్కూటర్ లభిస్తోంది. రూ.14.90 లక్షలకు కూడా స్కూటర్ లభిస్తోంది. దేశీయ విఫణిలో ఎన్నెన్ని స్కూటర్లు అందుబాటులో ఉన్నా.. కొనుగోలుదారులు మాత్రం తక్కువ ధర వద్ద లభించే స్కూటర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ కథనంలో సరసమైన టాప్ 5 స్కూటర్లు ఏవి? వాటి ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు పూర్తిగా తెలుసుకుందాం.హీరో ప్లెజర్ ప్లస్మహిళలకు ఇష్టమైన స్కూటర్ల జాబితాలో ఒకటైన 'హీరో ప్లెజర్ ప్లస్' సరసమైన స్కూటర్లలో ఒకటి. దీని ధర రూ. 70577. రెండు వేరియంట్లు, ఆరు కలర్ ఆప్షన్లలో లభించే ఈ స్కూటర్ 110 సీసీ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8 Bhp పవర్, 8.7 Nm టార్క్ అందిస్తుంది. దీనిని మహిళలు మాత్రమే కాకుండా పురుషులు కూడా రోజువారీ వినియోగం కోసం కొనుగోలు చేస్తారు.టీవీఎస్ జెస్ట్ 110టీవీఎస్ మోటార్ కంపెనీకి చెందిన జెస్ట్ 110 స్కూటర్ ధర మార్కెట్లో రూ. 73728 మాత్రమే. ఇది కూడా రెండు వేరియంట్లు, ఆరు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులోని 109.7 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 7.7 Bhp పవర్, 8.8 Nm టార్క్ అందిస్తుంది. ఇది కూడా మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన స్కూటర్ల జాబితాలో ఒకటిగా ఉంది.హోండా డియోఅతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన లేదా అత్యధిక అమ్మకాలు పొందిన స్కూటర్ల జాబితాలో ఒకటి ఈ హోండా డియో. ఈ స్కూటర్ ధర రూ. 75409. ఇది మూడు వేరియంట్లు, తొమ్మిది కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ స్కూటర్లోని 109 సీసీ ఇంజిన్ 7.75 Bhp, 9.03 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మార్కెట్లో ఇప్పటికి 30 లక్షల కంటే ఎక్కువ హోండా డియో స్కూటర్లు అమ్ముడైనట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే దీనికి భారతదేశంలో ఎంత డిమాంద్ ఉందో అర్థం చేసుకోవచ్చు.హీరో జూమ్ (Hero Xoom)హీరో మోటోకార్ప్ కంపెనీకి చెందిన జూమ్ స్కూటర్ 110 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8.05 Bhp పవర్, 8.7 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ స్కూటర్ ధర రూ. 75656. ఈ స్కూటర్ చూడటానికి కొంత ప్రత్యేకమైన డిజైన్ పొందుతుంది. ఇది నాలుగు వేరియంట్లు, ఆరు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.ఇదీ చదవండి: తక్కువ ధరతో.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే CNG కార్లుహీరో డెస్టినీ ప్రైమ్ఇక చివరగా మన జాబితాలో చివరి సరసమైన స్కూటర్ 'హీరో డెస్టినీ ప్రైమ్'. ఈ స్కూటర్ ధర రూ. 76,806. ఇందులో 124.6 సీసీ ఇంజిన్ 9 Bhp పవర్, 10.36 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం ఒక వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. కానీ మూడు కలర్ ఆప్షన్స్ పొందుతుంది. -
తక్కువ ధరతో.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే CNG కార్లు
ఇండియన్ మార్కెట్లో పెట్రోల్, ఎలక్ట్రిక్ కార్లకు మాత్రమే కాకుండా సీఎన్జీ కార్లకు కూడా మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ వాహన తయారీ సంస్థలు, తమ కార్లను సీఎన్జీ విభాగంలో లాంచ్ చేశాయి. ఈ కథనంలో రూ.8 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభిస్తున్న టాప్ 5 కార్ల గురించి తెలుసుకుందాం.టాటా పంచ్అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా నిలిచిన టాటా పంచ్ ప్రస్తుతం మార్కెట్లో సీఎన్జీ విభాగంలో.. ఓ సరసమైన కారుగా లభిస్తోంది. ఇది ప్యూర్, అడ్వెంచర్ అనే రెండు వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది. వీటి ప్రారంభ ధరలు వరుసగా రూ. 7.22 లక్షలు, రూ. 7.94 లక్షలు (ఎక్స్ షోరూమ్). చూడటానికి ఫ్యూయెల్ మోడల్ మాదిరిగా అనిపించినప్పటికీ.. ఇందులో సీఎన్జీ బ్యాడ్జెస్ చూడవచ్చు.టాటా పంచ్ సీఎన్జీ కారులో 3.5 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, ఫోర్ స్పీకర్ ఆడియో సెటప్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్వీఎం వంటి ఫీచర్స్ ఉన్నాయి. పంచ్ సీఎన్జీ కారు 6000 rpm వద్ద 72.4 Bhp పవర్, 3250 rpm వద్ద 103 Nm టార్క్ అందిస్తుంది. ఇది పెట్రోల్ కారు కంటే కూడా ఎక్కువ మైలేజ్ అందిస్తుంది.హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ సీఎన్జీ కారు ప్రారంభ ధర రూ. 7.75 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది పెట్రోల్ (రూ. 5.92) వేరియంట్ ప్రారంభ ధర కంటే కొంత ఎక్కువే అయినప్పటికీ కొంత ఎక్కువ మైలేజ్ అందిస్తుంది. ఇది 68 బీహెచ్పీ పవర్, 95.1 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇందులో 3.5 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్వీఎం, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు వంటివి ఉన్నాయి.టాటా ఆల్ట్రోజ్టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ మొత్తం ఎనిమిది వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ. 6.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారులోని 1.2 లీటర్ ఇంజిన్ 6000 rpm వద్ద 72.4 Bhp, 3500 rpm వద్ద 103 Nm టార్క్ అందిస్తుంది. ఈ కారులో 4 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రియర్ పార్కింగ్ సెన్సార్, డ్యూయల్ ఎయిర్బ్యాగ్లు వంటి ఫీచర్స్ ఉన్నాయి.హ్యుందాయ్ ఆరాహ్యుందాయ్ ఆరా సీఎన్జీ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. దీని ప్రారంభ ధర రూ.7.48 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారులోని ఎక్ట్సీరియర్, ఇంటీరియర్ రెండు కలర్ ఆప్షన్స్ పొందుతాయి. ఇందులోని ఇంజిన్ 68 Bhp, 95.1 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారులో 3.5 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, టిల్ట్ స్టీరింగ్ వీల్, ముందు భాగంలో పవర్ విండోస్, కూల్డ్ గ్లోవ్బాక్స్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, అడ్జస్టబుల్ రియర్ సీటు హెడ్రెస్ట్ వంటివి ఉన్నాయి.మారుతి సుజుకి సెలెరియోమారుతి సుజుకి సెలెరియో సీఎన్జీ కేవలం ఒకే వేరియంట్లో అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ.6.73 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులోని 1.0 లీటర్ కే సిరీస్ ఇంజిన్ 5300 rpm వద్ద 55.9 Bhp పవర్.. 3400 rpm వద్ద 82.1 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారులో ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్వీఎం, డ్యూయల్ ఎయిర్బ్యాగ్లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి. -
వాహనాల విక్రయాలు అదుర్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా తయారీ కంపెనీల నుండి డీలర్షిప్లకు చేరిన ప్యాసింజర్ వెహికిల్స్ (పీవీ) సంఖ్య గతేడాదితో పోలిస్తే 2024 నవంబర్లో 4 శాతం పెరిగి 3,47,522 యూనిట్లకు చేరుకున్నాయి. భారత పీవీ రంగంలో నవంబర్ నెలలో ఇవే ఇప్పటి వరకు అత్యధికం.అక్టోబర్లో పండుగ తర్వాత డిమాండ్ ఊపందుకుందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) తెలిపింది. సియామ్ గణాంకాల ప్రకారం.. గత ఏడాది నవంబర్లో మొత్తం ప్యాసింజర్ వాహనాల హోల్సేల్ విక్రయాలు 3,33,833 యూనిట్లుగా ఉన్నాయి. మార్కెట్ లీడర్ మారుతీ సుజుకీ ఇండియా గత నెల హోల్సేల్ అమ్మకాలు 5 శాతం వృద్ధితో 1,41,312 యూనిట్లను తాకాయి.హ్యుందాయ్ మోటార్ ఇండియా నుంచి డీలర్లకు చేరిన వాహనాల సంఖ్య 49,451 నుంచి 48,246 యూనిట్లకు తగ్గాయి. మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు 16 శాతం వృద్ధితో 46,222 యూనిట్లకు ఎగశాయి. ద్విచక్ర వాహనాల హోల్సేల్స్ 2023 నవంబర్లో 16,23,399 యూనిట్లు నమోదు కాగా, గత నెలలో 1 శాతం తగ్గి 16,04,749 యూనిట్లకు చేరుకున్నాయి.స్కూటర్ల విక్రయాలు 12 శాతం పెరిగి 5,68,580 యూనిట్లకు చేరుకున్నాయి. మోటార్సైకిల్స్ 7.5 శాతం తగ్గి 9,90,246 యూనిట్లకు పడిపోయాయి. గత నెలలో మోపెడ్ హోల్సేల్స్ 6 శాతం పెరిగి 45,923 యూనిట్లు నమోదయ్యాయి. త్రీ–వీలర్స్ 1 శాతం క్షీణించి 59,350 యూనిట్లకు వచ్చి చేరాయి. దీపావళి కాని నవంబర్లో మొదటిసారిగా టూవీలర్స్ హోల్సేల్ విక్రయాలు 16 లక్షల యూనిట్ల మార్కును దాటింది. -
కొత్త కారు కొనాలనుకుంటున్నారా? ఈ టిప్స్ మీకోసమే..
కాలం మారింది.. నేడు ఇంటికో వాహనం కనిపిస్తోంది. అయితే ఇప్పటికీ కొందరు కేవలం టూ వీలర్స్ మాత్రమే వినియోగిస్తున్నారు. అలాంటి వారిలో కొందరు కొత్త కారు కొనాలని యోచించవచ్చు. అయితే కొత్త కారు కొనేముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి టిప్స్ పాటించాలన్నది బహుశా తెలియకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలను క్షుణ్ణంగా తెలుసుకుందాం.ముందుగా సెర్చ్ చేయండిమార్కెట్లో లెక్కకు మించిన కార్లు నేడు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఏది మంచి కారు అనే విషయాన్ని తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్లను లేదా డీలర్షిప్లను సందర్శించండి. కస్టమర్ల రివ్యూలను బేరీజు వేసుకోవాలి. మీరు కొనాలనుకే కారు వాస్తవ ప్రపంచంలో ఎలాంటి పనితీరును అందిస్తుందనే విషయంపై కూడా అవగాహన పెంచుకోవాలి.బడ్జెట్ సెట్ చేసుకోవాలికారు కొనాలనుకోవడం సులభమే.. అయితే ఎంత బడ్జెట్లో కొనుగోలు చేయాలి? మన దగ్గర ఉన్న బడ్జెట్ ఎంత అనేదాన్ని కూడా ఆలోచించాలి. కేవలం కారు కొనాలంటే కేవలం ఎక్స్ షోరూమ్ ధరలను మాత్రమే కాకుండా.. లోన్ తీసుకుంటే కట్టాల్సిన వడ్డీ, ఇన్సూరెన్స్, మెయింటెనెన్స్ వంటివి చాలానే ఉంటాయి. వీటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి వీటన్నింటికి బడ్జెట్ సెట్ చేసుకోవాలి.ఫైనాన్సింగ్ ఆప్షన్స్కారు కొనాలంటే.. అందరూ మొత్తం డబ్బు చెల్లించి కొనుక్కోలేరు. కాబట్టి ఫైనాన్సింగ్ ఆప్షన్స్ ఎంచుకోవాలి. ఇది మీ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయకుండా చేస్తుంది. బ్యాంకులు, క్రెడిట్ యూనియన్లు, కార్ ఫైనాన్స్ కంపెనీలు అందించే వడ్డీ రేట్లతో పాటు.. ఇతర నిబంధనలను కూడా సరిపోల్చుకోండి. ఏదైనా ఆఫర్స్, డిస్కౌంట్స్ లేదా తక్కువ డౌన్ పేమెంట్ స్కీమ్స్ వంటి వాటిని ఎంచుకోవాలి.తెలివిగా చర్చించండికారు కొనడానికి డీలర్షిప్కు వెళ్తే.. అక్కడ తెలివిగా చర్చించాల్సి ఉంటుంది. మార్కెట్లో ఆ కారు ధర ఎంత, అప్పటికి ఏదైనా ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయా? అనే విషయాలను కూడా ముందుగానే తెలుసుకుని ఉండాలి. మీ డీల్ అంచనాలకు దగ్గరగా లేకపోతే అక్కడ నుంచి వెళ్లిపోవడానికి కూడా సిద్ధంగా ఉండండి. ఇయర్ ఎండ్, ఫెస్టివల్ డిస్కౌంట్స్, డీలర్షిప్ ప్రోత్సాహకాలు వంటి వాటిని దృష్టిలో ఉంచుకుని.. అలాంటి సమయంలో కారు కొనుగోలు సిద్దమవ్వండి.బీమా కవరేజ్బహుళ ప్రొవైడర్ల నుంచి బీమా ప్రీమియంలను సరిపోల్చండి. అందులో మీ వాహనానికి తగిన కవరేజీని అందిస్తూ చట్టపరమైన అవసరాలను తీర్చే ప్లాన్ను ఎంచుకోండి. యాడ్ ఆన్ కవర్లు, క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తులు వంటి అంశాలను పరిగణించండి. అలారం, ఇమ్మొబిలైజర్లు, ట్రాకింగ్ పరికరాల వంటి భద్రతా ఫీచర్లను ఇన్స్టాల్ చేయడం వల్ల బీమా ప్రీమియంలు కూడా తగ్గుతాయి. వీటన్నింటిని గురించి తెలుసుకోండి.క్రెడిట్ స్కోర్కారు కొనుగోలు చేయాలంటే.. దాని కోసం లోన్ తీసుకోవాలంటే, మీకు మంచి సిబిల్ స్కోర్ ఉండాలి. మీకున్న సిబిల్ స్కోరును బట్టి మీకు లోన్ లభిస్తుంది. వడ్డీ రేటు తగ్గాలంటే.. సిబిల్ స్కోర్ తప్పకుండా కొంత ఎక్కువగానే ఉంటుంది.ప్రభుత్వ ప్రోత్సాహకాలుఎలక్ట్రిక్ కారు, హైబ్రిడ్ కారు కొనుగోలు చేస్తే.. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సబ్సిడీలు, పన్ను ప్రయోజనాలు వంటివి లభిస్తాయి. కాబట్టి దీని గురించి కూడా తప్పకుండా తెలుసుకోవాలి. ఇలాంటి ప్రోత్సాహకాలు గురించి తెలుసుకుంటే.. ఖర్చులు కొంత తగ్గుతాయి.ఇంధన సామర్థ్యంకారు ఎంచుకునే ముందే.. ఏ ఇంజిన్ ఆప్షన్ కలిగిన కారును కొనుగోలు చేయాలి. పెట్రోల్ ఇంజిన్ కారును ఎంచుకుంటే.. అది ఎంత మైలేజ్ అందిస్తుంది? డీజిల్ ఇంజిన్ ఎంచుకుంటే.. అది ఎంత మైలేజ్ అందిస్తుందనేది తెలుసుకోవాలి. ఎక్కువ మైలేజ్ అందించే కార్లను కొనుగోలు చేస్తే.. ఇంధన ఖర్చులు తగ్గుతాయి. కాబట్టి ఇంధన సామర్థ్యాన్ని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. -
10 రోజుల్లో 10000 మంది కొన్న కారు ఇదే..
చెక్ రిపబ్లిక్ కార్ల తయారీ సంస్థ 'స్కోడా' (Skoda) ఇటీవలే మార్కెట్లో 'కైలాక్' పేరుతో ఓ కాంపాక్ట్ ఎస్యూవీ లాంచ్ చేసింది. అయితే 10 రోజుల ముందే దీని కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కాగా ఇప్పటికి ఈ ఎస్యూవీ బుకింగ్స్ 10,000 దాటినట్లు సమాచారం. కాగా బుక్ చేసుకున్న కస్టమర్లకు 2025 జనవరి 27న డెలివరీలు ప్రారంభమవుతాయి.స్కోడా కైలాక్ అనేది MQB A0-IN ప్లాట్ఫామ్ ఆధారంగా నిర్మితమైన మొదటి కాంపాక్ట్ ఎస్యూవీ. ఇది ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న కుషాక్ కింద ఉంటుంది. క్లాసిక్, సిగ్నేచర్, సిగ్నేచర్ ప్లస్, ప్రెస్టీజ్ అనే నాలుగు వేరియంట్లలో లభించే ఈ కారు ప్రారంభ ధర రూ. 7.89 లక్షలు (ఎక్స్ షోరూమ్).మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా నెక్సాన్, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ , మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న స్కోడా కైలాక్ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 113 Bhp పవర్, 178 Nm టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ పొందుతుంది.ఇదీ చదవండి: భారత్లోని బెస్ట్ 5 డీజిల్ కారు ఇవే!.. పూర్తి వివరాలుఫీచర్స్ విషయానికి వస్తే.. కైలాక్ 8 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లేతో కూడిన 10.1 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి వాటిని పొందుతుంది. అంతే కాకుండా వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, కాంటన్ సౌండ్ సిస్టమ్, యాంబియంట్ లైటింగ్ వంటివి కూడా ఇందులో ఉన్నాయి. -
8 వేల మారుతీ సుజుకీ సర్వీసింగ్ కేంద్రాలు
వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా దేశవ్యాప్తంగా సర్వీసింగ్ కేంద్రాలను విస్తరిస్తోంది. 2030–31 నాటికి మొత్తం 8,000 టచ్ పాయింట్లు అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా చేసుకున్నట్టు సంస్థ ఎండీ, సీఈవో హిసాటీ టాకేయూచీ తెలిపారు. నెక్సా 500వ టచ్ పాయింట్ను కంపెనీ తాజాగా ప్రారంభించింది.నెక్సా, అరీనా బ్రాండ్లలో మారుతీ సుజుకీ ఇండియాకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,240 సర్వీసింగ్ కేంద్రాలు ఉన్నాయి. ‘కస్టమర్లకు సౌలభ్యం, అత్యుత్తమ కారు యాజమాన్య అనుభవాన్ని స్థిరంగా అందించడమే మా లక్ష్యం. వినియోగదార్లకు దగ్గరవ్వాలి. తద్వారా సమీపంలో మారుతీ సుజుకీ సర్వీస్ టచ్పాయింట్ని కనుగొనగలమన్న భరోసా వారికి ఉంటుంది. వార్షిక తయారీ సామర్థ్యాన్ని, అమ్మకాలను గణనీయంగా పెంచడానికి ప్రణాళిక చేస్తున్నందున సర్వీస్ నెట్వర్క్ను ఏకకాలంలో బలోపేతం చేస్తాం’ అని టాకేయూచీ వివరించారు.మారుతీ సుజుకీ తన మొదటి నెక్సా సర్వీస్ సెంటర్ను 2017 జూలైలో ప్రారంభించింది. 2023–24లో 90 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఒక సంవత్సరంలో ఇదే అత్యధికం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు కంపెనీ కొత్తగా 78 నెక్సా సర్వీస్ టచ్పాయింట్లను తెరిచింది. 500ల సర్వీస్ టచ్పాయింట్ల మైలురాయిని 7 సంవత్సరాల 5 నెలల వ్యవధిలో చేరుకుంది. -
భారత్లోని బెస్ట్ 5 డీజిల్ కారు ఇవే!.. పూర్తి వివరాలు
ఒకప్పటి నుంచి భారతదేశంలో డీజిల్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. అయితే వాయు కాలుష్య కారణాలను దృష్టిలో ఉంచుకుని ఉద్గార ప్రమాణాలు కఠినంగా మారాయి. దీంతో కంపెనీలు డీజిల్ కార్ల ఉత్పత్తిని చాలా వరకు తగ్గించేసాయి. అయితే ఇప్పటికి కూడా కొన్ని డీజిల్ కార్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ కథనంలో రూ.10 లక్షల లోపు ధర వద్ద అందుబాటులో ఉన్న టాప్ 5 కార్లను గురించి వివరంగా తెలుసుకుందాం.టాటా ఆల్ట్రోజ్టాటా ఆల్ట్రోజ్ ప్రస్తుతం భారతదేశంలో అమ్ముడవుతున్న అత్యంత సరసమైన డీజిల్ కారు. దీని ప్రారంభ ధర రూ. 8.69 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారులోని 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 90 Bhp పవర్, 200 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పొందుతుంది.మహీంద్రా బొలెరోరూ. 9.79 లక్షల ధర మధ్య లభించే మహీంద్రా కంపెనీకి చెందిన 'బొలెరో' (బిఎస్4 మోడల్) మన జాబితాలో చెప్పుకోదగ్గ డీజిల్ కారు. దీనిని ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఇందులోని 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 76 Bhp పవర్, 210 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్బాక్స్తో లభిస్తుంది.కియా సోనెట్కియా సోనెట్ అనేది సబ్ 4 మీటర్ కాంపాక్ట్ ఎస్యూవీ. ఇందులో 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 115 Bhp పవర్, 253 Nm టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పొందుతుంది. ఈ కారు ప్రారంభ ధర దేశీయ విఫణిలో రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్).మహీంద్రా బొలెరో నియోమహీంద్రా బొలెరో నియో.. చూడటానికి కొంత బొలెరో మాదిరిగానే అనిపిస్తుంది. కానీ నిశితంగా పరిశీలిస్తే కొన్ని తేడాలను గమనించవచ్చు. ఈ కారు ప్రారంభ ధర రూ. 9.94 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులోని 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 100 Bhp పవర్, 210 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.ఇదీ చదవండి: టయోటా కొత్త కారు లాంచ్: ధర రూ.48 లక్షలుమహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన ఎక్స్యూవీ 3ఎక్స్ కూడా మన జాబితాలో ఒకటి. రూ. 9.98 లక్షల ప్రారంభ ధర వద్ద లభిస్తున్న ఈ కారు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ద్వారా 115 Bhp పవర్, 300 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. -
ఈ రంగంలో ప్రపంచ అగ్రగామిగా భారత్.. నితిన్ గడ్కరీ
వచ్చే ఐదేళ్లలో భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమ.. ప్రపంచంలోనే అగ్ర స్థానానికి చేరుతుందని కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' పేర్కొన్నారు. ఈ రంగంలో అమెరికా, చైనాలను సైతం అవలీలగా దాటేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో లాజిస్టిక్స్ ఖర్చులు లాజిస్టిక్స్ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని అన్నారు.అమెజాన్ సంభవ్ సమ్మిట్ (Amazon Smbhav Summit)లో గడ్కరీ మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశం ఆటోమొబైల్ పరిశ్రమలో విపరీతమైన వృద్ధిని సాధించింది. తాను రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత రూ.7 లక్షల కోట్ల నుంచి రూ.22 లక్షల కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.ప్రస్తుతం రూ. 78 లక్షల కోట్లతో అమెరికా అగ్రస్థానంలో ఉంది, తరువాత స్థానంలో చైనా (రూ. 47 లక్షల కోట్లు) ఉంది. భారత్ మూడో స్థానంలో (రూ. 22 లక్షల కోట్లు) ఉంది. కాబట్టి రానున్న ఐదు సంవత్సరాలలో భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే అగ్రగామిగా చేయాలనీ, తప్పకుండా అవుతుందని గడ్కరీ అన్నారు.ఇదీ చదవండి: టాప్ 5 బడ్జెట్ కార్లు: ధర తక్కువ.. ఎక్కువ కంఫర్ట్భారతదేశంలో లాజిస్టిక్స్ ఖర్చులను 2 సంవత్సరాలలోపు సింగిల్ డిజిట్కు తగ్గించాలనే మంత్రిత్వ శాఖ లక్ష్యాన్ని గడ్కరీ వివరించారు. మన దేశంలో లాజిస్టిక్ ధర 16 శాతం ఉంది, ఇది చైనాలో 8 శాతం, అమెరికా & యూరోపియన్ దేశాలలో ఇది 12 శాతంగా ఉంది. కాబట్టి భారత్ ప్రపంచ దేశాలతో పోటీపడాలంటే లాజిస్టిక్ ఖర్చులను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. -
టయోటా కొత్త కారు లాంచ్: ధర రూ.48 లక్షలు
టయోటా కంపెనీ ఎట్టకేలకు తన 9వ తరం 'క్యామ్రీ'ని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ సెడాన్ రూ. 48 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతో ఒకే వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంది.సరికొత్త టయోటా క్యామ్రీ TNGA-K ప్లాట్ఫామ్పై ఆధారంగా నిర్మితమైంది. ఇది యూ షేప్ హెడ్ల్యాంప్లతో కూడిన పెద్ద ట్రాపెజోయిడల్ గ్రిల్, వెనుక వైపు కొత్త టెయిల్లైట్ వంటివి ఉన్నాయి. ఈ కారులో 12.3 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 3 స్పోక్ స్టీరింగ్ వీల్, 10 వే అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, రిక్లైనింగ్ రియర్ సీట్లు, 3 జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ ఛార్జర్, హెడ్స్ అప్ డిస్ప్లే, 9 స్పీకర్ జేబీఎల్ ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.ఇదీ చదవండి: టాప్ 5 బడ్జెట్ కార్లు: ధర తక్కువ.. ఎక్కువ కంఫర్ట్టయోటా క్యామ్రీలోని 2.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 227 బీహెచ్పీ, 220 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఈసీవీటీ (ఎలక్ట్రిక్ కంటిన్యూస్లీ వేరియబుల్ ట్రాన్స్మిషన్) పొందుతుంది. కాబట్టి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఈ సేడం లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్, 9 ఎయిర్బ్యాగ్లు, 360 డిగ్రీ కెమెరా వంటి మరిన్ని సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. -
టాప్ 5 బడ్జెట్ కార్లు: ధర తక్కువ.. ఎక్కువ కంఫర్ట్
ఎస్యూవీలు, ఎంపీవీలు, సెడాన్లు, హ్యాచ్బ్యాక్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే దేశీయ విఫణిలో ఉన్న కార్ మోడల్స్ కోకొల్లలు. మార్కెట్లో ఎన్నెన్ని కార్లున్నా బడ్జెట్ కార్లకే ఎక్కువ డిమాండ్ ఉందనేది అందరికీ తెలిసిన సత్యం. బడ్జెట్ కార్ల విభాగంలో కూడా లెక్కకు మించిన కార్లు ఉండటం వల్ల.. ఇందులో బెస్ట్ కార్లు ఏవి అనేది కొందరికి అంతుచిక్కని ప్రశ్న. ఈ కథనంలో ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం.మారుతి సుజుకి ఆల్టో 800భారతదేశంలో అత్యధిక అమ్మకాలు పొందుతున్న, ఎక్కువ మంది ప్రజలను ఆకర్శించడంలో విజయం పొందిన కార్లలో 'మారుతి సుజుకి ఆల్టో 800' ప్రధానంగా చెప్పుకోదగ్గ మోడల్. రూ.3.25 లక్షల నుంచి రూ.5.12 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ధరతో లభించే ఈ కారు చూడటానికి పరిమాణంలో కొంత చిన్నదిగా ఉన్నప్పటికీ రోజువారీ వినియోగానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. లేటెస్ట్ ఫీచర్స్ కూడా ఇందులో ఉంటాయి. పనితీరు ఉత్తమంగానే ఉంటుంది.మారుతి సుజుకి స్విఫ్ట్మారుతి అంటే అందరికి గుర్తొచ్చేది స్విఫ్ట్. మంచి పర్ఫామెన్స్, ఆకర్షణీయమైన డిజైన్ కలిగిన ఈ కారు డ్యూయల్ టోన్ స్పోర్టీ స్టైల్, క్రాస్డ్ మెష్ గ్రిల్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్లైట్స్ వంటి వాటితో పాటు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, నావిగేషన్ సిస్టమ్, ఆటోమేటిక్ గేర్ స్విచ్, మల్టీ-కలర్ ఇన్ఫర్మేషన్ మానిటర్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, డ్యూయల్ ఎయిర్బ్యాగ్స్ వంటి ఎన్ని ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు ప్రారంభ ధర రూ.6.49 లక్షల నుంచి రూ.9.60 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది.హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్హ్యుందాయ్ కంపెనీకి చెందిన గ్రాండ్ ఐ10 నియోస్ కూడా ఎక్కువమంది కొనుగోలు చేస్తున్న పాపులర్ బడ్జెట్ కారు. మల్టిపుల్ వేరియంట్లలో లభించే ఈ కారు డీజిల్, పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. అప్డేటెడ్ గ్రాండ్ ఐ10 నియోస్ కొత్త ప్లాట్ఫామ్ ఆధారంగా నిర్మితమైంది. కాబట్టి ఇది రీడిజైన్ హెడ్ల్యాంప్లు, ఫ్రంట్ గ్రిల్ వంటివి పొందుతుంది. దీని ప్రారంభ ధర రూ.5.92 లక్షలు (ఎక్స్ షోరూమ్).టాటా టియాగోదేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ కూడా సరసమైన ధర వద్ద లభించే కార్లను మార్కెట్లో విక్రయిస్తోంది. ఇందులో ఒకటి టియాగో. 2016లో పరిచయమైన ఈ కారు మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలతో వస్తుంది. మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ కారు 242 లీటర్ బూట్ స్పేస్ పొందుతుంది. హైట్ అడ్జస్టబుల్ సీటు, రియర్వ్యూ కెమెరా, టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ క్లస్టర్, 8 స్పీకర్ ఆడియో సిస్టమ్ వంటి అనేక ఫీచర్స్ ఈ కారులో ఉన్నాయి. దీని ధర రూ.5 లక్షలు (ఎక్స్ షోరూమ్).ఇదీ చదవండి: దేశీయ దిగ్గజం కీలక నిర్ణయం: భారీగా పెరగనున్న ధరలుమారుతి సుజుకి వ్యాగన్ ఆర్రూ.5.41 లక్షల నుంచి రూ.7.12 లక్షల మధ్య లభించే 'మారుతి సుజుకి వ్యాగన్ ఆర్' మన జాబితాలో చెప్పుకోదగ్గ కారు. 2400 మిమీ వీల్బేస్ కలిగి ఐదుమంది ప్రయాణించడానికి అనుకూలంగా ఉండే ఈ కారు పెద్ద క్యాబిన్ కలిగి ఉంది. డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ పొందిన క్యాబిన్లోని డ్యాష్బోర్డ్ హై క్వాలిటీ ప్లాస్టిక్తో తయారైంది. మార్కెట్లో ఎక్కువమంది కొనుగోలు చేస్తున్న కార్ల జాబితాలో ఇది కూడా ఒకటి కావడం గమనార్హం. -
దేశీయ దిగ్గజం కీలక నిర్ణయం: భారీగా పెరగనున్న ధరలు
మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకి, హ్యుందాయ్ మోటార్స్, బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి కంపెనీలు ఇప్పటికే తమ బ్రాండ్ వాహనాల ధరలను 2025 జనవరి ప్రారంభం నుంచే పెంచనున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి దేశీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' కూడా చేరింది.టాటా మోటార్స్ తన మోడల్స్ ధరలను 3 శాతం వరకు పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ కొత్త ధరలు 2025 జనవరి నుంచే అమలులోకి వస్తాయి. కానీ ఏ వేరియంట్ ధర ఎంత అనేది త్వరలోనే వెల్లడవుతుంది. ఫ్యూయెల్ వాహనాలు మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.ఇన్పుట్ ఖర్చులు, ద్రవ్యోల్బణం పెరుగుదల కారణంగానే ధరలను పెంచుతున్నట్లు టాటా మోటార్స్ స్పష్టం చేసింది. కాగా కంపెనీ వచ్చే ఏడాదిలో మరిన్ని కొత్త కార్లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. 2025 భారత్ మొబిలిటీ ఎక్స్పోలో టాటా కొత్త ఉత్పత్తులు కనువిందు చేసే అవకాశం ఉంది.ఇదీ చదవండి: భారత్లో అత్యధికంగా అమ్ముడైన కారు: 1.86 లక్షల మంది కొనేశారువాహన తయారీ సంస్థలు ధరలను పెంచడం ఇదే మొదటిసారి కాదు. ప్రతి ఏటా.. ఏడాది చివరలో లేదా పండుగ సీజన్లలో ధరలను పెంచుతాయి. ఇప్పుడు కూడా ఇదే విధానం అనుసరించి.. పలు కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ధరల పెరుగుదల అమ్మకాలపైన ప్రభావం చూపుతుందా?.. లేదా? అనేది తెలియాల్సి ఉంది. -
భారత్లో అత్యధికంగా అమ్ముడైన కారు: 1.86 లక్షల మంది కొనేశారు
భారతదేశంలో లెక్కకు మించిన కార్లు అందుబాటులో ఉన్నాయి. అయితే దేశీయ విఫణిలో అమ్మకానికి ఉన్న అన్ని కార్లూ.. గొప్ప విక్రయాలను పొందలేవు. కానీ కొన్ని కార్లు మాత్రం ఊహకందని రీతిలో అమ్ముడవుతాయి. ఈ కథనంలో ఈ ఏడాది దేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లను గురించి తెలుసుకుందాం.దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్.. మార్కెట్లో 2021లో 'పంచ్' పేరుతో మైక్రో ఎస్యూవీని లాంచ్ చేసింది. ఈ కారు ఈ ఒక్క ఏడాది ఏకంగా 1.86 లక్షల సేల్స్ పొంది.. అమ్మకాల్లో అగ్రగామిగా నిలిచింది. 2023లో 1.50 లక్షల టాటా పంచ్ కార్లు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో టాటా పంచ్ పెట్రోల్, ఎలక్ట్రిక్, CNG రూపాల్లో అందుబాటులో ఉంది.చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ.. టాటా పంచ్ సేఫ్టీ రేటింగులో 5 స్టార్స్ సొంతం చేసుకుని, అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా నిలిచింది. టాటా పంచ్ ధర రూ. 6.13 లక్షల నుంచి రూ. 10.15 లక్షల మధ్య ఉంటుంది. అదే సమయంలో పంచ్ ఎలక్ట్రిక్ కారు ధరలు రూ. 9.99 లక్షల నుంచి రూ. 14.29 లక్షల (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.2024లో (జనవరి నుంచి నవంబర్) అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు⮞టాటా పంచ్: 1,86,958 యూనిట్లు⮞హ్యుందాయ్ క్రెటా: 1,74,311 యూనిట్లు⮞మారుతి సుజుకి బ్రెజ్జా: 1,70,824 యూనిట్లు⮞మహీంద్రా స్కార్పియో: 1,54,169 యూనిట్లు⮞టాటా నెక్సాన్: 1,48,075 యూనిట్లు⮞మారుతి సుజుకి ఫ్రాంక్స్: 1,45,484 యూనిట్లు⮞మారుతి సుజుకి గ్రాండ్ విటారా: 1,15,654 యూనిట్లు⮞హ్యుందాయ్ వెన్యూ: 1,07,554 యూనిట్లు⮞కియా సోనెట్: 1,03,353 యూనిట్లు⮞మహీంద్రా బొలెరో: 91,063 యూనిట్లుఇదీ చదవండి: మరో ఖరీదైన కారు కొన్న జొమాటో సీఈఓ: ధర ఎన్ని కోట్లో తెలుసా? -
2025లో లాంచ్.. ఇప్పుడే సిద్దమైన డుకాటీ
ప్రముఖ బైక్ తయారీ సంస్థ 'డుకాటీ' సరికొత్త మల్టిస్ట్రాడా వీ2, వీ2 ఎస్ బైకులను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. కంపెనీ ఈ బైకులను వచ్చే ఏడాది (2025) లాంచ్ చేయనున్నట్లు సమాచారం.2025లో లాంచ్ కానున్న కొత్త డుకాటీ మల్టీస్ట్రాడా వీ2 బైక్.. దాని మునుపటి మోడల్స్ కంటే కూడా 18 కేజీల తక్కువ బరువుతో ఉంటుంది. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 19 లీటర్లు. ఇందులోని 890 సీసీ ఇంజిన్ 115.6 హార్స్ పవర్, 92.1 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ స్లిప్పర్ క్లచ్ అండ్ బైడైరెక్షనల్ క్విక్షిఫ్టర్తో 6 స్పీడ్ గేర్బాక్స్ పొందుతుంది.కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ కాకుండా డిజైన్, ఫీచర్స్ వంటివన్నీ రెండింటిలోనూ ఒకే విధంగా ఉన్నప్పటికీ.. ఎస్ వేరియంట్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ యూనిట్. ఈ బైక్ ముందు భాగంలో 120/70-ఆర్19 టైర్, వెనుక 170/60-ఆర్19 టైర్లు ఉన్నాయి. ఇందులో 320 మిమీ ఫ్రంట్ డిస్క్లు, వెనుక 265 మిమీ రియర్ డిస్క్ ఉన్నాయి.మల్టీస్ట్రాడా వీ2 ట్రాక్షన్ కంట్రోల్, రైడింగ్ మోడ్లు, స్విచబుల్ డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, పవర్ మోడ్లు, ఇంజిన్ బ్రేకింగ్ కంట్రోల్తో కూడిన సరికొత్త ఎలక్ట్రానిక్స్ వంటివన్నీ ఉన్నాయి. ఈ ఎలక్ట్రానిక్స్ అన్నీ 5 ఇంచెస్ టీఎఫ్టీ డిస్ప్లేలో కనిపిస్తాయి. ప్రస్తుతం కంపెనీ ఈ బైక్ ధరలను వెల్లడించలేదు. అయితే ధరలు రూ. 16 లక్షల కంటే ఎక్కువ ఉండొచ్చని సమాచారం. -
తళుక్కుమన్న టీవీఎస్ సరికొత్త రోనిన్
వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ 2025 ఎడిషన్ రోనిన్ మోటార్సైకిల్ ఆవిష్కరించింది. గోవాలో జరుగుతున్న టీవీఎస్ మోటోసోల్ 4.0 కార్యక్రమంలో ఈ సరికొత్త మోడల్ తళుక్కుమంది. 225 సీసీ ఇంజన్తో ఇది తయారైంది. 20 బీహెచ్పీ, 19 ఎన్ఎం టార్క్ అందిస్తుంది.5 స్పీడ్ గేర్బాక్స్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఎల్ఈడీ లైటింగ్, సైడ్ స్టాండ్ కట్–ఆఫ్ సెన్సార్, సైలెంట్ స్టార్టర్ వంటి హంగులు ఉన్నాయి. టీవీఎస్ రోనిన్ మిడ్–వేరియంట్ రైడర్ల భద్రత, స్థిరత్వాన్ని పెంపొందించడానికి డ్యూయల్–ఛానల్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్తో రూపొందింది. బేస్ వేరియంట్కు సింగిల్ చానెల్ ఏబీఎస్ ఏర్పాటు చేశారు.‘ఈ అప్గ్రేడ్ టీవీఎస్ రోనిన్ యొక్క మూడు వేరియంట్లలో మరింత స్థిరమైన భేదాన్ని సృష్టిస్తుంది. ఇది రంగు, గ్రాఫిక్స్లో మాత్రమే కాకుండా కార్యాచరణలో కూడా స్పష్టమైన వ్యత్యాసాలను అందిస్తుంది’ అని కంపెనీ తెలిపింది. గ్లేసియర్ సిల్వర్, చార్కోల్ ఎంబర్ అనే రెండు కొత్త రంగులను కంపెనీ పరిచయం చేసింది. ఈ కొత్త రంగులు రోనిన్ మోడల్లలో ఇప్పటికే ఉన్న డెల్టా బ్లూ, స్టార్గేజ్ బ్లాక్లను భర్తీ చేస్తాయి.గివీతో టీవీఎస్ జోడీ..ఈ సందర్భంగా మోటార్సైకిల్ లగేజ్ సిస్టమ్లో ప్రపంచ అగ్రగామిగా ఉన్న గివీతో టీవీఎస్ మోటార్ కంపెనీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం వివిధ రైడింగ్ స్టైల్స్, స్టోరేజ్ అవసరాలకు అనుగుణంగా సమగ్రమైన ప్రీమియం లగేజ్ సొల్యూషన్లను అందజేస్తుందని టీవీఎస్ వివరించింది.ప్రత్యేకంగా టీవీఎస్ ద్విచక్ర వాహనాల కోసం కస్టమ్–డిజైన్ చేయబడిన ఫ్రేమ్లు, మౌంట్లను గివీ అభివృద్ధి చేస్తుంది. ఈ భాగస్వామ్యం ద్విచక్ర వాహనాల యాక్సెసరీల విభాగంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని, ఆధునిక మోటార్సైక్లిస్ట్లకు అత్యాధునిక డిజైన్, సౌకర్యాన్ని అందిస్తుందని టీవీఎస్ వివరించింది. -
కొత్త ఎలక్ట్రిక్ కారు.. పేరు మార్చేసిన మహీంద్రా: ఎందుకంటే..
మహీంద్రా ఎలక్ట్రిక్ కొత్తగా లాంచ్ చేసిన కారు పేరులో '6ఈ'ని ఉపయోగించడంపై.. భారత విమానయాన సంస్థ ఇండిగో అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఢిల్లీ హైకోర్టులో దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహీంద్రా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.ఇండిగో అభ్యంతరాన్ని దృష్టిలో ఉంచుకుని మహీంద్రా కంపెనీ తన బీఈ 6ఈ ఎలక్ట్రిక్ కారు పేరును 'బీఈ 6'గా మారుస్తున్నట్లు వెల్లడించింది. రెండు కంపెనీల మధ్య సంఘర్షణ అవసరం లేదు. కాబట్టే ఈ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. అంటే త్వరలో విక్రయానికి రానున్న మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కారు 'బీఈ 6'గా రానుంది.6ఈ పేరుతో ఇండిగో సేవలుఇండిగో సంస్థ తన బ్రాండింగ్ కోసం మాత్రమే కాకుండా.. ప్రయాణికులకు '6ఈ' పేరుతో సేవలందిస్తోంది. ఎయిర్లైన్ 6ఈ ప్రైమ్, 6ఈ ఫ్లెక్స్, బ్యాగేజ్ ఎంపికలు, లాంజ్ యాక్సెస్ వంటి వాటి కోసం కూడా 6ఈను ఉపయోగిస్తోంది. ఇప్పుడు మహీంద్రా '6ఈ'ను ఉపయోగించడం పట్ల ఇండిగో కోర్టును ఆశ్రయించింది. అయితే మహీంద్రా కంపెనీ తన కారు పేరును మార్చుకోవడంతో సమస్య సద్దుమణిగినట్లే అని స్పష్టమవుతోంది. -
జిమ్నీ కార్లు వెనక్కి.. మారుతి సుజుకి కీలక ప్రకటన
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన జిమ్నీ ఆఫ్-రోడర్ కారుకు రీకాల్ ప్రకటించింది. ఇప్పటి వరకు మార్కెట్లో విక్రయించిన అన్ని వేరియంట్లు ఈ రీకాల్ ప్రభావానికి గురయ్యాయి.మారుతి సుజుకి జిమ్నీ కారు 80 కిమీ వేగంతో వెళ్తున్న సమయంలో బ్రేక్ వేస్తే వైబ్రేషన్స్ వస్తున్నట్లు, వేగం 60 కిమీకి తగ్గితే ఈ వైబ్రేషన్ పోతుందని చాలామంది కస్టమర్లు ఫిర్యాదు చేశారు. దీంతో కంపెనీ ఈ సమస్యను పరిష్కరించుడనికి రీకాల్ ప్రకటించింది. కారులో సమస్యను కంపెనీ ఉచితంగానే పరిష్కరిస్తుంది.మారుతి సుజుకి దేశీయ విఫణిలో.. ఆఫ్-రోడ్ విభాగంలో కూడా తన హవాను చాటుకోవడానికి, 'మహీంద్రా థార్'కు ప్రత్యర్థిగా నిలువడానికి జిమ్నీ ఎస్యూవీని లాంచ్ చేసింది. ప్రారంభంలో ఈ కారు ఉత్తమ అమ్మకాలను పొందినప్పటికీ.. క్రమంగా అమ్మకాలు కొంత తగ్గుముఖం పట్టాయి. దీనికి కారణం కారు కొంత చిన్నదిగా ఉండటమే కాకుండా.. థార్ కంటే కూడా ధర కొంత ఎక్కువగా ఉండటం అనే తెలుస్తోంది.ఇదీ చదవండి: జనవరి నుంచి పెరగనున్న కార్ల ధరలు: ఎంతంటే..మారుతి జిమ్నీ మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఇందులోని 1.5 లీటర్ కే సిరీస్ పెట్రోల్ ఇంజిన్.. 104.8 పీఎస్ పవర్, 134.2 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మార్కెట్లో ఈ కారు ధర 12.74 లక్షల నుంచి రూ. 15.05 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. -
జనవరి నుంచి పెరగనున్న కార్ల ధరలు: ఎంతంటే..
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ 'మారుతి సుజుకి ఇండియా' జనవరి 2025లో తమ కార్ల ధరలను 4 శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు.. నిర్వహణ ఖర్చుల కారణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే మోడల్ వారీగా ధర పెరుగుదలకు సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడి కాలేదు.మారుతి తన కొత్త కార్లను నెక్సా & అరేనా అవుట్లెట్ల ద్వారా విక్రయిస్తుంది. నెక్సా అవుట్లెట్లలో ఇగ్నీస్, బాలెనొ, సియాజ్, గ్రాండ్ విటారా, జిమ్నీ, ఎక్స్ఎల్6, ఇన్విక్టో కార్లను విక్రయిస్తోంది. అరేనా అవుట్లెట్ల ద్వారా ఆల్టో కే10, ఎస్ ప్రెస్సో, సెలెరియో, ఈకో, వ్యాగన్ ఆర్, స్విఫ్ట్, బ్రెజ్జా, ఎర్టిగా కార్లను విక్రయిస్తోంది.మారుతి సుజుకి కొత్త ధరలను 2025 జనవరి నుంచే ప్రారంభించనుంది. ధరల పెరుగుదల.. కస్టమర్ల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి కంపెనీ సేల్స్ వచ్చే ఏడాదిలో ఎలా ఉండనున్నాయనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.వాహనాల ధరలను పెంచిన సంస్థల జాబితాలో ఇప్పటికే హ్యుందాయ్, మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి, నిస్సాన్ మోటార్ వంటి కంపెనీలు చేరాయి. ఇప్పుడు తాజాగా మారుతి సుజుకి కూడా ఈ జాబితాలోకి చేరింది. -
2025లో ఆ కార్లకే డిమాండ్!
భారతదేశంలో ప్రతి ఒక్కరూ సొంతంగా కారు కలిగి ఉండాలని భావిస్తున్నారు. ఈ కారణంగానే సరసమైన చిన్న కార్లకు ఆదరణ పెరుగుతోంది. ఈ డిమాండ్ 2025లో మరింత ఎక్కువగా ఉంటుందని.. గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ 'నోమురా' తన నివేదికలో పేర్కొంది.డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని అమెరికా, జపాన్ కంపెనీలు చిన్న కార్లను విరివిగా తయారు చేస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు మార్కెట్లో చిన్న కార్లను లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతున్నాయి. ఎస్యూవీలు, ప్రీమియం కార్ల ధరలు పెరగడంతో.. వాహన కొనుగోలుదారుల చూపు చిన్న కార్ల మీద పడింది. సీఎన్జీ కార్ల విక్రయాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి.చిన్న ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ కూడా పెరుగుతోంది. ఇప్పటికే చాలామంది ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు నోమురా తన నివేదికలో వెల్లడించింది. ప్రారంభంలో ఎలక్ట్రిక్ కార్లకు ఆశించిన స్థాయిలో ఆదరణ ఉండేది కాదు.. అయితే నేడు ఎక్కువమంది ఈ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.కరోనా మహమ్మారి సమయంలో గ్లోబల్ మార్కెట్లో వాహనాల ఉత్పత్తి భారీగా తగ్గింది. ఆ తరువాత ఆటోమొబైల్ కంపెనీలు కోలుకున్నప్పటికీ.. డిమాండుకు తగ్గ సరఫరా చేయడంలో కొంత విఫలమయ్యాయి. ప్రస్తుతం కార్ల ఉత్పత్తి వేగవంతమైంది. వచ్చే ఏడాది డిమాండుకు తగిన విధంగా డెలివరీ ఉంటుందని సర్వేలో వెల్లడైంది.ఇదీ చదవండి: రతన్ టాటా ఫ్రెండ్.. శంతను నాయుడు ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా?గ్లోబల్ ఆటోమొబైల్ మార్కెట్పై.. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ ప్రభావం కూడా ఉంటుంది. అంతే కాకుండా.. ఐరోపాలో ఉద్యోగ నష్టాలు.. ఫ్రాన్స్ & జర్మనీలలో రాజకీయ గందరగోళం వంటివి ఐరోపాలో మొత్తం డిమాండ్ రికవరీని ప్రభావితం చేసిందని నోమురా నివేదిక ద్వారా తెలిసింది. యూఎస్ ట్యాక్స్, అధిక ధరలు వంటివి కూడా కార్ల అమ్మకాల మీద ప్రభావం చూపినట్లు సమాచారం. -
హోండా అమేజ్ థర్డ్ జనరేషన్ వచ్చేసింది..
కార్ల తయారీలో ఉన్న జపాన్ సంస్థ హోండా మూడవ తరం అమేజ్ను కంపెనీ పరిచయం చేసింది. ఎక్స్ షోరూమ్లో ధర రూ.7.99 లక్షల నుండి రూ.10.89 లక్షల వరకు ఉంది. ఈ మోడల్ మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్లలో తయారైంది. కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో మారుతీ డిజైర్, హ్యుండై ఆరా వంటి మోడళ్లతో ఇది పోటీపడుతోంది.దేశంలో అడాస్ భద్రతా ఫీచర్లను కలిగిన అత్యంత సరసమైన కారు అమేజ్ అని హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో టకుయ సుమూర చెప్పారు.హోండా దేశంలో ఇప్పటివరకు 5.8 లక్షల యూనిట్ల అమేజ్ కార్లను విక్రయించింది. అమేజ్ మొదటి తరం 2013లో, రెండవ తరం 2018లో ప్రవేశించింది. అమేజ్ కస్టమర్లలో 50% మంది మొదటిసారి కారును సొంతం చేసుకున్నవారేనని సేల్స్ వైస్ ప్రెసిడెంట్ కునాల్ బెహల్ పేర్కొన్నారు. 2027 నాటికి మరో మూడు మోడళ్లు హోండా 2027 మార్చి నాటికి భారత్లో మూడు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. బలంగా అభివృద్ధి చెందుతున్న ఎస్యూవీ విభాగంలో వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని చూస్తున్నట్టు హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో టకుయ సుమూర తెలిపారు. కంపెనీ ప్రస్తుతం భారత్లో ఎలివేట్ ఎస్యూవీతోపాటు సెడాన్స్ అయిన అమేజ్, సిటీ మోడళ్లను విక్రయిస్తోంది.2026–27 ఆర్థిక సంవత్సరం నాటికి హైబ్రిడ్, ఎలక్ట్రిక్ పవర్ట్రెయిన్లతో మూడు కొత్త మోడళ్లను పరిచయం చేయడానికి ప్రణాళిక చేస్తున్నట్టు సుమూర తెలిపారు. తద్వారా ఎస్యూవీ విభాగంలో కంపెనీ ఉనికిని విస్తరిస్తుందని చెప్పా రు. భారతీయ మార్కెట్కు సరిపోయే హైబ్రిడ్, బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల వంటి మోడళ్లను హోండా అభివృద్ధి చేస్తూనే ఉందని వెల్లడించారు. -
థాయ్లాండ్లో రాయల్ ఎన్ఫీల్డ్ ప్లాంట్
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన రంగంలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ తాజాగా థాయ్లాండ్లో అసెంబ్లీ ప్లాంటును ప్రారంభించినట్లు ఐషర్ మోటార్స్ బుధవారం తెలిపింది. విడిభాగాలను దిగుమతి చేసుకుని ఈ కేంద్రంలో వాహనాల అసెంబుల్ చేస్తారు.‘అపారమైన వృద్ధికి అవకాశం ఉన్న మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే అంతర్జాతీయ విస్తరణ వ్యూహాన్ని కలిగి ఉండటమే మా వ్యూహాత్మక ఉద్దేశం. థాయ్లాండ్ అసెంబ్లీ ప్లాంట్ ఈ విజన్ను అందిస్తుంది’ అని రాయల్ ఎన్ఫీల్డ్ సీఈవో బి.గోవిందరాజన్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్జెంటీనా, కొలంబియా, బ్రెజిల్, బంగ్లాదేశ్, నేపాల్లో ఇప్పటికే రాయల్ ఎన్ఫీల్డ్కు ఇటువంటి అసెంబ్లింగ్ కేంద్రాలు ఉన్నాయి. నూతన ఫెసిలిటీ థాయ్లాండ్లో మిడ్–సెగ్మెంట్ మార్కెట్ను వృద్ధి చేయడంలో సహాయపడుతుందని విశ్వసిస్తున్నామని రాయల్ ఎన్ఫీల్డ్ సీసీవో యద్వీందర్ సింగ్ గులేరియా తెలిపారు.అలాగే ఈ ప్రాంతంలో పెరుగుతున్న డిమాండ్ను సమర్ధవంతంగా తీర్చడానికి వీలు కల్పిస్తుందని అన్నారు. కొత్త ప్లాంట్ సంవత్సరానికి 30,000 కంటే ఎక్కువ యూనిట్లను అసెంబుల్ చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంది. థాయ్లాండ్ మార్కెట్తో ప్రారంభించి దశలవారీగా ఈ ప్రాంతంలో విస్తరిస్తామని కంపెనీ తెలిపింది. -
250 కొత్త డీలర్షిప్లు.. ప్యూర్ ఈవీ విస్తరణ ప్రణాళిక
దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారుల్లో ఒకటైన ప్యూర్ ఈవీ సంస్థ తన విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. సుస్థిర రవాణా కోసం వినూత్న పరిష్కారాలను పరిచయం చేస్తూ దేశవ్యాప్తంగా ఉనికిని పెంచుకోవడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా విస్తరించే ప్రయత్నం చేస్తోంది.లాంగ్-రేంజ్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ మోటార్సైకిళ్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే 30 నెలల్లో 250 కొత్త డీలర్షిప్లను ఏర్పాటు చేయాలని ప్యూర్ ఈవీ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో దేశవ్యాప్తంగా తమ మొత్తం నెట్వర్క్ను 320కి పైగా పెంచుకోవాలని యోచిస్తోంది.నూతన ఆవిష్కరణలు, వాహనదారుల భద్రతకు తమ కంపెనీ కట్టుబడి ఉంటుందని ప్యూర్ ఈవీ వ్యవస్థాపకుడు, ఎండీ డాక్టర్ నిశాంత్ దొంగరి తెలిపారు. నానో పీసీఎం (ఫేజ్ చేంజ్ మెటీరియల్) టెక్నాలజీని బ్యాటరీ సిస్టమ్లలో ఉపయోగించిన మొదటి కంపెనీ తమదే అని పేర్కొన్నారు. ఈ టెక్నాలజీతో ప్రమాదాల శాతం తగ్గడమే కాకుండా బ్యాటరీల సామర్థ్యం కూడా పెరిగిందంటున్నారు. -
ఎంజీ తొలి లగ్జరీ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్.. ‘సైబర్స్టర్’ వస్తోంది
న్యూఢిల్లీ: వాహన రంగంలో ఉన్న జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఆల్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కన్వర్టబుల్ సైబర్స్టర్ మోడల్ను 2025 జనవరి–మార్చి మధ్య భారత్లో ప్రవేశపెడుతోంది. ధర రూ.65–70 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.ఎంజీ సెలెక్ట్ ఔట్లెట్లలో విక్రయానికి రానున్న తొలి మోడల్ ఇదేనని కంపెనీ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ గౌరవ్ గుప్తా తెలిపారు. వచ్చే రెండేళ్లలో నాలుగు ఎలక్ట్రిక్ మోడళ్లను పరిచయం చేయనున్నట్టు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. సైబర్స్టర్తోపాటు మరో మోడల్ సైతం మార్చిలోగా అడుగుపెట్టనుందని గుప్తా వెల్లడించారు.భారత్లో లగ్జరీ కార్ల విభాగం గత నాలుగేళ్లలో మాస్ సెగ్మెంట్ కార్ల కంటే రెండింతలై దాదాపు 25 శాతం వృద్ధి చెందిందని చెప్పారు. కంపెనీ పట్ల సానుకూల ప్రభావంతోపాటు సైబర్స్టర్ మొత్తం ఈవీలు, బ్రాండ్కు మరింత ఆకర్షణను జోడిస్తుందని అన్నారు. ఇది బ్రాండ్కు ప్రోత్సాహాన్ని ఇవ్వడంతోపాటు అదనపు గుర్తింపును ఇస్తుందని వివరించారు. -
మూడు ఐఐటీలతో హ్యుందాయ్ ఒప్పందం.. భారీ పెట్టుబడి
న్యూఢిల్లీ: బ్యాటరీలు, విద్యుదీకరణ రంగాలలో సహకార పరిశోధనా వ్యవస్థను నెలకొల్పేందుకు మూడు ఐఐటీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు హ్యుండై మోటార్ గ్రూప్ తెలిపింది. ఇందుకోసం ఐదేళ్లలో 7 మిలియన్ డాలర్ల పెట్టుబడి చేయనున్నట్టు వెల్లడించింది. ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్ వీటిలో ఉన్నాయి.సహకారంలో భాగంగా హ్యుండై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఐఐటీ ఢిల్లీలో ఏర్పాటు చేస్తామని, హ్యుండై మోటార్ గ్రూప్ నుండి స్పాన్సర్షిప్ల ద్వారా నిర్వహిస్తామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. బ్యాటరీలు, విద్యుదీకరణలో పురోగతిని నడిపించడం హ్యుండై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రాథమిక లక్ష్యం. ప్రధానంగా భారతీయ మార్కెట్ యొక్క విభిన్న అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు.ఈ సెంటర్ భారత విద్యా వ్యవస్థ నుండి ప్రతిభావంతులైన వ్యక్తులతో బలమైన నెట్వర్క్ను పెంపొందించగలదని నమ్ముతున్నామని, ఆవిష్కరణలు, భవిష్యత్తు వృద్ధిని ప్రోత్సహిస్తుందని హ్యుండై మోటార్ గ్రూప్ రిసర్చ్, డెవలప్మెంట్, ప్లానింగ్, కోఆర్డినేషన్ సెంటర్ హెడ్ నక్సప్ సంగ్ వివరించారు. హ్యుండై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అకడమిక్–పారిశ్రామిక సహకార ప్రాజెక్టులపై సంయుక్త పరిశోధనలను నిర్వహించడమే కాకుండా.. కొరియా, భారత్కు చెందిన బ్యాటరీ, విద్యుద్దీకరణ నిపుణుల మధ్య సాంకేతిక, మానవ వనరుల మార్పిడిని సులభతరం చేస్తుందని సంస్థ తెలిపింది. -
అమ్మకాల్లో అదరగొట్టిన నిస్సాన్: ఏకంగా..
నిస్సాన్ ఇండియా అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. మార్కెట్లో 5 లక్షల కార్లను విక్రయించినట్లు కంపెనీ వెల్లడించింది. సంస్థ 2010లో తన కార్యకలాపాలను ప్రారంభించినప్పటి నుంచి మొత్తం 5,13,241 యూనిట్ల సేల్స్ సాధించింది. నవంబర్ 2024లో నిస్సాన్ 9,040 యూనిట్ల కార్లను విక్రయించింది. ఇందులో దేశీయ విక్రయాలు 2,342 యూనిట్లు కాగా.. ఎగుమతులు 6,698 యూనిట్లు. గత ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది కంపెనీ సేల్స్ గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది.నిస్సాన్ కంపెనీ అమ్మకాలు పెరగటానికి మాగ్నైట్ ప్రధాన కారణం. రూ. 6 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వల్ల లభించే ఈ కారును చాలామంది కస్టమర్లు ఇష్టపడి కొనుగోలు చేశారు. ఇది ప్రస్తుతం ఎక్స్-ట్రైల్తో పాటు అమ్ముడవుతోంది.ఇదీ చదవండి: ట్రైన్ ఆలస్యమైతే.. అవన్నీ ఫ్రీ: రీఫండ్ ఆప్షన్ కూడా..సన్రూఫ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్లెస్ ఛార్జర్, 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన నిస్సాన్ మాగ్నైట్ 1.0 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇవి 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ పొందుతాయి. -
కింగ్ నాగార్జున గ్యారేజిలోని కార్లు ఇవే (ఫోటోలు)
-
కలిసొచ్చిన పెళ్లిళ్ల సీజన్.. వాహన అమ్మకాల జోరు
న్యూఢిల్లీ: పెళ్లిళ్ల సీజన్, ఎస్యూవీలకు డిమాండ్ నెలకొనడం, గ్రామీణ మార్కెట్లు మెరుగుపడుతుండటం వంటి సానుకూల అంశాలతో నవంబర్లో వాహన విక్రయాలు పెరిగాయి. మారుతీ సుజుకీ ఇండియా, టాటా మోటర్స్, టయోటా కిర్లోస్కర్ మోటర్స్ మొదలైన దిగ్గజాల దేశీయ అమ్మకాలు వృద్ధి చెందాయి.మారుతీ విక్రయాలు 5 శాతం, టాటా మోటర్స్ 2 శాతం, టయోటా 44 శాతం మేర వృద్ధి నమోదు చేశాయి. అటు, కొత్తగా లిస్టయిన హ్యుందాయ్ మోటర్ ఇండియా అమ్మకాలు 2 శాతం క్షీణించాయి. గ్రామీణ మార్కెట్లు పుంజుకుంటూ ఉండటం, ఎస్యూవీలకు డిమాండ్ నెలకొనడం, లిమిటెడ్ ఎడిషన్లను ప్రవేశపెట్టడం తదితర అంశాలు తమకు కలిసొచ్చాయని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు.నవంబర్లో బ్రెజా, ఎర్టిగా, గ్రాండ్ విటారా ఎక్స్ఎల్6 వంటి యుటిలిటీ వాహనాల అమ్మకాలు గత నవంబర్లో నమోదైన 49,016 యూనిట్లతో పోలిస్తే 59,003 యూనిట్లకు పెరిగాయి. అయితే, ఆల్టో, ఎస్–ప్రెసోలాంటి మినీ–సెగ్మెంట్ కార్ల అమ్మకాలు 9,959 యూనిట్ల నుంచి 9,750 యూనిట్లకు తగ్గాయి. మరోవైపు, వివిధ వర్గాల అవసరాలకు అనుగుణమైన హ్యాచ్బ్యాక్ల నుంచి ఎస్యూవీల వరకు వైవిధ్యమైన పోర్ట్ఫోలియోతో విక్రయాలు మెరుగుపర్చుకుంటున్నట్లు టయోటా వైస్ ప్రెసిడెంట్ శబరి మనోహర్ తెలిపారు. -
క్లాసిక్ లుక్లో కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ 650 (ఫొటోలు)
-
క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్: సేఫెస్ట్ కారుగా టక్సన్
భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్టులో హ్యుందాయ్ టక్సన్ 5 స్టార్ రేటింగ్ సాధించింది. బీఎన్సీఏపీ పరీక్షించిన తొలి హ్యుందాయ్ కారు టక్సన్ కావడం గమనార్హం. ఇది అడల్ట్ సేఫ్టీలో 32 పాయింట్లకు 30.84 పాయింట్లు సాధించగా, పిల్లల రక్షణలో 49కు 41 పాయింట్లు సాధించింది.హ్యుందాయ్ టక్సన్ కారులో ఫ్రంటల్ ఎయిర్ బ్యాగ్, బెల్ట్ ప్రీటెన్షనర్, బెల్ట్ లోడ్ లిమిటర్, సైడ్ హెడ్ కర్టెన్ ఎయిర్ బ్యాగ్, సైడ్ చెస్ట్ ఎయిర్ బ్యాగ్, సైడ్ పెల్విస్ ఎయిర్ బ్యాగ్ వంటివి ఉన్నాయి. ఇందులో చైల్డ్ సీట్ కోసం ఐసోఫిక్స్ మౌంట్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, సీట్ బెల్ట్ రిమైండర్లు మొదలైనవి ఉన్నాయి.హ్యుందాయ్ టక్సన్ ధర రూ.29.02 లక్షల నుంచి రూ.35.94 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఇది 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్, 2-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. పెట్రోల్ ఇంజన్ 156 బీహెచ్పీ పవర్, 192 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డీజిల్ ఇంజిన్ 186 బీహెచ్పీ పవర్, 416 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.హ్యుందాయ్ టక్సన్ మంచి డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. ఇది రెండు డ్యూయల్-టోన్ షేడ్స్, ఐదు మోనోటోన్ రంగులలో లభిస్తుంది. అవి అట్లాస్ వైట్, అబిస్ బ్లాక్, అమెజాన్ గ్రే, స్టార్రీ నైట్, ఫియరీ రెడ్, అట్లాస్ వైట్ విత్ అబిస్ బ్లాక్ రూఫ్, అబిస్ బ్లాక్ రూఫ్ తో ఫియరీ రెడ్.Safety ratings of Hyundai-Tucson Gasoline.The Hyundai Tucson Gasoline has scored 5 Star Safety Ratings in both Adult Occupant Protection (AOP) and Child Occupant Protection (COP) in the latest Bharat NCAP crash tests#bharatncap #safetyfirst #safetybeyondregulations #drivesafe pic.twitter.com/9vpaEUga8y— Bharat NCAP (@bncapofficial) November 28, 2024 -
అసలే ఖరీదైన బైకులు.. మరింత పెరగనున్న ధరలు
ప్రముఖ బైక్ తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మోటోరాడ్.. తన బైకుల ధరలను 2.5 శాతం పెంచనున్నట్లు ప్రకటించింది. ఈ ధరలు 2024 జనవరి 1నుంచే అమలులోకి రానున్నట్లు సమాచారం. ఇన్పుట్ ఖర్చులు పెరగడం వల్ల ధరలను పెంచినట్లు కంపెనీ వెల్లడించింది.ఏప్రిల్ 2017లో బీఎండబ్ల్యూ ఇండియా అనుబంధ సంస్థగా, తన కార్యకలాపాలను ప్రారంభించిన బీఎండబ్ల్యూ మోటోరాడ్.. ఖరీదైన బైకులను, స్కూటర్లను మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ జాబితాలో బీఎండబ్ల్యూ జీ310 ఆర్ఆర్, బీఎండబ్ల్యూ జీ310 ఆర్, బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్, బీఎండబ్ల్యూ జీ 310 జీఎస్, బీఎండబ్ల్యూ ఎం 1000 ఆర్ఆర్, బీఎండబ్ల్యూ సీఈ 02, బీఎండబ్ల్యూ సీఈ 04 మొదలైనవి ఉన్నాయి.ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో అత్యంత ఖరీదైన స్కూటర్గా బీఎండబ్ల్యూ సీఈ 04 (రూ. 14.90 లక్షలు). ప్రస్తుతం, దేశంలో విక్రయించే అన్ని బీఎండబ్ల్యూ బైక్లు, స్కూటర్లు ప్రామాణికంగా 3 సంవత్సరాల, అపరిమిత మైలేజ్ వారంటీతో వస్తున్నాయి. బీఎండబ్ల్యూ ఇండియన్ పోర్ట్ఫోలియోలో మొత్తం 27 మోడల్స్ ఉన్నట్లు సమాచారం. వీటి ధరలన్నీ జనవరి 1నుంచి గణనీయంగా పెరుగుతాయి. -
వచ్చే ఏడాదిపై ఆడి కంపెనీ ఆశలు
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది అమ్మకాలు తిరిగి పుంజుకుంటాయని ఆశిస్తున్నట్లు లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా తెలిపింది. సరఫరా అంతరాయాలతో ప్రస్తుత సంవత్సరంలో కంపెనీ పనితీరుకు ఆటంకం కలిగింది. 2024 మొదటి రెండు త్రైమాసికాల్లో ఎదుర్కొన్న సరఫరా సవాళ్ల నుండి కోలుకుని వచ్చే సంవత్సరంలో అమ్మకాలు 8–10 శాతం పెరుగుతాయని ఆడి అంచనా వేస్తోంది.‘భారత్లో 2024లో లగ్జరీ కార్ల పరిశ్రమ వృద్ధి 8–10 శాతం శ్రేణిలో ఉంటుందని అంచనా వేస్తున్నాం. కంపెనీ సైతం ఇదే విధమైన వృద్ధిని ఆశిస్తోంది’ అని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ వెల్లడించారు. గత మూడేళ్లలో భారీ వృద్ధిని కనబరిచిన తర్వాత పరిశ్రమ విక్రయాల వృద్ధి క్షీణించిందని పేర్కొన్నారు. ఈ సంవత్సరం జనవరి–సెప్టెంబర్లో పరిశ్రమ వృద్ధి దాదాపు 5 శాతంగా ఉంది. గత మూడేళ్లలో 30 శాతం వార్షిక వృద్ధిని సాధించిందని తెలిపారు. అత్యధిక వార్షిక విక్రయాలు.. లగ్జరీ కార్ల పరిశ్రమ ఈ సంవత్సరం ఎన్నడూ లేనంత అత్యధిక వార్షిక విక్రయాలు 50,000 యూనిట్ల మార్కును దాటుతుందని విశ్వసిస్తున్నామని బల్బీర్ సింగ్ ధిల్లాన్ అన్నారు. మొదటి రెండు త్రైమాసికాల్లో కార్ల సరఫరా తగినంతగా లేనందున 2024 ఆడి ఇండియాకు కఠిన సంవత్సరంగా మారిందని పేర్కొన్నారు. కాబట్టి ఈ ఏడాది ఎదగలేమని, వచ్చే సంవత్సరం బలంగా తిరిగి పుంజుకుంటామని వివరించారు.కాగా, ఎస్యూవీ క్యూ7 కొత్త వెర్షన్ను సంస్థ పరిచయం చేసింది. కంపెనీ ఇప్పటి వరకు భారత్లో 10,000 యూనిట్లకు పైగా క్యూ7 మోడల్ కార్లను విక్రయించింది. ఈ ఫ్లాగ్షిప్ మోడల్ను కలిగి ఉండాలనే కస్టమర్ల నిరంతర కోరిక ఇందుకు నిదర్శనమని ధిల్లాన్ పేర్కొన్నారు. క్యూ7 రెండు వేరియంట్లలో లభిస్తుంది. ధర ఎక్స్షోరూంలో రూ.88.66 లక్షల నుంచి ప్రారంభం. -
ఫుల్ ఛార్జ్ బ్యాటరీ: నిమిషంలో..
హోండా టూ వీలర్స్ ఇండియా ఇటీవలే.. యాక్టివా ఈ, క్యూసీ1 అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను ఆవిష్కరించింది. క్యూసీ1 స్కూటర్ ఫిక్స్డ్ బ్యాటరీ పొందుతుంది. యాక్టివా ఈ.. రిమూవబుల్ (స్వాపబుల్) బ్యాటరీ పొందుతుంది. అంటే బ్యాటరీ ఛార్జ్ అయిపోయిన తరువాత.. ఫుల్ ఛార్జ్ వున్న బ్యాటరీలను స్వాపింగ్ స్టేషన్లో తీసుకుని రీప్లేస్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.హోండా యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు స్వాపబుల్ బ్యాటరీలతో వస్తుంది. వీటిని కేవలం నిమిషం వ్యవధిలోనే మార్చుకోవచ్చని కంపెనీ కూడా చెబుతోంది. స్వాపింగ్ స్టేషన్ సందర్శించిన తరువాత.. స్మార్ట్ కీ ఉపయోగించి అక్కడ నుంచి బ్యాటరీలను తీసుకోవచ్చు. అదే సమయంలో స్కూటర్లోని బ్యాటరీలను రిమూవ్ చేయడానికి కూడా ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. కాబట్టి సంస్థ చెప్పినట్లుగానే బ్యాటరీని నిమిషం వ్యవధిలోనే మార్చుకోవచ్చు.ఇదీ చదవండి: వాట్సాప్ గ్రూప్లో చేరాడు.. రూ.11 కోట్లు పోయాయిఒక్కో బ్యాటరీ బరువు 10.2 కేజీలు ఉంటుంది. స్కూటర్ రెండు బ్యాటరీలతో 102 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ 80 కిమీ/గం కాగా.. ఇది 7.3 సెకన్లలో 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం (యాక్సలరేషన్) అవుతుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఉత్తమగానే ఉంటుంది. ఈ స్కూటర్ కోసం బుకింగ్స్ జనవరి 1 నుంచి ప్రారంభమవుతాయి. డెలివరీలు ఫిబ్రవరిలో మొదలవుతాయి. -
ఎనిమిది కంపెనీలకు రూ.7300 కోట్ల పెనాల్టీ!.. కారణం ఇదే..
హ్యుందాయ్ మోటార్, మహీంద్రా, కియా, హోండాతో సహా మొత్తం 8 దిగ్గజ కార్ల తయారీదారులు కేంద్రం గట్టి షాకివ్వనుంది. ఈ కంపెనీలు 2022-23 ఆర్ధిక సంవత్సరంలో ఉద్గార ప్రమాణాలను పాటించనందుకు అధిక పెనాల్టీని ఎదుర్కోవలసి ఉంటుంది.2022లో అమలులోకి వచ్చిన కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ కెపాసిటీ (CAFE) ప్రమాణాల ప్రకారం.. కంపెనీలు విక్రయించే అన్ని కార్లు 100 కిలోమీటర్లకు 4.78 లీటర్ల కంటే ఎక్కువ ఇంధన వినియోగం జగగకూడదు. అంతే కాకుండా కర్బన ఉద్గారాలు కూడా కిలోమీటరుకు 113 గ్రాముల కంటే ఎక్కువ ఉండకూడదు. అయితే కంపెనీలు ఈ నియమాలను పెడచెవిన పెట్టినట్లు సమాచారం. ఈ కారణంగానే కేంద్రం ఈ సంస్థలకు రూ.7,300 కోట్లు పెనాల్టీ విధించనుంది.కేంద్రం విధించనున్న ఫెనాల్టీలో అత్యధికంగా హ్యుందాయ్ మోటార్కు (రూ. 2837.8కోట్లు) పడే అవకాశం ఉంది. ఆ తరువాత స్థానంలో మహీంద్రా (రూ.1788.4 కోట్లు), కియా (రూ.1346.2 కోట్లు), హోండా (రూ.457.7 కోట్లు), రెనాల్ట్ (రూ.438.3 కోట్లు), స్కోడా (రూ.248.3 కోట్లు), నిస్సాన్ (రూ. 172.3 కోట్లు), ఫోర్డ్ (రూ.1.8 కోట్లు) ఉన్నాయి.ఈ విషయం మీద ఆటోమొబైల్ కంపెనీనీలు.. కేంద్రంతో చర్చలు జరుపుతున్నాయి. తాము 2023 జనవరి 1నుంచి ఉద్గార ప్రమాణాలకు సంబంధించిన అన్ని నియమాలను కఠినంగా పాటిస్తున్నామని సంస్థలు పేర్కొన్నాయి. కాబట్టి ఆ ఆర్థిక సంవత్సరం మొత్తానికి కలిపి పెనాల్టీ విధించడం సరికాదని చెబుతున్నాయి. దీనిపైన కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది. -
కార్గో ఈ-త్రీవీలర్లకు రాయితీల పొడిగింపు
న్యూఢిల్లీ: కార్గో ఎలక్ట్రిక్ త్రీ–వీలర్ల కొనుగోలుపై రాయితీలకు సంబంధించి పీఎం ఈ–డ్రైవ్ పథకం రెండవ దశను కేంద్రం ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 80,546 యూనిట్లకు రాయితీ మంజూరు చేయాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. అయితే నిర్ధేశించిన లక్ష్యాన్ని గడువు కంటే ముందే నవంబర్ 7 నాటికే చేరుకుంది.దీంతో 2025 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కావాల్సిన రెండవ దశను ముందుగానే ప్రారంభించాల్సి వచ్చింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఎల్5 విభాగంలో 1,24,846 యూనిట్ల ఎలక్ట్రిక్ కార్గో త్రిచక్ర వాహనాలకు రాయితీ ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. నవంబర్ 26న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం 2024 నవంబర్ 8 నుంచి 2026 మార్చి 31 మధ్య మొత్తం 1,24,846 యూనిట్ల ఎలక్ట్రిక్ కార్గో త్రీ–వీలర్లకు కిలోవాట్ అవర్కు రూ.2,500 సబ్సిడీ ఉంటుంది.రాయితీ కింద గరిష్టంగా ఒక్కో వాహనానికి రూ.25,000 అందిస్తారు. గతంలో ఈ మొత్తం కిలోవాట్ అవర్కు రూ.5,000 సబ్సిడీ ఇచ్చేవారు. గరిష్టంగా రూ.50,000 ఉండేది. పీఎం ఈ–డ్రైవ్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.10,900 కోట్లు కేటాయించింది. -
బహురూపాల బండి.. ఎక్కడికెళ్లాలన్నా ఈ ఒక్కటుంటే చాలు
-
మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కార్లు ఇవే: ధరలు ఎలా ఉన్నాయంటే..
మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయ మార్కెట్లో రెండు ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేసింది. ఒకటి 'బీఈ 6ఈ', మరొకటి 'ఎక్స్ఈవీ 9ఈ'. వీటి ప్రారంభ ధరలు వరుసగా రూ.18.90 లక్షలు, రూ.21.90 లక్షలు (ఎక్స్ షోరూమ్). కంపెనీ ఈ కార్లను 2025 మార్చిలో డెలివరీ చేయనున్నట్లు సమాచారం.మహీంద్రా కంపెనీ లాంచ్ చేసిన ఈ రెండు కొత్త ఎలక్ట్రిక్ కార్లు చూడటానికి కొంత భిన్నమైన డిజైన్ పొందుతాయి. ఎందుకంటే ఈ రెండూ INGLO ఆర్కిటెక్చర్ ఆధారంగా నిర్మితమయ్యాయి. ఈ ప్లాట్ఫామ్ ద్వారా తయారైన వాహనాలు ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తాయి. కాబట్టి మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కార్లు లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ పొందుతాయి.XEV 9e ఒక స్పోర్టి కూపే డిజైన్ పొందుతుంది. త్రిభుజాకార ఎల్ఈడీ హెడ్లైట్లు, విస్తృతమైన ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు, కూపే స్టైల్ రూఫ్లైన్ వంటివి ఇందులో చూడవచ్చు. ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ల మధ్యలో.. ప్రకాశవంతమైన మహీంద్రా లోగో మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కారులో 12.3 ఇంచెస్ డిస్ప్లేలతో కూడిన ట్రిపుల్-స్క్రీన్ సెటప్ ఉంటుంది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డ్రైవర్ డిస్ప్లే, లేటెస్ట్ కనెక్టివిటీ ఫీచర్లతో పాటు.. ట్విన్-స్పోక్ స్టీరింగ్ వీల్, వైర్లెస్ స్మార్ట్ఫోన్ ఛార్జింగ్, 16 స్పీకర్ ఆడియో సిస్టమ్, పనోరమిక్ సన్రూఫ్, ఏడీఏఎస్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.BE 6e షార్ప్ క్యారెక్టర్ లైన్లు, హుడ్ స్కూప్తో కూడిన పాయింటెడ్ హుడ్, సీ షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్, స్ట్రీమ్లైన్డ్ బంపర్ను కలిగి ఉంది. ఈ కారు ఏరోడైనమిక్ 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్.. ఇల్యూమినేటెడ్ బీఈ లోగో వంటివి దీనిని కొత్తగా చూపిస్తాయి. ఇందులో ట్విన్-స్క్రీన్ ర్యాప్రౌండ్ డిస్ప్లే ఉంటుంది. ఇందులో కూడా 16 స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్, ఆటోమేటిక్ పార్కింగ్, పనోరమిక్ సన్రూఫ్, ఏడీఏఎస్ వంటివి ఉన్నాయి.బీఈ 6ఈ, ఎక్స్ఈవీ 9ఈ రెండూ.. 59 కిలోవాట్, 79 కిలోవాట్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీలు ఉంటాయి. 59 kWh బ్యాటరీ 450 నుంచి 500 కిమీ రేంజ్.. 79 kWh బ్యాటరీ 650 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఇవి రెండూ ఏసీ ఛార్జర్కు మాత్రమే కాకుండా డీసీ ఫాస్ట్ ఛార్జర్కు సపోర్ట్ చేస్తాయి. -
టాప్ 10 స్కూటర్లు..
టూవీలర్లలో స్కూటర్లది ప్రత్యేకమైన విభాగం. అన్నివర్గాల వారూ స్కూటర్లను నడిపేందుకు ఇష్టపడతారు. ఈ క్రమంలో వాటి అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. గడిచిన అక్టోబర్లో జరిగిన విక్రయాల ఆధారంగా టాప్ 10 స్కూటర్లు ఏవో ఇక్కడ తెలుసుకుందాం..ఆటో న్యూస్ వెబ్సైట్ రష్లేన్ నివేదిక ప్రకారం.. గత అక్టోబర్లో టాప్ 10 స్కూటర్ల అమ్మకాలు 6,64,713 యూనిట్లతో ఏడాది ప్రాతిపదికతోపాటు అంతక్రితం నెలతో పోల్చి చేసినా మెరుగయ్యాయి. ఇవి గతేడాది అక్టోబర్లో 5,22,541 యూనిట్లు, ఈ ఏడాది సెప్టెంబర్లో 6,05,873 యూనిట్లు అమ్ముడుపోయాయి.ఇక అక్టోబర్ నెలలో ఏ స్కూటర్ ఎన్ని యూనిట్లు అమ్ముడుపోయాయో పరిశీలిస్తే.. 2,66,806 యూనిట్లతో హోండా యాక్టివా అగ్ర స్థానంలో ఉంది. మరోవైపు కస్టమర్ల నుంచి ఎన్ని ఫిర్యాదులు వస్తున్నా ఓలా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు మాత్రం తగ్గడం లేదు. ఓలా ఎస్1 గత అక్టోబర్లో 41,651 యూనిట్లు అమ్ముడుపోయింది. మొత్తం స్కూటర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఎలక్ట్రిక్ విభాగంలో టాప్లో నిలిచింది.ఏ స్కూటర్ ఎన్ని?» హోండా యాక్టివా 2,66,806» టీవీఎస్ జూపిటర్ 1,09,702» సుజుకి యాక్సెస్ 74,813» ఓలా ఎస్1 41,651» టీవీఎస్ ఎన్టార్క్ 40,065» హోండా డియో 33,179» బజాజ్ చేతక్ 30,644» టీవీఎస్ ఐక్యూబ్ 28,923» సుజుకి బర్గ్మన్ 20,479» యమహా రేజర్ 18,451 -
టాటా సియెరా మళ్లీ వస్తోంది..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ సియెరా ఎస్యూవీ వచ్చే ఏడాది భారత రోడ్లపై పరుగుతీయనుంది. 2025 ద్వితీయార్థంలో ఈ మోడల్ రీ–ఎంట్రీ ఇవ్వనుందని కంపెనీ ప్రకటించింది. వచ్చే ఏడాది పండుగల సీజన్ నాటికి కస్టమర్ల చేతుల్లోకి వచ్చే అవకాశం ఉంది.తొలుత ఎలక్ట్రిక్ వర్షన్లో ఇది రంగ ప్రవేశం చేయనుంది. తర్వాత ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ఐసీఈ) ఆధారిత సియెరా మార్కెట్లోకి రానుంది. అడాప్టివ్ టెక్ ఫార్వార్డ్ లైఫ్స్టైల్ (అట్లాస్) ప్లాట్ఫామ్పై సియెరా ఐసీఈ, అలాగే హారియర్ ఈవీలో ఉపయోగించిన జెన్2 ఈవీ ప్లాట్ఫామ్పై సియెరా ఈవీ రూపుదిద్దుకోనుందని సమాచారం.అడాస్ ఫీచర్లను జోడిస్తున్నట్టు తెలుస్తోంది. సియెరా కాన్సెప్ట్ వర్షన్ను 2020, 2023 ఆటో ఎక్స్పో వేదికల్లో టాటా మోటార్స్ ప్రదర్శించింది. అయితే తయారీకి సిద్దంగా ఉన్న వెర్షన్ ఇంకా వెల్లడి కాలేదు. మరోవైపు హ్యారియర్ ఈవీ 2025 తొలి త్రైమాసికంలో అందుబాటులోకి వస్తోంది. -
100 దేశాలు 17 కార్లు.. అగ్రరాజ్యాల్లో మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ 'మారుతి సుజుకి ఇండియా' ఎట్టకేలకు 30 లక్షల వాహనాలను ఎగుమతి చేసింది. భారతదేశంలో ఈ అద్భుతమైన ఫీట్ సాధించిన ఏకైక కార్ల తయారీ సంస్థగా మారుతి సుజుకి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.1986 నుంచి తమ వాహనాలను ఎగుమతి చేయడం ప్రారంభించిన మారుతి సుజుకి.. ప్రారంభంలో 500 కార్లను ఎగుమతి చేసింది. 2013 ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ ఏకంగా 10 లక్షల యూనిట్లను విజయవంతంగా ఎగుమతి చేయగలిగింది. ఆ తరువాత తొమ్మిదేళ్లకు (FY21) మరో 10 లక్షల వాహనాలు ఎగుమతి అయ్యాయి. మరో 10 లక్షల కార్లను కంపెనీ ఎగుమతి చేయడానికి పట్టిన సమయం మూడు సంవత్సరాల తొమ్మిది నెలలు మాత్రమే. దీన్ని బట్టి చూస్తే గ్లోబల్ మార్కెట్లో కూడా మారుతి సుజుకి కార్లకు డిమాండ్ విపరీతంగా పెరిగినట్లు స్పష్టమైంది.కంపెనీ ఎగుమతి చేసిన కార్లలో సెలెరియో, ఫ్రాంక్స్, జిమ్నీ, బాలెనో, సియాజ్, డిజైర్, ఎస్-ప్రెస్సో మొదలైన కార్లు ఉన్నాయి. నేడు భారత్ నుంచి ఎగుమతి అవుతున్న మొత్తం వాహనాల్లో మారుతి సుజుకి 40 శాతం వాటాను కలిగి ఉంది. ఇందులో ఎక్కువ భాగం ప్యాసింజర్ కార్లు ఉన్నట్లు తెలుస్తోంది.మారుతి సుజుకి దాదాపు 100 దేశాలకు 17 మోడళ్లను ఎగుమతి చేస్తోంది. ఇందులో లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా, మిడిల్ ఈస్ట్ వంటివి కంపెనీకి ముఖ్యమైన ఎగుమతి మార్కెట్లు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య తప్పకుండా పెరిగే అవకాశం ఉంది. ఎగుమతుల్లో కంపెనీ సాధించిన విజయానికి మారుతి సుజుకి ఎండీ అండ్ సీఈఓ హిసాషి టేకుచి భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. -
ఒక్కసారిగా పెరిగిన సీఎన్జీ ధరలు..
సాధారణంగా పెట్రోల్, డీజల్ ధరలే ప్రజలకు షాకిస్తుంటాయి. కానీ ఇప్పుడు సీఎన్జీ ధరలు కూడా ఇదే బాటలో కొనసాగుతున్నాయి. కేజీ సీఎన్జీ ధర ఉన్నట్టుండి.. ఏకంగా రెండు రూపాయల పెరిగింది.ముంబైతో పాటు నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్ వంటి ప్రాంతాల్లో సీఎన్జీ ధరలు పెరిగాయి. అయితే ఢిల్లీలో సీఎన్జీ ధరలు పెరగలేదని సమాచారం. దీనికి కారణం దేశ రాజధానిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే అని తెలుస్తోంది. కాబట్టి ఢిల్లీలో కేజీ సీఎన్జీ ధర రూ. 75.09 వద్ద ఉంది.ధరల పెరుగుదల తరువాత ముంబైలో కేజీ సీఎన్జీ 77 రూపాయలు దాటేసింది. నోయిడా, ఘజియాబాద్లలో కేజీ సీఎన్జీ ధరలు వరుసగా రూ. 81.70, రూ. 82.12గా ఉంది. దీన్ని బట్టి చూస్తే ఢిల్లీతో పోలిస్తే.. దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో సీఎన్జీ రేటు కొంత ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.ఇదీ చదవండి: యాపిల్ యూజర్లకు కేంద్రం హెచ్చరికఎన్నికలు ముగియడంతో.. ముంబైలోని సిటీ గ్యాస్ రిటైలర్ మహానగర్ గ్యాస్ లిమిటెడ్ (MGL) ముంబై, పరిసర ప్రాంతాల్లో సీఎన్జీ ధరలను కిలోపై రూ. 2 చొప్పున పెంచినట్లు వెల్లడించింది. గత రెండు నెలలుగా ధరలను పెంచని అదానీ టోటన్ గ్యాస్ కూడా సీఎన్జీ రేటును పెంచింది. ప్రస్తుతం హైదరాబాద్లో కేజీ ధర రూ. 96వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే దేశం మొత్తం మీద హైదరాబాద్లోనే సీఎన్జీ రేటు చాలా ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. -
కొత్త ఎలక్ట్రిక్ బైక్పై హీరో కసరత్తు
న్యూఢిల్లీ: మధ్య స్థాయి పర్ఫార్మెన్స్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ మోటర్సైకిల్ తయారీపై కసరత్తు చేస్తున్నట్లు హీరో మోటోకార్ప్ సీఈవో నిరంజన్ గుప్తా తెలిపారు. అమెరికాకు చెందిన జీరో మోటర్సైకిల్స్ భాగస్వామ్యంలో ఈ వాహనం అభివృద్ధి చేసే ప్రక్రియ తుది దశలో ఉందని పేర్కొన్నారు.జీరో మోటర్సైకిల్స్ ప్రధానంగా ఎలక్ట్రిక్ మోటర్సైకిల్స్, పవర్ట్రెయిన్స్ తయారు చేస్తుంది. 2022 సెప్టెంబర్లో జీరోలో 60 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టే ప్రతిపాదనకు హీరో బోర్డు ఆమోదముద్ర వేసింది. మరోవైపు, తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల శ్రేణిని మరింతగా విస్తరిస్తున్నట్లు గుప్తా చెప్పారు.వచ్చే ఆరు నెలల్లో వివిధ ధర శ్రేణుల్లో, కస్టమర్ సెగ్మెంట్లలో తమ ఎలక్ట్రిక్ వాహనాలు ఉంటాయని వివరించింది. ప్రస్తుతం హీరో మోటోకార్ప్కి చెందిన విడా ఎలక్ట్రిక్ స్కూటర్లు రూ. 1–1.5 లక్షల శ్రేణిలో అందుబాటులో ఉన్నాయి. 230 నగరాలు, పట్టణాల్లో అమ్ముడవుతున్నాయి. -
అదిరిపోయే లుక్తో రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త బండి
అదిరిపోయే లుక్తో రాయల్ ఎన్ఫీల్డ్ మరో కొత్త బైక్ ‘రాయల్ ఎన్ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350’ను ను లాంచ్ చేసింది. అలనాటి బాబర్ మోటార్సైకిల్ శైలిలో ప్రముఖ క్లాసిక్ 350 మోడల్కు అప్డేట్ ఫీచర్లతో గోవాలో జరిగిన మోటోవెర్స్ 2024 ఈవెంట్లో ఈ బైక్ను కంపెనీ ఆవిష్కరించింది.రాయల్ ఎన్ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350 మోటార్సైకిల్ సింగిల్-టోన్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.35 లక్షలు కాగా డ్యూయల్-టోన్ మోడల్ ధర రూ. 2.38 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. ఈ మోటార్సైకిల్ రేవ్ రెడ్, ట్రిప్ టీల్, పర్పుల్ హేజ్, షాక్ బ్లాక్ అనే నాలుగు కలర్ స్కీమ్లలో లభిస్తుంది.కొత్త గోవాన్ క్లాసిక్ 350 ఇప్పటికే ఉన్న క్లాసిక్ 350 మోడల్కు సరికొత్త రూపంగా ఉంటుంది. బాబర్ తరహాలో విలక్షణంగా దీన్ని లుక్ను తీర్చిదిద్దారు. దీంట్లో చేసిన ముఖ్యమైన అప్గ్రేడ్ల విషయానికి వస్తే ఏప్ హ్యాంగర్ హ్యాండిల్బార్లు, ఫార్వర్డ్-సెట్ ఫుట్పెగ్లు, స్లాష్-కట్ ఎగ్జాస్ట్ పైపు వంటివి ఉన్నాయి.క్లాసిక్ 350 లాగే గోవాన్ క్లాసిక్ 350 కూడా అదే 349సీసీ జె-సిరీస్ ఇంజన్తో వస్తుంది. ఫైవ్-స్పీడ్ గేర్బాక్స్తో వచ్చే సింగిల్-సిలిండర్, ఎయిర్-ఆయిల్ కూల్డ్ ఇంజిన్ 20.2 బీహెచ్పీ, 27 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. -
విజయవాడలో బిజినెస్ ఎక్స్పో.. వ్యాపార అవకాశాలపై ప్రచారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని వ్యాపార అవకాశాలు, ఉత్పత్తులపై ప్రచారం కల్పించేందుకు ఈనెల 29 నుంచి వచ్చే నెల 1 వరకు విజయవాడలో బిజినెస్ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు ఏపీ చాంబర్స్ ప్రకటించింది. ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేస్తున్న ఈ ఎక్స్పోను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని ఏపీ చాంబర్స్ ప్రెసిడెంట్ పొట్లూరి భాస్కరరావు తెలిపారు. ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్, బ్యాంకింగ్, టూరిజం, ఇన్ఫ్రా, మహిళా సాధికారత, రియల్ ఎస్టేట్, పునరుత్పాదక ఇంధనం తదితర అంశాలపై ఎక్స్పోలో చర్చలు జరుగుతాయని పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 వరకు ఈ ఎక్స్పోను సందర్శించవచ్చన్నారు.‘ఏఐ’తో వ్యాపార అవకాశాలపై సదస్సుసాక్షి, అమరావతి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ను వినియోగించుకోవడం ద్వారా వ్యాపార అవకాశాలు పెంచుకోవడంపై ఆంధ్ర చాంబర్ ఆఫ్ కామర్స్ డిసెంబర్ 4వ తేదీన విజయవాడలో అవగాహన సదస్సు నిర్వహిస్తోంది. విజయవాడలోని హోటల్ వివంతలో నిర్వహించే ఈ సదస్సులో చిన్న, మధ్య తరగతి, ఔత్సాహిక వ్యాపారులు, కుటీర పరిశ్రమల నిర్వాహకులు పాల్గొనవచ్చని విజయవాడ రీజియన్ అధ్యక్షుడు మలినేని రాజయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ నెల 30లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. వివరాలకు 9848077227, andhrachambervijayawada@gmail.comను సంప్రదించా లని సూచించారు.25 వరకు నేచురోపతి కోర్సుకు వెబ్ ఆప్షన్స్సాక్షి, అమరావతి: డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ రెండో దశ వెబ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ జారీ చేసింది. బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతి, యోగిక్ సైన్స్ సీట్ల భర్తీకి అభ్యర్థులు ఈనెల 25 వరకు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాలని ఓ ప్రకటనలో సూచించింది. స్పెషల్ స్ట్రె వేకెన్సీలో 76 ఎంబీబీఎస్ సీట్ల భర్తీ స్పెషల్ స్ట్రె వేకెన్సీ రౌండ్ కౌన్సెలింగ్ కింద కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేసినట్లు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికా రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. 76 కన్వీనర్ కోటా సీట్లను శనివారం రాత్రి కేటాయించారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 26 మధ్యాహ్నం లోగా కళాశాలల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు. ఏఆర్ డెయిరీలో ఏపీ పోలీసుల విచారణసాక్షి, చెన్నై: తిరుమల లడ్డూ కల్తీ వివాదం నేపథ్యంలో తమిళనాడులోని దిండుగల్లో ఉన్న ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో 11 మందితో కూడిన ఏపీ పోలీసుల బృందం శనివారం విచారణ చేపట్టినట్లు తెలిసింది. తిరుమల లడ్డూ వివాదంలో కల్తీ జరిగినట్టుగా వచ్చిన ఆరోపణలను ఆదినుంచి ఏఆర్ డెయిరీ తోసిపుచ్చుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఏపీ పోలీసులు స్థానిక పోలీసుల సహకారంతో ఆ పరిశ్రమలోకి వెళ్లినట్టు సమాచారం. -
తెలంగాణలో బీజం.. ఇతర రాష్ట్రాలకు చేరే అవకాశం
తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 31, 2026 వరకు రెండు సంవత్సరాల పాటు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి వంద శాతం మినహాయింపు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం ఈ పాలసీని కూని ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే పరిమితం చేసింది. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఈ సంఖ్యను మాపీ చేస్తూ.. అన్ని ఈవీలకు వర్తిస్తుందని వెల్లడించింది.తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ టూ వీలర్స్, ఫోర్ వీలర్స్, ఆటో, ట్రాక్టర్స్, బస్సులు కొనుగోలుపైన వంద శాతం రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి మినహాయింపు కల్పించింది. కొత్త పాలసీ ప్రకారం ద్విచక్ర వాహనాలపై రూ.15,000, నాలుగు చక్రాల వాహనాలపై రూ.3 లక్షల వరకు పన్నులు, ఫీజులు ఆదా చేసుకోవచ్చు.ప్రస్తుతం తెలంగాణలో 1.7 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు నమోదైనట్లు సమాచారం. ఇది రాష్ట్రంలోని మొత్తం వాహనాల్లో 5 శాతం అని తెలుస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడంలో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కొంత నష్టం జరిగినప్పటికీ.. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేవారికి ఉపయోగకరంగా ఉంటుంది.ఇతర రాష్ట్రాలకు పాకే అవకాశంప్రస్తుతం తెలంగాణలో ప్రవేశపెట్టిన ఈ కొత్త ఈవీ పాలసీ.. ఇతర రాష్ట్రాలకు కూడా చేసే అవకాశం ఉంటుందని సమాచారం. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో.. వాయు కాలుష్యం తీవ్రతరమైపోయింది. వాయు కాలుష్యాన్ని తగ్గించాలంటే.. తప్పకుండా ప్రత్యామ్నాయ వాహనాలను ఉపయోగించాల్సిందే. కాబట్టి ఇతర రాష్ట్రాలు కూడా ఈ పాలసీని అమలు చేసినా.. ఆశ్చర్యపడల్సిన పని లేదు.కేంద్రం కూడా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి ఫేమ్ పథకాలను తీసుకువచ్చింది. ఇప్పుడు పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద రూ.10,900 కోట్లు వెచ్చించింది. ఈ స్కీమ్ 2024 అక్టోబర్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు అమలులో ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను వేగవంతం చేయడానికి, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి ఈ పథకం ప్రవేశపెట్టారు.ఇదీ చదవండి: మరో కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఇదే: లాంచ్ ఎప్పుడంటే..ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను పెంచడానికి ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం మాత్రమే కాకుండా.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని సబ్సిడీలను అందించాయి. అయితే ఇప్పుడు ఫ్యూయెల్ వాహనాల మాదిరిగానే.. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం గణనీయంగా పెరిగింది. చాలా కంపెనీలు తమ ఉత్పత్తులను ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేశాయి. రాబోయే రోజుల్లో తప్పకుండా ఈవీల సంఖ్య మరింత పెరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. -
హోండా మోటార్సైకిల్ కీలక ప్రకటన: ఆ బైకులకు రీకాల్
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హోండా మోటార్సైకిల్ & స్కూటర్ ఇండియా తన 'సీఆర్ఎఫ్1100 ఆఫ్రికా ట్విన్' బైకులకు రీకాల్ ప్రకటించింది. త్రాటల్ ఆపరేషన్ సమస్య కారణంగా కంపెనీ రీకాల్ ప్రకటించినట్లు సమాచారం. 2022 ఫిబ్రవరి - 2022 అక్టోబర్ మధ్య తయారైన బైకులలో సమస్య ఉన్నట్లు కంపెనీ గుర్తించింది.ఎన్ని బైకులు ఈ రీకాల్ ప్రభావానికి గురయ్యాయో.. కంపెనీ వెల్లడించలేదు. త్రాటల్ ఆపరేషన్ సమస్య వల్ల రైడర్.. రైడింగ్ సమయంలో బ్యాలెన్స్ కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమస్యని పరిష్కరించడానికి కంపెనీ ఎలక్ట్రానిక్ కంట్రోల్డ్ యూనిట్ సాఫ్ట్వేర్ అప్డేట్ రూపొందించనుంది.వారంటీతో సంబంధం లేకుండా ప్రభావిత బైక్లలో సమస్యను ఉచితంగా పరిష్కరిస్తుంది. హోండా బిగ్వింగ్ వెబ్సైట్లో VINని నమోదు చేయడం ద్వారా కస్టమర్లు.. తమ బైక్ జాబితాలో ఉందో.. లేదో తెలుసుకోవచ్చు. ఈ బైక్ ధరలు మార్కెట్లో రూ. 16.01 లక్షల నుంచి రూ. 17.55 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. -
మరో కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఇదే: లాంచ్ ఎప్పుడంటే..
రాయల్ ఎన్ఫీల్డ్ తన లైనప్కు మరో బైక్ యాడ్ చేసింది. అదే స్క్రామ్ 440. ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా పెద్ద ఇంజిన్ పొందుతుంది. కాస్మొటిక్ అప్డేట్స్ కొన్ని గమనించవచ్చు. ఇది మార్కెట్లో 2025 జనవరి లాంచ్ అయ్యే అవకాశం ఉంది.కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440.. చూడటానికి స్క్రామ్ 411 మాదిరిగా ఉంటుంది. ఇది 443 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా.. 25.4 Bhp పవర్, 34 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్ పొందుతుంది. ఈ బైకులో ఎస్ఓహెచ్సీ వాల్వెట్రెయిన్ సిస్టమ్ ఉండటం వల్ల సౌండ్ కూడా తగ్గుతుంది.రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440 రౌండ్ హెడ్లైట్ కలిగి.. సింగిల్ డయల్ సెటప్ కూడా పొందుతుంది. ఇది స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్మీటర్ వంటి వాటిని చూపిస్తుంది. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుకవైపు మోనోషాక్ కలిగిన ఈ బైక్ డిస్క్ బ్రేక్స్ పొందుతుంది.15 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కలిగిన ఈ బైక్ బరువు 196 కేజీలు. రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440 కూడా రెండు వేరియంట్లలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీని ధర అధికారికంగా వెల్లడి కాలేదు, కానీ స్టాండర్డ్ స్క్రామ్ 411 ధర (రూ. 2.06 లక్షల నుంచి రూ. 2.12 లక్షలు) కంటే కొంత ఎక్కువ ఉండొచ్చని సమాచారం. -
రెండేళ్లు.. లక్ష సేల్స్: ఈ కారు రేటెంతో తెలుసా?
భారతదేశంలో వాహన విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అయితే ప్రజలు కొన్ని బ్రాండ్ కార్లను మాత్రమే అధికంగా కొనుగోలు చేస్తుంటారు. ఇలాంటి కోవకు చెందిన కార్లలో ఒకటి ఇన్నోవా హైక్రాస్. ఇప్పటికే ఈ కారును లక్ష మంది కొనుగోలు చేసినట్లు సమాచారం. కేవలం రెండేళ్లలో కంపెనీ ఈ అరుదైన ఘనతను సాధించింది.2022లో అమ్మకానికి వచ్చిన టయోటా ఇన్నోవా హైక్రాస్.. ఇన్నోవా క్రిస్టాతో పాటు అమ్ముడైంది. ప్రారంభంలో అమ్మకాలు అంతంత మాత్రంగా ఉన్నపటికీ.. ఆ తరువాత సేల్స్ భారీగా పెరిగాయి. ఈ కారు పెట్రోల్ - హైబ్రిడ్ పవర్ట్రెయిన్ పొందుతుంది. కాబట్టి ఇది అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.ఇదీ చదవండి: పెరగనున్న బీఎండబ్ల్యూ ధరలు: ఎప్పటి నుంచో తెలుసా?టయోటా ఇన్నోవా హైక్రాస్ నాన్-హైబ్రిడ్ వేరియంట్లు 172 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేసే 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది సీవీటీ ఆటోమేటిక్ గేర్బాక్స్తో లభిస్తుంది. టాప్ వేరియంట్లు స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో 184 హార్స్ పవర్ అందించే 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ పొందుతాయి. మార్కెట్లో ఈ కారు ధరలు రూ. 19.77 లక్షల నుంచి రూ. 30.98 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ధరలు మీరు ఎంచుకునే వేరియంట్ ఆధారంగా మారుతూ ఉంటాయి. -
పెరగనున్న బీఎండబ్ల్యూ ధరలు: ఎప్పటి నుంచో తెలుసా?
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'బీఎండబ్ల్యూ' (BMW) 2025 జనవరి 1నుంచి కార్ల ధరలను 3 శాతం పెంచనున్నట్లు ప్రకటించింది. అయితే ఏ మోడల్ ధర ఎంత పెరుగుతుంది అనే విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.భారతదేశంలోని బీఎండబ్ల్యూ చెన్నై సదుపాయంతో 10 మోడళ్లను అసెంబుల్ చేసింది. ఇందులో ఎక్స్1, ఎక్స్3, ఎక్స్5, ఎక్స్7, ఎం340ఐ, 2 సిరీస్ గ్రాన్ కూపే, 3 సిరీస్ లాంగ్ వీల్బేస్, 5 సిరీస్ లాంగ్ వీల్బేస్, 7 సిరీస్ మొదలైనవి ఉన్నాయి. ఇక సీబీయూ మార్గం ద్వారా ఐ4, ఐ5, ఐ7, ఐ7 ఎం70, ఐఎక్స్1, ఐఎక్స్ వంటి ఎలక్ట్రిక్ కార్లు దిగుమతి అవుతాయి.ఇన్పుట్ ఖర్చులు పెరగడం వల్ల కంపెనీ తన ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. అయితే ఇప్పటికే మెర్సిడెస్ బెంజ్ కంపెనీ కూడా జనవరి 1 నుంచి తన వాహనాల ధరలను పెంచనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. బెంజ్ ధరల పెరుగుదలకు సంబంధించిన నిర్ణయం తీసుకున్న తరువాత, బీఎండబ్ల్యూ కూడా ఇదే బాటలో అడుగులు వేసింది. కాబట్టి బీఎండబ్ల్యూ కార్ల ధరలు వచ్చే ఏడాది ప్రారంభం నుంచే పెరగనున్నాయి. -
ఒక్క చూపుకే ఫిదా చేస్తున్న కొత్త బీఎండబ్ల్యూ కారు: రేటెంతో తెలుసా?
ఈ ఏడాది జూన్లో 'ఎం5' (M5) కారును గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించిన తరువాత బీఎండబ్ల్యూ ఎట్టకేలకు భారతీయ విఫణిలో లాంఛ్ చేసింది. బీఎండబ్ల్యూ లాంచ్ చేసిన ఎం5 ధర రూ.1.99 కోట్లు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఇది ప్లగ్ ఇన్ హైబ్రిడ్, వీ8 పవర్ట్రెయిన్ రెండూ ఉపయోగిస్తుంది. కాబట్టి పర్ఫామెన్స్ దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఉత్తమంగా ఉంటుంది.బీఎండబ్ల్యూ ఎం5 భారతదేశానికి కంప్లీట్ బిల్డ్ యూనిట్ (సీబీయూ) మార్గం ద్వారా దిగుమతి అవుతుంది. ఈ కారణంగానే దీని ధర కొంత అధికంగా ఉంటుంది. ప్రస్తుతం ఇది మార్కెట్లో అమ్మకానికి ఉంది. ఈ కారులోని 4.4 లీటర్ ట్విన్ టర్బో వీ8 ఇంజిన్ 577 Bhp పవర్, 750 Nm టార్క్ అందిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 194 Bhp, 280 Nm టార్క్ అదనంగా ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పొందుతుంది. ఇది కేవలం 3.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 350 కిమీ (ఎం డ్రైవర్ ప్యాకేజీతో).బీఎండబ్ల్యూ ఎం5 కారులోని 22.1 కిలోవాట్ బ్యాటరీ 70 కిమీ రేంజ్ అందిస్తుంది. దీనిని ఫుల్ ఛార్జ్ చేసుకోవడానికి 7.4 కేడబ్ల్యు ఏసీ ఛార్జర్ ఉపయోగించాలి. బ్యాటరీ 3:15 గంటలలో ఫుల్ ఛార్జ్ అవుతుంది. కాబట్టి బ్యాటరీ కూడా మంచి రేంజ్ అందిస్తుందని స్పష్టమవుతోంది.ఇదీ చదవండి: సేఫ్టీలో జీరో రేటింగ్: భద్రతలో ఫ్రెంచ్ బ్రాండ్ ఇలా..2025 ఎం5 బోల్డ్ డిజైన్ కలిగి సిగ్నేచర్ కిడ్నీ గ్రిల్ గ్లోస్ బ్లాక్ ఫినిషింగ్ పొందుతుంది. ఫ్రంట్ బంపర్ ఎయిర్ వెంట్స్ కలిగి ఉండటం చూడవచ్చు. ఇది ఇంటిగ్రేటెడ్ డిఫ్యూజర్తో రీస్టైల్ బంపర్, క్వాడ్ ఎగ్జాస్ట్ టిప్స్ వంటివి కూడా పొందుతుంది. ఈ కారులో త్రీ-స్పోక్ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. కర్వ్డ్ ట్విన్ స్క్రీన్లు, ఫోర్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ హీటెడ్ ఫ్రంట్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ గ్లాస్ రూఫ్, వైర్లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ టెయిల్గేట్ వంటి మరెన్నో ఫీచర్స్ ఉంటాయి.బీఎండబ్ల్యూ ఎం5 నాన్ మెటాలిక్ ఆల్పైన్ వైట్, బ్లాక్ సఫైర్, సోఫిస్టో గ్రే, బ్రూక్లిన్ గ్రే, ఫైర్ రెడ్, కార్బన్ బ్లాక్, ఐల్ ఆఫ్ మ్యాన్ గ్రీన్, స్టార్మ్ బే, మెరీనా బే బ్లూ వంటి మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇంటీరియర్ రెడ్/బ్లాక్, కైలామి ఆరెంజ్, సిల్వర్స్టోన్/బ్లాక్ & ఆల్-బ్లాక్ వంటి కాంబినేషన్లను పొందుతుంది. -
సేఫ్టీలో జీరో రేటింగ్: భద్రతలో ఫ్రెంచ్ బ్రాండ్ ఇలా..
అతి తక్కువ కాలంలోనే అధిక అమ్మకాలు పొందిన సిట్రోయెన్ కంపెనీకి చెందిన 'సీ3 ఎయిర్క్రాస్' (C3 Aircross) ఇటీవల క్రాష్ టెస్టులో జీరో సేఫ్టీ రేటింగ్ పొందింది. ఈ వార్త ఒక్కసారిగా సిట్రోయెన్ కారు కొనుగోలు చేసిన వారికి భయాన్ని కలిగించింది.సిట్రోయెన్ సీ3 ఎయిర్క్రాస్ 'లాటిన్ ఎన్సీఏపీ' క్రాష్ టెస్టులో జీరో రేటింగ్ సాధించింది. అయితే ఇక్కడ టెస్ట్ చేయడానికి ఉపయోగించిన మోడల్ 'బ్రెజిల్ స్పెక్' కావడం గమనార్హం. ఇది గత ఏడాది మార్కెట్లో లాంచ్ అయింది. అప్పటి నుంచి మంచి అమ్మకాలతో దూసుకెల్తూనే ఉంది. అయితే సేఫ్టీలో జీరో స్టార్ రేటింగ్ అని తెలియడంతో.. రాబోయే అమ్మకాలు బహుశా తగ్గే అవకాశం ఉంది.సిట్రోయెన్ సీ3 ఎయిర్క్రాస్ సేఫ్టీలో జీరో స్టార్ రేటింగ్ సొంతం చేసుకుందన్న విషయాన్ని లాటిన్ ఎన్సీఏపీ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. క్రాష్ టెస్ట్ కోసం ఎంచుకున్న మోడల్ రెండు ఎయిర్బ్యాగ్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి స్టాండర్డ్ ఫీచర్స్ పొందింది.అడల్ట్ సేఫ్టీలో 33.01 శాతం, చైల్డ్ సేఫ్టీలో 11.37 శాతం స్కోర్ సాధించిన సీ3 ఎయిర్క్రాస్.. ముందున్న ప్రయాణికులకు పటిష్టమైన భద్రత అందించడంలో విఫలమైంది. సైడ్ ఇంపాక్ట్ కూడా ఆశాజనకంగా లేకపోవడం గమనార్హం. తలకు కూడా మంచి రక్షణ అందించడంలో కంపెనీ సక్సెస్ సాధించలేకపోయింది. దీంతో ఇది ప్రయాణికులకు భద్రత అందించడంలో విఫలమైందని లాటిన్ ఎన్సీఏపీ ధ్రువీకరించింది.ఇదీ చదవండి: ఇంటర్నెట్ లేకుండా ట్రాన్సక్షన్స్: వచ్చేస్తోంది 'యూపీఐ 123 పే'మంచి డిజైన్, ఫీచర్స్ కలిగి ఉన్న సీ3 ఎయిర్క్రాస్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, టర్బో పెట్రోల్ అనే రెండు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇవి రెండూ కూడా అత్యుత్తమ పనితీరును అందిస్తాయి. న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ 5 స్పీడ్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది. టర్బో పెట్రోల్ ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్, ఆటోమాటిక్ గేర్బాక్స్ పొందుతుంది. సిట్రోయెన్ సీ3 ఎయిర్క్రాస్ ధరలు రూ. 6.16 లక్షల నుంచి రూ. 10.15 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. -
నేలపై కారు.. గాలిలోనూ షికారు!
చైనీస్ ఆటోమేకర్ ఎక్స్పెంగ్ అనుబంధ సంస్థ అయిన ఎక్స్పెంగ్ ఏరోహ్ట్ ల్యాండ్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ పేరుతో కొత్త మాడ్యులర్ ఫ్లయింగ్ కారును ఆవిష్కరించింది. రెండు మాడ్యూళ్లను కలిగిన ఈ కారును ఇటీవలి 15వ చైనా ఇంటర్నేషనల్ ఏవియేషన్ & ఏరోస్పేస్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించింది.ల్యాండ్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లో మదర్షిప్, ఎయిర్క్రాఫ్ట్ అనే రెండు మాడ్యూల్స్ ఉన్నాయి. మదర్షిప్ పొడవు 5.5 మీటర్లు, ఎత్తు, వెడల్పు 2 మీటర్లు ఉంటుంది. విద్యుత్తో నడిచే ఈ కారు ఇది 1000 కిలోమీటర్లకుపైగా రేంజ్ని ఇస్తుందని కంపెనీ చెబుతోంది.ఎయిర్క్రాఫ్ట్ ఆరు-రోటర్, డ్యూయల్-డక్ట్ ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ , తేలికైన మన్నిక కోసం కార్బన్ ఫైబర్ను ఉపయోగించి తయారు చేశారు. ఇందులో ఇద్దరు కూర్చునే అవకాశం ఉంది. ఎక్స్పెంగ్ ఈ ఫ్లయింగ్ కార్లను ఒక కొత్త ఫ్యాక్టరీలో తయారు చేస్తోంది. ఇది 10,000 యూనిట్ల వార్షిక సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని, ల్యాండ్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ డెలివరీలు 2026లో ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది.China’s Xpeng just unveiled a modular flying car called the Land Aircraft Carrier. This vehicle combines a ground module—a fully functional EV—with an air module capable of vertical takeoff and flight. pic.twitter.com/ZpqW7CjSr5— Tansu Yegen (@TansuYegen) November 20, 2024 -
నిస్సాన్ మాగ్నైట్ ఎగుమతులు ప్రారంభం
దక్షిణాఫ్రికాకు సరికొత్త ఎస్యూవీ న్యూ నిస్సాన్ మాగ్నైట్ ఎగుమతులను నిస్సాన్ మోటార్ ఇండియా ప్రారంభించింది. “ఒక కారు, ఒకే ప్రపంచం” విధానంతోపాటు భారత్ను గ్లోబల్ ఎక్స్పోర్ట్ హబ్గా మార్చాలన్న లక్ష్యంలో భాగంగా ఎగుమతులు చేపట్టింది.ఈ వాహనాలు చెన్నైలోని నిస్సాన్ అలయన్స్ ప్లాంట్ నుండి ఎగుమతి అవుతున్నాయి. సరికొత్త మాగ్నైట్ మోడల్ను దిగుమతి చేసుకున్న మొదటి అంతర్జాతీయ మార్కెట్గా దక్షిణాఫ్రికా నిలిచింది. భారత్లో లాంచ్ అయిన ఒక నెలలోనే, చెన్నై పోర్ట్ నుండి 2,700 యూనిట్లకు పైగా న్యూ మాగ్నైట్ వాహనాలు ఎగుమతయ్యాయి.కాగా 2020 డిసెంబర్లో మాగ్నైట్ లాంచ్ అయినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా 150,000 యూనిట్లకు పైగా అమ్ముడుపోయాయి. ఇది నిస్సాన్క “మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్” చొరవ విజయాన్ని చాటుతోంది. బోల్డ్ లుక్, మెరుగైన భద్రతా ఫీచర్లు, అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన న్యూ మాగ్నైట్ ఈ ఏడాది అక్టోబర్లో న్యూ ఢిల్లీలో లాంచ్ అయింది.