
స్నాప్డీల్ బోర్డ్లో కబీర్ మిశ్రా
బెంగళూరు: ఈ కామర్స్ మార్కెట్ ప్లేస్, స్నాప్డీల్ కంపెనీ డైరెక్టర్గా కబీర్ మిశ్రాను సాఫ్ట్బ్యాంక్ నియమించింది. రెండేళ్లలో స్నాప్డీల్ను లాభాల్లోకి తేవడం లక్ష్యంగా ఆ సంస్థలో భారీగా పెట్టుబడులు పెట్టిన సాఫ్ట్బ్యాంక్ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ నియామకం జరిగిందని సంబంధిత వర్గాలంటున్నాయి. ఆన్లైన్ వ్యాపార వ్యవహారాల్లో కబీర్ మిశ్రాకు అపారమైన అనుభవం ఉంది.