IPO
-
కొత్త ఐపీవో.. రూ. 550 కోట్లు టార్గెట్
ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో) ద్వారా రూ. 550 కోట్లు సమీకరించేందుకు ఎస్ఎస్ఎఫ్ ప్లాస్టిక్స్ ఇండియా లిమిటెడ్, క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. ప్రతిపాదిత ఐపీవో కింద రూ. 300 కోట్లు విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ సంస్థలు రూ. 250 కోట్ల విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో విక్రయించనున్నాయి. ప్రస్తుతం ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ సంస్థలకు కంపెనీలో 100 శాతం వాటాలు ఉన్నాయి.తాజా ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను రుణాల చెల్లింపునకు, ప్లాంటు, మెషినరీ కొనుగోలు వంటి మూలధన వ్యయాల అవసరాలకు, ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. బాటిల్స్, కంటైనర్స్, ఇంజినీరింగ్ ప్లాస్టిక్ కాంపోనెంట్లు మొదలైన వాటి డిజైనింగ్ నుంచి డెలివరీ వరకు వివిధ ప్యాకేజింగ్ సొల్యూషన్స్ను ఎస్ఎస్ఎఫ్ ప్లాస్టిక్స్ అందిస్తోంది. పర్సనల్ కేర్, హోమ్ కేర్, ఫుడ్ అండ్ బెవరేజెస్, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఇంజిన్ ఆయిల్, లూబ్రికెంట్స్ తదితర పరిశ్రమలకు సేవలు అందిస్తోంది.2024 సెప్టెంబర్తో ముగిసిన ఆరు నెలల వ్యవధిలో ఎస్ఎస్ఎఫ్ ప్లాస్టిక్స్ రూ. 397.41 కోట్ల ఆదాయంపై రూ. 15.19 కోట్ల లాభం నమోదు చేసింది. ఈ ఇష్యూకి ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్, నువామా వెల్త్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సంస్థలు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. -
ఐపీవోకు ఫిజిక్స్వాలా
ఎడ్యుటెక్ యూనికార్న్ ఫిజిక్స్వాలా పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు ముందస్తు గోప్యతా దరఖాస్తు ద్వారా సెబీని ఆశ్రయించింది. దీంతో ప్రాస్పెక్టస్ వివరాలను పబ్లిక్కు వెల్లడించకుండా నిలువరించేందుకు కంపెనీకి వీలుంటుంది. కాగా.. స్టాక్ ఎక్స్ఛేంజీల మెయిన్బోర్డులో లిస్టయ్యేందుకు వీలుగా సెబీకి ప్రాస్పెక్టస్ను దాఖలు చేసినట్లు ఫిజిక్స్వాలా తాజాగా ప్రకటించింది. అయితే ముందస్తు ఫైలింగ్ ద్వారా ఐపీవోకు వెళ్లడంపై గ్యారంటీలేదని స్పష్టం చేసింది. వెరసి ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ, సూపర్మార్ట్ కంపెనీ విశాల్ మెగా మార్ట్ బాటలో ఐపీవోకు గోప్యతా దరఖాస్తును ఎంచుకుంది. పలు కంపెనీలు..ఇంతకుముందు 2023లోనూ ఆతిథ్య రంగ కంపెనీ ఓయో కాన్ఫిడెన్షియల్ మార్గంలో సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. అంతకంటే ముందు 2022 డిసెంబర్లో టాటా ప్లే(స్కై) రహస్య దరఖాస్తు చేసి 2023 ఏప్రిల్లో సెబీ అనుమతి పొందింది. అయితే ఈ రెండు సంస్థలూ పబ్లిక్ ఇష్యూ చేపట్టకపోవడం గమనార్హం! కాగా.. 2020లో ఏర్పాటైన ఫిజిక్స్వాలా ఆన్లైన్, ఆఫ్లైన్, హైబ్రిడ్ విధానాల్లో దేశవ్యాప్తంగా విద్యార్ధులకు శిక్షణ ఇస్తోంది. గతేడాది సెప్టెంబర్లో హార్న్బిల్ క్యాపిటల్ ఆధ్వర్యంలో 21 కోట్ల డాలర్ల(రూ.1,800 కోట్లు) పెట్టుబడులు అందుకుంది. 2.8 బిలియన్ డాలర్ల విలువలో నిధులు సమకూర్చుకుంది. ముందస్తు ఫైలింగ్ ఎంచుకుంటే సెబీ తుది అనుమతి తదుపరి ఐపీవోకు 18 నెలల గడువు లభిస్తుంది. సాధారణ పద్ధతిలో అయితే 12 నెలల్లోగా పబ్లిక్ ఇష్యూ చేపట్టవలసి ఉంటుంది.ఇదీ చదవండి: మున్సిపల్ బాండ్లకు వెబ్సైట్ రూ.550 కోట్లపై కన్నుప్యాకేజింగ్ సొల్యూషన్స్ కంపెనీ ఎస్ఎస్ఎఫ్ ప్లాస్టిక్స్ సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. వీటి ప్రకారం రూ. 550 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఐపీవోలో భాగంగా రూ.300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 250 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, సంబంధిత సంస్థలు విక్రయానికి ఉంచనున్నాయి. ప్రస్తుతం ప్రమోటర్లు 100 శాతం వాటా కలిగి ఉన్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, ప్లాంటు, మెషీనరీ తదితర పెట్టుబడి వ్యయాలతోపాటు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. కంపెనీ ప్రధానంగా బాటిళ్లు, కంటెయినర్లు, మూతలు, టబ్లు, ఇంజినీరింగ్ ప్లాస్టిక్ విడిభాగాలు తదితర ఉత్పత్తులను రూపొందిస్తోంది. వ్యక్తిగత సంరక్షణ, పానీయాలు, కన్జూమర్ ఎల్రక్టానిక్స్, లూబ్రికెంట్స్, ఫార్మాస్యూటికల్స్ రంగాలలో ప్రొడక్టులను వినియోగిస్తారు. 2024 సెప్టెంబర్తో ముగిసిన ఆరు నెలల్లో రూ.397 కోట్ల ఆదాయం, రూ.15 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
ఐపీవోకు సిద్ధంగా ఉన్న రెండు కంపెనీలు ఇవే..
క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు రెండు కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ జాబితాలో వైట్గూడ్స్ దిగ్గజం ఎల్జీ ఎల్రక్టానిక్స్ ఇండియాతోపాటు మానవ వనరులు, టోల్ప్లాజా నిర్వాహక సర్వీసుల సంస్థ ఇన్నోవిజన్ లిమిటెడ్ చేరాయి. రెండు కంపెనీలు 2024 డిసెంబర్లో సెబీకి ప్రాస్పెక్టస్ను దాఖలు చేశాయి.దక్షిణ కొరియా దిగ్గజం ఎల్జీ అనుబంధ సంస్థ ఎల్జీ ఎల్రక్టానిక్స్ ఇండియా దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్కు సన్నద్ధమవుతోంది. ఇందుకు ఇప్పటికే రోడ్షోలు ప్రారంభించగా..తాజాగా సెబీ నుంచి అనుమతి పొందింది. ఐపీవోలో భాగంగా 15 శాతం వాటాకు సమానమైన 10.18 కోట్ల షేర్లను మాతృ సంస్థ విక్రయానికి ఉంచనుంది. తద్వారా సుమారు రూ.15,000 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీవో పూర్తయితే కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ ఇండియా తదుపరి దేశీయంగా లిస్టయిన రెండో దక్షిణ కొరియా దిగ్గజంగా ఎల్జీ నిలవనుంది. హ్యుందాయ్ గతేడాది అక్టోబర్లో లిస్టయింది. ఎల్జీ ఇండియా ప్రధానంగా వాషింగ్ మెషీన్లు, లెడ్ టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్స్ తదితర పలు కన్జూమర్ ప్రొడక్టులను విక్రయించే విషయం విదితమే. దేశీయంగా నోయిడా, పుణెల్లో తయారీ యూనిట్లను కలిగి ఉంది.ఇదీ చదవండి: స్టార్లింక్ సర్వీసులపై స్పెక్ట్రమ్ ఫీజు?రుణ చెల్లింపులకు..టోల్ప్లాజా మేనేజ్మెంట్ సర్వీసుల కంపెనీ ఇన్నోవిజన్ లిమిటెడ్ ఐపీవోలో భాగంగా రూ.255 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్లు మరో 17.72 లక్షల షేర్లను ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. కంపెనీ ప్రధానంగా మానవ వనరులు, క్లయింట్లకు దేశవ్యాప్తంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ, టోల్ ప్లాజా మేనేజ్మెంట్ తదితర సర్వీసులు సమకూర్చుతోంది. -
టాటా గ్రూప్ నుంచి మరో ఐపీవో
టాటా గ్రూప్ ఫైనాన్షియల్ సర్వీసుల సంస్థ టాటా క్యాపిటల్ త్వరలో పబ్లిక్ ఇష్యూకి రానుంది. అయితే ఇందుకు కంపెనీతో టాటా మోటార్స్ ఫైనాన్స్ విలీనానికి జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) అనుమతించవలసి ఉంది. తదుపరి సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసేందుకు వీలుంటుంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల(మార్చి) చివరికల్లా విలీనానికి ఎన్సీఎల్టీ గ్రీన్సిగ్నల్ ఇవ్వనున్నట్లు అంచనా. దీంతో 2 బిలియన్ డాలర్ల(రూ.17,000 కోట్లు) విలువైన ఐపీవోకు శ్రీకారం చుట్టనుంది. తద్వారా 11 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీగా నిలవనున్నట్లు అంచనా. ఆర్బీఐ వద్ద అప్పర్లేయర్ ఎన్బీఎఫ్సీగా గుర్తింపు పొందిన టాటా క్యాపిటల్ పబ్లిక్ ఇష్యూకి ఇప్పటికే సంస్థ బోర్డు అనుమతించింది. ఐపీవోలో భాగంగా 2.3 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా ప్రస్తుత వాటాదారులు సైతం కొంతమేర ఈక్విటీని ఆఫర్ చేయనున్నారు.ఏప్రిల్లో ఏథర్ ఎనర్జీ ఐపీవోఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కంపెనీ ఏథర్ ఎనర్జీ ఏప్రిల్లో పబ్లిక్ ఇష్యూకి వచ్చే సన్నాహాలు చేపట్టింది. ఇందుకు వీలుగా కంపెనీ తప్పనిసరిగా మార్పిడికిలోనయ్యే ఫ్రిఫరెన్స్ షేర్ల(సీసీపీఎస్)ను ఈక్విటీగా మార్పు చేస్తోంది. కంపెనీల రిజిస్టర్ (ఆర్వోసీ) సమాచార ప్రకారం 1.73 సీసీపీఎస్ను 24.04 కోట్ల ఈక్విటీ షేర్లుగా మార్పిడి చేసేందుకు ఏథర్ బోర్డు తాజాగా అనుమతించింది. సెబీ నిబంధనల ప్రకారం ప్రధాన ప్రాస్పెక్టస్ దాఖలు చేసే ముందుగానే సీసీపీఎస్ను ఈక్విటీగా మార్పిడి చేయవలసి ఉంటుంది. వెరసి 2025–26లో పబ్లిక్ ఇష్యూకి వచ్చిన తొలి కంపెనీగా ఏథర్ ఎనర్జీ నిలిచే వీలున్నట్లు మర్చంట్ బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి.ఇదీ చదవండి: పాక్ రైల్వే విస్తీర్ణం ఎంతో తెలుసా..?గతేడాది సెప్టెంబర్లో ఏథర్ సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. మహారాష్ట్రలో ఈవీ ద్విచక్ర వాహన తయారీ ప్లాంటు ఏర్పాటు, రుణ చెల్లింపులకుగాను నిధుల సమీకరణ చేపట్టనున్నట్లు పత్రాలలో పేర్కొంది. ఐపీవోలో భాగంగా రూ. 3,100 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 2.2 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. దీంతో ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ తదుపరి రెండో ద్విచక్ర ఈవీ కంపెనీగా స్టాక్ ఎక్ఛ్సేంజీల్లో లిస్ట్కానుంది. -
స్టాక్మార్కెట్లోకి ‘చాయ్ పాయింట్’
న్యూఢిల్లీ: టీ, కాఫీ చైన్.. చాయ్ పాయింట్ 2026 మే నెలకల్లా స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యే ప్రణాళికల్లో ఉంది. ఈ అంశాన్ని ప్రతిరోజు సుమారు 9 లక్షల కప్పుల టీ, కాఫీ విక్రయిస్తున్న సంస్థ సహవ్యవస్థాపకుడు తరుణ్ ఖన్నా తెలియజేశారు. అయితే కుంభమేళాలో రోజుకి 10 లక్షలకంటే అధికంగా విక్రయించినట్లు తెలియజేశారు.ముంబైలో తమ విద్యార్ధి అములీక్ సింగ్ బిజ్రాల్తో కలసి ఒక కేఫ్లో టీ తాగే సమయంలో 2009లో చాయ్ పాయింట్ ప్రారంభించే ఆలోచన వచ్చినట్లు హార్వార్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ ఖన్నా వెల్లడించారు. ప్లాస్టిక్ కప్పులలో అంత శుభ్రతలేని విధంగా అందిస్తున్న చాయ్ స్థానే అత్యున్నత నాణ్యతతో, పరిశుభ్రంగా అందుబాటు ధరలో సువాసనలతో కూడిన చాయ్ అందించాలనే ఆలోచనతో చాయ్ పాయింట్కు తెరతీసినట్లు వివరించారు.దీంతో టీ అందించే వ్యక్తు(చోటూ)లకు ఉపాధిని సైతం కల్పించవచ్చని భావించినట్లు తెలియజేశారు. దీంతో 2010లో బెంగళూరులోని కోరమంగళలో తొలి ఔట్లెట్ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. అములీక్తో కలిసి ఐదుగురు ఉద్యోగులతో బిజినెస్ను మొదలుపెట్టినట్లు వెల్లడించారు. ప్రస్తుతం రోజుకి 90 లక్షల కప్పుల టీ, కాఫీలను విక్రయిస్తున్నట్లు తెలియజేశారు. -
మార్కెట్లోకి కొత్త ఐపీవోలు
జైపూర్: ఐటీ సర్వీసుల కంపెనీ హెక్సావేర్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూకి రూ.674–708 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ రేపు(12న) ప్రారంభమై 14న ముగియనుంది. దీనిలో భాగంగా ప్రమోటర్ సంస్థ సీఏ మ్యాగ్నమ్ హోల్డింగ్స్ రూ.8,750 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. పీఈ దిగ్గజం కార్లయిల్ గ్రూప్ సంస్థ ఇది. కాగా.. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 21 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు నేడు(11న) షేర్లను ఆఫర్ చేయనుంది. ఏఐసహా.. డిజిటల్, టెక్నాలజీ సేవలందిస్తున్న హెక్సావేర్ విభిన్న కస్టమర్లను కలిగి ఉంది. ప్రధానంగా ఫైనాన్షియల్ సర్వీసులు, హెల్త్కేర్ అండ్ ఇన్సూరెన్స్, మ్యాన్యుఫాక్చరింగ్, బ్యాంకింగ్ అండ్ ట్రావెల్ తదితర విభాగాల్లో సర్వీసులు అందిస్తోంది.ఇదీ చదవండి: 462 కంపెనీలపై దర్యాప్తు!క్వాలిటీ పవర్ @ రూ.401–425విద్యుత్ ప్రసార పరికరాలు, సంబంధిత టెక్నాలజీ కంపెనీ క్వాలిటీ పవర్ పబ్లిక్ ఇష్యూకి రూ.401–425 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 14న ప్రారంభమై 18న ముగియనుంది. దీనిలో భాగంగా రూ.225 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ.634 కోట్ల విలువైన(1.5 కోట్ల షేర్లు) ప్రమోటర్ చిత్రా పాండ్యన్ విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా కంపెనీ రూ.859 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. కంపెనీలో ప్రస్తుతం పాండ్యన్ కుటుంబం 100 శాతం వాటా కలిగి ఉంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 13న షేర్లను ఆఫర్ చేయనుంది. ఈక్విటీ జారీ నిధులతో మెహ్రు ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజినీర్స్ను సొంతం చేసుకోనుంది. అంతేకాకుండా ప్లాంటు, మెషీనరీ కొనుగోలుకి సైతం నిధులను వెచ్చించనుంది. కంపెనీ ప్రధానంగా అధిక వోల్టేజీ(హెచ్వీడీసీ) పరికరాల తయారీ, ఫ్లెక్సిబుల్ ఏసీ ట్రాన్స్మిషన్ సిస్టమ్స్ నెట్వర్క్స్ అందిస్తోంది. గతేడాది(2023–24) రూ. 300 కోట్ల ఆదాయం, రూ. 55 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. -
ఐపీవోకు 7 కంపెనీలు రెడీ
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ(Sebi) తాజాగా 7 కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ జాబితాలో డిఫెన్స్ తయారీ కంపెనీ ఏఎంపీపీసహా.. ఆదిత్య ఇన్పోటెక్, బ్రిగేడ్ హోటల్, కుమార్ ఆర్క్ టెక్, సోలార్ వరల్డ్ ఎనర్జీ సొల్యూషన్స్, ఇండోగల్ఫ్ క్రాప్ సైన్సెస్, గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్, ప్రోస్టార్ ఇన్ఫోసిస్టమ్స్ చేరాయి. అయితే ఆటో విడిభాగాల సంస్థ వినే కార్పొరేషన్ ముసాయిదా పేపర్స్ను ఇటీవలే వెనక్కి తీసుకుంది. మర్చంట్ బ్యాంకర్ల వివరాల ప్రకారం ఇవన్నీ ఉమ్మడిగా రూ. 7,800 కోట్లు సమీకరించనున్నాయి. రూ. 4,000 కోట్లపై కన్ను ఐపీవో ద్వారా ఎస్ఎంపీపీ లిమిటెడ్ రూ. 4,000 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. దీనిలో భాగంగా రూ. 580 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుండగా.. మరో రూ. 3,420 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ శివ్ చంద్ కన్సల్ విక్రయానికి ఉంచనున్నారు. ప్రస్తుతం ప్రమోటర్గా కన్సల్ 50 శాతం వాటాను కలిగి ఉన్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 437 కోట్లు అనుబంధ కంపెనీ ద్వారా పెట్టుబడి వ్యయాలపై వెచ్చించనుంది. రూ. 1,300 కోట్ల సమీకరణ ఆదిత్య ఇన్ఫోటెక్ ఐపీవో ద్వారా రూ. 1,300 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. దీనిలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుండగా.. మరో రూ. 800 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ నిధుల్లో రూ. 375 కోట్లు రుణాల చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. రూ. 900 కోట్లకు సై ఆతిథ్య రంగ కంపెనీ బ్రిగేడ్ హోటల్ వెంచర్స్ ఐపీవోలో భాగంగా రూ. 900 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా పెట్టుబడులను సమీకరించాలని ఆశిస్తోంది. వీటిలో రూ. 481 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 59 కోట్లు మెటీరియల్ అనుబంధ సంస్థ ఎస్ఆర్పీ ప్రోస్పరిటా హోటల్ వెంచర్స్కు కేటాయించనుంది. మరో రూ. 108 కోట్లు భూమి కొనుగోలుకి వెచ్చించనుంది. రూ. 740 కోట్లపై దృష్టి పీవీసీ బ్లెండ్ ఆధారిత బిల్డింగ్ మెటీరియల్ తయారీ కంపెనీ కుమార్ ఆర్క్ టెక్ ఐపీవో ద్వారా రూ. 740 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. రూ. 500 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనుండగా.. మరో రూ. 240 కోట్ల విలువైన ఈక్విటీని కంపెనీ తాజాగా జారీ చేయనుంది. ఈ నిధుల్లో రూ. 182 కోట్లు అనుబంధ సంస్థ టేలియస్ ఇండస్ట్రీలో పెట్టుబడికి వెచ్చించనుంది. రూ. 600 కోట్లకు రెడీ సోలార్వరల్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ ఐపీవోలో భాగంగా రూ. 600 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. దీనిలో రూ. 550 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. మరో రూ. 50 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. రూ. 200 కోట్లతోపాటు.. ఐపీవోలో భాగంగా ఇండోగల్ఫ్ క్రాప్సైన్సెస్ రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 38.55 లక్షల షేర్లను ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. 1.9 కోట్ల షేర్ల జారీ గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్ ఐపీవోలో భాగంగా 1.9 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. నిధులను పరికరాల కొనుగోలు, వర్కింగ్ క్యాపిటల్, సాధరణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. పబ్లిక్ ఇష్యూకు ప్రోస్టార్మ్ ఇన్ఫో సిస్టమ్స్ ఐపీవోలో భాగంగా పవర్ సొల్యూషన్లు, ప్రొడక్టుల తయారీ కంపెనీ ప్రోస్టార్మ్ ఇన్ఫో సిస్టమ్స్ 1.6 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. నిధులను రుణ చెల్లింపులు, అనుబంధ సంస్థలో వాటా కొనుగోలు, వర్కింగ్ క్యాపిటల్, సాధరణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. సెబీకి ఉయ్వర్క్ ఇండియా ప్రాస్పెక్టస్వర్క్స్పేస్ సేవల సంస్థ ఉయ్వర్క్ తమ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూకి (ఐపీవో) సంబంధించి ముసాయిదా ప్రాస్పెక్టస్ని (డీఆర్హెచ్పీ) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమరి్పంచింది. ఈ ఇష్యూలో భాగంగా కంపెనీ 4,37,53,952 షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో విక్రయించనుంది. ఐపీవో పూర్తిగా ఓఎఫ్ఎస్ రూపంలో ఉంటుంది కాబట్టి ఇష్యూ ద్వారా వచ్చే నిధులు కంపెనీకి లభించవు. వ్యక్తులు, చిన్నా .. పెద్ద వ్యాపార సంస్థలు, అంకురాలు మొదలైన కస్టమర్లకు నాణ్యమైన వర్క్స్పేస్లను అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. -
ఐపీవోకు డార్ఫ్-కీటాల్ కెమికల్స్
న్యూఢిల్లీ: ప్రత్యేక రసాయనాల తయారీలో ఉన్న డార్ఫ్–కీటాల్ కెమికల్స్ ఇండియా లిమిటెడ్ ఐపీవోకు వస్తోంది. రూ.5,000 కోట్లను సమీకరించేందుకు అనుమతి కోరుతూ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ.1,500 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేస్తారు.ప్రమోటర్ మీనన్ ఫ్యామిలీ హోల్డింగ్స్ ట్రస్ట్ రూ.3,500 కోట్ల విలువైన షేర్లను విక్రయించనుంది. డార్ఫ్–కీటాల్ కెమికల్స్ ఇండియా 1992లో ప్రారంభం అయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, పెట్రోనాస్, ఐవోసీ, పీపీజీ ఇండస్ట్రీస్, వేదాంత వంటి దిగ్గజ సంస్థలు క్లయింట్లుగా ఉన్నాయి. భారత్తోపాటు బ్రెజిల్, యూఎస్, కెనాడాలో మొత్తం 16 తయారీ కేంద్రాలను కలిగి ఉంది.రసాయనాల తయారీలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అతికొద్ది సంస్థల్లో డార్ఫ్–కీటాల్ కెమికల్స్ ఇండియా ఒకటి. భారత్ వెలుపల సంస్థ ఖాతాలో 542 పేటెంట్స్ ఉన్నాయి. వీటిలో యూఎస్లో 99 నమోదయ్యాయి. కంపెనీ 2023–24లో రూ.548 కోట్ల టర్నోవర్పై రూ.60 కోట్ల నికరలాభం ఆర్జించింది.ఐపీఓ అంటే..స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి రెండు రకాల మార్గాలు అందుబాటులో ఉంటాయి. ఒకటి..కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు వచ్చినప్పుడు వాటికి దరఖాస్తు చేయడం ద్వారా షేర్లను కొనుగోలు చేయడం. అలాకాకుండా మార్కెట్లో నేరుగా షేర్లను కొనుగోలు చేయడం రెండోది. పబ్లిక్ ఇష్యూనే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) అని కూడా వ్యవహరిస్తారు. సాధారణంగా కంపెనీలు తమ ఎదుగుదల క్రమంలో నిధులు అవసరమై ప్రజల నుంచి వాటిని సమీకరించాలనే ఉద్దేశంతో షేర్లను జారీ చేయడం ద్వారా మొట్టమొదటిసారి ఐపీఓకు వస్తాయి.ఇలా ఐపీఓకి వచ్చే కంపెనీలు ముందుగా లీడ్ మేనేజర్లను నియమించుకుంటాయి. వీరు ఆ కంపెనీ ఐపీఓ వ్యవహారాలు సజావుగా పూర్తయ్యేలా చూస్తారు. కంపెనీలు ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను కంపెనీలు విస్తరణ, మూలధన అవసరాలు, అప్పులు తీర్చడం కోసం వాడుకుంటాయి. ఐపీఓ తర్వాత సంస్థలు వాటాదారులకు జవాబుదారీగా నిలవాల్సి ఉంటుంది. -
ఐపీవో గ్రే మార్కెట్పై సెబీ కన్ను
పబ్లిక్ ఇష్యూల అనధికార క్రయవిక్రయాల(గ్రే మార్కెట్)కు చెక్ పెట్టే యోచనలో ఉన్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ(SEBI) తాజాగా పేర్కొంది. ఇందుకు ఒక వ్యవస్థను ప్రవేశపెట్టే ప్రణాళికల్లో ఉన్నట్లు సెబీ ఛైర్పర్సన్ మాధవీ పురీ బచ్ పేర్కొన్నారు. తద్వారా ఐపీవో(IPO)లో షేర్లను పొందగల ఇన్వెస్టర్లు ముందుగానే వీటిని విక్రయించేందుకు వీలు కల్పించనున్నట్లు తెలియజేశారు. ఇటీవల కాలంలో పలు ఐపీవోలకు భారీస్థాయిలో స్పందన లభించడంతోపాటు.. అధిక లాభాలతో లిస్టవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొద్దికాలంగా గ్రే మార్కెట్ లావాదేవీలు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. ఇన్వెస్టర్లు ఇలాంటి లావాదేవీలను కోరుకుంటుంటే నియంత్రణల పరిధిలో వీటిని ఎందుకు అనుమతించకూడదంటూ వ్యాఖ్యానించారు.దేశీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ల అసోసియేషన్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో బచ్ పలు అంశాలపై స్పందించారు. నిజానికి గ్రే మార్కెట్ లావాదేవీలు సరికాదని, ఆర్గనైజ్డ్ మార్కెట్ ద్వారానే క్రయవిక్రయాలు చేపట్టడం శ్రేయస్కరమని బచ్ తెలియజేశారు. ఇందుకు రెండు స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజాలు చర్చలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మార్గదర్శకాలు సిద్ధమయ్యాక ఐపీవో షేర్లకు లిస్టింగ్కంటే మూడు రోజులు ముందుగా లావాదేవీలకు తెరతీయనున్నట్లు వివరించారు. షేర్ల కేటాయింపులు, లిస్టింగ్ మధ్యలో ఇందుకు వీలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: స్టార్టప్స్కు ఏటా రూ.1.24 లక్షల కోట్ల నిధులునిధుల దుర్వినియోగంకొన్ని కంపెనీలు ఐపీవోల ద్వారా సమీకరించిన నిధులను దుర్వినియోగపరుస్తున్నట్లు గుర్తించామని బచ్ తెలియజేశారు. క్యాపిటల్ మార్కెట్లలో ఇలాంటి సంస్థలు కార్యకలాపాలు నిర్వహించకుండా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు అడ్డుకోవాలని సూచించారు. ఐపీవో డాక్యుమెంట్లను వేగంగా పరిశీలించి అనుమతులిచ్చేందుకు వీలుగా ఒక సాధనాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. బ్యాంకర్లకు ఇలాంటి కంపెనీలగురించి తెలుస్తుందని, ఇలాంటి వాటికి సహకరించవద్దని సలహా ఇచ్చారు. ఎస్ఎంఈ విభాగంలో ఇలాంటి ఐపీవోలు వెలువడితే అధిక సబ్ర్స్కిప్షన్ నమోదవుతున్నదని చెప్పారు. ఆపై షేరు ధర భారీగా పెరుగుతూపోవడం ద్వారా ప్రమోటర్లు త్వరితగతిన లాభపడుతున్నట్లు వివరించారు. సంబంధిత పార్టీ లావాదేవీల ద్వారా ఐపీవో నిధులను కొన్ని కంపెనీలు ప్రమోటర్ సంబంధ సంస్థలలోకి చేర్చడం లేదా రక్షణాత్మక ప్రాంతాలకు మళ్లించడం చేస్తున్నట్లు బచ్ తెలియజేశారు. ఈ నిధులను విదేశీ మార్కెట్లలో ఇతర సంస్థలు లేదా సాఫ్ట్వేర్ వంటి ప్రొడక్టుల కొనుగోలుకి వినియోగిస్తున్నాయని వివరించారు. -
రెండేళ్లలో 1,000 ఐపీవోలు
న్యూఢిల్లీ: రానున్న రెండేళ్లలో మొత్తం 1,000 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలు చేపట్టే వీలున్నట్లు దేశీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ల అసోసియేషన్(ఏఐబీఐ) తాజాగా అంచనా వేసింది. ఇందుకు ప్రధానంగా ఆర్థిక వృద్ధి, సానుకూల స్టాక్ మార్కెట్లు, మెరుగుపడనున్న నియంత్రణా సంబంధ నిబంధనలు తోడ్పాటు నివ్వగలవని పేర్కొంది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం(2025–26)లో అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ద్వారా కంపెనీల నిధుల సమీ కరణ రూ. 3 లక్షల కోట్లను అధిగమించవచ్చునని అభిప్రాయపడింది. రానున్న రెండేళ్ల(2026, 2027)లో దేశీ క్యాపిటల్ మార్కెట్లు భారీ ప్రగతిని సాధించనున్నట్లు ఏఐబీఐ తెలియజేసింది. గత ఆరేళ్లలో 851 కంపెనీలు ఐపీవోలు చేపట్టడం ద్వారా మొత్తం రూ. 4.58 లక్షల కోట్లు సమీకరించినట్లు వెల్లడించింది. వీటిలో 281 కంపెనీలు మెయిన్ బోర్డు నుంచి లిస్ట్కాగా.. 570 సంస్థలు ఎస్ఎంఈ విభాగానికి చెందినవిగా తెలియజేసింది. గతేడాదిలో గత ఆర్థిక సంవత్సరం(2023–24) స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్ ద్వారా దేశీ కంపెనీలు ఉమ్మడిగా రూ. 67,955 కోట్లు సమకూర్చుకున్నట్లు ఏఐబీఐ పేర్కొంది. వీటిలో ప్రధాన కంపెనీలు రూ. 61,860 కోట్లు అందుకోగా.. ఎస్ఎంఈలు రూ. 6,095 కోట్ల పెట్టుబడులు సమీకరించాయి. మరోవైపు క్విప్ ద్వారా 61 కంపెనీలు రూ. 68,972 కోట్ల నిధులను సమీకరించాయి. ఐపీవోల పరిమాణంరీత్యా గతేడా ది భారత్ ప్రపంచవ్యాప్తంగా తొలి స్థానంలో నిలిచినట్లు ఏఐబీఐ చైర్మన్ మహావీర్ లునావట్ తెలియజేశారు. మొత్తం 335 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వచ్చినట్లు వెల్లడించారు. తద్వారా యూఎస్, యూ రప్లను భారత్ అధిగమించినట్లు పేర్కొన్నారు. గత రెండేళ్ల బాటలో వచ్చే ఏడాదిలోనూ ఐపీవోలు రికార్డ్ సృష్టించనున్నట్లు అంచనా వేశారు. వెరసి క్విప్లు, ఐపీవోల ద్వా రా రూ. 3 లక్షల కోట్ల ను మించి పెట్టుబడుల సమీకరణకు వీలున్నట్లు అభిప్రాయపడ్డారు.ల్యూమినో ఇండస్ట్రీస్ లిస్టింగ్ బాట సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు కండక్టర్స్, పవర్ కేబుళ్ల తయారీ కంపెనీ ల్యూమినో ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 600 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 400 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా రూ. 1,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 420 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 15 కోట్లు పరికరాల కొనుగోలుకి వెచ్చించనుంది. మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా ప్రొడక్ట్ ఆధారిత ఈపీసీ సేవలు అందిస్తోంది. కండక్టర్స్, పవర్ కేబుళ్లు, ఎలక్ట్రికల్ వైర్లతోపాటు విద్యుత్ ప్రసారం, పంపిణీకి చెందిన ఇతర ప్రత్యేక విడిభాగాలను సైతం రూపొందిస్తోంది. కంపెనీ క్లయింట్లలో కల్పతరు ప్రాజెక్ట్స్, మాంటె కార్లో, జాక్సన్ లిమిటెడ్, వరోరా కర్నూల్ ట్రాన్స్మిషన్ తదితరాలున్నాయి. అంతేకాకుండా దేశ, విదేశీ ప్రభుత్వ విద్యుత్ బోర్డులు సైతం కస్టమర్ల జాబితాలో ఉన్నాయి. 2024 సెప్టెంబర్కల్లా కంపెనీ ఆర్డర్ బుక్ విలువ రూ. 1,804 కోట్లకు చేరింది. గతేడాది(2023–24) ఆదాయం 85% జంప్చేసి రూ. 1,407 కోట్లను తాకగా.. నికర లా భం రూ. 19 కోట్ల నుంచి రూ. 87 కోట్లకు ఎగసింది. ఐపీవో గ్రే మార్కెట్పై సెబీ కన్నుప్రీలిస్టింగ్ ట్రేడింగ్ను అనుమతించే యోచనపబ్లిక్ ఇష్యూల అనధికార క్రయవిక్రయాల(గ్రే మార్కెట్)కు చెక్ పెట్టే యోచనలో ఉన్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పేర్కొంది. ఇందుకు ఒక వ్యవస్థను ప్రవేవపెట్టే ప్రణాళికల్లో ఉన్నట్లు సెబీ చైర్పర్శన్ మాధవీ పురీ బచ్ పేర్కొన్నారు. తద్వారా ఐపీవోలో షేర్లను పొందగల ఇన్వెస్టర్లు ముందుగానే వీటిని విక్రయించేందుకు వీలు కల్పించనున్నట్లు తెలియజేశారు. ఇటీవల కాలంలో పలు ఐపీవోలకు భారీస్థాయిలో స్పందన లభించడంతోపాటు.. అధిక లాభాలతో లిస్టవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొద్దికాలంగా గ్రే మార్కెట్ లావాదేవీలు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. ఇన్వెస్టర్లు ఇలాంటి లావాదేవీలను కోరుకుంటుంటే నియంత్రణల పరిధిలో వీటిని ఎందుకు అనుమతించకూడదంటూ వ్యాఖ్యానించారు. దేశీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ల అసోసియేషన్ ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో బచ్ ఇంకా పలు అంశాలపై స్పందించారు. నిజానికి గ్రే మార్కెట్ లావాదేవీలు సరికాదని, ఆర్గనైజ్డ్ మార్కెట్ ద్వారానే క్రయవిక్రయాలు చేపట్టడం శ్రేయస్కరమని బచ్ తెలియజేశారు. ఇందుకు రెండు స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు చర్చలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మార్గదర్శకాలు సిద్ధమయ్యాక ఐపీవో షేర్లకు లిస్టింగ్కంటే మూడు రోజులు ముందుగా లావా దేవీలకు తెరతీయనున్నట్లు వివరించారు. షేర్ల కేటాయింపులు, లిస్టింగ్ మధ్యలో ఇందుకు వీలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. నిధుల దుర్వినియోగం కొన్ని కంపెనీలు ఐపీవోల ద్వారా సమీకరించిన నిధులను దురి్వనియోగపరుస్తున్నట్లు గుర్తించామని బచ్ తెలియజేశారు. క్యాపిటల్ మార్కెట్లలో ఇలాంటి సంస్థలు కార్యకలాపాలు నిర్వహించకుండా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు అడ్డుకోవాలని సూచించారు. ఐపీవో డాక్యుమెంట్లను వేగంగా పరిశీలించి అనుమతులిచ్చేందుకు వీలుగా ఒక సాధనాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. ఐబ్యాంకర్లకు ఇలాంటి కంపెనీలగురించి తెలుస్తుందని, ఇలాంటి వాటికి సహకరించవద్దని సలహా ఇచ్చారు. ఎస్ఎంఈ విభాగంలో ఇలాంటి ఐపీవోలు వెలువడితే అధిక సబ్ర్స్కిప్షన్ నమోదవుతున్నదని చెప్పారు. ఆపై షేరు ధర భారీగా పెరుగుతూపోవడం ద్వారా ప్రమోటర్లు త్వరితగతిన లాభపడుతున్నట్లు వివరించారు. సంబంధిత పార్టీ లావాదేవీల ద్వారా ఐపీవో నిధులను కొన్ని కంపెనీలు ప్రమోటర్ సంబంధ సంస్థలలోకి చేర్చడం లేదా రక్షణాత్మక ప్రాంతాలకు మళ్లించడం చేస్తున్నట్లు బచ్ తెలియజేశారు. ఈ నిధులను విదేశీ మార్కెట్లలో ఇతర సంస్థలు లేదా సాఫ్ట్వేర్ వంటి ప్రొడక్టుల కొనుగోలుకి వినియోగిస్తున్నాయని వివరించారు. -
ఐపీవోకు ఆరు కంపెనీలు రెడీ
కొత్త క్యాలండర్ ఏడాదిలోనూ ప్రైమరీ మార్కెట్ల దూకుడు కొనసాగనుంది. తాజాగా ఆరు కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ(SEBI) పచ్చ జెండా ఊపింది. జాబితాలో ఐటీ సర్వీసుల కంపెనీ హెక్సావేర్ టెక్నాలజీస్తోపాటు.. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు విక్రన్ ఇంజినీరింగ్, అజాక్స్ ఇంజినీరింగ్, పీఎంఈఏ సోలార్ టెక్ సొల్యూషన్స్, ఆల్ టైమ్ ప్లాస్టిక్స్, స్కోడా ట్యూబ్స్ చేరాయి. ఈ ఆరు కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్ కోసం 2024 సెప్టెంబర్-డిసెంబర్ మధ్య ప్రాస్పెక్టస్లను దాఖలు చేశాయి. తద్వారా ఉమ్మడిగా రూ.10,000 కోట్లు సమీకరించనున్నాయి. వివరాలు చూద్దాం..కార్లయిల్ మద్దతుతో..డిజిటల్, ఐటీ సొల్యూషన్ల కంపెనీ హెక్సావేర్ టెక్నాలజీస్ ఐపీవో(IPO)లో భాగంగా రూ. 9,950 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనుంది. ప్రమోటర్ సంస్థ సీఏ మ్యాగ్నమ్ హోల్డింగ్స్ వీటిని ఆఫర్ చేయనుంది. హెక్సావేర్లో పీఈ దిగ్గజం కార్లయిల్ గ్రూప్ సంస్థ సీఏకు ప్రస్తుతం 95.03 శాతం వాటా ఉంది. కంపెనీ ఫైనాన్షియల్, హెల్త్కేర్, తయారీ, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ తదితర రంగాలకు ఐటీ సర్వీసులు సమకూర్చుతోంది. గత ప్రమోటర్ బేరింగ్ పీఈ ఏషియా 2020లో హెక్సావేర్ను స్టాక్ ఎక్స్చేంజీల నుంచి డీలిస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తదుపరి ఏడాది కాలంలో బేరింగ్ వాటాను కార్లయిల్ గ్రూప్ కొనుగోలు చేసింది. గతేడాది(2023–24) హెక్సావేర్ రూ.10,380 కోట్ల ఆదాయం, రూ.997 కోట్ల నికర లాభం ఆర్జించింది. స్టెయిన్లెస్ స్టీల్ గుజరాత్ కంపెనీ స్కోడా ట్యూబ్స్ ఐపీవోలో భాగంగా రూ.275 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. సంస్థ ప్రధానంగా ఆయిల్, గ్యాస్, కెమికల్స్, ఫెర్టిలైజర్స్, విద్యుత్ తదితర రంగాలలో కార్యకలాపాలు నిర్వహించే ఈపీసీ, ఇండ్రస్టియల్ కంపెనీలకు స్టెయిన్లెస్ స్టీల్ ట్యూబ్స్, పైపులను తయారు చేసి అందిస్తోంది. ఈపీసీ కంపెనీమౌలిక రంగ ఈపీసీ సంస్థ విక్రన్ ఇంజినీరింగ్ ఐపీవోలో భాగంగా రూ.900 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ.100 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీలో సుప్రసిద్ధ ఇన్వెస్టర్ ఆశిష్ కొచాలియాకు సైతం పెట్టుబడులున్నాయి. టర్న్కీ పద్ధతిలో డిజైన్, సప్లై, ఇన్స్టలేషన్, టెస్టింగ్, కమిషనింగ్ తదితర ఎండ్ టు ఎండ్ ఈపీసీ సర్వీసులదిస్తోంది. సోలార్ టెక్ఐపీవోలో భాగంగా పీఎంఈఏ సోలార్ టెక్ సొల్యూషన్స్ రూ.600 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.12 కోట్ల షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. 2006లో ఏర్పాటైన కంపెనీ ప్రధానంగా సోలార్ ట్రాకింగ్ మౌంటింగ్ సిస్టమ్స్, ఎక్విప్మెంట్ తయారీలో ఉంది. మాడ్యూల్ మౌంటింగ్ అసెంబ్లీలో 16 గిగావాట్ల వార్షిక స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉంది. కన్జూమర్ ప్రొడక్ట్స్కస్టమర్ల కోసం కన్జూమర్వేర్ ప్రొడక్టులు తయారు చేసే ఆల్ టైమ్ ప్లాస్టిక్స్ ఐపీవోలో భాగంగా రూ. 350 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 52.5 లక్షల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. వైట్లేబుల్ కన్జూమర్వేర్ ప్రొడక్టుల తయారీ కంపెనీ క్లయింట్ల సొంత బ్రాండ్లను రూపొందించి అందిస్తోంది. కస్టమర్ల జాబితాలో గ్లోబల్ దిగ్గజాలు ఐకియా, ఏఎస్డీఏ స్టోర్స్, టెస్కో పీఎల్సీ, మైఖేల్స్ స్టోర్స్తోపాటు దేశీయంగా స్పెన్సర్స్ రిటైల్ తదితరాలున్నాయి.ఇదీ చదవండి: అత్యంత విలువైన ఐటీ బ్రాండ్లుకాంక్రీట్ ఎక్విప్మెంట్పీఈ దిగ్గజం కేదారా క్యాపిటల్కు పెట్టుబడులున్న అజాక్స్ ఇంజినీరింగ్ కాంక్రీట్ ఎక్విప్మెంట్ తయారీలో కార్యకలాపాలు విస్తరించింది. ఐపీవోలో భాగంగా 2.28 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. కేదారా క్యాపిటల్ 74.37 లక్షల షేర్లను ఆఫర్ చేయనుంది. -
కార్పొరేట్ వ్యవహారాలపై సెబీ నిర్ణయం
న్యూఢిల్లీ: ఇంజినీరింగ్ సొల్యూషన్స్ సంస్థ వినిర్ ఇంజినీరింగ్ తమ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూకి సంబంధించి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ(SEBI)కి ముసాయిదా ప్రాస్పెక్టస్ సమర్పించింది. దీని ప్రకారం ఐపీవోలో భాగంగా 5,33,00,000 షేర్లను కంపెనీ ఆఫర్ చేయనుంది. ప్రమోటర్ సెల్లింగ్ షేర్హోల్డర్ నితేష్ గుప్తా వీటిని ఆఫర్ ఫర్ సేల్ (OFS) కింద విక్రయించనున్నారు. షేర్ల ముఖవిలువ రూ.2గా ఉంటుంది.ఇదీ చదవండి: మరిన్ని సంస్థలకు పీఎల్ఐ ప్రోత్సాహకాలుఆనంద్ రాఠీకి సెబీ చెక్ఐపీవో ప్రాస్పెక్టస్ వెనక్కిన్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా బ్రోకింగ్ కంపెనీ ఆనంద్ రాఠీ(Anand Rati) గ్రూప్ పబ్లిక్ ఇష్యూ ప్రణాళికలకు చెక్ పెట్టింది. ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ 2024 డిసెంబర్లో దాఖలు చేసిన ఐపీవో ముసాయిదా ప్రాస్పెక్టస్ను తిప్పి పంపింది. వీటి ప్రకారం స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్ ద్వారా ఆనంద్ రాఠీ షేర్ రూ. 745 కోట్లు సమీకరించాలని భావించింది. ఇందుకు ఈక్విటీని తాజాగా జారీ చేయాలని ప్రతిపాదించింది. అయితే కారణాలు వెల్లడించకుండా సెబీ ప్రాస్పెక్టస్ను రిటర్న్ చేసింది. -
17న హైరింగ్ కంపెనీ ఐపీఓ.. ఒక్కో షేరు రూ.117–124
లీడర్షిప్ హైరింగ్ సేవల్లో ఉన్న ఈఎంఏ పార్ట్నర్స్ (EMA Partners)ఐపీఓ (IPO) జనవరి 17న ప్రారంభమై 21న ముగియనుంది. ఇష్యూ ధరల శ్రేణి రూ.117–124 గా కంపెనీ నిర్ణయించింది. గరిష్ట ధర వద్ద రూ.76.01 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా నిర్ధేశించుకుంది. పబ్లిక్ ఇష్యూలో భాగంగా 53.34 లక్షల తాజా ఈక్విటీలను జారీ చేయనుంది.ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రమోటర్లు క్రిష్ణన్ సుదర్శన్, సుబ్రమణియన్లు 7.96 లక్షల షేర్లను విక్రయించనున్నారు. క్యూఐబీలకు 50%, ఎన్ఐఐలకు 15%, రిటైల్ ఇన్వెస్టర్లకు 35% వాటా కేటాయింపు జరిగింది. ఐపీఓ పూర్తయిన తర్వాత ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్ఫామ్లో షేర్లు లిస్ట్ కానున్నాయి.సమీకరించిన నిధులను రుణాల చెల్లింపులకు, ఐటీ విభాగపు మౌలిక అభివృద్ధికి, నాయకత్వ బృందాన్ని పెంచుకునేందుకు వినియోగిస్తామని కంపెనీ తెలిపింది. ఈ ఇష్యూకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్గా ఇండోరియంట్ ఫైనాన్షియల్ సర్వీసెస్, రిజిస్ట్రార్గా బిగ్షేర్ సర్వీసెస్ వ్యవహరిస్తున్నాయి.13న లక్ష్మీ డెంటల్ ఐపీఓఆర్బిమెడ్ ప్రమోట్ చేస్తున్న లక్ష్మీ డెంటల్ తాజాగా యాంకర్ ఇన్వెస్టర్ల నుండి రూ.314 కోట్లకు పైగా అందుకుంది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్,, ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ ఎంఎఫ్, హెచ్డీఎఫ్సీ ఎంఎఫ్, కోటక్ ఎంఎఫ్, మిరే అసెట్ ఎంఎఫ్, టాటా ఎంఎఫ్, బిర్లా సన్లైఫ్ ఇన్సూరెన్స్, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, నోమురా, గోల్డ్మన్ సాక్స్, అల్ మెహ్వార్ కమర్షియల్స్ ఇన్వెస్ట్మెంట్స్, నాటిక్సిస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ తదితర 31 కంపెనీలు వీటిలో ఉన్నాయి.యాంకర్ ఇన్వెస్టర్లకు లక్ష్మీ డెంటల్ ఒక్కొక్కటి రూ.428 చొప్పున 73.39 లక్షల షేర్లు కేటాయించింది. కంపెనీ ఐపీవో జనవరి 13న ప్రారంభమై 15న ముగియనుంది. ఇష్యూ ధరల శ్రేణి రూ.407–428గా నిర్ణయించారు. ఐపీవోలో భాగంగా రూ.138 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేస్తారు. రూ.560 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయించనున్నారు. -
2025లో ఐపీవోల వెల్లువ
ప్రైమరీ మార్కెట్ల జోరు ఈ కేలండర్ ఏడాది(2025)లోనూ సరికొత్త రికార్డులను నెలకొల్పనున్నట్లు కొటక్ మహీంద్రా క్యాపిటల్ (Kotak Mahindra Capital) కంపెనీ అభిప్రాయపడింది. పలు దిగ్గజాలు స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యేందుకు సన్నాహాలు చేపట్టడంతో 2025లో 35 బిలియన్ డాలర్ల సమీకరణకు వీలున్నట్లు అంచనా వేసింది.2024లో 91 కంపెనీలు ఐపీవోల (IPO) ద్వారా రూ. 1.67 లక్షల కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. ఇది ప్రైమరీ మార్కెట్ల చరిత్రలోనే అత్యధికంకాగా.. ఈ ఏడాది మరిన్ని కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు రానున్నాయి. జాబితాలో ఫైనాన్షియల్ సర్వీసుల రంగం టాప్ ర్యాంకులో నిలవనున్నట్లు కొటక్ మహీంద్రా క్యాపిటల్ పేర్కొంది.హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, అవాన్సే ఫైనాన్షియల్ సర్వీసెస్, టాటా క్యాపిటల్ తదితర దిగ్గజాలు ఉమ్మడిగా 9 బిలియన్ డాలర్లు సమీకరించే ప్రణాళికల్లో ఉన్నట్లు వెల్లడించింది. ఈ బాటలో డిజిటల్ టెక్ కంపెనీలు ఈకామ్ ఎక్స్ప్రెస్, ఓలా, జెప్టో, పెప్పర్ఫ్రై తదితరాలు 5 బిలియన్ డాలర్లపై కన్నేసినట్లు తెలియజేసింది. ఇష్యూ పరిమాణం అప్ పలు కంపెనీలు ఐపీవోల ద్వారా పెట్టుబడుల సమీకరణపై దృష్టి పెట్టడంతో ఇష్యూ పరిమాణంసైతం పెరిగే వీలున్నట్లు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ కొటక్ మహీంద్రా క్యాపిటల్ వివరించింది. ప్రైమరీ, సెకండరీ మార్కెట్ల జోరు కారణంగా 2024లో లిస్టింగ్ రోజు సగటు ప్రీమియం 33 శాతానికి ఎగసినట్లు వెల్లడించింది.గతేడాది విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు సెకండరీ మార్కెట్లకంటే పబ్లిక్ ఇష్యూలపట్లే అత్యంత మక్కువ చూపినట్లు పేర్కొంది. ఆటో రంగ దిగ్గజం హ్యుందాయ్ చేపట్టిన రూ. 27,000 కోట్ల పబ్లిక్ ఇష్యూ నేపథ్యంలో పలు ఎంఎన్సీలు సైతం దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్వైపు ఆకర్షితమవుతున్నట్లు వివరించింది. -
నిధుల సమీకరణలో 2025 జోరు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25)లో క్యాపిటల్ మార్కెట్ల ద్వారా నిధుల సమీకరణ జోరందుకున్నట్లు సెబీ చీఫ్ మాధవీ పురీ బచ్ పేర్కొన్నారు. మార్చితో ముగియనున్న పూర్తి ఏడాదికి 21 శాతం ఎగసి రూ. 14.27 లక్షల కోట్లకు చేరే వీలున్నట్లు అంచనా వేశారు. గతేడాది(2023–24)లో ఈక్విటీ, డెట్ మార్కెట్ల నుంచి రూ. 11.8 లక్షల కోట్లు మాత్రమే సమకూర్చుకున్నట్లు ప్రస్తావించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్(ఎన్ఎస్ఐఎం) నిర్వహించిన ఒక సదస్సులో బచ్ పలు అంశాలను వివరించారు. ఈ ఏడాది తొలి 9 నెలల్లో(ఏప్రిల్–డిసెంబర్) కంపెనీలు ఈక్విటీల నుంచి రూ. 3.3 లక్షల కోట్లు, రుణ మార్గాల ద్వారా రూ. 7.3 లక్షల కోట్లు అందుకున్నట్లు తెలియజేశారు. వెరసి రూ. 10.7 లక్షల కోట్లు సమీకరించినట్లు వెల్లడించారు. ఇక చివరి త్రైమాసికాన్ని(జనవరి–మార్చి) కూడా పరిగణిస్తే ఈక్విటీ, డెట్ విభాగాల ద్వారా సుమారు రూ. 14.27 లక్షల కోట్లను అందుకునే వీలున్నట్లు బచ్ అంచనా వేశారు. ఇకపై ఇన్విట్స్ అదుర్స్ నిజానికి ఈ ఏడాది తొలి 9 నెలల్లో మునిసిపల్ బాండ్లుసహా రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు (ఇన్విట్స్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్విట్స్ ద్వారా సమీకరించిన నిధులు రూ. 10,000 కోట్లు మాత్రమేనని బచ్ వెల్లడించారు. అయితే వచ్చే దశాబ్దంలో వీ టిలో యాక్టివిటీ భారీగా పెరగనున్నట్లు అంచనా వే శారు. దీంతో ఈక్విటీ, డెట్ మార్కెట్ల నుంచి సమీకరించే నిధులను అధిగమించనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఎన్ఎస్ఐఎంను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఎస్ఎంఈలకు దన్ను చిన్న, మధ్యతరహా సంస్థ(ఎస్ఎంఈ)ల బోర్డు ప్రతిపాదనలకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు బచ్ పేర్కొన్నారు. క్లియరింగ్లకు పడుతున్న సమయాన్ని కుదించే యోచనలో ఉన్నట్లు తెలియజేశారు. ఎస్ఎంఈ ప్రతిపాదనలను అనుమతించేందుకు సెబీ 3 నెలల గడువును తీసుకుంటున్నదని, బ్యాంకులైతే 15 నిముషాలలో ముందస్తు అనుమతులు మంజూరు చేస్తున్నాయని బచ్ వ్యాఖ్యానించారు. దీంతో అనుమతుల జారీలో మరింత సాంకేతికతను వినియోగించనున్నట్లు తెలియజేశారు. ఐపీవోల వరద ఇటీవల కొద్ది నెలలుగా పబ్లిక్ ఇష్యూలు వెల్లువెత్తుతుండటంతో అప్రమత్తత పెరిగినట్లు బచ్ తెలియజేశారు. పలు కంపెనీలు సెబీ తలుపు తడుతున్నప్పటికీ ఇతర మార్గాలకూ ప్రాధాన్యత ఇవ్వవలసి ఉన్నట్లు పేర్కొన్నారు. వీటిలో ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్లు, ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్లు, రైట్స్ ఇష్యూలు తదితరాలను ప్రస్తావించారు. రైట్స్ జారీలో వ్యవస్థలను ఆధునీకరిస్తున్నట్లు, ఇందుకు కంపెనీలు సైతం సన్నద్ధంకావలసి ఉన్నట్లు వెల్లడించారు. కాగా.. మ్యూచువల్ ఫండ్ల కొత్త ఆఫర్లకు వేగవంత అనుమతులిస్తున్నామని, ఇకపై రూ. 250 కనీస పెట్టుబడులతో సిప్ పథకాలను అనుమతించనున్నట్లు తెలియజేశారు. గత కొన్నేళ్లలో దేశీయంగా పెట్టుబడులు పుంజుకోవడంతో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకున్నప్పుడు నమోదయ్యే ఆటుపోట్లు తగ్గినట్లు వివరించారు. -
తొలిరోజే ఫుల్ సబ్స్క్రైబ్ అయిన ఐపీవో
ఫార్మా రంగానికి ప్రత్యేక ఇంజినీరింగ్ పరికరాలను తయారు చేస్తున్న హైదరాబాద్ కంపెనీ స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ ఐపీవో(IPO) తొలిరోజు 13.32 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. ఆఫర్లో 2.08 కోట్ల షేర్లకు గాను 27.75 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. గ్రే మార్కెట్లో షేర్లు రూ.97 ప్రీమియంతో ట్రేడయ్యాయి. సేల్ను ప్రారంభించిన నిమిషాల్లోనే పూర్తిగా సబ్స్క్రైబ్(Subscribe) కావడం విశేషం.బిడ్డింగ్ రౌండ్లో ముందున్న నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (NII) విభాగం 25.43 రెట్లు, రిటైల్(Retail) ఇన్వెస్టర్స్ 14.46, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ కొనుగోలుదారుల (QIB) విభాగం 1.82 రెట్లు సబ్స్రైబ్ అయింది. షేర్లను జనవరి 13న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్ చేయనున్నారు. ఇష్యూ జనవరి 8న ముగుస్తుంది. ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.133–140 మధ్య నిర్ణయించారు. ఐపీవోలో భాగంగా రూ.210 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేస్తారు. 1.42 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద ప్రమోటర్లు విక్రయిస్తారు. ఇన్వెస్టర్లు కనీసం 107 ఈక్విటీ షేర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ రూ.123 కోట్లు అందుకుంది.ఇదీ చదవండి: ఇంటి భోజనం మరింత భారం!క్వాడ్రంట్ ఫ్యూచర్కు యాంకర్ నిధులురైల్వే సిగ్నలింగ్, రక్షణ(కవచ్) వ్యవస్థలకు సేవలందించే కంపెనీ క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్ యాంకర్ ఇన్వెస్టర్లకు 45 లక్షల షేర్లను విక్రయించింది. తద్వారా దాదాపు రూ.131 కోట్లు అందుకుంది. ఎంఎఫ్ సంస్థలు వైట్ఓక్ క్యాపిటల్, కొటక్, ఎల్ఐసీ, బీవోఐసహా సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ మారిషస్ తదితర 22 సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. షేరుకి రూ.290 ధరలో షేర్లను జారీ చేయనుంది. రూ.275–290 ధరల శ్రేణిలో నేడు ప్రారంభంకానున్న ఇష్యూ 9న ముగియనుంది. ఐపీవోలో భాగంగా రూ.290 కోట్ల విలువైన షేర్లను కొత్తగా జారీ చేయనుంది. నిధులను ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థ అభివృద్ధి, రుణ చెల్లింపులు తదితరాలకు వినియోగించనుంది. -
హైదరాబాద్లో స్టాండర్డ్ గ్లాస్ భారీ ప్లాంట్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా, కెమికల్ పరిశ్రమలకు ప్రత్యేక ఇంజనీరింగ్ పరికరాలను తయారు చేస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ 10వ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్ సమీపంలోని బొంతపల్లి వద్ద 36 ఎకరాల్లో ఇది రానుంది. రూ.130 కోట్ల వ్యయంతో తొలి దశ 15 నెలల్లో పూర్తి అవుతుందని కంపెనీ ఎండీ నాగేశ్వర రావు కందుల వెల్లడించారు. 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి వస్తుందని అన్నారు.జనవరి 6న ప్రారంభం అవుతున్న ఐపీవో వివరాలను వెల్లడించేందుకు శనివారమిక్కడ జరిగిన సమావేశంలో కంపెనీ ఈడీ కాట్రగడ్డ మోహన రావు, సీఎఫ్వో పాతూరి ఆంజనేయులుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అయిదేళ్లలో అన్ని దశలు పూర్తి చేసుకుని ప్లాంటు మొత్తం 9 లక్షల చదరపు అడుగుల స్థాయికి చేరుతుందని చెప్పారు. ఇందుకు మొత్తం రూ.300 కోట్ల పెట్టుబడి అవసరమని వెల్లడించారు. నతన కేంద్రంలో చమురు, సహజ వాయువు, భారీ పరిశ్రమలు, వంట నూనెల రంగ సంస్థలకు అవసరమైన ఇంజనీరింగ్ పరికరాలను తయారు చేస్తామని నాగేశ్వర రావు వివరించారు.అయిదేళ్లలో ఎగుమతులు సగం..కంపెనీ ఆదాయంలో గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల వాటా 0.5 శాతమే. 2024–25లో ఇది 15 శాతానికి చేరుతుందని నాగేశ్వర రావు వెల్లడించారు. ‘అయిదేళ్లలో ఎగుమతుల వాటా 50 శాతానికి చేరుస్తాం. యూఎస్కు చెందిన ఐపీపీ కంపెనీతో చేతులు కలిపాం.ఆ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 1.5 లక్షలకుపైగా కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయి. ఐపీపీ సహకారంతో ఎగుమతి అవకాశాలను అందిపుచ్చుకుంటాం. అలాగే జపాన్కు రెండు నెలల్లో ఎగుమతులు ప్రారంభిస్తున్నాం. కంపెనీ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా 100 బిలియన్ డాలర్ల వ్యాపార అవకాశాలు ఉన్నాయి. అలాగే ఒక్క భారత్ నుంచే రూ.15,000 కోట్లు ఉంటుంది’ అని వివరించారు.ఆర్డర్ బుక్ రూ.450 కోట్లు..ప్రస్తుతం స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ 65 రకాల ఉత్పత్తులను తయారు చేస్తోంది. 15 కొత్త ఉత్పత్తులు అభివృద్ధి దశలో ఉన్నాయని నాగేశ్వర రావు వెల్లడించారు. ‘నెలకు 300 యూనిట్లు తయారు చేసే సామర్థ్యం ఉంది. రెండు నెలల్లో ర.40 కోట్ల మూలధన వ్యయం చేస్తాం. రెండేళ్లలో మరో ర.60 కోట్లు వెచ్చిస్తాం. 2023–24లో ర.549 కోట్ల టర్నోవర్ సాధించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది ర.700 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నాం. ఏటా టర్నోవర్లో 50 శాతం వృద్ధి నమోదు చేస్తున్నాం. ఆర్డర్ బుక్ రూ.450 కోట్లు ఉంది’ అని పేర్కొన్నారు.జనవరి 6న ఐపీవో..స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ ఐపీవో జనవరి 6న ప్రారంభమై 8న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ ర.123 కోట్లు అందుకుంది. ఒక్కొక్కటి ర.140 చొప్పున 87,86,809 ఈక్విటీ షేర్లను కేటాయించింది. అమన్సా హోల్డింగ్స్, క్లారస్ క్యాపిటల్–1, ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ ఎంఎఫ్, కోటక్ మహీంద్రా ట్రస్టీ కో లిమిటెడ్ ఏ/సీ కోటక్ మాన్యుఫ్యాక్చర్ ఇన్ ఇండియా ఫండ్, టాటా ఎంఎఫ్, మోతిలాల్ ఓస్వాల్ ఎంఎఫ్, 3పీ ఇండియా ఈక్విటీ ఫండ్–1, కోటక్ ఇన్ఫినిటీ ఫండ్–క్లాస్ ఏసీ, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐటీఐ లార్జ్ క్యాప్ ఫండ్ వీటిలో ఉన్నాయి.ఇక ఐపీవోలో భాగంగా ర.210 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేస్తారు. 1,42,89,367 షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద ప్రమోటర్లు విక్రయిస్తారు. షేర్లను బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్ చేస్తారు. ప్రైస్ బ్యాండ్ ర.133–140గా నిర్ణయించారు. ఇన్వెస్టర్లు కనీసం 107 షేర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. -
కొత్త ఐపీవో.. ఒక్కో షేర్ ధర రూ.128–135
మౌలిక రంగ నిర్మాణ సంస్థ బీఆర్ గోయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (BR Goyal Infrastructure) ఐపీఓ జనవరి 7న ప్రారంభమై 9న ముగియనుంది. షేరు ధరల శ్రేణి రూ.128–135గా కంపెనీ నిర్ణయించింది. గరిష్ట ధర వద్ద రూ.85.2 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా నిర్ధేశించుకుంది. ఇష్యూలో భాగంలో కంపెనీ రూ.10 ముఖ విలువ కలిగిన 63.12 లక్షల కొత్త షేర్లను జారీ చేయనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు జనవరి 6న బిడ్డింగ్ ప్రారంభమవుతుంది.పబ్లిక్ ఇష్యూ ముగిసిన తర్వాత బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్లో షేర్లు లిస్ట్ కానున్నాయి. ఐపీఓ ద్వారా వచ్చే మొత్తాన్ని మూల ధన వ్యయానికి, ఇతర కార్పొరేట్ అవసరాలకు, వృద్ధి ఆధారిత కార్యక్రమాలకు వినియోగిస్తామని కంపెనీ చైర్మన్ బ్రిజ్ కిషోర్ గోయల్ తెలిపారు. ఈ ఇష్యూకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్గా బీలైన్ క్యాపిటల్ అడ్వైజర్స్, రిజిస్ట్రార్గా లింక్ ఇన్టైం ఇండియా వ్యవహరిస్తున్నాయి.క్వాడ్రాంట్ ఫ్యూచర్ కూడా అదే రోజునే..రైళ్లు, సిగ్నలింగ్ వ్యవస్థల నియంత్రణ(కవచ్) సంబంధ సర్వీసులందించే క్వాండ్రాంట్ ఫ్యూచర్ టెక్ (Quadrant Future Tek) పబ్లిక్ ఇష్యూ (IPO) కూడా ఈనెల 7న ప్రారంభంకానుంది. 9న ముగియనున్న ఇష్యూకి రూ. 275–290 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూలో భాగంగా రూ. 290 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది.రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 50 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 6న షేర్లను విక్రయించనుంది. ఇష్యూ నిధుల్లో రూ. 150 కోట్లవరకూ దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు(స్పెషాలిటీ కేబుల్ విభాగంపై) వెచ్చించనుంది. రూ. 24 కోట్లు ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థ అభివృద్ధికి, మరో రూ. 24 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది.ఇదీ చదవండి: Stock Market: ఎన్నాళ్లు ఆగితే.. అన్ని లాభాలు!కంపెనీ ప్రధానంగా రైల్వే రక్షణ సంబంధ వ్యవస్థల అభివృద్ధిపై పనిచేస్తోంది. అంతేకాకుండా రైల్వే రోలింగ్ స్టాక్, నౌకా(డిఫెన్స్) పరిశ్రమల్లో వినియోగించే కేబుళ్లను సైతం తయారు చేస్తోంది. స్పెషాలిటీ కేబుల్స్ విభాగంలో 2024 సెప్టెంబర్ 30కల్లా 1,887 మెట్రిక్ టన్నుల స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఐపీవో బాటలో సన్షైన్ పిక్చర్స్సినీ, టీవీ నిర్మాత, దర్శకుడు విపుల్ షా కంపెనీ సన్షైన్ పిక్చర్స్ లిమిటెడ్ (Sunshine Pictures) పబ్లిక్ ఇష్యూ బాటలో సాగుతోంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా 83.75 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిలో 50 లక్షల షేర్లను తాజాగా జారీ చేయనుండగా.. 33.75 లక్షల షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు.ఈక్విటీ జారీ నిధులను దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, ర. 94 కోట్లు భవిష్యత్ వృద్ధి కార్యకలాపాలకు వినియోగించనుంది. సినిమాలు, వెబ్సిరీస్ల సృష్టి, అభివృద్ధి, నిర్మాణం, మార్కెటింగ్, పంపిణీ తదితరాలను కంపెనీ ప్రధానంగా చేపడుతోంది. ఇప్పటికే 10 సినిమాలు నిర్మింంది. వీటిలో 6 మూవీలకు సహనిర్మాతగా వ్యవహరింంది. 2 వెబ్సిరీస్లు, 2 సీరియళ్లు సైతం కంపెనీ నుంచి వెలువడ్డాయి.కంపెనీ నుంచి త్వరలో గుడ్ మార్నింగ్ రియా, గవర్నర్, కేరళ స్టోరీ2, బుల్డోజర్, సముక్, భీమ్ తదితర సినిమాలు రానున్నాయి. ఈ బాటలో మాయా, నానావతి వెర్సస్ నానావతి, విజిల్ బ్లోయర్ వెబ్సిరీస్ ప్రాజెక్టులు సైతం చేపట్టింది. ఈ ఏడాది(2024–25) తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెపె్టంబర్)లో రూ. 45 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. -
కొత్త ఐపీవో.. క్వాడ్రాంట్ ఫ్యూచర్
రైళ్లు, సిగ్నలింగ్ వ్యవస్థల నియంత్రణ(కవచ్) సంబంధ సర్వీసులందించే క్వాండ్రాంట్ ఫ్యూచర్ టెక్ (Quadrant Future Tek) పబ్లిక్ ఇష్యూ (IPO) ఈ నెల 7న ప్రారంభంకానుంది. 9న ముగియనున్న ఇష్యూకి రూ. 275–290 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూలో భాగంగా రూ. 290 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది.రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 50 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 6న షేర్లను విక్రయించనుంది. ఇష్యూ నిధుల్లో రూ. 150 కోట్లవరకూ దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు(స్పెషాలిటీ కేబుల్ విభాగంపై) వెచ్చించనుంది. రూ. 24 కోట్లు ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థ అభివృద్ధికి, మరో రూ. 24 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది.కంపెనీ ప్రధానంగా రైల్వే రక్షణ సంబంధ వ్యవస్థల అభివృద్ధిపై పనిచేస్తోంది. అంతేకాకుండా రైల్వే రోలింగ్ స్టాక్, నౌకా(డిఫెన్స్) పరిశ్రమల్లో వినియోగించే కేబుళ్లను సైతం తయారు చేస్తోంది. స్పెషాలిటీ కేబుల్స్ విభాగంలో 2024 సెప్టెంబర్ 30కల్లా 1,887 మెట్రిక్ టన్నుల స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉంది. -
ఐపీవో బాటలో మరో కంపెనీ
స్టీల్ తయారీలో సమీకృత కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏవన్ స్టీల్స్ ఇండియా పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల(Cpaital Market) నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. వాటిలోని వివరాల ప్రకారం ఐపీవో(IPO) కింద రూ.600 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. మరో రూ.50 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు సందీప్ కుమార్, సునీల్ జలాన్, క్రిషన్ కుమార్ జలన్ ఆఫర్ చేయనున్నారు. తద్వారా మొత్తం రూ.650 కోట్లు అందుకునే యోచనలో కంపెనీ ఉంది.ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్ల వాటా 85.56 శాతంగా నమోదైంది. ఈక్విటీ జారీ నిధులను కంపెనీ అనుబంధ సంస్థ వినయ స్టీల్స్లో పెట్టుబడులకు వినియోగించనుంది. సంస్థ విస్తరణకు వీలైన మెషీనరీ కొనుగోలు, సొంత అవసరాల కోసం సోలార్ ఎనర్జీ(Solar Energy)ని సమకూర్చుకోవడం తదితరాలు చేపట్టనుంది. దాంతోపాటు మరికొన్ని నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది.ఇదీ చదవండి: 1,673 కోట్ల యూపీఐ లావాదేవీలుఆంధ్రప్రదేశ్లోనూ..బెంగళూరు కంపెనీ ఏవన్ స్టీల్స్ ఇండియా విభిన్న ప్రొడక్టుల పోర్ట్ఫోలియోను కలిగి ఉంది. ముడిస్టీల్ సామర్థ్యంరీత్యా దక్షిణాదిలోని టాప్–5 కంపెనీలలో ఒకటిగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని యూనిట్తోపాటు కర్ణాటకలో మరో 5 ప్లాంట్లను నిర్వహిస్తోంది. ప్రధానంగా స్టీల్ తయారీలో వినియోగించే లాంగ్, ఫ్లాట్ స్టీల్ ప్రొడక్టులుసహా ఇండ్రస్టియల్ ప్రొడక్టులను తయారు చేస్తోంది. 2024 జూన్30కల్లా వార్షికంగా 14.97 లక్షల మెట్రిక్ టన్నుల ఫినిష్డ్ ప్రొడక్టుల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఎంఎస్పీ స్టీల్ అండ్ పవర్, బాలాజీ ఇండస్ట్రీస్, శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీతో పోటీ పడుతోంది. -
రూ.3,395 కోట్ల ఐపీవోకు రంగం సిద్ధం
బెంగళూరుకు చెందిన సీఆర్డీఎం(కాంట్రాక్ట్ రీసెర్చ్, డెవలప్మెంట్, మాన్యుఫాక్చరింగ్) సేవలందిస్తున్న యాంథెమ్ బయోసైన్సెస్ తాజాగా ఐపీవో(IPO) ద్వారా రూ.3,395 కోట్లు సమీకరించనుంది. దీనికి సంబంధించిన ముసాయిదా ప్రాస్పెక్టస్ను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ(SEBI)కి సమర్పించింది. ఈ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) విధానంలో ఉండనుంది. ప్రమోటర్లు గణేష్ సాంబశివం, రవీంద్ర చంద్రప్పతో పాటు ఇతర ఇన్వెస్టర్లు, వాటాదారులు షేర్లను విక్రయించనున్నారు.ఇదీ చదవండి: ‘బీ-రెడీ’లో మంచి స్కోర్ రావాలంటే కష్టమే..ఇష్యూ పూర్తిగా ఓఎఫ్ఎస్ విధానంలో ఉంటుంది. సమీకరించిన నిధులన్నీ విక్రయదార్లకు చెందుతాయి. 2006లో ఏర్పాటైన యాంథెమ్ సంస్థ బెంగళూరు కేంద్రంగా కాంట్రాక్ట్ రీసెర్చ్, డెవలప్మెంట్, తయారీ సంస్థగా (CRDMO) కార్యకలాపాలు సాగిస్తోంది. కర్ణాటకలో రెండు ప్లాంట్లు ఉన్నాయి. నిర్మాణంలో ఉన్న మూడో యూనిట్ 2025 ప్రథమార్ధంలో అందుబాటులోకి రానుంది. కంపెనీ గత ఆర్థిక సంవత్సరం రూ.1,419 కోట్ల ఆదాయంపై రూ.367 కోట్ల లాభం నమోదు చేసింది. -
గ్రీవ్స్ ఎలక్ట్రిక్ ప్లాంట్ల విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహనాల తయారీలో ఉన్న గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ 2026–27 ఆర్థిక సంవత్సరం నాటికి తెలంగాణ, ఉత్తరప్రదేశ్ ప్లాంట్లలో త్రీ–వీలర్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని నిర్ణయించింది. ఆంపియర్, ఈలీ, గ్రీవ్స్, ఈల్ట్రా బ్రాండ్స్లో ఎలక్ట్రిక్, ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ఐసీఈ) వాహనాలను విక్రయిస్తున్న ఈ సంస్థకు తెలంగాణలోని తూప్రాన్, ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడా, తమిళనాడులోని రాణిపేట్ వద్ద తయారీ కేంద్రాలు ఉన్నాయి. గ్రేటర్ నోయిడా ప్లాంట్లో త్రిచక్ర వాహనాల తయారీ సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 21,514 యూనిట్ల నుంచి 45,896 యూనిట్లకు, తూప్రాన్ ప్లాంట్లో 13,538 నుంచి 34,800 యూనిట్లకు పెంచాలని కంపెనీ యోచిస్తోంది. ‘విస్తరిస్తున్న మార్కెట్కు అనుగుణంగా అదనంగా ఉత్పత్తి చేయడానికి, అలాగే కొత్త మోడళ్ల తయారీని కూడా ఈ విస్తరణ అనుమతిస్తుంది’ అని కంపెనీ తన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్లో పేర్కొంది.ఐపీవో ద్వారా వచ్చే నిధులతో..గ్రీవ్స్ ఎలక్ట్రిక్ గ్రేటర్ నోయిడాలో ఫెసిలిటీ విస్తరణ కోసం రూ.20 కోట్లు, తూప్రాన్ ప్లాంటుకు రూ.38 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ప్రతిపాదిత ఐపీవో ద్వారా వచ్చే నికర ఆదాయం నుండి ఈ పెట్టుబడులకు నిధులు సమకూర్చనున్నారు. రాణిపేట్ ప్లాంట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను, గ్రేటర్ నోయిడా కేంద్రంలో ఎలక్ట్రిక్ త్రీ–వీలర్లను, తూప్రాన్ ఫెసిలిటీలో ఎలక్ట్రిక్తోపాటు ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ త్రీ–వీలర్లను సంస్థ తయారు చేస్తోంది. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ అనుబంధ సంస్థలు బెస్ట్వే ఏజెన్సీస్ గ్రేటర్ నోయిడా కేంద్రాన్ని, ఎంఎల్ఆర్ ఆటో తూప్రాన్ ప్లాంట్ను నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం వార్షికంగా 4.80 లక్షల ద్విచక్ర వాహనాల సామర్థ్యం కలిగిన రాణిపేట ప్లాంట్లో తయారీ సామర్థ్యాన్ని పెంచే ఆలోచనలో కంపెనీకి ప్రస్తుతానికి లేదు.త్రీ–వీలర్ల వాటా 28 శాతం..2023–24లో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొత్తం ఆదాయంలో త్రీ–వీలర్ల వాటా 28 శాతం కైవసం చేసుకుంది. సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో 13,470 యూనిట్ల త్రిచక్ర వాహనాలను విక్రయించింది. 2022–23లో ఈ సంఖ్య 6,870 యూనిట్లు. ఆంపియర్ బ్రాండ్ క్రింద ఎలక్ట్రిక్ టూ–వీలర్ వ్యాపారం దాదాపు 68 శాతం వాటాతో ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. ఆంపియర్ ద్విచక్ర వాహనాల అమ్మకాల పరిమాణం 2022–23లో 1.09 లక్షల యూనిట్ల నుంచి గత ఆర్థిక సంవత్సరంలో 47,820 యూనిట్లకు పడిపోయాయి. బెంగళూరుకు చెందిన గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్ అనుబంధ కంపెనీయే గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ. బ్యాటరీ ప్యాక్ అసెంబ్లీ లైన్..రాణి పేటలో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ బ్యాటరీ ప్యాక్ అసెంబ్లీ లైన్ను ఏర్పాటు చేయనుంది. ఇది 4,00,000 యూనిట్ల వార్షిక స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రతిపాదిత నూతన కేంద్రాన్ని 2026 మే నెలలో ప్రారంభించనునన్నారు. 2026 జూలైలో వాణిజ్యపరంగా ఉత్పత్తి కార్యకలాపాలను మొదలు పెట్టాలని గ్రీవ్స్ ఎలక్ట్రిక్ భావిస్తోంది. ఈల్ట్రా బ్రాండ్ పోర్ట్ఫోలియో ప్రస్తుతం రూ.3.80 లక్షల నుండి ప్రారంభం. ప్యాసింజర్స్ లేదా వస్తువులను రవాణా చేయగల రెండు మీడియం స్పీడ్ త్రీ–వీలర్ మోడళ్లను విక్రయిస్తోంది. డీజిల్, సీఎన్జీ త్రీ–వీలర్లు గ్రీవ్స్ బ్రాండ్ ద్వారా రూ.2.90 లక్షల ప్రారంభ ధరకు విక్రయిస్తున్నారు. ఈ బ్రాండ్ కింద నాలుగు మోడళ్లు ఉన్నాయి. ఎలక్ట్రిక్ రిక్షా బ్రాండ్ ఈలీ కింద మూడు మోడళ్లు కొలువుదీరాయి. ధరల శ్రేణి రూ.1.30 లక్షల నుండి ప్రారంభం. -
ఐపీఓకు సిద్ధమవుతున్న మరిన్ని కంపెనీలు
ఐపీఓల పర్వం కొనసాగుతున్న తరుణంలో కొత్తగా మరికొన్ని కంపెనీలు నిధులు సమీకరణకు పూనుకుంటున్నాయి. ఇండిక్యూబ్ స్పేసెస్ లిమిటెడ్ అనే వర్క్ ప్లేస్ సొల్యూషన్స్ కంపెనీ ఐపీఓ ద్వారా రూ.850 కోట్లు నిధులు సమీకరించడానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) వద్ద ముసాయిదా పత్రాలను(డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్-DRHP)దాఖలు చేసింది. ఇందుకు సెబీ(SEBI) అనుమతిస్తే ఐపీఓకు వెళ్లేందుకు మార్గం సుగమమవుతుంది.ఐపీఓ ద్వారా రూ.750 కోట్లు, మరో రూ.100 కోట్లు ప్రమోటర్లు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా నిధులు సమీకరించనున్నారు. ఇలా వచ్చిన నిధులను మూలధన వ్యయాలకు వెచ్చించనున్నట్లు కంపెనీ తెలిపింది. కొత్త కేంద్రాల ఏర్పాటుకు రూ.462.6 కోట్లు, రుణాలను తిరిగి చెల్లించేందుకు రూ.100 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు పేర్కొంది. మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాలకు ఉపయోగిస్తామని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: ట్యాక్సీ సేవల యాప్స్పై విచారణకు ఆదేశంఇండో ఫామ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ఇండో ఫామ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ ఐపీఓ(IPO)కు రానున్నట్లు ప్రకటించింది. తాజా ఇష్యూ ద్వారా రూ.260.15 కోట్ల నిధులను సమీకరిచనున్నట్లు తెలిపింది. ఈ ఇష్యూ 2024 డిసెంబర్ 31 మంగళవారం ప్రారంభం కానుంది. ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.204 నుంచి రూ.215 మధ్య ఉంటుంది. ఇందులో 86 లక్షల షేర్లతో ఐపీఓ ద్వారా రూ.184.9 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.75.25 కోట్ల విలువైన 35 లక్షల షేర్లను విక్రయించనున్నారు. రిటైల్ ఇన్వెస్టర్లు 69 షేర్లకు కనీస పెట్టుబడి రూ.14,835 కలిగి ఉండాలని తెలిపింది. స్మాల్ నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (SNII) 966 షేర్లకు కనీస పెట్టుబడి రూ.2,07,690 అవసరం అవుతుంది. బిగ్ నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (BNII) 4,692 షేర్లకు కనీస పెట్టుబడి రూ.10,08,780 కలిగి ఉండాలి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ రెండింటిలోనూ లిస్టింగ్ తేదీ జనవరి 7, 2025గా నిర్ణయించారు. ఐపీఓ జనవరి 2న ముగియనుండగా, తుది కేటాయింపు 2025 జనవరి 3న జరగనుంది. -
ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ రూ.1,000 కోట్లు సమీకరణ
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీ గ్రీవ్స్(Greaves) ఎలక్ట్రిక్ మొబిలిటీ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ(SEBI)కి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. వీటి ప్రకారం రూ.1,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది.మరో 18.9 కోట్ల షేర్లను ప్రమోటర్ సంస్థ, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ప్రమోటర్ గ్రీవ్స్ కాటన్ 5.1 కోట్ల షేర్లను, ఏఎల్జే గ్రీన్ మొబిలిటీ సొల్యూషన్స్ డీఎంసీసీ 13.8 కోట్ల షేర్లను ఆఫర్ చేయనున్నాయి. కంపెనీ యాంపియర్ బ్రాండుతో ఎలక్ట్రిక్ స్కూటర్లు(EV Scooters), మరో బ్రాండుతో త్రిచక్ర ఈవీలను రూపొందిస్తోంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ.375 కోట్లు బెంగళూరు టెక్నాలజీ కేంద్రంలో ప్రొడక్ట్, సాంకేతిక అభివృద్ధికి, రూ.83 కోట్లు సొంత బ్యాటరీ అసెంబ్లీ సామర్థ్యాలకు, రూ.38 కోట్లు ఎంఎల్ఆర్ ఆటో తయారీ సామర్థ్య పెంపునకు, బెస్ట్వే ఏజెన్సీస్ ప్రయివేట్ తయారీ విస్తరణకు మరో రూ.20 కోట్లు చొప్పున వెచ్చించనుంది.ఇదీ చదవండి: గగనతలంలో 1.42 కోట్ల మందికంపెనీ తెలంగాణ(తూప్రాన్), తమిళనాడు(రాణీపేట్), ఉత్తరప్రదేశ్(గ్రేటర్ నోయిడా)లలో తయారీ యూనిట్లను కలిగి ఉంది. గతేడాది(2023–24) రూ.612 కోట్ల ఆదాయం సాధించింది. -
ఐపీవో బూమ్!
స్టాక్ మార్కెట్లో ఐపీఓలు దుమ్ముదులిపేస్తున్నాయి. సరిగ్గా మూడేళ్ల తర్వాత సరికొత్త రికార్డులతో కదం తొక్కుతున్నాయి. కేవలం లిస్టింగ్ మాత్రమే కాదు బంపర్ లాభాలతో ఇన్వెస్టర్లను రారమ్మని ఊరిస్తున్నాయి. ఈ ఏడాది (2024)లో మొత్తం 91 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. రూ. 1.6 లక్షల కోట్లకుపైగా సమీకరించాయి. ఇది సరికొత్త రికార్డ్ కాగా.. వీటిలో అధిక శాతం ఇష్యూలకు ఇన్వెస్టర్లు రికార్డ్ స్థాయిలో క్యూ కట్టారు. వెరసి 2021లో 63 కంపెనీలు సమకూర్చుకున్న రూ. 1.2 లక్షల కోట్ల రికార్డ్ బ్రేక్ అయింది.ప్రస్తుత క్యాలెండర్ ఏడాదిలో సెకండరీ మార్కెట్లు ఆటుపోట్లు చవిచూసినప్పటికీ ప్రధాన ఇండెక్సులు సరికొత్త గరిష్టాలను సాధించాయి. స్టాక్ మార్కెట్ చరిత్రలోనే సెన్సెక్స్ (బీఎస్ఈ) తొలిసారి సెపె్టంబర్ 27న 85,978 పాయింట్లకు చేరగా.. నిఫ్టీ (ఎన్ఎస్ఈ) 26,277ను తాకింది. ఈ బాటలో ఐపీవో మార్కెట్ మరింత కళకళలాడింది. ప్రధాన విభాగంలో ఏకంగా 91 కంపెనీలు లిస్టింగ్ బాటలో సాగాయి. తద్వారా మొత్తం రూ. 1,60,500 కోట్లు సమకూర్చుకున్నాయి. ఇందుకు ఆరి్థక వ్యవస్థ పురోభివృద్ధి, కంపెనీల ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలు, నగదు లభ్యత, భారీగా పెరిగిన రిటైల్ ఇన్వెస్టర్లు, వారి పెట్టుబడులు, లావాదేవీల సులభతర నిర్వహణకు వీలు తదితర అంశాలు తోడ్పాటునిచ్చాయి. దీంతో పలు ఐపీవోలకు గరిష్ట స్థాయిలో బిడ్డింగ్ లభించగా.. లిస్టింగ్ రోజు 64 కంపెనీలు లాభాలతో నిలిచాయి. 17 మాత్రమే నష్టాలతో ముగిశాయి. భారీ ఇష్యూల తీరిలా... 2024లో కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా రూ. 27,870 కోట్ల సమీకరణ ద్వారా దేశీ స్టాక్ మార్కెట్లో అతిపెద్ద ఐపీవోగా రికార్డులకెక్కింది. ఇదేవిధంగా ఫుడ్ అగ్రిగేటర్ యాప్ స్విగ్గీ రూ. 11,327 కోట్లు, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ రూ. 10,000 కోట్లు, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రూ. 6,560 కోట్లు, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ రూ. 6,145 కోట్లు అందుకున్నాయి. కేఆర్ఎన్ హీట్ ఎక్సే్ఛంజర్ ఐపీవోకు 200 రెట్లు అధిక బిడ్స్ లభించాయి. ఇక వన్ మొబిక్విక్, యూనికామర్స్ ఈసొల్యూషన్స్, డిఫ్యూజన్ ఇంజనీర్స్, బీఎల్ఎస్ ఈసరీ్వసెస్, ఎక్సికామ్ టెలి ఇష్యూలకు 100 రెట్లుపైగా స్పందన నమోదైంది. విభోర్ స్టీల్, బీఎల్ఎస్, బజాజ్ హౌసింగ్, కేఆర్ఎన్ లిస్టింగ్ రోజు 100 శాతం లాభపడ్డాయి. వచ్చే ఏడాదీ మెరుపుల్... సెబీకి దాఖలైన 89 కంపెనీల ఐపీవో దరఖాస్తుల ప్రకారం 2025లో రూ. 2.5 లక్షల కోట్ల సమీకరణకు వీలున్నట్లు అంచనా. వీటిలో ఇప్పటికే 34 కంపెనీలు సెబీ నుంచి అనుమతులు సైతం పొందాయి. ఈ జాబితాలో రిలయన్స్ జియో, ఎన్ఎస్ఈ ఎల్జీ ఎల్రక్టానిక్స్ ఇండియా, టాటా క్యాపిటల్, హెచ్డీబీ ఫైనాన్షియల్ సరీ్వసెస్, హెక్సావేర్ టెక్నాలజీస్తోపాటు ఫ్లిప్కార్ట్, హీరో ఫిన్కార్ప్, ఎన్ఎస్డీఎల్, జేఎస్డబ్ల్యూ సిమెంట్, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, కెనరా రోబెకో, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, బ్రిగేడ్ హోటల్ వెంచర్స్ వంటివి . దీంతో కొత్త ఏడాది ఇంకెన్ని రికార్డులు బద్దలవుతాయనే ఆసక్తి నెలకొంది!సగటు పరిమాణం అప్...ఈ ఏడాది చిన్న, మధ్యతరహా, భారీ కంపెనీలు లిస్టింగ్ బాటలో సాగాయి. దీంతో ఇష్యూ సగటు పరిమాణం రూ. 1,700 కోట్లను దాటింది. 2023లో ఇది కేవలం రూ. 867 కోట్లుగా నమోదైంది. ఏడాది చివరి నెల (డిసెంబర్)లోనూ 15 కంపెనీలు ఐపీవోలకు రాగా.. సెకండరీ మార్కెట్లో నికర అమ్మకందారులుగా నిలుస్తూనే విదేశీ ఇన్వెస్టర్లు పబ్లిక్ ఇష్యూలకు క్యూ కట్టడం విశేషం! ఈ నెల 24 వరకూ ముగిసిన 90 ఇష్యూల ద్వారా అన్లిస్టెడ్ కంపెనీలు రూ.1.6 లక్షల కోట్లను సమీకరించాయి.సోమవారం (23న) ప్రారంభమైన యూనిమెక్ ఏరోస్పేస్ మరో రూ. 500 కోట్లు అందుకోనుంది. గతేడాది (2023)లో 57 కంపెనీలు రూ. 49,436 కోట్లు మాత్రమే సమీకరించాయి. ఈ బాటలో మరోపక్క ఎస్ఎంఈ విభాగం సైతం రికార్డ్ నెలకొల్పడం గమనార్హం! ప్రైమ్డేటా గణాంకాల ప్రకారం ఈ ఏడాది 238 ఎస్ఎంఈలు రూ. 8,700 కోట్లు సమకూర్చుకున్నాయి. 2023లో లిస్టింగ్ ద్వారా ఎస్ఎంఈలు అందుకున్న రూ. 4,686 కోట్లతో పోలిస్తే రెట్టింపైంది! -
కాంకర్డ్ ఎన్విరో ఐపీవో ఎప్పుడంటే?
కాంకర్డ్ ఎన్విరో సిస్టమ్స్ లిమిటెడ్ ఐపీవో డిసెంబర్ 19, 2024న ప్రారంభమవుతుంది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.500.33 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఫ్రెష్ షేర్ల ఇష్యూ మాత్రమే కాకుండా.. ఆఫర్ ఫర్ సేల్ (OFS) కూడా ఉంటుంది.ఐపీవో కోసం సబ్స్క్రిప్షన్ విండో 2024 డిసెంబర్ 19న ప్రారంభమై.. డిసెంబర్ 23తో ముగుస్తుంది. పెట్టుబడిదారులు షేర్ల కేటాయింపు డిసెంబర్ 24న ఖరారు అయ్యే అవకాశం ఉంది. ఈ ఐపీవోలో ఒక్కో షేరు ధర రూ. 665 నుంచి రూ. 701 వరకు ఉండవచ్చు. పెట్టుబడిదారులు కనీసం 21 షేర్లను కలిగి ఉన్న ఒక లాట్కి వేలం వేయవచ్చు. రిటైల్ ఇన్వెస్టర్లకు కనీస పెట్టుబడి రూ.14,721. చిన్న నాన్-ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు కనీసం 14 లాట్ల (294 షేర్లు) కోసం దరఖాస్తు చేసుకోవాలి.జూలై 1999లో ప్రారంభమైన కాంకర్డ్ ఎన్విరో సిస్టమ్స్ లిమిటెడ్.. జీరో-లిక్విడ్ డిశ్చార్జ్ (ZLD) వంటి సాంకేతికతలతో సహా నీరు, మురుగునీటి శుద్ధి కోసం పరిష్కారాలను అందిస్తుంది. ఈ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా తన ఉనికిని కలిగి ఉంది. ఇది నీటి పునర్వినియోగం కోసం స్థిరమైన పరిష్కారాలను అందించడం ద్వారా పరిశ్రమలకు సేవలు అందిస్తుంది. -
ఐపీఓ గురించి తెలుసుకోండి..
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి రెండు రకాల మార్గాలు అందుబాటులో ఉంటాయి. ఒకటి..కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు వచ్చినప్పుడు వాటికి దరఖాస్తు చేయడం ద్వారా షేర్లను కొనుగోలు చేయడం. అలాకాకుండా మార్కెట్లో నేరుగా షేర్లను కొనుగోలు చేయడం రెండోది.పబ్లిక్ ఇష్యూ విషయానికొస్తే...పబ్లిక్ ఇష్యూనే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) అని కూడా వ్యవహరిస్తారు. సాధారణంగా కంపెనీలు తమ ఎదుగుదల క్రమంలో నిధులు అవసరమై ప్రజల నుంచి వాటిని సమీకరించాలనే ఉద్దేశంతో షేర్లను జారీ చేయడం ద్వారా మొట్టమొదటిసారి ఐపీఓకు వస్తాయి. ఇలా ఐపీఓకి వచ్చే కంపెనీలు ముందుగా లీడ్ మేనేజర్లను నియమించుకుంటాయి. వీరు ఆ కంపెనీ ఐపీఓ వ్యవహారాలు సజావుగా పూర్తయ్యేలా చూస్తారు. కంపెనీలు ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను కంపెనీలు విస్తరణ, మూలధన అవసరాలు, అప్పులు తీర్చడం కోసం వాడుకుంటాయి. ఐపీఓ తర్వాత సంస్థలు వాటాదారులకు జవాబుదారీగా నిలవాల్సి ఉంటుంది.పబ్లిక్ ఇష్యూకి వచ్చే కంపెనీలు తమ షేర్లకు ఒక ముఖవిలువ (ఫేస్వాల్యూ) నిర్ధారిస్తాయి. అప్పటికి ఆ కంపెనీస్థాయి, అది చేస్తున్న వ్యాపారం, మార్కెట్లో దాని ఉత్పత్తులకు ఉండే డిమాండ్ వంటి విభిన్న అంశాలను దృష్టిలో ఉంచుకుని సంస్థకు ఒక విలువను నిర్ధారిస్తాయి. కంపెనీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎన్ని షేర్లు జారీ చేయాలో (కంపెనీలో ఎంత వాటా అమ్మకానికి పెట్టాలో) నిర్ణయించుకుంటాయి. దానికి అనుగుణంగా సెబీని సంప్రదించి తమ ప్రతిపాదనలు సమర్పిస్తాయి. ఒకసారి సెబీ ఇష్యూకి క్లియరెన్స్ ఇచ్చి, ఎక్స్ఛేంజీల ఆమోదం పొందిన తర్వాత మార్కెట్లోకి ప్రవేశిస్తాయి. సాధారణంగా 3-5 రోజులపాటు ఇష్యూ అందుబాటులో ఉంటుంది. వివిధ సందర్భాలు, ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని 10 రోజులలోపు ఇష్యూ పూర్తి చేయవచ్చు.ఇన్వెస్టర్లు పరిగణించాల్సిన విషయాలు..1. ఇష్యూ లాట్ సైజ్ 2. ఇష్యూధర.. అంటే కంపెనీ ఒక్కో లాట్కు ఎన్ని షేర్లు ఆఫర్ చేస్తుంది.. ఎంత ధరకు ఆఫర్ చేస్తుంది అనే వివరాలు. ఒక్కో రిటైల్ ఇన్వెస్టర్ (సాధారణ ఇన్వెస్టర్లు) ఒక్కొక్కరు రూ.2 లక్షల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.ఉదా: x అనే కంపెనీ రూ.100-120 ధరల శ్రేణితో ఇష్యూకి వచ్చింది అనుకుందాం. సాధారణంగా గరిష్ట ధరకే షేర్ల కేటాయింపు జరుగుతూ ఉంటుంది కాబట్టి రూ.120 పరిగణనలోకి తీసుకుందాం. అలాగే 100 షేర్లను ఒక లాట్గా నిర్ధారించి జారీ చేస్తుంది అనుకుంటే మనం రిటైల్ ఇన్వెస్టర్లం కాబట్టి రూ.120 గరిష్ట ధరకు మనకు షేర్లు అలాట్ అవ్వాలంటే గరిష్టంగా 16 లాట్ల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే మార్కెట్లో ఆ ఇష్యూకి ఉండే డిమాండ్, దానికి అనుగుణంగా సబ్స్క్రిప్షన్ ఏ స్థాయిలో జరిగింది అనే దాన్ని దృష్టిలో ఉంచుకుని మనకు షేర్ల అలాట్మెంట్ జరుగుతుంది. 10 రెట్లు, 20 రెట్లు.. ఇలా సబ్స్రైబ్ అయితే మనకు కేటాయించే లాట్ల సంఖ్య తగ్గిపోతుంది. ఒక్కోసారి ఒకటే లాట్ అలాట్ కావొచ్చు. ఒక్కోసారి అది కూడా కాకపోవచ్చు.షేర్లు అలాంట్ అవ్వాలంటే..మీరు దరఖాస్తు చేసుకోవాలనుకునే కంపెనీ ఇష్యూకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని తెలిసి, ఎలాగైనా కొన్ని షేర్లు మీకు అలాట్ అవ్వాలంటే మీ కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు ప్యాన్ వివరాలతో ఇలా వివిధ అకౌంట్లతో దరఖాస్తు చేసుకోవచ్చు. దాంతో షేర్లు అలాట్ అయ్యే అవకాశం పెరుగుతుంది. అంతే తప్పా మీపేరుపైనే ఒకటి కంటే ఎక్కవ లాట్ల కోసం దరఖాస్తు చేసుకోకూడదు. అలా చేస్తే మొదటికే మోసం జరుగుతుంది. అధికమొత్తంలో షేర్లు అలాట్ అవ్వకపోగా, కనీసం ఒక లాట్కూడా వచ్చే అవకాశం ఉండదని గుర్తుంచుకోవాలి.రిస్కులులేవా..?ఇష్యూ పూర్తయిన మూడు రోజుల తర్వాత బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో సదరు కంపెనీ షేర్లు లిస్ట్ అవుతాయి. ఐపీఓకి దరఖాస్తు చేయడం వల్ల రిస్కులు, ప్రయోజనాలూ ఉంటాయి. ఐపీఓలో అలాట్ అయినా షేర్లు లిస్టింగ్ రోజున పడిపోతే ఆ నష్టాన్ని భరించడంకానీ, వాటిని కొనసాగించడంగానీ చేయాల్సి ఉంటుంది. అదే లాభాల్లో ట్రేడ్ అవుతుంటే మంచి ప్రయోజనం పొందవచ్చు.ఇదీ చదవండి: క్రెడిట్ కార్డ్.. గీత దాటొద్దు..!త్వరలో ఐపీఓకి రానున్న కంపెనీలు..వెంటివ్ హాస్పిటాలిటీ లిమిటెడ్ఇష్యూ ప్రారంభం 20 డిసెంబర్ఇష్యూ ముగింపు 24 డిసెంబర్ మమతా మెషినరీ లిమిటెడ్ఇష్యూ ప్రారంభం 19 డిసెంబర్ఇష్యూ ముగింపు 23 డిసెంబర్ట్రాన్స్రైల్ లైటింగ్ లిమిటెట్ఇష్యూ ప్రారంభం 19 డిసెంబర్ఇష్యూ ముగింపు 23 డిసెంబర్-బెహరా శ్రీనివాసరావుస్టాక్ మార్కెట్, నిపుణులు -
ఐపీవో బాటలో 3 కంపెనీలు
ప్రస్తుత కేలండర్ ఏడాది(2024)లో ప్రైమరీ మార్కెట్లు జోరు చూపుతున్నాయి. గత వారం 4 కంపెనీలు ఐపీవోలు చేపట్టగా.. ఈ వారం మరో 4 కంపెనీల ఇష్యూలు ప్రారంభంకానున్నాయి. ఈ బాటలో తాజాగా లక్ష్మీ డెంటల్కు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. మరో 2 కంపెనీలు లిస్టింగ్కు అనుమతించమంటూ ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేశాయి. మరోపక్క ఎన్లాన్ హెల్త్కేర్ అక్టోబర్లో దాఖలు చేసిన ప్రాస్పెక్టస్ను సెబీ తాజాగా వెనక్కి పంపింది. వివరాలు చూద్దాం..ఆనంద్ రాఠీ ఆనంద్ రాఠీ గ్రూప్ బ్రోకరేజీ కంపెనీ.. ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా తాజా ఈక్విటీ జారీ ద్వారా రూ. 745 కోట్లు సమీకరించే ప్రణాళికలు వేసింది. వీటిలో రూ. 550 కోట్లు దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్సహా సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. బ్రోకింగ్, మార్జిన్ ట్రేడింగ్, ఫైనాన్షియల్ ప్రొడక్టుల పంపిణీ తదితర విస్తారిత ఫైనాన్షియల్ సర్వీసులను ఆనంద్ రాఠీ బ్రాండుతో కంపెనీ ఆఫర్ చేస్తోంది. సంస్థాగత ఇన్వెస్టర్లతోపాటు రిటైల్, హెచ్ఎన్ఐలకు సేవలు సమకూర్చుతోంది. గతేడాది(2023–24) ఆదాయం 46 శాతం జంప్చేసి రూ. 682 కోట్లను తాకింది. నికర లాభం మరింత అధికంగా దాదాపు రెట్టింపై రూ. 77 కోట్లను దాటింది. ఈ బాటలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) ఏప్రిల్–సెప్టెంబర్లో రూ. 442 కోట్ల ఆదాయం, రూ. 64 కోట్ల నికర లాభం అందుకుంది.జీకే ఎనర్జీసౌర విద్యుత్ ఆధారిత వ్యవసాయ వాటర్ పంప్ సిస్టమ్స్ కంపెనీ.. జీకే ఎనర్జీ సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 84 లక్షల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 422 కోట్లు దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్కు, మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా సౌర విద్యుత్ వ్యవసాయ వాటర్ పంప్ సిస్టమ్స్కు సంబంధించి ఈపీసీ సేవలు అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పీఎం–కేయూఎస్యూఎం పథకంలో భాగంగా సర్వీసులు సమకూర్చుతోంది. జల్జీవన్ మిషన్కింద నీటి నిల్వ, పంపిణీ వ్యవస్థలను ఏర్పాటు చేస్తోంది. 2024 అక్టోబర్కల్లా రూ. 759 కోట్ల ఆర్డర్బుక్ను సాధించింది. గతేడాది(2023–24) ఆదాయం 44 శాతం ఎగసి రూ. 411 కోట్లను తాకింది. నికర లాభం మరింత అధికంగా రూ. 10 కోట్ల నుంచి రూ. 36 కోట్లకు జంప్చేసింది. ఈ బాటలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) ఏప్రిల్–సెప్టెంబర్లో రూ. 422 కోట్ల ఆదాయం, రూ. 51 కోట్ల నికర లాభం అందుకుంది.లక్ష్మీ డెంటల్ రెడీసెప్టెంబర్లో ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన లక్ష్మీ డెంటల్ తాజాగా అనుమతి పొందింది. ప్రాస్పెక్టస్ ప్రకారం ఐపీవోలో భాగంగా రూ. 150 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.28 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థ బిజ్డెంట్ డివైసెస్లో పెట్టుబడులకు, కొత్త మెషీనరీ కొనుగోలుకి, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. ఎండ్టుఎండ్ సమీకృత డెంటల్ ప్రొడక్టుల కంపెనీ ఇది. ఎలైనర్ సొల్యూషన్స్, పీడియాట్రిక్ డెంటల్ తదితర పలు ఉత్పత్తులను రూపొందిస్తోంది. -
ఐపీవో వేవ్
న్యూఢిల్లీ: ఓవైపు సెకండరీ మార్కెట్లు ఆటుపోట్లు చవిచూస్తున్నప్పటికీ మరోపక్క ప్రైమరీ మార్కెట్లు కళకళలాడుతున్నాయి. గత వారం 4 ఇష్యూలు మార్కెట్లను పలకరించగా.. గురువారం(19న) మరో 4 కంపెనీల పబ్లిక్ ఇష్యూలు ప్రారంభంకానున్నాయి. 23న ముగియనున్న ఇవి 27న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్టయ్యే వీలుంది. బుధవారం(18న) యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్లను విక్రయించనున్నాయి. వివరాలు చూద్దాం..ట్రాన్స్రైల్ లైటింగ్ ప్రధానంగా విద్యుత్ ప్రసారం, పంపిణీ సంబంధ ఈపీసీ సేవలందించే ట్రాన్స్రైల్ లైటింగ్ పబ్లిక్ ఇష్యూకి రూ. 410–432 ధరల శ్రేణి ప్రకటించింది. ఐపీవోలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు కంపెనీ ప్రమోటర్ 1.01 కోట్ల షేర్లను ఆఫర్ చేస్తున్నారు. ఇష్యూ ద్వారా మొత్తం రూ. 839 కోట్లు సమీకరించనుంది. ఈక్విటీ జారీ నిధులను పెట్టుబడి వ్యయాలు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 34 షేర్ల(ఒక లాట్)కు దరఖాస్తు చేయవలసి ఉంటుంది.డీఏఎమ్ క్యాపిటల్ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ డీఏఎమ్ క్యాపిటల్ అడ్వయిజర్స్ పబ్లిక్ ఇష్యూకి రూ. 269–283 ధరల శ్రేణి ప్రకటించింది. ఐపీవోలో భాగంగా కంపెనీ ప్రమోటర్, ప్రస్తుత ఇన్వెస్టర్లు 2.97 కోట్ల షేర్లను ఆఫర్ చేస్తున్నారు. తద్వారా రూ. 840 కోట్లు సమకూర్చుకోనున్నారు. ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్లు, విలీనాలు– కొనుగోళ్లు, ప్రైవేట్ ఈక్విటీ, బ్రోకింగ్, రీసెర్చ్లతోకూడిన సంస్థాగత ఈక్విటీల ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కార్యకలాపాలు కంపెనీ నిర్వహిస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 53 షేర్ల(ఒక లాట్)కు దరఖాస్తు చేయవలసి ఉంటుంది.కంకార్డ్ ఎన్విరో పర్యావరణ సంబంధ ఇంజనీరింగ్ సొల్యూషన్ల సంస్థ కంకార్డ్ ఎన్విరో సిస్టమ్స్ పబ్లిక్ ఇష్యూకి రూ. 665–701 ధరల శ్రేణి ప్రకటించింది. ఐపీవోలో భాగంగా రూ. 175 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు కంపెనీ ప్రమోటర్, ప్రస్తుత ఇన్వెస్టర్లు 46.41 లక్షల షేర్లను ఆఫర్ చేస్తున్నారు. ఇష్యూ ద్వారా మొత్తం రూ. 500 కోట్లుపైగా సమ కూర్చుకోనుంది. ఈక్విటీ జారీ నిధులను వాటర్ ట్రీట్మెంట్ వ్యవస్థల కోసం ఏర్పాటు చేస్తున్న కొత్త అసెంబ్లీ యూనిట్(సీఈఎఫ్)లో ఇన్వెస్ట్ చేయనుంది. అంతేకాకుండా రోకెమ్ సెపరేషన్ సిస్టమ్స్పై మరికొన్ని నిధులను వెచి్చంచనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 21 షేర్ల (ఒక లాట్)కు దరఖాస్తు చేయవలసి ఉంటుంది.సనాతన్ టెక్స్టైల్స్ విభిన్న యార్న్ల తయారీ కంపెనీ సనాతన్ టెక్స్టైల్స్ పబ్లిక్ ఇష్యూకి రూ. 305–321 ధరల శ్రేణి ప్రకటించింది. ఐపీవోలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు కంపెనీ ప్రమోటర్, గ్రూప్ సంస్థలు రూ. 150 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేస్తున్నాయి. ఇష్యూ ద్వారా మొత్తం రూ. 550 కోట్లు సమీకరించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 46 షేర్ల(ఒక లాట్)కు దరఖాస్తు చేయవలసి ఉంటుంది. టెక్నికల్ టెక్స్టైల్స్, ఇండ్రస్టియల్ పాలియస్టర్, కాటన్ తదితర యార్న్లను కంపెనీ రూపొందిస్తోంది. -
ఐపీవో బాటలో రెండు కంపెనీలు
వినియోగించిన ల్యాప్టాప్, డెస్క్టాప్లను పునరుద్ధరించే జీఎన్జీ ఎలక్ట్రానిక్స్ పబ్లిక్ ఇష్యూ బాటలో సాగుతోంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 825 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 97 లక్షల ఈక్విటీ షేర్లను కంపెనీ ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 320 కోట్లు రుణ చెల్లింపులకు, మరో రూ. 260 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వెచ్చించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనున్నట్లు ప్రాస్పెక్టస్లో పేర్కొంది. కంపెనీ ఎలక్ట్రానిక్స్ బజార్ బ్రాండుతో ల్యాప్టాప్, డెస్క్టాప్, సర్వర్లు, ప్రీమియం స్మార్ట్ఫోన్ తదితరాల పునర్వినియోగానికి వీలైన వేల్యూ చైన్ను నిర్వహిస్తోంది. విక్రయాలు, అమ్మకాల తదుపరి సర్వీసులు, వారంటీ సేవలు అందిస్తోంది. కొత్త ప్రొడక్టులతో పోలిస్తే 35–50 శాతం తక్కువ ధరలకే అందిస్తోంది. భారత్సహా యూఎస్, యూరప్, ఆఫ్రికా తదితర ప్రాంతాలలో కార్యకలాపాలు విస్తరించింది.ఎలిగంజ్ ఇంటీరియర్స్ఐపీఓ ద్వారా నిధులు సమీకరించేందుకు ఎన్ఎస్ఈ ఎమర్జ్ వద్ద ఎలిగంజ్ ఇంటీరియర్స్ ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా 60.05 లక్షల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తామని కంపెనీ తెలిపింది. ఐపీఓ అనంతరం షేర్లను ఎన్ఎస్ఈ ఎమర్జ్ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్లో నమోదు చేస్తామని పేర్కొంది.సమీకరించిన నిధుల్లో రూ.25 కోట్లు రుణాలను చెల్లించేందుకు, రూ.30 కోట్లు మూలధన వ్యయానికి, మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగిస్తామని వివరించింది. ఈ ఇష్యూకు వివ్రో ఫైనాన్సియల్ సర్వీసెస్ బుక్ రన్నింగ్ మేనేజర్గా, బిగ్షేర్ సర్వీసెస్ రిజిస్ట్రార్గా వ్యవహరిస్తున్నాయి. ఎలిగంజ్ ఇంటీరియర్స్ దేశవ్యాప్తంగా కార్పొరేట్, వాణిజ్య సంస్థలకు ఇంటీరియర్ ఫిట్ అవుట్ సేవలు అందిస్తోంది. -
మార్కెట్లోకి మరో కొత్త ఐపీఓ
మమతా మెషినరీ లిమిటెడ్ స్టాక్మార్కెట్లో లిస్ట్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది. డిసెంబర్ 19 గురువారం రోజున కంపెనీ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ప్రారంభం అవుతుందని సంస్థ తెలిపింది. ఈ ఐపీవో ధర కంపెనీ రూ.179 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. అందుకు ఒక్కో షేరుకు రూ.230-243 ధర నిర్ణయించింది. ఈ పబ్లిక్ ఇష్యూ డిసెంబర్ 23, 2024న ముగుస్తుంది.ఈ సంస్థ ప్రధానంగా ప్యాకేజింగ్ యంత్రాల తయారీ, ఎగుమతి, వాటికి సర్వీస్ అందిస్తోంది. ప్లాస్టిక్ సంచులు, పౌచ్లు, ఎక్స్ట్రూషన్ పరికరాలను తయారు చేసే యంత్రాలను ఈ కంపెనీ తయారు చేస్తుంది. ప్యాకేజింగ్ పరిశ్రమలో ఎండ్-టు-ఎండ్ మాన్యుఫ్యాక్చరింగ్ సొల్యూషన్లను అందిస్తుంది. ఎక్కువగా ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ), ఫుడ్ & బెవరేజ్ పరిశ్రమలకు సర్వీస్ చేస్తుంది. ఈ కంపెనీ తయారు చేసే యంత్రాలను ‘వెగా’, ‘విన్’ బ్రాండ్ పేర్లతో విక్రయిస్తున్నారు. 75కి పైగా దేశాలకు ఈ సంస్థ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.ఇదీ చదవండి: పాలసీపై రాబడి ఉండాలా..? వద్దా..?ఐపీఓ అలాట్ అవ్వాలంటే..ఒకటికి మించిన పాన్ కార్డుల ద్వారా ఐపీఓ దరఖాస్తు చేసుకుంటే షేర్ల అలాట్మెంట్ అవకాశాలు పెరుగుతాయి. మనలో కొంత మంది తమకున్న వివిధ డీమ్యాట్ ఖాతాల ద్వారా ఒకటికి మించిన బిడ్లు వేస్తుంటారు. కానీ, ఒకే పాన్ నంబర్పై ఒకటికి మించిన బిడ్లు వేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అప్పుడు మొదటికే మోసం వస్తుంది. అన్ని బిడ్లు తిరస్కరణకు గురవుతాయి. ఒకటికి మించిన బిడ్లు వేయడం సెబీ నిబంధనలకు విరుద్ధం. దీనికి బదులు తల్లిదండ్రులు, సోదర సోదరీమణులు, జీవిత భాగస్వామి పేరిట దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ పాన్ నంబర్లతో దరఖాస్తులు సమర్పించడం వల్ల షేర్లు కచ్చితంగా వస్తాయని చెప్పలేం. కానీ కేటాయింపుల అవకాశాలు కచ్చితంగా మెరుగుపడతాయి. -
ఐపీవోకు బ్లూస్టోన్ జ్యువెలరీ
వజ్రాల ఆభరణ రిటైలర్ బ్లూస్టోన్ జ్యువెలరీ అండ్ లైఫ్స్టైల్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. కంపెనీ ప్రధానంగా బ్లూస్టోన్ బ్రాండుతో డైమండ్, గోల్డ్, ప్లాటినం, స్టడ్డెడ్ జ్యువలరీ విక్రయిస్తోంది. ప్రాస్పెక్టస్ ప్రకారం ఐపీవోలో భాగంగా రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 2.4 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రస్తుత ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. కళారి క్యాపిట ల్, సామా క్యాపిటల్, సునీ ల్ కాంత్ ముంజాల్ తది తరులు షేర్లను ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 750 కోట్లు వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీలో ప్రస్తుతం ఇన్వెస్టర్లకు 26.82 శాతం వాటా ఉంది. కంపెనీ దేశవ్యాప్తంగా 203 స్టోర్లను నిర్వహిస్తోంది. గతేడాది(2024–25) మొత్తం ఆదాయం 64 శాతం జంప్చేసి రూ. 1,266 కోట్లకు చేరింది.ఇదీ చదవండి: ఐపీవో వేవ్.. ఇన్వెస్టర్ల క్యూమరోవైపు ప్యాకేజింగ్ మెషినరీ తయారీలో కార్యకలాపాలు నిర్వహించే గుజరాత్ కంపెనీ ‘మమతా మెషినరీ లిమిటెడ్’ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ఈ నెల 19న ప్రారంభం కానుంది. ఒక్కో షేరుకు రూ.230–243 ధరల శ్రేణిని ప్రకటించింది. ఈ మేరకు రూ.179 కోట్ల నిధులు సమీకరించనుంది. ఈ నెల 23న ఇష్యూ ముగుస్తుంది. ఈ నెల 18న యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్లు స్వీకరించనుంది. 50 శాతం సంస్థాగత ఇన్వెస్టర్లకు, 35 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు, 15 శాతం కోటాను నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు రిజర్వ్ చేశారు. -
ఐపీవో వేవ్.. ఇన్వెస్టర్ల క్యూ
ఓవైపు సెకండరీ మార్కెట్లు ఆటుపోట్లు చవిచూస్తున్నప్పటికీ మరోపక్క ప్రైమరీ మార్కెట్లు దుమ్ము రేపుతున్నాయి. వెరసి వారంతాన(13న) మూడు కంపెనీల పబ్లిక్ ఇష్యూలు విజయవంతమయ్యాయి. ఈ బాటలో వచ్చే వారం సైతం మరో 4 కంపెనీలు ఐపీవోలు చేపట్టనుండగా.. 11 కంపెనీలు లిస్ట్కానున్నాయి.వన్ మొబిక్విక్ డిజిటల్ పేమెంట్ సేవలు, ఫైనాన్షియల్ ప్రొడక్టుల అప్లికేషన్ సంస్థ వన్ మొబిక్విక్ పబ్లిక్ ఇష్యూకి ఇన్వెస్టర్లు క్యూ కట్టారు. దీంతో చివరి రోజు శుక్రవారానికల్లా 119 రెట్లుపైగా బిడ్స్ దాఖలయ్యాయి. తద్వారా రూ. 572 కోట్లు సమీకరించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 1,18,71,696 షేర్లు ఆఫర్ చేయగా.. 141,72,65,686 షేర్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. రిటైల్ ఇన్వెస్టర్లు దాదాపు 135 రెట్లు అధికంగా స్పందించగా.. క్విబ్ విభాగంలో 120 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 109 రెట్లు అధికంగా బిడ్స్ లభించాయి. షేరుకి రూ. 265–279 ఇష్యూలో భాగంగా మంగళవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 257 కోట్లు సమీకరించింది. విశాల్ మెగా మార్ట్ రిటైల్ స్టోర్ల దిగ్గజం విశాల్ మెగా మార్ట్ పబ్లిక్ ఇష్యూ సక్సెస్ అయ్యింది. చివరి రోజు శుక్రవారానికల్లా 27 రెట్లు అధికంగా స్పందన నమోదైంది. తద్వారా రూ. 8,000 కోట్లు సమీకరించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 75,67,56,757 షేర్లు ఆఫర్ చేయగా.. 20,64,25,23,020 షేర్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. క్విబ్ విభాగంలో 81 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 14 రెట్లు అధికంగా బిడ్స్ లభించాయి. రిటైల్ ఇన్వెస్టర్లు 2.3 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. షేరుకి రూ. 74–78 ధరలో చేపట్టిన ఇష్యూలో భాగంగా మంగళవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 2,400 కోట్లు సమీకరించిన సంగతి తెలిసిందే. సాయి లైఫ్ సైన్సెస్ కాంట్రాక్ట్ రీసెర్చ్ ఫార్మా రంగ కంపెనీ సాయి లైఫ్ సైన్సెస్ పబ్లిక్ ఇష్యూ విజయవంతమైంది. చివరి రోజు శుక్రవారానికల్లా 10 రెట్లుపైగా స్పందన నమోదైంది. తద్వారా రూ. 3,043 కోట్లు సమీకరించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 3,88,29,848 షేర్లు ఆఫర్ చేయగా.. 39,85,59,690 షేర్ల కోసం దరఖాస్తులు లభించాయి. క్విబ్ విభాగంలో 31 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 5 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. రిటైల్ ఇన్వెస్టర్లు 1.4 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. రూ. 522–549 ధరలో చేపట్టిన ఇష్యూలో భాగంగా మంగళవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 913 కోట్లు సమీకరించింది. -
ట్రాన్స్రైల్ లైటింగ్ ఐపీవో 19న..
న్యూఢిల్లీ: ప్రధానంగా విద్యుత్ ప్రసారం, పంపిణీ సంబంధిత ఈపీసీ కంపెనీ ట్రాన్స్రైల్ లైటింగ్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఈ నెల 19న ప్రారంభమై 23న ముగియనుంది. దీనిలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.01 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్ సంస్థ ఆజన్మా హోల్డింగ్స్ ప్రయివేట్ లిమిటెడ్ విక్రయానికి ఉంచనుంది.ప్రస్తుతం ప్రమోటర్లకు 83.22 శాతం వాటా ఉంది. ఈ నెల 18న యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్లను కేటాయించనుంది. ఈక్విటీ జారీ నిధులను పెట్టుబడి వ్యయాలు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. స్ట్రక్చర్స్, కండక్టర్స్, మోనోపోల్స్ తదితర సమీకృత తయారీ సౌకర్యాలను కంపెనీ కలిగి ఉంది.రూ. 2,000 కోట్లపై కన్ను విమానాశ్రయాలలో ట్రావెల్ క్విక్ సర్వీసు రెస్టారెంట్లు, లాంజ్ బిజినెస్ నిర్వహించే ట్రావెల్ ఫుడ్ సర్వీసెస్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ప్రధా నంగా భారత్, మలేషియాలో కంపెనీ సర్వీసులు అందిస్తోంది. ఐపీవోలో భాగంగా ప్రమోటర్ సంస్థ కపూర్ కుటుంబ ట్రస్ట్ రూ. 2,000 కోట్ల విలువైన వాటాను విక్రయానికి ఉంచనుంది.దీంతో ఐపీవో ద్వారా కంపెనీ కాకుండా ప్రమోటర్ సంస్థ నిధులు సమకూర్చుకోనుంది. ప్రమోటర్లలో ఎస్ఎస్పీ గ్రూప్సహా.. కపూర్ కుటుంబ ట్రస్ట్, వరుణ్ కపూర్, కరణ్ కపూర్ ఉన్నారు. ఎస్ఎస్పీ లండన్ స్టాక్ ఎక్సే్ఛంజీ లిస్టయిన కంపెనీ. ఆదాయంరీత్యా 2024లో గ్లోబల్ ట్రావెల్ ఫుడ్, పానీయాల విభాగంలో దిగ్గజంగా నిలిచినట్లు రేటింగ్ సంస్థ క్రిసిల్ పేర్కొంది. -
వారమంతా.. ఐపీవోల సందడి..
న్యూఢిల్లీ: ఐపీవోల జాతరతో ఈ వారమంతా మార్కెట్ సందడిగా ఉండనుంది. చిన్నా, పెద్దవి కలిపి మొత్తం 11 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వస్తున్నాయి. రూ. 18,500 కోట్లు సమీకరించబోతున్నాయి. విశాల్ మెగామార్ట్, సాయి లైఫ్ సైన్సెస్, ఫిన్టెక్ సంస్థ వన్ మొబిక్విక్ సిస్టమ్స్ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. మొత్తం మీద అయిదు పెద్ద సంస్థల ఇష్యూలు, ఆరు చిన్న–మధ్య తరహా సంస్థల (ఎస్ఎంఈ) ఇష్యూలు వీటిలో ఉన్నాయి. ఆరు ఎస్ఎంఈలు సుమారు రూ. 150 కోట్లు సమీకరించనున్నాయి. వివిధ రంగాలకు చెందిన సంస్థల ఐపీవోలు.. కొత్త షేర్ల జారీ, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానాల్లో ఉండనున్నాయి. ప్రస్తుత షేర్హోల్డర్లు తమ వాటాలను విక్రయించుకునేందుకు, సంస్థలు విస్తరణ ప్రణాళికల కోసం నిధులను సమీకరించుకునేందుకు, రుణాలను తిరిగి చెల్లించివేసేందుకు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం నిధులను సమకూర్చుకునేందుకు కంపెనీలకు ఈ ఇష్యూలు ఉపయోగపడనున్నాయి. మహారాష్ట్ర ఎన్నికలు, ఉత్తర్ ప్రదేశ్ లోక్సభ బై–ఎలక్షన్ల ఫలితాలతో మార్కెట్లో సానుకూల సెంటిమెంటు నెలకొందని, ఐపీవోలు విజయవంతమయ్యేందుకు ఇది దోహదపడగలదని ఆన్లైన్ బ్రోకరేజీ సంస్థ ట్రేడ్జినీ సీవోవో డి. త్రివేశ్ తెలిపారు.2024లో ఇప్పటివరకు రూ. 1.4 లక్షల కోట్ల సమీకరణ..ఈ ఏడాది ఇప్పటివరకు 78 మెయిన్ బోర్డ్ కంపెనీలు, పబ్లిక్ ఇష్యూల ద్వారా దాదాపు రూ. 1.4 లక్షల కోట్లు సమీకరించాయి. వీటిలో హ్యుందాయ్ మోటర్ ఇండియా, స్విగ్గీ, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ వంటి దిగ్గజ ఇష్యూలు ఉన్నాయి. 2023లో 57 సంస్థలు రూ. 49,436 కోట్లు సమీకరించాయి. గత కొన్నాళ్లుగా ఇటు ఇష్యూయర్లు అటు ఇన్వెస్టర్లలోను ప్రైమరీ మార్కెట్లపై గణనీయంగా ఆసక్తి పెరిగింది. గడిచిన అయిదు ఆర్థిక సంవత్సరాల్లో ఐపీవో ఇన్వెస్టర్లు భారీగా లాభాలు పొందారు. 2021–2025 ఆర్థిక సంవత్సరాల మధ్యలో వచి్చన 236 ఐపీవోలు .. రిటైల్ ఇన్వెస్టర్లకు సగటున 27 శాతం మేర లిస్టింగ్ లాభాలు అందించాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.ఇష్యూల వివరాలు..→ విశాల్ మెగా మార్ట్, సాయి లైఫ్ సైన్సెస్, మొబిక్విక్ ఇష్యూలు డిసెంబర్ 11న ప్రారంభమై 13న ముగుస్తాయి. ఇన్వెంచరస్ నాలెడ్జ్ సొల్యూషన్స్, ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇనిస్టిట్యూట్ ఐపీవోలు డిసెంబర్ 12న, 13న ప్రారంభమవుతాయి. → విశాల్ మెగామార్ట్ ఐపీవో ద్వారా రూ. 8,000 కోట్లు సమీకరిస్తోంది. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో ఉంటుంది. ప్రమోటర్ కేదారా క్యాపిటల్కి చెందిన సమాయత్ సరీ్వసెస్ ఓఎఫ్ఎస్ కింద షేర్లను విక్రయిస్తోంది. ధర శ్రేణి ఒక్కో షేరుకు రూ. 74–78గా నిర్ణయించారు. → సాయి లైఫ్ సైన్సెస్ ఐపీవోకి సంబంధించి ధర శ్రేణి రూ. 522 నుంచి రూ. 549 వరకు ఉంటుంది. కంపెనీ మొత్తం రూ. 3,043 కోట్లు సమీకరిస్తోంది. ఇందులో రూ. 950 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఓఎఫ్ఎస్ కింద ప్రమోటర్లు, ఇన్వెస్టర్ షేర్హోల్డర్లు, ఇతర షేర్హోల్డర్లు 3.81 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. → మొబిక్విక్ ఐపీవో రూ. 572 కోట్లు సమీకరిస్తోంది. ఇందుకోసం 2.05 కోట్ల షేర్లను తాజాగా జారీ చేస్తోంది. ధర శ్రేణి ఒక్కో షేరుకు రూ. 265–279 వరకు ఉంటుంది. → ఇన్వెంచరస్ నాలెడ్జ్ సొల్యూషన్స్ ఐపీవో పూర్తిగా ఓఎఫ్ఎస్ రూపంలో ఉంటుంది. ఇష్యూ పరిమాణం రూ. 2,500 కోట్లు. → ఇక ఎస్ఎంఈ ఐపీవోల విషయానికొస్తే ధనలక్ష్మి క్రాప్ సైన్స్ (డిసెంబర్ 9–11) టాస్ ది కాయిన్ లిమిటెడ్.. జంగిల్ క్యాంప్స్ ఇండియా (రెండూ డిసెంబర్ 10–12), సుప్రీమ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్.. పర్పుల్ యునైటెడ్ సేల్స్ (డిసెంబర్ 11–13), యశ్ హైవోల్టేజ్ (డిసెంబర్ 12–16) సంస్థలు ఉన్నాయి. -
రెండు ఐపీవోలకు సెబీ గ్రీన్ సిగ్నల్
రియల్టీ సంస్థ కల్పతరు లిమిటెడ్తోపాటు, హైప్రెసిషన్ ఇంజినీరింగ్ కంపెనీ యూనిమెక్ ఏరోస్పేస్ అండ్ మ్యాన్యుఫాక్చరింగ్ పబ్లిక్ ఇష్యూకి రానున్నాయి. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐపీవోలో కల్పతరు పూర్తిగా తాజా ఈక్విటీని జారీ చేయనుంది. యూనిమెక్ ఏరోస్పేస్ తాజాగా ఈక్విటీ జారీసహా ప్రమోటర్లు షేర్లను ఆఫర్ చేయనున్నారు. ఈ ఏడాది ఆగస్టులో రెండు కంపెనీలు సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్లను దాఖలు చేశాయి.రూ.1,590 కోట్లపై దృష్టికల్పతరు కంపెనీ ప్రాస్పెక్టస్ ప్రకారం సంస్థ ఐపీవోలో భాగంగా రూ.1,590 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. ఐపీవో నిధుల్లో దాదాపు రూ.1,193 కోట్లు కల్పతరు గ్రూప్ కంపెనీ రుణ చెల్లింపులకు వెచ్చించనుంది. కల్పతరు గ్రూప్లో కల్పతరు ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్, ప్రాపర్టీ సొల్యూషన్స్(ఇండియా), శ్రీ శుభం లాజిస్టిక్స్ ఉన్నాయి.ఇదీ చదవండి: అంతా ఓకే.. కేవలం వ్యక్తులపైనే ఆరోపణలు..రూ.500 కోట్ల సమీకరణఐపీవోలో భాగంగా యూనిమెక్ ఏరోస్పేస్ రూ.250 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్లు మరో రూ.250 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో కొంతమేర మెషీనరీ, పరికరాల కొనుగోలు ద్వారా విస్తరణకు వినియోగించనుంది. ఈ బాటలో వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, రుణ చెల్లింపులు తదితరాలకు సైతం నిధులను వెచ్చించనుంది. -
ఐపీవోకు తొలి ఎస్ఎం రీట్
దేశీయంగా తొలిసారి రిజిస్టర్డ్ స్మాల్ మీడియం (ఎస్ఎం) రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(రీట్) పబ్లిక్ ఇష్యూకి తెరలేవనుంది. డిసెంబర్ 2న ప్రారంభంకానున్న ఇష్యూ 4న ముగియనుంది. తద్వారా రూ.353 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నట్లు ప్రాపర్టీ షేర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ వెల్లడించింది. సంస్థ నుంచి వెలువడుతున్న తొలి ఎస్ఎం రీట్ పథకం ప్రాప్షేర్ ప్లాటినాకు రూ.10–10.5 లక్షల ధరల శ్రేణిని ప్రకటించింది.ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు ఎలాంటి యూనిట్లను ఆఫర్ చేయకపోగా.. పూర్తిగా ప్లాటినా యూనిట్లను జారీ చేయనున్నట్లు ప్రాపర్టీ షేర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(పీఎస్ఐటీ) పేర్కొంది. ఇష్యూ నిధులను ప్లాటినా ఎస్పీవీకిగల ప్రెస్టీజ్ టెక్ ప్లాటినా కొనుగోలుకి వెచ్చించనున్నట్లు వెల్లడించింది. ప్రాప్షేర్ ప్లాటినా తరహా ఎస్ఎం రీట్స్వల్ల ఇన్వెస్టర్లకు ప్రత్యామ్నాయ ఆస్తుల్లో పెట్టుబడులకు వీలు కలగనున్నట్లు ప్రాపర్టీ షేర్ డైరెక్టర్ కునాల్ మోక్టన్ తెలియజేశారు. నిరవధిక అద్దె రిటర్నులు(ఈల్డ్స్), పెట్టుబడుల వృద్ధి ద్వారా హైబ్రిడ్ రాబడులకు వీలున్నట్లు వివరించారు.ఇదీ చదవండి: జీపేలో నిమిషానికి రూ.1.. నెలకు రూ.40 వేలు!ప్రాప్షేర్ ప్లాటినా 2,46,935 చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని కలిగి ఉంది. బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్వద్ద ప్రెస్టీజ్ టెక్ ప్లాటినాకు చెందిన లీడ్ గోల్డ్ ఆఫీస్ బిల్డింగ్లో ఈ ఆస్థిని కలిగి ఉంది. యూఎస్ టెక్ కంపెనీకి పూర్తిస్థాయిలో 9 ఏళ్ల కాలానికి లీజుకి ఇచ్చేందుకు ప్రతిపాదించింది. ఇందుకు 4.6 ఏళ్ల సగటు వెయిటేజీ లాకిన్తోపాటు ప్రతీ మూడేళ్లకు 15 శాతం అద్దె పెంపు ప్రాతిపదికను ఎంపిక చేసుకుంది. వెరసి తాజా పథకం 2026లో ఇన్వెస్టర్లకు 9 శాతం పంపిణీ ఈల్డ్ను అంచనా వేస్తోంది. 2027లో 8.7 శాతం, 2028లో 8.6 శాతం చొప్పున రిటర్నులకు వీలుంది. యూనిట్లను బీఎస్ఈలో లిస్ట్ చేయనుంది. -
ఐపీవోలో సెక్యూరిటీ డిపాజిట్ రద్దు
న్యూఢిల్లీ: ఏదైనా కంపెనీ పబ్లిక్ ఇష్యూకి వచ్చేముందు స్టాక్ ఎక్స్చేంజీల వద్ద తప్పనిసరిగా డిపాజిట్ చేయవలసిన నిబంధనలను తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రద్దు చేసింది. ఐపీవో చేపట్టే ప్రణాళికలుగల అన్లిస్డెడ్ కంపెనీలకు సెక్యూరిటీ డిపాజిట్పై వెసులుబాటు కల్పిస్తూ సెబీ తాజా నిర్ణయాన్ని తీసుకుంది.దీంతో ఇకపై ఇష్యూ పరిమాణంలో 1 శాతాన్ని స్టాక్ ఎక్స్చేంజీల వద్ద డిపాజిట్ చేయవలసిన అవసరం ఉండదు. సులభతర బిజినెస్ నిర్వహణకు వీలు కల్పించే బాటలో సెబీ వెనువెంటనే అమల్లోకి వచ్చేవిధంగా సర్క్యులర్ను జారీ చేసింది. ఇప్పటివరకూ పబ్లిక్ ఇష్యూ ముగిశాక సెక్యూరిటీ డిపాజిట్ను స్టాక్ ఎక్స్చేంజీలు తిరిగి చెల్లిస్తున్నాయి.ఐపీవో లేదా రైట్స్కు ముందు 1 శాతం మొత్తాన్ని సెక్యూరిటీ డిపాజిట్ చేసే నిబంధన రద్దుపై ఈ ఏడాది ఫిబ్రవరిలో సెబీ చర్చాపత్రానికి తెరతీసింది. ప్రస్తుతం ఐపీవో ప్రక్రియలో ఇన్వెస్టర్ల ఖాతా లకు అస్బా అమలుకావడం, యూపీఐ చెల్లింపులు, డీమ్యాట్ ఖాతాల్లోకి షేర్ల అలాట్మెంట్ అమలు జరుగుతున్న నేపథ్యంలో సెక్యూరిటీ డిపాజిట్ అవసరానికి కాలం చెల్లినట్లు సెబీ వివరించింది. -
రెండు కంపెనీలు ఐపీవో బాటలో
న్యూఢిల్లీ: తాజాగా రెండు కంపెనీలు పబ్లిక్ ఇష్యూ బాట పట్టాయి. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేశాయి. జాబితాలో ఎల్పీజీ, కెమికల్స్ స్టోరేజీ కంపెనీ ఏజిస్ వొపాక్ టెర్మినల్స్తోపాటు.. సోలార్ ప్యానళ్ల తయారీ కంపెనీ సాత్విక్ గ్రీన్ ఎనర్జీ చేరాయి. వివరాలు చూద్దాం.. రూ. 3,500 కోట్లపై దృష్టి ఏజిస్ లాజిస్టిక్స్ అనుబంధ కంపెనీ ఏజిస్ వొపాక్ టెర్మినల్స్ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. వీటి ప్రకారం ఐపీవోలో భాగంగా రూ. 3,500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. తద్వారా రూ. 3,500 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవోకంటే ముందుగా షేర్ల జారీ ద్వారా రూ. 700 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. దీంతో ఐపీవో పరిమాణం ఆమేర తగ్గవచ్చు. ఇష్యూ నిధుల్లో రూ. 2,027 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 671 కోట్లు పెట్టుబడి వ్యయాలకు వెచి్చంచనుంది. వీటితో మంగళూరువద్ద క్రియోజెనిక్ ఎల్పీజీ టెర్మినల్ను ఏర్పాటు చేయనుంది. మిగిలిన నిధులను కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీలో ప్రస్తుతం వొపాక్ ఇండియా బీవీకి 50.1 శాతం, ఏజిస్ లాజిస్టిక్స్కు 47.31 శాతం చొప్పున వాటా ఉంది. 2024 జూన్కల్లా దేశవ్యాప్తంగా 18 స్టోరేజీ ట్యాంకులను నిర్వహిస్తోంది. పెట్రోలియం, వెజిటబుల్ ఆయిల్, లూబ్రికెంట్స్, ఎల్పీజీ, ప్రొపేన్, బ్యుటేన్ తదితరాల నిల్వకు వీటిని వినియోగించవచ్చు. రూ. 1,150 కోట్లకు రెడీ సోలార్ ఫొటో వోల్టాయిక్ మాడ్యూళ్ల తయారీ కంపెనీ సాత్విక్ గ్రీన్ ఎనర్జీ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. వీటి ప్రకారం స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్ ద్వారా రూ. 1,150 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. దీనిలో రూ. 850 కోట్లు తాజా ఈక్విటీ జారీ ద్వారా, మరో రూ. 300 కోట్లు ప్రమోటర్ల షేర్ల విక్రయం ద్వారా సమకూర్చుకోనుంది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్ల వాటా 90 శాతంగా నమోదైంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 553 కోట్లు ఒడిషాలో 4 గిగావాట్ల సోలార్ పీవీ మాడ్యూల్ తయారీ ప్లాంటు ఏర్పాటుపై వెచి్చంచనుంది. మరో రూ. 96 కోట్లు అనుబంధ సంస్థ సాత్విక్ సోలార్ ఇండస్ట్రీస్ రుణ చెల్లింపులకు కేటాయించనుంది. 2024 జూన్కల్లా 1.8 గిగావాట్ల నిర్వహణ సామర్థ్యాన్ని కలిగి ఉంది. కంపెనీ ప్రధానంగా సోలార్ ప్రాజెక్టులకు ఎండ్టు ఎండ్ ఈపీసీ సరీ్వసులను అందిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో రూ. 246 కోట్ల ఆదాయం, రూ. 21 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. -
ఈ ఏడాది ఇదే అతిపెద్ద ఐపీవో..!
ముంబై: సూపర్మార్కెట్ చైన్ విశాల్ మెగా మార్ట్ పబ్లిక్ ఇష్యూ బాటలో సాగుతున్నట్లు తెలుస్తోంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం డిసెంబర్లో ఐపీవో చేపట్టనుంది. తద్వారా రూ. 8,000 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. పీఈ దిగ్గజం కేదారా క్యాపిటల్ అండ్ పార్ట్నర్స్కు పెట్టుబడులున్న కంపెనీ లిస్టయితే 2024 ఏడాదికి అతిపెద్ద ఇష్యూగా నిలవనుంది.అంతేకాకుండా దేశీ ప్రైమరీ మార్కెట్లో నాలుగో పెద్ద ఐపీవోగా రికార్డులకు ఎక్కనుంది. మార్చితో ముగిసిన గతేడాది(2023–24) రూ. 8,912 కోట్ల ఆదాయం సాధించింది. రూ. 462 కోట్ల నికర లాభం ఆర్జించింది.డిసెంబర్ మధ్యలో.. నిజానికి దేశీ స్టాక్ మార్కెట్లలో ఇటీవల నమోదవుతున్న దిద్దుబాట్ల కారణంగా నవంబర్లో చేపట్టదలచిన ఇష్యూని విశాల్ మెగామార్ట్ డిసెంబర్కు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కంపెనీ ఇప్పటికే లండన్, సింగపూర్ తదితర ప్రాంతాలలో రోడ్షోలపై విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లతో చర్చలు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. వచ్చే నెల మధ్యలో చేపట్టనున్న ఐపీవోలో తాజా ఈక్విటీ జారీ లేనట్లు తెలుస్తోంది.నిధుల సమీకరణకు వీలుగా హోల్డింగ్ కంపెనీ సంయత్ సర్వీసెస్ ఎల్ఎల్పీ వాటాలు విక్రయించనుంది. ప్రస్తుతం విశాల్ మెగామార్ట్లో సంయత్ సర్వీసెస్కు 96.55 శాతం వాటా ఉంది. కంపెనీ సీఈవో గుణేందర్ కపూర్ వాటా 2.45 శాతంగా నమోదైంది. సుమారు 626 సూపర్మార్కెట్ల ద్వారా కంపెనీ దుస్తులు, ఎఫ్ఎంసీజీ, సాధారణ వర్తక వస్తువులు తదితర పలు ప్రొడక్టులను విక్రయిస్తోంది. -
లాజిస్టిక్స్ ఐపీవోకు స్పందన ఎలా ఉందంటే..
ట్రక్ ఆపరేటర్లకు డిజిటల్ ప్లాట్ఫామ్ సేవలందించే జింకా లాజిస్టిక్స్ సొల్యూషన్స్ పబ్లిక్ ఇష్యూకి అంతంతమాత్రమే స్పందన లభించింది. ఐపీవో దరఖాస్తు చివరి రోజు సోమవారానికల్లా 1.9 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయ్యింది. కంపెనీ 2.25 కోట్ల షేర్లు ఆఫర్ చేయగా.. 4.19 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. క్విబ్ విభాగంలో 2.76 రెట్లు బిడ్స్ నమోదుకాగా.. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 1.65 రెట్లు దరఖాస్తులు లభించాయి. సంస్థాగతేతర ఇన్వెస్టర్ల విభాగంలో 24 శాతానికే దరఖాస్తులు అందాయి.ఇష్యూలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.501 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. వెరసి షేరుకి రూ.259–273 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ.1,115 కోట్లు సమీకరించింది. ఐపీవో ద్వారా ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు రూ.565 కోట్ల విలువైన 2.06 కోట్ల షేర్లను విక్రయించగా.. రూ.550 కోట్ల విలువైన ఈక్విటీని కంపెనీ కొత్తగా జారీ చేసింది. ఈ నిధుల్లో రూ.200 కోట్లు మార్కెటింగ్కు, రూ.140 కోట్లు బ్లాక్బక్ ఫిన్సర్వ్ మూలధన పెట్టుబడులకు వినియోగించనుంది.ఇదీ చదవండి: గోల్డ్ ఈటీఎఫ్లు కళకళఏరిస్ఇన్ఫ్రా ఐపీవోకు రెడీనిర్మాణ రంగ మెటీరియల్స్ ప్రొక్యూర్మెంట్లో టెక్నాలజీ ఆధారిత బీ2బీ సేవలందించే ఏరిస్ఇన్ఫ్రా సొల్యూషన్స్ పబ్లిక్ ఇష్యూకి క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 600 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వెరసి ఐపీవో ద్వారా రూ. 600 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవో చేపట్టేందుకు వీలుగా ఈ ఏడాది ఆగస్ట్లో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన కంపెనీ తాజాగా అనుమతులు పొందింది. కాగా.. ఇష్యూ నిధులను వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, అనుబంధ సంస్థ బిల్డ్మెక్స్ ఇన్ఫ్రాలో పెట్టుబడులకు, రుణ చెల్లింపులకు, ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. -
ఐపీవో లో 'లక్కు' కుదురాలంటే..
ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో).. ఎక్స్ లేదా వై లేదా జెడ్.. ఇన్వెస్టర్ల నుంచి పదులు, వందల రెట్ల అధిక స్పందన కనిపిస్తోంది. ముఖ్యంగా సంస్థాగత ఇన్వెస్టర్లకు దీటుగా రిటైలర్లూ దూకుడుగా ఐపీవోల్లో బిడ్ వేస్తున్నారు. చాలా ఇష్యూలు లిస్టింగ్లో లాభాలు కురిపిస్తుండడంతో ప్రైమరీ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఆకర్షణీయంగా మారిపోయింది. ఇది ఏ స్థాయిలో అంటే బీఎస్ఈ ఎస్ఎంఈ, ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్ఫామ్లపై లిస్ట్ అయ్యే చిన్న కంపెనీల ఐపీవోలకూ ఎన్నో రెట్ల అధిక బిడ్లు దాఖలవుతున్నాయి. దీంతో ఐపీవో ఆకర్షణీయ మార్కెట్గా మారిపోయింది. సామాజిక మాధ్యమాల్లోనూ ఐపీవో పోస్ట్లకు మంచి ఫాలోయింగ్ ఉంటోంది. స్పందన పెరిగిపోవడం వల్ల చివరికి కొద్ది మందినే షేర్లు వరిస్తున్నాయి. కానీ, కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా డిమాండ్ ఉన్న ఐపీవోలో అలాట్మెంట్ అవకాశాలను పెంచుకోవచ్చు. ఇందుకు ఏమి చేయాలన్నది చూద్దాం. ఒకటికి మించిన దరఖాస్తులు ఐపీవోలో షేర్ల అలాట్మెంట్ అవకాశాలను పెంచుకోవాలంటే, ఒకటికి మించిన పాన్ల ద్వారా దరఖాస్తు చేసుకోవడం తెలివైన ఆప్షన్. మనలో కొంత మంది తమకున్న వివిధ డీమ్యాట్ ఖాతాల ద్వారా ఒకటికి మించిన బిడ్లు సమరి్పస్తుంటారు. కానీ, ఒకే పాన్ నంబర్పై ఒకటికి మించిన బిడ్లు వేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అప్పుడు మొదటికే మోసం వస్తుంది. అన్ని బిడ్లు తిరస్కరణకు గురవుతాయి. ఒకటికి మించిన బిడ్లు వేయడం సెబీ నిబంధనలకు విరుద్ధం. దీనికి బదులు తమ తల్లిదండ్రులు, సోదర సోదరీమణులు, జీవిత భాగస్వామి పేరిట దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ పాన్ నంబర్లతో దరఖాస్తులు సమరి్పంచడం వల్ల షేర్లు కచ్చితంగా వస్తాయని చెప్పలేం. కానీ కేటాయింపుల అవకాశాలు కచి్చతంగా మెరుగుపడతాయి. కొందరు స్నేహితుల సాయంతోనూ ఒకటికి మించిన దరఖాస్తులు సమరి్పస్తుంటారు. రిటైల్ ఇన్వెస్టర్ల కోటాలో కనీసం ఒక లాట్కు బిడ్ వేయాలి. ఒకటికి మించిన లాట్లతో బిడ్లు సమర్పించినప్పటికీ స్పందన అధికంగా ఉంటే, చివరికి ఒక్కటే లాట్ (కనీస షేర్లు) వస్తుంది. ఉదాహరణకు ఇటీవలే ముగిసిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీవో ఒక లాట్ పరిమాణం 214 షేర్లు. విలువ రూ.14,980. ఒక ఇన్వెస్టర్ రూ.74,900తో ఐదు లాట్లకు బిడ్ వేసినా కానీ, ఒక్కటే లాట్ అలాట్ అయి ఉండేది. ఎందుకంటే ఇష్యూ పరిమాణంతో పోలి్చతే 60 రెట్లు అధిక బిడ్లు దాఖలు కావడం గమనార్హం. తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారంతో ఒకటికి మించిన బిడ్లు సమరి్పంచడం వల్ల కొన్ని సందర్భాల్లో అదృష్టం కొద్దీ ఒకటికి మించిన దరఖాస్తులకు కేటాయింపులు రావచ్చు. జాక్పాట్డిమాండ్ ఉన్న కంపెనీ షేర్లను సొంతం చేసుకునేందుకు పదుల సంఖ్యలో ఖాతాల ద్వారా అదృష్టాన్ని పరీక్షించుకునే వారూ ఉన్నారు. దీన్నొక ఆదాయ మార్గంగా మలుచుకుని కృషి చేస్తున్నవారు కూడా కనిపిస్తుంటారు. చెన్నైకి చెందిన ఆదేష్ (30) ఇటీవలి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీవోలో జాక్పాట్ కొట్టేశాడు. వేర్వేరు పేర్లతో ఉన్న 18 డీమ్యాట్ ఖాతాల ద్వారా షేర్హోల్డర్ కేటగిరీ కింద బిడ్లు సమర్పించాడు. అదృష్టం తలుపుతట్టడంతో 14 డీమ్యాట్ ఖాతాలకూ వాటాదారుల కోట కింద కేటాయింపు లభించింది. అలాగే, హెచ్ఎన్ఐ కోటా కింద కూడా దరఖాస్తు చేశాడు. మొత్తం 39 లాట్లు దక్కాయి. అంటే మొత్తం 8,346 షేర్లు అతడిని వరించాయి. ఇష్యూ ధరతో పోలి్చతే లిస్టింగ్ రోజున బజాజ్ ఫైనాన్స్ ఒక దశలో 136 శాతం వరకు ర్యాలీ చేయడం గమనించొచ్చు. వాటాదారుల కోటా.. ఐపీవోకు వస్తున్న కంపెనీ మాతృసంస్థ (పేరెంట్) అప్పటికే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉంటే, వాటాదారుల కోటాను ఉపయోగించుకోవచ్చు. ఇటీవలే ముగిసిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీవోలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ వాటాదారులకు 7.62 శాతం షేర్లను రిజర్వ్ చేశారు. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అన్నది బజాజ్ ఫైనాన్స్ సబ్సిడరీ. అలాగే, బజాజ్ ఫైనాన్స్ అన్నది బజాజ్ ఫిన్సర్వ్ సబ్సిడరీ. దీంతో రెండు కంపెనీల వాటాదారులకూ షేర్హోల్డర్స్ కోటా లభించింది. ఐపీవోకు వస్తున్నది కొత్త కంపెనీ అయితే ఇందుకు అవకాశం ఉండదు. లిస్టెడ్ కంపెనీల సబ్సిడరీలు ఐపీవోలకు వస్తుంటే, ముందుగానే ఆయా లిస్టెడ్ సంస్థలకు సంబంధించి ఒక్క షేరు అయినా డీమ్యాట్ అకౌంట్లో ఉంచుకుంటే సరిపోతుంది. ఐపీవోకి సెబీ నుంచి అనుమతి రావడానికి ముందే ఈ పనిచేయాలి.బిడ్స్ ఇలా...త్వరలో ఐపీవోకు రానున్న ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ల కంపెనీ ఏథర్ ఎనర్జీ సైతం లిస్టెడ్ సంస్థ హీరో మోటోకార్ప్ వాటాదారులకు కోటా రిజర్వ్ చేసింది. ఏథర్ ఎనర్జీలో హీరో మోటోకార్ప్కు 35 శాతానికి పైగా వాటా ఉండడం ఇందుకు కారణం. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగంలో దరఖాస్తు పెట్టుకున్న వారు.. విడిగా వాటాదారుల కోటాలోనూ గరిష్టంగా రూ.2 లక్షల విలువకు బిడ్ సమరి్పంచొచ్చు. రూ.2 లక్షలకు మించి నాన్ ఇనిస్టిట్యూషనల్ కోటాలోనూ పాల్గొనొచ్చు. ఎల్ఐసీ ఐపీవో సమయంలో పాలసీదారుల కోసం విడిగా షేర్లను రిజర్వ్ చేయడం గుర్తుండే ఉంటుంది. రుణం తీసుకుని మరీ..వ్యాపారం నిర్వహించే హర్ష (25) ఐదు వ్యక్తిగత డీమ్యాట్ ఖాతాలు, ఒక హెచ్యూఎఫ్ డీమ్యాట్ ఖాతా ద్వారా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీవోలో పాల్గొన్నాడు. అప్పటికే తనకున్న ఈక్విటీ షేర్లను తనఖాపెట్టి ఎన్బీఎఫ్సీ నుంచి రూ.కోటి రుణం తీసుకుని మరీ హెచ్ఎన్ఐ విభాగంలో బిడ్ వేశాడు. మొత్తం మీద 19 లాట్లు దక్కించుకున్నాడు. వాటాదారుల కోటాలో..ఐటీ ఉద్యోగి అయిన ధీరజ్ మెహ్రా (43) ముందుగానే బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు కొని పెట్టుకున్నాడు. షేర్ హోల్డర్స్ కోటా కింద బిడ్లు వేశాడు. మొత్తం 11 డీమ్యాట్ ఖాతాలను ఉపయోగించుకున్నాడు. 6 లాట్ల షేర్లు అలాట్ అయ్యాయి. తిరస్కరణకు దూరంగా..కొన్ని తప్పుల కారణంగా దరఖాస్తులు తిరస్కరణకు గురవుతుంటాయి. ఒకటే పాన్ ఆధారంగా వేర్వేరు ఖాతాల నుంచి బిడ్లు వేయడం ఇందులో ఒకటి. బిడ్ వేయడానికి ఉపయోగించిన బ్యాంక్ ఖాతాలోని పేరు, డీమ్యాట్ ఖాతాలోని పేరు ఒకే విధంగా ఉండాలి. ఏదైనా ఐపీవో ఇష్యూ విజయవంతం కావాలంటే కనీసం 90% మేర సబ్్రస్కిప్షన్ రావాల్సి ఉంటుంది. కసరత్తు అవసరం.. లిస్టింగ్ రోజే లాభాలు తీసుకుందామనే ధోరణితో ఐపీవోల్లో పాల్గొనడం అన్ని సందర్భాల్లో ఫలితమివ్వదు. పైగా ఈ విధానంలో రిస్క్ను ఎదుర్కోవాల్సి వస్తుంది. జారీ ధర కంటే తక్కువకు లిస్ట్ అయ్యేవీ ఉంటాయి. అలాంటి సందర్భంలో నష్టానికి విక్రయించకుండా దీర్ఘకాలం పాటు కొనసాగించగలరా? అని ప్రశి్నంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం లిస్టింగ్ లాభం కోసం దరఖాస్తుచేసుకుంటే.. లిస్టింగ్ నాడు నష్టం వచి్చనా విక్రయించాల్సిందే. దీర్ఘకాల దృష్టితో దర ఖాస్తు చేసుకుంటే, మెరుగైన ఫలితాలు చూడొచ్చు. లిస్టింగ్ ఆశావహంగా లేకపోయినా, కంపెనీ వ్యాపార అవకాశాల దృష్ట్యా పెట్టుబడి కొనసాగించొచ్చు. ఇటీవలి ఐపీవోల్లో చాలా వరకు అధిక వేల్యుయేషన్పైనే నిధులు సమీకరిస్తున్నాయి. అలాంటి కొన్ని లిస్టింగ్ తర్వాత ర్యాలీ చేస్తున్నాయి. ఐపీవో ముగిసి లిస్టింగ్ నాటికి మార్కెట్ దిద్దుబాటులోకి వెళితే.. అధిక వ్యా ల్యూషన్పై వచ్చిన కంపెనీ షేర్లు లిస్టింగ్లో నష్టాలను మిగల్చవచ్చు.ఎస్ఎంఈ ఐపీవోలు మెయిన్బోర్డ్ ఐపీవోల్లో రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ (రూ.15,000)కు దరఖాస్తు చేసుకోవచ్చు. అదే ఎస్ఎంఈ ఐపీవో అయితే కనీస లాట్ విలువ రూ.లక్ష, అంతకు మించి ఉంటుంది. కనుక చిన్న ఇన్వెస్టర్లు అందరూ వీటిలో పాలు పంచుకోలేరు. బీఎస్ఈ ఎస్ఎంఈ, ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్ఫామ్లపై ఈ కంపెనీలు లిస్ట్ అవుతాయి. ఆరంభ స్థాయిలోని చిన్న, మధ్య స్థాయి కంపెనీలు సులభంగా ప్రజల నుంచి నిధులు సమీకరించి, లిస్ట్ అయ్యేందుకు ఈ వేదికలు వీలు కల్పిస్తుంటాయి. ఇటీవలి కాలంలో ఎస్ఎంఈ ఐపీవోలకు సైతం అనూహ్య స్పందన వస్తోంది. దీనికి కారణం గత రెండేళ్లుగా ఎస్ఎంఈ సూచీ ఏటా 39 శాతం మేర రాబడి ఇస్తోంది. ఇదే కాలంలో నిఫ్టీ 50 రాబడి 15 శాతం (సీఏజీఆర్) కాగా, నిఫ్టీ స్మాల్క్యాప్ 100 సూచీ రాబడి 37 శాతం చొప్పునే ఉంది. లాట్ పరిమాణం ఎక్కువగా ఉండడంతో ఇక్కడ లిక్విడిటీ (వ్యాల్యూమ్) తక్కువగా ఉంటుంది. కనుక ఇన్వెస్టర్లు లిస్టింగ్ లాభాల ధోరణితో కాకుండా, దీర్ఘకాల దృక్పథంతో ఎస్ఎంఈ ఐపీవోల్లో పాల్గొనడం మంచిది.జాగ్రత్త అవసరం..ఇక ఎస్ఎంఈ ఐపీవోల్లో మరింత జాగ్రత్తగా మసలుకోవాలి. ఆరంభ స్థాయి, చిన్న కంపెనీలు కావడంతో వ్యాపారంలో అన్నీ రాణిస్తాయని చెప్పలే. పైగా ప్రమోటర్ల సమర్థత గురించి తెలుసుకోవడానికి సరిపడా సమాచారం లభించదు. ఎస్ఎంఈ విభాగంలో నాణ్యమైన, పేరున్న కంపెనీల ఐపీవోలకే పరిమితం కావడం ద్వారా రిస్్కను తగ్గించుకోవచ్చు. ఎస్ఎంఈ ఐపీవోల పట్ల తగినంత శ్రద్ధ తీసుకోవాలని సెబీ ఇప్పటికే ఇన్వెస్టర్లకు సూచించింది. ట్రాఫిక్సాల్ ఐటీఎస్ టెక్నాలజీస్ అనే ఎస్ఎంఈ రూ.45 కోట్లతో ఐపీవో ఇష్యూ చేపట్టగా 345 రెట్ల స్పందన వచ్చింది, అయితే ఈ సంస్థ వెల్లడించిన సమాచారంలో లోపాలపై ఓ ఇన్వెస్టర్ చేసిన ఫిర్యాదు మేరకు, సెబీ జోక్యం చేసుకుని లిస్టింగ్ను నిలిపివేయించింది. సదరు కంపెనీ ఐపీవో పత్రాలపై సెబీ దర్యాప్తు చేస్తోంది. మెయిన్బోర్డ్ ఐపీవోకు సెబీ అనుమతి మంజూరు చేస్తుంది. ఎస్ఎంఈలకు అయితే బీఎస్ఈ లేదా ఎన్ఎస్ఈ ఆమోదం ఉంటే సరిపోతుంది. రుణంతో దరఖాస్తు... పేరున్న, వృద్ధికి పుష్కల అవకాశాలున్న కంపెనీ ఐపీవోకు వచ్చింది. దరఖాస్తుకు సరిపడా నిధుల్లేవు. అప్పుడు ఐపీవో ఫండింగ్ (రుణం రూపంలో నిధులు సమకూర్చుకోవడం) ఉపయోగపడుతుంది. కేవలం ఒక లాట్కు పరిమితం కాకుండా, పెద్ద మొత్తంలో దరఖాస్తు చేసుకునేందుకు ఐపీవో ఫండింగ్ సాయపడుతుంది. ఒక్కో పాన్పై గరిష్టంగా రూ.కోటి వరకు ఫండింగ్ తీసుకోవచ్చు. కొన్ని సంస్థలు కనీసం రూ.25 లక్షల పరిమితిని అమలు చేస్తున్నాయి. సాధారణంగా రూ.10లక్షలకు మించిన కేటగిరీలో పాల్గొనే హెచ్ఎన్ఐలు ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటుంటారు. రుణ కాలవ్యవధి 6 రోజులుగా ఉంటుంది. 20–30 శాతం వరకు వడ్డీ పడుతుంది. ఫండింగ్ కోసం రుణం ఇచ్చే సంస్థ వద్ద ఖాతా తెరవాలి. అలాగే ఆ సంస్థతో భాగస్వామ్యం కలిగిన బ్రోకరేజీ వద్ద డీమ్యాట్ ఖాతా తెరవాల్సి ఉంటుంది. తనవంతు మార్జిన్ను ఇన్వెస్టర్ సమకూర్చుకోవాలి. అప్పుడు మిగిలిన మొత్తాన్ని ఇన్వెస్టర్ ఖాతాకు ఎన్బీఎఫ్సీ బదిలీ చేస్తుంది. ఒప్పందం ప్రకారం కేటాయించిన షేర్లపై ఎన్బీఎఫ్సీకి నియంత్రణ ఉంటుంది. లిస్టింగ్ రోజే విక్రయించాల్సి ఉంటుంది. కేటాయించిన ధర కంటే తక్కువకు లిస్ట్ అయితే, మిగిలిన మేర ఇన్వెస్టర్ చెల్లించాలి. లాభం వస్తే, ఎన్బీఎఫ్సీ వడ్డీ, ఇతర చార్జీలు చెల్లించి మిగిలిన మొత్తాన్ని ఇన్వెస్టర్ వెనక్కి తీసుకోవచ్చు.నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల విభాగం (ఎన్ఐఐ) అధిక నెట్వర్త్ కలిగిన ఇన్వెస్టర్లు ఈ విభాగంలోనే బిడ్లు వేస్తుంటారు. ఇందులో రూ.2–10 లక్షల బిడ్లను స్మాల్ హెచ్ఎన్ఐ కేటగిరీగా, రూ.10 లక్షలకు మించి బిగ్ హెచ్ఎన్ఐ విభాగంగా పరిగణిస్తుంటారు. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్కు రూ.2–10 లక్షల విభాగంలో విలువ ప్రకారం చూస్తే 32 రెట్లు అధికంగా బిడ్లు వచ్చాయి. రూ.10 లక్షలకు పైన కేటగిరీలో 50 రెట్ల బిడ్లు దాఖలయ్యాయి. బిడ్ల విలువతో సంబంధం లేకుండా ప్రతి దరఖాస్తును సమానంగా పరిగణించి, అధిక సబ్ర్స్కిప్షన్ వచి్చనప్పుడు లాటరీ ఆధారంగా కేటాయింపులు చేస్తారు. ఇనిస్టిట్యూషన్స్ మినహా వ్యక్తులు ఎవరైనా ఈ విభాగంలో బిడ్లు వేసుకోవచ్చు. తద్వారా కేటాయింపుల అవకాశాలను పెంచుకోవచ్చు. ఒక అధ్యయనం ప్రకారం స్మాల్ హెచ్ఎన్ఐ విభాగంలో 3.6 శాతం, బిగ్ హెచ్ఎన్ఐ విభాగంలో 12 శాతం మేర షేర్లను పొందే అవకాశాలు ఉంటాయి. అందుకే ఎన్ని రెట్లు అధికంగా బిడ్లు వచ్చాయనే దానికంటే మొత్తం దరఖాస్తులు ఎన్ననేది చూడడం ద్వారా కేటాయింపు అవకాశాలను తెలుసుకోవచ్చు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
స్విగ్గీ ఐపీవో ‘డెలివరీ’ ఓకే
న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ, క్విక్కామర్స్ దిగ్గజం స్విగ్గీ పబ్లిక్ ఇష్యూకి మెరుగైన స్పందన లభించింది. చివరి రోజు శుక్రవారానికల్లా 3.6 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. కంపెనీ 16.01 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా.. 57.53 కోట్ల షేర్ల కోసం దరఖాస్తులు అందాయి. క్విబ్ విభాగంలో 6 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 0.41 రెట్లు చొప్పున బిడ్స్ లభించాయి. అయితే రిటైల్ ఇన్వెస్టర్లు 1.14 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. రూ. 371–390 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 11,327 కోట్లు సమకూర్చుకుంది. మంగళవారం (5న) యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 5,085 కోట్లు సమీకరించిన విషయం విదితమే. రూ. 95,000 కోట్ల విలువలో కంపెనీ ఐపీవోకు రావడం గమనార్హం! ఆక్మే సోలార్... 2.75 రెట్లు స్పందన పునరుత్పాదక ఇంధన రంగ కంపెనీ ఏసీఎంఈ (ఆక్మే) సోలార్ పబ్లిక్ ఇష్యూకి బాగానే ఆదరణ దక్కింది. చివరి రోజు శుక్రవారానికల్లా 2.75 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి. కంపెనీ 5.82 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా.. 16 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. క్విబ్ విభాగంలో 3.54 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 0.97 రెట్లు చొప్పున బిడ్స్ నమోదయ్యాయి. అయితే రిటైల్ ఇన్వెస్టర్లు 3.1 రెట్లు అధికంగా దరఖాస్తు చేయడం గమనార్హం! రూ. 275–289 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా రూ. 2,900 కోట్లు సమకూర్చుకుంది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.1,300 కోట్లు లభించాయి. -
నేటి నుంచి స్విగ్గీ ఐపీవో
న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ, క్విక్కామర్స్ దిగ్గజం స్విగ్గీ పబ్లిక్ ఇష్యూ నేడు(6న) ప్రారంభం కానుంది. ఒక్కో షేరుకి రూ. 371–390 ఆఫర్ ధరలో వస్తున్న ఇష్యూ శుక్రవారం(8న) ముగియనుంది. ఐపీవోలో భాగంగా రూ. 4,499 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 6,828 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్, ప్రస్తుత వాటాదారులు విక్రయించనున్నారు. తద్వారా రూ. 11,327 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. వెరసి 11.3 బిలియన్ డాలర్ల(రూ. 95,000 కోట్లు) విలువను ఆశిస్తోంది. ఇప్పటికే (2021 జూలై) లిస్టయిన ప్రత్యర్ధి కంపెనీ జొమాటో విలువ ప్రస్తుతం రూ. 2.13 లక్షల కోట్లకు చేరింది.నిధుల వినియోగమిలా...2014లో ఏర్పాటైన స్విగ్గీ 2024 జూన్తో ముగిసిన త్రైమాసికంలో రూ. 611 కోట్ల నష్టం ప్రకటించింది. ఈక్విటీ జారీ నిధులను టెక్నాలజీ, క్లౌడ్ ఇన్ఫ్రా, బ్రాండ్ మార్కెటింగ్, రుణ చెల్లింపులు, ఇతర సంస్థల కొనుగోళ్లు తదితరాలకు వినియోగించనుంది.ఆఫర్ ధర: రూ. 371–390 సమీకరణ: రూ. 11,327 కోట్లురిటైలర్లకు కనీస లాట్: 38 షేర్లు ఆఫర్ ముగింపు: శుక్రవారం (8న)షేర్ల అలాట్మెంట్: 11న లిస్టింగ్: 13న -
ఐపీఓకు సిద్ధమవుతున్న కంపెనీలివే..
రెనెవబుల్ ఎనర్జీ కంపెనీ ఏసీఎంఈ (ఆక్మే) సోలార్ హోల్డింగ్స్ పబ్లిక్ ఇష్యూ రేపు(6న) ప్రారంభంకానుంది. 8న ముగియనున్న ఇష్యూకి రూ.275–289 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూలో భాగంగా రూ.2,395 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ.505 కోట్ల విలువైన షేర్లను ఆక్మే క్లీన్టెక్ సొల్యూషన్స్ విక్రయానికి ఉంచనుంది. వెరసి ఐపీవో ద్వారా రూ.2,900 కోట్లు సమీకరించనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు నేడు(5న) షేర్లను కేటాయించనుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ.1,795 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది. సోలార్ పవర్ ప్రాజెక్టుల కంపెనీ సమీకృత పునరుత్పాదక ఇంధన సంస్థగా ఆవిర్భవించింది. 2024 జూన్కల్లా నిర్వహణలోని 28 ప్రాజెక్టులను కలిగి ఉంది. వీటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్తాన్లలోనే 18 ప్రాజెక్టులున్నాయి. ప్రస్తుత సామర్థ్యం 1,320 మెగావాట్లుకాగా.. 1,650 మెగావాట్లు నిర్మాణంలో ఉన్నాయి. గతేడాది రూ. 1,319 కోట్ల ఆదాయం, రూ. 698 కోట్ల నికర లాభం సాధించింది.ధర శ్రేణి: రూ. 275–289రిటైల్ ఇన్వెస్టర్లకు కనీస లాట్: 51 షేర్లు లిస్టింగ్: 13ననివా బూపాఆరోగ్య బీమా రంగ కంపెనీ నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ పబ్లిక్ ఇష్యూ గురువారం(7న) ప్రారంభంకానుంది. 11న ముగియనున్న ఇష్యూకి రూ.70–74 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూలో భాగంగా రూ.800 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ.1,400 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఐపీవో ద్వారా రూ.2,200 కోట్లు సమీకరించనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు రేపు(6న) షేర్లను కేటాయించనుంది. కంపెనీ ప్రమోటర్లలో 62.19 శాతం వాటాగల బూపా సింగపూర్ హోల్డింగ్స్ రూ.350 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనుంది. 26.8 శాతం వాటా కలిగిన ఫెటల్ టోన్ ఎల్ఎల్పీ రూ.1,050 కోట్ల విలువైన వాటాను విక్రయించనుంది. ఈక్విటీ జారీ నిధులను మూలధన పటిష్టతకు వినియోగించనుంది. దేశీ మార్కెట్లో స్టార్ హెల్త్ తదుపరి స్టాండెలోన్ కంపెనీగా లిస్ట్కానుంది. గతేడాది మొత్తం ప్రీమియం ఆదాయం 38 శాతం జంప్చేసి రూ.5,608 కోట్లకు చేరింది. రూ.82 కోట్ల నికర లాభం ఆర్జించింది.ధర శ్రేణి: రూ. 70–74 రిటైల్ ఇన్వెస్టర్లకు కనీస లాట్: 200 షేర్లు లిస్టింగ్: 14నఇదీ చదవండి: బేర్ ఎటాక్..!కార్దేఖోఆటో క్లాసిఫైడ్స్ పోర్టల్ కార్దేఖో పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. సంస్థ సహవ్యవస్థాపకుడు అమిత్ జైన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లను నియమించేందుకు చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీవో ద్వారా రూ.4,000 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. దీంతో 2021 ఆగస్ట్లో వెలువడిన కార్ట్రేడ్ టెక్ లిమిటెడ్ ఐపీవో తదుపరి రెండో ఆటో క్లాసిఫైడ్ లిస్టెడ్ సంస్థగా కార్దేఖో నిలవనుంది. -
వర్చువల్ గలాక్సీ ఐపీవో బాట
న్యూఢిల్లీ: బీఎఫ్ఎస్ఐపై ప్రత్యేక దృష్టిపెట్టిన సాస్(ఎస్ఏఏఎస్) సేవల సంస్థ వర్చువల్ గలాక్సీ ఇన్ఫోటెక్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు వీలుగా స్టాక్ ఎక్స్చేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ ఎమర్జ్కు ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది.ఐపీవోలో భాగంగా 66 లక్షల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. నిధుల్లో రూ. 34 కోట్లు అదనపు అభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు, రూ. 19 కోట్లు ప్రస్తుత ప్రొడక్టుల ఆధునీకరణ, విస్తరణ తదితరాలకు వినియోగించనుంది. మరో రూ. 14 కోట్లు బిజినెస్ డెవలప్మెంట్, మార్కెటింగ్ కార్యకలాపాలపై వెచ్చించనుంది.ఇదీ చదవండి: ఎన్ఎస్ఈ కొత్త యాప్.. తెలుగులోనూ వెబ్సైట్కాగా.. జులైలో ప్రీఐపీవో నిధుల సమీకరణలో భాగంగా సుప్రసిద్ధ ఇన్వెస్టర్ల నుంచి రూ. 21.44 కోట్లు సమకూర్చుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి ఆరు నెలల్లో(ఏప్రిల్–సెప్టెంబర్) రూ. 72 కోట్ల ఆదాయం, రూ. 19 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
నవంబర్ 6న స్విగ్గీ ఐపీవో!
న్యూఢిల్లీ: నిత్యావసరాలు, ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ప్రతిపాదిత రూ. 11,300 కోట్ల పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) నవంబర్ 6న ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇందుకోసం ధరల శ్రేణి ఒక్కో షేరుకు రూ. 371 నుంచి 390 వరకు ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇష్యూ నవంబర్ 8న ముగుస్తుందని, యాంకర్ ఇన్వెస్టర్లకు బిడ్డింగ్ తేదీ నవంబర్ 5గా ఉంటుందని వివరించాయి.ఐపీవో కింద రూ. 4,500 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో రూ. 6,800 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనున్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. ప్రారంభ దశలో ఇన్వెస్ట్ చేసిన యాక్సెల్, ఎలివేషన్ క్యాపిటల్, నార్త్వెస్ట్ వెంచర్స్ వాటాలను విక్రయించడం ద్వారా తమ పెట్టుబడులపై 35 రెట్లు రాబడులు పొందనున్నట్లు తెలిపాయి.తాజా ఇష్యూ ద్వారా సేకరించిన నిధుల్లో రూ. 137 కోట్ల మొత్తాన్ని అనుబంధ సంస్థ స్కూట్నీ రుణాలను తీర్చేందుకు, రూ. 982 కోట్లను క్విక్ కామర్స్ సెగ్మెంట్లో డార్క్ స్టోర్ నెట్వర్క్ విస్తరణకు కంపెనీ వినియోగించనుంది. 2014లో ఏర్పాటైన స్విగ్గీ వేల్యుయేషన్ ఈ ఏడాది ఏప్రిల్లో 13 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2023 మార్చి 31 నాటికి వార్షికాదాయం 1.09 బిలియన్ డాలర్లుగా నమోదైంది. -
నిరాశ మిగిల్చిన హ్యుందాయ్ మోటార్స్ ఐపీఓ!
హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ఐపీఓ మంగళవారం స్టాక్మార్కెట్లో లిస్ట్ అయింది. కొంతకాలంగా మదుపర్లు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ఈ ఐపీఓ 1.5 శాతం డిస్కౌంట్తో మార్కెట్లోకి ప్రవేశించింది. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ అనుబంధ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్(హెచ్ఎంఐఎల్) రూ.27,870 కోట్లు సమీకరించేందుకు ఐపీఓ బాట పట్టింది. ఈ ఐపీఓ సబ్స్క్రిప్షన్ అక్టోబర్ 17తో ముగిసింది.ఐపీఓ సబ్స్క్రిప్షన్ కోసం హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.1865-1960గా నిర్ణయించింది. కానీ 1.5 శాతం డిస్కౌంట్తో రూ.1931కు స్టాక్ మార్కెట్లో లిస్టవ్వడం గమనార్హం. ఈ ఐపీఓకు సంబంధించి భారీగా లిస్టింగ్ గెయిన్స్ వస్తాయని ముందుగా భావించారు. కానీ అందుకు భిన్నంగా స్టాక్ ఒక శాతం డిస్కౌంట్లో లిస్ట్ కావడంతో మదుపర్లు కొంత నిరాశ చెందుతున్నట్లు తెలిసింది.ఇదీ చదవండి: ఇంటి రుణం త్వరగా తీర్చండిలా..గతంలో లైప్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ఐపీఓకు వచ్చిన సమయంలో అత్యధికంగా రూ.21 వేలకోట్లు సమీకరించింది. ఇవ్వాళ లిస్టయిన హ్యుందాయ్ మోటార్స్ లిమిటెడ్ ఏకంగా రూ.27,870 కోట్ల సమీకరించాలనే లక్ష్యంతో మార్కెట్లో లిస్టయ్యింది. ఇదిలాఉండగా, కేవలం లిస్టింగ్ లాభాల కోసమే ఐపీఓకు దరఖాస్తు చేసుకునే వారికి ఇది కొంత నిరాశ కలిగిస్తుంది. కంపెనీ బిజినెస్పై అవగాహన ఏర్పరుచుకుని, యాజమాన్యం ఎలాంటి భవిష్యత్తు కార్యాచరణతో ఉందనే అంశాలను పరిగణించి ఐపీఓకు దరఖాస్తు చేస్తే మేలని నిపుణులు సూచిస్తున్నారు. లిస్టింగ్ సమయంలో కొన్ని కారణాల వల్ల లాభాలు రాకపోయినా దీర్ఘకాలంలో మంది రాబడులు సంపాదించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. -
ఐపీఓతో రూ.4,000 కోట్లు సమీకరణ
కమ్యునిషన్ పరికరాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వంటి వ్యక్తిగత రక్షణ ఉత్పత్తులను తయారు చేస్తున్న ఎస్పీపీ లిమిటెడ్ సంస్థ ఐపీఓతో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వనుంది. సంస్థ వ్యాపారంపై ఆసక్తి ఉన్న పెట్టుబడిదారుల నుంచి రూ.4,000 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఈమేరకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ)కు డీఆర్హెచ్పీ దాఖలు చేసింది.ఇదీ చదవండి: గూగుల్లో 15 జీబీ స్టోరేజ్ నిండిందా? ఇలా చేయండి..ఈ ఆఫర్లో భాగంగా రూ.580 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, సెల్లింగ్ షేర్హోల్డర్లు రూ.3,420 కోట్ల వరకు విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో విక్రయించనున్నారు. డీఆర్హెచ్పీ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎస్ఎంపీపీ లిమిటెడ్ షేర్లు బీఎస్ఈ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఈ)లో లిస్ట్ అవుతాయి. అయితే ఐపీఓ కోసం ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి.. చివరి తేదీ ఎప్పుడు.. లిస్టింగ్ ప్రైస్, లాట్ సైజ్.. వంటి పూర్తి వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది. -
ఎన్ఎస్డీఎల్, స్టాండర్డ్ గ్లాస్, జింకా లాజిస్టిక్స్.. ఐపీవోకు రెడీ
న్యూఢిల్లీ: డిపాజిటరీ సేవల దిగ్గజం నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్(ఎన్ఎస్డీఎల్) పబ్లిక్ ఇష్యూకి లైన్ క్లియర్ అయ్యింది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ బాటలో స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ, జింకా లాజిస్టిక్స్ సొల్యూషన్స్ సైతం సెబీ నుంచి లిస్టింగ్కు అనుమతులు పొందాయి. వివరాలు చూద్దాం..ఎన్ఎస్డీఎల్ ఐపీవో చేపట్టేందుకు వీలుగా ఎన్ఎస్డీఎల్ 2023 జులైలో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. అయితే 14 నెలల తదుపరి అనుమతులు సాధించడం గమనార్హం! ప్రాస్పెక్టస్ ప్రకారం ఐపీవోలో 5.72 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ, బ్యాంకింగ్ దిగ్గజాలు ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్సహా కంపెనీలో వాటాదారు సంస్థలు షేర్లను ఆఫర్ చేయనున్నాయి. ప్రధానంగా ఐడీబీఐ బ్యాంక్ 2.22 కోట్ల షేర్లు, ఎన్ఎస్ఈ 1.8 కోట్ల షేర్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 56.25 లక్షల షేర్లు, స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా 40 లక్షల షేర్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 40 లక్షల షేర్లు చొప్పున విక్రయానికి ఉంచనున్నాయి. వెరసి ఐపీవో ద్వారా ఎన్ఎస్డీఎల్కు ఎలాంటి నిధులు అందబోవు! ఇదీ బ్యాక్గ్రౌండ్ సెబీ వద్ద రిజిస్టరైన్ ఎన్ఎస్డీఎల్ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసులందించే కంపెనీ. దేశీయంగా ఫైనాన్షియల్, సెక్యూరిటీస్ మార్కెట్లో వివిధ సర్వీసులు, ప్రొడక్టులను ఆఫర్ చేస్తోంది. 1996లో ప్రవేశపెట్టిన డిపాజిటరీల చట్టం ప్రకారం అదే ఏడాది నవంబర్లో సెక్యూరిటీల డీమ్యాట్ సేవలకు తెరతీసింది. కాగా.. డిపాజిటరీ సేవలందించే మరో కంపెనీ సెంట్రల్ డిపాజిటరీ సరీ్వసెస్(సీడీఎస్ఎల్) 2017లో ఎన్ఎస్ఈలో లిస్టయ్యింది. దీంతో పబ్లిక్గా ట్రేడయ్యే రెండో డిపాజిటరీగా ఎన్ఎస్డీఎల్ నిలవనుంది. జింకా లాజిస్టిక్స్ వస్తు రవాణా రంగ కంపెనీ జింకా లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ఈ ఏడాది(2024) జులైలో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 550 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 2.16 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను అమ్మకాలు, మార్కెటింగ్ వ్యయాలకు, భవిష్యత్ అవసరాలరీత్యా బ్లాక్బక్ ఫిన్సర్వ్ మూలధన పటిష్టతకు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.చదవండి: హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాలు డౌన్.. కారణం ఏంటో తెలుసా? స్టాండర్డ్ గ్లాస్ హైదరాబాద్ కంపెనీ స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ ఈ ఏడాది(2024) జులైలో సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 250 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 350 కోట్ల విలువైన 1.84 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా కంపెనీ రూ. 600 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. కంపెనీ ప్రధానంగా ఫార్మాస్యూటికల్, కెమికల్ రంగాలలో వినియోగించే స్పెషలైజ్డ్ ఇంజినీరింగ్ పరికరాల తయారు చేస్తోంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, ఇతర సంస్థల కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. -
ఐపీవోల సందడే సందడి
సెకండరీ మార్కెట్లను మించుతూ ప్రైమరీ మార్కెట్ సైతం సరికొత్త రికార్డులవైపు పరుగు తీస్తోంది. జనవరి నుంచి ఇప్పటికే 62 కంపెనీలు ఐపీవోలకురాగా.. తాజాగా ఒకే రోజు 13 కంపెనీలు సెబీని ఆశ్రయించాయి. వివరాలు చూద్దాం.. – సాక్షి, బిజినెస్డెస్క్రిటైల్ ఇన్వెస్టర్ల దన్ను, సెకండరీ మార్కెట్ల జోష్ పలు అన్లిస్టెడ్ కంపెనీలకు ప్రోత్సాహాన్నిస్తోంది. దీంతో నిధుల సమీకరణతోపాటు.. స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్కు క్యూ కడుతున్నాయి. వెరసి తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ఒకే రోజు 13 కంపెనీలు ముసాయిదా ప్రాస్పెక్టస్లను దాఖలు చేశాయి. ఈ జాబితాలో విక్రమ్ సోలార్, ఆదిత్య ఇన్ఫోటెక్, వరిండెరా కన్స్ట్రక్షన్స్ తదితరాలు చేరాయి. ఇవన్నీ కలసి ఉమ్మడిగా రూ. 8,000 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉన్నాయి. ఈ ఏడాది(2024) ఇప్పటివరకూ 62 కంపెనీలు రూ. 64,000 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. గతేడాది(2023) మొత్తంగా 57 కంపెనీలు ఉమ్మడిగా సమీకరించిన రూ. 49,436 కోట్లతో పోలిస్తే ఇది 29% అధికం! జాబితా ఇలా తాజాగా సెబీకి ప్రాథమిక పత్రాలు దాఖలు చేసిన కంపెనీల జాబితాలో విక్రమ్ సోలార్, ఆదిత్య ఇన్ఫోటెక్, వరిండెరా కన్స్ట్రక్షన్స్, అజాక్స్ ఇంజినీరింగ్, రహీ ఇన్ఫ్రాటెక్, విక్రన్ ఇంజినీరింగ్, మిడ్వెస్ట్, వినే కార్పొరేషన్, సంభవ్ స్టీల్ ట్యూబ్స్, జారో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్, అల్ టైమ్ ప్లాస్టిక్స్ లిమిటెడ్, స్కోడా ట్యూబ్స్, దేవ్ యాక్సిలరేటర్ చోటు చేసుకున్నాయి. ఈ సంస్థలన్నీ కలసి రూ. 8,000 కోట్లవరకూ సమీకరించనున్నట్లు అంచనా. విస్తరణ ప్రణాళికలు, రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్, ప్రస్తుత వాటాదారుల వాటా విక్రయం తదితర లక్ష్యాలతో కంపెనీలు ఐపీవో బాట పడుతున్నట్లు నిపుణులు వివరించారు. సమీకరణ తీరిదీ ఐపీవోలో భాగంగా సోలార్ మాడ్యూల్ తయారీ కంపెనీ విక్రమ్ సోలార్ రూ. 1,500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.74 కోట్ల షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. ఆదిత్య ఇన్ఫోటెక్ రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని జారీ చేయడంతోపాటు.. రూ. 800 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయించనున్నారు. ఇక వరిండెరా రూ. 900 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుండగా.. ప్రమోటర్లు రూ. 300 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈ బాటలో ఈపీసీ సంస్థ విక్రన్ ఇంజినీరింగ్ రూ. 900 కోట్ల విలువైన ఈక్విటీ జారీసహా.. రూ. 100 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ ఆఫర్ చేయనున్నారు. కారణాలున్నాయ్ ప్రైమరీ మార్కెట్ల జోరుకు పలు సానుకూల అంశాలు దోహదం చేస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. స్థూల ఆర్థిక పరిస్థితులు, రంగాలవారీగా అనుకూలతలు, నిధుల లభ్యత, రిటైల్సహా సంస్థాగత ఇన్వెస్టర్ల ఆసక్తి తదితరాలను ప్రస్తావించారు. దేశీ మ్యూచువల్ ఫండ్స్లోకి భారీగా పెట్టుబడులు ప్రవహిస్తుండటం, యూఎస్లో వడ్డీ రేట్ల కోత సైతం ఇందుకు తోడ్పాటునిస్తున్నట్లు ఈక్విరస్ ఎండీ మునీష్ అగర్వాల్ తెలియజేశారు. కోవిడ్–19, సబ్ప్రైమ్ సంక్షోభం, 2011 సెపె్టంబర్ ఉగ్రదాడి తదితర అనూహ్య విపరిణామాలు సంభవిస్తే తప్ప మార్కెట్లు పతనంకాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. దీంతో 2025లో మార్కెట్ సరికొత్త రికార్డులను నెలకొల్పడంతోపాటు.. మరిన్ని కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యే వీలున్నట్లు తెలియజేశారు. -
బాహు‘బుల్’ ఐపీఓలొస్తున్నాయ్!
ఇప్పటిదాకా వచ్చినవి ఒక రేంజ్.. ఇకపై వచ్చేవి వేరే లెవెల్! అడుగుపెడితే మార్కెట్ రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోవాల్సిందే!! ఇప్పటికే సెపె్టంబర్లో ఇన్వెస్టర్లు ఐపీఓల వర్షంలో ముద్దవుతుండగా.. రాబోయే రెండు నెలల్లో బాహుబలి ఆఫర్లు మార్కెట్ను ముంచెత్తనున్నాయి. దేశంలో రెండో బడా కార్ల కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా అతిపెద్ద ఇష్యూగా రికార్డు బ్రేక్ చేయనుంది. ఇక ఫుడ్–గ్రాసరీ డెలివరీ దిగ్గజం స్విగ్గీ రెండో మెగా స్టార్టప్ ఆఫర్గా నిలవనుంది. ఈ రెండింటికీ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక మెగా ఐపీఓల జాతరకు రంగం సిద్ధమైంది. దక్షిణకొరియా కార్ల దిగ్గజం హ్యుందాయ్ ఐపీఓకు సెబీ తాజాగా ఆమోదం తెలపడంతో పబ్లిక్ ఆఫర్ల (ఐపీఓ) చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ కనీసం 3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.25,000 కోట్లు) సమీకరించనుంది. హ్యుందాయ్ ఇండియా మాతృ సంస్థ (ప్రమోటర్) హ్యుందాయ్ మోటార్ కంపెనీ ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో కొంత వాటాను, అంటే 14.22 కోట్ల షేర్లను విక్రయిచనుంది. తాజా ఈక్విటీ షేర్లు ఏవీ జారీ చేయడం లేదు. ఈ ఇష్యూ పూర్తయితే ఎల్ఐసీ రికార్డును బద్దలవుతుంది. 2022లో ఎల్ఐసీ ఐపీఓ ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.21,000 కోట్లను సమీకరించింది. ఇప్పటిదాకా ఇదే దలాల్ స్ట్రీట్లో అతిపెద్ద పబ్లిక్ ఆఫర్.రెండు దశాబ్దాల తర్వాత... దేశీ వాహన పరిశ్రమలో ఇదో సరికొత్త మైలురాయిగా నిలవనుంది. 2003లో జపాన్ వాహన దిగ్గజం మారుతీ సుజుకీ లిస్టింగ్ అయిన రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ దేశీయంగా ఒక కార్ల కంపెనీ ఐపీఓకు వస్తుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. అమ్మకాల పరంగా దేశంలో రెండో అతిపెద్ద కార్ల కంపెనీగా నిలుస్తున్న హ్యుందాయ్ ఇండియా మార్కెట్ క్యాప్ (విలువ) 18–20 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. ప్రస్తుతం మారుతీ మార్కెట్ విలువ దాదాపు 48 బిలియన్ డాలర్లు. కాగా, అక్టోబర్లో హ్యుందాయ్ ఐపీఓ వస్తుందని సమాచారం. 1996లో భారత్లోకి అడుగుపెట్టిన హ్యుందాయ్.. వివిధ కార్ల విభాగాల్లో 13 మోడల్స్ విక్రయిస్తోంది. గత నెలలో ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఐపీఓ ద్వారా రూ.6,145 కోట్ల సమీకరించడంతో పాటు బంపర్ లిస్టింగ్ నేపథ్యంలో హ్యుందాయ్ మెగా ఇష్యూపై ఇన్వెస్టర్లు గురిపెడుతున్నారు. స్విగ్గీ డెలివరీ రెడీ...ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీకి కూడా సెబీ నుంచి ప్రాథమిక ఆమోదం లభించింది. సెబీ కొన్ని మార్పుచేర్పులు సూచించడంతో తుది డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్ను కంపెనీ త్వరలో దాఖలు చేయనుంది. ఏప్రిల్లో వాటాదారుల ఆమోదం ప్రకారం ఈ మెగా ఇష్యూ ద్వారా రూ.10,414 కోట్లను స్విగ్గీ సమీకరించనుంది. ఇందులో రూ.3,750 కోట్లను తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా కంపెనీ సమీకరించనుంది. మిగతా మొత్తాన్ని ప్రస్తుత ఇన్వెస్టర్లు కొంత వాటాను విక్రయించి సొమ్ము చేసుకోనున్నారు. తుది ఆమోదం మేరకు ఇష్యూ సైజు 1.4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.11,700 కోట్లు) ఉండొచ్చని అంచనా. 2014లో ఆరంభమైన స్విగ్గీ ప్రస్తు తం ఫుడ్ డెలివరీతో పాటు క్విక్ కామర్స్ (ఇన్స్టామార్ట్), హైపర్ లోకల్ లాజిస్టిక్స్ విభాగాల్లో దూసుకుపోతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి కంపెనీ మార్కెట్ వేల్యుయేషన్ 13 బిలియన్ డాలర్లుగా అంచనా. 2022–23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 1.09 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించింది. 4,700 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాగా, జొమాటో 2021లో బంపర్ లిస్టింగ్తో బోణీ చేసింది. రూ.9,375 కోట్లు సమీకరించింది. రూ.76 ఇష్యూ ధర కాగా, 60% ప్రీమియంతో రూ.115 వద్ద లిస్టయింది. రెండేళ్లలో జొమాటో షేరు రూ.46 కనిష్ట స్థాయి నుంచి 520 శాతం (ప్రస్తుత ధర 286) ఎగబాకడం విశేషం. కాగా, స్విగ్గీ ఐపీఓ నవంబర్లో ఉండొచ్చనేది మార్కెట్ వర్గాల సమాచారం.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
14 ఏళ్లలో సెప్టెంబర్ బిజీ..బిజీ
పద్నాలుగేళ్ల తర్వాత ఈ నెల(సెప్టెంబర్) సరికొత్త రికార్డుకు వేదిక కానుంది. రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) వివరాల ప్రకారం సెప్టెంబర్లో ఇప్పటివరకూ 28 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. మెయిన్ బోర్డ్, ఎస్ఎంఈలు కలిపి ఇప్పటికే 28 కంపెనీలు లిస్టింగ్కు తెరతీశాయి.ఫైనాన్షియల్ మార్కెట్లు వృద్ధిలో ఉన్నట్లు ఆర్థిక వ్యవస్థపై రూపొందించిన సెప్టెంబర్ బులెటిన్లో ఆర్బీఐ పేర్కొంది. ప్రైమరీ ఈక్విటీ మార్కెట్లో చిన్న, మధ్యతరహా సంస్థలు(ఎస్ఎంఈలు)సహా భారీ సందడి నెలకొన్నట్లు తెలియజేసింది. వెరసి 14 ఏళ్ల తరువాత ఈ సెప్టెంబర్ అత్యంత రద్దీగా మారినట్లు వ్యాఖ్యానించింది. దేశీ మ్యూచువల్ ఫండ్స్ తదితర ఇన్వెస్టర్ల ద్వారా ఇష్యూలు భారీస్థాయిలో సబ్స్క్రైబ్ అవుతున్నట్లు వివరించింది. ఇదీ చదవండి: నూనెల ధర ఎందుకు పెరిగింది?క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పరిశీలన ప్రకారం ఐపీవోల్లో లభించిన షేర్లలో 54 శాతాన్ని ఇన్వెస్టర్లు లిస్టయిన వారం రోజుల్లోనే విక్రయించారు. 2024లో ఐపీవోల ద్వారా నిధుల సమీకరణ జోరు చూపుతున్నట్లు ఆర్బీఐ నివేదిక పేర్కొంది. ఈ బాటలో తొలి అర్ధభాగానికల్లా ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఐపీవోలు వెలువడిన దేశంగా భారత్ నిలిచినట్లు తెలియజేసింది. ఇందుకు ఎస్ఎంఈలు ప్రధానంగా దోహదపడినట్లు వెల్లడించింది. -
ఐపీవోల హవా
రోజుకో కొత్త గరిష్టాన్ని తాకుతున్న సెకండరీ మార్కెట్ల బాటలో ప్రైమరీ మార్కెట్లు సైతం భారీ సంఖ్యలో ఇష్యూలతో కదం తొక్కుతున్నాయి. తాజాగా రెండు కంపెనీలకు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. మరో రెండు కంపెనీలు ఐపీవో సన్నాహాల్లో ఉన్నాయి. వివరాలు ఇలా.. –సాక్షి, బిజినెస్డెస్క్ఐపీవో చేపట్టేందుకు సోలార్ ప్యానళ్ల తయారీ కంపెనీ వారీ ఇంజినీర్స్.. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతి పొందింది. ఇదేవిధంగా డిజిటల్ పేమెంట్ల సంస్థ వన్ మొబిక్విక్ సిస్టమ్స్ పబ్లిక్ ఇష్యూకి సైతం సెబీ ఆమోదముద్ర వేసింది. వారీ సెబీకి 2023 డిసెంబర్లో, మొబిక్విక్ 2024 జనవరిలో దరఖాస్తు చేశాయి. వారీ ఇంజినీర్స్.. రూ. 3,000 కోట్లకుపైగా వారీ ఇంజినీర్స్ ఐపీవోలో భాగంగా రూ. 3,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా 32 లక్షల షేర్లను ప్రమోటర్తోపాటు ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను ఒడిషాలో 6 గిగావాట్ల ఇన్గాట్ వేఫర్, సోలార్ సెల్, సోలార్ పీవీ మాడ్యూల్ తయారీ ప్లాంటు ఏర్పాటుకు వెచి్చంచనుంది. మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ 2023 జూన్కల్లా 12 గిగావాట్ల పీవీ మాడ్యూల్ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. మొబిక్విక్.. రూ. 700 కోట్లు తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా మొబిక్విక్ రూ. 700 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. తద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్కు సై అంటోంది. ఐపీవో నిధుల్లో రూ. 250 కోట్లు ఫైనాన్షియల్ సర్వీసుల బిజినెస్ వృద్ధికి వినియోగించనుంది. రూ. 135 కోట్లు పేమెంట్ సరీ్వసుల బిజినెస్కు దన్నుగా వెచ్చించనుంది. మరో రూ. 135 కోట్లు డేటా, మెషీన్ లెర్నింగ్, ఏఐ, ప్రొడక్ట్ టెక్నాలజీలపై ఇన్వెస్ట్ చేయనుంది. ఈ బాటలో పేమెంట్ పరికరాలపై రూ. 70 కోట్లు పెట్టుబడి వ్యయాలుగా కేటాయించనుంది. రూ. 10,000 కోట్లపై కన్ను విద్యుత్ రంగ పీఎస్యూ దిగ్గజం ఎన్టీపీసీ అనుబంధ కంపెనీ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ భారీ ఐపీవోకు సిద్ధపడుతోంది. ఇందుకు అనుగుణంగా గత వారమే సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. తద్వారా నవంబర్ తొలి వారంలో ఐపీవోకు వచ్చే వీలున్నట్లు తెలుస్తోంది. ప్రాస్పెక్టస్ ప్రకారం ఐపీవో ద్వారా రూ. 10,000 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. ముంబైసహా.. సింగపూర్ తదితర దేశాలలో రోడ్షోలకు ప్రణాళికలు వేసింది.ఇష్యూ నిధుల్లో రూ. 7,500 కోట్లు అనుబంధ సంస్థ ఎన్టీపీసీ రెనెవబుల్ ఎనర్జీ రుణ చెల్లింపులతోపాటు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. ఈ మహారత్న కంపెనీ 2024 ఆగస్ట్కల్లా 3,071 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులు, 100 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులను కలిగి ఉంది. ఈ ఏడాది ఇప్పటికే 60 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వచి్చన నేపథ్యంలోనూ మరిన్ని కంపెనీలు ఇందుకు తెరతీస్తుండటం విశేషం! ఇదే బాటలో లీలా ప్యాలెస్ లీలా ప్యాలెస్ హోటళ్ల నిర్వాహక సంస్థ ష్లాస్ బెంగళూరు లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. తద్వారా రూ. 5,000 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. వెరసి దేశీ ఆతిథ్య రంగంలో అతిపెద్ద ఐపీవోగా నిలవనుంది. కాగా.. ఇష్యూలో భాగంగా లీలా ప్యాలెస్ రూ. 3,000 కోట్ల తాజా ఈక్విటీని జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్ సంస్థ డీఐఎఫ్సీ రూ. 2,000 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనుంది. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థల రుణ చెల్లింపులకు, ఇతర సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు బ్రూక్ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ దన్నుగల ష్లాస్ బెంగళూరు వెల్లడించింది. 2024 మార్చికల్లా కంపెనీ రుణ భారం రూ. 4,053 కోట్లుగా నమోదైంది. ద లీలా బ్రాండ్తో కంపెనీ విలాసవంత హోటళ్లను నిర్వహిస్తున్న విషయం విదితమే. మొత్తం 3,382 గదులను కలిగి ఉంది.రూ. 1,100 కోట్ల సమీకరణరియల్టీ కంపెనీ కాసాగ్రాండ్ ప్రీమియర్ బిల్డర్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలకు తెరతీసింది. ఇందుకు వీలుగా సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. దీనిలో భాగంగా రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 100 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. వెరసి ఐపీవో ద్వారా రూ. 1,100 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఈక్విటీ జారీ నిధులను కంపెనీతోపాటు అనుబంధ సంస్థల రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కాసాగ్రాండ్ బ్రాండుతో కంపెనీ రియల్టీ అభివృద్ధి కార్యకలాపాలు చేపడుతోంది. 2023–24లో రూ. 2,614 కోట్ల ఆదాయం, రూ. 257 కోట్ల నికర లాభం ఆర్జించింది.14ఏళ్లలో సెప్టెంబర్ బిజీ..బిజీ ఐపీవోలకు 28 కంపెనీలు ఈ నెల(సెప్టెంబర్) 14 ఏళ్ల తదుపరి సరికొత్త రికార్డుకు వేదిక కానుంది. రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) వివరాల ప్రకారం సెపె్టంబర్లో ఇప్పటివరకూ 28 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. మెయిన్ బోర్డ్, ఎస్ఎంఈలు కలిపి ఇప్పటికే 28 కంపెనీలు లిస్టింగ్కు తెరతీశాయి. ఫైనాన్షియల్ మార్కెట్లు పరివర్తనలో ఉన్నట్లు ఆర్థిక వ్యవస్థపై రూపొందించిన సెపె్టంబర్ బులెటిన్లో ఆర్బీఐ పేర్కొంది. ప్రైమరీ ఈక్విటీ మార్కెట్లో చిన్న, మధ్యతరహా సంస్థలు(ఎస్ఎంఈలు)సహా భారీ సందడి నెలకొన్నట్లు తెలియజేసింది. వెరసి 14 ఏళ్ల తరువాత ఈ సెప్టెంబర్ అత్యంత రద్దీగా మారినట్లు వ్యాఖ్యానించింది. దేశీ మ్యూచువల్ ఫండ్స్ తదితర ఇన్వెస్టర్ల ద్వారా ఇష్యూలు భారీస్థాయిలో సబ్్రస్కయిబ్ అవుతున్నట్లు వివరించింది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పరిశీలన ప్రకారం ఐపీవోలలో లభించిన షేర్లలో 54 శాతాన్ని ఇన్వెస్టర్లు లిస్టయిన వారం రోజుల్లోనే విక్రయించారు. 2024లో ఐపీవోల ద్వారా నిధుల సమీకరణ జోరు చూపుతున్నట్లు ఆర్బీఐ నివేదిక పేర్కొంది. ఈ బాటలో తొలి అర్ధభాగానికల్లా ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఐపీవోలు వెలువడిన దేశంగా భారత్ నిలిచినట్లు తెలియజేసింది. ఇందుకు ఎస్ఎంఈలు ప్రధానంగా దోహదపడినట్లు వెల్లడించింది. -
వచ్చే ఏడాది ఈవీ రంగంలో కొత్త ఐపీఓ
ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ ‘ప్యూర్ ఈవీ’ 2025లో ఐపీఓగా రానున్నట్లు ప్రకటించింది. కంపెనీ బిజినెస్పై ఆసక్తి ఉన్న ఇన్వెస్టర్ల నుంచి ఈక్విటీ మార్కెట్ ద్వారా మూలధనాన్ని సమకూర్చాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. దాంతో కంపెనీ భవిష్యత్తు అవసరాలను తీర్చుకుంటూ కార్యకలాపాలను విస్తరిస్తామని పేర్కొంది.కంపెనీకి నాట్కో ఫార్మా ఫ్యామిలీ ఆఫీస్, లారస్ ల్యాబ్స్ ఫ్యామిలీ ఆఫీస్, హెచ్టీ వెంచర్స్, బీసీసీఎల్, యూఈపీఎల్, ఐ-టీఐసీ ఐఐటీ హైదరాబాద్ వంటి ప్రముఖ సంస్థల మద్దతు ఉందని ప్యూర్ఈవీ తెలిపింది. సంస్థలోని 85 శాతం వాటా ప్రమోటర్ల వద్దే ఉంది. ఐపీఓ ద్వారా మార్కెట్లో ఈ వాటాను అమ్మి డబ్బు సేకరించాలని చూస్తున్నారు. దాంతో వ్యాపారాన్ని విస్తరించాలని యోచిస్తున్నారు. వచ్చే నాలుగేళ్లలో రూ.రెండు వేలకోట్ల వ్యాపారం సాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే కంపెనీ ఏధరతో షేర్లను విడుదల చేస్తుందనేది మాత్రం తెలియరాలేదు. ఐపీఓ తేదీ, లిస్టింగ్ తేదీ, లాట్ సైజ్..వంటి కీలక వివరాలు తెలియజేయాల్సి ఉంది. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ డిమాండ్ ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈవీ తయారీలో బ్యాటరీకి ఎక్కువగా ఖర్చు అవుతుంది. చాలా కంపెనీలు వాటి సామర్థ్యం పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.ఇదీ చదవండి: స్టార్టప్ కంపెనీలో క్రికెటర్ రూ.7.4 కోట్లు పెట్టుబడి -
సెప్టెంబర్ మాసం... ఐపీఓల వర్షం!
స్టాక్ మార్కెట్ జోరు నేపథ్యంలో పబ్లిక్ ఆఫర్లు (ఐపీఓ) వెల్లువెత్తుతున్నాయి. సెప్టెంబర్ నెలలో ఇష్యూల వర్షం కురవనుంది. 2010 సెప్టెంబర్లో అత్యధికంగా 15 ఐపీఓలతో రికార్డు నమోదైంది. ప్రస్తుతం ప్రైమరీ మార్కెట్లో జోరు చూస్తుంటే ఈ ఏడాది ఆ 14 ఏళ్ల రికార్డు బద్దలయ్యే అవకాశం కనిపిస్తోంది.వరుస ఐపీఓలతో సెప్టెంబర్ నెలలో స్టాక్ మార్కెట్ కళకళలాడనుంది. ఇప్పటికే గాలా ప్రెసిషన్ ఇంజనీరింగ్, బాజార్ స్టయిల్ రిటైల్ ఇష్యూలు పూర్తయ్యాయి. ఇంకా అనేక ఇష్యూలు నిధుల సమీకరణ బాటలో ఉన్నాయి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్తో పాటు నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్, గరుడా కన్స్ట్రక్షన్స్, మన్బా ఫైనాన్స్ సహా అనేక కంపెనీలు పబ్లిక్ ఇష్యూల మోత మోగించనున్నాయి. దీంతో 2010 సెప్టెంబర్ నెల 15 ఐపీఓల రికార్డు తుడిచిపెట్టుకుపోవచ్చనేది మార్కెట్ వర్గాల అంచనా. ఇన్వెస్టర్ల నుంచి పటిష్టమైన డిమాండ్కు సెకండరీ మార్కెట్లో నెలకొన్న ఉత్సాహం తోడవడంతో మరిన్ని కంపెనీలు ఐపీఓల బాట పట్టేందుకు దోహదం చేస్తోందని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు చెబుతున్నారు. ‘వచ్చే కొన్ని వారాల్లో చాలా కంపెనీలు పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో ఉన్నాయి. ఇటీవలి ఐపీఓలకు బలమైన డిమాండ్తో పాటు దేశీయ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి నిధుల ప్రవాహం తగినంతగా ఉండటం కూడా దీనికి ప్రధాన కారణం‘. మరోపక్క తాజా ఇష్యూలు లిస్టింగ్లోనూ, ఆ తర్వాత కూడా ఇన్వెస్టర్లకు మంచి లాభాలు పంచడం మార్కెట్లో మరింత జోష్ నింపుతోంది’ అని కోటక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఎండీ వి. జయశంకర్ పేర్కొన్నారు. విదేశీ పోర్ట్ఫోలియో నిధుల వెల్లువ... ఈ ఏడాది ఇప్పటిదాకా విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) రూ.55,300 కోట్ల నిధులను ఐపీఓల్లో కుమ్మరించారు. మరోపక్క, సెకండరీ మార్కెట్లో రూ.2,700 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. రూ. 6,560 కోట్ల బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ భారీ ఇష్యూ 9న మొదలవుతోంది. దీని ప్రైస్ బ్యాండ్ రూ.66–70. టోలిన్స్ టైర్స్ రూ.230 కోట్ల నిధుల కోసం 9న మార్కెట్ తలుపుతడుతోంది. ఇక పీఎన్ గాడ్గిల్ జ్యువెల్లర్స్ రూ.228–240 ధరల శ్రేణితో ఈ నెల 10న ఐపీఓకు వస్తోంది. గతేడాది సెప్టెంబర్లో వచ్చిన రూ.11,893 కోట్ల విలువైన 14 ఐపీఓలే ఇటీవలి కాలంలో అత్యధికంగా నిలుస్తున్నాయి. 2024 ఆగస్ట్లో 10 కంపెనీలు రూ.17,076 కోట్ల నిధులను సమీకరించాయి. ‘మెరుగైన వ్యాపారావకాశాల నేపథ్యంలో భారత కార్పొరేట్ సంస్థలు ప్లాంట్ల విస్తరణతో పాటు కంపెనీల కొనుగోళ్ల జోరు పెంచాయి. మరోపక్క, పబ్లిక్ ఇష్యూకు వచ్చేందుకు ఆడిట్ చేసిన ఆర్థిక ఫలితాల గడువు ఆరు నెలలు మాత్రమే. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్నెల్ల గడువు సెప్టెంబర్తో ముగియనుంది. ఈలోపు ఐపీఓ పూర్తి చేయకపోతే, మళ్లీ ఆడిట్ చేయడంతో పాటు ఐపీవో ముసాయిదా దర ఖాస్తు పత్రాలను మా ర్చాల్సి ఉంటుంది. దీనివల్ల ఇష్యూ జాప్యానికి దారితీస్తుంది. అందుకే కంపెనీలు వరుసకడుతున్నాయి’ అని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ రవి శంకర్ చెప్పారు.ఎగబడుతున్న ఇన్వెస్టర్లు.. లిస్టింగ్లో అసాధారణ లాభాలిస్తుండటంతో ఇటీవలి కాలంలో మార్కెట్లోకి ఏ ఐపీఓ వచ్చినా రిటైల్ ఇన్వెస్టర్లు ఎగబడిపోతున్నారు. ఈ నెల 4న ముగిసిన రూ.168 కోట్ల గాలా ప్రెసిషన్ ఇష్యూ 201 రెట్లు అధికంగా సబ్్రస్కయిబ్ అయింది. బాజార్ స్టయిల్కు 41 రెట్ల స్పందన లభించింది. అంతక్రితం ఎకోస్ మొబిలిలిటీకి 64 రెట్లు సబ్్రస్కిప్షన్ లభించింది. అంతేకాదు, ఇది 32 శాతం ప్రీమియంతో లిస్టయింది కూడా. ప్రీమియర్ ఎనర్జీస్ 87 శాతం, ఓరియంట్ టెక్నాలజీస్ 48 శాతం చొప్పన లిస్టింగ్ లాభాలను పంచాయి. ఆగస్ట్లో లిస్టయిన 8 ఐపీఓల సగటు లాభం 36 శాతం కావడం గమనార్హం.మార్కెట్ రికార్డులు, ఐపీఓల వరదతో కొత్తగా ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆగస్ట్లో 41.4 లక్షల డీమ్యాట్ ఖాతాలు జత కావడంతో మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య 17.1 కోట్లకు దూసుకెళ్లింది. ఇది ఆల్టైమ్ రికార్డు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఎన్బీఎఫ్సీ ఐపీవోల క్యూ
న్యూఢిల్లీ: అప్పర్ లేయర్ ఎన్బీఎఫ్సీలపై రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) నిబంధనల కారణంగా ఇకపై పలు పబ్లిక్ ఇష్యూలకు తెరలేవనుంది. ఈ విభాగంలో వచ్చే వారం బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ పబ్లిక్ ఇష్యూ ప్రారంభంకానుంది. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ల వివరాల ప్రకారం కనీసం మరో మూడు కంపెనీలు ఈ జాబితాలో చేరనున్నాయి. వీటిలో టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆదిత్య బిర్లా ఫైనాన్స్ ఏడాదిలోగా స్టాక్ ఎక్సే్ఛంజీలో లిస్టింగ్కు ప్రయత్నించనున్నాయి.ఆర్బీఐ నిబంధనల ప్రకారం అప్పర్లేయర్ నాన్బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ)లు గుర్తింపు పొందిన మూడేళ్లలోగా ఐపీవోలు చేపట్టవలసి ఉంటుంది. ప్రస్తుతం క్యాపిటల్ మార్కెట్లు జోరుమీదుండటంతో నాణ్యతగల బిజినెస్లకు డిమాండ్ ఉన్నట్లు ఆనంద్ రాఠీ అడ్వయిజర్స్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ విభాగ డైరెక్టర్ సచిన్ మెహతా పేర్కొన్నారు. దీంతో మంచి విలువలు లభించేందుకు వీలున్నట్లు తెలియజేశారు. ఫలితంగా పలు ఎన్బీఎఫ్సీలు లిస్టింగ్ బాట పట్టనున్నట్లు అంచనా వేశారు. కేవలం ఆర్బీఐ నిబంధనల అమలుకోసమేకాకుండా నిధుల సమీకరణకు సైతం ఐపీవోలను వినయోగించుకోవచ్చని తెలియజేశారు. ఒకసారి లిస్టయితే నిధుల సమీకరణ సులభమవుతుందని వివరించారు. క్యూ ఇలా ఆర్బీఐ అప్పర్ లేయర్ ఎన్బీఎఫ్సీ నిబంధనల ప్రకారం చూస్తే దిగ్గజాలు టాటా సన్స్, టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, పిరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్, హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆదిత్య బిర్లా ఫైనాన్స్ ఏడాదిలోగా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్కావలసి ఉంది. వీటిలో పిరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ పిరమల్ ఎంటర్ప్రైజెస్లో విలీనంకానుంది. ఇక టాటా సన్స్ లిస్టింగ్ను తప్పించుకునే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే టాటా సన్స్ లిస్టింగ్ గేమ్చేంజర్గా నిలవనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇన్వెస్టర్లు లిస్టింగ్ ద్వారా భారీ లాభాలు అందుకునేందుకు వీలుండటమే దీనికి కారణమని తెలియజేశారు. దేశ, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి అధికస్థాయిలో పెట్టుబడులను ఆకట్టుకోగలదని భావిస్తున్నారు. దేశీయంగా పలు కార్పొరేట్ దిగ్గజాల హోల్డింగ్ కంపెనీగా నిలుస్తున్న టాటా సన్స్కు భారీ డిమాండ్ నెలకొంటుందని అంచనా వేశారు.కీలక పరిణామం ప్రయివేట్ రంగ హోల్డింగ్ దిగ్గజం టాటా సన్స్ లిస్టయితే వేగంగా వృద్ధి చెందుతున్న దేశీ క్యాపిటల్ మార్కెట్లలో ఇది కీలక పరిణామంగా నిలుస్తుందని డీఏఎం క్యాపిటల్ సీఈవో ధర్మేష్ మెహతా పేర్కొన్నారు. భారత్లోనే అత్యంత ప్రముఖ గ్రూప్లలో ఒకటైన టాటా సన్స్కు దేశ, విదేశాల నుంచి గరిష్ట డిమాండ్ పుడుతుందని తెలియజేశారు.వాటాదారులకు భారీ విలువ చేకూరుతుందని మార్కెట్ నిపుణులు పలువురు అభిప్రాయపడ్డారు. వెరసి కనీసం 5 శాతం వాటాను ఆఫర్ చేస్తే రూ. 55,000 కోట్లకుపైగా నిధులు లభించవచ్చని అంచనా వేశారు. లిక్విడిటీతోపాటు.. ట్రేడింగ్ పరిమాణం సైతం భారీఆ పెరుగుతుందని తెలియజేశారు.లిస్టింగ్ను తప్పించుకునే యోచనతో టాటా సన్స్ ఇప్పటికే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ను ఆర్బీఐకు స్వచ్చందంగా సరెండర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఆర్బీఐ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరమని నిపుణులు పేర్కొన్నారు. కాగా.. 2018లో ఐఎల్అండ్ఎఫ్ఎస్ అనూహ్య పతనానికితోడు.. డీహెచ్ఎఫ్ఎల్ సైతం విఫలంకావడంతో మొత్తం ఫైనాన్షియల్ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడింది. కఠిన లిక్విడిటీ సవాళ్లు ఎదురయ్యాయి. ఫలితంగా 2021 అక్టోబర్లో ఆర్బీఐ సవరించిన ఎస్బీఆర్ మార్గదర్శకాలను జారీ చేసింది. తద్వారా వ్యవస్థాగత రిస్కులను అడ్డుకోవడం, పాలనను మరింత పటిష్టపరచడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చింది.ఇవీ నిబంధనలుఎస్బీఆర్ మార్గదర్శకాల ప్రకారం ఎన్బీఎఫ్సీలను నాలుగు విభాగాలు(లేయర్లు)గా విభజించింది. ప్రాథమిక(బేసిక్), మాధ్యమిక(మిడిల్), ఎగువ(అప్పర్), అత్యున్నత(టాప్) లేయర్లుగా ఏర్పాటు చేసింది. ఆయా కంపెనీల పరిమాణం, కార్యకలాపాలు, రిస్క్ స్థాయిల ఆధారంగా వీటికి తెరతీసింది. దీనిలో భాగంగా అప్పర్ లేయర్ ఎన్బీఎఫ్సీలుగా గుర్తింపు పొందిన మూడేళ్ల కాలంలో స్టాక్ ఎక్స్చేంజీలలో లిస్టయ్యేలా నిబంధనలను సవరించింది. ఇందుకు అనుగుణంగా 2022 సెప్టెంబర్లో 16 సంస్థలను ఈ జాబితాలో చేర్చింది. అయితే 2023లో జాబితా నుంచి సంఘ్వీ ఫైనాన్స్ను తప్పించింది.వెరసి 15 సంస్థలు అప్పర్లేయర్లో చేరాయి. వీటిలో పిరమల్ క్యాపిటల్, టాటాసన్స్లను మినహాయిస్తే 9 కంపెనీలు ఇప్పటికే లిస్టయినట్లు మెహతా వెల్లడించారు. బజాజ్ హౌసింగ్ ఐపీవో ప్రారంభంకానున్న కారణంగా మిగిలిన మూడు కంపెనీలు ఏడాదిలోగా లిస్ట్కావలసి ఉంటుంది. ఈ మూడు సంస్థలు 2025 సెప్టెంబర్లోగా పబ్లిక్ ఇష్యూలను చేపట్టవలసి ఉన్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్వెస్ట్మెంట్ చీఫ్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్ కుమార్ తెలియజేశారు. -
బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీవో: రూ. 6,560 కోట్లు
న్యూఢిల్లీ: బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ తమ ఐపీవోకి (ఇనీíÙయల్ పబ్లిక్ ఆఫరింగ్) సంబంధించి షేరు ధర శ్రేణిని రూ. 66–70గా నిర్ణయించింది. ఈ ఇష్యూ సెపె్టంబర్ 9న ప్రారంభమై 11న ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం బిడ్డింగ్ సెపె్టంబర్ 6న ఉంటుంది. ప్రతిపాదిత ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 6,560 కోట్లు సమీకరిస్తోంది.ఇందుకోసం రూ. 3,560 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, మాతృ సంస్థ బజాజ్ ఫైనాన్స్ రూ. 3,000 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో విక్రయించనుంది. ఇన్వెస్టర్లు కనీసం 214 షేర్లు చొప్పున బిడ్ చేయొచ్చు. సమీకరించే నిధులను భవిష్యత్ మూలధన అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం రూ. 1,258 కోట్ల నుంచి 38% పెరిగి రూ. 1,731 కోట్లకు పెరిగింది.రూ. 500 కోట్ల క్రోస్ ఇష్యూ .. ఆటో విడిభాగాల సంస్థ క్రోస్ లిమిటెడ్ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూ కూడా సెపె్టంబర్ 9న ప్రారంభమై 11తో ముగియనుంది. ఈ ఐపీవో ద్వారా కంపెనీ రూ. 500 కోట్లు సమీకరించనుంది. క్రోస్ తాజాగా రూ. 250 కోట్ల షేర్లను జారీ చేయనుండగా, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో ప్రమోటర్లు రూ. 250 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనున్నారు. జంషెడ్పూర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీ 1991లో ఏర్పాటైంది. -
స్విగ్గీలో అమితాబ్ బచ్చన్ కుటుంబానికి వాటాలు
న్యూఢిల్లీ: ఐపీవోకి సన్నద్ధమవుతున్న ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ ప్లాట్ఫాం స్విగ్గీలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్కి చెందిన ఫ్యామిలీ ఆఫీస్ స్వల్ప వాటాలు తీసుకున్నట్లు సమాచారం. కంపెనీ ఉద్యోగులు, ప్రారంభ దశ ఇన్వెస్టర్ల నుంచి షేర్లను కొనుగోలు చేయడం ద్వారా ఈ లావాదేవీని నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 10,414 కోట్లు సమీకరించే ప్రతిపాదనకు స్విగ్గీ షేర్హోల్డర్లు ఏప్రిల్లో ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఐపీవోలో భాగంగా కొత్తగా షేర్లను జారీ చేయడంతో పాటు ఆఫర్ ఫర్ సేల్ కింద షేర్లను విక్రయించనున్నారు. -
ప్రముఖ కంపెనీ వాటా కొనుగోలు చేసిన బిగ్బీ కుటుంబం?
బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్బీ అమితాబ్ బచ్చన్ కుటుంబం ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీలో కొంత వాటాను కొనుగోలు చేసింది. అలాగే, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చైర్మన్ రామ్డియో అగర్వాల్ స్విగ్గీతో పాటు జెప్టోలో వాటాను కొనుగోలు చేసినట్లు ఈ వ్యవహరంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు.స్విగ్గీ ఐపీఓ ద్వారా నిధులు సేకరిస్తుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే క్విక్ కామర్స్ బిజినెస్కు పబ్లిక్ మార్కెట్లో పెట్టుబడిదారుల నుంచి ఆసక్తి పెరుగుతోంది. చాలామంది ప్రముఖులు ఈ బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి లాభాలు గడించాలని చూస్తున్నారు. తాజాగా బిగ్బీ కుటుంబానికి చెందిన కార్యాలయం స్విగ్గీలో కొంత వాటాను కొనుగోలు చేసినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చైర్మన్ రామ్డియో అగర్వాల్ కూడా స్విగ్గీతో పాటు జెప్టోలోనూ వాటాను కొనుగోలు చేశారు.ఇదీ చదవండి: ఈ ఆఫర్ ఓ తుఫాన్!రెవెన్యూ ఎలా అంటే..స్విగ్గీ దేశీయంగా దాదాపు 580 నగరాల్లో ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ఫుడ్ డెలివరీ సేవలు అందిస్తోంది. రెస్టారెంట్లు, ఆహారప్రియుల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. కస్టమర్లు తమకు ఇష్టమైన రెస్టారెంట్ల నుంచి ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి ఒక వేదికను అందిస్తుంది. దాంతోపాటు వినియోగదారుల నుంచి ఆర్డర్లను స్వీకరించడానికి రెస్టారెంట్లుకు అవకాశం కల్పిస్తోంది. అయితే అందుకోసం కంపెనీ ప్లాట్ఫామ్ ఫీజు, ఇతర ఛార్జీలను వసూలు చేస్తోంది. ఆన్లైన్ ప్రకటనల వల్ల కూడా రెవెన్యూ సంపాదిస్తోంది. స్విగ్గీ కేవలం ఆన్లైన్ ఫుడ్ డెలివరీకే పరిమితం కాకుండా ఇన్స్టామార్ట్ ద్వారా క్విక్ కామర్స్ సేవలందిస్తోంది. -
ఈ ఆఫర్ ఓ తుఫాన్!
దేశీ ప్రైమరీ మార్కెట్లలో తాజాగా ఒక విచిత్రమైన రికార్డ్ నమోదైంది. కేవలం రూ.12 కోట్ల సమీకరణకు ఒక చిన్నతరహా సంస్థ పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. అయితే కనీవినీ ఎరుగని రీతిలో రూ.4,800 కోట్ల విలువైన బిడ్స్ దాఖలయ్యాయి. ఢిల్లీకి చెందిన రీసోర్స్ఫుట్ ఆటోమొబైల్ కంపెనీ యమహా ద్విచక్ర వాహన డీలర్గా వ్యవహరిస్తోంది. అదికూడా రెండు ఔట్లెట్లను మాత్రమే కలిగి ఉంది. 2018లో ఏర్పాటైన సంస్థ 8 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2023 డిసెంబర్ 28న సెబీకి దాఖలు చేసిన ఐపీవో ప్రాస్పెక్టస్ వివరాలు కింది విధంగా ఉన్నాయి.కొద్ది రోజులుగా దేశీ స్టాక్ మార్కెట్లు సాధిస్తున్న రికార్డుల బాటలో ప్రైమరీ మార్కెట్లు సైతం దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. దీంతో చిన్న, మధ్యతరహా కంపెనీల(ఎస్ఎంఈలు) ఐపీవోలకూ ఇటీవల భారీ డిమాండ్ నెలకొంటోంది. వెరసి తాజాగా ఐపీవోకు వచ్చిన రీసోర్స్ఫుల్ ఆటోమొబైల్ ఏకంగా 419 రెట్లు అధికంగా సబ్స్రైబ్ అయింది. సాహ్నీ ఆటోమొబైల్ బ్రాండుతో యమహా డీలర్గా వ్యవహరిస్తున్న కంపెనీ మోటార్ సైకిళ్లు, స్కూటర్ల విక్రయాలు, సర్వీసింగ్ చేపడుతోంది. ఇన్వెస్టర్ల నుంచి హెవీ రష్ఈ నెల 22న ప్రారంభమై 26న ముగిసిన రీసోర్స్ఫుల్ ఆటోమొబైల్ ఐపీవోలో భాగంగా 9.76 లక్షల షేర్లను ఆఫర్ చేసింది. అయితే 40.76 కోట్ల షేర్ల కోసం దరఖాస్తులు వెల్తువెత్తాయి. రూ.12 కోట్ల సమీకరణకు తెరతీస్తే ఏకంగా రూ.4,800 కోట్ల విలువైన బిడ్స్ లభించాయి. సంస్థాగతేతర ఇన్వెస్టర్ల కేటగిరీలో 316 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 496 రెట్లు చొప్పున బిడ్స్ దాఖలయ్యాయి. ఇష్యూకి తొలి రోజు 10.4 రెట్లు, రెండో రోజు 74 రెట్లు అధికంగా స్పందన లభించింది. చివరి రోజుకల్లా బిడ్డింగ్ తుఫాన్ సృష్టించింది. షేరుకి రూ.117 ధరలో మొత్తం 10.25 లక్షల షేర్లను ఆఫర్ చేసింది. చిన్న, మధ్యతరహా కంపెనీల కోసం ఏర్పాటు చేసిన బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ ద్వారా సాహ్నీ ఆటోమొబైల్ లిస్ట్కానుంది.ఇదీ చదవండి: భారత్లో ఎప్పటికీ చిన్నకార్లదే హవాఎస్ఎంఈలకు కనిపిస్తున్న అనూహ్య డిమాండ్ అసంబద్ధమని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రధాన పెట్టుబడుల వ్యూహకర్త వీకే విజయకుమార్ పేర్కొన్నారు. లిస్టింగ్ లాభాల కోసం ఇన్వెస్టర్లు నాణ్యతా సంబంధ విషయాలను సైతం విస్మరిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. అధిక సబ్స్క్రిప్షన్వల్ల తాత్కాలికంగా లాభాలు వచ్చినప్పటికీ దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి కొంత నిరాశ కలిగించవచ్చన్నారు. అయితే కంపెనీ బిజినెస్పై పూర్తి అవగాహనతో పెట్టుబడి పెట్టే వారు తక్కువవుతున్నారని ఆందోళన వ్యక్తి చేశారు. నియంత్రణ సంస్థలు హెచ్చరిస్తున్నప్పటికీ వేలంవెర్రి కొనసాగుతున్నట్లు తెలియజేశారు. ఎస్ఎంఈ ప్లాట్ ఫామ్ ద్వారా లిస్టయ్యే కంపెనీల ఖాతాలను మరింత అప్రమత్తంగా ఆడిటింగ్ చేయమంటూ గత వారం సెబీ హోల్టైమ్ డైరెక్టర్ అశ్వనీ భాటియా చార్టర్డ్ అకౌంటెంట్ల(సీఏలు)కు సూచించడం గమనార్హం.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
వేగంగా అనుమతులు
ముంబై: ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)లకు అనుమతులను వేగవంతం చేసే దిశగా కొత్త విధానంపై పనిచేస్తున్నట్టు సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్ తెలిపారు. ముందుగా రూపొందించిన టెంప్లేట్లోని ఖాళీలను నింపడం ద్వారా కంపెనీలు ఐపీవో పత్రాలను సులభంగా సమరి్పంచొచ్చని చెప్పారు. అలాగే, కంపెనీలు సమరి్పంచిన ఐపీవో పత్రాలను వేగంగా తనిఖీ చేసేందుకు కృత్రిమ మేథ ఆధారిత టూల్ను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. డిసెంబర్ నాటికి దీన్ని సిద్ధం చేస్తామన్నారు. ఫిక్కీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె మాట్లాడారు. ఐపీవో ప్రక్రియను వేగవంతం చేయడం తన ముందున్న కీలక లక్ష్యంగా పేర్కొన్నారు. ఎనిమిది ఐపీవో దరఖాస్తుల అనుమతులకు గరిష్ట గడువు అయిన మూడు నెలలు దాటినట్టు వివరించారు. న్యాయపరమైన జోక్యం, నిబంధనల అమలు లేమిని కారణాలుగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఐపీవో విషయంలో సంక్లిష్ట ముసాయిదా పత్రాల దాఖలు ప్రకియ ఉన్నట్టు చెప్పారు. దీన్ని సులభతరం చేసేందుకు టెంప్లేట్ను తీసుకొస్తామన్నారు. ఈ విధానంలో కేవలం ఖాళీలు నింపడం ద్వారా ఐపీవో డాక్యుమెంట్ను సిద్ధం చేసుకోవచ్చని చెప్పారు. నిరి్ధష్ట అంశాల్లో వైరుధ్యాలను, సంక్లిష్టతలను వివరించేందుకు ప్రత్యేక కాలమ్ ఉంటుందన్నారు. కాకపోతే కొత్త విధానం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందన్నది ప్రకటించలేదు. రైట్స్, ప్రిఫరెన్షియల్కూ కొత్త విధానంలిస్టెడ్ కంపెనీలు సైతం వేగంగా నిధులు సమీకరించేందుకు కొత్త విధానంపై సెబీ కసరత్తు చేస్తోంది. రైట్స్ ఇష్యూ, ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ కలయికతో ఇది ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రక్రియకు 42 రోజుల సమయం తీసుకుంటుండగా, 23 రోజులకు తగ్గించనున్నట్టు సెబీ చైర్పర్సన్ తెలిపారు. సెబీ అనుమతులు, మర్చంట్ బ్యాంకర్ల అవసరాన్ని తొలగించనున్నట్టు, నిధుల సమీకరణకు సంబంధించి కేవలం రెండు పేజీల డాక్యుమెంట్ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పారు. దీనివల్ల మర్చంట్ బ్యాంకర్ల ఫీజుల బెడద తొలగిపోతుందన్నారు. ఈ ఆవిష్కరణను అమల్లోకి తీసుకురావడానికి ముందు సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేస్తామన్నారు. ఐపీవో పత్రాలు వెనక్కి.. మర్చంట్ బ్యాంకర్లకు వైపు నుంచి ప్రయోజనాల వైరుధ్యం, డైరెక్టర్లు మోసాల్లో నిందితులుగా ఉన్నప్పుడు, ఇష్యూకి సంబంధించి ఉద్దేశ్యాలు స్పష్టంగా లేనప్పుడు ఐపీవో పత్రాలను వెనక్కి తిప్పి పంపాలని సెబీ నిర్ణయించినట్టు మాధవి పురి బుచ్ తెలిపారు. నష్టాల్లోని కంపెనీలు లిస్ట్ అయ్యే విషయంలో వెల్లడించాల్సిన సమాచారాన్ని క్రమబదీ్ధకరించడంపైనా పనిచేస్తున్నట్టు చెప్పారు. ఇందుకు నెలలో పరిష్కారాలను తీసుకొస్తామన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు (ఇని్వట్లు), రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్లు (రిట్లు) పనితీరు పోల్చి చూసుకునేందుకు వీలుగా బెంచ్మార్క్ ఏజెన్సీని రూపొందిస్తున్నట్టు తెలిపారు.గ్యారంటీ హామీలతో జాగ్రత్త ఇన్వెస్టర్లకు హెచ్చరిక కాగా రిజిస్టర్డ్ స్టాక్ బ్రోకర్ తరఫున ఓ అ«దీకృత వ్యక్తి ఇస్తున్న హామీపూర్వక రిటర్నుల విషయంలో అప్రమ్తతంగా వ్యవహరించాలని ఇన్వెస్టర్లకు నియంత్రణ సంస్థ సెబీ హెచ్చరించింది. ‘‘మా రిజిస్టర్డ్ స్టాక్ బ్రోకర్ ఒకరికి సంబంధించి అ«దీకృత వ్యక్తి అమిత్ లిహారే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులపై గ్యారంటీ రాబడులను ఆఫర్ చేస్తున్నట్టు మా దృష్టికి వచి్చంది. ఈ తరహా హామీపూర్వక రాబడులపై కమీషన్లను సైతం తన వ్యక్తిగత బ్యాంక్ ఖాతాల ద్వారా తీసుకుంటున్నట్టు తెలిసింది’’అని సెబీ తెలిపింది. సంబంధిత ట్రేడింగ్ సభ్యుడిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించింది. భారీ రాబడులు ఇస్తామంటూ హామీలు గుప్పించే గుర్తింపు లేని సంస్థల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ సెబీ ఇన్వెస్టర్లను హెచ్చరించడం గమనార్హం. -
Ola Electric IPO: పేటీఎం బాస్ షేర్లు విక్రయించడం లేదా?
ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓకు వస్తుండటంలో మార్కెట్లో అందరి దృష్టి దీనిమీదే ఉంది. ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ రీటైల్ సబ్స్క్రిప్షన్లు ఆగస్టు 2 నుంచి 6వ తేదీ వరకు ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉంటాయి. ఒక్కో షేర్ ధరను రూ.72 - 76గా కంపెనీ నిర్ణయించింది.కాగా ఓలా ఎలక్ట్రిక్లో గణనీయమైన సంఖ్యలో షేర్లున్న పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ, బాలివుడ్ డైరెక్టర్ జోయా అక్తర్, ఆమె సోదరుడు బాలివుడ్ నటుడు సోదరుడు ఫర్హాన్ అక్తర్ రానున్న ఐపీఓలో తమ షేర్లను విక్రయించకుండా అంటిపెట్టుకోనున్నారు. మనీకంట్రోల్ కథనం ప్రకారం.. వీరు ఆఫర్ ప్రైస్ బ్యాండ్ రూ. 72-76 షేరు ఎగువ ముగింపులో 26 శాతం లాభాల వద్ద ఉన్నారు.విజయ్ శేఖర్ శర్మ, అక్తర్ ద్వయం పెట్టుబడి తేదీ 2021 డిసెంబర్ 21గా నమోదైంది. అప్పటి నుంచి బెంచ్మార్క్ నిఫ్టీ 48.32 శాతం పెరిగింది. శర్మ తన పెట్టుబడి సంస్థ వీఎస్ఎస్ ఇన్వెస్ట్కో ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఏడు సిరీస్ సి ప్రిఫరెన్స్ షేర్లను రూ.7.5 కోట్లకు కొనుగోలు చేశారు. ఇప్పుడవి ప్రైస్ బ్యాండ్ దిగువన రూ. 8.96 కోట్లు, ప్రైస్ బ్యాండ్ ఎగువన రూ. 9.46 కోట్లుగా ఉన్నాయి.జోయా అక్తర్ సింగిల్ సిరీస్ సి ప్రిఫరెన్స్ షేర్ను రూ. 1.07 కోట్లకు కొనుగోలు చేయగా, ఫర్హాన్ 2 షేర్లను రూ. 2.14 కోట్లకు కొనుగోలు చేశారు. ఫర్హాన్తో కలిసి ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ సహ వ్యవస్థాపకుడు రితేష్ సిధ్వానీ కూడా ఓలా ఎలక్ట్రిక్ సిరీస్ సి రౌండ్లో రెండు షేర్లను కొనుగోలు చేశారు. ప్రిఫరెన్స్ షేర్ల మార్పిడి తర్వాత, శర్మ ఓలా ఎలక్ట్రిక్లో 12.45 లక్షలు, జోయా అక్తర్ 1.78 లక్షలు, ఫర్హాన్ అక్తర్ 3.56 లక్షలు, రితేష్ సిధ్వానీ 3.56 లక్షల షేర్లను కలిగి ఉన్నారు. -
ఓలా ఎలక్ట్రిక్ వచ్చేస్తోంది.. టార్గెట్ రూ. 5,500 కోట్లు
ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ వచ్చే వారం ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు రానుంది. ఆగస్టు 2న రిటైల్ సబ్స్క్రిప్షన్లు ప్రారంభించనున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్లో కంపెనీ తెలిపింది. సంస్థాగత పెట్టుబడిదారులకు మాత్రం ఒక రోజు ముందుగా ఆగస్టు 1న సబ్స్క్రిప్షన్లు తెరుచుకోనున్నాయి. ఆగస్టు 6న ఐపీఓ ముగుస్తుంది.ఐపీఓ ద్వారా రూ. 5,500 కోట్లను (సుమారు 657 మిలియన్ డాలర్లు) ఆర్జించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ ఆఫర్ ఫర్ సేల్ (OFS)లో భాగంగా దాదాపు 38 మిలియన్ షేర్లను విక్రయించాల్సి ఉందని కంపెనీ తెలిపింది. 2023 డిసెంబర్లో దాఖలు చేసిన డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్లో సూచించిన 47.4 మిలియన్ షేర్ల విక్రయం కంటే ఇది దాదాపు 20% తక్కువ.ఓలా ఎలక్ట్రిక్ సుమారు 4.2 బిలియన్ డాలర్ల నుంచి 4.4 బిలియన్ డాలర్ల వాల్యూషన్తో ఐపీఓకు వస్తోంది. సింగపూర్కు చెందిన పెట్టుబడి సంస్థ టెమాసెక్ గతేడాది 140 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిన తర్వాత కంపెనీ విలువను 5.4 బిలియన్ డాలర్లుగా నిర్ణయించింది. ఆ మొత్తంతో పోలిస్తే.. ఇప్పుడు కంపెనీ ఐపీఓ వాల్యూషన్ 20 శాతం మేర తగ్గడం గమనార్హం. -
ఈ వారం 2 లిస్టింగ్లు, 2 ఐపీవోలు
న్యూఢిల్లీ: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో 4 ఐపీవోలు హడావిడి చేయనున్నాయి. గత వారమే ఇష్యూలు పూర్తి చేసుకున్న అలైడ్ బ్లెండర్స్ 2న, వ్రజ్ ఐరన్ 3న స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్కానున్నాయి. ఇక మరోపక్క ఎమ్క్యూర్ ఫార్మాస్యూటికల్స్, బన్సల్ వైరింగ్ పబ్లిక్ ఇష్యూలు 3నే ప్రారంభంకానున్నాయి. ఆఫీసర్స్ చాయిస్ విస్కీ బ్రాండ్ కంపెనీ అలైడ్ బ్లెండర్స్ రూ. 281 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా రూ. 1,500 కోట్లు అందుకుంది. స్పాంజ్ ఐరన్, టీఎంటీ బార్ల తయారీ కంపెనీ వ్రజ్ ఐరన్ అండ్ స్టీల్ షేరుకి రూ. 207 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా రూ. 171 కోట్లు అందుకుంది. జూలై 5న ముగియనున్న స్టీల్ వైర్ల తయారీ కంపెనీ బన్సల్ వైర్ ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూకి రూ. 243–256 ధరల శ్రేణిని ప్రకటించింది. మొత్తం రూ. 745 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయడం ద్వారా రూ. 745 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. రిటైలర్లు కనీసం 58 షేర్లకు దరఖాస్తు చేయవలసి ఉంటుంది. హెల్త్కేర్ రంగ కంపెనీ ఎమ్క్యూర్ ఫార్మా పబ్లిక్ ఇష్యూకి రూ. 960–1008 ధరల శ్రేణిని ప్రకటించింది. 5న ముగియనున్న ఇష్యూ ద్వారా రూ. 800 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 1.14 కోట్ల షేర్ల(రూ. 1,152 కోట్ల విలువ)ను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా రూ. 1,952 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. రిటైలర్లు కనీసం 14 షేర్లకు దరఖాస్తు చేయవలసి ఉంటుంది. -
సమీప భవిష్యత్తులో రూ.1.48 లక్షలకోట్ల షేర్లపై ప్రభావం..!
రానున్న 4 నెలల్లో రూ.1.48 లక్షల కోట్ల విలువైన 66 కంపెనీల షేర్లకు లాకిన్ గడువు ముగియనుంది. దీంతో ఈ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎదురుకావొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో భారీగా కంపెనీలు స్టాక్మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. అయితే సెబీ నిబంధనల ప్రకారం యాంకర్ ఇన్వెస్టర్లు కంపెనీలో పెట్టుబడిపెట్టిన 90 రోజుల వరకు తమ షేర్లను అమ్మేందుకు వీలుండదు. ఆ లాకిన్ గడువు ముగిసిన తర్వాత వాటిని ఈక్విటీ మార్కెట్లో విక్రయించవచ్చు. గడిచిన కొద్దిరోజుల్లో టాటా టెక్నాలజీస్ వంటి ప్రముఖ కంపెనీలు సైతం ఐపీఓగా మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. ఆ ఒక్క కంపెనీ అనే కాకుండా మార్కెట్లో పేరున్న చాలా కంపెనీలు మంచి లిస్టింగ్గేయిన్స్తో స్టాక్మార్కెట్లో లిస్ట్అయ్యాయి. ఆ లాభాలంతా 90 రోజుల తర్వాత యాంకర్ ఇన్వెస్టర్ల పొందే వీలుంది. ఇదీ చదవండి: తగ్గనున్న పారుబాకీలు.. అధిక ఎన్పీఏలు ఉన్న రంగాలివే.. లాకిన్ గడువు పూర్తికానున్న షేర్లలో టాటా టెక్నాలజీస్, హోనాసా కన్జూమర్, సెల్లో వరల్డ్, జనస్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉన్నాయి. ఏప్రిల్ 1న గ్లోబల్ సర్ఫేసెస్, సాయి సిల్క్స్, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లాటినం ఇండస్ట్రీస్, ఎక్సికామ్ టెక్నాలజీస్ షేర్ల లాకిన్ ముగియనుంది. రానున్న 4 నెలల్లో దాదాపు 66 కంపెనీల లాకిన్ ముగుస్తుంది. దాంతో సుమారు రూ.1.48 లక్షలకోట్ల విలువైన షేర్లపై ప్రభావం పడనుంది. -
ఫేమస్ కంపెనీల మొదటిరోజు లాభాలు..(ఫొటోలు)
-
ఐపీఓకు రానున్న ప్రముఖ సంస్థ..?
ప్రముఖ సూపర్మార్కెట్ సంస్థగా విశాల్మార్ట్ తొలి పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు రాబోతున్నట్లు తెలిసింది. విశాల్ మెగామార్ట్ 1 బిలియన్ డాలర్ల (సుమారు రూ.8,300 కోట్ల) నిధుల సమీకరణ కోసం తొలి పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు రానుందని సమాచారం. విశాల్మార్కెట్ పలు నగరాల్లో 560 సూపర్మార్కెట్లు నిర్వహిస్తోంది. ఈ సంస్థ విలువను 5 బిలియన్ డాలర్లుగా (రూ.41,500 కోట్లు) పరిగణించి, ఐపీఓకు రావాలని సంస్థ యోచిస్తున్నట్లు తెలిసింది. విశాల్ మెగామార్ట్లో స్విట్జర్లాండ్ పార్ట్నర్స్ గ్రూప్ పీజీహెచ్ఎన్.ఎస్, మన దేశానికి చెందిన కేదారా క్యాపిటల్కు కలిపి మెజార్టీ వాటా ఉంది. ఐపీఓలో ఈ రెండు సంస్థలు షేర్లు విక్రయిస్తాయని తెలుస్తోంది. ఇదీ చదవండి: కంపెనీని బురిడీ కొట్టించి గ్యాంబ్లింగ్.. అసలేం జరిగిందంటే.. ఈ రెండు ప్రైవేటు ఈక్విటీ సంస్థలు కలిపి విశాల్ మెగామార్ట్లో ఎంత వాటా కలిగి ఉన్నాయి? ఎంతమేరకు విక్రయిస్తాయనేది తెలియాల్సి ఉంది. విశాల్ మెగామార్ట్ సీఈఓ గుణేందర్ కపూర్ ఐపీఓ వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. -
కోహ్లీ, అనుష్క శర్మల కంపెనీకి లైన్ క్లియర్
వ్యాపారవేత్తలే కాకుండా ప్రముఖులు సైతం కంపెనీలు స్థాపిస్తున్నారు. అందులో పెట్టుబడి పెడుతున్నారు. భవిష్యత్తులో అభివృద్ధి అయ్యే మంచి బిజినెస్ మోడల్ ఉన్నవారికి ఇన్వెస్టర్లుగా మారుతున్నారు. దాంతో ఇరువురికి లాభం జరిగేలా వ్యవహరిస్తున్నారు. అందులో కొన్ని కంపెనీలు మరింత వృద్ధి చెంది ఐపీవోగా స్టాక్మార్కెట్లోనూ లిస్ట్ అవుతున్నాయి. అలాంటి సంస్థ ‘గో డిజిట్’ ఐపీవోకు తాజాగా సెబీ ఆమోదం తెలిపింది. ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ పెట్టుబడి పెట్టిన ‘గో డిజిట్’ ఐపిఓకి వెళ్లేందుకు లైన్క్లియర్ అయింది. అందుకు సంబంధించి మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఆమోదం తెలిపింది. గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్లో ఇన్వెస్టర్ అయిన కెనడాకు చెందిన ఫెయిర్ఫాక్స్ గ్రూప్ కూడా మద్దతు తెలిపింది. ఆగస్టు 2022లో కంపెనీ ఐపీఓ కోసం ప్రిలిమినరీ పత్రాలను దాఖలు చేసింది. డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్హెచ్పీ) వివరాల ప్రకారం..గో డిజిట్ ఐపీఓలో రూ.1,250 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనున్నట్లు తెలిసింది. ఐపీఓ ద్వారా సమకూరే మూలధనాన్ని కార్పొరేట్ ప్రయోజనాల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఐపీవో ద్వారా నిధులు సేకరించేందుకు కంపెనీ మొదటగా ఆగస్టు 2022లో సెబీకు డీఆర్హెచ్పీ దాఖలు చేసింది. అయినప్పటికీ, ఉద్యోగులకు సంబంధించి స్టాక్ అప్రిసియేషన్ రైట్స్ స్కీమ్లోని కొన్ని కారణాల వల్ల కొద్దికాలంపాటు నిలిచిపోయింది. సెబీ జనవరి 30, 2023న గో డిజిట్ డ్రాఫ్ట్ ఐపీఓ పేపర్లను తిరిగి ఇచ్చింది. కంపెనీ నుంచి మరింత సమాచారం కోరింది. ఇదీ చదవండి: మరో సంస్థపై ఆంక్షలు విధించిన ఆర్బీఐ సవరించిన సమాచారంతో ఏప్రిల్ 2023లో ప్రిలిమినరీ ఐపీఓ పత్రాలను సెబీకి దాఖలు చేసింది. అన్ని పరిశీలించిన సెబీ తాజాగా ఐపీవోకు లైన్ క్లియర్ చేసినట్లు తెలిసింది. -
పెట్టుబడుల ఆశచూపి.. అందినకాడికి దోపిడీ
సాక్షి, హైదరాబాద్: స్టాక్ మార్కెట్లో తాము చెప్పే కంపెనీల్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశచూపి బ్యాంకు ఖాతాలు ఖాళీచేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. షేర్ల కొనుగోలు పేరిట అమాయకులకు గాలం వేసి రూ.కోట్లలో దోచుకుంటున్నారు. ఈ తరహా ఐపీఓ ట్రేడింగ్ మోసాలు ఇటీవల పెరిగినట్టు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది. కొత్తగా మార్కెట్లోకి వచ్చే ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్)లను ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్ట్మెంట్ కింద కొనుగోలు చేయండి అంటూ సైబర్ నేరగాళ్లు నమ్మబలుకుతున్నట్టు పేర్కొంది. 2023లో ఈ తరహా కేసులు 627 నమోదు కాగా, బాధితులు రూ.3,91,54,683 పోగొట్టుకున్నట్టు టీఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వెల్లడించింది. ఈ ఏడాదిలో రెండు నెలల్లోనే మొత్తం 213 కేసులు నమోదయ్యాయని, బాధితులు రూ.27,40,76,211 పోగొట్టుకున్నట్టు అధికారులు తెలిపారు. ఇలా మోసగిస్తున్నారు.. సైబర్ మోసగాళ్లు తొలుత వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్ట్రాగామ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా యాప్ల ద్వారా లింక్లు పంపుతున్నారు. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్(ఎఫ్పీఐ)ల వంటి ఇన్స్టిట్యూషనల్ విధానాల్లో ఐపీఓలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మబలుకుతున్నారు. ఈ ప్రకటనలు నమ్మి ఎవరైనా పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపితే, వారిని ఫేక్ ట్రేడింగ్ యాప్లను డౌన్లోడ్ చేసుకునేలా సైబర్ నేరగాళ్లు ప్రోత్సహించి తమ అదీనంలో ఉండే బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు వేయించుకుంటారు. నకిలీ యాప్లో బోగస్ డ్యాష్ బోర్డులను సృష్టించి వారికి లాభాలు వస్తున్నట్టుగా చూపుతున్నా రు. మరింత పెట్టుబడి పెడితే పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయ ని నమ్మిస్తారు. బాధితులు చివరకు తమ సొమ్మును డ్రా చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడు మోసపోయిన విషయం తెలుస్తుంది. ఈ తరహా ట్రేడింగ్ మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు హెచ్చరిస్తున్నా రు. ఒకవేళ తాము మోసపోయినట్టు గుర్తిస్తే బాధితులు వెంటనే 1930 టోల్ఫ్రీనంబర్లో లేదా cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. -
నేటి నుంచి 3 ఐపీవోలు
న్యూఢిల్లీ: నేటి(బుధవారం) నుంచి మూడు కంపెనీల పబ్లిక్ ఇష్యూలు ప్రారంభంకానున్నాయి. శుక్రవారం(9న) ముగియనున్న ఇష్యూల జాబితాలో రాశి పెరిఫెరల్స్, జానా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉన్నాయి. ఉమ్మడిగా సుమారు రూ. 1,700 కోట్లు సమీకరించనున్నాయి. ప్రస్తుతం ద పార్క్ బ్రాండ్తో హోటళ్లను నిర్వహిస్తున్న ఏపీజే సురేంద్ర పార్క్ రూ. 920 కోట్లు అందుకునేందుకు పబ్లిక్ ఇష్యూకి తెరతీసిన సంగతి తెలిసిందే. వీటికి అదనంగా ఎంటెరో హెల్త్కేర్ సొల్యూషన్స్ ఈ నెల 9న ఐపీవోకు రానుంది. తద్వారా రూ. 1,600 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. ఈ బాటలో గత నెలలోనూ ఐదు కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్ ద్వారా ఉమ్మడిగా రూ. 3,266 కోట్లు సమకూర్చుకోవడం ప్రస్తావించదగ్గ అంశం! రాశి వివరాలిలా.. ఐపీవోలో భాగంగా ఐటీ, కమ్యూనికేషన్స్ టెక్నాలజీ ప్రొడక్టుల పంపిణీ సంస్థ రాశి పెరిఫెరల్స్ పూర్తిగా ఈక్విటీ జారీని చేపట్టనుంది. మొత్తం రూ. 600 కోట్ల విలువైన షేర్లను జారీ చేయడం ద్వారా అంతేమేర నిధులు సమకూర్చుకోనుంది. ఇందుకు రూ. 295–311 ధరల శ్రేణిని ప్రకటించింది. ఐపీవో నిధులలో రూ. 326 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 220 కోట్లు వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచి్చంచనుంది. జానా స్మాల్ తీరిదీ పీఈ దిగ్గజాలు టీపీజీ, మోర్గాన్ స్టాన్లీలకు పెట్టుబడులున్న జానా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఐపీవో ద్వారా రూ. 462 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 108 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. మొత్తం రూ. 574 కోట్ల సమీకరణపై కన్నేసిన కంపెనీ రూ. 393–414 ధరల శ్రేణిని ప్రకటించింది. ఈక్విటీ జారీ నిధులను భవిష్యత్ అవసరాలరీత్యా మూలధన పటిష్టతకు, కనీస మూలధన నిష్పత్తి మెరుగుకు వినియోగించనుంది. క్యాపిటల్ స్మాల్ రెడీ ఐపీవోలో భాగంగా క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రూ. 450 కోట్ల విలువైన ఈక్విటీని జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 73 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్ చేయనున్నారు. తద్వారా రూ. 523 కోట్లు అందుకోనుంది. ఇందుకు రూ. 445–468 ధరల శ్రేణిని ప్రకటించింది. ఈక్విటీ జారీ నిధులను భవిష్యత్ అవసరాలరీత్యా టైర్–1 మూలధన పటిష్టతకు కేటాయించనుంది. -
Hyundai IPO: ఐపీవో బాటలో హ్యుందాయ్.. రూ.27500 కోట్ల సమీకరణ!
న్యూఢిల్లీ: ఆటో రంగ దక్షిణ కొరియా దిగ్గజం హ్యుందాయ్ మోటార్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. దేశీ అనుబంధ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్(హెచ్ఎంఐఎల్)ను స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్ చేయడం ద్వారా కనీసం 3.3 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 27,500 కోట్లు) సమీకరించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దేశీయంగా కార్ల తయారీకి అతిపెద్ద కంపెనీలలో మారుతీ సుజుకీ ఇండియా తదుపరి రెండో ర్యాంకులో నిలుస్తున్న హెచ్ఎంఐఎల్.. ఐపీవో ద్వారా 15–20 శాతం వాటాను విక్రయించే వీలున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెరసి 3.3–5.6 బిలియన్ డాలర్లు సమీకరించవచ్చని అంచనా వేశాయి. అంచనాలకు అనుగుణంగా హెచ్ఎంఐఎల్ పబ్లిక్ ఇష్యూకి వస్తే బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ రికార్డును అధిగమించే వీలుంది. రూ. 21,000 కోట్ల సమీకరణ చేపట్టిన ఎల్ఐసీ ఇష్యూ.. అతిపెద్ద ఐపీవోగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అంశాలపై కంపెనీ ప్రతినిధులు స్పందించకపోవడం గమనార్హం! దేశీయంగా 1996లో హెచ్ఎంఐఎల్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం విభిన్న విభాగాలలో 13 రకాల మోడళ్ల కార్లను విక్రయిస్తోంది. దేశవ్యాప్తంగా 1,366 అమ్మకాల ఔట్లెట్లు, 1,549 సర్వీసు పాయింట్లను కలిగి ఉంది. -
ఐపీవోకు 4 కంపెనీలు రెడీ
న్యూఢిల్లీ: ఇటీవల కళకళలాడుతున్న ప్రైమరీ మార్కెట్లో మరో నాలుగు కంపెనీలు సందడి చేయనున్నాయి. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి తాజాగా అనుమతులు పొందాయి. ఈ జాబితాలో ఎంటెరో హెల్త్కేర్ సొల్యూషన్స్, జేఎన్కే ఇండియా, ఎక్సికామ్ టెలీసిస్టమ్స్, అక్మే ఫిన్ట్రేడ్(ఇండియా) చేరాయి. 2023 జూన్– అక్టోబర్ మధ్య కాలంలో ఈ నాలుగు కంపెనీలు సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేశాయి. కాగా.. స్టాలియన్ ఇండియా ఫ్లోరోకెమికల్స్ ఐపీవో దరఖాస్తును మాత్రం సెబీ తిప్పిపంపింది. వివరాలు చూద్దాం.. ఎంటెరో హెల్త్కేర్.. స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్కు వీలుగా ఎంటెరో హెల్త్కేర్ సొల్యూషన్స్ సెబీ నుంచి గ్రీన్సిగ్నల్ను అందుకుంది. ఐపీవోలో భాగంగా రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. ప్రాస్పెక్టస్ ప్రకారం వీటికి జతగా మరో 85.57 లక్షల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఎంటెరో హెల్త్ను 2018లో ప్రభాత్ అగర్వాల్, ప్రేమ్ సేథీ ఏర్పాటు చేశారు. జేఎన్కే ఇండియా పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించేందుకు జేఎన్కే ఇండియా సెబీ నుంచి అనుమతి పొందింది. ఇష్యూలో భాగంగా రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. ప్రాస్పెక్టస్ ప్రకారం వీటికి జతగా మరో 84.21 లక్షల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. అక్మే ఫిన్ట్రేడ్ ఐపీవోలో భాగంగా అక్మే ఫిన్ట్రేడ్(ఇండియా) 1.1 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ప్రాస్పెక్టస్ ప్రకారం ఈక్విటీ జారీ నిధులను మూలధన పటిష్టతకు వినియోగించనుంది. ఎక్సికామ్టెలీ టెలికం రంగ కంపెనీ ఎక్సికామ్ టెలీసిస్టమ్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్కు సిద్ధపడుతోంది. దీనిలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో 74 లక్షల షేర్లను ప్రమోటర్ సంస్థ నెక్ట్స్వేవ్ కమ్యూనికేషన్స్ విక్రయానికి ఉంచనుంది. ప్రస్తుతం నెక్ట్స్వేవ్కు కంపెనీలో 71.45 శాతం వాటా ఉంది. ఈక్విటీ జారీ నిధులను తెలంగాణలోని తయారీ యూనిట్లో ప్రొడక్షన్ లైన్ల ఏర్పాటుకు వినియోగించనుంది. మరికొన్ని నిధులను పరిశోధన, అభివృద్ధి, ప్రొడక్ట్ డెవలప్మెంట్, రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనుంది. -
త్వరలో ఐపీవోకి.. అంతలోనే రూ.300 కోట్ల షేర్లు అమ్ముకున్న సీఈవో..
పిల్లల దుస్తులు, ఉత్పత్తులను విక్రయించే ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ‘ఫస్ట్క్రై’ (FirstCry) త్వరలో ఐపీవోకి రానుంది. అంతలోనే ఈ కంపెనీ సీఈవో దాదాపు రూ.300 కోట్ల విలువైన షేర్లను అమ్మేసుకున్నారు. కంపెనీ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) ప్రకారం.. ఫస్ట్క్రై సీఈవో సుపమ్ మహేశ్వరి ఐపీవో కోసం పత్రాలను సమర్పించడానికి పది రోజుల ముందు కంపెనీకి చెందిన 6.2 మిలియన్ షేర్లను విక్రయించారు. ఒక్కొక్కటి రూ.487.44 ధరతో మొత్తం రూ.300 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. సీఈవో సుపమ్ మహేశ్వరి పబ్లిక్ ఇష్యూలో సెల్లింగ్ షేర్హోల్డర్గా కూడా నమోదు చేసుకున్నారని మనీకంట్రోల్ నివేదించింది. 6.2 మిలియన్లకు పైగా షేర్లను ఆఫ్లోడ్ చేయడానికి ముందు, సుపమ్ మహేశ్వరి కంపెనీలో 7.46 శాతం వాటాను (35,097,831 షేర్లు) కలిగి ఉన్నారు. ఇప్పుడు కంపెనీలో ఆయన వాటా 5.95 శాతానికి (28,893,347 షేర్లు) తగ్గింది. ఐపీవోకి వచ్చే నాటికి ఫస్ట్క్రై కంపెనీ విలువ 3.5 నుంచి 3.75 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. అయితే ఐపీవో తేదీ ఇంకా ఖరారు కాలేదు. ఫస్ట్క్రై సహ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన సుపమ్ మహేశ్వరి అహ్మదాబాద్ ఐఐఎం నుంచి పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందారు. బ్రెయిన్వీసా అనే కంపెనీతో తన వ్యవస్థాపక ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన పిల్లల ఉత్పత్తుల విక్రయ సంస్థలు పరిమితంగా ఉన్నాయని గ్రహించి 2010లో అమితవ సాహాతో కలిసి ఫస్ట్క్రై కంపెనీని స్థాపించారు. ఇందులో మహీంద్ర అండ్ మహీంద్ర, సాఫ్ట్ బ్యాంక్ వంటివి కూడా పెట్టుబడులు పెట్టాయి. -
పెట్టుబడి దారులకు శుభవార్త!. టాటా గ్రూప్ నుంచి ఐపీఓకి మరో సంస్థ
పెట్టుబడి దారులకు శుభవార్త. ప్రముఖ దేశీయ డైవర్సిఫైడ్ దిగ్గజం టాటా గ్రూప్ నుంచి మరో సంస్థ ఐపీఓకి రానుంది. ఇటీవల టాటాగ్రూప్ 20 ఏళ్ల తర్వాత టాటా టెక్నాలజీస్ ఐపీఓకి వచ్చింది. దాదాపు 2 దశాబ్ధాల తర్వాత టాటా గ్రూప్ నుంచి ఐపీఓ రావడంపై మదుపర్లు ఆసక్తి చూపించారు. ఇప్పుడు వారి ఆసక్తిని మరింత రెట్టింపు చేసేలా టాటా గ్రూప్లో భాగమైన టాటా ఆటోక్యాప్ సిస్టమ్ (టీఏసీఓ) ఐపీఓకి తెచ్చేలా టాటా గ్రూప్ ఆ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. టాటా ఆటోక్యాప్ సిస్టమ్ సంస్థ వాహనాల తయారీకి కావాల్సిన విడి భాగాల్ని తయారు చేస్తుంది. ఈ సంస్థను ఐపీఓ తెచ్చే యోచనలో ట్రాప్ గ్రూప్ ఉంది. ప్రస్తుతం అవి ప్రారంభ దశలో ఉన్నాయి. 1995లో టీఏసీఓని టాటా గ్రూప్ నిర్మించింది. ఇందులో టాటా సన్స్ 21 శాతం వాటా ఉండగా.. మిగిలిన మొత్తం టాటా ఇండస్ట్రీస్కి ఉంది. -
కొత్త ఏడాది మొదలవనున్న పబ్లిక్ ఇష్యూలు..
కొద్ది నెలలుగా దుమ్ము రేపుతున్న ప్రైమరీ మార్కెట్ ప్రభావంతో మూడు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు సిద్ధపడుతున్నాయి. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి రెండు కంపెనీలు ముసాయిదా ప్రాస్పెక్టస్లను దాఖలు చేశాయి. సోలార్ ఈపీసీ కంపెనీ రేస్ పవర్ ఇన్ఫ్రా, సమీకృత ఐటీ సొల్యూషన్లు అందించే ఎస్కోనెట్ టెక్నాలజీస్ తాజాగా సెబీని ఆశ్రయించాయి. ఈ బాటలో ఇన్సులేటెడ్ వైర్లు, స్ట్రిప్స్ తయారీ కంపెనీ డివైన్ పవర్ ఎనర్జీ సైతం స్టాక్ ఎక్ఛ్సెంజీలలో లిస్టింగ్పై కన్నేసింది. ఆ వివరాలు చూద్దాం.. రేస్ పవర్ ఇన్ఫ్రా సోలార్ ఈపీసీ కంపెనీ రేస్ పవర్ ఇన్ఫ్రా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్కు సన్నాహాలు చేస్తోంది. ఇందుకు ఐపీవోను చేపట్టనుంది. ప్రాస్పెక్టస్ ప్రకారం పబ్లిక్ ఇష్యూలో భాగంగా రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 29.95 లక్షల షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఐపీవోకంటే ముందుగానే షేర్ల జారీ లేదా ప్రమోటర్లు 14.97 లక్షల షేర్లను ఆఫర్ చేయడం ద్వారా రూ. 45 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇది జరిగితే ఆమేర ఈక్విటీ జారీ తగ్గనుంది. ఈక్విటీ జారీ నిధులను వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. షేర్లు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో లిస్ట్కానున్నాయి. కంపెనీ ప్రధానంగా సోలార్ విభాగంలో ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్(ఈపీసీ) సరీ్వసులను అందిస్తోంది. 1,207 మెగావాట్ల పీక్ పవర్ ప్రాజెక్టుల అభివృద్ధి ద్వారా కంపెనీ దేశీయంగా సోలార్ విభాగంలోని లీడింగ్ కంపెనీలలో ఒకటిగా నిలుస్తోంది. గతేడాది(2022–23) మొత్తం ఆదాయం రూ. 891 కోట్లకు చేరగా.. నికర లాభం రూ. 131 కోట్లను అధిగమించింది. ఎస్కోనెట్ టెక్నాలజీస్ ఐటీ రంగంలో సమీకృత సరీ్వసులందిస్తున్న ఎస్కోనెట్ టెక్నాలజీస్ ఐపీవో ద్వారా నిధుల సమీకరణ ప్రణాళికలకు తెరతీసింది. దీనిలో భాగంగా రూ. 10 ముఖ విలువగల 33,60,000 షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్ఫామ్ ద్వారా కంపెనీ లిస్ట్కానుంది. ఈక్విటీ జారీ నిధులను వర్కింగ్ క్యాపిటల్ అవసరాలతోపాటు.. పూర్తి అనుబంధ సంస్థ జీక్లౌడ్ సరీ్వసెస్ విస్తరణ వ్యయాలకు వినియోగించనుంది. అంతేకాకుండా మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకూ వెచి్చంచనున్నట్లు ప్రాస్పెక్టస్లో పేర్కొంది. 2012లో ఏర్పాటైన కంపెనీ హైఎండ్ సూపర్ కంప్యూటింగ్ సొల్యూషన్స్, డేటా సెంటర్ సౌకర్యాలు, స్టోరేజీ సర్వర్లు, నెట్వర్క్ సెక్యూరిటీ, డేటా ప్రొటెక్షన్ తదితరాలను సమకూర్చుతోంది. గ్లోబల్ దిగ్గజాలు ఏఎండీ, అమెజాన్ వెబ్ సరీ్వసెస్, సిస్కో, డెల్ టెక్నాలజీస్, హెచ్పీ, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా సాంకేతిక భాగస్వాములుగా వ్యవహరిస్తున్నట్లు ప్రాస్పెక్టస్లో పేర్కొంది. రక్షణ శాఖ, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, ఐఐటీ, భారత్ ఎలక్ట్రానిక్స్ తదితరాలు క్లయింట్లుగా ఉన్నట్లు తెలియజేసింది. డివైన్ పవర్ ఎనర్జీ ఇన్సులేటెడ్ వైర్లు, స్ట్రిప్స్ తయారీ కంపెనీ డివైన్ పవర్ ఎనర్జీ పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో ఉంది. తద్వారా సమకూర్చుకున్న నిధులతో సామర్థ్య విస్తరణ చేపట్టాలని ప్రణాళికలు వేసింది. తాజా పెట్టుబడుల వినియోగంతో 2026కల్లా రూ. 400 కోట్ల టర్నోవర్ను సాధించాలని ఆశిస్తోంది. వెరసి ఈ ఫిబ్రవరి లేదా మార్చికల్లా ఐపీవో చేపట్టే ప్రణాళికల్లో ఉంది. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునే లక్ష్యంతో సాగుతోంది. దీంతో 2025కల్లా ఆదాయాన్ని రెట్టింపునకు పెంచుకోవాలని చూస్తోంది. ప్రస్తుత రూ. 150 కోట్ల టర్నోవర్ను తొలుత రూ. 300 కోట్లకు, ఆపై రూ. 400 కోట్లకు పెంచుకునే ప్రణాళికలు అమలు చేయనుంది. కంపెనీ పేపర్ కవర్డ్, డబుల్ కాటన్ కవర్డ్ కండక్టర్లు, ఫైబర్గ్లాస్ ఇన్సులేషన్, సూపర్ ఎనామిల్డ్ ఇన్సులేషన్లను రూపొందిస్తోంది. వీటిని ప్రధానంగా ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు తదితర ఎలక్ట్రికల్ పరికరాలలో వినియోగిస్తారు. ఘజియాబాద్లో 40,000 చదరపు అడుగులలో విస్తరించిన తయారీ యూనిట్ ద్వారా రూపొందించిన ప్రొడక్టులను టాటా పవర్, బీఎస్ఈఎస్సహా పలు ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలకు అందిస్తోంది. నాల్కో, బాల్కో, హిండాల్కో నుంచి ముడిసరుకులను పొందుతోంది. -
ఎస్ఎంఈ ఐపీవోల దూకుడు
కొద్ది రోజులుగా దేశీ స్టాక్ మార్కెట్ల ప్రధాన ఇండెక్సులు సరికొత్త గరిష్టాలను తాకుతున్నాయి. తాజాగా ఇటు సెన్సెక్స్ 72,000 పాయింట్ల మైలురాయిని చేరగా.. పోటీగా అటు నిఫ్టీ 22,000 పాయింట్ల మార్క్వైపు కదులుతోంది. ఇటీవల ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఉత్సాహం చూపుతుండటంతో ప్రధాన ప్రైమరీ మార్కెట్ పలు ఐపీవోలతో కళకళలాడుతోంది. ఈ ప్రభావంతో చిన్న, మధ్యతరహా కంపెనీలు(ఎస్ఎంఈ) సైతం లిస్టింగ్కు క్యూ కడుతున్నాయి. వెరసి ఎస్ఎంఈ పబ్లిక్ ఇష్యూలు వెల్తువెత్తుతున్నాయి. దీంతో 2023లో సరికొత్త రికార్డుకు తెరలేచింది. వివరాలు చూద్దాం.. ముంబై: ఈ క్యాలండర్ ఏడాది(2023)లో ఎస్ఎంఈ పబ్లిక్ ఇష్యూల విభాగం దూకుడు చూపుతోంది. ఇప్పటివరకూ 166 కంపెనీలు ఐపీవోలను పూర్తి చేసుకున్నాయి. బ్రోకింగ్ సంస్థ ఫైయర్స్ రీసెర్చ్ గణాంకాల ప్రకారం రూ. 4,472 కోట్లు సమీకరించాయి. ఇది సరికొత్త రికార్డ్కాగా.. ఇంతక్రితం 2022లో 109 ఎస్ఎంఈలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. మొత్తం రూ. 1,980 కోట్లు సమకూర్చుకున్నాయి. కాగా.. ఈ ఏడాది ఐపీవోకి వచ్చిన 166 సంస్థలలో 136 లాభాలతో లిస్టయ్యాయి. వీటిలో 24 ఎస్ఎంఈలు లిస్టింగ్ రోజున ఏకంగా 100 శాతం లాభాలను సాధించాయి. జాబితాలో గోయల్ సాల్ట్ 258 శాతం దూసుకెళ్లి టాప్ ర్యాంకును కైవసం చేసుకుంది. ఈ బాటలో సన్గార్నర్ ఎనర్జీస్ 216 శాతం, బేసిలిక్ ఫ్లై 193 శాతం జంప్చేసి తదుపరి ర్యాంకుల్లో నిలిచాయి. ఇన్వెస్టర్ల క్యూ ఎస్ఎంఈ పబ్లిక్ ఇష్యూలకు ఇన్వెస్టర్లు క్యూ కడుతున్నారు. ఈ ఏడాది లిస్టయిన సంస్థలలో 51 ఇష్యూలు 100 రెట్లుపైగా సబ్ర్స్కిప్షన్ను సాధించాయి. మరో 12 ఐపీవోలు ఏకంగా 300 రెట్లు అధికంగా డిమాండును అందుకున్నాయి. ఫైయర్స్ వివరాల ప్రకారం రిటైల్ ఇన్వెస్టర్లు చరిత్రాత్మక స్థాయిలో ఆసక్తి చూపుతున్నారు. అంతగా ప్రసిద్ధంకాని చాలా కంపెనీల ఇష్యూలలో సైతం రిటైలర్లు భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. వెరసి స్పందనలో గత రికార్డులను తుడిచిపెడుతున్నారు. అయితే ఇకపై రానున్న ఐపీవోల విషయంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉన్నట్లు ఫైయర్స్ పేర్కొంది. మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాలకు చేరిన ప్రస్తుత పరిస్థితుల్లో జాగ్రత్త వహించవలసిందిగా సూచిస్తోంది. ఈ స్పీడ్ దీర్ఘకాలం కొనసాగకపోవచ్చని అభిప్రాయపడింది. కొన్ని కంపెనీల షేర్లు దూకుడు చూపుతున్నప్పటికీ ఆర్థిక పనితీరు ఆ స్థాయిలో ఉండటంలేదని ప్రస్తావిస్తోంది. వెరసి చిన్న ఇన్వెస్టర్లకు బహుపరాక్ చెబుతోంది! జోరు తీరిదీ.. బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ ద్వారా లిస్టయిన సంస్థలలో గోయల్ సాల్ట్ ముందునిలవగా.. లిస్టింగ్ రోజు భారీ లాభాలు ఆర్జించిన ఐపీవోల జాబితాలో పలు సంస్థలు చోటు సాధించాయి. వీటిలో సన్గార్నర్ ఎనర్జీస్(216 శాతం), బేసిలిక్ ఫ్లై స్టుడియో(193 శాతం), స్(216 శాతం), ఓరియానా పవర్(169 శాతం), ఏనియన్ టెక్ సొల్యూషన్స్(164 శాతం), సీపీఎస్ షేపర్స్(155 శాతం), శ్రీవారి స్పైసెస్(154 శాతం), ఇన్ఫోలియన్ రీసెర్చ్(142 శాతం), రాకింగ్డీల్స్ సర్క్యులర్(125 శాతం), నెట్ ఎవెన్యూ టెక్(122 శాతం), పారగాన్ ఫైన్ ఎస్(114 శాతం), విన్యాస్ ఇన్నొవేటివ్ టెక్(110 శాతం), కృష్ణా స్ట్రాపింగ్(109 శాతం), సార్ టెలివెంచర్(101 శాతం), ఇన్నోకయిజ్ ఇండియా(100 శాతం) తదితరాలున్నాయి. -
ముత్తూట్ మైక్రోఫిన్ నేలచూపు.. ఐపీఓలో మదుపర్లకు నిరాశ
ఇటీవలే పబ్లిక్ ఇష్యూకి వచ్చిన ముత్తూట్ పాపచన్ గ్రూప్ అనుబంధ సంస్థ ముత్తూట్ మైక్రోఫిన్ లిమిటెడ్ లిస్టింగ్లో ఇన్వెస్టర్లను నిరాశ పరచింది. ఇష్యూ ధర రూ. 291తో పోలిస్తే బీఎస్ఈలో 4.5 శాతం తక్కువగా రూ. 278 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఆపై ఒక దశలో 9 శాతంవరకూ పతనమై రూ. 265 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 8.5 శాతం నష్టంతో రూ. 266 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలోనూ 5.4 శాతం డిస్కౌంట్తో రూ. 275 వద్ద లిస్టయ్యింది. చివరికి 8.6 శాతం క్షీణతతో రూ. 266 వద్ద నిలిచింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ. 4,539 కోట్లుగా నమోదైంది. 11 రెట్లుపైగా స్పందన లభించిన ఐపీవో ద్వారా కంపెనీ రూ. 960 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. ముత్తూట్ ఫిన్కార్ప్ ప్రమోట్ చేసిన కంపెనీ ప్రధానంగా మైక్రోఫైనాన్స్ సరీ్వసులు అందిస్తోంది. -
ఫస్ట్క్రైలో సాఫ్ట్బ్యాంక్ వాటాల విక్రయం
న్యూఢిల్లీ: త్వరలో ఐపీవోకి రానున్న రిటైల్ సంస్థ ఫస్ట్క్రైలో జపాన్ దిగ్గజం సాఫ్ట్బ్యాంక్ 310 మిలియన్ డాలర్ల విలువ చేసే షేర్లను విక్రయించింది. రెండు విడతల్లో షేర్లను విక్రయించగా, కొందరు అత్యంత సంపన్న ఇన్వెస్టర్లు కొనుగోలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ డీల్స్తో ఫస్ట్క్రై వేల్యుయేషన్ను 3.5–3.75 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టినట్లు పేర్కొన్నాయి. 900 మిలియన్ డాలర్ల వేల్యుయేషన్తో ఫస్ట్క్రైలో సాఫ్ట్బ్యాంక్ గతంలో 400 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. తాజా విక్రయానంతరం కంపెనీలో సాఫ్ట్బ్యాంక్కు ఇంకా 800–900 మిలియన్ డాలర్ల విలువ చేసే వాటాలు ఉన్నాయి. వీటిని తర్వాత విక్రయించే యోచనలో ఉంది. మొత్తం మీద ఫస్ట్క్రైలో పెట్టుబడుల ద్వారా 1.3 బిలియన్ డాలర్లు ఆర్జించడంపై సాఫ్ట్బ్యాంక్ దృష్టి పెట్టినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. -
ఈవారం ఐపీఓకు రానున్న కంపెనీలు ఇవే!
న్యూఢిల్లీ: స్టీల్ ప్రొడక్టుల తయారీ కంపెనీ శ్రీ బాలాజీ వాల్వ్ కంపోనెంట్స్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 27న ప్రారంభంకానుంది. 29న ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి షేరుకి రూ. 95–100గా ప్రకటించింది. ఆఫర్లో భాగంగా 21.6 లక్షల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. తద్వారా రూ. 21.6 కోట్లు సమీకరించనుంది. కంపెనీ షేర్లు బీఎస్ ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ ద్వారా లిస్ట్కానున్నాయి. ఇష్యూ నిధులను పెట్టుబడి వ్యయాలు, అదనపు ప్లాంట్లు, మెషీన్ల ఏర్పాటు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వెచి్చంచనుంది. విద్యుత్, నిర్మాణం, చమురుగ్యాస్, ఫార్మా రంగాలలో వినియోగించే వాల్వ్ సంబంధ పరికరాలను కంపెనీ రూపొందిస్తోంది. ఆఫిస్ స్పేస్ లిస్టింగ్ బాట ఇటీవల పలు పబ్లిక్ ఇష్యూలతో కళకళలాడుతున్న ప్రైమరీ మార్కెట్ మరింత జోరు చూపనుంది. తాజాగా ఆఫిస్ స్పేస్ సొల్యూషన్స్, గ్రేటెక్స్ షేర్ బ్రోకింగ్ లిస్టింగ్ సన్నాహాలు ప్రారంభించాయి. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ముసాయిదా ప్రాస్పెక్టస్లను దాఖలు చేశాయి. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ స్పేస్ సొల్యూషన్స్ అందించే ఆఫీస్ స్పేస్ ఇష్యూలో భాగంగా రూ. 160 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో కోటి ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. గ్రేటెక్స్ షేర్ బ్రోకింగ్ రెడీ స్టాక్ మార్కెట్ సంబంధ సరీ్వసులందించే గ్రెటెక్స్ షేర్ బ్రోకింగ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు సెబీకి ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. వీటి ప్రకారం కంపెనీ 1.67 కోట్ల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా వీటికి జతగా మరో 30.96 లక్షల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. మార్కెట్ మేకింగ్, స్టాక్ బ్రోకింగ్, క్యాపిటల్ మార్కెట్ ఆఫర్లకు అండర్ రైటింగ్, ఎన్ఎస్డీఎల్కు డిపాజిటరీ పారి్టసిపెంట్లుగా సరీ్వసులు సమకూర్చుతోంది. -
ఈ ఏడాది దుమ్మురేపిన టాప్ ఐపీవోలు ఇవే..
కంపెనీ స్థాపించి దాన్ని స్టాక్మార్కెట్లో లిస్ట్ చేయాలంటే 20 ఏళ్ల కింద పెద్ద సాహసంతో కూడిన వ్యవహారం. కానీ పెరుగుతున్న సాంకేతికత, నైపుణ్యాల అభివృద్ధితో మంచి బిజినెస్ మోడల్ ఐడియా ఉంటే ప్రస్తుతం కోటీశ్వరులుగా మారొచ్చు. మంచి కంపెనీని స్థాపించి ఆర్థికంగా ఎదుగుతూ, వారిని నమ్ముకున్న ముదుపర్లను సైతం ఎదిగేలా చేయొచ్చని చాలా మంది నిరూపిస్తున్నారు. అయితే 2023లో అలాంటి మంచి బిజినెస్ మోడల్ ఐడియాతో మార్కెట్లో లిస్ట్అయి ఇన్వెస్టర్లకు మెరుగైన రాబడులను అందించిన కొన్ని టాప్ ఐపీఓల గురించి తెలుసుకుందాం. ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చిన అనేక ఐపీవోలు మంచి లాభాలను అందించి మల్టీబ్యాగర్లుగా నిలిచాయి. అందులో అధిక రాబడులను అందించిన టాప్ ఐపీవోల జాబితాలో.. ఐఆర్ఈడీఏ, సియెట్ డీఎల్ఎం, టాటా టెక్నాలజీస్, సెన్కో గోల్డ్ వంటి కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. ఈ క్రమంలో తక్కువ కాలంలోనే మంచి లాభాలను అందించాయి. ఇన్వెస్టర్లకు అధిక లాభాలు మిగిల్చిన ఐపీఓ లిస్ట్లో టాప్లో ఇండియన్ రెన్యూవెబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్(ఐఆర్ఈడీఏ) నిలిచింది. నవంబర్లో ఈ కంపెనీ రూ.32 ఇష్యూ ధరతో ఐపీఓగా మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం రూ.109 వద్ద ఈ కంపెనీ షేర్ ట్రేడవుతోంది. పెట్టుబడిదారులకు ఊహించని రాబడులను అందించిన ఐపీవోగా ఈ ఏడాది సియెంట్ టీఎల్ఎం నిలిచింది. జూలై 10న మార్కెట్లో లిస్టింగ్ సమయంలో 58 శాతానికి పైగా రాబడిని అందించింది. ఆ తర్వాత సైతం ఐపీవో తన పెట్టుబడిదారులకు 145 శాతానికి పైగా రాబడిని ఇచ్చింది. ఐపీవో ఇష్యూ ధర రూ.265గా ఉండగా.. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.778.90గా ఉంది. ఇదీ చదవండి: ఉంటుందో..? ఊడుతుందో..? ఇక మంచి రాబడులను అందించిన జాబితాలో టాటా టెక్నాలజీస్ ఐపీవో మూడో స్థానంలో నిలిచింది. ఐపీవో 140 శాతం ప్రీమియం ధరకు లిస్టింగ్ గెయిన్స్తో బీఎస్ఈలో రూ.1199.95 వద్ద మార్కెట్లోని అడుగుపెట్టింది. తరువాతి స్థానంలో సెన్కో గోల్డ్ నిలిచింది. జులైలో ఈ కంపెనీ ఐపీగా లిస్ట్ అయింది. వాస్తవానికి కంపెనీ షేర్ల ప్రైస్ బ్యాండ్ రూ.301-రూ.317గా ఉంది. అయితే ప్రస్తుతం కంపెనీ రూ.725 వద్ద ట్రేడవుతుంది. -
3 ఐపీవోలకు సెబీ గ్రీన్సిగ్నల్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా మూడు కంపెనీల లిస్టింగ్ ప్రణాళికలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. జాబితాలో జ్యోతి సీఎన్సీ ఆటోమేషన్, బీఎల్ఎస్ ఈసర్వీసెస్, పాప్యులర్ వెహికల్స్ చేరాయి. పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు ఈ మూడు కంపెనీలూ సెబీకి ఆగస్ట్– అక్టోబర్ మధ్య కాలంలో ముసాయిదా ప్రాస్పెక్టస్లను దాఖలు చేశాయి. తాజాగా అనుమతులు పొందాయి. వివరాలు చూద్దాం.. రూ. 1,000 కోట్లు ఐపీవోలో భాగంగా జ్యోతి సీఎన్సీ ఆటోమేషన్ రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేసే యోచనలో ఉంది. ప్రాస్పెక్టస్ ప్రకారం ఇష్యూ నిధులను రుణ చెల్లింపులు, దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్(సీఎన్సీ) మెషీన్లను తయారు చేస్తోంది. జ్యోతి సీఎన్సీ ఆటోమేషన్ విభిన్న రంగాల నుంచి కస్టమర్లను కలిగి ఉంది. 2.41 కోట్ల షేర్లు పబ్లిక్ ఇష్యూలో భాగంగా బీఎల్ఎస్ ఈ–సరీ్వసెస్ 2.41 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ప్రాస్పెక్టస్ ప్రకారం ఇష్యూ నిధులను టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పటిష్టపరచుకోవడం, నూతన సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవడం, ప్రస్తుతమున్న ప్లాట్ఫామ్స్ను కన్సాలిడేట్ చేసుకోవడం తదితర కార్యకలాపాలకు వినియోగించనుంది. అంతేకాకుండా బీఎల్ఎస్ స్టోర్ల ఏర్పాటు, ఇతర సంస్థల కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు సైతం వెచ్చించనుంది. వీసా, కాన్సులర్ సర్వీసులందించే బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ సరీ్వసెస్కు ఇది అనుబంధ కంపెనీ. రూ. 250 కోట్ల ఈక్విటీ ఆటోమోటివ్ డీలర్షిప్స్ కంపెనీ పాప్యులర్ వెహికల్స్ అండ్ సరీ్వసెస్ పబ్లిక్ ఇష్యూలో భాగంగా రూ. 250 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో 1.42 కోట్ల షేర్లను బన్యన్ ట్రీ గ్రోత్ క్యాపిటల్–2 ఎల్ఎల్సీ విక్రయానికి ఉంచనుంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఆటో దిగ్గజాలు మారుతీ, హోండా, జేఎల్ఆర్ ప్యాసింజర్ వాహనాల డీలర్ షిప్స్ నిర్వహిస్తోంది. టాటా మోటార్స్ వాణిజ్య వాహన డీలర్ షిప్స్ను సైతం కలిగి ఉంది. -
ఐపీవో బాటలో ఓలా, ఫస్ట్క్రై
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కంపెనీ ఓలా, ఈకామర్స్ సంస్థ ఫస్ట్క్రై పబ్లిక్ ఇష్యూ బాటలో సాగుతున్నాయి. వచ్చే వారం క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్లను దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్ యాజమాన్యం దేశ, విదేశీ ఇన్వెస్టర్లను ఆకట్టుకునేందుకు రోడ్షోలను నిర్వహిస్తోంది. ఇక ఫస్ట్క్రై కొత్త ఏడాది(2024)లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల తదుపరి స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్కావచ్చని అంచనా. పీఈ దిగ్గజం సాఫ్ట్బ్యాంక్ రెండు సంస్థలలోనూ పెట్టుబడులున్న సంగతి తెలిసిందే. కాగా.. రెండు కంపెనీలూ వచ్చే వారం సెబీకి ప్రాస్పెక్టస్లను దాఖలు చేసే సన్నాహాల్లో ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఐపీవో ద్వారా ఫస్ట్క్రై 50 కోట్ల డాలర్లు(సుమారు రూ. 4,150 కోట్లు) సమీకరించే అవకాశముంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం దీనిలో 60 శాతం వరకూ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనుండగా.. మిగిలిన 40 శాతం ఈక్విటీని కొత్తగా జారీ చేసే వీలుంది. కాగా.. రంజన్ పాయ్ కంపెనీ ఎంఈఎంజీ ఫ్యామిలీ ఆఫీస్, హర్ష్ మరియావాలా సంస్థ షార్ప్ వెంచర్స్, హేమేంద్ర కొఠారీ సంస్థ డీఎస్పీ ఫ్యామిలీ ఆఫీస్ ఇటీవలే ఫస్ట్క్రైలో రూ. 435 కోట్ల విలువైన వాటాలను సొంతం చేసుకోవడం గమనార్హం! -
పెట్టుబడిదారులకు శుభవార్త, ఐపీఓకి ఓలా ఎలక్ట్రిక్.. ఎప్పుడంటే?
స్టాక్ మార్కెట్లోని పెట్టుబడిదారులకు శుభవార్త. ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం ఓలా ఎలక్ట్రిక్ త్వరలో ఐపీఓకి రానున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆ సంస్థ ఫౌండర్, సీఈఓ భవిష్ అగర్వాల్ డిసెంబర్ 20న సెబీకి డ్రాఫ్ట్ రెడ్ హియరింగ్ ప్రాస్పెక్ట్ (DRHP)ని దాఖలు చేయనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఐపీఓ ద్వారా 700 మిలియన్ డాలర్లను సేకరించనున్నారు. ఓలా లక్ష్యం అదే ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం సాఫ్ట్ బ్యాంక్ పెట్టుబడులున్న ఓలా సంస్థ వచ్చే ఏడాదిలో ఆ సంస్థ విలువ 7 నుంచి 8 బిలియన్ డాలర్ల మధ్య ఉండేలా ఓ లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. దానికి అనుగుణంగా ఐపీఓ ద్వారా నిధులు సేకరించి.. వాటితో ఓలా ఎలక్ట్రిక్ వెహికల్స్లో వినియోగించే లిథియం అయాన్ బ్యాటరీలను తయారు చేసే మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ను ఏర్పాటు చేయనుందని సమాచారం. నవంబర్ 17 నుంచే ప్రయత్నాలు ప్రారంభం ఓలా ఎలక్ట్రిక్ నవంబర్ 17న తన ఐపీఓ కోసం సన్నాహకాలు ప్రారంభించింది. కంపెనీ పేరును ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ నుండి ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్గా మార్చే ప్రయత్నాలు చేసింది. అయితే ఏదైనా కంపెనీ ఐపీఓకి రావాలంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని పబ్లిక్ కంపెనీగా మార్చాల్సి ఉంటుంది. అందుకే తన కంపెనీ పేరును మార్చనుంది. -
ఐపీవోకు మరో రెండు కంపెనీలు రెడీ
క్రియోజెనిక్ ట్యాంకుల తయారీ కంపెనీ ఐనాక్స్ ఇండియా, లగ్జరీ ఫర్నీచర్ కంపెనీ స్టాన్లీ లైఫ్స్టైల్స్ పబ్లిక్ ఇష్యూకి రానున్నాయి. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. గతేడాది ఆగస్ట్, సెప్టెంబర్లో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేశాయి. వీటి ప్రకారం ఐనాక్స్ ఇండియా ఐపీవోకింద 2.21 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రస్తుత వాటాదారులు, ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ నిధులు ప్రమోటర్లు, వాటాదారులకు చేరనున్నాయి. మూడు దశాబ్దాలుగా ఐనాక్స్ ఇండియా క్రియోజెనిక్ ట్యాంకుల తయారీలో కార్యకలాపాలు కలిగి ఉంది. డిజైన్, ఇంజినీరింగ్, పరికరాల ఇన్స్టాలేషన్, క్రియోజెనిక్ సిస్టమ్స్ ఏర్పాటు తదితర సర్వీసులు అందిస్తోంది. రూ. 200 కోట్ల ఈక్విటీ లగ్జరీ ఫర్నీచర్ను రూపొందిస్తున్న స్టాన్లీ లైఫ్స్టైల్స్ పబ్లిక్ ఇష్యూలో భాగంగా రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 91.33 లక్షల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు, వాటాదారులు విక్రయానికి ఉంచనున్నా రు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 90 కోట్లు కొత్త స్టోర్ల ఏర్పాటుకు, మరో రూ. 40 కోట్లు యాంకర్ స్టోర్లను తెరిచేందుకు వినియోగించనుంది. వీటితోపాటు ప్రస్తుతమున్న స్టోర్లను నవీకరించేందుకు రూ. 10 కోట్లు వెచ్చించనుంది. ఈ బాటలో కొత్త మెషీనరీ, పరికరాల కొనుగోలు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు రూ. 8.2 కోట్లు కేటాయించనుంది. -
టాటా టెక్నాలజీ ఐపీఓ : స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ముఖ్యగమనిక!
ఇంజినీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ డిజిటల్ సర్వీసుల కంపెనీ టాటా టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూకి భారీ స్పందన లభిస్తోంది. ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతుండటంతో రెండో రోజు గురువారానికల్లా 15 రెట్లు అధిక సబ్స్క్రిప్షన్ నమోదైంది. షేరుకి రూ. 475–500 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూలో భాగంగా కంపెనీ 4.5 కోట్లకుపైగా షేర్లను ఆఫర్ చేసింది. అయితే దాదాపు 67 కోట్ల షేర్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. దీంతో నేడు(24న) ముగియనున్న ఇష్యూ ద్వారా రూ. 3,043 కోట్లవరకూ అందుకోనుంది. టీసీఎస్(2004) తదుపరి రెండు దశాబ్దాలకు టాటా గ్రూప్ నుంచి వస్తున్న ఐపీవోకాగా.. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 8.5 రెట్లు బిడ్స్ లభించగా.. సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 31 రెట్లు, రిటైలర్ల నుంచి 11 రెట్లు చొప్పున దరఖాస్తులు దాఖలయ్యాయి. ఇష్యూలో భాగంగా మంగళవారం(21న) యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 791 కోట్లు సమీకరించిన విషయం విదితమే. ఫెడ్ఫినా స్పందన.. అంతంతే! రెండో రోజుకల్లా 90 శాతం బిడ్స్ : దేశీ స్టాక్ మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నప్పటికీ ప్రైమరీ మార్కెట్లు పలు ఇష్యూలతో సందడి చేస్తున్నాయి. టాటా టెక్నాలజీస్, గాంధార్ ఆయిల్ రిఫైనరీ, ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీస్, ఇరెడా పబ్లిక్ ఇష్యూలు భారీస్థాయిలో ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. అయితే ప్రయివేట్ రంగ సంస్థ ఫెడరల్ బ్యాంక్ అనుబంధ సంస్థ ఫెడ్బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్(ఫెడ్ఫినా) ఐపీవోకు స్పందన అంతంతమాత్రంగానే కనిపిస్తోంది. ఇష్యూ రెండో రోజు గురువారానికల్లా 90 శాతమే సబ్స్క్రయిబ్ అయ్యింది. ఐపీవోలో భాగంగా 5.59 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచగా.. 5.03 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 56 శాతం, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 52 శాతం చొప్పున బిడ్స్ లభించగా.. రిటైలర్లు 1.25 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. షేరుకి రూ. 133–140 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ సుమారు రూ. 1,093 కోట్లు సమీకరించా లని భావిస్తోంది. ఇష్యూలో భాగంగా రూ. 601 కో ట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు మరో 3,51,61,723 షేర్ల(రూ. 492 కోట్ల విలువ)ను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదా రులు విక్రయానికి ఉంచనున్నారు. యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్ల జారీ ద్వారా మంగళవారం(21న) రూ. 325 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. -
ఐపీవో.. హాట్ కేక్ - తొలి రోజే మంచి స్పందన
దేశీ స్టాక్ మార్కెట్లు హెచ్చుతగ్గులు చవిచూస్తున్నప్పటికీ ఇటీవల ప్రైమరీ మార్కెట్లు కొత్త ఇష్యూలతో కళకళలాడుతున్నాయి. ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తి చూపుతుండటంతో పలు కంపెనీలు లిస్టింగ్ బాట పడుతున్నాయి. తాజాగా టాటా టెక్నాలజీస్, గాంధార్ ఆయిల్ రిఫైనరీ, ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూలు ప్రారంభంకాగా.. తొలి రోజే అధిక స్థాయిలో స్పందన లభించడం గమనార్హం! వివరాలు ఇలా.. టాటా టెక్నాలజీస్ ఇంజనీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ డిజిటల్ సర్వీసుల టాటా గ్రూప్ కంపెనీ టాటా టెక్నాలజీస్ ఐపీవో తొలి రోజే అధిక సబ్స్క్రిప్షన్ను సాధించింది. ఇన్వెస్టర్లు క్యూ కట్టడంతో ప్రారంభమైన వెంటనే భారీగా బిడ్స్ దాఖలయ్యాయి. షేరుకి రూ. 475–500 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూకి 6.5 రెట్లు అధికంగా స్పందన నమోదైంది. కంపెనీ 4.5 కోట్లకుపైగా షేర్లను ఆఫర్ చేయగా.. 29.43 కోట్లకుపైగా షేర్ల కోసం దరఖాస్తులు లభించాయి. వెరసి 24న ముగియనున్న ఇష్యూ ద్వారా రూ. 3,043 కోట్లవరకూ అందుకోనుంది. టీసీఎస్(2004) తదుపరి రెండు దశాబ్దాలకు టాటా గ్రూప్ నుంచి వస్తున్న ఐపీవోకాగా.. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 4 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 11.7 రెట్లు, రిటైలర్ల నుంచి 5.4 రెట్ల చొప్పున బిడ్స్ దాఖలయ్యాయి. ఇష్యూలో భాగంగా మంగళవారం(21న) యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 791 కోట్లు సమీకరించిన విషయం విదితమే. మొత్తం 6.08 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. వీటిలో మాతృ సంస్థ టాటా మోటార్స్ 4.63 కోట్ల షేర్లను ఆఫర్ చేస్తోంది. ఫ్లెయిర్ రైటింగ్ పెన్నులు, స్టేషనరీ ప్రొడక్టుల తయారీ కంపెనీ ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీస్ ఐపీవో తొలి రోజే పూర్తి సబ్స్క్రిప్షన్ను సాధించింది. షేరుకి రూ. 288–304 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూకి 2.17 రెట్లు అధిక స్పందన నమోదైంది. కంపెనీ 1.44 కోట్లకుపైగా షేర్లను ఆఫర్ చేయగా.. 3.13 కోట్లకుపైగా షేర్లకు దరఖాస్తులు వచ్చాయి. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 53%, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 2.78 రెట్లు, రిటైలర్ల నుంచి 2.86 రెట్లు చొప్పున బిడ్స్ దాఖలయ్యాయి. ఇష్యూలో భాగంగా రూ. 292 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. మరో రూ. 301 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ గ్రూప్ సంస్థలు విక్రయానికి ఉంచాయి. 24న ముగిసే ఇష్యూ ద్వారా రూ. 501 కోట్ల వరకూ అందుకోనుంది. గాంధార్ ఆయిల్ ప్రైవేట్ రంగ కంపెనీ గాంధార్ ఆయిల్ రిఫైనరీ(ఇండియా) ఐపీవో తొలి రోజే అధిక సబ్స్క్రిప్షన్ను సాధించింది. షేరుకి రూ. 160–169 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూకి 5.5 రెట్లు అధికంగా స్పందన నమోదైంది. కంపెనీ 2.12 కోట్లకుపైగా షేర్లను ఆఫర్ చేయగా.. 11.72 కోట్లకుపైగా షేర్ల కోసం దరఖాస్తులు లభించాయి. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 1.3 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 7.7 రెట్లు, రిటైలర్ల నుంచి 6.9 రెట్ల చొప్పున బిడ్స్ దాఖలయ్యాయి. 24న ముగియనున్న ఇష్యూ ద్వారా రూ. 501 కోట్లవరకూ అందుకోనుంది. ఇష్యూలో భాగంగా రూ. 302 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా 1.17 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచింది. -
Tata Tech: గంటలోనే అమ్ముడైన 4.5 కోట్ల షేర్లు
ఇరవై ఏళ్ల తర్వాత టాటా గ్రూప్ నుంచి ఐపీఓ వచ్చింది. మదుపరులు ఎదురుచూస్తున్న టాటా టెక్నాలజీస్ ఐపీఓ నవంబర్ 22న ప్రారంభమయింది. నవంబర్ 24తో సబ్స్క్రిప్షన్ ముగియనుంది. ఈ ఐపీఓ ద్వారా రూ.3042.5 కోట్లు సమీకరించనున్నారు. ఆఫర్ ఫర్ సేల్ కింద 22వ తేదీన 4,50,29,207 (నాలుగున్నర కోట్లు) షేర్లను అందుబాటులో ఉంచగా ఐపీఓ మొదలైన గంటలోనే పూర్తిగా సబ్స్క్రైబ్ అయ్యాయి. టాటా మోటార్స్కు చెందిన టాటా టెక్నాలజీస్ ఇంజినీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ డిజిటల్ సర్వీసెస్ సంస్థ. టాటా మోటార్స్, జాగ్వార్ ల్యాండ్రోవర్ సహా టాటా గ్రూప్లోని ఇతర సంస్థలకు ఇది ప్రధానంగా సేవలందిస్తోంది. ఐపీఓలో భాగంగా టాటా మోటార్స్ 11.4 శాతం వాటాకు సమానమైన షేర్లను విక్రయించనుంది. ఇతర ప్రైవేటు ఈక్విటీ సంస్థలైన ఆల్ఫా టీసీ హోల్డింగ్ 2.4 శాతం, టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్ 1.2 శాతం చొప్పున తమ వాటాలను విక్రయించనున్నాయి. ఐపీఓలో భాగంగా టాటా టెక్నాలజీస్, టాటా మోటార్స్ ఉద్యోగులకు 10 శాతం షేర్లను రిజర్వ్ చేశారు. టాటా టెక్నాలజీస్ ఐపీఓకు జేఎం ఫైనాన్షియల్ లిమిటెడ్, సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, బోఫా సెక్యూరిటీస్ ఇండియా లిమిటెడ్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి. ఎన్ఎస్ఈ డేటా ప్రకారం ఉదయం 11 గంటలకు 8,73,22,890 బిడ్లు దాఖలయ్యాయి. అంటే 1.94 రెట్లు సబ్స్క్రైబ్ అయినట్లు తెలుస్తోంది. కేటగిరీ వారీగా నాన్ ఇన్స్టిట్యూషనల్ మదుపర్లు 2.72 రెట్లు, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ మదుపర్ల 1.98 రెట్లు, రిటైల్ విభాగంలో 1.63 రెట్లు సబ్స్క్రైబ్ అయ్యాయి. మంగళవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి టాటా టెక్ రూ.791 కోట్లు సమీకరించింది. -
బంపరాఫర్, ఐపీఓకి టాటా టెక్నాలజీ.. ఒక్కోషేర్ ధర ఎంతంటే?
మదుపర్లు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఇంజినీరింగ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ డిజిటల్ సర్వీసుల కంపెనీ టాటా టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ అనుబంధ సంస్థ ఇష్యూ ఈ నెల 22న ప్రారంభమై 24న ముగియనుంది. ఇందుకు వీలుగా ఈ నెల 13న ఆర్వోసీ మహారాష్ట్రకు ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసినట్లు టాటా మోటార్స్ పేర్కొంది. ఐపీవోలో భాగంగా కంపెనీ ఈక్విటీలో 15 శాతానికి సమానమైన 6.08 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిలో మాతృ సంస్థ టాటా మోటార్స్ 11.4 శాతం వాటాను ఆఫర్ చేయనుండగా.. పీఈ సంస్థ అల్ఫా టీసీ హోల్డింగ్స్ 2.4 శాతం వాటాను విక్రయించనుంది. ఇక టాటా క్యాపిటల్ సైతం 1.2 శాతం వాటాను ఆఫర్ చేస్తోంది. తాజాగా ధరల శ్రేణి, కనీస పెట్టుబడి సహా ఇతర కీలక సమాచారాన్ని వెల్లడించింది. ఐపీఓలో ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.475-500గా నిర్ణయించింది. ఈ లెక్కన అత్యధిక ధర వద్ద కంపెనీ రూ.3,042 కోట్లు సమీకరించనుంది. కాగా.. టాటా టెక్నాలజీస్లో టీపీజీ రైజ్ క్లయిమేట్కు 9.9 శాతం వాటాను విక్రయించేందుకు గత నెలలో టాటా మోటార్స్ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు రూ. 1,614 కోట్ల డీల్ను కుదుర్చుకుంది. -
బిలియనీర్ జాబితాలో ఎంట్రీ.. రూ.8వేల కోట్ల సంపద.. ఎలా సాధ్యమైందంటే
మంచి బిజినెస్ ఐడియా ఉంటే కోటీశ్వరులు కావడం సులువేనని చాలా మంది నిరూపిస్తున్నారు. స్టార్టప్ కంపెనీ స్థాపించి లాభాలు పొందుతున్నారు. తర్వాత కొన్ని రోజులకు ఐపీఓ ద్వారా స్టాక్మార్కెట్లో లిస్ట్ అయి కోట్లు గడిస్తున్నారు. దాంతో ఏళ్లుగా మార్కెట్లో ఉంటున్న సంపన్నుల సరసన కొత్త బిలియనీర్లు చేరుతున్నారు. ఈ క్రమంలో తాజాగా భారత బిలియనీర్ల జాబితాలో కొత్తగా ప్రదీప్ రాథోడ్ స్థానం సంపాదించారు. అసలు ఈయన ఎవరు? ఏ వ్యాపారం చేస్తుంటారు.. వంటి అంశాల గురించి తెలుసుకుందాం. వంట గదుల్లో ఉపయోగించే వస్తువులు, థర్మోవేర్ ఉత్పత్తులను తయారుచేసే కంపెనీ సెల్లో వరల్డ్ ఛైర్మన్గా ప్రదీప్ రాథోడ్ వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆయన కంపెనీ ఐపీవో ద్వారా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. మార్కెట్లోని డిమాండ్ వల్ల పెట్టుబడిదారులు, రిటైల్ ఇన్వెస్టర్లు కంపెనీ స్టాక్ను కొనుగోలు చేయడంతో స్టాక్ ధర అమాంతం పెరిగింది. దాంతో తన సంపద కూడా పెరిగి బిలియనీర్గా మారిపోయారు. ఆయనకు కంపెనీలో 44 శాతం వాటా ఉంది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ప్రదీప్ రాథోడ్ వద్ద రూ.8,300 కోట్ల సంపద ఉన్నట్లు ఫోర్బ్స్ ప్రకటించింది. ఆయన బడామియా చారిటబుల్ ట్రస్ట్కు ట్రస్టీగా కొనసాగుతున్నారు. జేఐటీఓ అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్ ఫౌండేషన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. సెల్లోవరల్డ్ కంపెనీ కిచెన్ వేర్, థర్మోవేర్, పెన్నులు, స్టేషనరీ ఉత్పత్తులను తయారు చేస్తోంది. 2017లో గాజు ఉత్పత్తుల తయారీలోకి కంపెనీ ప్రవేశించింది. 1974లో ఈ కంపెనీని స్థాపించారు. కంపెనీ తయరుచేస్తున్న ఉత్పత్తులు, కంపెనీ రాబడులు, వ్యాపార విస్తరణ వంటి అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని ఇటీవల మార్కెట్లో లిస్ట్ చేశారు. ప్రస్తుతం కంపెనీ డామన్, హరిద్వార్, చెన్నై, కలకత్తాల్లో కలిపి 13 తయారీ కేంద్రాలు కలిగి ఉంది. 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం 30 శాతం పెరిగి రూ.285 కోట్లుగా నమోదైంది. ఇదీ చదవండి: పసితనంలోనే పొదుపు పాఠాలు.. ఎందుకంటే.. ప్రస్తుతం ప్రదీప్ రాథోడ్ కుమారుడు గౌరవ్, తమ్ముడు పంకజ్ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్లుగా ఉన్నారు. రాథోడ్ కుటుంబం విమ్ప్లాస్ట్ లిమిటెడ్ కంపెనీకి ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇది సెల్లో బ్రాండ్కు అనుబంధంగా ఉంటూ అనేక ప్లాస్టిక్ ఫర్నిచర్ ఉత్పత్తులను తయారు చేస్తోంది. ఇది గతంలోనే బీఎస్ఈలో లిస్ట్ అయింది. ఈ కంపెనీ రూ.700 కోట్ల మార్కెట్ క్యాపిటల్ను కలిగి ఉంది. -
ఐపీవోకు ఫెడ్ఫినా, ఇరెడా
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్ఛేంజీలలో లిస్టయ్యేందుకు వీలుగా జులై–సెప్టెంబర్ మధ్య కాలంలో ఐఆర్ఈడీఏ(ఇరెడా)సహా.. ఫెడ్ఫినా, ఇప్యాక్ డ్యురబుల్, సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్లను దాఖలు చేశాయి. వీటికి సెబీ అక్టోబర్ 30– నవంబర్ 10 మధ్య ఆమోదముద్ర వేసింది. ఐపీవో ద్వారా కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు సెబీ నుంచి అనుమతులు పొందవలసిన సంగతి తెలిసిందే. ఫెడ్బ్యాంక్ ఫైనాన్షియల్ ప్రయివేట్ రంగ సంస్థ ఫెడరల్ బ్యాంక్ ప్రమోట్ చేసిన ఫెడ్ఫినా ఐపీవోలో భాగంగా రూ. 750 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 7.03 కోట్ల షేర్లను ప్రమోటర్ సంస్థ ఫెడరల్ బ్యాంక్, ప్రస్తుత వాటాదారు ట్రూ నార్త్ ఫండ్ వీఐ ఎల్ఎల్పీ విక్రయానికి ఉంచనున్నాయి. ప్రాస్పెక్టస్ ప్రకారం ఫెడరల్ బ్యాంక్ 1.65 కోట్లు, ట్రూ నార్త్ 5.38 కోట్లు చొప్పున షేర్లు ఆఫర్ చేస్తున్నాయి. కాగా.. ఈక్విటీ జారీ నిధులను భవిష్యత్ అవసరాలరీత్యా టైర్–1 మూలధన పటిష్టతకు ఫెడ్ఫినా వినియోగించనుంది. ఇండియన్ రెనెవబుల్ ఎనర్జీ ఐపీవోలో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ రెనెవబుల్ ఎనర్జీ 40.31 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 26.88 కోట్ల షేర్లను కంపెనీ ప్రమోటర్.. కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ విక్రయానికి ఉంచనుంది. కాగా.. ఈక్విటీ జారీ నిధులను కంపెనీ భవిష్యత్ పెట్టుబడి అవసరాలరీత్యా మూలధన పటిష్టతకు వినియోగించనుంది. ఇప్యాక్ డ్యురబుల్ రూమ్ ఎయిర్ కండిషనర్ల ఔట్సోర్స్డ్ డిజైన్ తయారీ సంస్థ ఇప్యాక్ డ్యురబుల్ ఐపీవోకింద రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 1.3 కోట్ల షేర్లను సైతం ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ సభ్యులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను పెట్టుబడులు, తయారీ యూనిట్ల ఏర్పాటు, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ పబ్లిక్ ఇష్యూలో భాగంగా రియల్టీ రంగ కంపెనీ సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. ఈ నిధులలో రూ. 285 కోట్లను కంపెనీతోపాటు అనుబంధ సంస్థలు ఎకార్డ్ ఎస్టేట్స్, ఐకానిక్ ప్రాపర్టీ డెవలపర్స్ రుణ చెల్లింపులకు వెచ్చించనుంది. మరో రూ. 35 కోట్లు భూముల కొనుగోలుకి వెచ్చించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. -
ఐపీవోకి స్విగ్గీ.. ఎప్పుడంటే?
ప్రముఖ దేశీయ ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు సిద్ధమైంది. వచ్చే ఏడాది ఐపీవోని లాంచ్ చేయనుంది. ఇందుకోసం ఇప్పటి నుంచే నిపుణుల సలహాలు తీసుకుంది. తాజాగా, ఐపీవోకు ఆర్ధికపరమైన సలహాలు ఇచ్చేందుకు స్విగ్గీ ఏడు ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లను షార్ట్లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ ఏడింటిలో కొటక్ మహీంద్రా కేపిటల్, సిటీ అండ్ జేపీ మోర్గాన్లో పనిచేస్తున్న సీనియర్ సిబ్బంది ఉన్నట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు ఇప్పటికే సంస్థకు సంబంధిన రాతపూర్వక డాక్యుమెంట్లను DRHP (డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్) స్విగ్గీ పూర్తి చేసిందని, అన్నీ సవ్యంగా జరిగి మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా ఉంటే వచ్చే ఏడాది మార్చి నెలలో ఐపీవోకి వెళ్లనున్నట్లు నివేదికలు హైలెట్ చేశాయి. 700 మిలియన్ల ఫండ్ గత ఏడాది జనవరిలో స్విగ్గీ కంపెనీ విలువ 10.7 బిలియన్ డాలర్లుగా ఉంది. ఆ సమయంలో సంస్థ వృద్ది కోసం నిధుల సమీకరించింది. రెండు బ్యాక్-టు-బ్యాక్ మార్కెట్ డౌన్ల తర్వాత అట్లాంటాకు చెందిన అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఇన్వెస్కో స్విగ్గిలో చివరి సారిగా 2023 ఏప్రిల్ ముగిసే సమయానికి దాదాపు 5.5 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టింది. ఇన్వెస్కోతో పాటు బారన్ క్యాపిటల్ 7.3 బిలియన్లు ఇన్వెస్ట్ చేయగా ఆల్ఫా వేవ్ గ్లోబల్, ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ అండ్ ప్రోసస్లు స్విగ్గీలో పెట్టుబడులు పెట్టాయి. -
IPO: నెలలో రూ.15వేల కోట్లు సమీకరించే కంపెనీలు ఇవే..
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని నవంబరులో దాదాపు 12 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు రానున్నాయి. వీటి ద్వారా వచ్చే నెల రోజుల్లో దాదాపు రూ.15,000 కోట్ల సమీకరణకు సిద్ధమవుతున్నాయి. ఈ డజన్ కంపెనీల్లో ఇప్పటికే బ్లూ జెట్ హెల్త్కేర్ ఐపీఓ ప్రారంభం అయింది. సెల్లో వరల్డ్ ఇష్యూ తేదీలను ప్రకటించింది. టాటా టెక్నాలజీస్, మామాఎర్త్, ఏఎస్కే ఆటోమోటివ్, ప్రోటీన్ ఈగవ్ టెక్, ఫెడ్బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీస్, క్రెడో బ్రాండ్స్ మార్కెటింగ్ పబ్లిక్ ఆఫర్లు నవంబరులో రానున్నాయి. వీటితో మొత్తం దాదాపు రూ.15వేలకోట్లు సమీకరించే వీలుంది. రూ.1,900 కోట్ల సమీకరణ లక్ష్యంతో వస్తోన్న సెల్లో వరల్డ్ ఐపీఓ అక్టోబర్ 30న ప్రారంభమై నవంబర్ 1 వరకు కొనసాగనుంది. ఒక్కో షేరు ధరల శ్రేణిని కంపెనీ రూ.617-648గా నిర్ణయించింది. మరోవైపు ఇప్పటికే ప్రారంభమైన బ్లూ జెట్ హెల్త్కేర్ ఐపీఓ అక్టోబర్ 27 వరకు కొనసాగుతుంది. ఈ కంపెనీ రూ.840 కోట్లు సమీకరించనుంది. చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాటా టెక్నాలజీస్ ఐపీఓ నవంబర్ రెండు లేదా మూడో వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇరవయ్యేళ్లలో టాటా గ్రూప్ నుంచి వస్తున్న తొలి ఐపీఓ ఇది. దీని ఒక్కో షేరు ధర శ్రేణి రూ.400 నుంచి రూ.500 మధ్య ఉండొచ్చని మార్కెట్ నిపుణుల అంచనా వేస్తున్నారు. చివరగా 2004లో టాటా సంస్థల నుంచి టీసీఎస్ ఐపీఓగా వచ్చింది. హొనాస కన్జ్యూమర్(మామాఎర్త్ మాతృసంస్థ) పబ్లిక్ ఇష్యూకు త్వరలో రాబోతోంది. దాదాపు రూ.1,650 కోట్ల సమీకరించేందుకు సిద్ధమవుతోంది. ఫెడరల్ బ్యాంక్ ఆధ్వర్యంలోని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ ఫెడ్బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓకు రానుంది. రూ.1,200 కోట్ల సమీకరణ లక్ష్యంతో ప్రోటీన్ ఇగవ్ టెక్, రూ.1,000 కోట్ల సమీకరణ కోసం ఏఎస్కే ఆటోమోటివ్ సైతం నవంబర్లోనే ఐపీఓ (IPO)కి రానున్నాయి. వచ్చే నెలలోనే రూ.1,400 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఈ సంస్థ పబ్లిక్ ఇష్యూకి సిద్ధ అవుతుంది. రూ.750 కోట్లు విలువ చేసే తాజా షేర్లతో పాటు మరో 70.3 మిలియన్ల షేర్లు ఓఎఫ్ఎస్ కింద జారీ చేయనున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఐపీఓకు వచ్చిన 36 కంపెనీలు దాదాపు రూ.28,330 కోట్లు సమీకరించాయి. గతేడాది మొత్తం 40 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వచ్చాయి. ఫలితంగా రూ.59వేలకోట్ల నిధులు కూడగట్టాయి. కంపెనీలు సమీకరించనున్న మొత్తం టాటా టెక్నాలజీస్: రూ.2500 కోట్లు సెల్లోవరల్డ్: రూ.1900 కోట్లు హొనాస కన్జ్యూమర్:రూ.1650 కోట్లు ఫెడ్బ్యాంక్ ఫైనాన్సియల్: రూ.1400 కోట్లు ప్రొటీన్ ఈగోవ్టెక్: రూ.1300 కోట్లు డీఓఎంఎస్ ఇండస్ట్రీస్:రూ.1200 కోట్లు ఏఎస్కే ఆటోమోటివ్:రూ.1000 కోట్లు జనస్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: రూ.1000 కోట్లు ఫిన్కేర్ మైక్రోఫైనాన్స్: రూ.900 కోట్లు బ్లూజెట్ హెల్త్కేర్: రూ.840 కోట్లు ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీస్: రూ.800 కోట్లు ఈసాఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: రూ.630 కోట్లు -
పబ్లిక్ ఇష్యూ ద్వారా హీరో ఫిన్కార్ప్ రూ.4వేల కోట్లు సమీకరణ!
ప్రముఖ దిగ్గజ కంపెనీ హిరో మోటోకార్ప్ ఆటోమోబైల్ రంగంలో సేవలు అందించడంతో పాటు ఫైనాన్స్ రంగంలోనూ తన సత్తాచాటేందుకు సిద్ధం అయింది. హీరో మోటోకార్ప్ ఆర్థిక సేవల విభాగమైన హీరో ఫిన్కార్ప్ రూ.4,000 కోట్ల సమీకరణ లక్ష్యంతో 2024లో పబ్లిక్ ఇష్యూకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పబ్లిక్ ఇష్యూపై సలహాలు ఇచ్చేందుకు ఎనిమిది ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులను సంస్థ ఎంపిక చేసినట్లు సమాచారం. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకుల్లో జేఎం ఫైనాన్షియల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్, జెఫ్రీస్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, హెచ్ఎస్బీసీ సెక్యూరిటీస్, యూబీఎస్, ఎస్బీఐ కేపిటల్, హెచ్డీఎఫ్సీ ఉన్నాయని ఓ వార్త మీడియాలో ప్రచురించారు. ప్రతిపాదిత ఐపీఓలో భాగంగా కొత్త షేర్ల జారీ, ప్రస్తుత వాటాదార్ల షేర్ల విక్రయం ద్వారా రూ.4,000 కోట్లను సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. హీరో ఫిన్కార్ప్లో హీరోమోటో కార్ప్ సంస్థకు 40 శాతం వాటా ఉంది. ముంజల్ కుటుంబం చేతిలో 35-39 శాతం వాటా ఉండగా.. అపోలో గ్లోబల్, క్రిస్ కేపిటల్, క్రెడిట్ సూయిజ్, హీరో మోటోకార్ప్నకు చెందిన కొన్ని డీలర్ల సంస్థల వద్ద మిగిలిన వాటా ఉంది. 1991లో హీరో ఫిన్కార్ప్ బ్యాంకింగేతర ఆర్థిక సేవల కంపెనీగా ఏర్పడింది. -
కొత్త రికార్డ్! ఐపీవో ముగిసిన రెండు రోజుల్లోనే లిస్టింగ్..
న్యూఢిల్లీ: గత వారం ఐపీవోకు వచ్చిన వైర్లు, కేబుళ్ల తయారీ కంపెనీ ఆర్ఆర్ కేబుల్ కొత్త రికార్డుకు తెరతీస్తోంది. బుధవారం (సెప్టెంబర్ 20) స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్ట్ అవుతోంది. వెరసి పబ్లిక్ ఇష్యూ ముగిసిన రెండు రోజుల్లోనే స్టాక్ ఎక్సే్ఛంజీల్లో లిస్ట్ అయిన తొలి కంపెనీగా నిలుస్తోంది. ఇక టీ+3 విధానంలో లిస్టయిన తొలి కంపెనీ రత్నవీర్ ప్రెసిషన్ ఇంజనీరింగ్కాగా.. రెండో రోజు నుంచి టీ+2లో ఆర్ఆర్ కేబుల్లో ట్రేడింగ్ ప్రారంభంకానుంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆగస్ట్లో ఐపీవో తదుపరి లిస్టింగ్ కాలాన్ని సగానికి కుదించింది. దీంతో టీ+6 నుంచి టీ+3కి లిస్టింగ్ కాలావధి తగ్గింది. ఆర్ఆర్ కేబుల్ ఇష్యూ సెప్టెంబర్ 13న మొదలై 15న ముగిసింది. సెప్టెంబర్ 1 నుంచి లిస్టింగ్ తాజా మార్గదర్శకాలు స్వచ్చంద ప్రాతిపదికన అమలులోకి వచ్చాయి. అయితే 2023 డిసెంబర్ 1 నుంచి తప్పనిసరి కానున్నాయి. ఈ నెల 20 నుంచి ఆర్ఆర్ కేబుల్ ఈక్విటీ షేర్లు బీ గ్రూప్లో లిస్ట్కానున్నట్లు బీఎస్ఈ ఒక ప్రకటనలో పేర్కొంది. -
సిగ్నేచర్ గ్లోబల్ @ రూ. 366–385
ముంబై: రియల్టీ రంగ కంపెనీ సిగ్నేచర్ గ్లోబల్(ఇండియా) లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రూ. 366–385 ధరల శ్రేణిని కంపెనీ ప్రకటించింది. ఐపీవో ఈ నెల 20న ప్రారంభమై 22న ముగియనుంది. ఇష్యూలో భాగంగా రూ. 603 కోట్ల విలువైన ఈక్విటీని కంపెనీ తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 127 కోట్ల విలువైన షేర్లను సైతం విక్రయానికి ఉంచనుంది. వెరసి రూ. 730 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 330 కోట్లు సమకూర్చుకునే లక్ష్యంతో ఉంది. కంపెనీ గతేడాది జులైలో సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఇష్యూ నిధుల్లో రూ. 432 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనున్నట్లు కంపెనీ చైర్మన్ ప్రదీప్ అగర్వాల్ పేర్కొన్నారు. గతేడాది చివరికల్లా రూ. 1,100 కోట్ల నికర రుణ భారం నమోదైనట్లు వెల్లడించారు. మిగిలిన నిధులను ఇతర సంస్థలు, భూముల కొనుగోళ్లకు కేటాయించనున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్లకు 78.35 శాతం వాటా ఉంది. ఐఎఫ్సీ 5.38 శాతం వాటాను కలిగి ఉంది. అనుబంధ సంస్థ సిగ్నేచర్ బిల్డర్స్ ప్రయివేట్ లిమిటెడ్ ద్వారా గురుగ్రామ్లోని సోలెరా ప్రాజెక్టుతో 2014లో కార్యకలాపాలు ప్రారంభించింది. -
ఐపీవో అక్రమాల నిధుల పంపిణీ
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ.. 2003–05 మధ్య కాలంలో నమోదైన ఐపీవో అవకతవకల నుంచి సమీకరించిన నిధుల పంపిణీని మరోసారి చేపట్టింది. మూడో దశలో భాగంగా దాదాపు రూ. 15 కోట్లను 2.58 లక్షల ఇన్వెస్టర్లకు పంపిణీ చేయనుంది. ఈ బాటలో ఇప్పటికే 2010 ఏప్రిల్లో రూ. 23.28 కోట్లు, 2015 డిసెంబర్లో రూ. 18.06 కోట్లు ఇన్వెస్టర్లకు పంచిపెట్టింది. పబ్లిక్ ఇష్యూల అక్రమాల కేసులలో భాగంగా సమీకరించిన నిధులను అర్హతగల ఇన్వెస్టర్లకు సెబీ పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. 2003–05 మధ్య కాలంలో మొత్తం 21 ఐపీవోలకు సంబంధించి సెబీ అక్రమాలను గుర్తించింది. వీటిపై దర్యాప్తు పూర్తయ్యాక సంబంధిత వ్యక్తుల నుంచి చట్టవిరుద్ధంగా ఆర్జించిన లాభాలను రాబట్టే చర్యలు చేపట్టింది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి డీపీ వాధ్వా అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఆదేశాల ప్రకారం సంబంధిత ఇన్వెస్టర్లకు నిధుల పంపిణీని చేపడుతోంది. -
అదృష్టం కాదిది.. అంతకు మించి! ఒక్క రోజులో రూ. 3.2 లక్షల కోట్ల సంపద..
సాధరణంగా ఊహించని లాభాలు, ఆదాయం వస్తే అదృష్టం వరించింది అంటుంటారు. కానీ ఒక్క రోజులో రూ. 3.2 లక్షల కోట్ల సంపద పెరిగితే దాన్ని ఏమంటారు? అదృష్టం కాదు.. అంతకు మించి అంటారు. సింగపూర్కు చెందిన ఆటోమొబైల్ సంస్థ విన్ఫాస్ట్ ఆటో లిమిటెడ్ (VinFast Auto Ltd) స్టాక్ మార్కెట్లలో ప్రవేశించిన మొదటి రోజునే దూసుకెళ్లి, దాని వ్యవస్థాపకుడి సంపదను భారీగా పెంచింది. దిగ్గజ కంపెనీలను దాటేసి.. ఈ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ షేర్లు మంగళవారం (ఆగస్టు 15) ఏకంగా 255 శాతం పెరిగాయి. దీంతో కంపెనీ చైర్మన్ వియత్నాంకు చెందిన ఫామ్ నాట్ వూంగ్ (Pham Nhat Vuong) నికర సంపదకు 39 బిలియన్ డాలర్లు (రూ.3.2 లక్షల కోట్లకు పైగా) చేరాయి. పరిశ్రమ దిగ్గజాలు జనరల్ మోటార్స్ కో, మెర్సిడెస్ బెంజ్ గ్రూప్ ఏజీ కంటే విన్ఫాస్ట్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగింది. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, వియత్నాంకు చెందిన ఫామ్ నాట్ వూంగ్ సంపద ఇప్పుడు 44.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కంపెనీలో వూంగ్ వాటాను స్టాక్ ఇండెక్స్ గతంలో చేర్చలేదు. తన వింగ్ గ్రూప్ జేఎస్సీ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 99 శాతం కంపెనీ అవుట్స్టాండింగ్ వూంగ్ నియంత్రణలోనే ఉన్నాయి. అత్యధిక వాటా ఆయనకే ఉండటంతో ఇతర ఇన్వెస్టర్లకు కంపెనీ షేర్లు అందుబాటులో లేవు. విన్ఫాస్ట్ ఆటో లిమిటెడ్ను 2017లో వూంగ్ స్థాపించారు. తమ వాహనాల అమ్మకాలు ఈ సంవత్సరం 45,000 నుంచి 50,000కి చేరుకుంటాయని కంపెనీ అంచనా వేసింది. గత నెలలో నార్త్ కరోలినాలో ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఈ సంస్థ చేపట్టింది. వూంగ్తోపాటు అతని బంధువులు విన్ఫాస్ట్ సంస్థలో కనీసం 300 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టారు. న్యూడిల్స్ బిజినెస్తో మొదలుపెట్టి... రష్యాలో జియో-ఎకనామిక్ ఇంజనీరింగ్ చదివిన తర్వాత 1990ల ప్రారంభంలో వూంగ్ ఉక్రెయిన్కు వెళ్లారు. అనంతరం వియత్నాంకు తిరిగి వచ్చిన తొమ్మిదేళ్ల తర్వాత ఇన్స్టాంట్ న్యూడిల్స్ బిజినెస్ను ప్రారంభించారు. తర్వాత దాన్ని 2010లో నెస్లే ఎస్ఏకి అమ్మేశారు. అప్పటికే ఆయన రియల్ ఎస్టేట్, రిసార్ట్లు, స్కూళ్లు, షాపింగ్ మాల్స్ వ్యాపారాలు నిర్వహించే వింగ్ గ్రూప్ జేఎస్సీ (Vingroup JSC)ని స్థాపించారు. హనోయి కేంద్రంగా కార్యకలాపాలు నర్వహిస్తున్న ఈ సంస్థ గత సంవత్సరం 4.4 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. విన్ఫాస్ట్ కంపెనీలో ఇది ప్రధాన వాటాదారుగా ఉంది. -
మూడు రోజుల్లోనే లిస్టింగ్ - సెబీ తాజా నిర్ణయం
న్యూఢిల్లీ: ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)లకు సంబంధించి సెబీ సానుకూల నిర్ణయం తీసుకుంది. ఐపీవో ఇష్యూ ముగిసిన రోజు నుంచి ఆరు పని దినాల్లో స్టాక్ ఎక్స్చేంజ్లలో ప్రస్తుతం లిస్ట్ కావాల్సి ఉండగా, దీన్ని మూడు రోజులకు తగ్గించింది. అంటే ఇకపై ఐపీవో ముగిసిన రోజు తర్వాత నుంచి మూడో పనిదినం రోజున ఆ కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్లలో లిస్ట్ కావాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 1, ఆ తర్వాత నుంచి వచ్చే ఐపీవోలకు మూడు రోజుల లిస్టింగ్ నిబంధన ఐచ్ఛికమే. అంటే ఇప్పటి మాదిరే ఆరు రోజులు (టీప్లస్6) లేదంటే మూడు రోజుల గడువు (టీప్లస్3)ను కంపెనీలు అనుసరించొచ్చు. కానీ, డిసెంబర్ 1 నుంచి మాత్రం విధిగా అన్ని ఐపీవోలు మూడు రోజుల లిస్టింగ్ నిబంధననే అమలు చేయాల్సి ఉంటుందని సెబీ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. అందరికీ అనుకూలమే సెబీ నిర్ణయం చిన్న ఇన్వెస్టర్ల నుంచి పెద్ద ఇన్వెస్టర్ల వరకు ఎంతో ప్రయోజనం కలిగించనుంది. షేర్ల కేటాయింపు లేకపోతే బ్యాంక్ ఖాతాల్లో బ్లాక్ అయిన నిధులు తొందరగా విడుదల అవుతాయి. రుణం తీసుకుని ఐపీవోల్లో దరఖాస్తు చేసే హెచ్ఎన్ఐలు కూడా ఉంటారు. వీరికి రోజుల వారీగా రుణంపై వడ్డీ భారం పడుతుంది. తొందరగా లిస్ట్ అయితే, తాము తీసుకున్న రుణాన్ని తొందరగా తీర్చేసే వీలుంటుంది. అటు ఐపీవోకు వచ్చిన కంపెనీలకూ ప్రయోజనమే. ఎలా అంటే ఐపీవో నిధులను అవి వేగంగా పొందొచ్చు. ఏఎస్బీఏ కింద షేర్లు అలాట్ కాని వారి నిధులను బ్యాంకు ఖాతాల్లో టీప్లస్3 రోజున అన్బ్లాక్ చేయాల్సి ఉంటుంది. లేదంటే వారికి చెల్లించే పరిహారం అనేది ట్లీప్లస్3 తర్వాతి రోజు నుంచి అమల్లోకి వస్తుందని సెబీ తెలిపింది. -
రేపు ప్రారంభంకానున్న శ్రీ టెక్టెక్స్ ఐపీవో - ధరల శ్రేణి ఇలా..
న్యూఢిల్లీ: టెక్నికల్ టెక్స్టైల్ తయారీ కంపెనీ శ్రీ టెక్టెక్స్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఈ నెల 26న ప్రారంభంకానున్న ఇష్యూకి ధరల శ్రేణి షేరుకి రూ. 54–61గా నిర్ణయించింది. 28న ముగియనున్న ఇష్యూలో భాగంగా 74 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. తద్వారా రూ. 45 కోట్లకుపైగా సమీకరించే యోచనలో ఉంది. యాంకర్ ఇన్వెస్టర్లకు నేడు(25న) షేర్లను కేటాయించనుంది. చిన్నతరహా కంపెనీల కోసం ఎన్ఎస్ఈ ఏర్పాటు చేసిన ఎమర్జ్ ప్లాట్ఫామ్ ద్వారా కంపెనీ షేర్లు లిస్ట్కానున్నాయి. ఇష్యూ నిధులను ఫ్యాక్టరీ షెడ్ నిర్మాణం, సోలార్ ప్లాంటు ఏర్పాటు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా పీపీ నాన్ఒవెన్ ఫ్యాబ్రిక్ను వివిధ పరిమాణాల్లో తయారు చేస్తోంది. -
ఐపీవో లైన్లో 80 సంస్థలు
న్యూఢిల్లీ: దాదాపు 80 కంపెనీలు వరుసగా ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు రానున్నాయని బ్రోకరేజీ సంస్థ ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ నిపుణ్ గోయల్ తెలిపారు. ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్, స్నాప్డీల్, టాటా టెక్నాలజీస్, నెట్వెబ్ టెక్నాలజీస్, గో డిజిట్ ఇన్సూరెన్స్ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నట్లు పేర్కొన్నారు. మ్యాన్కైండ్ ఫార్మా రూ. 4,326 కోట్ల ఇష్యూతో మొదలై గత మూడు నెలలుగా ఐపీవో మార్కెట్ చాలా సందడిగా ఉన్నట్లు గోయల్ చెప్పారు. అప్పటి నుంచి మరో ఐదు పబ్లిక్ ఇష్యూలు విజయవంతంగా పూర్తయ్యాయని, వచ్చే 4–8 వారాల్లో మరిన్ని సంస్థలు ఐపీవోకు రానున్నాయని వివరించారు. -
మదుపర్లకు శుభవార్త, 20 ఏళ్ల తర్వాత ఐపీఓకు టాటా టెక్నాలజీస్
స్టాక్ మార్కెట్లోని మదుపరులకు శుభవార్త. దాదాపూ 19 ఏళ్ల తర్వాత టాటా గ్రూప్ నుంచి టాటా టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూకు సెబీ ఆమోదం తెలిపింది. ఐపీఓలో భాగంగా 23.6 శాతం వాటాకు సమానమైన 9.57 లక్షల కోట్ల విలువైన షేర్లను విక్రయించనుంది. ఇందులో భాగంగా టాటా టెక్నాలజీస్ మాతృ సంస్థ టాటా మోటార్స్ 8.11 కోట్ల షేర్లను లేదా 20 శాతం వాటాను వదులుకోనుంది. టాటా గ్రూప్ నుంచి 2004లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఐపీఓకు వచ్చింది. తాజాగా అదే గ్రూప్ నుంచి మరో ఐపీఓ రావడం పట్ల మదుపర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఐపీఓ కోసం టాటా టెక్నాలజీస్ ఈ ఏడాది మార్చిలో సెబీకి సంబంధిత పత్రాలను సమర్పించింది. కాగా, ఈ ఐపీవో ద్వారా ఎంత మొత్తాన్ని సేకరించనుందనే అంశాన్నీ టాటా టెక్నాలజీస్ వెల్లడించలేదు. అయితే, సెబీ ఆమోదం పొందిన ఈ ఐపీఓ పరిమాణామం రూ.4,000 కోట్లు ఉండొచ్చని అంచనా. -
ఐపీవోకి ఆస్క్ ఆటోమోటివ్
న్యూఢిల్లీ: బ్రేక్-షూ, అడ్వాన్స్డ్ బ్రేకింగ్ సిస్టమ్స్ తయారీ సంస్థ ఆస్క్ ఆటోమోటివ్ .. పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) ద్వారా నిధులను సమీకరించనుంది. దీనికి సంబంధించి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలను సమర్పించింది. వీటి ప్రకారం ఈ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో ఉండనుంది. ప్రమోటర్లు కుల్దీప్ సింగ్ రాఠీ, విజయ్ రాఠీ 2,95,71,390 షేర్లను విక్రయించనున్నారు. ప్రస్తుతం కుల్దీప్నకు 41.33 శాతం, విజయ్కి 32.3 శాతం వాటాలు ఉన్నాయి. ఇష్యూ పూర్తిగా ఓఎఫ్ఎస్ విధానంలోనే ఉంటుంద కాబట్టి ఐపీవో నిధులన్నీ ప్రమోటర్లకే లభించ నున్నాయి. కంపెనీకి చెందవు. ఆస్క్ ఆటోమోటివ్కి టీవీఎస్ మోటర్ కంపెనీ, హీరో మోటోకార్ప్, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, బజాజ్ ఆటో వంటివి క్లయింట్లుగా ఉన్నాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ వాటా దాదాపు 50 శాతంగా నమోదైంది. (SaradhaChitFundScam: పెట్టుబడిదారుల సొమ్ము రికవరీకి శారదా ఆస్తుల వేలం) గురుగ్రామ్కు చెందిన ఆస్క్ ఆటోమోటివ్ 2022 ఆర్థిక సంవత్సరంలో సుమారు 50 శాతం మార్కెట్ వాటాతో భారతదేశంలో ద్విచక్ర వాహనాల కోసం బ్రేక్-షూ, అధునాతన బ్రేకింగ్ సిస్టమ్ల అతిపెద్ద తయారీదారులలో ఒకటిగా ఉంది. (MRF బెలూన్లు అమ్మి, కటిక నేలపై నిద్రించి: వేల కోట్ల ఎంఆర్ఎఫ్ సక్సెస్ జర్నీ) మరిన్ని ఇంట్రస్టింగ్ వార్తలు, బిజినెస్ వ న్యూస్ కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
ఐకియో లైటింగ్కు యాంకర్ నిధులు
న్యూఢిల్లీ: లెడ్ లైటింగ్ సొల్యూషన్ల కంపెనీ ఐకియో లైటింగ్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ నేడు(6న) ప్రారంభంకానుంది. 8న ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ. 270–285కాగా.. సోమవారం(5న) యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 182 కోట్లు సమీకరించింది. షేరుకి రూ. 285 ధరలో 16 ఫండ్స్కు 63.84 లక్షల షేర్లను కేటాయించింది. ఇన్వెస్ట్ చేసిన యాంకర్ సంస్థలలో సొసైటీ జనరాలి, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ మారిషస్, గోల్డ్మన్ శాక్స్, హెచ్డీఎఫ్సీ ఎంఎఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎఫ్ తదితరాలున్నాయి. ఐపీవోలో భాగంగా కంపెనీ మొత్తం రూ. 350 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు మరో 90 లక్షల షేర్లను ప్రమోటర్లు హర్దీప్ సింగ్, సుర్మీత్ కౌర్ విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా కంపెనీ రూ. 606 కోట్లకుపైగా సమకూర్చుకోవాలని చూస్తోంది. అనుబంధ సంస్థకు నిధులు ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 212 కోట్లను సొంత అనుబంధ సంస్థ ఐకియో సొల్యూషన్స్ నోయిడాలో ఏర్పాటు చేయనున్న కొత్త ప్లాంటు కోసం ఐకియో లైటింగ్ వెచ్చించనుంది. మరో రూ. 50 కోట్లు రుణ చెల్లింపులకు కేటాయించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 52 ఈక్విటీ షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేయవలసి ఉంటుంది. కంపెనీ నాలుగు తయారీ కేంద్రాలను కలిగి ఉంది. ప్రధానంగా లెడ్ లైటింగ్ డిజైన్, అభివృద్ధి, తయారీ, ప్రొడక్టుల సరఫరా చేపడుతోంది. 2021–22లో ఆదాయం 55 శాతం జంప్చేసి రూ. 332 కోట్లకు చేరింది. నికర లాభం 75 శాతం వృద్ధితో రూ. 50.5 కోట్లను తాకింది. -
ఐకియో లైటింగ్ ధరల శ్రేణి రూ. 270–285
న్యూఢిల్లీ: లెడ్ లైటింగ్ సొల్యూషన్ల కంపెనీ ఐకియో లైటింగ్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 6న ప్రారంభంకానుంది. 8న ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ. 270–285గా కంపెనీ ప్రకటించింది. ఐపీవోలో భాగంగా రూ. 350 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు మరో 90 లక్షల షేర్లను ప్రమోటర్లు హర్దీప్ సింగ్, సుర్మీత్ కౌర్ విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా కంపెనీ రూ. 606 కోట్లకుపైగా సమకూర్చుకోవాలని చూస్తోంది. ఐపీవోలో భాగంగా 5న యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్లను కేటాయించనుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 212 కోట్లను సొంత అనుబంధ సంస్థ ఐకియో సొల్యూషన్స్ నోయిడాలో ఏర్పాటు చేయనున్న కొత్త ప్లాంటు కోసం వెచ్చించనుంది. మరో రూ. 50 కోట్లు రుణ చెల్లింపులకు కేటాయించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 52 ఈక్విటీ షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేయవలసి ఉంటుంది. కంపెనీ నాలుగు తయారీ కేంద్రాలను కలిగి ఉంది. ప్రధానంగా లెడ్ లైటింగ్ డిజైన్, అభివృద్ధి, తయారీ, ప్రొడక్టుల సరఫరా చేపడుతోంది. 2021–22లో ఆదాయం 55 శాతం జంప్చేసి రూ. 332 కోట్లకు చేరింది. నికర లాభం 75 శాతం వృద్ధితో రూ. 50.5 కోట్లను తాకింది. -
LIC: ఏడాదిలో రూ. 1.93 లక్షల కోట్లు ఆవిరి!
న్యూఢిల్లీ: జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ షేర్లు లిస్టయిన ఏడాది వ్యవధిలో 40 శాతం క్షీణించాయి. దీంతో రూ. 1.93 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. ఎల్ఐసీ గతేడాది ఐపీవో ద్వారా రూ. 20,557 కోట్లు సమీకరించి, రూ. 5.54 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్తో టాప్ 5 విలువైన కంపెనీల్లో ఒకటిగా నిల్చింది. షేర్లు మే 17న ఇష్యూ రేటుతో పోలిస్తే దాదాపు 8 శాతం డిస్కౌంటుకు బీఎస్ఈలో రూ. 872 వద్ద, ఎన్ఎస్ఈలో రూ. 867 వద్ద లిస్టయ్యాయి. ఇష్యూ ధర రూ. 949తో పోలిస్తే ప్రస్తుతం షేరు ఎన్ఎస్ఈలో 39.93 శాతం క్షీణించింది. బుధవారం రూ. 570 వద్ద ముగిసింది. తొలి ఏడాది ట్రేడింగ్లో కంపెనీ షేర్లు 52 వారాల గరిష్ట స్థాయి రూ. 920ని, 52 వారాల కనిష్ట స్థాయి రూ. 530.20ని తాకాయి. (ఈ పిక్స్ చూశారా? గుండెలు బాదుకుంటున్న కృతి సనన్ ఫ్యాన్స్) గురువారం కూడా షేరు ధర మరో 3 శాతం నష్టాలతో ఉంది. గడిచిన సంవత్సర కాలంలో ఇష్యూ ధరను మాత్రం దాటలేకపోయాయి. ఇదే వ్యవధిలో బీఎస్ఈ సెన్సెక్స్ 13.33 శాతం, నిఫ్టీ 11.82 శాతం పెరిగాయి. (అయ్యయ్యో! ఐకానిక్ స్టార్, ప్రిన్స్ మహేష్, డార్లింగ్ ప్రభాస్? ఎందుకిలా?) -
రూ. 2,800 కోట్ల సమీకరణకు జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా ప్రణాళికలు
న్యూఢిల్లీ: రుణ భారాన్ని తగ్గించుకునేందుకు, విస్తరణ ప్రణాళికలను అమలు చేసేందుకు అవసరమైన నిధుల సమీకరణ కోసం జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పబ్లిక్ ఇష్యూకి (ఐపీవో) రానుంది. దీని ద్వారా రూ. 2,800 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా ప్రాస్పెక్టస్ను (డీఆర్హెచ్పీ) నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. (Nokia C22: నోకియా సీ22 స్మార్ట్ఫోన్ వచ్చేసింది: అదిరే ఫీచర్లు, అతి తక్కువ ధర) ఇప్పటికే జేఎస్డబ్ల్యూ గ్రూప్లో భాగమైన జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, జేఎస్డబ్ల్యూ స్టీల్.. స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయి ఉన్నాయి. దీంతో గ్రూప్ నుంచి జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా మూడో లిస్టెడ్ కంపెనీ కానుంది. కంపెనీకి వార్షికంగా 153.43 మిలియన్ టన్నుల కమోడిటీ కార్గో హ్యాండ్లింగ్ స్థాపిత సామర్థ్యం ఉంది. 2022 డిసెంబర్ 31 నాటికి సంస్థకు నికరంగా రూ. 2,875 కోట్ల రుణాలు ఉన్నాయి. 2022–23 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా రూ. 447 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
2 కంపెనీల ఐపీవోలకు సెబీ ఓకే
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా రెండు కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తద్వారా నిధుల సమీకరణకు నాస్డాక్ లిస్టెడ్ కంపెనీ ఎబిక్స్ ఇంక్ అనుబంధ సంస్థ ఎబిక్స్క్యాష్ లిమిటెడ్, స్పెషాలిటీ కెమికల్ తయారీ కంపెనీ సర్వైవల్ టెక్నాలజీస్లను అనుమతించింది. స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు అనుమతించమంటూ ఈ రెండు కంపెనీలు 2022 మార్చి, డిసెంబర్ మధ్య కాలంలో సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేశాయి. రూ. 6,000 కోట్లపై కన్ను ఐపీవో ద్వారా ఎబిక్స్క్యాష్ లిమిటెడ్ రూ. 6,000 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇందుకు వీలుగా తాజా ఈక్విటీని జారీ చేయనుంది. ఇష్యూ నిధులను అనుబంధ సంస్థలు ఎబిక్స్ ట్రావెల్స్, ఎబిక్స్క్యాష్ వరల్డ్ మనీ.. వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనుంది. అంతేకాకుండా ఎబిక్స్ మారిషస్ జారీ చేసిన తప్పనిసరిగా మార్పడికి లోనయ్యే డిబెంచర్ల చెల్లింపులతోపాటు.. వ్యూహాత్మక కొనుగోళ్లు, పెట్టుబడులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు సైతం వెచ్చించనుంది. కంపెనీ పేమెంట్ సొల్యూషన్స్, ట్రావెల్, ఫైనాన్షియల్ టెక్నాలజీస్, బీపీవో సర్వీసులు, స్టార్టప్ల ఏర్పాటులో టెక్నాలజీ ఆధారిత డిజిటల్ ప్రొడక్టులు, సర్వీసులను అందిస్తోంది. రూ. 1,000 కోట్లకు సై ఐపీవోలో భాగంగా సర్వైవల్ టెక్నాలజీస్ రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా రూ. 800 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా రూ. 1,000 కోట్ల సమీకరణపై కన్నేసింది. నిధుల్లో రూ. 175 కోట్లను వర్కింగ్ క్యాపిటల్, ఇతర సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కాంట్రాక్ట్ రీసెర్చ్ అండ్ మ్యాన్యుఫాక్చరింగ్ సర్వీసెస్(సీఆర్ఏఎంఎస్– క్రామ్స్) విభాగంలో ప్రధానంగా కంపెనీ కార్యకలాపాలు విస్తరించింది. హెటెరోసైక్లిక్, ఫ్లోరో ఆర్గానిక్ ప్రొడక్ట్ గ్రూప్ల నుంచి ఎంపిక చేసిన ఉత్పత్తులను కంపెనీ రూపొందిస్తోంది. -
కండోమ్స్ బిజినెస్: 50లక్షలనుంచి రూ. 43వేల కోట్లతో దడ పుట్టించిన బ్రదర్స్
ప్రముఖ కండోమ్ బ్రాండ్ మేన్కైండ్ ఫార్మా ఏప్రిల్ 25న ఐపీఓకు రానుంది. దేశీయంగా మేన్ఫోర్స్ కండోమ్లు, ప్రెగా న్యూస్ ప్రెగ్నెన్సీ డిటెక్షన్ కిట్ల విక్రయాలతో పాపులర్ బ్రాండ్గా పేరొందింది. మెడికల్ సేల్స్మెన్స్గా మొదలై రూ.43,264 కోట్ల విలువైన సంస్థగా తీర్చిదిద్దిన జునేజా సోదరుల సక్సెస్ స్టోరీ.. ఢిల్లీకి చెందిన డ్రగ్ కంపెనీ, కండోమ్ మేకర్ మేన్కైండ్ ఫార్మా రూ. 4,326 కోట్ల పబ్లిక్ ఆఫర్ని ఏప్రిల్ 25న ప్రారంభించి, ఏప్రిల్ 27న ముగించడానికి సిద్ధంగా ఉంది. అనిశ్చిత ఆర్థికపరిస్థితుల మధ్య 2023లో ఎక్స్ఛేంజీలో లిస్ట్ అయిన ఏడో ఐపీఓ ఇది. మెడికల్ సేల్స్మెన్లా ప్రయాణం మొదలుపెట్టి రూ. 43,264 కోట్లకు చేర్చారు రమేష్ జునేజా, రాజీవ్ జునేజా. జునేజా సోదరులుగా పేరొందిన వీరు ఒంటరిగానే మొదలు పెట్టారు. పట్టుదలతో, మొక్కవోని దీక్షతో కంపెనీని అద్భుత స్థాయికి తీసుకొచ్చారు. ముఖ్యంగా 90వ దశకంలో బాలీవుడ్ స్టార్లతో ఆకర్షణీయమైన ప్రకటనలతో మధ్య తరగతిని ఆకర్షించడంలో జునేజా సోదరుల మేనేజ్మెంట్ స్కిల్స్, కార్పొరేట్ వ్యూహం నిదర్శనంగా నిలిచింది. అతితక్కువ సమయంలోనే విక్రయాల్లో దూసుకు పోతూ దిగ్గజాలకు దడ పుట్టించారు. ఛైర్మన్ రమేష్ సీ జునేజా 1974లో కీఫార్మా అనే కంపెనీకి మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేశారు. ఆ తరువాత ఫార్మా దిగ్గజం లుపిన్లో ఎనిమిదేళ్లు పనిచేశారు. 1994లో తను స్థాపించిన కంపెనీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. 1995లో తన సోదరుడు రాజీవ్ జునేజాతో కలిసి మేన్కైండ్ని ప్రారంభించారు. ఇందుకు వారి ప్రారంభ పెట్టుబడి రూ.50 లక్షలు మాత్రమే. 25మంది వైద్య ప్రతినిధులతో సంస్థను ప్రారంభించారు. ఇపుడు దేశవ్యాప్తంగా 25 తయారీ కేంద్రాలతో, 600 మందికిపైగా శాస్త్రవేత్తల బృందంతో పనిచేస్తోంది. అతిపెద్ద నెట్వర్క్తో నాలుగు యూనిట్లలో పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను నడుపుతోంది. 2022లో ఫోర్బ్స్ డేటా ప్రకారం 34500 కోట్ల రూపాయల నికర విలువ జునేజా సోదరుల సొంతం. మేన్ కైండ్ ఫార్మా మార్కెట్ క్యాప్ రూ.43,264 కోట్లు. దేశీయ విక్రయాల పరంగా ఇది భారతదేశంలో నాలుగో అతిపెద్ద కంపెనీ. గత సంవత్సరం, డిసెంబర్ 2022 నాటికి, దాని ఏకీకృత లాభం రూ.996.4 కోట్లు. తొలి తొమ్మిది నెలల ఆదాయం రూ.6697 కోట్లు. మ్యాన్ఫోర్స్ కండోమ్ బ్రాండ్ రూ. 462 కోట్లకు పైగా దేశీయ విక్రయాలతో ఈ విభాగంలో మార్కెట్ లీడర్గా ఉందని పేర్కొంది. ప్రెగా న్యూస్ ప్రెగ్నెన్సీ కిట్ల విక్రయం రూ. 184.40 కోట్లు. ముఖ్యంగా కంపెనీ నెట్వర్క్ విస్తరణకు, విజయానికి కారణం కంపెనీ సీఈవోగా రాజీవ్ జునేజా. రమేష్ జునేజా సైన్స్ గ్రాడ్యుయేట్ కాగా, రాజీవ్ కాలేజీ డ్రాప్ అవుట్. అలాగే జునేజా సోదరుల మేనల్లుడు అర్జున్, ప్రొడక్షన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పర్యవేక్షిస్తుండగా. మరో మేనల్లుడు శీతల్ అరోరా, గైనకాలజీ, డెర్మటాలజీ డ్రగ్స్ మార్కెటింగ్ విభాగం లైఫ్స్టార్ను బాధ్యతలను చూస్తుండటం విశేషం.కంపెనీ వివిధ తీవ్రమైన, దీర్ఘకాలిక చికిత్సలకు సంబంధించి పలు ఫార్మ ఫార్ములేషన్స్తోపాటు, అనేక వినియోగదారు ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను తయారు చేస్తుంది. ఐపీఓ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ద్వారా 40,058,844 ఈక్విటీ షేర్లను బీఎస్ఈ, ఎన్ఎస్సీ రెండింటిలోనూ జాబితా చేయాలని ప్రతిపాదించింది. ప్రమోటర్లలో సహ వ్యవస్థాపకులు రమేష్ జునేజా , రాజీవ్ జునేజా, సీఈవో శీతల్ అరోరా, కెయిర్న్హిల్ CIPEF, కెయిర్న్హిల్ CGPE, బీజ్ లిమిటెడ్ ,లింక్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఉన్నారు. ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.1,026 1,080గా నిర్ణయించారు. కంపెనీ షేర్లు మే 3న ఇన్వెస్టర్లకు కేటాయించిన తరువాత మే 8న స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టవుతాయి. Autism is a development disorder where children have problems with social communication and interaction, restricted or repetitive behaviors or interests. Let's learn more about Autism and bridge the gap created by social stigma. #AutismAwarenessDay #MankindPharma #ServingLife pic.twitter.com/5WPKIqvIUi — Mankind Pharma (@Pharma_Mankind) April 2, 2023 -
నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ ఐపీవోకు రెడీ
న్యూఢిల్లీ: గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం బ్లాక్స్టోన్కు పెట్టుబడులున్న నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ పబ్లిక్ ఇష్యూ ప్రణాళికల్లో ఉంది. గతేడాది నవంబర్లో ప్రాస్పెక్టస్ను దాఖలు చేసిన కంపెనీ మే నెలలో ఐపీవో చేపట్టే యోచనలో ఉంది. తద్వారా రూ. 4,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. వెరసి దేశీయంగా తొలి రిటైల్ రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(రీట్)గా నిలవనుంది. నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ రిటైల్ రీట్.. 17 నిర్వహణలోగల షాపింగ్ మాల్స్ పోర్ట్ఫోలియోను కలిగి ఉంది. ఇవి 14 పట్టణాలలో 9.8 మిలియన్ చదరపు అడుగులలో విస్తరించి ఉన్నాయి. వీటి విలువ రూ. 23,000 కోట్లు. బ్లాక్స్టోన్ స్పాన్సర్ చేసిన మూడో రీట్గా ఇది నిలవనుంది. ఇప్పటికే దేశీయంగా సంస్థకు పెట్టుబడులున్న రీట్ ఎంబసీ ఆఫీస్ పార్క్స్, మైండ్స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్ లిస్టయ్యాయి. మరో కంపెనీ బ్రూక్ఫీల్డ్ ఇండియా రియల్టీ ట్రస్ట్ సైతం స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్కాగా.. ఇవన్నీ ఆఫీస్ ఆస్తులపైనే ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ మాత్రం రిటైల్ రియల్టీ ఆస్తులపై ఇన్వెస్ట్ చేయడం ద్వారా అద్దె ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఐపీవో నిధులను కొంతమేర రుణ చెల్లింపులకు వినియోగించే వీలుంది. 2022 జూన్కల్లా రూ. 4,500 కోట్ల రుణ భారాన్ని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. -
ఐపీవో యోచనలో బ్యాంక్ బజార్
న్యూఢిల్లీ: ఫిన్టెక్ కంపెనీ బ్యాంక్ బజార్.కామ్ పబ్లిక్ ఇష్యూ చేపట్టే యోచనలో ఉంది. రానున్న 12–18 నెలల్లోగా ఐపీవోకు వెళ్లే ప్రణాళికల్లో ఉన్న ట్లు కంపెనీ తాజాగా వెల్లడించింది. బ్యాంకింగ్ దిగ్గజాలతో భాగస్వామ్యం ద్వారా కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్న కంపెనీ మార్చితో ముగి సి న గతేడాది(2022–23) రూ. 160 కోట్ల ఆదాయం సాధించింది. ఏడాది నుంచి ఏడాదిన్నర లోగా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యే యోచనలో ఉన్నట్లు ఒక ప్రకటనలో బ్యాంక్ బజార్.కామ్ తెలియజేసింది. -
ఐపీవోకి ఓయో..సమీకరణ లక్ష్యం ఎన్ని వేలకోట్లంటే?
ఓయో పేరిట ఆతిథ్య సేవలను అందిస్తోన్న ఒరావెల్ స్టేస్ లిమిటెడ్ ఐపీఓకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఓయో సీఈవో రితిష్ అగర్వాల్ మాట్లాడుతూ ఈ ఏడాది అక్టోబర్ - నవంబర్ నెలలో లిస్టింగ్కు వెళ్లే యోచనలో ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. మరోవైపు ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న ఒడిదుడుకుల నేపథ్యంలో ఐపీఓ విషయంలో ఓయో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఈసారి ఆఫర్ ఫర్ సేల్ కింద ఎలాంటి షేర్లను విక్రయించబోదని తెలుస్తోంది. రూ.8,430 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఓయో 2021లోనే ఐపీఓకి దరఖాస్తు చేసుకుంది. కానీ, వివిధ కారణాల వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు మరోసారి ఓయో ఐపీవోకి ఫైల్ చేసినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలపై మాట్లాడేందుకు ఓయో అధికార ప్రతినిధులు విముఖత వ్యక్తం చేశారు. -
ఎవలాన్ టెక్ @ 415–436
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ తయారీ సర్వీసుల కంపెనీ ఎవలాన్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూకి రూ. 415–436 ధరల శ్రేణి ప్రకటించింది. ఏప్రిల్ 3న ప్రారంభంకానున్న ఇష్యూ 6న ముగియనుంది. తద్వారా కంపెనీ రూ. 865 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. యాంకర్ ఇన్వెస్టర్లకు ఈ నెల 31న షేర్లను విక్రయించనుంది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 320 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 545 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. షేర్ల జారీ నిధులను రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 34 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేయవలసి ఉంటుంది. ఏప్రిల్ 18న షేర్లు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్కానున్నాయి. ఎండ్టుఎండ్ ఎలక్ట్రానిక్ మ్యాన్యుఫాక్చరింగ్ సర్వీస్ సొల్యూషన్లు అందిస్తున్న ఎవలాన్ టెక్ 1999లో ఏర్పాటైంది. యూఎస్తోపాటు దేశీయంగా 12 తయారీ ప్లాంట్లను నిర్వహిస్తోంది. 2021–22లో రూ. 840 కోట్ల ఆదాయం సాధించింది. -
ఐపీవోకు సెబీతో మామాఎర్త్ చర్చలు
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీతో చర్చలు నిర్వహిస్తున్నట్లు హోనసా కన్జూమర్ లిమిటెడ్ తాజాగా పేర్కొంది. బలహీన మార్కెట్ పరిస్థితుల కారణంగా ఐపీవోను పక్కనపెట్టినట్లు మీడియాలో వెలువడిన వార్తల నేపథ్యంలో ఎఫ్ఎంసీజీ బ్రాండ్లు మామాఎర్త్, ద డెర్మా కో మాతృ సంస్థ వివరణ ఇచ్చింది. ప్రస్తుతం ఐపీవోకు అనుమతి పొందే బాటలో ముసాయిదా ప్రాస్పెక్టస్పై సెబీతో చర్చిస్తున్నట్లు కంపెనీ సీఈవో, సహవ్యవస్థాపకుడు వరుణ్ అలగ్ వెల్లడించారు. నిబంధనల ప్రకారం సెబీ అనుమతి పొందాక ఐపీవో చేపట్టేందుకు 12 నెలల గడువు ఉంటుందని, తదుపరి బ్యాంకర్లతో చర్చిస్తామని తెలియజేశారు. 2022 డిసెంబర్లో కంపెనీ సెబీకి ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా 4.68 కోట్లకుపైగా షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. షేర్లను ఆఫర్ చేయనున్న ప్రమోటర్లు, ఇన్వెస్టర్లలో వరుణ్, ఘజల్ అలగ్, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి కుంద్రా, రోహిత్ కుమార్ బన్సల్ తదితరులున్నారు. -
ఎవలాన్ టెక్నాలజీస్ ఐపీవో
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ తయారీ సర్వీసుల కంపెనీ ఎవలాన్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఏప్రిల్ 3న ప్రారంభంకానున్న ఇష్యూ 6న ముగియనుంది. తద్వారా కంపెనీ రూ. 865 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. యాంకర్ ఇన్వెస్టర్లకు ఈ నెల 31న షేర్లను విక్రయించనుంది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 320 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 545 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. షేర్ల జారీ నిధులను రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కాగా.. తొలుత ఐపీవో ద్వారా రూ. 1,025 కోట్ల సమీకరణకు కంపెనీ ప్రణాళికలు వేసింది. అయితే ఇష్యూ కంటే ముందుగా షేర్ల ప్లేస్మెంట్ ద్వారా రూ. 160 కోట్లు సమకూర్చుకుంది. రూ. 80 కోట్లు తాజా ఈక్విటీ, మరో రూ. 80 కోట్లు సెకండరీ షేర్ల అమ్మకం ద్వారా ఈ నిధులు అందుకుంది. వీటిలో యూనిఫై ఫైనాన్షియల్ ప్రయివేట్ లిమిటెడ్, అశోకా ఇండియా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ నుంచి రూ. 60 కోట్లు చొప్పున లభించగా.. ఇండియా ఎకార్న్ ఫండ్ నుంచి రూ. 40 కోట్లు సమకూరినట్లు ఎవలాన్ వెల్లడించింది. 1999లో షురూ.. ఎండ్టుఎండ్ ఎలక్ట్రానిక్ మ్యాన్యుఫాక్చరింగ్ సర్వీస్ సొల్యూషన్లు అందిస్తున్న ఎవలాన్ 1999లో ఏర్పాటైంది. కంపెనీ క్లయింట్లలో క్యోసన్ ఇండియా, జోనర్ సిస్టమ్స్ ఇంక్, కొలిన్స్ ఏరోస్పేస్, ఈ ఇన్ఫోచిప్స్, యూఎస్ మలబార్ కంపెనీ, మెగ్గిట్, సిస్టెక్ కార్పొరేషన్ తదితరాలున్నాయి. యూఎస్తోపాటు దేశీయంగా 12 తయారీ ప్లాంట్లను నిర్వహిస్తోంది. 2021–22లో రూ. 840 కోట్ల ఆదాయం సాధించింది. 2022 జూన్కల్లా రూ. 1,039 కోట్ల విలువైన ఆర్డర్బుక్ను కలిగి ఉంది. -
ఇండియాఫస్ట్ లైఫ్ ఐపీవోకు సై
న్యూఢిల్లీ: పీఎస్యూ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ప్రమోట్ చేసిన ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా దాదాపు 14.13 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ప్రమోటర్ సంస్థలలో బీవోబీ 8.9 కోట్లకుపైగా షేర్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1,30,56,415 షేర్లు చొప్పున ఆఫర్ చేయనున్నాయి. వాటాదారులలో కార్మెల్ పాయింట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియా 3.92 కోట్లకుపైగా షేర్లు విక్రయించనుంది. ఇండియాఫస్ట్ లైఫ్లో బీవోబీ 65 శాతం వాటాను కలిగి ఉంది. వార్బర్గ్ పింకస్ సంస్థ కార్మెల్ పాయింట్కు 26 శాతం, యూనియన్ బ్యాంక్కు 9 శాతం చొప్పున వాటా ఉంది. ఇష్యూకి ముందు ప్రిఫరెన్షియల్ పద్ధతి లేదా ప్రయివేట్ ప్లేస్మెంట్(రైట్స్ ఇష్యూ) ద్వారా రూ. 100 కోట్లవరకూ సమీకరించే యోచనలో ఉంది. తాజా ఈక్విటీ జారీ నిధులను మూలధన పటిష్టతకు వినియోగించనుంది. కంపెనీ గతేడాది అక్టోబర్లో సెబీకి ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. దేశీయంగా మూడో పెద్ద పీఎస్యూ బ్యాంక్ బీవోబీ, యూనియన్ బ్యాంక్ కంపెనీకి విస్తారిత బ్యాంకెస్యూరెన్స్ నెట్వర్క్ ద్వారా మద్దతిస్తున్నాయి. -
రెండు నెలల్లో 6 ఐపివోలకు చెక్: లిస్ట్లో ఓయో, షాక్లో పేటీఎమ్
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధుల సమీకరణకు వస్తున్న కంపెనీలపై క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కఠినంగా వ్యవహరిస్తోంది. డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎమ్ ఐపీవో తదుపరి తలెత్తిన సవాళ్లరీత్యా అన్లిస్టెడ్ కంపెనీలు అందిస్తున్న సమాచారంపై మరింత ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెరసి గత రెండు నెలల్లో ఆరు కంపెనీల ముసాయిదా ప్రాస్పెక్టస్లను తిప్పి పంపింది. ఓయో బ్రాండుతో ఆతిథ్య రంగ సేవలందిస్తున్న ఒరావెల్ స్టేస్ ఈ జాబితాలో చోటు చేసుకోవడం గమనార్హం! మరింత లోతైన సమాచారంతో తిరిగి తాజా ప్రాస్పెక్టస్లను దాఖలు చేయమంటూ సెబీ ఆయా కంపెనీలను ఆదేశిస్తోంది. జాబితాలో..: ఓయోతోపాటు.. సెబీ ప్రాస్పెక్టస్లను వెనక్కి పంపిన జాబితాలో ఫెయిర్ఫాక్స్(కెనడా) గ్రూప్నకు పెట్టుబడులున్న గో డిజిట్ ఇన్సూరెన్స్ లిమిటెడ్, బీ2బీ పేమెంట్స్, సర్వీసుల సంస్థ పేమేట్ ఇండియా, మొబైల్ తయారీ దేశీ కంపెనీ లావా ఇంటర్నేషనల్, ఫైనాన్షియల్ సేవల సంస్థ ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇండియా, సమీకృత సర్వీసుల సంస్థ బీవీజీ ఇండియా ఉన్నాయి. 2021 సెపె్టంబర్ - 2022 మే నెల మధ్యలో ఈ 6 కంపెనీలు సెబీకి దరఖాస్తు చేశాయి. ఈ ఏడాది జనవరి - మార్చి10 మధ్య సెబీ వీటి ప్రాస్పెక్టస్లను తిప్పి పంపింది. ఈ కంపెనీలు ఉమ్మడిగా రూ. 12,500 కోట్ల సమీకరణకు ప్రణాళికలు వేశాయి. 2021లో నష్టాల ఎఫెక్ట్... 2021లో కొన్ని బడా కంపెనీల పబ్లిక్ ఇష్యూల ద్వారా ఇన్వెస్టర్లు భారీగా నష్టపోవడంతో సెబీ ఇటీవల కఠినంగా వ్యవహరిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రైమ్డేటాబేస్ గణాంకాల ప్రకారం 2022లో సగటున సెబీ ఐపీవోలకు 115 రోజుల్లోగా అనుమతిని ఇచ్చింది. కొత్తతరం డిజిటల్ కంపెనీలు పేటీఎమ్, జొమాటో, నైకా ఇష్యూలలో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోవడంతో సెబీ ఐపీవోకు అనుమతించడంలో కఠినంగా వ్యవహరిస్తున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నిపుణులు వీకే విజయ్కుమార్ పేర్కొన్నారు. ఇన్వెస్టర్ల పరిరక్షణరీత్యా ఇది ఆహ్వానించదగ్గ పరిణామమని వ్యాఖ్యానించారు. అయితే పబ్లిక్ ఇష్యూలలో ఇన్వెస్ట్ చేసేటపుడు ఇన్వెస్టర్లు ప్రధానంగా అధిక ధరను ఆశిస్తున్న కంపెనీలకు దూరంగా ఉండాలని సూచించారు. పేటీఎమ్ షాక్ పేటీఎమ్ బ్రాండుతో డిజిటల్ చెల్లింపుల సేవలు అందిస్తున్న వన్97 కమ్యూనికేషన్స్ 16 నెలల క్రితం పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. పీఎస్యూ దిగ్గజం కోల్ ఇండియా తదుపరి అత్యధికంగా రూ. 18,300 కోట్లు సమీకరించి 2021 నవంబర్లో లిస్టయ్యింది. తదుపరి ఇష్యూ ధరలో 72 శాతాన్ని కోల్పోయింది. కాగా.. సెబీ ఇటీవలి చర్యలు నిబంధనల అమలులో మర్చంట్ బ్యాంకర్లకు హెచ్చరికలుగా భావించవచ్చని మూలా వ్యవస్థాపక సీఈవో ప్రకార్ పాండే అభిప్రాయపడ్డారు. మార్కెట్ల హెచ్చుతగ్గులు, ఇన్వెస్టర్ల బలహీన సెంటిమెంటు నేపథ్యంలో ఈ ఏడాది ఇప్పటివరకూ 9 కంపెనీలు సెబీకి ప్రాస్పెక్టస్లను దాఖలు చేశాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచీ డివ్జీ టార్క్ట్రాన్స్ఫర్ సిస్టమ్స్, గ్లోబల్ సర్ఫేసెస్ మాత్రమే పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. తద్వారా రూ. 730 కోట్లు సమీకరించాయి. రూ. 66 కోట్లు సమకూర్చుకునేందుకు ఉదయ్శివ్కుమార్ వచ్చే వారం ఐపీవోకు రానుంది. 2022లో ఓకే... గతేడాది(2022) మొత్తం 38 కంపెనీలు ఐపీవోకు వచ్చాయి. తద్వారా రూ. 59,000 కోట్లు సమీకరించాయి. అయితే 2021లో రికార్డ్స్థాయిలో 63 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలు చేపట్టాయి. రూ. 1.2 లక్షల కోట్లు సమకూర్చుకున్నాయి. ఇక గతేడాది బీమా రంగ పీఎస్యూ ఎల్ఐసీ రూ. 20,557 కోట్లు సమీకరించడం ద్వారా స్టాక్ ఎక్స్చెంజీలలో లిస్టయ్యింది. వెరసి 2022 ఐపీవో నిధుల్లో 35 శాతం వాటాను ఆక్రమించింది. ఈ ఇష్యూని మినహాయిస్తే ప్రైమరీ మార్కెట్ నీరసించినట్లేనని విశ్లేషకులు పేర్కొన్నారు. ఆర్థిక మాంద్య భయాలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు ప్రభావం చూపినట్లు తెలియజేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం(2023–24) ద్వితీయార్ధంలో ప్రైమరీ మార్కెట్ పుంజుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ధరలతోపాటు పెరుగుతున్న వడ్డీ రేట్లు, ఆర్థిక మందగమనం, షేర్ల అధిక విలువలు తదితర అంశాలు మార్కెట్లలో దిద్దుబాట్లకు కారణంకానున్నట్లు విశ్లేషించారు. -
ఐపీవోకు టాటా టెక్నాలజీస్
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కార్పొరేట్ దిగ్గజం టాటా గ్రూప్ నుంచి మరో కంపెనీ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. గ్లోబల్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అందించే టాటా టెక్నాలజీస్ ఐపీవో సన్నాహాలు ప్రారంభించింది. సెబీకి తాజాగా ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్కు ఇది అనుబంధ సంస్థకాగా.. ఇంతక్రితం ఐటీ సేవల నంబర్ వన్ కంపెనీ టీసీఎస్ 2004లో స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యింది. ఐపీవోలో భాగంగా టాటా టెక్నాలజీస్ 9.57 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. -
ఐపీవోకు నోవా అగ్రిటెక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సస్యరక్షణ ఉత్పత్తుల తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ నోవా అగ్రిటెక్ ఐపీవోకు రానుంది. ఐపీవోలో భాగంగా రూ.140 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా కంపెనీ ప్రమోటర్ నూతలపాటి వెంకట సుబ్బారావు 77.58 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా విక్రయించనున్నారు. అయితే ఓఎఫ్ఎస్ ద్వారా ఒక్కో షేరును ఎంతకు ఆఫర్ చేస్తారనే విషయాన్ని వెల్లడించలేదు. కంపెనీలో ఆయనకున్న మొత్తం వాటా 11.9 శాతం విక్రయించనున్నారు. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ కంపెనీ నోవా అగ్రి సైన్సెస్ ద్వారా కొత్త ఫార్ములేషన్ ప్లాంటు ఏర్పాటుకు వెచ్చిస్తారు. అలాగే ఇప్పటికే ఉన్న ప్లాంటు విస్తరణకు సైతం ఖర్చు చేస్తారు. కంపెనీ షేర్లను ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో లిస్ట్ చేయనుంది. -
రెండు ఇష్యూలకు సెబీ చెక్
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ చేపట్టే బాటలో రెండు కంపెనీలు దాఖలు చేసిన ప్రాస్పెక్టస్లకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా చెక్ పెట్టింది. ఫైనాన్షియల్ రంగ కంపెనీలు బీవీజీ ఇండియా లిమిటెడ్, ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇండియా దరఖాస్తులను సెబీ తిప్పి పంపింది. కాగా.. మౌలిక సదుపాయాల రంగ కంపెనీ ఆర్అండ్బీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ దాఖలు చేసిన ప్రాస్పెక్టస్కు సెబీ ఈ నెల 3న గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వెరసి కంపెనీ పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధుల సమీకరణ చేపట్టేందుకు దారి ఏర్పడింది. సమీకృత సర్వీసుల కంపెనీ బీవీజీ ఇండియా 2021 సెప్టెంబర్లో సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. వీటి ప్రకారం రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్లు, పీఈ ఇన్వెస్టర్ సంస్థ 3ఐ గ్రూప్.. మరో 71.96 లక్షలకుపైగా షేర్లను ఆఫర్ చేయనున్నారు. అయితే సెబీ ప్రాస్పెక్టస్కు చెక్ పెట్టింది. రూ. 1,330 కోట్ల కోసం ఐపీవో ద్వారా రూ. 1,330 కోట్ల సమీకరణకు ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 2021 మే నెలలో సెబీకి ప్రాస్పెక్టస్ దఖలు పరచింది. జులైలో సెబీ గ్రీన్సిగ్నల్ ఇచ్చినప్పటికీ ఇష్యూ చేపట్టలేదు. సెబీ అనుమతి పొందిన తదుపరి ఏడాదిలోగా నిధుల సమీకరణను పూర్తి చేయవలసి ఉన్న సంగతి తెలిసిందే. ఐపీవో చేపట్టేందుకు లభించిన గడువు 2022 జులైలో ముగియడంతో ఆగస్ట్లో తిరిగి సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. వీటి ప్రకారం రూ. 625 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా ప్రమోటర్లు, కంపెనీ ప్రస్తుత వాటాదారులు మరో 1.7 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. అయితే ఈ నెల తొలి వారంలో బీవీజీ ఇండియా, ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ ప్రాస్పెక్టస్లను సెబీ తిప్పి పంపింది. ఎయిరాక్స్ నేలచూపు మెడికల్ పరికరాల తయారీ కంపెనీ ఎయిరాక్స్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూ ప్రయత్నాలను విరమించుకుంది. ఐపీవో ద్వారా రూ. 750 కోట్ల సమీకరణ కోసం 2022 సెప్టెంబర్లో సెబీకి సమర్పించిన ప్రాస్పెక్టస్ను వెనక్కి తీసుకుంది. ప్రాస్పెక్టస్ ప్రకారం కంపెనీ ప్రమోటర్లు సంజయ్ భరత్ కుమార్ జైస్వాల్, ఆషిమా సంజయ్ జైస్వాల్ షేర్లను విక్రయించేందుకు సిద్ధపడ్డారు. పీఎక్స్ఏ ఆక్సిజన్ జనరేటర్ తయారీలో ఉన్న కంపెనీ గత నెలలో ప్రాస్పెక్టస్ను వెనక్కి తీసుకుంది. -
ఫ్యాబిండియా ఐపీవో రద్దు
న్యూఢిల్లీ: కళాత్మక వస్తువులు, లైఫ్స్టైల్ ఉత్పత్తుల రిటైల్ రంగ కంపెనీ ఫ్యాబిండియా పబ్లిక్ ఇష్యూ యోచనను విరమించుకుంది. ప్రస్తుత మార్కెట్ ఆటుపోట్ల నేపథ్యంలో ఐపీవో ద్వారా రూ. 4,000 కోట్ల సమీకరణ ప్రణాళికలను రద్దు చేసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. వెరసి క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి ముసాయిదా ప్రాస్పెక్టస్ను వెనక్కి తీసుకున్నట్లు వెల్లడించింది. ఇష్యూ పరిమాణంరీత్యా ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా లేనట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలియజేశారు. ఐపీవో ద్వారా 2.5 కోట్ల షేర్లను ఆఫర్ చేయాలని భావించింది. ప్రాస్పెక్టస్ గడువు 2023 ఏప్రిల్తో ముగియనున్న నేపథ్యంలో తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఎన్సీడీల స్వచ్చంద చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు నిధులను వెచ్చించాలని కంపెనీ తొలుత ప్రణాళికలు వేసింది. -
డివ్జీ టార్క్ ఇష్యూ @ రూ. 560–590
న్యూఢిల్లీ: ఆటోమోటివ్ విడిభాగాల కంపెనీ డివ్జీ టార్క్ట్రాన్స్ఫర్ సిస్టమ్స్ పబ్లిక్ ఇష్యూ మార్చి 1న ప్రారంభంకానుంది. 3న ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి షేరుకి రూ. 560–590గా నిర్ణయించింది. తద్వారా రూ. 412 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ నేడు(28న) ప్రారంభంకానుంది. ఐపీవోలో భాగంగా రూ. 180 కోట్ల ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 39.34 లక్షల షేర్లను ప్రస్తుత ఇన్వెస్టర్లు, వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను పెట్టుబడి వ్యయాలు, తయారీ సౌకర్యాల పరికరాల కొనుగోలు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 25 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేయవలసి ఉంటుంది. కంపెనీ ప్రధానంగా సిస్టమ్ లెవెల్ ట్రాన్స్ఫర్ కేస్, టార్క్ కప్లర్, డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సొల్యూషన్లు అందిస్తోంది. క్లయింట్ల జాబితాలో ఎంఅండ్ఎం, టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్ ఆటో పార్ట్స్ తదితరాలున్నాయి. మార్చి 14న కంపెనీ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ అయ్యే వీలుంది. -
ఐపీవోకు క్రేయాన్స్ అడ్వర్టైజింగ్
న్యూఢిల్లీ: ప్రకటనల రంగ కంపెనీ క్రేయాన్స్ అడ్వర్టైజింగ్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు అనుగుణంగా ఎన్ఎస్ఈ ఎమర్జ్కు ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. వీటి ప్రకారం రూ. 10 ముఖ విలువగల 64.3 లక్షల ఈక్విటీ షేర్లను బుక్బిల్డింగ్ విధా నంలో జారీ చేయనుంది. తద్వారా సమీకరించి న నిధుల్లో రూ. 15.3 కోట్లను మౌలికసదుపాయాలు, విస్తరణకు అవసరమైన ఆధునిక సాంకేతికతకు వినియోగించనుంది. అంతేకాకుండా మరో రూ. 14.5 కోట్లను వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వెచ్చించనుంది. క్రేయాన్స్ అడ్వర్టైజింగ్ ప్రధానంగా బ్రాండ్ వ్యూహాలు, క్రియేటివ్ సొల్యూషన్లు, ఈవెంట్లు, డిజిటల్, సంప్రదాయ మీడియా ప్లానింగ్ తదితర సర్వీ సులను అందిస్తోంది. ఇటీవలే టాటా సన్స్, జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ కాంట్రాక్టులు పొందింది. క్లయింట్ల జాబితాలో ఐవోసీ, టాటా క్రోమా, బ్యాంక్ ఆఫ్ బరోడా సైతం చేరాయి. -
ఐపీవోకు ఫస్ట్ మెరిడియన్ బిజినెస్
న్యూఢిల్లీ: సిబ్బంది సరఫరా, నియామక సంస్థ ఫస్ట్ మెరిడియన్ బిజినెస్ సర్వీసెస్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. తద్వారా రూ. 740 కోట్లు సమకూర్చుకోనుంది. వెరసి తొలుత వేసిన రూ. 800 కోట్ల సమీకరణ ప్రణాళికలను తాజాగా సవరించింది. ఐపీవోలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో రూ. 690 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారు సంస్థలు విక్రయానికి ఉంచనున్నాయి. చదవండి: మెడికల్ లైసెన్సింగ్ పరీక్షల్లో చాట్జీపీటీ పాస్..ఇకపై విద్యార్ధులకు పేపర్పైనే పరీక్షలు! -
రెండు ఐపీవోలకు సెబీ గ్రీన్సిగ్నల్
న్యూఢిల్లీ: సెబీ తాజాగా రెండు కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వీటిలో ఎలక్ట్రానిక్ తయారీ సర్వీసులు అందించే ఎవలాన్ టెక్నాలజీస్, నిర్మాణ రంగ కంపెనీ ఉదయ్శివకుమార్ ఇన్ఫ్రా ఉన్నాయి. అయితే బీటూబీ పేమెంట్స్, సర్వీసుల సంస్థ పేమేట్ ఇండియా పబ్లిక్ ఇష్యూకి తాత్కాలికంగా బ్రేకులు వేసింది. ఈ నెల మొదట్లో మొబైల్ తయారీ కంపెనీ లావా ఇంటర్నేషనల్, ఓయో బ్రాండ్ ట్రావెల్ టెక్ సంస్థ ఒరావెల్ స్టేస్ లిమిటెడ్ ఐపీవో దరఖాస్తులను సైతం తాజా సమాచారం కోసం సెబీ తిప్పి పంపిన విషయం విదితమే. ఇతర వివరాలు చూద్దాం.. ఎవలాన్ టెక్ ఐపీవోలో భాగంగా ఎవలాన్ టెక్నాలజీస్ రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 625 కోట్ల విలువైన షేర్లను సైతం కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. 1999లో ఏర్పాటైన ఎవలాన్ ఎండ్ టు ఎండ్ ఎలక్ట్రానిక్స్ మ్యాన్యుఫాక్చరింగ్ సర్వీసులను అందిస్తోంది. క్లయింట్ల జాబితాలో క్యోసన్ ఇండియా, జోనర్ సిస్టమ్స్ ఇంక్, కొలిన్స్ ఏరోస్పేస్, ఈఇన్ఫోచిప్స్, మెగ్గిట్, సిస్టెక్ కార్పొరేషన్ తదితరాలున్నాయి. ఉదయ్శివకుమార్ ముసాయిదా ప్రాస్పెక్టస్ ప్రకారం ఐపీవోలో భాగంగా ఉదయ్శివకుమార్ ఇన్ఫ్రా రూ. 60 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. పబ్లిక్ ఇష్యూ నిధులను వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. రహదారుల నిర్మాణంలో కంపెనీ కార్యకలాపాలు కలిగి ఉంది. కర్ణాటకలో రోడ్డు, బ్రిడ్జిలు, కాలువలు, పారిశ్రామిక ప్రాంత ప్రాజెక్టులతోపాటు ప్రభుత్వ శాఖల ఆర్డర్లు చేపడుతోంది. పేమేట్ ఇండియా బీటూబీ పేమెంట్స్, సర్వీసుల కంపెనీ పేమేట్ ఇండియా ఐపీవో దరఖాస్తుకు సెబీ బ్రేక్ వేసింది. కొన్ని అంశాలలో తాజా సమాచారంతో కూడిన మరో దరఖాస్తును తిరిగి దాఖలు చేయమంటూ ఆదేశించింది. కంపెనీ తొలుత 2022 మే నెలలో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. తద్వారా రూ. 1,500 కోట్ల సమీకరణ యోచనలో ఉంది. ప్రతిపాదిత దరఖాస్తు ప్రకారం రూ. 1,125 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 375 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ క్రెడిట్ కార్డ్ దిగ్గజం వీసాతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. చదవండి: మరీ ఇంత దారుణమా! అద్దె కూడా చెల్లించని ఎలాన్ మస్క్.. కోర్టులో దావా -
రెండు ఫార్మా ఐపీవోలకు సెబీ అనుమతి
న్యూఢిల్లీ: ఇన్నోవా క్యాప్టాబ్, బ్లూజెట్ హెల్త్కేర్ కంపెనీల ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు సెబీ నుంచి ఆమోదం లభించింది. దీంతో ఈ రెండు సంస్థలు ఐపీవో రూపంలో ప్రజల నుంచి నిధులు సమీకరించుకునేందుకు మార్గం సుగమం అయింది. ఈ రెండు సంస్థలు గతేడాది జూన్–సెప్టెంబర్ మధ్య ఐపీవో అనుమతి కోరుతూ సెబీ వద్ద పత్రాలు దాఖలు చేశాయి. తాజాగా ఈ రెండింటి ఐపీవోలకు సెబీ అన అబ్జర్వేషన్ (అనుమతి) తెలియజేసింది. ఇన్నోవా క్యాప్టాబ్ తాజా ఈక్విటీ జారీ రూపంలో రూ.400 కోట్ల విలువైన షేర్లను విక్రయించనుంది. కంపెనీలో ఇప్పటికే వాటాలు కలిగిన ప్రమోటర్లు, ఇతర వాటాదారులు 96 లక్షల ఈక్విటీ షేర్లను ఐపీవోలో భాగంగా విక్రయించనున్నారు. అంటే ఈ మొత్తం ఆయా వాటాదారులకే వెళుతుంది. తాజా షేర్ల జారీ రూపంలో వచ్చే నిధుల నుంచి రూ.180 కోట్లను కంపెనీ రుణాలు తీర్చివేసేందుకు వినియోగించనుంది. రూ.90 కోట్లను మూలధన అవసరాలకు ఉపయోగిస్తుంది. ఇన్నోవా క్యాప్టాబ్ ఫార్మా రంగంలో పరిశోధన, అభివృద్ధి, తయారీ, పంపిణీ, మార్కెటింగ్, ఎగుమతి సేవలను అందిస్తోంది. ఫార్మాస్యూటికల్ ఇంగ్రేడియంట్స్ను తయారు చేసే బ్లూజెట్ హెల్త్ కేర్ ఐపీవోలో భాగంగా రూ.2,16,83,178 షేర్లను (ఓఎఫ్ఎస్) విక్రయించనుంది. ప్రమోటర్లు అక్షయ్ బన్సారిలాల్ అరోరా, శివేన్ అక్షయ్ అరోరా తమ వాటాల నుంచి ఈ మేరకు విక్రయిస్తారు. -
లావాకి షాకిచ్చిన సెబీ.. ఐపీవోకు బ్రేక్
న్యూఢిల్లీ: మొబైల్ తయారీ దేశీ కంపెనీ లావా ఇంటర్నేషనల్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. కంపెనీ దాఖలు చేసిన ప్రాథమిక దరఖాస్తును క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వెనక్కి పంపించింది. కొన్ని అంశాలలో తాజా సమాచారాన్ని క్రోడికరించి తిరిగి ప్రాస్పెక్టస్ను దాఖలు చేయవలసిందిగా ఆదేశించింది. వెరసి లావా లిస్టింగ్ ఆలస్యమయ్యే అవకాశమున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. లావా, జోలో బ్రాండ్లతో మొబైల్ హ్యాండ్ సెట్లు, ట్యాబ్లెట్లు తదితర ఎలక్ట్రానిక్ ప్రొడక్టులను లావా ఇంటర్నేషనల్ రూపొందిస్తోంది. ఐపీవో చేపట్టేందుకు వీలుగా కంపెనీ 2021 సెప్టెంబర్లో సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. వీటి ప్రకారం రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 4.37 కోట్లకుపైగా షేర్లను ప్రమోటర్లు, వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను బ్రాండుకు ప్రాచుర్యం, ఇతర సంస్థల కొనుగోళ్లు, అనుబంధ సంస్థలలో పెట్టుబడులు తదితరాలకు వినియోగించనుంది. చదవండి: విమాన ప్రయాణం.. మీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేయమంటారు, ఎందుకో తెలుసా? -
ఐపీవోకు సైయంట్ డీఎల్ఎం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్ తయారీ సేవల (ఈఎంఎస్) సంస్థ సైయంట్ డీఎల్ఎం పబ్లిక్ ఇష్యూకు (ఐపీవో) వస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రాస్పెక్టస్ ముసాయిదాను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దాఖలు చేసింది. దీని ప్రకారం ఐపీవో ద్వారా రూ. 740 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఈ నిధులను మూలధనం, రుణాల చెల్లింపు, ఇతర సంస్థల కొనుగోలు తదితర అవసరాల కోసం వినియోగించుకోనుంది. ఈ ఇష్యూలో ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో షేర్ల విక్రయం ఉండదు. పూర్తిగా కొత్త షేర్లను జారీ చేయనున్నారు. ప్రీ–ఐపీవో ప్లేస్మెంట్ రౌండులో రూ. 148 కోట్ల వరకు విలువ చేసే షేర్లను జారీ చేసే అవకాశం ఉంది. ఐటీ ఇంజనీరింగ్ సేవల సంస్థ సైయంట్కు ఇది అనుబంధ సంస్థగా ఉంది. దీనికి హైదరాబాద్, బెంగళూరు, మైసూర్లో తయారీ ప్లాంట్లు ఉన్నాయి. చదవండి: అమెజాన్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. ఈసారి ఎంతమంది అంటే? -
జేజీ కెమికల్స్ ఐపీవో బాట
న్యూఢిల్లీ: జింక్ ఆక్సైడ్ తయారీ కంపెనీ జేజీ కెమికల్స్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 203 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 57 లక్షల షేర్లను ప్రస్తుత ప్రమోటర్ గ్రూప్ వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ప్రధానంగా విజన్ ప్రాజెక్ట్స్ అండ్ ఫిన్వెస్ట్ 36.4 లక్షల షేర్లను ఆఫర్ చేయనుంది. చదవండి: Jack Ma: సంచలన నిర్ణయం తీసుకున్న చైనా వ్యాపార దిగ్గజం -
దేశంలో తగ్గని ఐపీవో జోరు..ఐపీవోకి సిద్దంగా దిగ్గజ కంపెనీలు
న్యూఢిల్లీ: తాజాగా రెండు కంపెనీలు పబ్లిక్ ఇష్యూ బాట పట్టాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ భారత్ హైవేస్ ఇన్విట్, వైట్ ఆయిల్స్ తయారీ కంపెనీ గాంధార్ ఆయిల్ రిఫైనరీ ఈ జాబితాలో చేరాయి. ఈ రెండు సంస్థలూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేశాయి. వివరాలు ఇలా.. రూ. 2,000 కోట్లకు రెడీ పబ్లిక్ ఇష్యూలో భాగంగా భారత్ హైవేస్ ఇన్విట్ బుక్బిల్డింగ్ ద్వారా రూ. 2,000 కోట్ల విలువైన యూనిట్లను ఆఫర్ చేయనుంది. తద్వారా రూ. 2,000 కోట్లు సమకూర్చుకోనుంది. నిధులను ప్రాజెక్టŠస్ ఎస్పీవీకి చెందిన కొన్ని రుణాల చెల్లింపుతోపాటు.. సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఎస్పీవీ ప్రాజెక్టŠస్లో.. పోర్బందర్– ద్వారకా ఎక్స్ప్రెస్వే, వారణాశి– సంగమ్ ఎక్స్ప్రెస్వే, జీఆర్ సంగ్లీ– సోలాపూర్ హైవే, జీఆర్ అక్కల్కోట్– సోలాపూర్ హైవే, జీఆర్ ఫగ్వారా ఎక్స్ప్రెస్వే, జీఆర్ గుండుగొలను– దేవరాపల్లి హైవే ఉన్నాయి. 2022 ఆగస్ట్లో ఏర్పాటైన భారత్ హైవేస్ ఇన్విట్ ప్రాజెక్ట్ ఎస్పీవీలో ప్రతీ ప్రాజక్టులోనూ 100 శాతం చొప్పున వాటా కొనుగోలు చేయనుంది. ప్రాథమికంగా 49 శాతం వాటాను సొంతం చేసుకుంటుంది. రూ. 500 కోట్లపై కన్ను పబ్లిక్ ఇష్యూలో భాగంగా గాంధార్ ఆయిల్ రిఫైనరీ రూ. 357 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో 1.2 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా రూ. 500 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, ఎక్విప్మెంట్ కొనుగోలుసహా.. సిల్వస్సా ప్లాంటులో ఆటోమోటివ్ ఆయిల్ తయారీ సామర్థ్య విస్తరణకు అవసరమైన సివిల్ వర్క్లకూ వెచ్చించనుంది. అంతేకాకుండా తలోజా ప్లాంటులో పెట్రోలియం జెల్లీతోపాటు.. సంబంధిత కాస్మెటిక్ ప్రొడక్టుల తయారీ విస్తరణకు సైతం వినియోగించనుంది. వైట్ ఆయిల్స్ తయారీకి మరిన్ని బ్లెండింగ్ ట్యాంకులను సైతం ఏర్పాటు చేయనుంది. -
ఐపీవోకి రేడియంట్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్.. స్టాక్ ప్రైస్ ఎంతంటే?
న్యూఢిల్లీ: వారాంతాన(23న) ప్రారంభంకానున్న పబ్లిక్ ఇష్యూకి రేడియంట్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ రూ. 94–99 ధరల శ్రేణిని ఖరారు చేసింది. మంగళవారం(27న) ముగియనున్న ఇష్యూలో భాగంగా రూ. 60 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 3,31,25,000 షేర్లను ప్రమోటర్ డేవిడ్ దేవసహాయంతోపాటు, పీఈ సంస్థ అసెంట్ క్యాపిటల్ అడ్వయిజర్స్ ఇండియా ఆఫర్ చేయనుంది. తద్వారా కంపెనీ రూ. 388 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. 2015లో అసెంట్ క్యాపిటల్ రేడియంట్లో 37.2 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈక్విటీ జారీ నిధులను వర్కింగ్ క్యాపిటల్, పెట్టుబడి వ్యయాలకు వినియోగించనుంది. ప్రత్యేకంగా రూపొందిన రక్షణాత్మక వ్యాన్లను సొంతం చేసుకునేందుకు వెచ్చించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 150 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చెయ్యాలి. జాగిల్ ప్రీపెయిడ్ ఓషన్ రెడీ ఫిన్టెక్ కంపెనీ జాగిల్ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీసెస్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా సెబీకి తాజాగా ప్రాథమిక ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 490 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా 1.05 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు, ఇతర వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. 2011లో ప్రారంభమైన కంపెనీ బిజినెస్ టు బిజనెస్ టు కస్టమర్ విభాగంలో పనిచేస్తోంది. -
వీదేశీ విస్తరణ బాటలో కేఫిన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పబ్లిక్ ఇష్యూకి వస్తున్న ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ కేఫిన్ టెక్నాలజీస్ అంతర్జాతీయంగా కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తోంది. మలేసియా, ఫిలిప్పీన్స్, హాంకాంగ్ తదితర దేశాల్లో ఇప్పటికే 21 ఏఎంసీలకు (అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు) సర్వీసులు అందిస్తుండగా మలేసియా, సింగపూర్లలో ఏఎంసీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. శుక్రవారమిక్కడ విలేకరుల సమావేశంలో ఐపీవో వివరాల వెల్లడి సందర్భంగా కంపెనీ ఎండీ శ్రీకాంత్ నాదెళ్ల ఈ విషయాలు చెప్పారు. ఈ మార్కెట్లలో పరిమాణం 1 ట్రిలియన్ డాలర్లకుపైగా ఉంటుందని వివరించారు. ఆగ్నేయాసియా, ఇతర మార్కెట్లలో అవకాశాలను దక్కించుకునేందుకు ఫండ్ అకౌంటింగ్, అడ్మినిస్ట్రేషన్ సర్వీసులు మొదలైనవి కూడా అందించడంపై దృష్టి పెడుతున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం హెక్సాగ్రామ్ ఫిన్టెక్ వంటి కంపెనీలను కొనుగోలు చేసినట్లు వివరించారు. తమకు అనువుగా ఉండే మరిన్ని సంస్థలను కూడా కొనుగోలు చేసే యోచన ఉందని శ్రీకాంత్ చెప్పారు. మరోవైపు, ప్రస్తుతం సంస్థలో సుమారు 5,000 మంది పైచిలుకు సిబ్బంది ఉండగా, హైదరాబాద్లో 3,500 మంది ఉద్యోగులు ఉన్నారని శ్రీకాంత్ వివరించారు. కార్యకలాపాలను విస్తరిస్తున్న నేపథ్యంలో వచ్చే 12–18 నెలల్లో మరో 400–500 మందిని నియమించుకోనున్నట్లు చెప్పారు. డిసెంబర్ 19తో ప్రారంభమయ్యే ఐపీవో ద్వారా కేఫిన్ టెక్నాలజీస్ రూ. 1,500 కోట్లు సమీకరిస్తోంది. ధర శ్రేణి రూ. 347–366గా ఉండగా, కనీసం 40 షేర్లకు బిడ్ చేయాల్సి ఉంటుంది. చదవండి: గ్రామీణ ప్రాంతాల్లో ఆ కారుకు ఉన్న క్రేజ్ వేరబ్బా.. మూడు నెలల్లో రికార్డు సేల్స్! -
ఐపీవోకు ఐఆర్ఎం ఎనర్జీ
న్యూఢిల్లీ: సిటీ గ్యాస్ పంపిణీ కంపెనీ ఐఆర్ఎం ఎనర్జీ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియత్రంణ సంస్థ సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా 1.01 కోట్ల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ఐపీవో ద్వారా రూ. 700 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్లకు 67.94 శాతం వాటా ఉంది. దీనిలో క్యాడిలా ఫార్మాస్యూటికల్స్ వాటా 49.5 శాతంకాగా.. ఐఆర్ఎం ట్రస్ట్ లిమిటెడ్ మిగిలిన వాటాను కలిగి ఉంది. ఇష్యూ నిధులను ప్రధానంగా పెట్టుబడి అవసరాలకు వినియోగించనుంది. నమక్కల్, తిరుచిరాపల్లిలో సిటీ గ్యాస్ పంపిణీ అభివృద్ధిని చేపట్టనుంది. కంపెనీ పైప్డ్ నేచురల్ గ్యాస్(పీఎన్జీ), కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(సీఎన్జీ)లను సరఫరా చేస్తోంది. గుజరాత్, పంజాబ్, తమిళనాడుల్లో కార్యకలాపాలు విస్తరించింది. ఈ సెప్టెంబర్తో ముగిసిన ఆరు నెలల కాలంలో ఆదాయం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 504 కోట్లను అధిగమించింది. 2020–21 ప్రథమార్ధంలో రూ. 205 కోట్ల టర్నోవర్ మాత్రమే సాధించింది. అయితే ముడిగ్యాస్ ధరల పెరుగుదల కారణంగా నికర లాభం 18 శాతం క్షీణించి రూ. 39 కోట్లకు పరిమితమైంది. గతేడాది ఇదే కాలంలో దాదాపు రూ. 48 కోట్లు ఆర్జించింది. చదవండి: ఆర్థిక మాంద్యంలోనూ అదరగొట్టిన మల్టీబ్యాగర్ స్టాక్.. కలలో కూడా ఊహించని లాభం! -
పబ్లిక్ ఇష్యూల హవా
న్యూఢిల్లీ: ఈ వారం ప్రైమరీ మార్కెట్ ఊపందుకుంది. బుధవారం(14న) ముగిసిన శూల వైన్యార్డ్స్కు 2.33 రెట్లు అధిక స్పందన లభించగా.. గురువారం(15న) ముగిసిన మరో రెండు ఐపీవోలు విజయవంతమయ్యాయి. ఇవి ల్యాండ్మా ర్క్ కార్స్, అబాన్స్ హోల్డింగ్స్కాగా.. సోమ (21), మంగళ(22)వారాల్లో మరో రెండు కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వస్తున్నాయి. ఈ ప్రభావంతో హెల్త్కేర్ టెక్ సంస్థ ఇండెజీన్ లిమిటెడ్ తాజాగా పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇతర వివరాలు చూద్దాం.. ల్యాండ్మార్క్ కార్స్ చివరి రోజుకల్లా ప్రీమియం ఆటోమొబైల్ డీలర్ షిప్ కంపెనీ ల్యాండ్మార్క్ కార్స్ ఐపీవోకు 3 రెట్లు అధికంగా సబ్స్క్రిప్షన్ లభించింది. కంపెనీ 80,41, 805 షేర్లు ఆఫర్ చేయగా.. 2.46 కోట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగం నుంచి 8.71 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 1.32 రెట్లు అధికంగా బిడ్స్ నమోదయ్యాయి. రిటైల్ ఇన్వెస్టర్ల కోటాలో మాత్రం 59 శాతానికే దరఖాస్తులు వచ్చాయి. షేరుకి రూ. 481–506 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 552 కోట్లు సమకూర్చుకుంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. అబాన్స్ హోల్డింగ్స్ ఫైనాన్షియల్ సర్వీసుల కంపెనీ అబాన్స్ హోల్డింగ్స్ ఐపీవోకు చివరి రోజుకల్లా కేవలం 1.1 రెట్లు అధికంగా సబ్స్క్రిప్షన్ లభించింది. కంపెనీ 1,28,00,000 షేర్లు ఆఫర్ చేయగా.. 1.40 కోట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగం నుంచి 4.1 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 1.48 రెట్లు అధికంగా బిడ్స్ నమోదయ్యాయి. రిటైల్ ఇన్వెస్టర్ల కోటాలో మాత్రం 40 శాతానికే దరఖాస్తులు వచ్చాయి. ఇష్యూకి ధరల శ్రేణి షేరుకి రూ. 256–270కాగా.. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థ అబాన్స్ ఫైనాన్స్ పెట్టుబడులకు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఎలిన్ ధర ఖరారు ఎలక్ట్రానిక్స్ తయారీ సర్వీసుల కంపెనీ ఎలిన్ ఎలక్ట్రానిక్స్ పబ్లిక్ ఇష్యూకి రూ. 234–247 ధరల శ్రేణిని ప్రకటించింది. ఈ నెల 20–22 మధ్య చేపట్టనున్న ఇష్యూ ద్వారా రూ. 475 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. తొలుత రూ. 760 కోట్లపై కన్నేసినప్పటికీ టార్గెట్లో కోత పెట్టుకుంది. వెరసి ఇష్యూలో భాగంగా రూ. 175 కోట్ల ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా రూ. 300 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, యూపీ, గోవా యూనిట్ల విస్తరణ, ఆధునీకరణసహా ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 60 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. కంపెనీ లైటింగ్, ఫ్యాన్లు, చిన్నతరహా కిచెన్ అప్లయెన్సెస్, తదితర విభాగాలలో ప్రధాన బ్రాండ్లకు ఎండ్టు ఎండ్ ప్రొడక్ట్ సొల్యూషన్స్ అందిస్తోంది. ఫ్రాక్షనల్ హెచ్పీ మోటార్స్ తయారీలో పేరొందింది. మార్చితో ముగిసిన గతేడాది(2021–22) ఆదాయం 27 శాతం జంప్చేసి రూ. 1,094 కోట్లకు చేరగా.. నికర లాభం 12 శాతం మెరుగుపడి రూ. 39 కోట్లను తాకింది. ఇండెజీన్ లిమిటెడ్ హెల్త్కేర్ టెక్ కంపెనీ ఇండెజీన్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. గ్లోబల్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమపై దృష్టి పెట్టిన కంపెనీ ఐపీవో ద్వారా రూ. 3,200 కోట్లు సమీకరించాలని చూస్తోంది. దీనిలో భాగంగా రూ. 950 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా కంపెనీ ప్రస్తుత ఇన్వెస్టర్లు మరో 3.63 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలు, ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. సోమవారం కేఫిన్.. 19న ప్రారంభంకానున్న పబ్లిక్ ఇష్యూలో భాగంగా కేఫిన్ ప్రమోటర్ సంస్థ జనరల్ అట్లాంటిక్ సింగపూర్ ఫండ్ పీటీఈ రూ. 1,500 కోట్ల విలువైన ఈక్విటీని ఆఫర్ చేయనుంది. వెరసి ఐపీవో ద్వారా సమీకరించే రూ. 1,500 కోట్లు ప్రమోటర్ సంస్థకు చేరనున్నాయి. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్ సంస్థకు 74.37 శాతం వాటా ఉంది. కాగా.. 2021లో కొటక్ మహీంద్రా బ్యాంకు కేఫిన్లో 9.98 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఐపీవోకు రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 40 షేర్ల(ఒక లాట్)కు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. కంపెనీ ప్రధానంగా దేశీ మ్యూచువల్ ఫండ్స్, ఏఐఎఫ్లు, వెల్త్ మేనేజర్స్ తదితరాలకు ఇన్వెస్టర్ సొల్యూషన్స్ అందిస్తోంది. -
ఆర్ఆర్ కేబుల్ ఐపీవో బాట
న్యూఢిల్లీ: వైర్లు, కేబుళ్లుసహా ఎఫ్ఎంఈజీ ప్రొడక్టుల తయారీ కంపెనీ ఆర్ఆర్ కేబుల్ పబ్లిక్ ఇష్యూ ప్రణాళికల్లో ఉంది. ఇందుకు అనుగుణంగా వచ్చే మే నెలలో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక దరఖాస్తును దాఖలు చేసే అవకాశముంది. ఆర్ఆర్ గ్లోబల్ గ్రూప్ కంపెనీ రానున్న మూడేళ్లపాటు ప్రతీయేటా టర్నోవర్ను రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వెరసి 2026కల్లా రూ. 11,000 కోట్ల అమ్మకాలు అందుకోవాలని చూస్తున్నట్లు కంపెనీ ఎండీ, గ్రూప్ ప్రెసిడెంట్ శ్రీగోపాల్ కాబ్రా తెలియజేశారు. 2023–24 మూడో త్రైమాసికంలో ఐపీవో చేపట్టాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. చదవండి అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.7వేలకే అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్టీవీ! -
28 నుంచి ధర్మజ్ కార్ప్ ఐపీవో
న్యూఢిల్లీ: ఆగ్రో కెమికల్స్ తయారీ కంపెనీ ‘ధర్మజ్ కార్ప్ గార్డ్’ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ఈ నెల 28 నుంచి మొదలు కానుంది. 30వ తేదీన ఇష్యూ ముగుస్తుంలది. ఒక్కో షేరుకు ధరల శ్రేణిగా రూ.216–237ను ప్రకటించింది. గరిష్ట ధర ప్రకారం చూస్తే ఈ ఐపీవో ద్వారా కంపెనీ రూ.251 కోట్ల వరకు సమీకరించనుంది. రూ.216 కోట్ల విలువ చేసే షేర్లను తాజా జారీ ద్వారా, మరో 14.83 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా విక్రయించనుంది. ఐపీవో రూపంలో కంపెనీకి సమకూరే రూ.216 కోట్లను గుజరాత్లోని బరూచ్లో తయారీ కేంద్రం ఏర్పాటుకు వినియోగించనుంది. అలాగే, మూలధన అవసరాలకు, రుణాలను చెల్లించేందుకు ఉపయోగించుకోనుంది. పురుగు ముందులు, శిలీంద్ర సంహారిణి రసాయనాలు, సూక్ష్మ ఎరువులు తదితర ఉత్పత్తులను ధర్మజ్ తయారు చేస్తోంది. 25కు పైగా దేశాలకు తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. చదవండి: PM Kisan New Rules: పీఎం కిసాన్లో కొత్త రూల్స్.. వాళ్లంతా అనర్హులు, ఈ పథకం వర్తించదు! -
ప్రొటీన్ ఈగవ్ టెక్నాలజీస్ ఐపీవోకు ఆమోదం
న్యూఢిల్లీ: ఐటీ సంబంధిత సేవల్లోని ప్రొటీన్ ఈ గవ్ టెక్నాలజీస్, బాలాజీ స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీల ఐపీవోలకు సెబీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ రెండు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) అనుమతి కోరుతూ ఈ ఏడాది ఆగస్ట్ ముందు సెబీ వద్ద ముసాయిదా పత్రాలను దాఖలు చేశాయి. ఈ నెల 15–17 మధ్య సెబీ నుంచి వీటికి అనుమతి (అబ్జర్వేషన్) లభించింది. బాలాజీ స్పెషాలిటీ కెమికల్స్ ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్/ప్రస్తుత వాటాదారుల అమ్మకం) రూపంలో 2,60,00,000 షేర్లను విక్రయించనుంది. అలాగే, రూ.250 కోట్ల విలువైన తా జా షేర్ల జారీ చేయనుంది. ఇందులో రూ.68 కోట్లను రుణాలను చెల్లించేందుకు, రూ.120 కోట్లను మూలధన అవసరాలకు వినియోగించనుంది. ఇక ప్రొటీన్ ఈగవ్ టెక్నాలజీస్ (గతంలో ఎన్ఎస్డీఎల్ ఈ గవర్నెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో 1.2 కోట్ల ఈక్విటీ షేర్లను ఐపీవోలో భాగంగా వాటాదారులకు విక్రయించనుంది. ఈ ఐపీవోతో కంపెనీకి వచ్చే నిధులు ఏమీ లేవు. ప్రస్తుత వాటాదారులైన యాక్సిస్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు తదితర కంపెనీలు వాటాలను విక్రయిస్తాయి. -
నష్టాల్లో పేటీఎం..లక్ష కోట్లు హాంఫట్!
ప్రముఖ ఫిన్టెక్ కంపెనీ పేటీఎం భారీగా నష్టపోతుంది. పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ షేర్ మంగళవారం స్టాక్స్ ఇంట్రాడే ట్రేడింగ్లో రూ.476.65లతో ఆల్టైం కనిష్టాన్ని తాకింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి రూ.477.1 వద్ద నిలిచింది. గత సెషన్తో పోలిస్తే 11 శాతానికి పైగా పేటీఎం షేర్ పతనమైంది. దీంతో గతేడాది నవంబర్18న స్టాక్ మార్కెట్లలో లిస్టయినప్పటి నుంచి రూ.లక్ష కోట్లకు పైగా మార్కెట్ కేపిటల్ వ్యాల్యూని పోగొట్టుకుంది. ప్రస్తుత మార్కెట్ క్యాపిటలైజేషన్ మంగళవారం నాటికి రూ.30,971 కోట్లగా ఉంది. -
యాత్రా ఆన్లైన్ ఐపీవో.. సెబీ గ్రీన్సిగ్నల్
న్యూఢిల్లీ: ప్రయాణ సంబంధ సేవలందించే యాత్రా ఆన్లైన్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి గ్రీన్సిగ్నల్ పొందింది. యాత్రా ఆన్లైన్ ఇంక్కు దేశీ అనుబంధ సంస్థ అయిన కంపెనీ ఇష్యూలో భాగంగా రూ. 750 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 93,28,358 షేర్లను కంపెనీలో ఇప్పటికే పెట్టుబడులున్న సంస్థలు విక్రయానికి ఉంచనున్నాయి. ఈక్విటీ జారీ నిధులను వ్యూహాత్మక కొనుగోళ్లు, కస్టమర్లను ఆకట్టుకునే పెట్టుబడులు తదితర వృద్ధి అవకాశాలకు వినియోగించనుంది. 700 భారీ కంపెనీలు కస్టమర్లుగా కలిగిన యాత్రా ఆన్లైన్ దేశీయంగా కార్పొరేట్ ట్రావెల్ సర్వీసుల విభాగంలో ముందుంది. చదవండి: ఆధార్ కార్డు హోల్డర్లకు హెచ్చరిక.. ఇలా చేయకపోతే ఇబ్బందులు తప్పవ్! -
కీస్టోన్ రియల్టర్స్ ఐపీవో ఓకే
న్యూఢిల్లీ: రుస్తోంజీ బ్రాండుతో రియల్టీ ఆస్తులను విక్రయించే కీస్టోన్ రియల్టర్స్ పబ్లిక్ ఇష్యూకి ఓమాదిరి స్పందన లభించింది. ఇష్యూ చివరి రోజు బుధవారానికల్లా 2 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయ్యింది. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం కంపెనీ 86,47,858 షేర్లను ఆఫర్ చేయగా.. 1,73,72,367 షేర్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారులు(క్విబ్) నుంచి 3.84 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 3.03 రెట్లు అధిక బిడ్స్ దాఖలయ్యాయి. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగంలో మాత్రం 53 శాతమే సబ్స్క్రిప్షన్ నమోదైంది. షేరుకి రూ. 514–541 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 635 కోట్లు సమకూర్చుకుంది. ఇష్యూలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 190 కోట్లు అందుకున్న విషయం విదితమే. దాదా పు రూ. 342 కోట్ల రుణ చెల్లింపులు, భవిష్యత్ రియల్టీ ప్రాజెక్టులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు నిధులను వినియోగించనుంది. 1995లో ఏర్పాటైన కంపెనీ 32 ప్రాజెక్టులను పూర్తి చేయగా.. ప్రస్తుతం 12 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో మరో 19 ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు కంపెనీ తెలియజేసింది. -
కళామందిర్కు సెబీ గ్రీన్సిగ్నల్
న్యూఢిల్లీ: సంప్రదాయ దుస్తుల విక్రయ సంస్థ సాయి సిల్క్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఐపీవో ద్వారా రూ. 1,200 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. ఇష్యూలో భాగంగా రూ. 600 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా 1.80 కోట్లకుపైగా షేర్లను ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ సంస్థలు విక్రయానికి ఉంచనున్నాయి. కళామందిర్, వరమహాలక్ష్మి సిల్క్స్, కేఎల్ఎం, మందిర్ బ్రాండ్లతో కంపెనీ రిటైల్ స్టోర్లను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈక్విటీ జారీ నిధులను 25 కొత్త స్టోర్లు, 2 వేర్హౌస్ల ఏర్పాటుకు వినియోగించనుంది. అంతేకాకుండా రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలు తదితరాలకు సైతం కేటాయించనుంది. కంపెనీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులలో 50 స్టోర్లను నిర్వహిస్తోంది. రూ. 2,400 కోట్లపై కేఫిన్ కన్ను ఫైనాన్షియల్ సర్వీసుల ప్లాట్ఫామ్ కేఫిన్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూ చేపట్టనుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా అనుమతించింది. ఐపీవో ద్వారా కంపెనీ రూ. 2,400 కోట్లు సమకూర్చుకోవాలని ప్రణాళికలు వేసింది. కంపెనీ ప్రమోటర్ జనరల్ అట్లాంటిక్ సింగపూర్ ఫండ్ పీటీఈ లిమిటెడ్ వాటాను విక్రయించనుంది. ప్రస్తుతం కేఫిన్లో జనరల్ అట్లాంటిక్ దాదాపు 75 శాతం వాటాను కలిగి ఉంది. గతేడాది ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం కొటక్ మహీంద్రా 9.98 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఐపీవో దరఖాస్తును కంపెనీ మార్చిలో సెబీకి దాఖలు చేసింది. -
ముత్తూట్ మైక్రోఫిన్ ఐపీవో బాట.. రూ.1800 కోట్లు టార్గెట్!
ముంబై: ప్రయివేట్ రంగ కంపెనీ ముత్తూట్ మైక్రోఫిన్ పబ్లిక్ ఇష్యూ యోచనలో ఉంది. ముత్తూట్ ఫిన్కార్ప్ ప్రమోట్ చేసిన కంపెనీ 2023 చివరి క్వార్టర్కల్లా క్యాపిటల్ మార్కెట్లను ఆశ్రయించే ప్రణాళికల్లో ఉన్నట్లు వెల్లడించింది. ఐపీవో ద్వారా రూ. 1,500–1,800 కోట్లను సమీకరించాలని భావిస్తున్నట్లు కంపెనీ ఎండీ థామస్ ముత్తూట్ తెలియజేశారు. దీంతో మైక్రోఫైనాన్స్ పరిశ్రమ(ఎంఎఫ్ఐ)లోనే అతిపెద్ద ఐపీవోగా నిలవనున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా లిస్టింగ్కల్లా రూ.10,000 కోట్ల నిర్వహణలోని ఆస్తుల(ఏయూఎం) కలిగిన తొలి ఎంఎఫ్ఐగా రికార్డ్ సాధించే వీలున్నట్లు తెలియజేశారు. కంపెనీలో ముత్తూట్ ఫిన్కార్ప్, ముత్తూట్ కుటుంబానికి 71 శాతం వాటా ఉన్నట్లు వెల్లడించారు. పీఈ సంస్థ జీపీసీ 16.6 శాతం వాటాను కలిగి ఉన్నట్లు తెలియజేశారు. చదవండి: ఐటీలో ఫేక్ కలకలం.. యాక్సెంచర్ బాటలో మరో కంపెనీ, వేరే దారిలేదు వాళ్లంతా ఇంటికే! -
మార్కెట్లో న్యూఏజ్ టెక్ షేర్ల వెల్లువ.. జాబితాలో పేటీఎం, జొమాటో, నైకా
గత కొద్ది నెలలుగా పబ్లిక్ ఇష్యూలకు వచ్చి స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన పలు కొత్తతరం(న్యూఏజ్) టెక్ కంపెనీల షేర్లు కొద్ది రోజులుగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇందుకు ఐపీవోకు ముందు కంపెనీలో ఇన్వెస్ట్చేసిన సంస్థల షేర్లపై లాకిన్ గడువు తీరనుండటం కారణమవుతోంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఐపీవోకు ముందు కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు లేదా 20 శాతానికి మించిన ప్రమోటర్ల వాటాకు లాకిన్ గడువును ఏడాది నుంచి ఆరు నెలలకు కుదించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నిబంధనలు అమల్లోకి వచ్చాయి. వివరాలు చూద్దాం.. గతేడాది నవంబర్ మొదలు ఈ ఏడాది మే నెలవరకూ పబ్లిక్ ఇష్యూలకు వచ్చిన పలు న్యూఏజ్, ఫిన్టెక్ కంపెనీలు, స్టార్టప్ల షేర్లకు లాకిన్ గడువు ఈ నెలలో ముగియనుంది. 12 నెలల నుంచి 6 నెలల గడువు తీరనుండటమే దీనికి కారణం. నేటి నుంచి క్యాంపస్ యాక్టివ్వేర్ షేర్లు అందుబాటులోకి రానుండగా.. ఎఫ్ఎస్ఎన్ ఈకామర్స్, రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ షేర్లకు రేపు(10న) లాకిన్ గడువు తీరనుంది. ఈ జాబితాలో ఫినో పేమెంట్స్ బ్యాంక్(12న), పీబీ ఫిన్టెక్(15న), పేటీఎమ్, శాఫైర్ ఫుడ్స్(18న), డెల్హివరీ(24న), టార్సన్ ప్రొడక్ట్స్(26న) పారదీప్ ఫాస్ఫేట్స్(27న), గో ఫ్యాషన్ ఇండియా(30న) తదితరాలున్నాయి. దీంతో ఈ షేర్లు స్టాక్ ఎక్సే్ఛంజీలను తాకనున్నాయి. వెరసి పలు కంపెనీల కౌంటర్లలో అందుబాటులోని ఈక్విటీ ఒక్కసారిగా పెరగనుంది. అయితే నైకా, రెయిన్బో చిల్డ్రన్స్, క్యాంపస్ యాక్టివ్వేర్, శాఫైర్ ఫుడ్స్, గోకలర్స్ తదితర కొన్ని కౌంటర్లు ఐపీవో ధరతో పోలిస్తే భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. దీంతో లాభాల స్వీకరణకు అవకాశమున్నట్లు మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఐపీవోకు ముందు ఇన్వెస్ట్చేసిన సంస్థలు ఆయా షేర్లను విక్రయించేందుకు ఆసక్తి చూపేదీ లేనిదీ వేచి చూడవలసి ఉన్నట్లు మరికొందరు అభిప్రాయపడ్డారు. జొమాటో ఎఫెక్ట్ ఈ ఏడాది జులైలో లాకిన్ గడువు ముగిసిన వెంటనే జొమాటో షేర్లు జులైలో 22 శాతం పతనంకావడం గమనార్హం. ప్రీఐపీవో ఇన్వెస్టర్లు ఉబర్, టైగర్ గ్లోబల్ తదితరాలు షేర్లను విక్రయించడం ప్రభావం చూపింది. ఒక అంచనా ప్రకారం 14 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 1,15,000 కోట్లు) విలువైన షేర్లకు లాకిన్ గడువు తీరనుంది. వీటిలో నైకా 31.9 కోట్ల షేర్లు, పాలసీ బజార్ 2.8 కోట్ల షేర్లు అందుబాటులోకి రానున్నట్లు అంచనా. దీంతో పలు కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే పేటీఎమ్ షేరు ఐపీవో ధరతో పోలిస్తే 70 శాతం పతనంకాగా.. గత నెల రోజుల్లోనే డెల్హివరీ 35 శాతం, పీబీ ఫిన్టెక్ 26 శాతం, ఫినో పేమెంట్స్ బ్యాంక్ 21 శాతం చొప్పున డీలా పడ్డాయి. చదవండి: ‘వెనక ఇంత జరిగిందా’.. ఉద్యోగులకు ఊహించని షాకిచ్చిన ప్రముఖ ఐటీ కంపెనీ! -
ఫస్ట్మెరీడియన్ ఐపీవోకు సెబీ ఆమోదం
న్యూఢిల్లీ: మానవ వనరుల కన్సల్టెన్సీ సంస్థ ఫస్ట్మెరీడియన్ బిజినెస్ సర్వీసెస్ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూ (ఐపీవో)కు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదముద్ర లభించింది. దీనికి సంబంధించి అక్టోబర్ 18న అబ్జర్వేషన్ లెటర్ అందినట్లు సంస్థ తెలిపింది. ఈ లెటర్ను పబ్లిక్ ఇష్యూకు గ్రీన్ సిగ్నల్గా పరిగణిస్తారు. ఐపీవో ద్వారా ఫస్ట్మెరీడియన్ రూ. 800 కోట్లు సమీకరించనుంది. ఇందులో రూ. 50 కోట్ల విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుండగా, మిగతా రూ. 750 కోట్ల విలువ చేసే షేర్లను ప్రమోటర్లు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలో విక్రయించనున్నారు. ప్రాస్పెక్టస్ ముసాయిదా ప్రకారం ప్రమోటర్ అయిన మ్యాన్పవర్ సొల్యూషన్స్ లిమిటెడ్ రూ. 665 కోట్ల షేర్లు, ప్రస్తుత వాటాదారులు న్యూ లేన్ ట్రేడింగ్ రూ. 45 కోట్లు, సీడ్త్రీ ట్రేడింగ్ రూ. 40 కోట్ల షేర్లను విక్రయిస్తాయి. కొత్తగా జారీ చేసే షేర్ల ద్వారా వచ్చే నిధులను రుణాలు తీర్చేందుకు, ఇతరత్రా కార్పొరేట్ అవసరాలకు కంపెనీ వినియోగించుకోనుంది. 2018లో ఏర్పడిన ఫస్ట్మెరీడియన్కు అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్, డెల్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ ఇండియా. ఫోన్పే, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ మొదలైనవి క్లయింట్లుగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా 50 శాఖలు ఉండగా, 75 పైగా నగరాల్లో రిక్రూట్మెంట్లు నిర్వహిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 2,110 కోట్ల ఆదాయం నమోదు చేసింది. -
బోట్కు రూ.500 కోట్లు
న్యూఢిల్లీ: బోట్ పేరుతో వేరబుల్స్ విక్రయాల్లో ఉన్న ఇమేజిన్ మార్కెటింగ్ తాజాగా రూ.500 కోట్లు సమీకరించింది. సంస్థలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన వార్బర్గ్ పింకస్ అనుబంధ కంపెనీతోపాటు నూతనంగా మలబార్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ నిధులను సమకూర్చింది. నిధుల రాకతో వ్యక్తిగత ఆడియో ఉత్పత్తుల విభాగంలో కంపెనీ నాయకత్వ స్థానాన్ని సుస్థిరం చేస్తూనే వేగంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్వాచ్ల సెగ్మెంట్లో విస్తరణకు ఆజ్యం పోస్తుందని కంపెనీ తెలిపింది. ఐపీవో ద్వారా రూ.2,000 కోట్లు సమీకరణకై కంపెనీ గతంలో సెబీకి దరఖాస్తు చేసుకుంది. లిస్టింగ్ ప్రణాళికను ప్రస్తుతానికి విరమించుకున్న ఇమేజిన్ మార్కెటింగ్.. 12–18 నెలల్లో ఐపీవో అంశాన్ని పునర్పరిశీలించనుంది. విదేశాల్లోనూ బోట్ ఉత్పత్తులను విక్రయించాలని కంపెనీ భావిస్తోంది. చదవండి: ఐటీలో అసలేం జరుగుతోంది! ఉద్యోగుల తొలగింపు, ఆఫర్ లెటర్స్ లేవు.. అన్నింటికీ అదే కారణమా -
డీసీఎక్స్ సిస్టమ్స్ ఐపీవో @ రూ. 500 కోట్లు
న్యూఢిల్లీ: కేబుళ్లు, వైర్ హార్నెస్ అసెంబ్లీల తయారీ సంస్థ డీసీఎక్స్ సిస్టమ్స్ తాజాగా పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) ద్వారా రూ. 500 కోట్లు సమీకరించనుంది. ఇందుకోసం షేరు ధర శ్రేణిని రూ. 197–207గా నిర్ణయించింది. ఐపీవో అక్టోబర్ 31న ప్రారంభమై నవంబర్ 2న ముగుస్తుంది. ఐపీవో కింద కొత్తగా జారీ చేసే ఈక్విటీ షేర్ల పరిమాణాన్ని రూ. 500 కోట్ల నుంచి రూ. 400 కోట్లకు సంస్థ తగ్గించింది. ప్రమోటర్లు (ఎన్సీబీజీ హోల్డింగ్స్, వీఎన్జీ టెక్నాలజీ) ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో రూ. 100 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనున్నారు. ఇన్వెస్టర్లు కనీసం 72 షేర్లకు బిడ్ చేయాల్సి ఉంటుంది. ఇష్యూలో 75 శాతాన్ని క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు (క్యూఐఐ), 15 శాతాన్ని సంస్థాగతయేతర ఇన్వెస్టర్లకు, 10 శాతాన్ని రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ. 1,102 కోట్లుగా నమోదైంది. ఆర్డరు బుక్ 2020 మార్చి నాటికి రూ. 1,941 కోట్లుగా ఉండగా 2022 మార్చి నాటికి రూ. 2,369 కోట్లకు పెరిగింది. -
నాలుగు ఐపీవోలకు సెబీ ఓకే..
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా మూడు కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. జాబితాలో బిబా ఫ్యాషన్స్, కీస్టోన్ రియల్టర్స్, ప్లాజా వైర్స్, హేమానీ ఇండస్ట్రీస్ చేరాయి. సంప్రదాయ దుస్తుల ఫ్యాషన్ లేబుల్ బిబా ఫ్యాషన్ ఏప్రిల్లో సెబీకి దరఖాస్తు చేసింది. వార్బర్గ్ పింకస్, ఫేరింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసిన కంపెనీ ఐపీవోలో భాగంగా రూ. 90 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 2.77 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. జూన్లో దరఖాస్తు చేసిన రుస్తోంజీ గ్రూప్ కంపెనీ కీస్టోన్ రియల్టర్స్ ఐపీవో ద్వారా రూ. 850 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. దీనిలో రూ. 700 కోట్లమేర ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. ఇక రూ. 2,000 కోట్ల సమీకరణకు వీలుగా ఆగ్రోకెమికల్ తయారీ కంపెనీ హేమానీ ఇండస్ట్రీస్ మార్చిలో సెబీకి ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా రూ. 1,500 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. వైర్లు, అల్యూమినియం కేబుళ్ల కంపెనీ ప్లాజా వైర్స్ మే నెలలో దరఖాస్తు చేసింది. పబ్లిక్ ఇష్యూలో భాగంగా 1,64,52,000 ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఐపీవో అదిరింది
న్యూఢిల్లీ: కన్జూమర్ వస్తు రిటైల్ చైన్ ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా పబ్లిక్ ఇష్యూ సూపర్ సక్సెస్ సాధించింది. ఇష్యూ చివరి రోజు శుక్రవారానికల్లా 72 రెట్లు అధికంగా స్పందన లభించింది. షేరుకి రూ. 56–59 ధరలో చేపట్టిన ఇష్యూలో భాగంగా 6.25 కోట్ల షేర్లను కంపెనీ విక్రయానికి ఉంచింది. అయితే ఏకంగా 449.53 కోట్ల షేర్లకు బిడ్స్ దాఖలయ్యాయి. బజాజ్ ఎలక్ట్రానిక్స్ బ్రాండుతో కంపెనీ రిటైల్ స్టోర్లను నిర్వహిస్తోంది. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 169.54 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 63.59 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. రిటైల్ ఇన్వెస్టర్లు సైతం 19.7 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. -
ఐపీవోకు వెళ్లేముందు ఓయోకు భారీ షాక్
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో ఉన్న ఆతిథ్య రంగ కంపెనీ ఓయో విలువ 8 బిలియన్ డాలర్ల నుంచి 6.5 బిలియన్ డాలర్లకు క్షీణించినట్లు తెలుస్తోంది. ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం సాఫ్ట్బ్యాంక్ పెట్టుబడి విలువలో 20 శాతంమేర కోత పెట్టినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెరసి ఓయోలో పెట్టుబడుల విలువను 2.7 బిలియన్ డాలర్లుగా మదింపు చేసినట్లు తెలియజేశాయి. గతేడాది ప్రయివేట్ మార్కెట్లలో 8 బిలియన్ డాలర్ల స్థాయిలో లావాదేవీలు జరగ్గా.. ఇటీవల 6.5 బిలియన్ డాలర్ల విలువలో నమోదౌతున్నట్లు వివరించాయి. ఈ ప్రభావంతో సెప్టెంబర్ 30తో ముగిసిన వారంలో 12.3 లక్షల ఓయో షేర్లు విక్రయమైనట్లు తెలుస్తోంది. అంతక్రితం వారం 1.6 లక్షల షేర్లు మాత్రమే చేతులు మారాయి. కాగా.. నష్టాలను తగ్గించుకుంటూ నిర్వహణా లాభాలు ఆర్జించినట్లు ఫైనాన్షియల్స్పై గత నెలలో ఓయో ప్రాస్పెక్టస్ను ఆప్డేట్ చేసింది. దీంతో షేరు ప్రయివేట్ మార్కెట్లో రూ. 94ను తాకింది. తాజాగా ఈ విలువ రూ. 81కు క్షీణించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఓయో రూ. 8,430 కోట్ల సమీకరణకు వీలుగా గతేడాది అక్టోబర్లో సెబీకి ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. తదుపరి 2022 జూన్తో ముగిసిన త్రైమాసికంలో రూ. 1,459 కోట్ల ఆదాయాన్ని, సర్దుబాటు తదుపరి రూ. 7.3 కోట్ల ఇబిటాను ఆర్జించినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
బజాజ్ ఎలక్ట్రానిక్స్@రూ. 56–59
న్యూఢిల్లీ: రిటైల్ చైన్ ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. అక్టోబర్ 4న ప్రారంభమయ్యే ఇష్యూకి రూ. 56–59 ధరల శ్రేణిని ప్రకటించింది. 7న ముగియనున్న ఐపీవోలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. బజాజ్ ఎలక్ట్రానిక్స్ బ్రాండుతో కంపెనీ వినియోగ వస్తువుల విక్రయ స్టోర్లను నిర్వహిస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 254 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. పవన్ కుమార్ బజాజ్, కరణ్ బజాజ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కంపెనీకి 36 పట్టణాలలో 112 మల్టీబ్రాండ్ ఔట్లెట్స్ ఉన్నాయి. చదవండి: మామూలు లక్ కాదండోయ్, సంవత్సరంలో రూ.లక్ష పెట్టుబడితో రూ.20 లక్షలు!