హిందూజా లేలాండ్ ఫైనాన్స్ ఐపీఓ పత్రాలు దాఖలు | Hinduja Leyland Finance files IPO papers to mop-up Rs 500 crore | Sakshi
Sakshi News home page

హిందూజా లేలాండ్ ఫైనాన్స్ ఐపీఓ పత్రాలు దాఖలు

Published Thu, Mar 31 2016 2:00 AM | Last Updated on Tue, Oct 2 2018 3:56 PM

హిందూజా లేలాండ్ ఫైనాన్స్ ఐపీఓ పత్రాలు దాఖలు - Sakshi

హిందూజా లేలాండ్ ఫైనాన్స్ ఐపీఓ పత్రాలు దాఖలు

కనీసం రూ.500 కోట్లు సమీకరణ లక్ష్యం...

 న్యూఢిల్లీ: అశోక్ లేలాండ్ అనుబంధ కంపెనీ హిందూజా లేలాండ్ ఫైనాన్స్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ముసాయిదా పత్రాలను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి బుధవారం  సమర్పించింది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ  రూ.500 కోట్ల విలువైన తాజా షేర్లను జారీచేయడంతో పాటు ప్రస్తుత షేర్‌హోల్డర్లు 2.66 కోట్ల ఈక్విటీ షేర్లను పబ్లిక్ ఆఫర్లో విక్రయిస్తారు. లేలాండ్ ఫైనాన్స్ సంస్థ వివిధ వాహనాల కొనుగోళ్లకు రుణాలందజేస్తోంది.

 వచ్చే ఆర్థిక సంవత్సరంలో బీఎస్‌ఈ ఐపీఓ: బీఎస్‌ఈ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) వచ్చే ఆర్థిక సంవత్సరంలో రానున్నది. ఈ ఐపీఓ ద్వారా రూ.800 కోట్లు సమీకరించాలని బీఎస్‌ఈ యోచిస్తోంది. ఈ ఐపీఓకు సంబంధించిన ముసాయిదా పత్రాలను వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల కాలంలో సెబీకి బీఎస్‌ఈ సమర్పించవచ్చని సమాచారం.

 ఐపీవో బాటలో 23 ఎస్‌ఎంఈలు: దాదాపు 23 చిన్న, మధ్య తరహా వాణిజ్య సంస్థలు(ఎస్‌ఎంఈ)ఐపీఓ ముసాయిదా పత్రాలను ఈ మార్చి క్వార్టర్లో  సెబీకి సమర్పించాయి.  ఈ సంస్థలు ఐపీఓల ద్వారా రూ200 కోట్లు సమీకరించాలని యోచిస్తున్నాయి.

 మళ్లీ సీఎల్ ఎడ్యుకేట్ ఐపీఓ: విద్య సంబంధిత సేవలందించే సీఎల్ ఎడ్యుకేట్ కంపెనీ ఐపీఓ పత్రాలను దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ సెబీకి సమర్పించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement