జియోపై జీహెచ్ఎంసీ ఫిర్యాదు
జియోపై జీహెచ్ఎంసీ ఫిర్యాదు
Published Thu, Jun 8 2017 1:58 PM | Last Updated on Tue, Sep 5 2017 1:07 PM
హైదరాబాద్ లో రాత్రి కురిసిన కుండపోత వర్షంతో జీహెచ్ఎంసీ అధికారులు మేల్కొన్నారు. ఎల్ అండ్ టీ, జియోలు గతకొంతకాలంగా తవ్వుతున్న గుంతలపై నేడు కేసు నమోదుచేశారు. యూసఫ్ గూడలో గుంతలు తవ్వ వదిలేశారంటూ జూబ్లిహిల్స్ పీఎస్ లో తమ ఫిర్యాదును దాఖలు చేశారు. ప్రభుత్వ భూమిని అనవసరంగా డ్యామేజ్ చేశారంటూ జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. బ్యాంకు ఆఫ్ ఇండియా ఉద్యోగుల క్వార్టర్స్ నుంచి యూసఫ్ గూడ వెళ్లే దారిలో మెట్రో పిల్లర్ల కోసం ఎల్ అండ్ టీ గుంతలు తీసింది.
వారి పనులు పూర్తయినా వాటిని పూడ్చలేదు. అంతేకాక ఇటు జియో సైతం తమ టవర్ల కోసం గుంతలు తవ్వింది. గత రాత్రి కురిసిన వర్షానికి ఈ గుంతలన్నీ నీరు నిండిపోయాయి. నీటిని తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు.. నాలాల్లో నిండిన చెత్త వీరి పనులకు తీవ్ర అడ్డంకులు సృష్టిస్తోంది.
Advertisement
Advertisement