Snapdeal
-
నేపాల్ విమానానికి రంద్రాలు..టిష్యూతో కవర్ చేసిన ఎయిర్హోస్ట్
నేపాల్లోని పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఖాట్మాండు నుంచి కాస్కీ జిల్లాలోని పొఖారాకు బయలుదేరిన యతి ఎయిర్లైన్స్కు చెందిన ఏటీఆర్ 72 విమానం కుప్పకూలింది. ఆ సమయంలో విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. వారిలో 70 మంది ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. సోమవారం నాటికి ఈ సంఘటనలో అయిదుగురు భారతీయులతో సహా 68 మంది మృత్యువాతపడ్డారు. This is really really sad. Few yrs ago on my flight to Pokhara, when I told the stewardess that airflow was coming from the corner of a window while airborne, she brought a tissue paper & stuffed the crevice. Decided to never fly to Pokhara again expecting the worst one day 😔 https://t.co/Mf8kBHqIWV — Kunal Bahl (@1kunalbahl) January 15, 2023 ఇక ఈ విమాన ప్రమాదంపై స్నాప్ డీల్ కో-ఫౌండర్ కునాల్ బహ్ల్ విచారం వ్యక్తం చేశారు. నేపాల్ విమాన ప్రమాద వార్తని ట్వీట్ చేశారు. గతంలో బిజినెస్ పనిమీద పొఖారాకు వెళ్లిన బహ్ల్కు విమానంలో ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ‘ఇది నిజంగా విచారకరం. కొన్ని సంవత్సరాల క్రితం నేను పోఖారాకు వెళ్లాను. నేను ప్రయాణిస్తున్న విమానం కిటికీలకు ఏర్పడిన పగుళ్ల కారణంగా ఆకాశ మార్గంలో ఉండగా.. బయట నుంచి గాలి విమాన కిటికీల పగుళ్ల గుండా లోపలికి వస్తుంది. ఇదే విషయాన్ని గుర్తించిన నేను వెంటనే పక్కనే ఉన్న ఎయిర్ హోస్ట్కి సమాచారం అందించా. ఆమె ఓ టిష్యూ పేపర్ను అడ్డం పెట్టి గాలి లోపలికి రాకుండా ప్రయత్నించింది. నా దృష్టిలో అదే అంత్యత వరస్ట్ డే. నాటి నుంచి మళ్లీ పోఖారాకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను’ అని ట్వీట్లో తెలిపారు. -
ఈ కామర్స్ దిగ్గజాలకు మరోసారి బిగ్ షాక్, కేంద్రం నోటీసులు
సాక్షి,ముంబై: ఈ కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ సంస్థలకు భారీ షాక్ తగిలింది. నాణ్యతా ప్రమాణాలు విస్మరించి, బొమ్మల విక్రయాలపై రెగ్యులేటరీ కొరడా ఝళిపించింది. బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ) క్వాలిటీ మార్క్ లేని బొమ్మలను విక్రయించి నందుకు వినియోగదారుల రక్షణ నియంత్రణ సంస్థ అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్లకు నోటీసులు జారీ చేసింది. నాణ్యతా ప్రమాణాలు పాటించని బొమ్మలను అక్రమంగా విక్రయిస్తున్న మూడు ఇ-కామర్స్ సంస్థలకు ఈ మేరకు నోటీసులిచ్చామని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) చీఫ్ నిధి ఖరే ఒక ప్రకటన జారీ చేశారు. బీఐఎస్ ప్రమాణానికి అనుగుణంగా లేని బొమ్మల విక్రయాలపై ఫిర్యాదులు నేపథ్యంలో దేశంలో పలు దుకాణాల్లో దాడులు నిర్వహించామని బీఐఎస్ డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ తెలిపారు. 44 చోట్ల గత నెలలో నిర్వహించిన దాడుల్లో ప్రధాన రిటైల్ దుకాణాల నుండి 18,600 బొమ్మలను స్వాధీనం చేసు కున్నామని వెల్లడించారు. ముఖ్యంగా దేశంలోని ప్రధాన విమానాశ్రయాలు, మాల్స్లో ఉన్న హామ్లీస్, ఆర్చీస్, డబ్ల్యూహెచ్ స్మిత్, కిడ్స్ జోన్ , కోకోకార్ట్తో సహా రిటైల్ దుకాణాలపై దాడులు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. బీఐఎస్ చట్టంలోని నిబంధనల ప్రకారం సంబంధిత వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తివారీ తెలిపారు. కాగా 2021, జనవరి నుంచి బీఐఎస్ నిర్దేశించిన భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని టాయ్మేకర్స్ కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది. నాసిరకం వస్తువులు విక్రయించినందుకుగానూ గతంలో ఈకామర్స్ సంస్థలకు సీసీపీఏ నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. -
వ్యాపార విస్తరణలో స్నాప్డీల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ–కామర్స్ సంస్థ స్నాప్డీల్ తమ కార్యకలాపాల విస్తరణపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా వినియోగదారుల సంఖ్యను పెంచుకోవడం, టెక్నాలజీపరంగా మరిన్ని ఆవిష్కరణలు చేయడం, లాజిస్టింక్స్ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడానికి ప్రాధాన్యమిస్తోంది. దీనికోసం ఐపీవో ద్వారా రూ. 1,250 కోట్లు సమీకరించనున్నట్లు సంస్థ తెలిపింది. కొత్తగా ఈక్విటీల జారీ, ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో పబ్లిక్ ఇష్యూ ఉంటుందని పేర్కొంది. సాఫ్ట్బ్యాంక్, బ్లాక్రాక్, టెమాసెక్, ఈబే తదితర సంస్థలు స్నాప్డీల్లో ఇన్వెస్ట్ చేశాయి. మొత్తం 71 షేర్హోల్డర్లలో 8 మంది మాత్రమే స్వల్ప వాటాలను విక్రయించనున్నట్లు సంస్థ వివరించింది. సంయుక్తంగా 20.28 శాతం వాటా ఉన్న కంపెనీ వ్యవస్థాపకులు కునాల్ బెహల్, రోహిత్ కుమార్ బన్సల్ తమ వాటాలను ఐపీవోలో విక్రయించడం లేదని స్నాప్డీల్ తెలిపింది. -
ఐపీవో బాటలో స్నాప్డీల్
న్యూఢిల్లీ: ఈకామర్స్ ప్లాట్ఫామ్ స్నాప్డీల్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఇటీవల ఇంటర్నెట్ ఆధారిత బిజినెస్లు నిర్వహించే పలు కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో స్నాప్డీల్ నిధుల సమీకరణకు ప్రాధాన్యత ఏర్పడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 1,250 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్చేసిన సంస్థలు మరో 3.07 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనున్నాయి. లిస్టింగ్ ద్వారా కంపెనీ విలువ 1.5–1.7 బిలియన్ డాలర్ల(రూ. 12,750 కోట్లు)కు చేరవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తాజా ఈక్విటీ జారీ నిధులను ఇతర కంపెనీల కొనుగోళ్లు, లాజిస్టిక్స్ విస్తరణ, సాంకేతిక మౌలిక సదుపాయాలను మెరుగుపరచుకోవడం తదితరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్లో స్నాప్డీల్ పేర్కొంది. ఇటీవల ఇంటర్నెట్ ఆధారిత దిగ్గజాలు జొమాటో, నైకా, పాలసీబజార్, పేటీఎమ్ పబ్లిక్ ఇష్యూల ద్వారా నిధులను సమీకరించి స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్ను పొందిన విషయం విదితమే . మ్యాప్మైఇండియా లాభాల లిస్టింగ్ ఢిల్లీ: డిజిటల్ మ్యాపింగ్ కంపెనీ మ్యాప్మైఇండియా షేరు తొలిరోజు ఇన్వెస్టర్లకు లాభాలను పంచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర 1,033తో పోలిస్తే 53 శాతం ప్రీమియంతో రూ.1,581 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో రూ.1,587 వద్ద గరిష్టాన్ని.., రూ.1,395 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. చివరి గంట లాభాల స్వీకరణతో 35% లాభంతో రూ.1,394 వద్ద నిలిచింది. మార్కెట్ ముగిసే సరికి కంపెనీ విలువ రూ.7,425 కోట్లుగా నమోదైంది. -
కోవిడ్ బాధితుల కోసం స్నాప్డీల్ సంజీవని
ఈ-కామర్స్ కంపెనీ స్నాప్డీల్ తాజాగా సంజీవని పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీని ద్వారా కోవిడ్-19 రోగులను ప్లాస్మా దాతలతో అనుసంధానిస్తారు. రోగులు, దాతలు తమ పేర్లను మొబైల్ నంబరు, ఈ-మెయిల్ ఆధారంగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. బ్లడ్ గ్రూప్, ప్రాంతం, కోవిడ్-19 ఎప్పుడు సోకింది, ఎప్పుడు నెగెటివ్ వచ్చింది వంటి వివరాలను పొందుపర్చాలి. ఈ వివరాల ఆధారంగా స్నాప్డీల్ సర్చ్ ఇంజన్ రోగులను, దాతలను కలుపుతుంది. ప్లాస్మా దానంపై అవగాహన పెంచేందుకు సంజీవని నడుం బిగించింది. మహ మ్మారి విస్తృతి నేపథ్యంలో ఫేస్బుక్, గూగుల్, పేటీఎం వంటి సంస్థలు సైతం తమ వంతుగా సాయపడేందుకు డిజిటల్ వేదికగా టూల్స్ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: కరోనా పేషెంట్స్ కోసం గూగుల్ మ్యాప్స్ లో సరికొత్త ఫీచర్ -
కరోనా సంక్షోభం: స్నాప్డీల్ డెలివరీ హామీ
సాక్షి, ముంబై: కోవిడ్ -19 లాక్ డౌన్ కారణంగా ఇ-కామర్స్ మార్కెట్లు అవసరమైన వస్తువులను పంపిణీ చేయడానికి చాలా కష్టపడుతున్నాయి. ప్రారంభ రోజుల్లో నిత్యావసరాల సరఫరాపై స్పష్టత లేకపోవడంతో, ఎక్కువ మంది గిడ్డంగులను మూసివేయవలసి వచ్చింది. అలాగే డెలివరీల సమయంలో ఉద్యోగులకు కూడా పెద్ద కొరత ఏర్పడింది. చాలా ఆర్డర్లను నిరాకరించాయి. వస్తువులను రవాణా చేయలేకపోయిన ఫలితంగా చాలా ఇ-కామర్స్ కంపెనీ గిడ్డంగుల్లో నిల్వలు పేరుకు పోయాయి. అయితే తాజాగా ఇ-కామర్స్ మార్కెట్, స్నాప్డీల్ 6-10 రోజులలోపు అవసరమైనవాటిని పంపిణీ చేస్తామని వినియోగదారులకు హామీ ఇస్తోంది. లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి, అత్యవసరాలను స్థానికంగా (నగరంలో మాత్రమే) పంపిణీ చేయడం ప్రారంభించినట్లు స్నాప్డీల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (కార్పొరేట్ వ్యవహారాలు కమ్యూనికేషన్స్) రజనీష్ వాహి చెప్పారు. ప్రారంభంలో మూసివేయాల్సి వచ్చిందని, కాని వేగంగా తిరిగి సేవల్లోకి ప్రవేశించామన్నారు. అయితే వివిధ నగరాల మధ్య పంపిణీ కాకుండా, ఇంట్రా-సిటీ మాత్రమే తమ సేవల అందిస్తున్నామని అందుకే వేగంగా బట్వాడా చేయగలుగుతున్నామని ఆయన చెప్పారు. గత 10 రోజులలో స్నాప్డీల్ స్థానిక ధాన్యం మార్కెట్లలోని డీలర్లతో, ఎఫ్ఎంసిజి హోల్సేల్ వ్యాపారులతో (వారిలో చాలా మందికి స్టాక్ ఉంది, కాని వాటిని మూసివేయవలసి వచ్చింది) ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. అలాగే ప్రస్తుత పరిస్థితులలో వైద్య పరికరాలు కూడా చాలా అవసరం కాబట్టి సంబంధిత డీలర్లతో కూడా ఒప్పందం చేసుకున్నామన్నారు. నిత్యావసరాల సేకరణపై మాత్రమే దృష్టి పెట్టామని తమ వ్యాపార బృందాన్ని కోరామని వాహి వివరించారు. కేవలం పది రోజుల్లో తమ సామర్థ్యాన్ని పెంచుకున్నామని, సాధారణ పరిస్థితులలో ఇందుకు ఐదు-ఆరు నెలలు పట్టేదని ఆయన చెప్పారు. అలాగే ఈ సంక్షోభ సమయం దేశవ్యాప్తంగా అనేక చిన్న అమ్మకందారులు, చిన్న చిన్న గిడ్డంగులున్న దుకాణాదారులు ప్రయోజనాలకు ఉపయోగపడిందని ఆయన చెప్పారు. మరో ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ కరోనా వైరస్ ను అడ్డుకునే క్రమంలో అమలవుతున్న లాక్ డౌన్ ఇంటికే పరిమితమైన తమ వినియోగదారులకు ఇ-కామర్స్ సేవలు అందించే క్రమంలో మరో అడుగు ముందు కేశామని. అన్ని వనరులను సమీకిస్తూ అవసరమైన అత్యవసర సామాగ్రిని పంపిణీ చేయడానికి, డెలివరీ సామర్థ్యాన్ని పెంచుకోడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని సీనియర్ ఫ్లిప్కార్ట్ ప్రతినిధి వెల్లడించడం గమనార్హం. చదవండి : కరోనా కాటు : 36 వేల మంది ఉద్యోగులు సస్పెన్షన్ -
వాచ్.. తూచ్..
సాక్షి, సిటీబ్యూరో: ఈ కామర్స్ యాప్ స్నాప్డీల్లో వాచీ కొన్నాడు...కొన్నాళ్ళకే లక్కీ డ్రాలో కారు గెల్చుకున్నారంటూ సందేశం రావడంతో పొంగిపోయాడు... సైబర్ నేరగాళ్ళ మాటల వల్లోపడి రూ.50 వేలు పోగొట్టుకున్నాడు... చివరకు మోసపోయానని గుర్తించి బుధవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. బేగంబజార్ ప్రాంతానికి చెందిన ఓ కార్పెంటర్ ఇటీవల స్నాప్డీల్ నుంచి వాచీ ఖరీదు చేశారు. ఇది కొరియర్లో అతడికి చేరిన కొన్ని రోజుల తర్వాత స్నాప్డీల్ నుంచి అంటూ ఓ సంక్షిప్త సందేశం వచ్చింది. అందులో తమ సంస్థ నిర్వహించిన లక్కీడ్రాలో కారు గెల్చుకున్నారని, ఇతర వివరాలు తమ ప్రతినిధి అందిస్తారని ఉంది. ఇది జరిగిన మరుసటి రోజు స్నాప్డీల్ సంస్థ నుంచి అంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. లక్కీడ్రాలో రూ.12.6 లక్షల విలువైన హైఎండ్ కారు గెల్చుకున్నందుకు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ కారును సొంతం చేసుకోవడానికి సదరు కార్పెంటర్ సంసిద్ధత వ్యక్తం చేయడంతో సైబర్ నేరగాళ్ళు అసలు కథ ప్రారంభించారు. కారును డెలివరీ పొందడానికి కొన్ని చార్జీలు, పన్నులు చెల్లించాలని ఎర వేశారు. అలా రకరాలైన పేర్లతో రూ.8,500 నుంచి ప్రారంభించి విడదల వారీగా రూ.50,700 తమ ఖాతాల్లోకి డిపాజిట్ చేయించుకున్నారు. సైబర్ నేరగాళ్ళు మరికొంత మొత్తం చెల్లించాలని అడుగుతుండటంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు బుధవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ జి.వెంకటరామిరెడ్డి దర్యాప్తు ప్రారంభించారు. మూడు చోట్ల నుంచి లీక్కు అవకాశం ఈ తరహా మోసాల్లో ఓ వ్యక్తిని సైబర్ నేరగాళ్ళు టార్గెట్ చేయడానికి ఆయా ఈ–కామర్స్ సంస్థల డేటానే ఆధారం. ఈ కేసును తీసుకుంటే బేగంబజార్కు చెందిన బాధితుడు స్నాప్డీల్ నుంచి వాచీ ఖరీదు చేశాడనే విషయం ఆ సంస్థతో పాటు మరో రెండు సంస్థలకు తెలిసే అవకాశం ఉంది. ఈ తరహాకు చెందిన ఈ–కామర్స్ సైట్స్/యాప్స్ తమకు వచ్చిన ఆర్డర్స్ను థర్డ్ పార్టీ సంస్థలకు పంపిస్తాయి. ఆయా వస్తువుల్ని తయారు చేసే, సరఫరా చేసే సంస్థలే థర్డ్పార్టీలుగా ఉంటాయి. వీళ్ళు వినియోగదారుడు ఆర్డర్ చేసిన వస్తువుల్ని అతడి చిరునామాకు కొరియర్ ద్వారా పంపిస్తారు. కస్టమర్ చెల్లించిన సొమ్ముకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు స్నాప్డీల్కు ఈ థర్డ్ పార్టీ సంస్థకు మధ్య జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి ఫలానా సైట్/యాప్ నుంచి ఫలానా వస్తువు ఖరీదు చేశాడనే సమాచారం ఆ సంస్థతో పాటు, థర్డ్ పార్టీ సంస్థకు, కోరియర్ సంస్థకు తెలిసే ఆస్కారం ఉంది. ఈ మూడు చోట్ల పని చేసే ఉద్యోగుల్లో ఎవరైనా ఈ డేటా లీక్ చేస్తున్నారని అనుమానిస్తున్నాం. దీనికి సంబంధించి లోతైన దర్యాప్తు చేయాల్సి ఉంది. లక్కీ డ్రాల పేరుతో వచ్చే సందేశాలు, ఫోన్కాల్స్ను నమ్మవద్దు.– జి.వెంకట రామిరెడ్డి, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ -
నకిలీ సెగ : బుక్కైన స్నాప్డీల్ ఫౌండర్స్
కోటా : ఆన్లైన్ షాపింగ్ సైట్ స్నాప్డీల్ చిక్కుల్లో పడింది. నకిలీ ఉత్పత్తులను విక్రయిస్తోందన్నఆరోపణల నేపథ్యంలో కంపెనీ ఫౌండర్స్ అడ్డంగా బుక్కయ్యారు. రాజస్థాన్కు చెందిన వ్యాపారవేత్త ఇందర్మోహన్ సింగ్ హనీ ఫిర్యాదు మేరకు స్నాప్డీల్ సీఈవో కునాల్ బాల్, సీవోవో రోహిత్ బన్సల్ చీటింగ్ కేసు నమోదైంది. వ్యాపారవేత్త ఇంద్రమోహన్ సింగ్ హనీ జూలై 17న ఉడ్ ల్యాండ్ బెల్ట్, వాలెట్ లను స్నాప్డీల్లో ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేశాడు. ఈ బ్రాండెడ్ వస్తువులకు బదులుగా, నకిలీ వస్తువులు చేరడంతో, వాటిని ఉడ్ల్యాండ్ షోరూంకి వెళ్లి ఎంక్వయిరీ చేశాడు. అవి నకిలీవని ఉడ్ల్యాండ్ సిబ్బంది కూడా ధృవీకరించారు. దీంతో స్థానిక గుమన్పురా స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇంతకుముందు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందని ఆయన ఆరోపిస్తున్నారు. చేతి గడియారాన్ని ఆర్డర్ చేశా...డెలివరీ చేశామని కంపెనీ నుంచి మెసేజ్ వచ్చింది కానీ వాచ్ ఇంటికి చేరలేదని తెలిపారు. అయితే కంపెనీకి ఫిర్యాదు చేయడంతో తన డబ్బులను రిఫండ్ చేసిందంటూ గుర్తు చేసుకున్నారు. మరోవైపు ఇంద్రమోహన్ ఫిర్యాదు ఆదారంగా సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారి మనోజ్ సింగ్ సికార్వాల్ తెలిపారు. చదవండి : స్నాప్డీల్లో ఆ విక్రయాలపై నిషేధం -
స్నాప్డీల్లో ఆ విక్రయాలపై నిషేధం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ స్నాప్డీల్కు జపాన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం భారీ షాక్ ఇచ్చింది. తన బ్రాండ్ పేరుతో నకిలీ ఉత్పత్తులను విక్రయిస్తోందని ఆరోపిస్తూ స్నాప్డీల్పై కేసు నమోదు చేసింది. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీదారు కాసియో ఈ మేరకు ఢిల్లీలోని తీస్ హజారీ జిల్లా కోర్టులో కేసు వేసింది. దీంతో ఆ వస్తువుల ప్రకటనలు, ప్రదర్శన, అమ్మకాలను నిలిపివేయాలంటూ మధ్యంతర ఎక్స్-పార్ట్ నిషేధ ఉత్తర్వులను కోర్టు జారీ చేసింది. కాసియో బ్రాండ్ వాచెస్, కాలిక్యులేటర్ల నకిలీ అమ్మకాలకు సంబంధించి వినియోగదారుల ఫిర్యాదులు వెల్లువెత్తడంతో స్నాప్డీల్ చట్టపరమైన చర్యలను ప్రారంభించినట్లు కంపెనీ లీగల్ డిపార్ట్మెంట్ జనరల్ మేనేజర్ సతోషి యమజాకి వెల్లడించారు. అయితే కోర్టు ఆదేశాలను సమీక్షించి, మార్పులు చేయాల్సిందిగా కోరతామని స్నాప్డీల్ తెలిపింది. ప్లాట్ఫాంలు, విక్రేతల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం ముఖ్యమని వ్యాఖ్యానించింది. కొద్దిమంది చర్యల వల్ల నిజమైన అమ్మకందారులపై ప్రతికూల ప్రభావితం చూపుతోందని స్నాప్డీల్ ప్రతినిధి చెప్పారు. ఈ క్రమంలో నిజమైన ఉత్పత్తులను మాత్రమే విక్రయించేలా సెల్లర్స్ జాగ్రత్త వహించాలన్నారు. లేనిపక్షంలో ఆయా సంస్థలు తమ మార్కెట్ను కోల్పోవడంతోపాటు, కాంట్రాక్టు నిబంధనల ప్రకారం భవిష్యత్తులో ప్లాట్ఫామ్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తామని హెచ్చరించారు. అలాగే బ్రాండ్లు తమ మేధో సంపత్తి హక్కుల ఉల్లంఘనను నివేదించడానికి వీలుగా, ఆన్లైన్లో నకిలీ ఉత్పత్తుల నిరోధక కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నట్టు కంపెనీ తెలిపింది. -
స్నాప్డీల్ సమ్మర్ మెగా డీల్స్
స్నాప్డీల్ మెగా డీల్స్ పేరుతో డిస్కౌంట్ ఆఫర్లను ప్రకించింది.. మే 17నుంచి 19వ తేదీవరకు పరిమితి కాలానికి డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. వివిధ కేటగిరీల ప్రొడక్ట్స్పై దాదాపు 80శాతం తగ్గింపును అందిస్తోంది. ఆర్బీఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల కొనుగోళ్లపై అదనంగా 15శాతం డిస్కౌంట్. డీల్350 కూపన్ల ద్వారా రూ.350 దాకా ఆదా చేసుకునే అవకాశం. సరసమైన ధరల్లో అందుబాటుల్లో ఉన్న ఫీచర్ ఫోన్లను మరింత తక్కువ ధరకే కొనుగోలు దారులకు అందుబాటులో ఉంచింది. నోకియా 8110 బనానా ఫోన్, ఐవూమి ఐ2 లైట్, కూల్ప్యాడ్ మెగా 5 సిరీస్లపై డిస్కౌంట్ అందిస్తోంది. వీటితో పాటు కోల్డ్ కాఫీ మేకర్స్, షర్బత్ మేకర్స్, ట్రావెల్ బాగ్స్, ఎయిర్ కూలర్లు, కూలర్ ప్యాడ్లపై స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఇంకా వివిధ సాంప్రదాయ వస్తువులు, డోలక్, తాళాలు లాంటి సంగీత సాధనాలు కూడా ఈ తగ్గింపు ధరల్లో లభిస్తాయి. మరిన్నివివరాలు స్నాప్డీల్ వెబ్సైట్ లో లభ్యం. -
ఎన్నికల జాతరలో అమ్మకాల జోరు
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రచారం కోసం అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుంటున్నాయి. సంప్రదాయ జెండాలు, ప్లెక్సీలతో పాటు బెలూన్లు, బటన్లు, టీషర్టులు, కప్పులు, కీ–చైన్లపై తమ గుర్తులను ప్రచారం చేస్తూ ప్రజల్లోకి దూసుకుపోతున్నాయి. వీటిపై ఆయా పార్టీల మద్దతుదారులు, యువత ఆసక్తి చూపుతుండటంతో ఆఫ్లైన్తో పాటు అమెజాన్, స్నాప్డీల్ వంటి ఆన్లైన్ సంస్థల్లోనూ జోరుగా అమ్మకాలు సాగుతున్నాయి. మై భీ హూ చౌకీదార్(నేనూ కాపలాదారునే) అనే బీజేపీ నినాదమున్న టీ–షర్టులు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. మోదీ, ప్రియాంకా గాంధీ చీరలకు డిమాండ్ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రత్యేక టోపీలను తీసుకొచ్చింది. వీటికే భారీ డిమాండ్.. కాంగ్రెస్, బీజేపీ సహా వేర్వేరు రాజకీయ పార్టీల గుర్తులు, నినాదాలతో వస్తున్న టీ–షర్టులు, కప్పులు, కీచైన్లకు ఆన్లైన్లో మంచి గిరాకీ ఉందని ఆన్లైన్ రిటైల్ సంస్థ స్నాప్డీల్ అధికార ప్రతినిధి తెలిపారు. ‘అభ్యర్థులు, పార్టీల చిత్రాలు ఉన్న కాఫీ మగ్గులు, పవర్ బ్యాంకులు, యూఎస్బీ డ్రైవ్స్, టీ షర్టులు, చీరలను కొనేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్లలో కారు, బైక్ స్టిక్కర్లు, టీషర్టులు, టోపీలు, నీటి బాటిళ్లు, కీచైన్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి’ అని అన్నారు. మోదీ, రాహుల్, ప్రియాంక వంటి కీలక నేతల ముఖచిత్రాలతో ఉన్న ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని పేరొన్నారు. సదర్ బజార్లో దీటుగా అమ్మకాలు.. ఆన్లైన్ అమ్మకాలకు పోటీగా ఢిల్లీలోని సదర్ బజార్లో ఎన్నికల ఉత్పత్తుల అమ్మకాలు సాగుతున్నాయి. ఇక్కడి షాపుల్లో కాంగ్రెస్, బీజేపీ, ఆప్, సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ)లకు చెందిన జెండాలు, బ్యాండ్లు, పార్టీ ముఖ్యనేతల చిత్రాలకు మంచి డిమాండ్ ఉంది. విక్రమ్ ఎంటర్ప్రైజెస్ సంస్థ యజమాని హర్ప్రీత్ సింగ్ స్పందిస్తూ.. ప్రచార సామగ్రి అమ్మకాల్లో బీజేపీ అన్నిపార్టీల కంటే ముందంజలో ఉందని అభిప్రాయపడ్డారు. ప్రముఖ ఆన్లైన్ రిటైల్ సంస్థ అమెజాన్ వెబ్సైట్లో మోదీ చీరలు రూ.700 నుంచి రూ.3,549 మధ్యలో దర్శనమిస్తున్నాయి. మరోవైపు బీజేపీ ప్రచార సామగ్రిని అమ్మేందుకు ‘నమో రథాల’ను సిద్ధం చేశామనీ, ఈసీ నుంచి అనుమతి లభించిన వెంటనే వీటిని రంగంలోకి దించుతామని బీజేపీ నేత మనోజ్ తెలిపారు. -
ఈ కామర్స్ సంస్థలకు గడువు పొడిగింపు లేదు
న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) విషయంలో ఈ కామర్స్ సంస్థలకు సవరించిన నిబంధనల అమలుకు ఫిబ్రవరి 1గా ఇచ్చిన గడువును పొడిగించేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గడువును కనీసం మూడు నెలల వరకైనా పొడిగించాలని ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు ఇప్పటికే కేంద్రాన్ని కోరాయి. ‘‘ఈ కామర్స్ రంగానికి సంబంధించి ఎఫ్డీఐల పాలసీ నిబంధనల అమలుకు ఇచ్చిన గడువు పొడిగించాలంటూ అభ్యర్థనలు వచ్చాయి. వీటిని పరిశీలించిన తర్వాత గడువును పొగించకూడదని నిర్ణయించాం’’ అని పారిశ్రామిక ప్రోత్సాహక మండలి (డీపీఐటీ) పేర్కొంది. కొత్త నిబంధనల కార్యాచరణను పూర్తిగా అర్థం చేసుకునేందుకు గాను గడువు పొడిగించాలని ఫ్లిప్కార్ట్, అమెజాన్ కేంద్రాన్ని కోరాయి. జూన్ 1వరకు పొడిగింపు ఇవ్వాలని అమెజాన్ కోరగా, ఆరు నెలల సమయాన్ని ఫ్లిప్కార్ట్ కోరింది. ఇందుకోసం తమ వంతు ప్రయత్నాలు చేశాయి. నూతన నిబంధనలకు అనుగుణంగా తమ వ్యాపార నమూనాను మార్చుకోవాల్సి ఉంటుందని అధికారులకు వివరించాయి. భారత్లో బిలియన్ డాలర్ల పెట్టుబడులకు తాము నిర్ణయించుకున్నామని, ఈ పెట్టుబడులకు రిస్క్ ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. కానీ, దేశీయ వర్తకుల సమాఖ్య సీఏఐటీ మాత్రం గడువు పొడిగించొద్దని డిమాండ్ చేసింది. అమెరికా కంపెనీల ఒత్తిడికి తలగొద్దని దేశీయ ఈ కామర్స్ సంస్థలు స్నాప్డీల్, షాప్క్లూస్ సైతం కోరాయి. కాగా, ఫ్లిప్కార్ట్, అమెజాన్ తరహా ఈ రిటైలింగ్ సంస్థలు తమ ప్లాట్ఫామ్లపై తమకు వాటాలున్న కంపెనీల ఉత్పాదనలను 25 శాతానికి మించి విక్రయించకుండా నిషేధిస్తూ గత డిసెంబర్ 26న కేంద్రం నూతన నిబంధనలను ప్రకటించింది. కొన్ని కంపెనీల ఉత్పత్తులను ఎక్స్క్లూజివ్గా తమ ప్లాట్ఫామ్పైనే విక్రయించే ఒప్పందాలను సైతం నిషేధించింది. మరోవైపు ప్రభుత్వం గడువు పొడిగించకపోతే నిబంధనల అమలుకు గాను ప్లాన్–బిని ఫ్లిప్కార్ట్, అమెజాన్ సిద్ధం చేసుకున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వంతో కలసి పనిచేస్తాం: అమెజాన్ నూతన నిబంధనల విషయంలో మరింత స్పష్టత కోసం ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని, తమ కస్టమర్లు, విక్రయదారులపై ప్రభావాన్ని పరిమితం చేసేందుకు కృషి చేస్తామని అమెజాన్ ప్రకటించింది. ‘‘అన్ని చట్టాలు, నిబంధనలను పాటించేందుకు కట్టుబడి ఉంటాం. ప్రభుత్వం నుంచి స్పష్టత తీసుకుని మా భవిష్యత్తు ప్రణాళికను రూపొందించుకుంటాం. ఈ ప్రభావాన్ని పరిమితం చేసేందుకు చర్యలు తీసుకుంటాం’’ అని అమెజాన్ ప్రతినిధి పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి స్వాగతం: స్నాప్డీల్ చిన్న ఈ కామర్స్ సంస్థలు స్నాప్డీల్, షాప్క్లూస్ మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాయి. దేశంలో సచ్ఛీలమైన, బలమైన ఈ కామర్స్ రంగానికి ప్రభుత్వ నిర్ణయం దారితీస్తుందని స్నాప్డీల్ పేర్కొంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు ఇది విజయం వంటిదని షాప్క్లూస్ సీఈవో విజయ్సేతి అభివర్ణించారు. -
ఆరోపణలపై స్పందించిన స్నాప్డీల్
ఆన్లైన్ రిటైల్ పోర్టల్ స్నాప్డీల్పై వచ్చిన ఆరోపణలపై సంస్థ స్పందించింది. చట్టం, నిబంధనల ప్రకారం విక్రయాదారులు వ్యవహరించాల్సి ఉందని పేర్కొంది. కన్సూమర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి సెంటర్ (సీఈఆర్సీ) అంశాలను పరిగణనలోకి తీసుకొని విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. నకిలి ఉత్పత్తుల బెడద ప్రపంచవ్యాప్తంగా ఉందని అందుకే బ్రాండ్ షీల్డ్ ద్వారా వీటి నిరోధానికి తాము ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది. థర్డ్ పార్టీ బ్రాండ్ల విషయంలో పూర్తి పరిశీలన అనంతరం ఆయా బ్రాండ్లు నకిలీవని తేలితే వెంటనే కేవలం ఒక రోజులోనే వాటిని తొలగిస్తున్నామని తెలిపింది. మార్కెట్ ప్లేస్ ఆధారిత అమ్మకాల్లో ఆయా ఉత్పత్తిదారులు, విక్రయదారులు వీటికి బాధ్యత వహిస్తారని తెలిపింది. ఈ మేరకు స్నాప్డీల్ ప్రతినిధి మంగళవారం ఒక ప్రకటన జారీ చేశారు. 2018 జనవరినుంచి అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం ప్యాకేజీలపై ధర, ఉత్పత్తిదారుడు పేరు, తేదీ, ఎక్స్పైరీ తేదీ వివరాలను అందించాల్సిన బాధ్యత సెల్లర్స్కు ఉందని పేర్కొన్నారు. కాగా భారీ డిస్కౌంట్లు ఇచ్చేందుకు పలు వస్తువుల ఎంఆర్పీలను స్నాప్డీల్ పెంచేస్తూ, అక్రమాలకు పాల్పడుతూ వినియోగదారులకు టోకరా ఇస్తోందని తాజా అథ్యయనం వెల్లడించింది. అధిక ధరలతో, అరకొర లేబిలింగ్తో ఉన్న ఉత్పత్తులన్నింటినీ స్నాప్డీల్ ఉపసంహరించేలా చర్యలు చేపట్టాలంటూ అహ్మదాబాద్కు చెందిన కన్సూమర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి సెంటర్ (సీఈఆర్సీ)డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ)ని ఆశ్రయించింది. స్నాప్డీల్లో ఉత్పత్తుల వారీగా ఎంత ధరలకు విక్రయిస్తున్నారనే దానిపై సమగ్ర దర్యాప్తు అవసరమని సీఈఆర్సీ సీజీఎం ప్రీతి షా డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. -
కస్టమర్లకు స్నాప్డీల్ టోకరా
సాక్షి, న్యూఢిల్లీ : ఆన్లైన్ రిటైల్ పోర్టల్ స్నాప్డీల్ వినియోగదారులకు టోకరా ఇస్తోందని తాజా అథ్యయనం వెల్లడించింది. భారీ డిస్కౌంట్లు ఇచ్చేందుకు పలు వస్తువుల ఎంఆర్పీలను స్నాప్డీల్ పెంచేస్తోందని, కాస్మెటిక్ ఉత్పత్తులపై గడువు తేదీని చూపడం లేదని అహ్మదాబాద్కు చెందిన కన్సూమర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి సెంటర్ (సీఈఆర్సీ) పేర్కొంది. అధిక ధరలతో, అరకొర లేబిలింగ్తో ఉన్న ఉత్పత్తులన్నింటినీ స్నాప్డీల్ ఉపసంహరించేలాచర్యలు చేపట్టాలని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ)ని సీఈఆర్సీ కోరింది. ఇప్పటికే విక్రయించిన హానికారక ఉత్పత్తులను వెనక్కి తీసుకుని వినియోగదారులకు పరిహారం చెల్లించాలని సీఈఆర్సీ పిలుపు ఇచ్చింది. వెండార్లు, ఉత్పత్తుల ఎంపికలో కంపెనీ పారదర్శక విధానం పాటించాలని, పాలసీ ఉల్లంఘనలకు పాల్పడిన వెండార్లపై కఠిన చర్యలు చేపట్టాలని సూచించింది. స్నాప్డీల్లో ఉత్పత్తుల వారీగా ఎంత ధరలకు విక్రయిస్తున్నారనే దానిపై సమగ్ర దర్యాప్తు అవసరమని సీఈఆర్సీ సీజీఎం ప్రీతి షా డిమాండ్ చేశారు. -
ఔషధాలను విక్రయిస్తున్నందుకు స్నాప్డీల్పై విచారణ
బెంగళూరు: ఆన్లైన్లో నియంత్రిత ఔషధాలను చట్ట విరుద్ధంగా విక్రయిస్తున్నందుకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ స్నాప్డీల్కు వ్యతిరేకంగా చట్టపరమైన విచారణ చర్యలు చేపట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.‘‘షెడ్యూల్డ్ హెచ్ డ్రగ్ ‘సుహాగ్రా 100’ ప్రదర్శన, విక్రయం, పంపిణీ చేస్తున్నందుకు గాను స్నాప్డీల్, ఆ సంస్థ సీఈవో కౌర్బాహల్, సీవోవో రోహిత్కుమార్ బన్సాల్కు వ్యతిరేకంగా విచారణ చర్యలు తీసుకునేందుకు బెళగావికి చెందిన అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ను అనుమతిస్తూ డిసెంబర్ 21న ఆదేశాఉలు ఇవ్వడం జరిగింది. ఈ ఔషధాన్ని ఓవర్ ద కౌంటర్ విక్రయించకూడదు. ఇది ఔషధ, సౌందర్య ఉత్పత్తుల నిబంధనలకు వ్యతిరేకం’’అని కర్ణాటక డ్రగ్ కంట్రోలర్ అమరేష్ తుంబగి బుధవారం మీడియాకు తెలిపారు. లుథినాయాకు చెందిన హెర్బల్ హెల్త్కేర్ కంపెనీ యజమాని, ఉద్యోగులకు వ్యతిరేకంగా కూడా విచారణ చర్యలు చేపట్టినట్టు చెప్పారు. లైంగిక ఉద్దీపనానికి వినియోగించే సుహాగ్ర ఔషధాన్ని వైద్యుల సిఫారసు లెటర్ లేకుండా విక్రయించకూడదని స్పష్టం చేశారు. చట్టానికి సహకరిస్తాం: స్నాప్డీల్ ఈ విషయానికి సంబంధించి తమకు ఎటువంటి సమచారం లేదని, విచారణ అధికారులకు సహకారం అందిస్తామని స్నాప్డీల్ ప్రకటన జారీ చేసింది. ‘‘స్నాప్డీల్ అనేది మధ్యవర్తి. విక్రేతలను, కొనుగోలుదారులతో అనుసంధానిస్తుంది. షెడ్యూల్డ్ హెచ్ విభాగంలోని ఔషధాలను విక్రయించకుండా నిషేధం ఉంది. నిబంధనలను ఉల్లంఘించినట్టు తేలితే కఠినంగా వ్యవహరిస్తాం. అటువంటి విక్రేతలు ఇకపై అమ్మకాలు జరపకుండా నిషేధం విధిస్తాం’’ అని స్నాప్డీల్ అధికార ప్రతినిధి ప్రకటనలో వివరించారు. ఈ విషయంలో చట్టాన్ని అమలు చేసేందుకు తమ వైపు నుంచి సహాయ, సహకారాలు అందిస్తామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. -
చిన్న సంస్థలూ పోటీ పడగలగుతాయి
న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడులున్న ఈ–కామర్స్ కంపెనీల నిబంధనలను కేంద్రం కఠినతరం చేయడం.. చిన్న సంస్థలకు ప్రయోజనకరంగా ఉండగలదని పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి. ఇప్పటిదాకా నిబంధనలను బాహాటంగా ఉల్లంఘిస్తున్న పెద్ద కంపెనీలకు అడ్డదారులన్నీ మూసుకుపోతాయని షాప్క్లూస్, స్నాప్డీల్ వంటి సంస్థలు వ్యాఖ్యానించాయి. ‘బడా విదేశీ కంపెనీలు ముందు నుంచీ ఈ పాలసీ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయన్న సంగతిని ప్రభుత్వం గుర్తించిందనేది తాజా నిబంధనల ద్వారా వెల్లడైంది‘ అని షాప్క్లూస్ సీఈవో సంజయ్ సేథి చెప్పారు. విక్రేతలందరూ ఈ–కామర్స్ ప్రయోజనాలు పొందేందుకు తాజా మార్పులు దోహదపడగలవని స్నాప్డీల్ సహ వ్యవస్థాపకుడు కునాల్ బెహల్ పేర్కొన్నారు. ‘పెద్ద సంస్థలతో సమానంగా చిన్న సంస్థలు కూడా అవకాశాలు అందిపుచ్చుకునేందుకు తాజా నిబంధనలు ఉపయోగపడతాయి. లఘు వ్యాపార సంస్థలు కూడా ఈ–కామర్స్ ప్రయోజనాలు అందుకోవచ్చు‘ అని ఇన్స్టామోజో సీఈవో సంపద్ స్వైన్ తెలిపారు. ఇకపై ఈ–కామర్స్ సంస్థలు భారత్లో తమ వ్యాపార వ్యూహాలను సవరించుకోవాల్సి వస్తుందని ఈవై ఇండియా నేషనల్ లీడర్ (పాలసీ అడ్వైజరీ అండ్ స్పెషాలిటీ సర్వీసెస్) రాజీవ్ చుగ్ అభిప్రాయపడ్డారు. చర్చించి ఉండాల్సింది: ఫ్లిప్కార్ట్ మరోవైపు, పరిశ్రమ వృద్ధిపై దీర్ఘకాలిక ప్రభావాలు చూపే నిబంధనలను రూపొందించేటప్పుడు.. ప్రభుత్వం సంబంధిత వర్గాలతో సమాలోచనలు జరపడం ముఖ్యమని ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ–కామర్స్ వ్యవస్థతో చిన్న సంస్థలకు తోడ్పాటు లభిస్తుండటంతో పాటు వేల కొద్దీ ఉద్యోగాల కల్పన జరుగుతోందని తెలిపింది. ఇది ఆరంభం మాత్రమేనని, దేశ ఎకానమీకి ఈ పరిశ్రమ వృద్ధి చోదకంగా మారగలదని పేర్కొంది. ఇక, నిబంధనల సర్క్యులర్ను అధ్యయనం చేస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. నిబంధనలు కచ్చితంగా అమలవ్వాలి.. ఈ–కామర్స్ సైట్లలో అమ్మకాలకు సంబంధించిన కొత్త నిబంధనలన్నీ కచ్చితంగా అమలయ్యేలా చూడాలని ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీ ప్రభుత్వాన్ని కోరింది. ‘మేం లేవనెత్తిన ప్రధాన అంశాలన్నింటినీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. కొత్త నిబంధనల ప్రకారం ఇకపై క్యాష్బ్యాక్ అమ్మకాలు, డిస్కౌంట్లు, ఎక్స్క్లూజివ్ విక్రయాల్లాంటివి ఉండబోవు. ప్రభుత్వ నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం. అలాగే వీటిని కఠినంగా అమలు కూడా చేస్తుందని ఆశిస్తున్నాం‘ అని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ చెప్పారు. దిగ్గజాలకు సమస్యలు.. కొత్త నిబంధనలతో అమెజాన్, ఫ్లిప్కార్ట్ సంస్థలపైనే ఎక్కువగా ప్రతికూల ప్రభావాలు పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వీటి స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. బుధవారం ప్రకటించిన నిబంధనల ప్రకారం.. తమకు వాటాలు ఉన్న ఇతర సంస్థల ఉత్పత్తులను ఈ–కామర్స్ సంస్థలు తమ ప్లాట్ఫాంపై విక్రయించడానికి లేదు. అలాగే, ఎక్స్క్లూజివ్ అమ్మకాల కోసం ఏ సంస్థతోనూ ఒప్పందాలు కుదుర్చుకోరాదు. పోటీని దెబ్బతీసేలా భారీ డిస్కౌంట్లు ప్రకటించడానికి లేదు. దాదాపు 16 బిలియన్ డాలర్లు వెచ్చించి ఇటీవలే ఫ్లిప్కార్ట్లో 77% వాటాలు కొన్న అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ లాంటి వాటికి ఈ నిబంధనలు సమస్యాత్మకమే. అవి సొంత ప్రైవేట్ బ్రాండ్స్ను విక్రయించుకోవడానికి ఉండదు. అలాగే, ఎక్స్క్లూజివ్ ఒప్పందాలపై ఆంక్షల ప్రభావం అసూస్, వన్ప్లస్, బీపీఎల్ వంటి బ్రాండ్స్పై పడనుంది. -
నకిలీ ఉత్పత్తులకు స్నాప్డీల్ చెక్..
న్యూఢిల్లీ: నకిలీ ఉత్పత్తుల విషయంలో ప్రముఖ బ్రాండ్స్ అప్రమత్తంగా వ్యవహరించేలా తోడ్పడేందుకు ఈ–కామర్స్ సంస్థ స్నాప్డీల్ తాజాగా ‘బ్రాండ్ షీల్డ్’ పేరిట ప్రత్యేక విధానాన్ని రూపొందించింది. వివిధ బ్రాండ్స్ నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా దీన్ని తీర్చిదిద్దినట్లు సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. స్నాప్డీల్లో అమ్ముడయ్యే నకిలీ ఉత్పత్తులపై ఆయా బ్రాండ్స్ ఫిర్యాదు చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని వెల్లడించింది. ట్రేడ్మార్క్, కాపీరైట్, పేటెంట్, డిజైన్పరంగా జరిగే మేథోహక్కుల ఉల్లంఘనలను బ్రాండ్ షీల్డ్ విధానం కింద సదరు సంస్థలు ఫిర్యాదు చేయొచ్చని స్నాప్డీల్ తెలిపింది. -
అమెజాన్ డెలివరీలు ఆలస్యం
న్యూఢిల్లీ : రవాణా వ్యవస్థలో అత్యంత కీలకమైన లారీలు దేశవ్యాప్తంగా బంద్ చేపడుతున్నాయి. జూలై 20 నుంచి ప్రారంభమైన ఈ బంద్ ఇంకా కొనసాగుతూనే ఉంది. డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని.. దేశవ్యాప్తంగా ఒకే ధరను నిర్ణయించి, ప్రతి 3 నెలలకోసారి ధరలను సవరించాలన్న డిమాండ్ల సాధన కోసం లారీ యజమానులు ఈ బంద్ చేపడుతున్నాయి. ఈ బంద్తో దేశీయ ఈ-కామర్స్ కంపెనీలు అమెజాన్, స్నాప్డీల్కు భారీగా దెబ్బకొడుతోంది. కొన్ని నగరాల్లో సరుకుల డెలివరీ చేయడం కష్టతరంగా మారింది. దీంతో అమెజాన్, స్నాప్డీల్ డెలివరీలు కస్టమర్లకు ఆలస్యంగా చేరుకుంటున్నాయి. లారీలు బంద్ చేపట్టినప్పటి రోజే అమెజాన్, ఫ్లిప్కార్ట్లు రెండూ తమ తమ వార్షిక విక్రయాలను ముగించాయి. ఈ విక్రయాల్లో ఆర్డర్లు ఇచ్చిన వారికి డెలివరీ ఆలస్యమవుతుందని అమెజాన్ అధికార ప్రతినిధి చెప్పారు. ఎలాగైనా కస్టమర్లకు ఉత్పత్తులు చేరుకునేలా పనిచేస్తున్నామని తెలిపారు. దేశీయ అతిపెద్ద రవాణా వ్యవస్థ స్తంభించడంతో, ఉత్తర, పశ్చిమ భారత్లో డెలివరీలపై ప్రభావం చూపుతుందని స్నాప్డీల్ కూడా తెలిపింది. ఈ విషయాలపై ఇప్పటికే కొనుగోలుదారులకు, విక్రయదారులకు సమాచారం అందించామని చెప్పింది. దేశీయ కమోడిటీ ట్రేడ్ కూడా దెబ్బతిన్నది. పత్తి సరుకు రవాణా ఆగిపోయింది. ముడి పదార్థం లేనందున పత్తి గైనింగ్ కర్మాగారాలు మూసివేత అంచున ఉన్నాయని భారతదేశ కాటన్ అసోసియేషన్ అధ్యక్షుడు అతుల్ గణట్రా చెప్పారు. పత్తి రవాణా ఆగిపోవడంతో, ఎగుమతిదారులు తమ తమ బాధ్యతలను నెరవేర్చలేకపోతున్నారని, దీంతో షిప్మెంట్లను రద్దు చేస్తున్నారని పేర్కొన్నారు. చైనా, బంగ్లాదేశ్, వియత్నాం, పాకిస్తాన్లు దేశీయ పత్తి కొనుగోలు చేయడంలో ప్రధానదారులు. ఉల్లిగడ్డలు, బంగాళదుంపలు వంటి కూరగాయలను పెద్ద పెద్ద నగరాలకు సరఫరా చేయడం కూడా పడిపోయింది. కొన్ని చోట్ల బంగాళదుంపలు ఖరీదైనవిగా మారాయి. ఈ వారంలోనే బంగాళదుంపల ధరలు 29 శాతం మేర పైకి ఎగిశాయి. -
ఇన్ఫీబీమ్ చేతికి స్నాప్డీల్ ’యూనికామర్స్’
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ సంస్థ స్నాప్డీల్ అనుబంధ కంపెనీ యూనికామర్స్ను కొనుగోలు చేయనున్నట్లు ఇన్ఫీ బీమ్ వెల్లడించింది. ఈ–కామర్స్ సాఫ్ట్వేర్ సేవలందించే యూని కామర్స్ కొనుగోలుకు రూ. 120 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపింది. స్నాప్డీల్ మాతృసంస్థ జాస్పర్ ఇన్ఫోటెక్కు ఆప్షనల్లీ కన్వర్టబుల్ డిబెంచర్స్ను జారీ చేయటం ద్వారా ఈ డీల్ను పూర్తి చేస్తామని, నగదు చెల్లింపులు ఉండబోవని వివరించింది. మూడు నుంచి అయిదు నెలల్లోగా డీల్ పూర్తి కాగలదని అంచనా. సమగ్రమైన ఈ–కామర్స్ సర్వీసులు అందించేందుకు ఈ కొనుగోలు ఉపయోగపడగలదని ఇన్ఫీ బీమ్ ఎండీ విశాల్ మెహతా ధీమా వ్యక్తంచేశారు. యూనికామర్స్ డీల్కు ఆమోదముద్ర వేసిన ఇన్ఫీబీమ్ కార్పొరేషన్ బోర్డు.. తమ సంస్థ పేరును కూడా ఇన్ఫీబీమ్ అవెన్యూస్గా మార్చే ప్రతిపాదనను ఓకే చేసింది. 2012లో ఏర్పాటైన యూనికామర్స్ సంస్థకు 10,000 పైగా విక్రేతలు క్లయింట్స్గా ఉన్నారు. ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ టర్నోవరు రూ.20 కోట్లుగాను, నికర విలువ రూ.25 కోట్లుగాను ఉంది. ఇతరత్రా వ్యాపార విభాగాలను విక్రయించి, ప్రధాన వ్యాపారంపై మరింతగా దృష్టి పెట్టేందుకు ఉద్దేశించిన వ్యూహంలో భాగంగానే యూనికామర్స్ను విక్రయిస్తున్నట్లు స్నాప్డీల్ చీఫ్ స్ట్రాటెజీ, ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ జేసన్ కొఠారి తెలిపారు. ఫ్లిప్కార్ట్, అమెజాన్ల నుంచి తీవ్రమైన పోటీతో కుదేలయిన స్నాప్డీల్.. మళ్లీ పుంజుకునేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే పేమెంట్ సేవల విభాగం ఫ్రీచార్జ్ను యాక్సిస్ బ్యాంక్కి రూ. 385 కోట్లకు, లాజిస్టిక్స్ విభాగం వల్కన్ ఎక్స్ప్రెస్ను ఫ్యూచర్ సప్లై చెయిన్ సొల్యూషన్స్కి రూ.35 కోట్లకు అమ్మేసింది. -
ఆ ఆయుధాల విక్రయం నిలిపేశాం
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్లో అక్రమంగా ఆయుధాలు విక్రయిస్తున్న ఆరోపణలపై హైదరాబాద్లో కేసులు నమోదు కావడంతో స్నాప్డీల్ సంస్థ దిగివచ్చింది. తమ వెబ్సైట్లో ఉన్న ఆయా ఆయుధాల మెనూను తొలగించామని, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూస్తామని నగర పోలీసులకు వివరణ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం నగర పోలీసు కమిషనర్ వీవీ శ్రీనివాసరావును కలసి స్నాప్డీల్ లీగల్ టీమ్ సంజాయిషీ ఇచ్చుకుంది. స్నాప్డీల్ చేస్తున్న ఆయుధ వ్యాపారాన్ని నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు గత వారం గుట్టురట్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయుధ చట్టం ప్రకారం 9 అంగుళాల కంటే ఎక్కువ పొడవు, రెండు అంగుళాల కంటే ఎక్కువ వెడల్పుతో కూడిన ఆయుధాలు సరైన అనుమతులు లేకుండా కలిగి ఉండటం, విక్రయించడం, ఖరీదు చేయడం నేరం. ఖరీదు చేసినందుకు సిటీకి చెందిన పలువురు యువకులను అరెస్టు చేసిన పోలీసులు విక్రయించిన ఆరోపణలపై స్నాప్డీల్కు నోటీసులు జారీ చేశారు. పునరావృతం కాకుండా చూస్తాం.. దీంతో హైదరాబాద్ పోలీసు కమిషనర్ను కలసి ఆ సంస్థ లీగల్ టీమ్ సంజాయిషీ ఇచ్చుకుంది. తాము నేరుగా ఎలాంటి ఉత్పత్తుల విక్రయాలు చేయమని, అటు విక్రేతలు.. ఇటు కొనుగోలుదారులకు మధ్య అనుసంధానకర్తగా మాత్రమే పని చేస్తామని వివరణ ఇచ్చింది. ఈ ఆయుధాలను గుజరాత్కు చెందిన సంస్థ తమ సైట్ ద్వారా విక్రయిస్తోందని పేర్కొంది. అయితే క్రయవిక్రయాలకు ప్లాట్ఫామ్గా వ్యవహరించిన నేపథ్యంలో స్నాప్డీల్కు విక్రేత కొంత మేరకు కమీషన్ చెల్లిస్తాడు. ఈ నేపథ్యంలో చట్ట ప్రకారం బాధ్యులవుతారని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో తమ వెబ్సైట్ నుంచి పరిమితికి మించిన పొడవు, వెడల్పులతో ఉన్న ఆయుధాల మెనూను తొలగించామని, విక్రయాలు ఆపేశామని స్పష్టం చేశారు. దీంతో గుజరాత్ సంస్థకూ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించిన పోలీసులు.. స్నాప్డీల్పై చర్యలకు సంబంధించి న్యాయ సలహా తీసుకోవాలని నిర్ణయించారు. ఇతర వెబ్సైట్లలోనూ... స్నాప్డీల్లోనే కాదు.. ఏ ఈ–కామర్స్ సైట్లలో చూసినా కత్తులు విక్రయానికి సిద్ధంగా ఉంటున్నాయని పోలీసులు గుర్తించారు. రూ.వెయ్యి నుంచి రూ.8 వేల వరకు వివిధ ఆకృతులు, సైజుల్లో వీటిని విక్రయించేస్తున్నారని ఆధారాలు సేకరించారు. వీటిని పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో ఆయా వెబ్సైట్లకూ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. ఆన్లైన్లో కత్తులు అందుబాటులోకి రావడంతో అనేక మంది అవసరం ఉన్నా లేకున్నా, చట్ట విరుద్ధమని తెలిసో తెలియకో వీటిని ఖరీదు చేసి తమ వద్ద ఉంచుకుంటున్నారు. -
ఫ్యూచర్ చేతికి ‘వల్కన్ ఎక్స్ప్రెస్’!
న్యూఢిల్లీ: కిశోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ సప్లై చెయిన్ సొల్యూషన్స్ కంపెనీ ప్రముఖ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ స్నాప్డీల్కు చెందిన లాజిస్టిక్స్ విభాగం వల్కన్ ఎక్స్ప్రెస్ను కొనుగోలు చేసింది. పూర్తిగా నగదు చెల్లించి వల్కన్ ఎక్స్ప్రెస్ను కొనుగోలు చేశామని, ఈ డీల్ విలువ రూ.35 కోట్లని ఫ్యూచర్ గ్రూప్ చైర్మన్ కిశోర్ బియానీ తెలిపారు. వల్కన్ చేరికతో ఈ కామర్స్, రిటైల్ కస్టమర్లకు మరింత మెరుగైన సేవలందించగలమని చెప్పారాయన. కాగా పూర్తిగా ఈ–కామర్స్ వ్యాపారంపైననే దృష్టి సారించే వ్యూహంలో భాగంగా స్నాప్డీల్ కంపెనీ వల్కన్ ఎక్స్ప్రెస్ను విక్రయించిందని స్నాప్డీల్ చీఫ్ స్ట్రాటజీ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ జేసన్ కొఠారి పేర్కొన్నారు. ఫ్యూచర్ సప్లై చెయిన్కు దేశవ్యాప్తంగా 44 గిడ్డంగులు, 14 లాజిస్టిక్స్ కేంద్రాలు, 106 బ్రాంచ్లు ఉన్నాయి. ఫ్యూచర్ జోరు..: ఇటీవల కాలంలో ఫ్యూచర్ కంపెనీ జోరుగా కంపెనీలను కొనుగోలు చేస్తోంది. గత ఏడాది అక్టోబర్లో ఈ కంపెనీ షాపర్స్ స్టాప్కు చెందిన హైపర్ సిటీ రిటైల్ను రూ.655 కోట్లకు కొనుగోలు చేసింది. గత వారమే ట్రావెల్ న్యూస్ సర్వీసెస్ ఇండియాను (టీఎన్ఎస్ఐ) రూ.100 కోట్లకు కొనుగోలు చేసింది. -
‘ఫ్యూచర్’ చేతికి స్నాప్డీల్ ‘వల్కన్’!
ముంబై: ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ స్నాప్డీల్కు చెందిన లాజిస్టిక్స్ విభాగం, వల్కన్ ఎక్స్ప్రెస్ను ఫ్యూచర్ గ్రూప్ కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ విలువ రూ.50 కోట్లు ఉండొచ్చు. తన సరఫరా చెయిన్ వ్యాపారాన్ని మరింత పటిష్టవంతం చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా ఫ్యూచర్గ్రూప్ వల్కన్ ఎక్స్ప్రెస్ను కొనుగోలు చేయనున్నదని సంబంధిత వర్గా లు వెల్లడించాయి. ఈ డీల్కు సంబంధించి చర్చలు ఆరంభ దశలో ఉన్నాయని, మరికొన్ని వారాల్లో ఖరా రు కావచ్చని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ డీల్లో భాగంగా వల్కన్ సిబ్బంది ఫ్యూచర్ గ్రూప్కు బదిలీ అవుతారు. వల్కన్ ఎక్స్ప్రెస్ చేరికతో ఫ్యూచర్ గ్రూప్ థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ కార్యకలాపాలు మరింత శక్తివంతమవుతాయి. ఈ వార్తలపై వ్యాఖ్యానించడానికి స్నాప్డీల్, ఫ్యూచర్గ్రూప్లు నిరాకరించాయి. వంద నగరాల్లో వల్కన్ కార్యకలాపాలు... వల్కన్ ఎక్స్ప్రెస్ రిటైల్ కంపెనీలకు ముఖ్యంగా ఈ కామర్స్ సంస్థలకు సరఫరా సేవలందిస్తోంది. మొత్తం వంద నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇక ఫ్యూచర్ గ్రూప్కు సొంత లాజిస్టిక్స్ సంస్థ ఉంది. ఇటీవలే ఈ సంస్థ, ఫ్యూచర్ సప్లై చెయిన్ సొల్యూషన్స్ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ద్వారా రూ.650 కోట్లు సమీకరించింది. రిటైల్, ఫ్యాషన్, ఆటోమోటివ్, ఇంజినీరింగ్, ఫుడ్, బేవరేజేస్, ఎఫ్ఎమ్సీజీ, ఈ కామర్స్, హెల్త్కేర్, ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ రంగాల సంస్థలకు లాజిస్టిక్స్ సేవలందిస్తోంది. కీలకం కాని ఆస్తుల విక్రయంలో భాగంగా స్నాప్డీల్ సంస్థ వల్కన్ ఎక్స్ప్రెస్ను విక్రయిస్తోంది. అత్యంత తీవ్రమైన పోటీ ఉన్న ఈ కామర్స్ మార్కెట్లో ఫ్లిప్కార్ట్, అమెజాన్ల నుంచి నిలదొక్కుకోవడానికి కావలసిన నిధులను ఇలాంటి కీలకం కాని ఆస్తుల విక్రయం ద్వారా సమకూర్చుకుంటోంది. గత ఏడాది జూలైలో తన పేమెంట్ వాలెట్ ఫ్రీచార్జ్ను స్నాప్డీల్ కంపెనీ యాక్సిస్ బ్యాంక్కు రూ.385 కోట్లకు విక్రయించింది. -
ఆన్లైన్లో విజృంభిస్తున్న నకిలీ దందా!
సాక్షి, న్యూఢిల్లీ : స్మార్ట్ఫోన్లు, 4జీ వినియోగం పెరగడంతో ఆన్లైన్ అమ్మకాలు విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆన్లైన్లో అమ్మేవాటిలో చాలా వరకు నకిలీ ఉత్పత్తులు ఉన్నట్టు వెల్లడయింది. సాధారణంగా పండుగ సమయంలో ఈ–కామర్స్ వెబ్సైట్లు డిస్కౌంట్లతో హోరెత్తిస్తుంటాయి. రాయితీలు ఇచ్చి అమ్మే వస్తువుల్లో ఎన్ని మంచివి? ఎన్ని నకిలీవి? అనే విషయమై ఓ ఆంగ్ల ఛానల్ జరిపిన పరిశోధనలో విస్తపోయే వాస్తవాలు తెలిశాయి. చాలామంది తయారీదారులు, విక్రేతలు ఆన్లైన్లో నకిలీ సరుకులను అంటగడుతున్నట్టు తేలింది. ఐటీ చట్టంలోని లోపాలను వాడుకుంటూ ఇలా చేస్తున్నారు. ఆన్లైన్లో ఉన్న దాదాపు 60 శాతం క్రీడా ఉత్పత్తులు నకిలీవేనట. అంతేకాక 40 శాతం దుస్తులు నకిలీ కంపెనీలవేనని గుర్తించారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన మీరట్లోని బ్రహ్మపురి ఏరియాలో పోలీసులు జరిపిన తనిఖీలో పెద్ద మొత్తంలో పట్టుబడిన నకిలీ ఉత్పత్తులను సీజ్ చేశారు. వీటిని ఫ్లిప్కార్ట్, షాప్క్లూస్, స్నాప్డీల్ వంటి ప్రముఖసైట్లలో విక్రయిస్తున్నారు. రూ.170–200 వరకు ధర ఉన్న నకిలీ ఉత్పత్తులను రూ.450–500కు అమ్ముతున్నారు. ఏకంగా 50–60 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. మనీలాండరింగ్కు, కొన్ని రకాల మోసాలకు కూడా కంపెనీలు ఆన్లైన్ను వాడుకుంటున్నట్టు దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు. -
స్నాప్డీల్ అన్బాక్స్ దివాలి సేల్ ప్రారంభం
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్కార్ట్, అమెజాన్ల కంటే ముందస్తుగానే స్నాప్డీల్ తన సేల్ను ప్రారంభించేసింది. ఈ పండుగ సీజన్ క్యాష్ చేసుకునేందుకు అన్బాక్స్ దివాలి సేల్ను నేటి నుంచి నిర్వహిస్తోంది. ఈ సేల్లో భాగంగా స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, టెలివిజన్లు వంటి ఎలక్ట్రానిక్స్పై బంపర్ ఆఫర్లను అందిస్తోంది. పలు బ్యాంకు కార్డులపై కూడా ఫ్లాట్ డిస్కౌంట్లను, క్యాష్బ్యాక్లను స్నాప్డీల్ ప్రవేశపెట్టింది. వీటితో పాటు ఈ సేల్లో భాగంగా ధమాకా డీల్స్ను కూడా స్నాప్డీల్ ఆఫర్ చేస్తోంది. క్యాష్బ్యాక్ ఆఫర్లు.. ఇతర ఫెస్టివల్ సేల్స్ మాదిరిగా కాకుండా.. స్నాప్డీల్ పలు బ్యాంకులపై క్యాష్బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది. సిటీ క్రెడిట్ కార్డును వాడి కనీసం రూ.2000 మేర కొనుగోలు చేస్తే, 15 శాతం క్యాష్బ్యాక్ నుంచి రూ.2000 వరకు అందుబాటులో ఉంటుంది. హెచ్డీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ కార్డు హోల్డర్స్కు 10 శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్ను అందిస్తోంది. తొలిరోజు సేల్లో భాగంగా హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డు దారులకు అదనంగా 10 శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్ను ఆఫర్ చేస్తోంది. రెండో రోజు(శనివారం) స్టాండర్డ్ ఛార్టడ్ కార్డు యూజర్లకు ఆఫర్లను స్నాప్డీల్ ప్రకటించింది. మొబైల్, ఇతర ఎలక్ట్రానిక్స్పై డీల్స్... వివో వీ5 ప్లస్ 64జీబీ గోల్డ్ కలర్ వేరియంట్పై 28 శాతం డిస్కౌంట్, ఒకవేళ ఏదైనా బ్యాంకు కార్డు ఆఫర్ ఉంటే మరో రూ.2000 క్యాష్బ్యాక్(మొత్తంగా రూ.17,549కు అందుబాటు) వివో వీ5ఎస్ స్మార్ట్ఫోన్ రూ.15,799కు, జియోని ఏ1 రూ.15,348కి, మోటో ఎం రూ.14,999కు, మోటో జీ5ఎస్ రూ.14,295కు అందుబాటు సోనీ ఎండీఆర్-జెడ్ఎక్స్110ఏ హెడ్ఫోన్లపై 53 శాతం డిస్కౌంట్ లెనోవో ఐడియాప్యాడ్ 80ఎక్స్హెచ్01జీఈఐఎన్ నోట్బుక్పై 21 శాతం డిస్కౌంట్, రూ.24,999కే విక్రయం హెచ్పీ 15-బీయూ003టీయూ ల్యాప్టాప్పై 18 శాతం డిస్కౌంట్, రూ.26,499కే అందుబాటు పలు పీసీ, ల్యాప్టాప్ మోడల్స్ ఈ సేల్లో డిస్కౌంట్ ధరలకే అందుబాటులో ఉన్నాయి. -
స్నాప్డీల్ సేల్: డిస్కౌంట్లో కొత్త ఐఫోన్లు
ఈ-కామర్స్ కంపెనీల్లో ఫెస్టివల్ సీజన్ ఇంకా నడుస్తూనే ఉంది. ఫ్లిప్కార్ట్, అమెజాన్ తర్వాత స్నాప్డీల్ తన 'అన్బాక్స్ దివాలి సేల్''ను కొనసాగిస్తోంది. రెండో రౌండ్ నిర్వహిస్తున్న ఈ సేల్ నేటితో ముగియనుంది. ఈ సేల్లో భాగంగా ఆపిల్ ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త ఐఫోన్లపై బంపర్ డిస్కౌంట్లను ప్రకటించింది. హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డులతో కొత్త ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్లను కొనుగోలు చేస్తే, తక్షణ డిస్కౌంట్ కింద రూ.13వేల వరకు స్నాప్డీల్ అందిస్తోంది. పరిమిత యూనిట్లపై ఈ డిస్కౌంట్ను ఆఫర్ చేస్తున్నట్టు స్నాప్డీల్ చెప్పింది. ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్లో డిస్కౌంట్ను అందుబాటులో ఉంచింది. అదనంగా స్టాండర్డ్ ఛార్టడ్, యస్ బ్యాంకు కార్డులపై రూ.2500 కంటే ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేపడితే, ఫ్లాట్ 20 శాతం డిస్కౌంట్ను ఇస్తోంది. ప్రతికార్డుపైనా రూ.1500 వరకు డిస్కౌంట్ను స్నాప్డీల్ ఆఫర్ చేస్తోంది. అంతేకాక గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్ స్మార్ట్ఫోన్ను 58వేల రూపాయలకే అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్ స్మార్ట్ఫోన్ కొనుగోలుపై రూ.22వేల వరకు ఆదాచేసుకోవచ్చు. సేల్ డేస్లో ఆఫర్లకు అదనంగా ఇండస్ఇండ్ బ్యాంకు హోల్డర్స్కు అక్టోబర్ 3 నుంచి ప్రతి మంగళవారం ఫ్లాట్ 10 శాతం తగ్గింపును ఇవ్వనుంది. అయితే రూ.1500 కంటే మించి కొనుగోలు చేపడితేనే ఈ తగ్గింపును స్నాప్డీల్ ఆఫర్ చేస్తుంది. -
ఆన్లైన్ ‘పండుగ’..!
►ఈ–కామర్స్ కంపెనీల పోటాపోటీ ► 90 శాతం దాకా డిస్కౌంట్ సేల్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఆన్లైన్ ఫెస్టివల్ మొదలైంది. పండుగల సీజన్ కోసం ఈ–కామర్స్ కంపెనీలు డిస్కౌంట్లతో సవాల్ విసురుతున్నాయి. డేటా చార్జీలు దిగిరావడం, 4జీ స్మార్ట్ఫోన్ల హవా నడుస్తోంది. దీంతో కొత్త యూజర్లు తోడుకావడంతో ఆన్లైన్ షాపింగ్ ఈసారి జోరుమీద ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. ఇంకేముంది అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, షాప్క్లూస్తోపాటు పేటీఎం మాల్ సైతం ‘క్లిక్’ అయ్యే ఆఫర్లతో సిద్ధమయ్యాయి. ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, హోమ్ డెకోర్.. ఇలా వందలాది విభాగాల్లో కస్టమర్ల ముందుకు లక్షలాది ఉత్పత్తులను తీసుకొచ్చాయి. సులభ వాయిదాల్లో మొత్తాలను స్వీకరించేందుకు సై అంటున్నాయి. ఈ ఫెస్టివల్ సీజన్లో ఆన్లైన్ వేదికగా సుమారు రూ.11,000 కోట్ల విలువైన వ్యాపారం జరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. 2016లో దేశవ్యాప్తంగా పండుగల సీజన్కు ఈ–కామర్స్ కంపెనీలు రూ.6,500 కోట్ల వ్యాపారం చేశాయి. డీల్స్లో దేనికదే సాటి.. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరుతో అమెజాన్ నేటి నుంచే రంగంలోకి దిగుతోంది. 24వరకు ఉండే ఈ ఫెస్టివల్లో బిగ్ డీల్స్ ఉంటాయని కంపెనీ చెబుతోంది. ఆసక్తికర అంశం ఏమంటే డబ్బులు వచ్చే ఏడాది చెల్లించొచ్చు అంటూ ఈ కంపెనీ కొత్త డీల్కు తెరలేపింది. దీని కింద హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్లు వాయిదా మొత్తాన్ని 2018 జనవరి నుంచి చెల్లించొచ్చు. బిగ్ బిలియన్ డేస్ పేరుతో ఫ్లిప్కార్ట్ సెప్టెంబర్ 24 వరకు విక్రయాలను జరుపనుంది. 90 శాతం వరకు డిస్కౌంట్ను ఆఫర్ చేస్తోంది. అలాగే సేల్లో భాగంగా కార్లు, హాలిడే ప్యాకేజెస్, టెలివిజన్ల వంటి బహుమతులతో విక్రేతలను ప్రోత్సహిస్తున్నట్టు ఫ్లిప్కార్ట్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ గోటేటి వెల్లడించారు. విక్రేతలు రెండు రెట్ల అమ్మకాల వృద్ధి సాధించాలన్న లక్ష్యంతో రంగంలోకి దిగామన్నారు. బై నౌ, పే లేటర్ అంటూ ఫ్లిప్కార్ట్ సైతం కస్టమర్లను ఊరిస్తోంది. ఇక వేలాది ఉత్పత్తులపై 15 నుంచి 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్లతో గట్టిపోటీ ఇచ్చేందుకు పేటీఎం మాల్ ఇప్పటికే రంగంలోకి దిగింది. సెప్టెంబరు 23 వరకు ఉండే మేరా క్యాష్బ్యాక్ సేల్ కోసం రూ.501 కోట్లను కేటాయించింది. ప్రతి ఆర్డరుపై ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఉంటుందని పేటీఎం మాల్ సీవోవో అమిత్ సిన్హా వెల్లడించారు. ఈ నెల 25 వరకు అన్బాక్స్ దివాలీ సేల్కు స్నాప్డీల్ సమాయత్తమైంది. సెప్టెంబర్ 28 వరకు మహాభారత్ దివాలీ సేల్కు షాప్క్లూస్.కామ్ సిద్ధమైంది. స్మార్ట్ఫోన్లదే హవా.. ఆన్లైన్ కంపెనీలు ఎక్స్క్లూజివ్ ఉత్పత్తులతో ప్రధానంగా స్మార్ట్ఫోన్లతో పోటీకి సై అంటున్నాయి. విలువ పరంగా ఈ–కామర్స్ వ్యాపారం లో స్మార్ట్ఫోన్ల వాటాయే అత్యధికంగా 55% దాకా ఉంది. 160 స్మార్ట్ఫోన్ మోడళ్లు, 100 ఎలక్ట్రానిక్స్ ఎక్స్క్లూజివ్గా విక్రయిస్తున్నట్టు అమెజాన్ వెల్లడించింది. మొత్తంగా ఈ ఏడాది సీజన్లో ఈ–కామర్స్ వ్యాపారంలో 60 శాతం వృద్ధి ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొబైల్స్ తర్వాత ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయెన్సెస్, ఫ్యాషన్, కిచెన్, హోంకేర్ తదితర విభాగాల్లో అమ్మకాలు గణనీయంగా ఉండనున్నాయి. బిగ్ బిలియన్ డేస్ ద్వారా ఫ్లిప్కార్ట్ అమ్మకాల్లో రెండుమూడు రెట్ల వృద్ధి ఆశిస్తోంది. సేల్లో 80% దాకా డిస్కౌంట్ ఇస్తున్నట్టు షాప్క్లూస్ సహ వ్యవస్థాపకులు రాధిక అగర్వాల్ తెలిపారు. -
స్నాప్డీల్ 3 రోజుల ఫెస్టివల్ సేల్
సాక్షి, న్యూఢిల్లీ : ఈ-కామర్స్ సంస్థ స్నాప్డీల్ మూడు రోజుల ఫెస్టివల్ సేల్కు తెరతీసింది. నిన్నటి(శుక్రవారం) నుంచి ఈ సేల్ను నిర్వహిస్తోంది. ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, హోమ్కు సంబంధించిన అన్ని కేటగిరీ వస్తువులపై రెండింతలు డిస్కౌంట్లను అంటే 70 శాతం వరకు డిస్కౌంట్ను స్నాప్డీల్ ప్రకటించింది. రేపటి వరకు(ఆదివారం) వరకు ఈ సేల్ నడుస్తోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్రెడిట్ కార్డు హోల్డర్స్కు వెనువెంటనే 10 శాతం డిస్కౌంట్ను కూడా స్నాప్డీల్ ఆఫర్ చేస్తోంది. అయితే ఈ ఆఫర్ కింద కనీస లావాదేవీ రూ.2500 ఉండాలి. ఇటు అమెజాన్, ఫ్లిప్కార్ట్లు పండుగ సీజన్కు సన్నద్ధమవుతుండగానే, స్నాప్డీల్ ఈ ప్రకటన ఇచ్చేసింది. స్మార్ట్ఫోన్లపై అందించే బ్లాక్బస్టర్ డీల్స్ ఇవే.. గూగుల్ పిక్సెల్ ఫోన్లపై 13 శాతం తగ్గింపు, దీంతో రూ.67వేలుగా ఉన్న గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్(32జీబీ) రూ.58వేలకే అందుబాటు లెనోవో జెడ్2 ప్లస్ 32జీబీ ఫోన్పై 44 శాతం తగ్గింపు, దీంతో రూ.17,999గా ఉన్న ఈ ఫోన్రూ.9999కే విక్రయం స్వైప్ కనెక్ట్ పవర్ 4జీ(16జీబీ) కూడా రూ.4999కు తగ్గింపు శాంసంగ్ గెలాక్సీ జే7 ప్రొ(3జీబీ, 64జీబీ) ఫోన్ 8 శాతం తగ్గింపు, రూ.22,999కే విక్రయం మైక్రోమ్యాక్స్ కాన్వాస్ నైట్ 2 ఈ471 4జీ స్మార్ట్ఫోన్పై 61 శాతం తగ్గింపు, రూ.6499కే అందుబాటు వివో వీ5ఎస్ ఫర్ఫెక్ట్ సెల్ఫీపై 16 శాతం తగ్గింపుతో రూ.16,700కే విక్రయం -
ఈ కామర్స్ సైట్కు హీరో పంచ్
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే యంగ్ హీరో రాహుల్ రవీంద్రన్ ఈ కామర్స్ వెబ్ సైట్ స్నాప్ డీల్ కు పంచ్ ఇచ్చాడు. ఇటీవల ఈ సైట్ ప్రకటించిన ఓ సేల్ కు సంబంధించి ట్విట్టర్ లో చేసిన పోస్ట్ పై రాహుల్ స్పందించిన తీరు ఆకట్టుకుంది. ఐశ్వర్యారాయ్ పరిగెడుతున్న వీడియోను పోస్ట్ చేసి స్నాప్ డీల్, ఆ వీడియోకు 'మీరు ఎంత షాపింగ్ చేశారో మీ భర్తకు తెలిసే లోపే డోర్ దగ్గరకు పరిగెత్తండి' అనే కామెంట్ ను జోడించింది. ఈ ట్వీట్ పై స్పందించిన రాహుల్ రవీంద్రన్ 'గత ఏడాది నా సంపాదన కన్నా.. నా భార్య సంపాదనే ఎక్కువ.. తన ఆన్ లైన్ షాపింగ్ తన సంపాదన తోనే చేస్తోంది. కాబట్టి పరిగెత్తాల్సిన అవసరం లేదు' అంటూ ట్వీట్ చేశాడు. రాహుల్ ట్వీట్ పై స్పందించిన ఆయన భార్య ఇలాంటి భర్తనే ప్రతీ అమ్మాయి కోరుకుంటుంది అంటూ ట్వీట్ చేసింది. రాహుల్ కామెంట్ చేసిన తరువాత స్నాప్ డీల్ తన ట్వీట్ ను తొలగించింది. 👇🏼👇🏼 This is the kinda man one should be with, ladies. I hope you (and your parents) choose well. Happy Independence Day. — Chinmayi Sripaada (@Chinmayi) 15 August 2017 -
చిక్కుల్లో స్నాప్డీల్: నోటీసులు
ముంబై: ఇ-కామర్స్ సంస్థ స్నాప్డీల్ మరోసారి చిక్కుల్లో పడింది. వన్య ప్రాణుల అవయవాలనుంచి తయారు చేసిన ఉత్పత్తులను విక్రయిస్తోందని ఆరోపిస్తూ స్నాప్డీల్ సహా, మరికొన్ని సంస్థలకు నోటీసులు జారీ అయ్యాయి. వెంటనే ఆయా ఉత్పత్తులను తొలించాలని, దీనిపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరించాలంటూ ఆదేశించినట్టు ప్రజా సంబంధాల విభాగం అధికారి ఒకరు తెలిపారు. స్నాప్డీల్తో పాటు విష్ అండ్ బిట్, ఇండియా మార్ట్, క్రాఫ్ట్ కంపారిజన్ వెబ్సైట్లకు మధ్యప్రదేశ్ టైగర్ స్ట్రైక్ ఫోర్స్ ఈ నోటీసులిచ్చింది. దీనిపై తక్షణమే వివరణ ఇవ్వాల్సిందిగా కోరింది. కాగా ఇండోర్ విజయ్ నగర్లోని శుభభక్తి స్నాప్డీల్ ద్వారా అడవి జంతువుల అవయవాలు నుండి తయారు చేసిన "హత్తా-జోడి" "సియర్-సింఘి"లాంటి ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ నోటీసులు జారీ అయ్యాయి. అలాగే ఈ వ్యవహారంలో శుభభక్తి సంస్థ యజమానులు సుమిత్ శర్మ , ఫిరోజ్ ఆలీని పోలీసులు గత వారం అరెస్టు చేశారు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసును దాఖలు చేశారు. అయితే ఇ-కామర్స్ పోర్టల్స్ స్నాప్డీల్, ఇండియా మార్ట్, విష్ అండ్ బై వెబ్సైట్ల ద్వారా ఈ వస్తువులను విక్రయించినట్టు దర్యాప్తు సమయంలో వీరు వెల్లడించారు. పూజ పదార్ధాల వర్తకంతో పాటు వన్యప్రాణుల సంబంధిత వస్తువులను విక్రయిస్తున్నట్టు తేలిందని దర్యాప్తు అధికారి తెలిపారు. ధనవంతులు కావడం, కోర్టు కేసులనుంచి విముక్తి, వ్యాపార వృద్ధి తదితర సమస్యలకు పరిష్కారంగా వీటిని జనం విశ్వసిస్తారని ఆయన చెప్పారు. -
ఫ్లిప్కార్ట్తో సాఫ్ట్బ్యాంకు చర్చలు
2 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు ఆసక్తి న్యూఢిల్లీ: జపాన్కు చెందిన అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ కంపెనీ సాఫ్ట్బ్యాంకు ఫ్లిప్కార్ట్తో అనుబంధానికి ప్రయత్నిస్తోంది. స్నాప్డీల్లో అతిపెద్ద వాటాదారైన సాఫ్ట్బ్యాంకు (35% వాటా) దాన్ని ఫ్లిప్కార్ట్లో విలీనం చేయడం ద్వారా దిగ్గజ ఈ కామర్స్ సంస్థలో వాటా పొందాలని చూసింది. కానీ, ఫ్లిప్కార్ట్తో విలీనం విషయమై చర్చల నుంచి స్నాప్డీల్ వైదొలగడంతో, సాఫ్ట్ బ్యాంకు నేరుగా ఫ్లిప్కార్టులో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఈ విషయాన్ని సాఫ్ట్బ్యాంకు చైర్మన్ మసయోషిసన్ తాజాగా వెల్ల డించారు. సాఫ్ట్ బ్యాంకు జూన్ క్వార్టర్ త్రైమాసిక ఫలితాల సందర్భంగా ఆయన ఈ విషయమై మాట్లాడారు. ఫ్లిప్కార్ట్లో సాఫ్ట్బ్యాంకు విజన్ ఫండ్ ద్వారా 2 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం. -
స్నాప్డీల్కు మరో ఇద్దరు సీనియర్లు గుడ్బై
న్యూఢిల్లీ: ఇ-కామర్ సంస్థ స్నాప్డీల్కు రాజీనామాల బెడద తప్పడం లేదు. తాజాగా ఇద్దరు కీలక సీనియర్ అధికారులు సంస్థకు రాజీనామా చేశారు. టాప్ మేనేజ్మెంట్ పై తీవ్ర మైన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వారు సంస్థను వీడడం గమనార్హం. ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గంజ్, టెక్నాలజీ (డేటా ప్లాట్ఫాం) వైస్ ప్రెసిడెంట్ అరవింద్ హేడ తమ పదవులకు గుడ్ బై చెప్పారు. ముఖ్యంగా ‘స్నాప్డీల్ 2.0’ కొత్త స్ట్రాటజీపై బహిరంగంగానే నిరసన వ్యక్తం చేసిన వీరు చివరికి కంపెనీనుంచి వైదొలగారు. ప్రొడక్ట్ వైస్ ప్రెసిడెంట్ ప్రదీప్ దేశాయ్, ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్, విరాజ్ చటర్జీ, ఐటి అధిపతి గౌరవ్ గుప్తా ఈ కంపెనీ నుంచి తొలుత నిష్క్రమించగా, ఇటీవల ఎంసీజి బిజినెస్ హెడ్ దిగ్విజయ్ ఘోష్, జనరల్ మెర్కండైజ్ బిజినెస్ హెడ్ రాహుల్ జైన్ రాజీనామా చేశారు. తాజాగా మరో ఇద్దరు టాప్ఎగ్జిక్యూటివ్స్ ఈ కోవలో చేరడం సంస్థకు పెద్ద ఎదురుదెబ్బగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. కాగా ఇటీవల ఇ కామర్స్ బిజినెస్లో అతిపెద్ద డీల్గా భావించిన ఫ్లిప్కార్ట్తో విలీనానికి స్వస్తి చెప్పిన స్నాప్డీల్ భారీగా ఉద్యోగులకు తొలగించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
యాక్సెస్ బ్యాంక్ చేతికి ఫ్రీచార్జ్ వాలెట్
-
యాక్సిస్ బ్యాంకు చేతికి ఫ్రీచార్జ్
► రూ. 385 కోట్లకు విక్రయం ► 90 శాతం డిస్కౌంటుకు అమ్మేసిన స్నాప్డీల్ ముంబై: నిధుల కొరతతో సతమతమవుతున్న ఈ కామర్స్ సంస్థ స్నాప్డీల్ తాజాగా తమ గ్రూప్లో భాగమైన పేమెంట్ వాలెట్ సంస్థ ఫ్రీచార్జ్ను.. యాక్సిస్ బ్యాంకుకు విక్రయించేందుకు అంగీకరించింది. ఈ డీల్ విలువ రూ.385 కోట్లు. 2015లో ఫ్రీచార్జ్ను కొనేందుకు స్నాప్డీల్ వెచ్చించిన 400 మిలియన్ డాలర్లతో (సుమారు రూ.2,600 కోట్లు) పోలిస్తే ఇది సుమారు 90 శాతం తక్కువ. మార్కెట్ వర్గాల ప్రకారం ఇతర సంస్థలు ఫ్రీచార్జ్ కొనుగోలుకు 15–20 మిలియన్ డాలర్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. పోటీ వాలెట్ సంస్థ పేటీఎం సుమారు 10–20 మిలియన్ డాలర్లు ఆఫర్ చేయగా, ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా ఫ్రీచార్జ్ కొనుగోలుకు ఆఖర్లో పోటీకి దిగింది. టెక్నాలజీ ప్లాట్ఫాం, కస్టమర్ల సంఖ్య, బ్రాండ్, సమర్థత మొదలైన వాటి కారణంగా ఫ్రీచార్జ్పై తాము ఆసక్తి చూపినట్లు యాక్సిస్ బ్యాంక్ సీఈవో శిఖా శర్మ తెలిపారు. ఇలాంటి డీల్స్కి ప్రత్యేకంగా విలువ కట్టడం కష్టమన్నారు. మరోవైపు, ఈ ఒప్పందం ఇరు సంస్థలకు ప్రయోజనకరమేనని స్నాప్డీల్ సహ వ్యవస్థాపకుడు కునాల్ బెహల్ చెప్పారు. స్నాప్డీల్ను ఫ్లిప్కార్ట్ కొనే ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో ఫ్రీచార్జ్ను యాక్సిస్ బ్యాంకు కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఫ్రీచార్జ్ .. యాక్సిస్ల కథ ఇదీ.. ఫ్రీచార్జ్కి 5.4 కోట్ల మంది రిజిస్టర్డ్ యూజర్లున్నారు. వీరిలో 70% మంది 30 ఏళ్ల లోపు వారే. గతేడాది సుమారు రూ.80 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఇక యాక్సిస్ బ్యాంక్కు 2 కోట్ల సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారులు.. బ్రోకరేజి, మ్యూచువల్ ఫండ్స్, ఇతరత్రా రుణగ్రహీతల రూపంలో మరో 30 లక్షల మంది యూజర్లున్నారు. యాక్సిస్కు ఇప్పటికే లైమ్ పేరిట ప్రీపెయిడ్ పేమెంట్ వాలెట్ ఉంది. ఇప్పుడు ఫ్రీచార్జ్ను కూడా కొనడంతో ఈ రెండింటిని విలీనం చేసే అవకాశాన్ని పరిశీలించవచ్చని బ్యాంకు సీఈవో శిఖా శర్మ తెలిపారు. మూడోసారీ సీఈవోగా శిఖా శర్మే.. కొత్త ఎండీ, సీఈఓ పగ్గాలు చేపట్టే వారిపై ఊహాగానాలకు తెరదించుతూ మూడోసారి కూడా శిఖా శర్మే ఆ హోదాల్లో కొనసాగుతారని యాక్సిస్ బ్యాంక్ స్పష్టం చేసింది. 2021 జూన్ దాకా ఆమె పదవీ కాలం ఉంటుంది. ‘ 2018 జూన్ 1 నుంచి మూడేళ్ల పాటు ఎండీ, సీఈవోగా శిఖా శర్మ పునర్నియామకాన్ని జులై 26న జరిగిన సమావేశంలో బోర్డు ఆమోదించింది’ అని యాక్సిస్ తెలియజేసింది. యాక్సిస్ బ్యాంక్ శిఖా శర్మ వారసులను అన్వేషిస్తోందని, టాటా సన్స్ ఆమెకు భారీ ఆఫర్ ఇచ్చిందని వార్తలు రావడం తెలిసిందే. ఐసీఐసీఐలో 1980లో కెరియర్ ప్రారంభించిన శిఖా శర్మ.. 2009లో అయిదేళ్ల కాల వ్యవధికి యాక్సిస్ బ్యాంక్ సీఈవోగా చేరారు. రెండో దఫా కూడా ఆమె నియమితులయ్యారు. -
ఫ్రీచార్జ్పై యాక్సిస్ బ్యాంక్ కన్ను
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ సంస్థ స్నాప్డీల్లో భాగమైన ఫ్రీచార్జ్ను ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ కొనుగోలు చేయనుంది. ఇందుకోసం సుమారు రూ. 350–400 కోట్ల దాకా చెల్లించేలా స్నాప్డీల్తో ఒప్పందం కూడా ఖరారు చేసుకున్నట్లు సమాచారం. డీల్ దాదాపు పూర్తయిపోయినట్లేనని, మరికొద్ది రోజుల్లో దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ’కీలకమైన వ్యాపార ప్రకటన’ చేసేందుకు గురువారం విలేకరుల సమావేశం నిర్వహించనున్నట్లు యాక్సిస్ బ్యాంక్ వెల్లడించిన నేపథ్యంలో డీల్ వార్త మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. 2015 ఏప్రిల్లో ఫ్రీచార్జ్ను స్నాప్డీల్ 400 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. అప్పట్లో దేశీ స్టార్టప్ సంస్థలకు సంబంధించి ఇది అతిపెద్ద డీల్గా నిల్చింది. ఫ్రీచార్జ్ కొనుగోలుతో దీని 5 కోట్ల మంది మొబైల్ వాలెట్ యూజర్లు యాక్సిస్కు చేరువ కాగలరు. ఫ్లిప్కార్ట్ ఆఫర్కు స్నాప్డీల్ ఓకే? తమ సంస్థ కొనుగోలు కోసం ఫ్లిప్కార్ట్ ఆఫర్ చేసిన 900–950 మిలియన్ డాలర్ల డీల్కు స్నాప్డీల్ బోర్డు ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. ఇక స్నాప్డీల్లోని మిగతా వాటాదారుల ఆమోదం లభించాల్సి ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వారంలోనే ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉన్నట్లు వివరించాయి. శుక్రవారం జరిగే బోర్డు సమావేశంలో షేర్ల మార్పిడి నిష్పత్తిని ఫ్లిప్కార్ట్ ఖరారు చేయొచ్చు. విలీన సంస్థలో సాఫ్ట్బ్యాంక్కు 20% వాటాలు దక్కే అవకాశముంది. ప్రారంభ దశలో స్నాప్డీల్ బ్రాండ్ పేరును ఫ్లిప్కార్ట్ అలాగే కొనసాగించవచ్చని తెలుస్తోంది. స్నాప్డీల్ కొనుగోలుకు తొలుత బిలియన్ డాలర్లు ఇవ్వజూపిన ఫ్లిప్కార్ట్.. ఆ తర్వాత వ్యాపార కార్యకలాపాల మదింపు అనంతరం 550 మిలియన్ డాలర్లకు కుదించి.. మళ్లీ తాజాగా 900–950 మిలియన్ డాలర్లకు పెంచింది. -
ఎట్టకేలకు ఫ్లిప్కార్ట్-స్నాప్డీల్ బిగ్ డీల్
న్యూఢిల్లీ : ఎట్టకేలకు ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఆఫర్కు స్నాప్డీల్ ఓకే చెప్పింది. గతవారం ఫ్లిప్కార్ట్ సవరించి ప్రతిపాదించిన 900 మిలియన్ డాలర్ల (రూ.5,850 కోట్లు) నుంచి 950 మిలియన్ డాలర్ల(రూ.6,175 కోట్లు) టేక్ఓవర్ ఆఫర్కు స్నాప్డీల్ బోర్డు అంగీకరించినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ఇక ఈ డీల్ను స్నాప్డీల్ షేర్ హోల్డర్స్ ఆమోదించాల్సి ఉందని సంబంధిత వర్గాలు రాయిటర్స్కు తెలిపాయి. అయితే దీనిపై ఇంకా ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ కంపెనీలు అధికారికంగా స్పందించలేదు. నిధుల కొరతతో కటకటలాడుతున్న స్నాప్డీల్ను కొనేందుకు ఫ్లిప్కార్ట్ ముందు 1 బిలియన్ డాలర్ల దాకా ఇవ్వజూపినప్పటికీ.. మదింపు ప్రక్రియ అనంతరం 800-850 మిలియన్ డాలర్ల దాకా (సుమారు రూ. 5,500 కోట్లు) ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే, స్నాప్డీల్ దీన్ని తిరస్కరించడంతో అనంతరం ఫ్లిప్కార్ట్ తన ఆఫర్ను సవరించింది. ఈ వారంలోనే స్నాప్డీల్, ఫ్లిప్కార్ట్ బోర్డు సభ్యులు సమావేశం కాబోతున్నారని, టర్మ్షీట్పై సంతకాలు చేసి, డీల్ను ఓకే చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. మూడు పార్ట్లలో డీల్ను పూర్తిచేయబోతున్నారని తెలుస్తోంది. తొలుత స్నాప్డీల్, తన ఇన్వెస్టర్లు నెక్సస్, కలారీ క్యాపిటల్ నుంచి సాఫ్ట్బ్యాంకు వాటాను కొనుగోలుచేస్తుంది. అనంతరం ఆ క్యాపిటల్ను సాఫ్ట్బ్యాంకు ఫ్లిప్కార్ట్లో పెడుతోంది. తుది దశలో ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ విలీనం కాబోతున్నాయి. శుక్రవారం రోజు సమావేశమయ్యే ఫ్లిప్కార్ట్ బోర్డు సభ్యులు ఈ డీల్ను ఆమోదించబోతున్నారు. టర్మ్షీట్ మీద సంతకం చేసిన అనంతరం మూడు నెలల్లోపు ఈ డీల్ ప్రక్రియను ముగించాలని కంపెనీలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ రెండింటి విలీన సంస్థలో సాఫ్ట్బ్యాంకు 20 శాతం వాటాని కలిగి ఉంటుంది. ప్రాథమిక దశలో స్నాప్డీల్ బ్రాండు పేరును ఫ్లిప్కార్ట్ అలానే కొనసాగించనుంది. -
స్నాప్డీల్కు ఫ్లిప్కార్ట్ కొత్త ఆఫర్
టేకోవర్కు 900–950 మిలియన్ డాలర్లు న్యూఢిల్లీ: ఈకామర్స్ సంస్థ స్నాప్డీల్ను కొనుగోలు చేసేందుకు పోటీ దిగ్గజం ఫ్లిప్కార్ట్ తాజాగా తమ ఆఫర్ను సవరించింది. స్నాప్డీల్ ఆన్లైన్ మార్కెట్ప్లేస్తో పాటు యూనికామర్స్ సంస్థను కూడా కొనుగోలు చేసేందుకు 900–950 మిలియన్ డాలర్లు ఇస్తామంటూ ఆఫర్ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈకామర్స్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్, ఫుల్ఫిల్మెంట్ సేవల సంస్థ యూనికామర్స్ను స్నాప్డీల్ 2015లో కొనుగోలు చేసింది. ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ ఒప్పందం ఇంకా ఖరారు కాలేదని, చర్చల దశలోనే ఉందని వివరించాయి. దీనిపై సమావేశం కానున్న స్నాప్డీల్ .. మొత్తం మీద డీల్కు సుముఖంగానే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి. నగదు, తత్సమాన అసెట్స్ రూపంలో ఒప్పందం తుది మొత్తం చెల్లింపులకు సంబంధించి చివర్లో స్వల్ప మార్పులు, చేర్పులేమైనా ఉండొచ్చని ఆయా వర్గాలు తెలిపాయి. నిధుల కొరతతో కటకటలాడుతున్న స్నాప్డీల్ను కొనేందుకు ఫ్లిప్కార్ట్ ముందు 1 బిలియన్ డాలర్ల దాకా ఇవ్వజూపినప్పటికీ.. మదింపు ప్రక్రియ అనంతరం 800–850 మిలియన్ డాలర్ల దాకా (సుమారు రూ. 5,500 కోట్లు) ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే, స్నాప్డీల్ దీన్ని తిరస్కరించడంతో తాజాగా సవరించిన ఆఫర్ మరొకటి ఇచ్చింది. ఒకవేళ స్నాప్డీల్ బోర్డు గానీ దీనికి అంగీకరిస్తే తుది విక్రయ, కొనుగోలు ఒప్పందంపై ఇరు పక్షాలు చర్చలు జరుపుతాయి. అటు స్నాప్డీల్ మొబైల్ చెల్లింపుల విభాగం ఫ్రీచార్జ్, సరకు రవాణా వ్యాపార విభాగం వల్కన్ ఎక్స్ప్రెస్ల విక్రయానికి కూడా వేర్వేరుగా డీల్స్ కుదుర్చుకోవడంపై కసరత్తు చేస్తోంది. -
ఫ్లిప్కార్ట్కు షాకిస్తున్న స్నాప్డీల్
న్యూఢిల్లీ : ఈ-కామర్స్ మార్కెట్లో దిగ్గజ కంపెనీగా ఉన్న ఫ్లిప్కార్ట్ ఆఫర్ను తిరస్కరించి, మరో కంపెనీకి చేయి అందిస్తోంది స్నాప్డీల్. కొనుగోలుకు తక్కువ విలువ కడుతున్న ఫ్లిప్కార్ట్ ఆఫర్కు నో చెప్పిన స్నాప్డీల్, ఇక ఫ్లిప్కార్ట్కు అమ్మడం కంటే, మరో కంపెనీతో జతకట్టడమే మంచిదని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పబ్లిక్గా లిస్టు అయిన ఒకే ఒక్క ఈ-కామర్స్ కంపెనీగా పేరున్న ఇన్ఫీబీమ్తో స్నాప్డీల్ విలీన చర్చలు జరుపుతున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ఈ రెండింటి మధ్య డీల్ 1 బిలియన్ డాలర్ల(రూ.6446కోట్లకు పైగా)కు కుదురుతున్నట్టు కూడా తెలిపాయి. గతవారమే ఫ్లిప్కార్ట్ ఆఫర్ చేసిన 700-750 మిలియన్ డాలర్ల డీల్ను స్నాప్డీల్ బోర్డు తిరస్కరించింది. ఆ ఆఫర్ను స్నాప్డీల్ తిరస్కరించడంతో మరోసారి ఆ కంపెనీకి 900-950 మిలియన్ డాలర్లకు విలువకట్టాలని మరోవైపు నుంచి ఫ్లిప్కార్ట్ చూస్తోంది. కానీ స్నాప్డీల్, ఇన్ఫీబీమ్తో చర్చలు సాగిస్తోంది. ప్రస్తుతం ఇన్ఫీబీమ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6106 కోట్లగా ఉంది. స్నాప్డీల్ రాకతో వీటి విలీన సంస్థ 2 బిలియన్ సంస్థగా అవతరించనుంది. అయితే ఈ డీల్లో స్నాప్డీల్ లాజిస్టిక్ బిజినెస్లు వుల్కాన్ ఎక్స్ప్రెస్(లాజిస్టిక్ విభాగం), పేమెంట్స్ ప్లాట్ఫామ్ ప్రీఛార్జ్లను కలుపడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం స్నాప్డీల్ ముందు మూడు ఆప్షన్లున్నాయని కంపెనీ సహవ్యవస్థాపకుడు, సీఈఓ కునాల్ బహల్ చెప్పారు. ఒకటి ఫ్లిప్కార్ట్తో క్లోజ్ డీల్కు ఆమోదించడం, రెండు ఇన్ఫీబీమ్తో విలీనమవ్వడం లేదా స్వతంత్ర సంస్థగా ఉండటానికి వుల్కాన్ ఎక్స్ప్రెస్, ఫ్రీఛార్జ్లను వంటి ఆస్తులను అమ్మేసి నిధులు సేకరించడం అని ఆయన చెప్పారు. ఫ్లిప్కార్ట్ ఆఫర్ చేస్తున్న ఆఫర్కు మెజార్టీ, మెనార్టీ షేర్హోల్డర్స్ మధ్య ఆమోదం రాకపోవడంతో ఇది తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే. తాజాగా ఇన్ఫీబీమ్తో జరుపుతున్న తాజా చర్చలు షేర్హోల్డర్స్ ఆమోదిస్తున్నారో లేదో ఇంకా స్పష్టంకాలేదు. -
స్నాప్డీల్కి ఫ్లిప్కార్ట్ మరో ఆఫర్!!
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ ఈ–కామర్స్ సంస్థ ‘ఫ్లిప్కార్ట్’.. స్నాప్డీల్కు అతిత్వరలోనే మరొక ఆఫర్ను ప్రకటించే అవకాశముంది. కాగా ఫ్లిప్కార్ట్ 800–850 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.5,500 కోట్లు) కొనుగోలు ప్రతిపాదనను స్నాప్డీల్ బోర్డు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. ఫ్లిప్కార్ట్ ఆఫర్... కంపెనీ వాస్తవ విలువ కన్నా తక్కువగా ఉందని స్నాప్డీల్ పేర్కొంది. కాగా కొత్త ఆఫర్ 1 బిలియన్ డాలర్లకు దగ్గరగా ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. తొలి ఆఫర్ తిరస్కరణ నేపథ్యంలో ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ మధ్య మళ్లీ చర్చలు జరుగుతున్నాయి. ఇవి ఇంకా కొలిక్కి రాలేదు. ఒకవేళ అన్ని కుదిరితే డీల్ ఒక నెలలోనే పూర్తయ్యే అవకాశముంది. కాగా ఈ అంశాలపై అటు స్నాప్డీల్, సాఫ్ట్బ్యాంక్ కానీ, ఇటు ఫ్లిప్కార్ట్ కానీ స్పందించలేదు. కాగా స్నాప్డీల్.. ఫ్రీచార్జ్ (మొబైల్ వాలెట్ విభాగం), వుల్కాన్ ఎక్స్ప్రెస్ (లాజిస్టిక్ విభాగం) విక్రయానికి సంబంధించి ప్రత్యేకమైన మంతనాలు జరుపుతోంది. ఈ డీల్స్ కూడా వచ్చే కొన్ని వారాల్లో పూర్తయ్యే అవకాశముంది. ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ డీల్ ఓకే అయితే ఇది దేశీ ఈ–కామర్స్ రంగంలో అతిపెద్ద విలీనంగా అవతరించనుంది. -
అలా కాదు.. ఇంకో మాట చెప్పండి!!
మరికాస్త వేల్యుయేషన్ కోసం ఫ్లిప్కార్ట్తో స్నాప్డీల్ చర్చలు న్యూఢిల్లీ: ఆన్లైన్ షాపింగ్ సంస్థ స్నాప్డీల్ను ఫ్లిప్కార్ట్ కొనుగోలు చేసే అంశంపై ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. మరింత అధిక వేల్యుయేషన్ కట్టడంపై ఇరు సంస్థలు చర్చిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ముందుగా 1 బిలియన్ డాలర్లు ఆఫర్ చేసిన ఫ్లిప్కార్ట్ ఆ తర్వాత అన్ని అంశాలు మదింపు చేసుకున్న తర్వాత దాన్ని 850 మిలియన్ డాలర్లకు తగ్గించిన సంగతి తెలిసిందే. దీన్ని స్నాప్డీల్ బోర్డు తిరస్కరించింది. ముందుగా చెప్పిన 1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్కు తగ్గట్లుగా అదనంగా 150–200 మిలియన్ డాలర్ల విలువ కోసం ప్రస్తుతం ఇరు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ పూర్తయితే దేశీ ఈ–కామర్స్ విభాగంలో ఇదే అత్యంత భారీ ఒప్పందం కానుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్లతో తీవ్ర పోటీలో స్నాప్డీల్ గణనీయంగా వెనుకబడిపోయింది. 2016 ఫిబ్రవరిలో 6.5 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్తో నిధులు సమీకరించిన స్నాప్డీల్ విలువ ప్రస్తుతం గణనీయంగా తగ్గిపోయింది. కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన సాఫ్ట్బ్యాంక్ ఇప్పటికే 1 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులను రైటాఫ్ చేసేసి.. స్నాప్డీల్ను ఫ్లిప్కార్ట్కు విక్రయించేందుకు మిగతా ఇన్వెస్టర్ల మద్దతు సమీకరించింది. -
ఫ్లిప్కార్ట్ ఆఫర్ తిరస్కరించిన స్నాప్డీల్
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ కంపెనీలు ఫ్లిప్కార్ట్–స్నాప్డీల్ల మధ్య జరగాల్సిన డీల్ విఫలమయ్యింది. స్నాప్డీల్ను కొనుగోలు చేసేందుకు ప్రత్యర్థి కంపెనీ ఫ్లిప్కార్ట్ ఇచ్చిన 80–85 కోట్ల డాలర్ల (దాదాపు రూ. 5,500 కోట్లు) ఆఫర్ను స్నాప్డీల్ బోర్డు తిరస్కరించింది. టేకోవర్ చేసేందుకు స్నాప్డీల్ను పరిశీలించే ప్రక్రియను ఇటీవల పూర్తిచేసిన ఫ్లిప్కార్ట్ ఆఫర్ చేసిన మొత్తానికి స్నాప్డీల్ అంగీకరించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. కంపెనీ వాస్తవ విలువకంటే ఈ ఆఫర్ తక్కువని స్నాప్డీల్ బోర్డు భావించినట్లు ఆ వర్గాలు వివరించాయి. అయితే ఈ తొలి ఆఫర్ తిరస్కరణకు గురైనప్పటికీ, ఈ అంశమై చర్చలు కొనసాగుతున్నాయన్నది సమాచారం. ఈ అంశమై స్నాప్డీల్, సాఫ్ట్బ్యాంక్, ఫ్లిప్కార్ట్లను సంప్రదించగా వ్యాఖ్యానించేందుకు నిరాకరించాయి. స్నాప్డీల్లో ప్రధాన వాటాదారు అయిన సాఫ్ట్బ్యాంక్ ఈ డీల్ కోసం గత కొద్దినెలలుగా ప్రయత్నాలు జరుపుతోంది. స్నాప్డీల్ వ్యవస్థాపకులు కూనల్ బెహెల్, రోహిత్ బన్సాల్లు కూడా బోర్డులో వున్నారు. ఈ డీల్ జరిగితే ఇండియా ఈ–కామర్స్ రంగంలో అతిపెద్ద టేకోవర్ అవుతుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ల పోటీతో కొద్ది నెలలుగా స్నాప్డీల్ వ్యాపారం తగ్గుతూ వస్తోంది. 2016 ఫిబ్రవరిలో స్నాప్డీల్ను 650 కోట్ల డాలర్లకు విలువకడుతూ పెట్టుబడులు రాగా, తాజా ఫ్లిప్కార్ట్ ఆఫర్ ప్రకారం 100 కోట్ల డాలర్లలోపునకు విలువ తగ్గడం గమనార్హం. -
ఫ్లిప్కార్ట్, స్నాప్ ’డీల్’ కు ప్రేమ్జీ బ్రేక్!
♦ చిన్న ఇన్వెస్టర్లకు చెల్లింపులపై ♦ ప్రేమ్జీ ఇన్వెస్ట్ అభ్యంతరాలు ♦ డీల్ స్వరూపంపై స్పష్టత ♦ ఇవ్వాలంటూ స్నాప్డీల్ బోర్డుకు లేఖ ముంబై: దేశీ ఆన్లైన్ షాపింగ్ దిగ్గజాలు ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ విలీనానికి అవరోధాలు కొనసాగుతున్నాయి. స్నాప్డీల్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లకు తలో రకంగా పరిహారం లభించేలా ఉన్న డీల్ స్వరూపంపై తాజాగా ప్రేమ్జీ ఇన్వెస్ట్ సంస్థ అభ్యంతరాలు లేవనెత్తింది. దీంతో మొత్తం విలీన ఒప్పందానికే విఘాతం కలగడమో లేదా స్నాప్డీల్ వేల్యుయేషన్ను మరింతగా తగ్గించడమో జరిగే పరిస్థితి నెలకొంది. విలీన ప్రతిపాదన ప్రకారం స్నాప్డీల్లో పెట్టుబడులు పెట్టిన ప్రారంభ దశ ఇన్వెస్టర్లు కలారి క్యాపిటల్, నెక్సస్ వెంచర్ పార్ట్నర్స్కి ప్రత్యేకంగా 60 మిలియన్ డాలర్లు లభించనున్నాయి. అలాగే స్నాప్డీల్ వ్యవస్థాపకులు కునాల్ బెహల్, రోహిత్ బన్సల్కి 30 మిలియన్ డాలర్లు దక్కనున్నాయి. ఉద్యోగులకు 30 మిలియన్ డాలర్ల మేర ప్రత్యేక చెల్లింపుల రూపంలో ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఈ నెలాఖర్లోగా లేదా జూలై ప్రారంభంలో మదింపు ప్రక్రియ పూర్తి కాగలదని అంచనా. డీల్ సాకారమైతే దేశీ ఈ–కామర్స్ రంగంలో ఇదే అత్యంత భారీ ఒప్పందం కాగలదు. అయితే, స్నాప్డీల్లో కొంత మొత్తం ఇన్వెస్ట్ చేసిన ప్రేమ్జీ ఇన్వెస్ట్(ఐటీ దిగ్గజం విప్రో అధినేత అజీం ప్రేమ్జీ సంస్థ).. ఉద్యోగుల ప్యాకేజీకి ఓకే చెప్పినప్పటికీ.. ప్రారంభదశ ఇన్వెస్టర్లు, వ్యవస్థాపకులకు ఇవ్వనున్న ప్రత్యేక ప్యాకేజీపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ స్నాప్డీల్ బోర్డుకు లేఖ రాసినట్లు సమాచారం. షేర్హోల్డర్లందరికీ సమాన ప్రయోజనాలు కల్పించాలని, డీల్ నిబంధనలపై మరింత స్పష్టతనివ్వాలని ప్రేమ్జీ ఇన్వెస్ట్ సూచించింది. తాజా పరిణామాల నేపథ్యంలో స్నాప్డీల్కు అడ్వైజర్గా వ్యవహరిస్తున్న ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ క్రెడిట్ సూసీ రంగంలోకి దిగింది. డీల్ సాకారమయ్యేలా.. మైనారిటీ ఇన్వెస్టర్లలో ఏకాభిప్రాయ సాధన కోసం ప్రయత్నిస్తోంది. వేల్యుయేషన్కు మరింతగా కోత పడే అవకాశాలు.. పోటీ సంస్థలు అమెజాన్, ఫ్లిప్కార్ట్కు దీటుగా కార్యకలాపాలు విస్తరించేందుకు నిధులు సమీకరించుకోలేక స్నాప్డీల్ కొన్నాళ్లుగా గడ్డుకాలం ఎదుర్కొంటోంది. ఒకప్పుడు 6.5 బిలియన్ డాలర్ల మేర పలికిన స్నాప్డీల్ వేల్యుయేషన్ ప్రస్తుతం బిలియన్ డాలర్ల స్థాయికి పడిపోయింది. ఈ నేపథ్యంలో అందులో పెట్టుబడులున్న సాఫ్ట్బ్యాంక్ గ్రూప్.. దాన్ని ఫ్లిప్కార్ట్లో విలీనం చేసే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. స్నాప్డీల్ ఇన్వెస్టర్లంతా ఒప్పుకుంటేనే ఒప్పందంపై ముందుకెడతామంటూ ఫ్లిప్కార్ట్ షరతు విధించడంతో .. ఒప్పందంపై సాఫ్ట్బ్యాంక్ ఇతర ఇన్వెస్టర్ల మద్దతు కూడా కూడగట్టింది. తాజాగా ప్రేమ్జీ ఇన్వెస్ట్ అభ్యంతరాలతో సమస్య మరింత జటిలంగా మారనుంది. దీంతో స్నాప్డీల్ వేల్యుయేషన్ మరింత తగ్గొచ్చనేది పరిశ్రమ వర్గాల అంచనా. స్నాప్డీల్లో రతన్ టాటా, ఇంటెల్ క్యాపిటల్, బెస్సీమర్ వెంచర్ పార్ట్నర్స్, బ్లాక్రాక్, టెమాసెక్లకు వాటాలున్నాయి. -
ఇరకాటంలో పడ్డ ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ డీల్
ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ విలీనానికి అజిమ్ ప్రేమ్ జీ మెలక పెట్టారు. ఈ డీల్ తుదిఆమోదం పొందితే, మైనార్టీ షేర్ హోల్డర్స్ హక్కులను ఎలా రక్షిస్తారని ప్రేమ్ జీ పెట్టుబడుల సంస్థ ప్రశ్నించింది. ఫ్లిప్ కార్ట్ కొనాలనుకుంటున్న స్నాప్డీల్ లో విప్రో చైర్మన్ అజిమ్ ప్రేమ్ జీకి మైనార్టీ స్టేక్ ఉంది. ఈ విషయంపై మరోసారి స్పష్టమైన వివరణ ఇవ్వాలని ప్రేమ్జీ పెట్టుబడుల సంస్థ అడుగుతోంది. దీంతో ఈ డీల్ మరికొంత కాలం ఆలస్యమయ్యే అవకాశముందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కొన్ని నెలలుగా ఈ పెట్టుబడుల సంస్థ దీనిపై తమకు క్లారిటీ కావాలని అడుగుతూనే ఉంది. ఇతర మైనార్టీ ఇన్వెస్టర్ల ఆందోళనలను కూడా ఈ సంస్థ కంపెనీ బోర్డు సభ్యుల ముందు ఉంచుతోంది. అంతేకాక ఈ విలీన డీల్ లో స్నాప్ డీల్ ఇద్దరి సహవ్యవస్థాపకులకు, మరో ఇద్దరికి స్పెషల్ చెల్లింపులు చేయాలని బోర్డు సభ్యులు నిర్ణయించారు. కానీ దీనికి ప్రేమ్జీ ఇన్వెస్ట్ అడ్డుచెబుతోంది. బుధవారం స్నాప్ డీల్ బోర్డుకు రాసిన లేఖలో ఎంపికచేసిన స్నాప్ డీల్ షేర్ హోల్డర్స్, వ్యవస్థాపకులు చెల్లించే 90మిలియన్ డాలర్లు తమకు ఆమోదయోగ్యంగా లేవని, ఉద్యోగులకు చెల్లిదామనుకున్న 30 మిలియన్ డాలర్ల స్పెషల్ పేమెంట్ల ప్రతిపాదన తమకు సమ్మతమేనని ప్రేమ్జీ ఇన్వెస్ట్ పేర్కొంది. ఈ తారతమ్యంతో కూడిన పేమెంట్లు, కేవలం పెద్ద స్నాప్ డీల్ ఇన్వెస్టర్లకు, వ్యవస్థాపకులకు మాత్రమే మేలు చేకూరుతుందని ప్రేమ్ జీ ఇన్వెస్ట్ ఆందోళన వ్యక్తంచేస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థను తక్కువ విలువ కట్టి, ఫ్లిప్ కార్ట్ కు అమ్మబోతున్నారు. ఒకప్పుడు 40వేల కోట్లతో స్నాప్ డీల్ ను కొనడానికి ముందుకొచ్చిన సంస్థలు, తర్వాత దానిలో పావు శాతం ఇవ్వడానికి కూడా సముఖత వ్యక్తంచేయలేదు. దీంతో స్నాప్ డీల్ సంస్థకు తక్కువ విలువ కట్టి ఫ్లిప్ కార్ట్ కు అమ్మేస్తున్నారు. ఈ డీల్ ను జూన్ వరకు ముగించేయాలని స్నాప్ డీల్ అతిపెద్ద వాటాదారు అయిన సాఫ్ట్ బ్యాంకు నిర్ణయించింది. కానీ ఈ ప్రక్రియ మరికొంత కాలం ఆలస్యమయ్యేటట్టు కనిపిస్తోంది. ప్రేమ్జీ ఇన్వెస్ట్ తో పాటు రతన్ టాటా, ఫాక్స్ కాన్, అలీబాబా గ్రూప్, ఆంటారియో టీచర్స్ పెన్షన్ ప్లాన్, ఈబే, హాంకాంగ్ ఆధారిత హెడ్జ్ ఫండ్స్ స్నాప్ డీల్ లో ఇన్వెస్టర్లుగా ఉన్నాయి. వీరందరూ 40 శాతం కలిగి ఉన్నారు. కానీ వీరు బోర్డు బాధ్యతను నిర్వర్తించడం లేదు. -
ఫ్లిప్కార్ట్లో విలీనంతో స్నాప్డీల్ ఉద్యోగులకు పండుగే!
రూ.193 కోట్ల బొనాంజా ప్రకటించనున్న స్నాప్డీల్ వ్యవస్థాపకులు! న్యూఢిల్లీ: సాధారణంగా ఏదైనా కంపెనీని వేరొక కంపెనీకి అమ్మేస్తున్నారంటే.. అక్కడి ఉద్యోగుల్లో గుబులు, ఆందోళన అనేవి సహజమే. అయితే, ఫ్లిప్కార్ట్లో త్వరలో విలీనం అయ్యే అవకాశం ఉన్న ఈ–కామర్స్ సంస్థ స్నాప్డీల్ సిబ్బందికి మాత్రం పంట పండనుంది. ఈ డీల్ కనుక సాకారం అయితే, తమకు లభించనున్న పారితోషికం(పేఅవుట్)లో సగాన్ని(3 కోట్ల డాలర్లు–దాదాపు రూ.193 కోట్లు) తమ సిబ్బందికి పంచేయాలని కంపెనీ వ్యవస్థాపకులు(కునాల్ బహల్, రోహిత్ బన్సల్) నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు తగిన చెల్లింపు స్కీమ్ను రూపొందించాల్సిందిగా స్నాప్డీల్ డైరెక్టర్ల బోర్డుకు వ్యవస్థాపకులు సూచించారని.. విలీన ఒప్పందం విషయంలో సిబ్బందికి ఎలాంటి ఇబ్బందీ ఉండదన్న భరోసా కల్పించేందుకే ఈ ప్రతిపాదన చేసినట్లు ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం స్నాప్డీల్లో 1,500–2000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు అంచనా. కాగా, గడిచిన ఏడాది కాలంలో కంపెనీని వీడిన కొంతమంది సీనియర్ ఎగ్జిక్యూటివ్లకు కూడా ఈ చెల్లింపు స్కీమ్తో ప్రయోజనం లభించనుంది. గతంలో వారికి ఇచ్చిన ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్స్(ఎసాప్స్)కు అనుగుణంగా తగిన మొత్తాన్ని చెల్లించేలా చూడాలని వ్యవస్థాపకులు భావిసున్నారు. స్నాప్డీల్లో మెజారిటీ వాటాదారు అయిన జపాన్ దిగ్గజం సాఫ్ట్బ్యాంక్.. ఫ్లిప్కార్ట్లో విలీనం చేసేందుకు స్నాప్డీల్లోని మిగతా ఇన్వెస్టర్లందర్నీ ఇప్పటికే ఒప్పించింది. దీంతో అతిత్వరలోనే ఈ విలీన డీల్ను ప్రకటించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. విలీనానికి స్నాప్డీల్ వ్యవస్థాపకులు కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. విలీన డీల్ ద్వారా వ్యవస్థాపకులకు 6 కోట్ల డాలర్ల నగదు మొత్తం లభిస్తుందని అంచనా. కాగా, ప్రస్తుతం స్నాప్డీల్లో సాఫ్ట్బ్యాంక్కు 30 శాతం వాటా ఉంది. మిగతా ఇన్వెస్టర్లలో నెక్సస్ వెంచర్ పార్ట్నర్స్కు 10 శాతం, కలారి క్యాపిటల్కు 8 శాతం చొప్పున వాటాలున్నాయి. అమెరికా ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్తో పాటు దేశీ అగ్రగామి ఫ్లిప్కార్ట్తో పోటీలో స్నాప్డీల్ వెనుకపడటమే కాకుండా.. ఇటీవల ఆర్థికపరమైన ఇబ్బందుల్లో కూడా కూరుకుపోయిన సంగతి తెలిసిందే. 2016 ఫిబ్రవరిలో దాదాపు 6.5 బిలియన్ డాలర్లమేర విలువ(వేల్యుయేషన్)ఉన్న స్నాప్డీల్కు... ఇప్పుడు ఫ్లిప్కార్ట్తో విలీనం డీల్లో కేవలం 1 బిలియన్ డాలర్ల మేర మాత్రమే విలువ దక్కుతుందని అంచనా వేస్తున్నారు. -
గతవారం బిజినెస్
సాఫ్ట్బ్యాంక్ పెట్టుబడులు ఆవిరి జపాన్ దిగ్గజం సాఫ్ట్బ్యాంక్ గ్రూప్కు భారత్లో పెట్టుబడులు అంతగా కలిసి రావడం లేదు. క్యాబ్ ఆగ్రిగేటర్ ఓలా, ఈకామర్స్ సంస్థ స్నాప్డీల్లో భారీగా పెట్టిన పెట్టుబడుల విలువ గణనీయంగా తరిగిపోతోంది. ఈ రెండింటిలో పెట్టిన పెట్టుబడుల విలువ ఏకంగా రూ.9 వేల కోట్ల మేర కరిగిపోయినట్లు సాఫ్ట్బ్యాంక్ వెల్లడించింది. గృహ రుణాలకు ఎస్బీఐ రేట్లు తగ్గాయ్ ఎస్బీఐ చౌక గృహ రుణ రేట్లను పావు శాతం వరకూ తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో బ్యాంక్ కొత్తగా రుణం తీసుకునే మహిళా ఉద్యోగులకు సంబంధించి అతి తక్కువగా 8.35 శాతం వడ్డీరేటును అమలు చేయనుంది. కాగా ఎస్బీఐ ఈ ఆర్థిక సంవత్సరంలో క్యాపిటల్ మార్కెట్ నుంచి ఎఫ్పీఓ లేదా క్విప్ ద్వారా నిధులు సమీకరించాలని భావిస్తోంది. ఆర్బీఐ వాచ్లిస్ట్లో ఐడీబీఐ బ్యాంక్ ఎన్పీఏలు భారీగా పేరుకుపోయిన నేపథ్యంలో ఐడీబీఐ బ్యాంకు విషయంలో సత్వర దిద్దుబాటు చర్యలకు ఆర్బీఐ ఉపక్రమించింది. దీంతో కొత్త రుణాలు మంజూరు చేయడం, డివిడెండ్ పంపిణీ తదితర కార్యకలాపాలపై పరిమితులు అమల్లోకి రానున్నాయి. తమ సంస్థలో అధిక ఎన్పీఏలు, ఆస్తులపై రాబడులు ప్రతికూలంగా ఉండటం వంటి అంశాల కారణంగా ఆర్బీఐ మే 5న సత్వర దిద్దుబాటు చర్యలు ప్రారంభించినట్లు ఐడీబీఐ బ్యాంకు వెల్లడించింది. ఈక్విటీ ఎంఎఫ్ల్లోకి నిధుల ప్రవాహం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి ఏప్రిల్ నెలలో రూ.9,429 కోట్లమేర పెట్టుబడులు వచ్చాయి. ఇది నాలుగు నెలల గరిష్ట స్థాయి. రిటైల్ ఇన్వెస్టర్లు ఎక్కువ ఆసక్తి చూపడం సహా ఫండ్ హౌస్లు మ్యూచువల్ ఫండ్స్ గురించి ప్రజల్లో అవగాహన పెంచడం కోసం తీసుకున్న పలు చర్యలు ఇన్వెస్ట్మెంట్ల పెరుగుదలకు కారణంగా ఉన్నాయి. సత్యం కేసులో సెబీ ఉత్తర్వులు చెల్లవు: శాట్ సత్యం కంప్యూటర్స్ కేసుకు సంబంధించి దాని వ్యవస్థాపకుడు బి.రామలింగరాజుతో సహా మరి కొందరికి వ్యతిరేకంగా సెబీ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్) తోసిపుచ్చింది. ‘‘సెబీ ఉత్తర్వులు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి వాటిని తోసిపుచ్చుతున్నాం. నాలుగు నెలల్లో తాజా ఉత్తర్వులివ్వాల్సిందిగా సెబీని ఆదేశిస్తున్నాం’’ అని శాట్ స్పష్టం చేసింది. కాగా రామలింగరాజు తదితరులు ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారని, మోసపూరిత కార్యకలాపాలకు దిగారని సెబీ ఇచ్చిన ఉత్తర్వులతో శాట్ కూడా ఏకీభవించింది. ఐఐపీ, టోకు ధరల బేస్ ఇయర్ల మార్పు.. దేశ స్థూల ఆర్థిక గణాంకాలను కేంద్రం విడుదల చేసింది. ఇందులో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) లెక్కలు మార్చి నెలవి కాగా, టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం, వినియోగ ధరల సూచీ ఆధారిత (రిటైల్) ద్రవ్యోల్బణం అంకెలు ఏప్రిల్కు సంబంధించినవి. ఐఐపీ, టోకు ద్రవ్యోల్బణాలకు సంబంధించి బేస్ ఇయర్ను మార్చడం గణాంకాల్లో ప్రత్యేకాంశం. ఇంతక్రితం ఈ రెండు సూచీలకు బేస్ ఇయర్గా 2004–05గా ఉండేది. ఈ బేస్ ఇయర్ తాజాగా 2011–12గా మారింది. రిటైల్ ద్రవ్యోల్బ ణానికి ఇప్పటికే 2011–12 బేస్ ఇయర్గా అమలవుతోంది. డీల్స్.. రూ.1,600 కోట్లతో కొనుగోలు చేసిన లాయిడ్ కన్సూమర్ డ్యూరబుల్ బిజినెస్ డివిజన్ విలీన ప్రక్రియ పూర్తయినట్లు దేశీ ఎఫ్ఎంసీజీ దిగ్గజం హావెల్స్ ఇండియా ప్రకటించింది. ఇంజినీరింగ్ సర్వీసుల కంపెనీ టాటా టెక్నాలజీస్.. ఇసెం డా ఇంజినీరింగ్ ఏబీ కంపెనీని కొనుగోలు చేయనుంది. డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎమ్, ముంబైకి చెందిన ఈవెంట్స్, ప్రోపర్టీస్కు సంబంధించి టికెటింగ్ ప్లాట్ఫార్మ్ సంస్థ ఇన్సైడర్డాట్ఇన్లో మెజారిటీ వాటా కొనుగోలు కోసం 3 కోట్ల డాలర్లు (రూ.193 కోట్లు) వెచ్చించనుందని సమాచారం. వీడియోకాన్ డీ2హెచ్ను విలీనం చేసుకోవడానికి డిష్ టీవీ కంపెనీకి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నుంచి ఆమోదం లభించింది. -
స్నాప్‘డీల్ ’కు ఇన్వెస్టర్లు సై
ఇక ఫ్లిప్కార్ట్కు విక్రయించటం లాంఛనమే! ► ఎట్టకేలకు నెక్సస్ వెంచర్స్ను ఒప్పించిన సాఫ్ట్బ్యాంక్ ► డీల్ ప్రకారం వ్యవస్థాపకులకు చెరో 30 మిలియన్ డాలర్లు ► నెక్సస్కు 80 మిలియన్ డాలర్లు; కలారికి 70–80 మిలియన్ డాలర్లు న్యూఢిల్లీ: ఈ–కామర్స్ సంస్థ స్నాప్డీల్ విక్రయం దిశగా మరో అడుగు ముందుకు పడింది. పోటీ సంస్థ ఫ్లిప్కార్ట్కు దీన్ని విక్రయించే ప్రతిపాదనకు కంపెనీలో కీలకమైన ఇన్వెస్టరు నెక్సస్ వెంచర్ పార్ట్నర్స్ (ఎన్వీపీ) ఎట్టకేలకు ఆమోదముద్ర వేసింది. ఎన్వీపీ నుంచి ఆమోదం కోసం సహ ఇన్వెస్టరు సాఫ్ట్బ్యాంక్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వ్యవస్థాపకులు, ఇంకో ఇన్వెస్టరు కలారి క్యాపిటల్ నుంచి సాఫ్ట్బ్యాంక్ ఆమోదముద్ర దక్కించుకుంది. అయితే, వేల్యుయేషన్ ఆమోదయోగ్యంగా లేకపోవడంతో ఎన్వీపీ మాత్రం అంగీకారం తెలపలేదు. దీంతో గత కొద్ది వారాలుగా ప్రతిష్టంభనను తొలగించే క్రమంలో ఎన్వీపీతో సాఫ్ట్బ్యాంక్ చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగా రెండు సంస్థల మధ్య పలు దఫాలుగా సమావేశాలు జరిగిన నేపథ్యంలో స్నాప్డీల్ విక్రయ ప్రతిపాదనకు ఎన్వీపీ ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. ఈ వారంలోనే ఫ్లిప్కార్ట్తో లాంఛనంగా ఒప్పందంపై సంతకాలు జరగొచ్చని, సాధ్యాసాధ్యాలు.. లాభనష్టాల మదింపు ప్రారంభం కావొచ్చని తెలిసింది. డీల్ ప్రకారం స్నాప్డీల్ వ్యవస్థాపకులకు చెరో 30 మిలియన్ డాలర్లు చొప్పున... అంటే దాదాపు రూ.192 కోట్ల వంతున దక్కుతాయి. ఎన్వీపీకి 80 మిలియన్ డాలర్లతో పాటు విలీన సంస్థలో కొంత వాటాలు కూడా లభిస్తాయి. మరో ఇన్వెస్టరు కలారి క్యాపిటల్కు 70–80 మిలియన్ డాలర్లు దక్కవచ్చు. అయితే, దీనిపై స్నాప్డీల్, సాఫ్ట్బ్యాంక్, ఎన్వీపీ, కలారి స్పందించలేదు. భారీగా పడిపోయిన స్నాప్డీల్ వేల్యుయేషన్ .. గతేడాది ఫిబ్రవరిలో ఆఖరుసారిగా నిధులు సమీకరించినప్పుడు 6.5 బిలియన్ డాలర్లుగా ఉన్న స్నాప్డీల్ వేల్యుయేషన్ ఇప్పుడు గణనీయంగా పడిపోయింది. ఫ్లిప్కార్ట్ గానీ కొనుగోలు చేసిన పక్షంలో 1 బిలియన్ డాలర్లుగా లెక్క కట్టే అవకాశముందని పరిశీలకుల అంచనా. స్నాప్డీల్లో సాఫ్ట్బ్యాంక్కు 30 శాతం పైగా, నెక్సస్కు సుమారు 10 శాతం, కలారికి 8 శాతం వాటాలు ఉన్నాయి. స్నాప్డీల్ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కంపెనీలో పెట్టిన పెట్టుబడులపై 2016–17లో దాదాపు 1 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 6,500 కోట్లు) నష్టం వచ్చినట్లు సాఫ్ట్బ్యాంక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
'స్నాప్డీల్-ఫ్లిప్కార్ట్' డీల్కు నెక్సస్ ఓకే
ముంబై: అతిపెద్ద ఈ -కామర్స్ విలీనానికి సిద్ధమైన జపనీస్ బ్యాంకింగ్ దిగ్గజం సాఫ్ట్ బ్యాంక్ కీలకమైన అనుమతి సాధించింది. సాఫ్ట్బ్యాంక్ కో ఇన్వెస్టర్ నెక్సస్ వెంచర్ పార్టనర్స్ (ఎన్వీపీ) ఈ మెగాడీల్కు ఒకే చెప్పింది. ఈ విక్రయ ప్రణాళికతో ముందుకు వెళ్లడానికి ఎన్వీపీతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవలే మరో ఫౌండర్ కలారీ అనుమతిని సాధించిన సాఫ్ట్ బ్యాంక్, స్నాప్డీల్ లో అతి పెద్దవాటాదారుగా ఈ అమ్మక ఒప్పందానికి మరింత చేరువైంది. ఆన్లైన్ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఈ వారంలో ఈ ఒప్పందంపై సంతకం చేసే అవకాశంది. అనంతరం వెంటనే ఈ డీల్ అమల్లోకిరానుంది. అయితే దీనిపై అధికారికంగా ఫ్లిప్కార్ట్, సాఫ్ట్బ్యాంక్ స్పందించాల్సిఉంది. తాజా నివేదికల ప్రకారం ఈ మెగాడీల్ ద్వారా స్నాప్డీల్ ఫౌండర్స్కు 25 మిలియన్ డాలర్లు దక్కనున్నాయి. మరోవైపు కొత్త సంస్థలో ఎన్వీపీ 100 మిలియన్ల డాలర్ల వాటా, కలారీకి సుమారు 70-80 మిలియన్ డాలర్లు దక్కనున్నాయి. కాగా 2016-17లో స్నాప్ డీల్ పెట్టుబడుల కారణంగా 1 బిలియన్ డాలర్లు(రూ.6,500కోట్లు) నష్టపోయినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. రెగ్యులేటరీ ఫైలింగ్స్ ప్రకారం, సాఫ్ట్బ్యాంక్ ప్రస్తుతం స్నాప్ డీల్లో 30 శాతం వాటా, నెక్సస్ సుమారు 10 శాతం వాటాను,కలారి 8 శాతం వాటాను కలిగి ఉంది. భారత ఈ కామర్స్ రంగంలో ఇది మెగాడీల్గా నిలవనుందని ,తీవ్రమైన పోటీ ఉండనుందని మార్కెట్ పండితులు విశ్లేషిస్తున్నారు. అలాగే భారత ఈ కామర్స్ రంగంపై పట్టుబిగించేందుకు భారీ పెట్టుబడులతో పావులు కదుపుతున్న అమెరికా ఈ కామర్స్ దిగ్గజం, ప్రధాన ప్రత్యర్థి అమెజాన్కు ఫ్లిప్కార్ట్ గట్టిషాక్ ఇవ్వడం ఖాయమంటున్నారు. -
సాఫ్ట్బ్యాంకుకు 9,000 కోట్లు హుష్
♦ పెట్టుబడులకు అచ్చిరాని భారత్ ♦ స్నాప్డీల్, ఓలాలో ఇన్వెస్ట్మెంట్స్తో భారీ నష్టాలు న్యూఢిల్లీ: జపాన్ దిగ్గజం సాఫ్ట్బ్యాంక్ గ్రూప్కు భారత్లో పెట్టుబడులు అంతగా కలిసి రావడం లేదు. క్యాబ్ ఆగ్రిగేటర్ ఓలా, ఈ–కామర్స్ సంస్థ స్నాప్డీల్లో భారీగా పెట్టిన పెట్టుబడులు విలువ గణనీయంగా తరిగిపోతోంది. ఈ రెండింటిలో పెట్టిన పెట్టుబడుల విలువ ఏకంగా రూ.9 వేల కోట్ల మేర కరిగిపోయినట్లు సాఫ్ట్బ్యాంక్ వెల్లడించింది. స్నాప్డీల్లో పెట్టుబడుల కారణంగా సుమారు 1 బిలియన్ డాలర్ల మేర (దాదాపు రూ. 6,500 కోట్లు) నష్టాలు చవిచూడాల్సి వచ్చినట్లు తెలిపింది. ఈ మొత్తం 2016–17లో స్నాప్డీల్లో పెట్టిన పెట్టుబడులకు దాదాపు సమానం. ‘భారత ఈ కామర్స్ మార్కెట్లో పోటీ గణనీయంగా పెరిగిపోవడంతో సంస్థ వ్యాపార పనితీరు ఆశించిన దాని కన్నా తక్కువ స్థాయిలో ఉంది’’ అని ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా సాఫ్ట్బ్యాంక్ తెలిపింది. ‘అకౌంటింగ్ విధానాలు, కరెన్సీ హెచ్చుతగ్గులు, మార్కెట్ పరిణామాలకు అనుగుణంగా పెట్టుబడుల విలువ తరచూ పెరుగుతుండటం లేదా తగ్గుతుండటం జరుగుతుంది. తాజా ఫలితాలు పూర్తి ఆర్థిక సంవత్సరం చోటుచేసుకున్న పరిణామాలను ప్రతిఫలిస్తాయి‘ అని పేర్కొంది. భారత మార్కెట్లో సుమారు 10 బిలియన్ డాలర్ల పైగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు ప్రకటించిన సాఫ్ట్బ్యాంక్... ప్రస్తుతం స్నాప్డీల్ను ఫ్లిప్కార్ట్కు విక్రయించే ప్రణాళికపై కసరత్తు చేస్తోంది. ఈ ప్రతిపాదనకు దాదాపుగా స్నాప్డీల్ బోర్డు సభ్యులందరి దగ్గర్నుంచీ మద్దతు దక్కించుకున్న సాఫ్ట్బ్యాంక్ .. మరో కీలక ఇన్వెస్టరైన నెక్సస్ వెంచర్ పార్ట్నర్స్(ఎన్వీపీ) ఆమోదం కోసం ప్రయత్నిస్తోంది. ఎన్వీపీ కూడా విక్రయ ప్రతిపాదన పట్ల సుముఖంగా మారుతున్న నేపథ్యంలో త్వరలోనే ఈ డీల్కు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సమస్యల్లో స్టార్టప్లు .. దేశీ సంస్థ ఫ్లిప్కార్ట్, అటు అమెరికన్ సంస్థ అమెజాన్ వంటి దిగ్గజాలతో పోటీపడలేక చతికిలబడిన స్నాప్డీల్ ప్రస్తుతం దేశీ ఈకామర్స్ మార్కెట్లో .. మూడో స్థానంలో ఉంది. సుమారు 6.5 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్తో స్నాప్డీల్ 2016 ఫిబ్రవరిలో నిధులు సమీకరించింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం బిలియన్ డాలర్లకే ఫ్లిప్కార్ట్కు దీన్ని విక్రయించే అవకాశాలు ఉన్నట్లు అంచనా. ఇక, సాఫ్ట్బ్యాంక్ ఇన్వెస్ట్ చేసిన మరో స్టార్టప్ ఓలా కూడా తీవ్రమైన పోటీ ఎదుర్కొంటోంది. అమెరికాకు చెందిన ప్రత్యర్థి సంస్థ ఉబెర్ భారీగా పెట్టుబడులు కుమ్మరిస్తూ దూసుకుపోతోంది. దీంతో ఓలా కూడా నిధులను కుమ్మరించక తప్పడం లేదు. భారీగా ప్రకటనలు, ప్రచార కార్యక్రమాలు, ఉద్యోగుల వ్యయాలతో 2015–16లో కన్సాలిడేటెట్ ప్రాతిపదికన ఓలా దాదాపు రూ. 2,311 కోట్ల నష్టాలు ప్రకటించింది. -
సాఫ్ట్ బ్యాంకుకు 9వేల కోట్లు హుష్ కాకి
న్యూఢిల్లీ : భారత్ లో పెట్టుబడులతో జపనీస్ దిగ్గజం సాఫ్ట్ బ్యాంకు గ్రూప్ భారీ నష్టాలను మూటగట్టుకుంది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను 1.4 బిలియన్ డాలర్లు లేదా 9000 కోట్లకు పైగా నష్టాలు వచ్చినట్టు ఈ గ్రూప్ బుధవారం పేర్కొంది. ముఖ్యంగా దేశీయ స్టార్టప్స్ స్నాప్ డీల్, ఓలా కంపెనీ వల్ల సాఫ్ట్ బ్యాంకుకు ఈ మేర నష్టాలొచ్చినట్టు తెలిసింది. సబ్సిడరీలు, అసోసియేట్ల షేర్లు విలువ నష్టాలతో 2017 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 1 బిలియన్ మేర కంపెనీకి నష్టాలొచ్చాయని సాఫ్ట్ బ్యాంకు వెల్లడించింది. దానిలో స్నాప్ డీల్ మాతృ సంస్థ జాస్పర్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ షేర్లు కలిగి ఉన్న స్టార్ ఫిష్ ఐ పీటీఈ లిమిటెడ్ ముఖ్యమైందని తెలిపింది. అంతేకాక భారత్ లో తన రెండో అతిపెద్ద పెట్టుబడుల సంస్థ ఓలా వల్ల కూడా 400 మిలియన్ డాలర్లు నష్టపోయినట్టు పేర్కొంది. దీంతో స్నాప్ డీల్, ఓలా వల్ల ఫేర్ వాల్యు వద్ద 1.4 బిలియన్ డాలర్ల నష్టాలను నమోదుచేసినట్టు వెల్లడించింది. భారత్ లో ఈ-కామర్స్ మార్కెట్లో నెలకొన్న తీవ్రమైన పోటీ, అంచనావేసిన దానికంటే మరింత తక్కువగా స్నాప్ డీల్ ప్రదర్శన ఉందని సాఫ్ట్ బ్యాంకు ఓ ప్రకటన విడుదల చేసింది. స్నాప్ డీల్ అత్యల్ప ప్రదర్శనతో స్టార్ ఫిష్ నికర ఆస్తి విలువ తగ్గిపోయినట్టు ఈ టెలికమ్యూనికేషన్ దిగ్గజం పేర్కొంది. దేశీయ స్టార్టప్ ఎకో సిస్టమ్ లో సాఫ్ట్ బ్యాంకు అతిపెద్ద ప్రైవేట్ ఇన్వెస్టర్. ఇప్పటివరకు 2 బిలియన్ డాలర్లకు పైగా(12,911 కోట్లకు పైగా) పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం స్నాప్ డీల్ ను దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కు విక్రయించాలని ప్రయత్నాలు సాగుతున్నాయి. స్నాప్ డీల్ లో సాఫ్ట్ బ్యాంకు 900 మిలియన్ డాలర్ల(5,810కోట్లు) పెట్టుబడులు పెట్టింది. ఈ ఏడాది మొదట్లో కూడా స్నాప్ డీల్, ఓలాల వల్ల 350 మిలియన్ డాలర్ల నష్టాలు వచ్చినట్టు సాప్ట్ బ్యాంకు తెలిపిన సంగతి తెలిసిందే. -
ఇరకాటంలో పడ్డ స్నాప్ డీల్
న్యూఢిల్లీ : ఇప్పటికే నిధుల రాక తీవ్ర సంక్షోభంలో కొనసాగుతున్న దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం స్నాప్డీల్ ఇప్పుడు మరో ఇరకాటంలో పడింది. స్నాప్డీల్ సీఈవో కునాల్ బహల్, మరో ఇద్దరు ఎగ్జిక్యూటివ్లపై క్రిమినల్ ఫిర్యాదు దాఖలైంది. దీనిపై వారికి కోర్టు సమన్లు పంపింది. ఈ-ప్లాట్ఫామ్ ద్వారా కొనుగోలుదారులను, విక్రయదారులను కనెక్ట్ చేసే ఐడియాను అనధికారికంగా స్నాప్ డీల్ సంస్థ, దాని అధికారులు వాడుకుంటున్నారంటూ గౌరవ్ దువా అనే వ్యాపారవేత్త ఆరోపించారు. ఈ ఆరోపణలు చేస్తూ స్నాప్ డీల్, ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్లపై క్రిమినల్ ఫిర్యాదు దాఖలు చేశారు. నాన్-ఇన్వెంటరీ మార్కెట్ ప్లేస్ మోడల్ ఐడియా తనదేనని వ్యాపారవేత్త చెప్పారు. ఐపీసీ సెక్షన్లు 420 మోసం, 406 నమ్మకానికి భంగం కలిగించడం, 120బీ నేరపూరిత కుట్ర కింద తన ఫిర్యాదును దాఖలు చేశారు. అయితే ఈ కేసును ట్రయల్ కోర్టు తోసిపుచ్చగా.. సెషన్స్ కోర్టులో రివిజన్ పిటిషన్ ను ఆ వ్యాపారవేత్త వేశారు. ఈ ఫిర్యాదుకు సంబంధించి, సంస్థ సీఈవో కునాల్కి, సీఓఓ రోహిత్ బన్సాల్, మాజీ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ విజయ్ అజ్మేరాకు అడిషనల్ సెషన్స్ జడ్జి ఆర్కే త్రిపాఠి నోటీసులు జారీచేశారు. ఫిర్యాదు ప్రకారం దువా, ఇంజనీర్, వ్యాపారవేత్త. 1999లో మార్కెట్స్ఢిల్లీ.కామ్ ను, 2005లో ఇండియారిటైల్.కామ్ ను స్థాపించారు. డిజిటల్ టెక్నాలజీ ప్రయోజనాలను రిటైల్ కమ్యూనిటీకి అందించడానికి ఆయన వీటిని తీసుకొచ్చారు. అయితే నాన్-ఇన్వెంటరీ హోల్డింగ్ మార్కెట్ ప్లేస్ మోడల్ ను తీసుకొచ్చిన తనని, స్నాప్డీల్ అధికారులు మోసం చేశారని ఆరోపించారు. తన బిజినెస్లలో పెట్టుబడులు పెడుతూ తనని చీట్ చేసినట్టు పేర్కొన్నారు. -
ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ విలీనమైతే ఎవరికి లాభం?
న్యూఢిల్లీ: ఈ కామర్స్లో పోటీ పోటీగా దూసుకుపోతున్న ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ సంస్థలు ఒకదానిలో ఒకటి విలీనం అవుతాయా? అదే జరిగితే ఎవరికి ఎక్కువ లాభం ? ఎవరికి తక్కువ లాభం ? రెండింటికి లాభమేనా? ఇప్పటికే భారత్లో ‘ఈ బే’ను కొనేసిన ఫ్లిప్కార్ట్ తనకంటె వెనకబడిన స్నాప్డీల్ను కొనేందుకు ముందుకు వస్తుందా? గత కొన్ని రోజులుగా ఈ రెండు సంస్థలు కలసిపోతున్నాయన్న వార్తలు వినిపిస్తుండడంతో మార్కెట్ వర్గాల్లో ఇలాంటి సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. భారత ఈ మార్కెట్ రంగంలో అమెరికా దిగ్గజ సంస్థ అమెజాన్ దూసుకుపోతున్న నేపథ్యంలో మార్కెట్లో సుస్థిర స్థానాన్ని సాధించుకోవాలంటే ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ సంస్థలు విలీనం కావాల్సిన అవసరం ఉంది. అమెజాన్ను ఎదుర్కోవాలంటే స్నాప్డీల్ మాతృసంస్థయిన జోసఫ్ ఇన్ఫోటెక్లో 35 శాతం వాటా కలిగిన జపాన్ సాఫ్ట్ బ్యాంక్ సహాయం ఫ్లిప్కార్ట్కు అవసరం. అధిక రెవెన్యూ కలిగిన ఫ్లిప్కార్ట్కు మార్కెట్లో స్నాప్డీల్ ప్రదర్శిస్తున్న దూకుడుతత్వం కూడా అవసరమేనని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ మార్కెట్లో విపరీతమైన పోటీ నెలకొనడం వల్ల అనేక సంస్థలు ఎంత చమటోడ్చినా ఆశించిన లాభాలను అందుకోలేక పోతున్నాయి. పదేళ్ల క్రితం రంగప్రవేశం చేసిన ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ సంస్థలు ఇప్పటి వరకు లాభాలు చూపించలేకపోయాయి. ఈ రెండు సంస్థలు కలసిపోవడం వల్ల ఈ మార్కెట్లో వేడెక్కిన పోటీ వాతావరణం కొంత చల్లబడుతుందని అట్లాంటాలోని పెట్టుబడుల బ్యాంకైన ‘సన్ట్రస్ట్ రాబిన్సన్ హంప్రే’ విశ్లేషకులు చెబుతున్నారు. తమ అమ్మకాల మొత్తం విలువ (జీఎంవీ) 400 కోట్ల డాలర ్లకు (25,858 కోట్ల రూపాయలు) చేరుకుందని 2014–15 సంవత్సరంలోనే ఫ్లిప్కార్ట్ ప్రకటించగా, ఆ తర్వాత కొంతకాలానికి స్నాప్డీల్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో కునాల్ బహల్ ప్రకటించారు. అమ్మకాల మొత్తం వెలువ ఎక్కువగా ఉన్నంత మాత్రాన మార్కెట్లో సుస్థిరంగా నిలవగల పరిస్థితి ఉండదని, నిర్వహణ రెవెన్యూ ఎక్కువ ఉండడం వల్లనే నిలిదెక్కుకోవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సంవత్సరానికి ఫ్లిప్కార్ట్ ఏకంగా 1400 కోట్ల డాలర్ల పెట్టుబడులను సేకరించగా, బొత్తిగా పెట్టుబడులులేక స్నాప్డీల్ సంస్థ సతమతమవుతున్నది. ప్రజాదరణలోనూ, అంటే యాప్స్ను డౌన్లోడ్ చేసుకున్న వారి సంఖ్యలోనూ ప్లిప్కార్ట్ ఎంతో ముందుండగా, స్నాప్డీల్ వెనకబడి పోయింది. 2016 లెక్కల ప్రకారం అనుబంధ సంస్థలైన మింత్ర, జబాంగ్లను కలుపుకొని ఫ్లిప్కార్ట్ యాప్ను దాదాపు నాలుగున్నర కోట్ల మంది ఖాతాదారులు డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ విషయంలో కూడా స్నాప్డీల్ వెనకబడే ఉన్నది. రెండు సంస్థల విలీనం వల్ల ఎక్కువ ప్రయోజనం స్నాప్డీల్కే ఉన్నప్పటికీ మార్కెట్ పోటీ పరిస్థితుల దృష్ట్యా రెండు సంస్థలు విలీనం అవడమే ఉత్తమమార్గమని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
స్నాప్డీల్లో 15% వేతనాల పెంపు!
న్యూఢిల్లీ: నిధుల కొరత ఎదుర్కొంటున్న ఈ కామర్స్ దిగ్గజం స్నాప్డీల్.. ఉద్యోగుల్లో భరోసా కల్పించే ప్రయత్నాలు చేస్తోంది. ఈసారి 15 శాతం దాకా వేతనాలు పెంచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మధ్య, జూనియర్ స్థాయి ఉద్యోగుల జీతాలు సగటున 12–15 శాతం పెరగవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. సీనియర్ మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగులకు పెంపు 9–12 శాతంగా ఉండొచ్చని... అసాధారణ పనితీరు కనపర్చిన వారికి 20–25 శాతం దాకా ఉండగలదని వివరించాయి. పే రివిజన్ ఏప్రిల్ 1 నుంచి వర్తింపచేయవచ్చని సమాచారం. ఉద్యోగులకు షేర్లు కూడా... కంపెనీ షేర్లలో 1 శాతాన్ని సుమారు 150 మంది ఉద్యోగులకు పంపిణీ చేయవచ్చని స్నాప్డీల్ వర్గాలు తెలియజేశాయి. స్నాప్డీల్ ఈ–కామర్స్ కార్యకలాపాల్లో 3,000 మంది పైచిలుకు ఉద్యోగులున్నారు. ఇది కాకుండా మొబైల్ వాలెట్ (ఫ్రీచార్జ్), లాజిస్టిక్స్ (వల్కన్) కార్యకలాపాలు కూడా కంపెనీకి ఉన్నాయి. ప్రస్తుత, మాజీ ఉద్యోగులందరికీ కలిపి స్నాప్డీల్లో ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ రూపంలో 5–6 శాతం వాటాలున్నాయి. అత్యధికంగా పెట్టుబడులున్న సాఫ్ట్బ్యాంక్ సంస్థ.. నిధుల కొరత ఎదుర్కొంటున్న స్నాప్డీల్ను విక్రయించే యత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే. వేల్యుయేషన్పై ఏకాభిప్రాయం సాధించేందుకు మిగతా భాగస్వాములైన కలారి క్యాపిటల్, నెక్సస్ వెంచర్ పార్ట్నర్స్తో కూడా సాఫ్ట్బ్యాంక్ చర్చలు జరుపుతోంది. ఇటీవలే 1.4 బిలియన్ డాలర్లు సమకూర్చుకున్న పోటీ సంస్థ ఫ్లిప్కార్ట్.. స్నాప్డీల్ కొనుగోలు రేసులో ముందుంది. -
'ఉద్యోగాల భద్రతే మాకు టాప్-ప్రియారిటీ'
బెంగళూరు : నిన్నమొన్నటిదాకా ఆన్ లైన్ షాపింగ్ లో మారుమోగిన స్మాప్ డీల్ పరిస్థితి ప్రస్తుతం అతలాకుతలంగా మారింది. ఆ నష్టాలను అధిగమించడానికి ప్రత్యర్థైన ఫ్లిప్ కార్ట్ కు స్నాప్ డీల్ ను అమ్మేస్తున్నారంటూ వార్తలు ఊపందుకున్నాయి. కానీ ఇప్పటివరకు దానిపై స్నాప్ డీల్ ఎలాంటి కామెంట్ చేయనప్పటికీ, ఉద్యోగులు మాత్రం తమ ఉద్యోగాలపై ఆందోళన చెందుతున్నారు. అయితే ఉద్యోగుల భద్రతకు ఎలాంటి ముప్పు ఉండదని కంపెనీ వ్యవస్థాపకులు కునాల్ బహల్, రోహిత్ బన్సాల్ భరోసా ఇస్తున్నారు. కంపెనీ ఇన్వెస్టర్లు వివిధ రకాల ఆప్షన్లపై చర్చలు సాగిస్తున్నప్పటికీ.. తాము మాత్రం జాబ్ సెక్రురిటీకే టాప్-ప్రియారిటీ ఇస్తామని చెప్పారు. ఉద్యోగాలకు భరోసా ఇస్తూ ఈ మేరకు ఓ ఈ-మెయిల్ ను ఆదివారం బహల్, స్నాప్ డీల్ ఉద్యోగులకు పంపారు. ''మేము చేయగలిగిందంతా చేస్తాం.. అంతకంటే ఎక్కువ చేయడానికైనా మేము సిద్ధమే. ఇన్వెస్టర్లతో కలిసి పనిచేసేటప్పుడు, ఎంప్లాయిమెంట్లో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూసుకుంటాం'' అని ఈ-మెయిల్ లో తెలిపారు. గత రెండు నెలలుగా కంపెనీ భవితవ్యంపై ఉద్యోగుల్లో నెలకొన్న అనిశ్చితిపై వ్యవస్థాపకులు భరోసా కల్పిస్తూ స్పందించడం ఇది మూడోసారి. వచ్చే రెండు వారాల్లో ఇంక్రిమెంట్లు ప్రకటించబోతున్నట్టు కూడా వ్యవస్థాపకులు పేర్కొన్నారు. శరవేగంగా దూసుకెళ్తున్న ఈ-కామర్స్ మార్కెట్లో స్నాప్ డీల్ తట్టుకోలేక, నెంబర్ -2 స్థానాన్ని కోల్పోయింది. మరోవైపు ఊహాగానాలను నిజం చేస్తూ ఫ్లిప్ కార్ట్ కు స్నాప్ డీల్ అమ్మే విషయాన్ని కంపెనీ ఈ నెలలోనే ప్రకటించబోతుందట. -
అమ్మకానికి ఫ్రీచార్జ్ రేసులో పేటీఎమ్ !
ముంబై: స్నాప్డీల్కు చెందిన మొబైల్ వాలెట్ ప్లాట్ఫార్మ్ ఫ్రీచార్జ్ను సాఫ్ట్బ్యాంక్ విక్రయించనున్నదని సమాచారం. దీనికి సంబంధించి కొన్ని సంస్థలతో సాఫ్ట్బ్యాంక్ చర్చలు జరుపుతోందని డీల్ విలువ 15–20 కోట్ల డాలర్ల రేంజ్లో ఉండొచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. స్నాప్డీల్ను మరో ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ కంపెనీ ఫ్లిప్కార్ట్కు సాఫ్ట్బ్యాంక్ విక్రయించనున్నదన్న వార్తల నేపథ్యంలో ఫ్రీచార్జ్ విక్రయ వార్తలు రావడం విశేషం. కాగా అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆలీబాబా యాజమాన్యంలోని పేటీఎమ్ సంస్థ ప్రీచార్జ్ ను కొనుగోలు చేయొచ్చని సమాచారం. రెండేళ్ల క్రితం ప్రీచార్జ్ను స్నాప్డీల్ మాతృసంస్థ జాస్పర్ ఇన్ఫోటెక్ 40 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. గత ఏడాది కాలంలో నిధుల కోసం ఫ్రీచార్జ్ సంస్థ అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు పేపాల్, పేయూలతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. కాగా కొన్ని నెలల క్రితం ప్రీచార్జ్ను కొనుగోలు చేయడానికి విజయ శేఖర్ శర్మ నేతృత్వంలోని పేటీఎమ్ సంస్థ జాస్పర్ ఇన్ఫోటెక్ను సంప్రదించిందని, అప్పుడు జాస్పర్ ఇన్ఫోటెక్ 50 కోట్ల డాలర్లు డిమాండ్ చేసిందని సమాచారం. ఒక దశలో ప్రీచార్జ్ విలువను 90 కోట్ల డాలర్లుగా అంచనా వేశారు. కాగా గత మూడు నెలల్లో స్నాప్డీల్, ప్రీచార్జ్లకు సంబంధించి చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు ప్రీచార్జ్ కోసం 15 కోట్ల డాలర్లనే పేటీఎమ్ ఆఫర్ చేస్తోందని సమాచారం. -
కొద్ది వారాల్లోనే స్నాప్డీల్ విక్రయ డీల్!
మద్దతు కూడగట్టే దిశగా సాఫ్ట్బ్యాంక్ న్యూఢిల్లీ: ఈ కామర్స్ సంస్థ స్నాప్డీల్ను విక్రయించే ఆలోచనతో ఉన్న జపాన్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం సాఫ్ట్బ్యాంక్ ఈ విషయమై తన ప్రయత్నాలను ముమ్మరం చేయనుంది. వచ్చే కొన్ని వారాల్లోనే నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం... మంగళవారం స్నాప్డీల్ బోర్డు భేటీ జరిగింది. కంపెనీ విక్రయ ప్రతిపాదనపై ఈ భేటీలో ఏకాభిప్రాయం కుదరలేదు. స్నాప్డీల్లో సాఫ్ట్బ్యాంకు అదిపెద్ద వాటాదారునిగా ఉంది. అయినప్పటికీ విక్రయ ప్రతిపాదనకు ఇతర డైరెక్టర్ల మద్దతును కూడగట్టాలన్న ఆలోచనతో ఉంది. స్నాప్డీల్ విక్రయంపై వచ్చే 4 నుంచి 8 వారాల్లో నిర్ణయం వెలువడుతుందని ఆ వర్గాలు తెలిపాయి. స్నాప్డీల్ను దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్కు విక్రయించొచ్చంటూ ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. పేటీఎం పేరు కూడా తెరపైకి వచ్చింది. పేటీఎంలో ప్రముఖ వాటాదారునిగా ఉన్న అలీబాబా స్నాప్డీల్లోనూ వాటా కలిగి ఉండడం గమనార్హం. -
మెగా మెర్జర్: ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ విలీనం?
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ఇ-కామర్స్ మెర్జర్కు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. అమెజాన్ నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న స్నాప్ డీల్.. మరో ఆన్లైన్ రీటైలర్ ఫ్లిప్కార్ట్ తో విలీనం కానున్నట్టు తెలుస్తోంది. ఆన్లైన్ మార్కెట్ లో ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న ఫ్లిప్కార్ట్- స్నాప్డీల్ విలీనంకానున్నాయని జాతీయ పత్రిక రిపోర్ట్ చేసింది. ఈ విలీనానికి జపనీస్ బ్యాంకింగ్ దిగ్గజం సాఫ్ట్ బ్యాంక్ సారధ్యం వహిస్తోందని నివేదించింది. ఈ మేరకు ఇరు కంపెనీలతో సంప్రదింపులు నిర్వహిస్తోందట. అలాగే ఈ విలీన సంస్థలో 1 బిలియన్ల డాలర్లను పెట్టుబడిగా పెట్టనుంది. ఈ ఉమ్మడి సంస్థకు ప్రోత్సాహాన్నిచ్చేందుకు 15 శాతం ప్రైమరీ, సెకండరీ షేర్లను కొనుగోలు చేయనుందట. అలాగే ఫ్లిప్కార్ట్లో అతిపెద్ద పెట్టుబడిదారు న్యూయార్క్ కు చెందిన టైగర్ గ్లోబల్ బిలియన్ షేర్లను విక్రయించనుంది. అయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్ సంస్థలో ఏదో ఒకదానిలో విలీనానికి స్నాప్డీల్ సుముఖంగా ఉందని, ప్రస్తుతం ఈ ప్రతిపాదన ఆరంభ దశలోనే ఉందని ఇటీవల వార్తలు హల్ చల్ చేశాయి. ఫ్లిప్కార్ట్లో పెట్టుబడులు పెట్టిన అమెరికా హెడ్జ్ ఫండ్ టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్తో స్నాప్డీల్ సహ వ్యవస్థాపకుడు కునాల్ బెహల్ సమావేశమైనట్టు కూడా వ్యాఖ్యానించాయి. ఈ వార్తలను స్నాప్డీల్ తోసిపుచ్చింది. ఇవి నిరాధారమైనవని, కంపెనీ లాభాల వైపు పురోగమిస్తోందని స్నాప్డీల్ వర్గాలు ఖండిచిన సంగతి విదితమే. మరి తాజా వార్తలపై ఎలా స్పందిస్తుందో చూడాలి. స్నాప్డీల్, ఫ్లిప్కార్ట్ మరిన్ని నిధు లు సమీకరించుకునేందుకు కష్టాలు పడుతున్నాయి. ఈ క్రమంలో నిధుల కొరతతో కుదేలవుతున్న ప్రస్తుతం 8,000 ఉద్యోగులను కలిగి ఉన్న స్నాప్డీల్ ఖర్చులు తగ్గించుకునేందుకు ఇటీవల తన ఉద్యోగుల్లో కోత పెడుతున్నట్టు సంస్థ కో ఫౌండర్ కునాల్ స్వయంగా అంగీకరించారు. పునరుద్ధరణ ప్రణాళికలో భాగంగా షాపోకు బై బై చెపుతున్నట్టు గత నెల ప్రకటించింది. నాన్ కోర్ ప్రాజెక్టులు తొలగించడంతో పాటు లాభదాయకమైన వృద్ధిపై దృష్టి పటిష్టం తదితర పునఃవ్యవస్థీకరణ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. నివేదించారు. -
ఉద్యోగం పోయినా... నిధి ఉండాలి!
♦ వివిధ రంగాల్లో తగ్గుతున్న ఉద్యోగాలు ♦ ఉన్నట్టుండి తొలగిస్తున్న ప్రైవేటు సంస్థలు ♦ తగినంత నిధి లేకుంటే ఇబ్బందుల పాలు ♦ బీమా సహా అవసర రక్షణలు తప్పనిసరి స్నాప్డీల్ 500 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్ ఇస్తున్నట్టు చెప్పేసింది. అంటే వారికి ఉద్వాసన చెప్పినట్టే!! భారీగా ఉద్యోగాలను కల్పిస్తున్న బ్యాంకింగ్, ఐటీ రంగాల్లో ఆటోమేషన్ కారణంగా అవకాశాలు తగ్గిపోతున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు డిసెంబర్ క్వార్టర్లో 4,500 మంది ఉద్యోగులను తగ్గించుకుంది. టెలికం కంపెనీలు కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అసలు ఏ రంగంలో పరిస్థితులు ఎప్పుడెలా మారతాయో తెలియని పరిస్థితి. మరి ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోతే? అప్పటి వరకు జీతంతో సాఫీగా సాగిపోతున్న ప్రయాణానికి స్పీడ్ బ్రేకర్లు ఎదురైతే...? ఆదుకునేందుకు ఓ నిధి తప్పనిసరి. ఉద్యోగం ఊడినా ఈ నిధితో మళ్లీ ఉద్యోగం వచ్చే వరకూ కుటుంబ అవసరాలు తీరాలి. అందుకే ముందుచూపుతో జాబ్ లాస్ ఫండ్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఇటువంటి ఆకస్మిక పరిణామాలను సులభంగా తట్టుకోవచ్చు. మన దేశంలో ప్రైవేటు రంగంలో ఉద్యోగం కోల్పోతే... దాదాపు ఎలాంటి రక్షణా ఉండదనే చెప్పాలి. కంపెనీ నుంచి వెళ్లిపోతే చెల్లించే సెవరెన్స్ పే కొన్ని సంస్థల్లోనే ఉంది. మేనేజ్మెంట్ నిపుణులకు ఉద్యోగం కోల్పోతే మూడు నుంచి ఆరు నెలలు, కొన్ని కంపెనీల్లో 12 నెలల వేతనాన్ని సెవరెన్స్ పే కింద చెల్లిస్తుంటారు. అయితే ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా ఎలాంటి నిబంధనలు లేవు. సంస్థను బట్టి మారుతుంటుంది. అందుకే ఇలాంటి వాటిని నమ్ముకోకుండా ఉద్యోగం లేని పరిస్థితికి సన్నద్ధంగా ఉండాలన్నది నిపుణుల సూచన. ఉద్యోగం పోతే పెట్టుబడులు, రుణాల చెల్లింపులు, కుటుంబ అవసరాలకు విఘాతం కలగని విధంగా ప్రణాళిక వేసుకోవాలి. కంటింజెన్సీ ఫండ్ (అత్యవసర నిధి) ప్రతి కుటుంబానికీ అత్యవసర నిధి ఎంతో అవసరం. కనీసం మూడు నుంచి ఆరు నెలల అవసరాలకు, బీమా చెల్లింపులు, రుణాల చెల్లింపులకు సరిపడా ఈ నిధిని సమకూర్చుకోవాలి. ఒకవేళ ఎక్కువ ఒత్తిళ్లతో కూడిన రంగంలో పనిచేస్తుంటే మాత్రం అత్యవసర నిధి ఏడాది అవసరాలను తీర్చేంత ఉండాలి. ఈ నిధిని షార్ట్ టర్మ్ డెట్ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్, బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉంచితే అవసరమైన వెంటనే వినియోగించుకోవటానికి అనువుగా ఉంటుంది. ఉద్యోగాన్ని బట్టి నిధి కంటింజెన్సీ ఫండ్ ఎంతన్నది చేస్తున్న ఉద్యోగం సీనియారిటీ, రంగాన్ని బట్టే ఉంటుంది. ఎందుకంటే జూనియర్ లెవల్ ఉద్యోగంలో ఉన్న వ్యక్తి ఆకస్మికంగా దాన్ని కోల్పోతే నెలల వ్యవధిలో తిరిగి వేరొక ఉద్యోగాన్ని సొంతం చేసుకోవడం సాధ్యమవుతుంది. అదే మధ్య స్థాయి ఉద్యోగి అయితే మూడు నుంచి నాలుగు నెలలు పట్టొచ్చు. ఇక వైస్ ప్రెసిడెంట్ లేదా మేనేజింగ్ డైరెక్టర్ వంటి సీనియర్ మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగం అయితే తిరిగి తనకు సరిపడే ఉద్యోగాన్ని సొంతం చేసుకునేందుకు ఏడాది పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. విమానయాన రంగంలోని వారైతే ఇంకా ఎక్కువే పట్టొచ్చు. అదే ఆరోగ్యరంగం, ఫార్మాలో ఉన్న వారు రోజుల వ్యవధిలోనే కొత్త ఉద్యోగాన్ని సొంతం చేసుకోగలరు. అందుకే తామున్న రంగం, ఉద్యోగ స్థాయిల ఆధారంగా తిరిగి ఉద్యోగం సంపాదించేందుకు గరిష్టంగా పట్టే కాలానికి అవసరాలను తీర్చేలా కంటింజెన్సీ ఫండ్ను సమకూర్చుకోవాలి. అత్యవసర నిధి జీవిత బీమా పాలసీ, వైద్య బీమా, ప్రమాద బీమా పాలసీ వార్షిక ప్రీమియాన్ని చెల్లించేదిగా ఉండాలి. సొంత కారు, ఇల్లు ఉంటే వాటి బీమాలను కూడా కవర్ చేసే విధంగా ఉండాలి. ఎందుకంటే ఉద్యోగం లేదు కదా అని బీమా రక్షణలు అనవసరం అయిపోవు కదా. ఒకవేళ ఉద్యోగం లేదులే అనుకుని వైద్య బీమా ప్రీమియం చెల్లించడం మానేశారనుకోండి. ఉన్నట్టుండి కుటుంబంలో ఎవరైనా ఆస్పత్రి పాలైతే ఆ భారాన్ని భరించడం తలకుమించినది అవుతుంది. అందుకే ఉద్యోగం లేకున్నా బీమా రక్షణ కొనసాగాలి. అది కూడా సరిపడినంత ఉండాలి. పెట్టుబడుల విషయంలో పునరాలోచన రిస్క్తో కూడిన పెట్టుబడులను ఉద్యోగం లేని సమయంలో సమీక్షించుకోవడం సరైనదే. ఉదాహరణకు యులిప్ పాలసీ ఉందనుకోండి. దాన్ని విక్రయించేసి నగదు చేసుకోవడం సరైనదేనని ఆర్థిక నిపుణుల సలహా. ఒకవేళ కొనసాగించదలచుకుంటే పెట్టుబడుల తీరును మార్చుకోవాలి. ఉద్యోగం లేదు గనుక రిస్క్ తగ్గించుకునేందుకు ఈక్విటీకి కేటాయింపులు తగ్గించి, డెట్కు కేటాయింపులు పెంచుకోవాలి. తిరిగి ఉద్యోగం సంపాదించిన తర్వాత మళ్లీ ఈక్విటీ కేటాయింపులు పెంచుకోవచ్చు. రుణాల్ని సమీక్షించుకోవాలి ఉద్యోగం లేకపోయినా తీసుకున్న రుణాలకు తిరిగి చెల్లింపులు ఆగకుండా కొనసాగించాలి. ఉద్యోగం లేని సమయంలో రుణం మొత్తాన్ని తీర్చేసే ఆలోచన సరైనది కాదు. ఒకవేళ ఈఎంఐ చెల్లింపులు కష్టంగా ఉంటే... రుణ కాల వ్యవధిని పెంచుకోవడం ద్వారా నెలవారీ వాయిదాను కొద్ది మేర తగ్గించుకోవచ్చు. ఇక క్రెడిట్ కార్డు రుణాలు, వ్యక్తిగత రుణాలపై వడ్డీ అధికంగా ఉండడమే కాదు, సకాలంలో చెల్లింపులు చేయకుంటే వడ్డనలు భారీగా ఉంటాయి. చెల్లింపులు కష్టమైతే తిరిగి ఉద్యోగం వచ్చే వరకు మారటోరియం విధించాలని రుణ దాతలను కోరవచ్చు. అయితే, ఇది రుణదాత ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది. కొత్తగా వేరొక రుణం తీసుకుని ప్రస్తుత రుణం తీర్చివేసే ఆలోచనలు కూడా సమంజసం కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఖర్చుల తీరు మారాలి ఉద్యోగం లేకపోయినా విచక్షణా రహిత ఖర్చులు శ్రేయస్కరం కాదు. ఈఎంఐ, బీమా ప్రీమియం, ఇంటి ఖర్చులు, పిల్లల ఫీజులు తప్పనిసరి అవసరాలు. ఇక వినోదం, రెస్టారెంట్లలో విందులు, పర్యటనలు వంటి అనవసర వ్యయాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగం పోతే బీమా...? ఉద్యోగం లేని సమయంలో రక్షణ కల్పించేందుకు వీలుగా పాలసీలున్నాయి. ఉద్యోగం ఊడితే మూడు నెలల పాటు ఖర్చులకు పరిహారం చెల్లిస్తాయి. మూడు నెలల వరకు వేతనం, నెలవారీ ఈఎంఐలకు చెల్లింపులు చేస్తాయి. కానీ వీటికి కొన్ని షరతులు కూడా విధిస్తాయి. పనితీరు బాగాలేక ఉద్యోగం కోల్పోతే పరిహారం ఇవ్వవు. మోసపూరిత ఆరోపణలపై ఉద్యోగం పోయినా పరిహారం చెల్లించవు. పైగా ఉద్యోగం పోయిన దగ్గర్నుంచి 90 రోజుల పాటు కొత్తగా ఉద్యోగం చేపట్టకూడదు. అది కూడా పాలసీ కాల వ్యవధిలో ఒక్కసారి ఉద్యోగం కోల్పోతేనే రక్షణ. రెండోసారి ఉద్యోగం పోతే బీమా కవరేజీ ఉండదు. పైగా ప్రీమియం కూడా ఎక్కువగానే ఉంటుంది కనుక ఇది అంత ఉపయోగకరం కాదన్నది ఆర్థిక సలహాదారుల సూచన. –సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం -
అమ్మకానికి స్నాప్డీల్..?
-
అమ్మకానికి స్నాప్డీల్..?
ఫ్లిప్కార్ట్, పేటీఎంతో చర్చలు ♦ సుమారు రూ.11,700 కోట్లకు ఆఫర్లు ♦ గతేడాదే 6.5 బిలియన్ డాలర్లు విలువ ♦ ఏడాది తిరక్కుండానే 80 శాతం విలువ ఆవిరి? ♦ పోటీని తట్టుకోలేకపోవటమే కారణం ♦ అదేమీ నిజం కాదు; అమ్మటం లేదు: స్నాప్డీల్ న్యూఢిల్లీ: పుష్కలంగా పెట్టుబడులతో ఒకప్పుడు దిగ్గజ ఈ కామర్స్ సంస్థలకు పోటీనిచ్చిన స్నాప్డీల్ ప్రస్తుతం నిధుల కొరతతో కుదేలవుతోంది. దీంతో స్నాప్డీల్ మాతృసంస్థ జాస్పర్ ఇన్ఫోటెక్ దీన్ని విక్రయించే ప్రయత్నాల్లో పడింది. ఇందులో భాగంగా పోటీ సంస్థలైన ఫ్లిప్కార్ట్ ఇండియా, పేటీఎం ఈ–కామర్స్తో చర్చలు జరుపుతున్నట్లు తెలియవచ్చింది. అయితే ఒకప్పుడు 6 బిలియన్ డాలర్లకు పైగా (రూ.40వేల కోట్లు) విలువ పలికిన స్నాప్డీల్కు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 1.5–1.8 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 9,750 కోట్లు– రూ. 11,700 కోట్ల దాకా) మేర మాత్రమే ఆఫర్ వస్తున్నట్లు తెలుస్తోంది. స్నాప్డీల్లో ఇన్వెస్ట్ చేసిన సాఫ్ట్బ్యాంక్ ఈ చర్చలకు సారథ్యం వహిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం చర్చలింకా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నందున డీల్ ముగిసేదాకా సాఫ్ట్బ్యాంక్ అదనంగా మరో 50 మిలియన్ డాలర్లు సమకూర్చే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఫ్లిప్కార్ట్ కన్నా కూడా పేటీఎం ఈ–కామర్స్తోనే చర్చలు కాస్త పురోగతి సాధిస్తున్నట్లు పేర్కొన్నాయి. పేటీఎంలో పెట్టుబడులున్న ఆలీబాబా టీమ్ డీల్కి సంబంధించి ఇటీవలి కాలంలో పలు సార్లు భారత్ను సందర్శించింది. ఒకవేళ నిజంగానే స్నాప్డీల్ గానీ అమ్ముడైన పక్షంలో దేశీ స్టార్టప్ వ్యాపారంలో ఇదే అతి పెద్ద డీల్ కానుంది. ఈ–కామర్స్ రంగంలో దీర్ఘకాలంలో రెండు లేదా మూడు పెద్ద సంస్థలకు మాత్రమే చోటు ఉంటుందని పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. వీటిలో ఒకటిగా అమెజాన్ ఎలాగూ ఉంటుందని పేర్కొంటున్నాయి. అత్యంత తక్కువగా ఆఫర్లు .. క్రితంసారి 2016లో నిధులు సమీకరించినప్పుడు స్నాప్డీల్ వేల్యుయేషన్ 6.5 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇది గరిష్ట వేల్యుయేషన్. అయితే ప్రస్తుతం వస్తున్న ఆఫర్లు చూస్తే.. స్నాప్డీల్ ఇప్పటిదాకా సమీకరించిన నిధుల కన్నా తక్కువ మొత్తమే కనిపిస్తోంది. మరోవైపు, చర్చలు సాగిస్తున్న పేటీఎం, స్నాప్డీల్కు సంబంధించి ఇన్వెస్టర్లపరమైన సారూప్యత ఉండటం గమనార్హం. పేటీఎంలో ఇన్వెస్టర్ అయిన చైనా దిగ్గజం ఆలీబాబాలో... సాఫ్ట్బ్యాంక్కి పెట్టుబడులున్నాయి. ఇదే సాఫ్ట్బ్యాంక్ ఇటు స్నాప్డీల్లో కూడా ఇన్వెస్ట్ చేసింది. స్నాప్డీల్ ఇప్పటిదాకా దాదాపు 2 బిలియన్ డాలర్లు సమీకరించగా.. సాఫ్ట్బ్యాంక్ సుమారు 900 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. తద్వారా అత్యధిక వాటాలు (సుమారు 35 శాతం) దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే ఇటు పేటీఎం, అటు స్నాప్డీల్ మధ్య అనుసంధానకర్తగా సాఫ్ట్బ్యాంక్ వ్యవహరిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. స్నాప్డీల్లో కలారి క్యాపిటల్, నెక్సస్ క్యాపిటల్, ఆలీబాబా గ్రూప్ మొదలైన సంస్థలు కూడా ఇన్వెస్ట్ చేశాయి. పేటీఎం ఈ–కామర్స్ ఇటీవలే 200 మిలియన్ డాలర్లు ఆలీబాబా గ్రూప్ నుంచి సమకూర్చుకుంది. అటు ఫ్లిప్కార్ట్ కూడా మళ్లీ 1 బిలియన్ డాలర్లు సమీకరించుకునేందుకు చర్చల్లో ఉంది. పోటీలో వెనక్కి...: 2015 ఆఖరు నుంచి స్నాప్డీల్ మార్కెట్ వాటాను ఫ్లిప్కార్ట్, అమెజాన్ కొల్లగొడుతూ వస్తున్నాయి. దీంతో స్నాప్డీల్ మూడోస్థానానికి పడిపోయింది. 2016 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 56 శాతం పెరిగి రూ.1,457 కోట్లకు చేరినప్పటికీ .. నష్టాలు కూడా రెట్టింపై రూ. 3,316 కోట్లకు చేరాయి. పెట్టుబడుల రాక తగ్గిపోవడంతో స్నాప్డీల్ కొన్నాళ్లుగా చేతిలో ఉన్న నగదును జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తోంది. గత 3–4 నెలలుగా సిబ్బందిని తగ్గించుకుంటూ వస్తోంది. డిస్కౌంట్లనూ, మార్కెటింగ్ వ్యయాలను కూడా గణనీయంగా తగ్గించింది. ఈ పరిణామాలతో మిగతా ఈ–కామర్స్ కంపెనీలతో పోటీపడలేక చతికిలబడుతోంది. అమ్మడం లేదు: స్నాప్డీల్ వ్యాపార విక్రయ వార్తలను స్నాప్డీల్ వర్గాలు ఖండించాయి. పేటీఎం, ఫ్లిప్కార్ట్తో చర్చలు జరుపుతున్న వార్తలను కూడా తోసిపుచ్చాయి. ఇవి నిరాధారమైనవని, కంపెనీ లాభాల వైపు పురోగమిస్తోందని స్నాప్డీల్ వర్గాలు వివరించాయి. బాకీలు తీర్చాలంటూ స్నాప్డీల్ విక్రేతలకు ఎస్బీఐ ఆదేశాలు నిర్దేశిత స్థాయికి మించి పేరుకుపోయిన రుణాల బాకీలను తీర్చేయాలంటూ స్నాప్డీల్ ప్లాట్ఫాంపై అమ్మకం లావాదేవీలు జరిపే సుమారు 100 మంది విక్రేతలకు ఎస్బీఐ సూచించింది. స్నాప్డీల్ క్యాపిటల్ అసిస్ట్ ప్రోగ్రాం కింద డ్రాయింగ్ పవర్కి మించి తీసుకున్న రుణాల బకాయిలను తగ్గించుకోవాలంటూ కొంత మంది సెల్లర్స్కు అడ్వైజరీలు పంపినట్లు ఎస్బీఐ సీజీఎం (ఎస్ఎంఈ) జీకే కన్సల్ తెలిపారు. బ్యాంక్ సాధారణంగానే స్నాప్డీల్ సెల్లర్స్ అమ్మకాలను ప్రతి క్వార్టర్లోనూ సమీక్షిస్తుందని, ఒకవేళ విక్రయాలు తగ్గిన పక్షంలో ఆ మేరకు రుణ బాకీ పరిమాణాన్ని కూడా తగ్గించుకోవాలని సూచిస్తుందని ఆయన వివరించారు. అయితే, ఇది మొండి బకాయిల అంశమేమీ కాదని పేర్కొన్నారు. విక్రేతలకు చెల్లించాల్సిన మొత్తాలను స్నాప్డీల్ డిఫాల్ట్ చేసే అవకాశం ఉందంటూ ఆలిండియా ఆన్లైన్ వెండార్ అసోసియేషన్ ఇటీవలే కేంద్రానికి లేఖ రాసిన నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. -
స్నాప్డీల్ బోర్డ్లో కబీర్ మిశ్రా
బెంగళూరు: ఈ కామర్స్ మార్కెట్ ప్లేస్, స్నాప్డీల్ కంపెనీ డైరెక్టర్గా కబీర్ మిశ్రాను సాఫ్ట్బ్యాంక్ నియమించింది. రెండేళ్లలో స్నాప్డీల్ను లాభాల్లోకి తేవడం లక్ష్యంగా ఆ సంస్థలో భారీగా పెట్టుబడులు పెట్టిన సాఫ్ట్బ్యాంక్ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ నియామకం జరిగిందని సంబంధిత వర్గాలంటున్నాయి. ఆన్లైన్ వ్యాపార వ్యవహారాల్లో కబీర్ మిశ్రాకు అపారమైన అనుభవం ఉంది. -
ఫ్రీ చార్జ్ సీఈవో ఈయనే
న్యూఢిల్లీ: ప్రముఖ ఆన్ లైన్ దిగ్గజం స్నాప్ డీల్ అనుబంధ సంస్థ ప్రీ చార్జ్ సీఈవో నియామకాన్ని చేపట్టింది. మాజీ రియల్ ఎస్టేట్ పోర్టల్ హౌసింగ్ .కామ్ ఎగ్జిక్యూటివ్ జాసన్ కొఠారి కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇటీవల ఈ పదవికి గోవింద్ రాజన్ రాజీనామా చేయడంతో కంపెనీ ఈ నియామకాన్ని చేపట్టింది. జాసన్ను సీఈవోగా ఎంపిక చేయడం ఆనందంగాఉందని స్పాప్డీల్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో కునాల్ బాల్ తెలిపారు. ఆయన ఒక బలమైన వ్యూహాత్మక మరియు బహుముఖ వ్యాపార నాయకుడని, ఇప్పటికే రెండు విజయవంతమైన సంస్థలకు సీఈవోగా, వ్యాపారవేత్తగా ఉన్నారని కొనియాడారు. సంస్థలో మరో 20 మిలియన్ డాలర్లు పెట్టేందుకు యోచిస్తున్నట్టు స్నాప్డీల్ ప్రకటించింది. మరోవైపు భారతదేశ డిజిటల్ చెల్లింపుల విప్లవం లో ఫ్రీఛార్జ్ సంస్థ ఒక కీలక పాత్ర పోషించనుందని కొఠారి అంచనా వేశారు. డిజిటల్ పరిశ్రమ 2025 నాటికి 1 ట్రిలియన్ డాలర్లను సాధిస్తుందని తెలిపారు. కాగా 2015 ఆగష్టులో ప్రీ చార్జ్ సీఈఓగా గోవిందరాజన్ బాధ్యతలను స్వీకరించారు. దాదాపుగా ఏడాదిన్నర పాటు ఆయన విశేష సేవలను అందించారు. ప్రధాన ప్రత్యర్థి అమెజాన్ నుంచి గట్టిపోటీతోపాటు సాఫ్ట్ బ్యాంక్ పెట్టుబడులను ఉపసంహరించు కోవడం ఫ్రీచార్జ్ ఇబ్బందుల్లో పడింది. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా పెట్టుబడుల కొరత తీవ్రత కారణంగా 2016 మార్చి నాటికి రూ. 235 కోట్ల నష్టాన్ని నమోదుచేసింది. అయితే ఈ ఏడాది జనవరిలో గోవింద రాజన్ రాజీనామా చేయడంతొ ఆయన స్థానంలో నూతన సిఈఓగా జాసన్ కొఠారిని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. -
స్నాప్డీల్ పీకేసింది.. పేటీఎం పిలుస్తోంది!
న్యూఢిల్లీ: సంక్షోభంలో ఉన్న స్నాప్డీల్, స్టేజిల్లా వందల సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకగా... వారికి పేటీఎం ఆహ్వానం పలికింది. పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ ట్విట్టర్లో ఇందుకు సంబంధించి ఓ ట్వీట్ చేశారు. వ్యాపార పునర్వ్యవస్థీకరణ కారణంగా ఢిల్లీ రాజధాని ప్రాంతంలో ఉద్యోగం కోల్పోయిన టెక్/ప్రొడక్టు ఉద్యోగులకు తాము ఆహ్వానం పలుకుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. దేశంలోని ప్రముఖ ఈ కామర్స్ సంస్థల్లో ఒకటైన స్నాప్డీల్ సుమారు 500–600 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు గత వారం ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరగా వృద్ధి చెందే క్రమంలో పొరపాట్లు చేసినట్టు స్పాప్డీల్ సహ వ్యవస్థాపకుడు కునాల్బాహ్ అంగీకరించారు. వ్యయాలు తగ్గించుకుని వ్యాపారాన్ని తిరిగి గాడిన పెట్టే క్రమంలో ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. చెన్నై కేంద్రంగా నడిచే ఆన్లైన్ హోటల్ గదుల బుకింగ్ సంస్థ స్టేజిల్లా మార్కెట్లో విపరీతమైన పోటీ కారణంగా కార్యకలాపాలు నిలిపివేయాలని నిర్ణయించింది. -
ఉద్యోగాలు కావాలా? ఆయన పిలుస్తున్నారు!
న్యూఢిల్లీ : కంపెనీల పునరుద్ధరణతో ఉద్యోగాలు కోల్పోతున్న వారికి పేటీఎం ఓ అనూహ్య ఆఫర్ ప్రకటించింది. ఉద్యోగాలు కావాలనుకునే వారికి తాము ఆహ్వానం పలుకుతున్నట్టు పేర్కొంది. ఇటీవలే స్నాప్డీల్ తన ఉద్యోగుల్లో 600 మందిని తీసివేస్తున్నట్టు ప్రకటించగా.. స్టేజిల్లా మొత్తానికే తన కార్యకలాపాలను మూసివేస్తున్నట్టు తెలిపింది. దీంతో ఈ కంపెనీల్లో పనిచేసే చాలామంది ఉద్యోగులు రోడ్డున పడనున్నారు. మరోవైపు కంపెనీలు తీసుకునే ఈ నిర్ణయాలపై ఉద్యోగులు కూడా అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో స్నాప్ డీల్, స్టేజిల్లా ఉద్యోగులకు పేటీఎం ఈ బంపర్ ఆఫర్ను అందించబోతోంది. శుక్రవారం ఉదయం పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ దీనికి సంబంధించి ఓ ట్వీట్ చేశారు.'' హలో ఢిల్లీ, జాతీయ రాజధాని పరిశ్రమలోని టెక్,ప్రొడక్ట్ ఉద్యోగులారా, వ్యాపార పునరుద్ధరణతో చాలా అసంతృప్తితో ఉన్నారా? అయితే పేటీఎం, పేటీఎం మాల్ మీకు వెల్కమ్ చెబుతోంది'' అంటూ ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో ఎలాంటి కంపెనీ పేరును శర్మ ప్రస్తావించనప్పటికీ, ఇటీవల స్టార్టప్లో ఉద్యోగాలు కోల్పోతున్న వారికి ఈ ఆఫర్ అందించనున్నట్టు తెలుస్తోంది. పేటీఎం తన ఈ-కామర్స్ వ్యాపారాలను విస్తరిస్తుందని కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు. తమ మార్కెట్ప్లేస్, బ్యాంకులో కొత్త ఉద్యోగులను తీసుకుంటున్నామని, ట్రైన్డ్, డొమైన్ ఎక్స్పర్ట్లకు వెల్కమ్ చెబుతున్నట్టు పేర్కొన్నారు. ఈ స్టార్టప్లో పనిచేసేవారందరూ మంచి వ్యక్తులేనని తాము నమ్ముతున్నట్టు, వారు తమ కల్చర్కు సరిపడతారని అధికార ప్రతినిధి చెప్పారు. లింక్డ్ ఇన్ పోస్టుల ద్వారా కూడా ఉద్యోగాలు కోల్పోతున్న వారికి పేటీఎం ఉద్యోగాలు ఆఫర్ చేస్తోంది. -
సంక్షోభంలో స్నాప్డీల్!!
-
సంక్షోభంలో స్నాప్డీల్!!
⇒ 600 మంది ఉద్యోగుల తొలగింపు ⇒ జీతం వదులుకుంటున్న వ్యవస్థాపకులు ⇒ వ్యూహాల్లో తప్పిదాలు జరిగాయని ఒప్పుకోలు న్యూఢిల్లీ: ఆన్లైన్ అమ్మకాల్లో ఫ్లిప్కార్ట్, అమెజాన్లకు గట్టిపోటీనిస్తూవచ్చిన స్నాప్డీల్ ప్రస్తుతం సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఇటు నిధుల ప్రవాహం మందగించడం, అటు నష్టాలు పెరుగుతుండటం వంటి అంశాలతో కంపెనీ కుదేలవుతోంది. ఈ నేపథ్యంలో ప్రాధాన్యేతర కార్యకలాపాల నుంచి తప్పుకోవాలని, వ్యయాలు భారీగా తగ్గించుకోవాలని సంస్థ నిర్ణయించింది. ఇందులో దాదాపు 500–600 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం. ఈ–కామర్స్ మార్కెట్ప్లేస్, మొబైల్ వాలెట్ సంస్థ ఫ్రీచార్జ్, లాజిస్టిక్స్ విభాగం వల్కన్ ఎక్స్ప్రెస్ మొదలైన అనుబంధ సంస్థల్లోని ఉద్యోగాల్లో కోత పడొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, పై స్థాయిలోని మరికొందరు ఎగ్జిక్యూటివ్స్ జీతభత్యాల్లో కూడా కోత పడనుంది. కంపెనీ వ్యవస్థాపకులు కూడా తమ జీతాలను వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. తప్పు చేశాం.. కంపెనీని లాభాల్లోకి మళ్లించేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను సమర్ధంగా వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నామని సంస్థ వ్యవస్థాపకుడు కునాల్ బెహల్.. ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇందులో భాగంగా తాను, మరో వ్యవస్థాపకుడు రోహిత్ బన్సల్ జీతాన్ని పూర్తిగా వదులుకుంటున్నామని వివరించారు. మరికొందరు పైస్థాయి ఎగ్జిక్యూటివ్స్ కూడా జీతంలో కోత విధించుకోవడానికి సిద్ధపడ్డారని ఆయన పేర్కొన్నారు. తమ వ్యాపార వ్యూహాల్లో తప్పిదాలు చోటుచేసుకున్నాయని ఈ సందర్భంగా ఆయన అంగీకరించారు. ‘ఈ మార్కెట్లోకి కుప్పతెప్పలుగా పెట్టుబడులు వచ్చి పడ్డాయి. దీంతో యావత్ పరిశ్రమతో పాటు మన సంస్థ కూడా తప్పిదాలు చేయడం ప్రారంభమైంది. సరైన లాభసాటి విధానం, మార్కెట్ గురించి పూర్తిగా అంచనా వేయకుండానే వ్యాపారాన్ని విస్తరించడం మొదలుపెట్టాం. తొలి వెంచర్లో ఇంకా పట్టు సాధించకుండా.. లాభాలు చూడకుండానే ఇతరత్రా కొంగొత్త ప్రాజెక్టుల్లోకి అడుగుపెట్టాం. ప్రస్తుతం అవసరమైనదానికంటే కూడా అధిక స్థాయిలో టీమ్ను, ఇన్ఫ్రాను విస్తరించుకుంటూ పోయాం‘ అని బెహల్ పేర్కొన్నారు. కంపెనీని మళ్లీ గట్టెక్కించాలంటే.. ప్రధాన వ్యాపారంపై దృష్టిపెట్టి ప్రాధాన్యేతర వ్యాపారాల నుంచి వైదొలగడం, వ్యయాలను గణనీయంగా తగ్గించుకోవడం, సాధ్యమైనంత త్వరగా లాభాల బాట పట్టడం, వచ్చిన లాభాలనే వృద్ధికి.. కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉపయోగించుకోవడం వంటి చర్యలు అవసరమని తెలిపారు. ఈ క్రమంలో కొందరు ఉద్యోగులకు ఉద్వాసన పలకాల్సి రావడం బాధాకరమైన అంశమని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం సంస్థలో దాదాపు 8,000 మంది ఉద్యోగులు ఉన్నారు. నష్టాలతో కుదేలు.. కొన్నాళ్ల క్రితం దాకా నంబర్ వన్ స్థానానికి పోటీపడిన స్నాప్డీల్.. గత పదిహేను నెలలుగా గడ్డుకాలం ఎదుర్కొంటోంది. పెరుగుతున్న నష్టాలు, టాప్ మేనేజ్మెంట్లో మార్పులు, పోటీ సంస్థ అమెజాన్ దూకుడుగా కార్యకలాపాలు విస్తరిస్తుండటం మొదలైన వాటితో స్నాప్డీల్ ఉక్కిరిబిక్కిరవుతోంది. 2015–2016 ఆర్థిక సంవత్సరంలో స్నాప్డీల్ సిబ్బంది సంబంధిత వ్యయాలు ఏకంగా 148 శాతం ఎగిసి రూ. 911 కోట్లకు పెరిగాయి. కంపెనీ అమ్మకాలు 56% వృద్ధితో రూ. 1,457 కోట్లు నమోదు కాగా.. నష్టాలు మాత్రం రెట్టింపై రూ. 2,960 కోట్లకు పెరిగాయి. స్నాప్డీల్ ఇటీవలే మార్కెట్ప్లేస్ షాపోను మూసివేసింది. స్నాప్డీల్, ట్యాక్సీ సేవల సంస్థ ఓలాలో కూడా ఇన్వెస్ట్ చేసిన జపాన్ దిగ్గజం సాఫ్ట్బ్యాంక్ ఈ రెండింటిలో కలిపి దాదాపు రూ. 3,226 కోట్ల (475 మిలియన్ డాలర్లు) రైటాఫ్ చేసింది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే స్నాప్డీల్ కఠిన నిర్ణయాలపై దృష్టి సారించింది. 2016 ఆఖరు నాటికి స్నాప్డీల్ మాతృసంస్థ జాస్పర్ ఇన్ఫోటెక్ బ్యాం కు ఖాతాల్లో రూ. 1,200 కోట్లు, డిజిటల్ చెల్లింపుల అనుబంధ సంస్థ ఫ్రీచార్జ్ ఖాతాల్లో సుమారు 300–400 కోట్లు ఉన్నట్లు అంచనా. ఫ్రీచార్జ్ సీఈవో గోవింద్ రాజన్ రాజీనామా స్నాప్డీల్ టాప్ మేనేజ్మెంట్లో మార్పులు, చేర్పులు కొనసాగుతున్నాయి. తాజాగా అనుబంధ సంస్థ ఫ్రీచార్జ్ సీఈవో గోవింద్ రాజన్ రాజీనామా చేశారు. దీనికి కారణాలేంటన్నది వెల్లడి కాలేదు. 2015లో ఈ మొబైల్ వాలెట్ సంస్థను స్నాప్డీల్ కొనుగోలు చేసిన అనంతరం రాజన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా చేరారు. గతేడాది మే లో సీఈవోగా పదోన్నతి పొందారు. ఫ్రీచార్జ్కి 1 బిలియన్ డాలర్ల పైగా వేల్యుయేషన్తో సుమారు 150–200 మిలియన్ డాలర్లు సమీకరించాలని గత కొన్నాళ్లుగా కంపెనీ ప్రయత్నిస్తోంది. -
తప్పులు దొర్లాయి..ఫౌండర్స్ పూర్తి జీతం కోత
ముంబై: ఉద్యోగులను తొలగిస్తున్న వార్తలను ధృవీకరించిన దేశీయ ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ స్నాప్డీల్ వ్యవస్థాపకులు మరో సంచలన ప్రకటన చేశారు. ఫౌండర్స్ కునాల్ బహల్, రోహిత్ బన్సాల్ తమ జీతాలను వదులుకుంటున్నట్టు వెల్లడించారు. కంపెనీ వ్యూహాన్నిఅమలు చేయడంలో విఫలమయ్యామని అంగీకరించిన వీరివురు, తమ వేతనాలను 100శాతం కోతకు నిర్ణయించినట్టు చెప్పారు. బుధవారం స్నాప్డీల్ ఉద్యోగులకు రాసిన ఒక ఈ మెయిల్ లో ఈ విషయాన్ని వెల్లడించారు గత కొన్ని సంవత్సరాలుగా అద్భుతంగా సంస్థ పయనం కొనసాగినప్పటికీ..కొన్ని తప్పులు చేశామన్నారు. కచ్చితంగా ఈ కామర్స్ పరిశ్రమ, స్నాప్డీల్ ఇబ్బందుల్లో ఉందని తెలిపారు. అందుకే సంస్థను లాభాల బాట పట్టించేదుకు అటు ఉద్యోగాల కోత, ఇటు తమ వేతనాల కోత అని చెప్పారు. అయితే ఎంత కాలం అనేది మాత్రం స్పష్టం చేయలేదు. సరైన పునాది లేకుండా కంపెనీ వ్యూహం అమలులో లోపాన్ని ఒప్పుకుంటూనే, తమ వేతనాల్లో చెల్లింపులో కోత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా టీమ్ ను నియమించుకోవడంలో తప్పుదొర్లిందని పేర్కొన్నారు. అవసరమైనదానికంటే ఎక్కువమంది ఉద్యోగులనునియమించుకున్నట్టు చెప్పారు. మార్కెట్ సరిపోయే సరియైన ఆర్ధిక నమూనాతో వ్యాపారవృద్ధిని ప్రారంభించామన్నారు. లాభదాయమైన కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాం. ప్రస్తుత స్థాయి అవసరమమైన జట్టు మరియు సామర్థ్యాలనిర్మాణం ప్రారంభించామని ఈమెయిల్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టీమ్ పునర్నిర్మాణంపై దృష్టిపెట్టామని చెప్పారు. అందుకే ఉద్యోగలను తొలగించేందకు నిర్ణయించామనీ,ఈ కష్టాల నుంచి గట్టెక్కి కంపెనీని తిరుగులేని లాభదాయక సంస్థగా మార్చే తమ ప్రయత్నాలలో భాగమే ఈ కుదింపు అని చెప్పారు. అలాగే రెండేళ్లలో లాభాలను ఆర్జించే తొలి ఈ-కామర్స్ కంపెనీగా స్నాప్ డీల్ ను వృద్ధి చేయనున్నామన్నారు. అన్ని బిజినెస్ లలో ఈ వద్ధిని కొనసాగించడం తమకు ప్రధానమైన అంశంగా పేర్కొన్నారు. -
ఫ్రీచార్జ్ సీఈవో రాజీనామా..
న్యూఢిల్లీ: ప్రముఖ ఆన్లైన్ దిగ్గజం స్నాప్డీల్ అనుబంధ సంస్థ ఫ్రీచార్జ్ సీఈవో గోవింద్ రాజన్ తన పదవికి రాజీనామా చేశారు. 2015 లో రాజన్ ఫ్రీచార్జ్ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. గోవింద్ రాజన్ ఆధ్వర్యంలో ఫ్రీచార్జ్ ఎదుగుదలకు విశేష కృషి చేశారని స్నాప్డీల్ సహ వ్యవస్థాపకులు కునాల్ బాల్ అన్నారు. గోవింద్ రాజన్ గతంలో భారతీ ఎయిర్టెల్కు ఎక్జిక్యూటీవ్ సీఈవోగా పనిచేసిన విషయం తెలిసిందే. ఎయిర్ టెల్ నుంచి బయటకు వచ్చాక 2015 ఆగస్టులో ఫ్రీచార్జ్ సీఈవోగా నియమితులై దాదాపు ఏడాదిన్నర్ పాటు విశేష సేవలు అందించారు.ఇకపై ఆయన స్థానంలో నూతన సీఈవోగా జాసన్ కొటారీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఫ్రీచార్జ్ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నట్లు రాజన్ తెలిపారు. గతేడాది మే నెలలో ఆనంద్ చంద్రశేఖరన్ ఫ్రీచార్జ్ నుంచి బయటకు వచ్చి ఫేస్బుక్ సంస్థలో జాయిన్ అయ్యారు. రాజన్ అనంతరం సీఈవోగా రానున్న జాసన్ కొటారీ ఎప్పుడు, ఎక్కడ బాథ్యతలు చేపడతారో తెలియాల్సి ఉంది. -
ఉద్యోగులపై వేటు వేస్తున్న స్నాప్డీల్
న్యూఢిల్లీ : దేశీయ ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ స్నాప్ డీల్ ఉద్యోగాల కోత పెడుతోంది. తమ ఈ-కామర్స్, లాజిస్టిక్స్, పేమెంట్స్ ఆపరేషన్లలో దాదాపు 600 మందిని స్నాప్ డీల్ తీసివేస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పారు. గత వారం నుంచే ఈ ప్రక్రియను స్నాప్ డీల్ ప్రారంభించిందని, మొత్తం 500 నుంచి 600 మందిని తీసివేసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. మరికొన్ని రోజుల్లోనే వీరిని తొలగించనున్నట్టు తెలుస్తోంది. రెండేళ్లలో లాభాలను ఆర్జించే తొలి ఈ-కామర్స్ కంపెనీగా తమ జర్నీ సాగుతుందని స్నాప్ డీల్ అధికార ప్రతినిధి చెప్పారు. అన్ని బిజినెస్ లలో ఈ వద్ధిని కొనసాగించడం తమకు ప్రధానమైన అంశంగా పేర్కొన్నారు. కంపెనీలో ఇప్పటివరకు 8000 మంది ఉద్యోగులున్నారు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ నుంచి స్నాప్ డీల్ గట్టి పోటీని ఎదుర్కొంటోంది. ప్రెష్ క్యాపిటల్ ను ఆర్జించడానికి కూడా స్నాప్ డీల్ తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోంది. అయితే కంపెనీ నికర రెవెన్యూలు ఈ ఆర్థిక సంవత్సరంలో 3.5 సార్లు పైకి ఎగిశాయి. ఈ రెవెన్యూలతో స్నాప్ డీల్ దేశంలోనే లాభాలను ఆర్జించే తొలి ఈ-కామర్స్ కంపెనీగా పేరొందనున్నట్టు కంపెనీ అంచనావేస్తోంది. -
విలీన బాటలో స్నాప్డీల్, పేటీఎం ఈ–కామర్స్
ముంబై: ఆన్లైన్ షాపింగ్ సంస్థ స్నాప్డీల్, పేటీఎం ఈ–కామర్స్ సంస్థ విలీనంపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇది పూర్తిగా స్టాక్స్ డీల్గా ఉండొచ్చునని తెలుస్తోంది. దాదాపు నెల రోజుల క్రితమే ఈ అంశంపై చర్చలు జరిగినట్లు, ఇరుపక్షాలకూ ఆమోదయోగ్యమైతే సంప్రతింపులు మళ్లీ ప్రారంభం కావొచ్చునని సంబంధిత వర్గాలు తెలిపాయి. చెల్లింపుల బ్యాంక్ లైసెన్స్ పొందిన పేటీఎం సంస్థ ఆర్బీఐ నిబంధనల ప్రకారం మార్చి 31లోగా తమ మార్కెట్ప్లేస్ వ్యాపార విభాగాన్ని విక్రయించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో స్నాప్డీల్తో ఈ–కామర్స్ వ్యాపార విభాగం విలీనంపై వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇరు సంస్థల్లోనూ వాటాలు ఉన్న చైనా ఈ–కామర్స్ దిగ్గజం ఆలీబాబా ఈ డీల్కు సారథ్యం వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఆలీబాబాకు పేటీఎంలో 40%, స్నాప్డీల్లో 3% వాటాలు ఉన్నాయి. పేటీఎం ఈ–కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రస్తుతం ఆలీబాబా, ఎస్ఏఐఎఫ్ పార్ట్నర్స్ నుంచి నిధులు సమీకరించే ప్రయత్నాల్లో ఉంది. ఒకవేళ స్నాప్డీల్, పేటీఎం ఈ–కామర్స్ విలీనం జరిగిందంటే కొత్తగా ఏర్పడే సంస్థలో ఆలీబాబా అతి పెద్ద వాటాదారుగా అవతరిస్తుంది. ఈ మొత్తం డీల్లో జపాన్కి చెందిన సాఫ్ట్బ్యాంక్ కూడా ప్రయోజనం పొందనుంది. స్నాప్డీల్లో భారీగా ఇన్వెస్ట్ చేసిన సాఫ్ట్బ్యాంక్కి అటు ఆలీబాబాలో కూడా గణనీయమైన వాటాలు ఉన్నాయి. ఆలీబాబా ఇటీవలే పేటీఎం ఈ–కామర్స్లో రూ. 1,350–1,700 కోట్ల మేర ఇన్వెస్ట్ చేసింది. తద్వారా భారత మార్కెట్లో ఆన్లైన్ దిగ్గజాలు ఫ్లిప్కార్ట్, అమెజాన్లతో పోటీపడుతోంది. పేటీఎం వేల్యుయేషన్ దాదాపు 4.8 బిలియన్ డాలర్లుగా ఉంది. పేటీఎంలో రిలయన్స్ క్యాప్ వాటా సేల్..! పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్లో తమకున్న 1 శాతం వాటాను విక్రయించాలని రిలయన్స్ క్యాపిటల్ యోచిస్తోంది. తద్వారా 50–60 మిలియన్ డాలర్లు సమీకరించాలని భావిస్తోంది. అయితే రిలయన్స్ క్యాపిటల్ వర్గాలు ఈ వార్తలపై స్పందించేందుకు నిరాకరించాయి. -
రెండు నెలల్లో 30శాతం ఉద్యోగాల కోత
న్యూఢిల్లీ: దేశీయ ఇ-కామర్స్ సంస్థ స్నాప్డీల్ భారీగా ఉద్యోగుల్లో కోత పెట్టనుంది. ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాబోయే రెండు నెలల్లో దాదాపు 30 శాతం ఉద్యోగులకు ఇంటికి పంపించేందకు రంగం సిద్ధం చేస్తున్నట్టు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ఇటీవల భారీ ఇబ్బందుల్లో పడ్డ స్నాప్ డీల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీంతో వేలమంది ఉద్యోగులు పత్యక్షంగా, పరోక్షంగా ఉపాధిని కోల్పోనున్నారు. ఇప్పటికే ఉద్యోగులకు ఉద్వాసన పలికే ప్రక్రియను ప్రారంభించినట్టు తెలుస్తోంది. తాజా నివేదికల ప్రకారం వాల్యూయేషన్స్ భారీగా కుంగిపోవడం, పెట్టుబడులు క్షీణిచడంతో ఇబ్బందుల్లో పడ్డ స్నాప్ డీల్ ఉద్యోగులను కుదించుకునేందుకు రడీ అవుతోంది. ఈ మేరకు టీం మేనేజర్లకు పంపిన అంతర్గత ఈ మెయిల్ సమాచారంలో ఆదేశాలు జారీచేసింది. తమ టీంలోని సభ్యుల సంఖ్యను తగ్గించుకోవాల్సింది కోరింది. ఈ నేపథ్యంలో దాదాపు 40-50 మందిని ఇప్పటికే ఇంటికి పంపించేసింది. దీంతో పాటు స్నాప్డీల్ డైరెక్ట్ ఉద్యోగులు మరో వెయ్యిమంది దాకా, అలాగే దాదాపు 5వేలకు పైగా క ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులు ప్రభావితంకానున్నారు. వీరిలో 30శాతం మంది రోడ్డున పడనున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో కూడా సుమారు 200 మంది ఉద్యోగులను స్నాప్ డీల్ తొలగించింది. కాగా జపాన్కు చెందిన సాఫ్ట్బ్యాంకు కార్ప్ స్నాప్డీల్లో 6.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులపై 35 కోట్ల డాలర్ల నష్టాన్ని చవిచూసింది. దీంతో స్నాప్డీల్ లో పెట్టిన పెట్టుబడులపై ఆశించిన స్థాయిలో ఫలితాలు అందని నేపథ్యంలో డిసెంబర్తో ముగిసిన తొమ్మిది నెలలకు గాను 35 కోట్ల డాలర్లు రైటాఫ్ చేసిన సంగతి తెలిసిందే -
స్నాప్డీల్లో కొట్టేసి.. ఓఎల్ఎక్స్లో అమ్మేశారు!
నలుగురు వ్యక్తులు కలిసి మంచి ప్లాన్ వేశారు. స్నాప్డీల్ ద్వారా డెలివరీకి వచ్చే సరుకులను దారిలోనే కొట్టేసి, వాటిని ఓఎల్ఎక్స్లో పెట్టి అమ్మేశారు. ఒకటి, రెండు రోజులు కాదు.. చాలా కాలం ఇలాగే చేయడంతో చివరకు పట్టుబడ్డారు. వాళ్లలో స్నాప్డీల్ సరుకులు చేరవేసే లాజిస్టిక్స్ సంస్థలో పనిచేసే ముగ్గురు డెలియరీ బోయ్లు కూడా ఉన్నారు. ఈ నలుగురు కలిసి తప్పుడు పేర్లు, చిరునామాలతో స్నాప్డీల్లో వివిధ వస్తువులు బుక్ చేసి, ఆ తర్వాత వాటిని తీసేసుకుని వాటి స్థానంలో రాళ్లు, సబ్బులు పెట్టేసి డెలివరీ తీసుకోనట్లుగా వాటిని రిటర్న్ చేసేసేవారు. తీసుకున్న సరుకులను ఎంచక్కా ఓఎల్ఎక్స్లో అమ్మేసుకునేవారు. ఈ కేసులో ఢిల్లీకి చెందిన రవికాంత్, హరి ఓం, అమృత్, కరణ్ శర్మ అనే నలుగురిని అరెస్టు చేసి గుర్గ్రామ్ కోర్టులో ప్రవేశపెట్టారు. స్నాప్డీల్ తరఫున పార్సిల్స్ తీసుకుని వాటిని నగరంలోని వివిధ ప్రాంతాల్లో డెలివరీ చేసే వల్కన్ ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏరియా మేనేజర్ రమేష్ కుమార్ గత నెలలో ఈ వ్యవహారంపై ఫిర్ఆయదు చేశారు. విచారణలో ఈ సంస్థలో పనిచేసే డెలివరీ బోయ్లే ఈ నేరానికి పాల్పడినట్లు తేలింది. ముందుగా రవికాంత్, హరి ఓం అనే ఇద్దరు డెలివరీ బోయ్లను అరెస్టు చేయగా, వాళ్లిచ్చిన సమాచారంతో హరి ఓం అన్న కరణ్ను అరెస్టు చేశారు. అతడే మొత్తం కుట్రకు సూత్రధారి. ఖరీదైన వస్తువులు బుక్ చేసి, వాటికి క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతిలో చెల్లింపు ఆప్షన్ పెట్టేవాడు. డెలివరీ బోయ్లు అతడి అడ్రస్ సరిగా లేదని చెప్పి వాటిని తిరిగి ఇచ్చేసేవారు. అప్పటికే లోపలి సరుకు మారిపోయేది. సరుకు విలువలో 15% మొత్తాన్ని డెలివరీ బోయ్లకు కమీషన్గా ఇచ్చేవారు. దాదాపు 50 పార్సిళ్లను ఇలా ఓఎల్ఎక్స్లో అమ్మేశారని డీసీపీ క్రైం సుమిత్ కుమార్ తెలిపారు. -
జీఎస్టీ నిబంధనలపై ఈ–కామర్స్ సంస్థల్లో ఆందోళన
న్యూఢిల్లీ: ముసాయిదా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానంలో ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్ (టీసీఎస్) నిబంధనపై ఆన్లైన్ రిటైల్ సంస్థలు ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, అమెజాన్ ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నిబంధన వల్ల ఏటా దాదాపు రూ. 400 కోట్ల పెట్టుబడులు లాక్ అయిపోతాయని, వ్యాపారులు ఆన్లైన్లో విక్రయించడానికి ముందుకు రాబోరని పేర్కొన్నాయి. అంతే గాకుండా సుమారు 1.8 లక్షల ఉద్యోగాలకు గండిపడుతుందని ఆయా సంస్థలు అభిప్రాయపడ్డాయి. ఈ–కామర్స్ రంగంలోకి పెట్టుబడులు రావడం తగ్గి, వృద్ధి నిల్చిపోతుందని పేర్కొన్నాయి. టీసీఎస్ నిబంధన ప్రకారం ఈకామర్స్ సంస్థలు.. తమ ప్లాట్ఫాంపై విక్రయించే వ్యాపారులకు చెల్లించాల్సిన మొత్తాల్లో కొంత భాగాన్ని మినహాయించుకుని పన్ను రూపంలో ప్రభుత్వ ఖజానాకు జమచేయాల్సి ఉంటుంది. నిత్యం ఒకదానితో మరొకటి తీవ్రంగా పోటీపడే ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్నాప్డీల్.. టీసీఎస్ విషయంలో మాత్రం ఒక్కతాటిపైకి రావడం గమనార్హం. -
భారత్లో సాఫ్ట్బ్యాంక్కు కష్టాలు..!
పెట్టుబడులపై భారీ నష్టాలు • ఓలా, స్నాప్డీల్లో ఇన్వెస్ట్మెంట్స్ విలువ 350 మిలియన్ డాలర్లు తగ్గుదల న్యూఢిల్లీ: ఆన్లైన్ షాపింగ్ సైట్ స్నాప్డీల్, ట్యాక్సీ సేవల సంస్థ ఓలా సహా భారత్కి చెందిన పలు సంస్థల్లో జపాన్ దిగ్గజం సాఫ్ట్బ్యాంక్ కార్పొరేషన్ చేసిన పెట్టుబడులు గణనీయంగా కరిగిపోయాయి. డిసెంబర్తో ముగిసిన తొమ్మిది నెలల కాలంలో జాస్పర్ ఇన్ఫోటెక్, ఏఎన్ఐ టెక్నాలజీస్ వంటి సంస్థల్లో దాదాపు 350 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడుల విలువను తగ్గించినట్లు చేసినట్లు సాఫ్ట్బ్యాంక్ పేర్కొంది. స్నాప్డీల్కు జాస్పర్ ఇన్ఫోటెక్ మాతృసంస్థ కాగా, ఓలాను ఏఎన్ఐ టెక్నాలజీస్ నిర్వహిస్తోంది. అయితే, పెట్టుబడుల విలువను తగ్గించడాన్ని.. ఆయా కంపెనీల పనితీరును ప్రతిబింబించడంగా పరిగణించరాదని సాఫ్ట్బ్యాంక్ ప్రతినిధి పేర్కొన్నారు. సాధారణంగా అకౌంటింగ్ విధానాలు, కరెన్సీ హెచ్చుతగ్గులు తదితర అంశాల కారణంగా పోర్ట్ఫోలియో కంపెనీల్లో పెట్టుబడుల వేల్యుయేషన్స్ మారుతుంటాయని వివరించారు. సాఫ్ట్బ్యాంక్ సారథ్యంలో 2014లో ఓలాలోకి 210 మిలియన్ డాలర్లు, స్నాప్డీల్లోకి 627 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఆ తర్వాత కూడా రెండు కంపెనీల్లో సాఫ్ట్బ్యాంక్ మరింత ఇన్వెస్ట్ చేసింది. ఇప్పటిదాకా భారత్లో సాఫ్ట్బ్యాంక్ 2 బిలియన్ డాలర్ల దాకా పెట్టుబడులు పెట్టింది. వచ్చే 5–10 సంవత్సరాల్లో పెట్టుబడులను 10 బిలియన్ డాలర్ల దాకా పెంచుకోనున్నట్లు కంపెనీ ఇటీవలే ప్రకటించింది. స్నాప్డీల్ ’షాపో’.. షట్డౌన్ చిన్న తరహా వ్యాపార సంస్థల మధ్య క్రయ, విక్రయ లావాదేవీలకు తోడ్పడే ఆన్లైన్ ప్లాట్ఫాం షాపోను శుక్రవారం నుంచి మూసివేస్తున్నట్లు స్నాప్డీల్ వెల్లడించింది. 2013లో స్నాప్డీల్ దీన్ని కొనుగోలు చేసింది. ఈ తరహా సర్వీసుల వ్యవస్థకు డిమాండ్ ఏర్పడటానికి మరికొన్నేళ్లు పట్టేసే అవకాశం ఉన్నందున తాజా నిర్ణయం తీసుకున్నట్లు స్నాప్డీల్ పేర్కొంది. ఓలా సీఎఫ్వో బన్సల్ ఔట్.. ఓలా టాప్ మేనేజ్మెంట్లో మార్పులు కొనసాగుతున్నాయి. తాజాగా సీఎఫ్వో రాజీవ్ బన్సల్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ రఘువేశ్ సరూప్ రాజీనామా చేశారు. వీరు ఏడాది క్రితం ఓలాలో చేరారు. బన్సల్ ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ కాగా, సరూప్ మైక్రోసాఫ్ట్ ఇండియా మాజీ ఎండీ. బన్సల్ రాజీనామాతో ప్రస్తుత సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పల్లవ్ సింగ్కు తాత్కాలిక సీఎఫ్వోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. -
ఆ స్మార్ట్ఫోన్లపై స్నాప్డీల్ బ్రిలియంట్ ఆఫర్
ముంబై: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ స్నాప్ డీల్ సోమవారం భారీ ఆఫర్ ప్రకటించింది. గూగుల్ తొలి స్మార్ట్ ఫోన్లపై భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తోంది. ఇ-కామర్స్ సైట్ యాత్ర , ఎస్ బ్యాంక్ ఈ-క్యాష్ ద్వారా రూ. 10,000 తక్షణ క్యాష్ బ్యాక్, అలియాంజ్ నుంచి రెండు స్మార్ట్ ఫోన్లకు మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్స్ ను రూ. 5999ఉచితంగా అందిస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు గూగుల్ పిక్సెల్ తో ఆన్ లైన్ రిటైల్ భాగస్వామ్యాన్ని ప్రకటించింది. గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ రావడం ఆనందంగా ఉందని స్నాప్డీల్ వైస్ ప్రెసిడెంట్ విశాల్ చడ్డా చెప్పారు. ఇప్పటికే నాణ్యతలో కొత్త ప్రమాణాలను సృష్టించిన ఈ స్మార్ట్ ఫోన్లు తమ తాజా ఆఫర్ ద్వారా హాట్ సెల్లర్ గా నిలవనున్నాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో గూగుల్ పిక్సెల్ 128జీబీ రూ.66 వేలకు, 32 జీబీ రూ.57వేలకు అందుబాటులో ఉన్నాయి. గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్ ( బ్లాక్ అండ్ సిల్వర్, 32 జీబీ) రూ.67 వేలకు లభిస్తోంది. ఫ్లిప్ కార్ట్ లో ఎక్సేంజ్ ఆఫర్ లో రూ 23 వేలు తగ్గింపును ఆఫర్ చేస్తోంది. అలాగే ఐసీఐసీఐ బ్యాంకు కార్డులతో ఈఎంఐ లపై రూ 8000 వరకు క్యాష్ బ్యాక్ ఉంది. యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డుపై అదనంగా 5 శాతం తగ్గింపు . కాగా గూగుల్ పిక్సెల్ , ఎక్స్ఎల్ అధికారికంగా అక్టోబర్ 4న లాంచ్ అయ్యాయి. 64 గంటల బ్యాటరీ లైఫ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 1080x 1920 పిక్సెల్ రిజల్యూషన్ తదితర ఫీచర్లతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి. గూగుల్ అసిస్టెంట్, వర్చువల్ రియాలిటీ సామర్థ్యం, 32-128 జీబీ మెమొరీ, 12.3-8 మెగాపిక్సెల్ కెమేరాలు, 5.5 అంగుళాల తెర, 4జీబీ ర్యామ్, 3,450 ఏంఏహెచ్ బ్యాటరీ , ఆండ్రాయిడ్ 7.1 నాట్ ఆపరేటింగ్ సిస్టమ్తో 'పిక్సెల్' స్మార్ట్ ఫోన్లను ఆవిష్కారంతో గూగుల్ స్మార్ట్ ఫోన్ల రంగంలో పోటీకి తొలి అడుగువేసిన సంగతి తెలిసిందే. -
స్నాప్డీల్ న్యూ ఇయర్ బంపర్ ఆఫర్లు
న్యూఢిల్లీ: దేశీయ కామర్స్ దిగ్గజం స్నాప్ డీల్ బంపర్ ఆఫర్స్ అనౌన్స్ చేసింది. నూతన సంవత్సరంలో వినియోగాదారులకు భారీ డిస్కౌంట్ ను ఆఫర్ చేస్తోంది. 'వెల్ కం2017' పేరుతో రెండు రోజుల అమ్మకాలకు తెర లేపింది. జనవరి 8 ,9 తేదీల్లో నిర్వహించే టు-డే సేల్ లో దుస్తులు, స్మార్ట్ ఫోన్లు, గృహోపకరణాలు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల పై 70శాతం వరకు రాయితీ అందిస్తోంది. స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్ ధరలు రెడ్ మి నోట్ రూ.11,999 శామ్సంగ్ జె2 ప్రో (16జీబీ). రూ.9,490 ఐఫోన్ 5ఎస్ (16జీబీ రూ. 17,499 ఐఫోన్ 7 (32Gజీబీ ) రూ. రూ 52,999 ఐఫోన్ 6ఎస్ (32జీబీ). రూ. 43, 999 ధరల్లో అందుబాటులో ఉండనున్నాయి. అలాగే ఎస్ బీఐ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేసిన వినియోగదారులకు అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తోంది. సుమారు 15శాతం రాయితీ కల్పిస్తోంది. దీనితోపాటు ప్రధాన క్రెడిట్ కార్డులతో కొనుగోలుపై ఫీజులేని ఈఎంఐ ఆప్షన్ ను ఆఫర్ చేస్తోంది. -
ఇంటి వద్దకే జియో సిమ్..ఎలానో తెలుసా?
న్యూఢిల్లీ : ఇప్పటివరకు రిలయన్స్ జియో సిమ్ కార్డు కొనలేదా? ఉచిత ఆఫర్లను వినియోగించుకోలేకపోతున్నామని ఆందోళన చెందుతున్నారా? అయితే ఎలాంటి బెంగ అవసరం లేదట. ఈ-కామర్స్ దిగ్గజం స్నాప్డీల్ ద్వారా ఇంటి వద్దకే జియో సిమ్ డెలివరీ చేసేందుకు కంపెనీ సన్నద్ధమవుతోంది. హ్యాపీ న్యూఇయర్ ఆఫర్ కింద జియో సిమ్లను ఇంటింటికి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే సిమ్ కార్డు కోసం ముందస్తుగా కస్టమర్లు ఈ-కామర్స్ వెబ్సైట్లో వివరాలను నమోదుచేసుకుంటే చాలట. స్నాప్డీల్ జియో సిమ్ హోమ్ డెలివరీ సర్వీసులో వివరాలు నమోదుచేసుకున్న అనంతరం యూజర్లకు డెలివరీ టైమ్, ప్రోమోకోడ్తో ఓ మెసేజ్ను పొందుతారు. రిలయన్స్ జియో సిమ్ను వెంటనే యాక్టివేట్ చేసుకోవాలనుకునే కస్టమర్లు, ప్రోమోకోడ్ను, ఆధార్ నెంబర్ను స్నాప్డీల్ డెలివరీ ఎగ్జిక్యూటివ్తో పంచుకుంటే వెంటనే సిమ్ యాక్టివేట్ ప్రక్రియ కూడా అయిపోతుందని రిపోర్టులు పేర్కొన్నాయి.. ఇప్పటికే స్నాప్ డీల్ తన కస్టమర్లకు ఈ-మెయిల్స్ పంపడం ప్రారంభించిందని, సిమ్ కార్డులను ఇంటింటికి డెలివరీ చేయనున్నామని తెలిపినట్టు తెలిసింది. స్నాప్డీల్ నుంచి ఈ-మెయిల్స్ అందిన కస్టమర్లు ఎలాంటి చెల్లింపులు అవసరం లేకుండా జియో సిమ్ కార్డును ఇంటివద్దే పొందవచ్చు. సిమ్ను యాక్టివేట్ చేసుకోవడానికి ఎలాంటి చార్జీలు చెల్లించనవసరం లేదట. సిమ్ కార్డు పొందిన వెంటనే వారు వాలిట్ లోకల్ ఆధార్ కార్డులను కంపెనీకి సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఆఫర్ ఎంపికచేసిన ప్రాంతాల్లో అందుబాటులో ఉందని రిపోర్టులు చెప్పాయి. ఇటీవలే జియో ఉచిత సేవలను 2017 మార్చి 31వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, ఇంటివద్దకే జియోసిమ్ లు అందిస్తూ మరో ప్రయోగం చేయబోతున్నారు. -
బీజేపీ ఐటీ సెల్ పై సంచలన ఆరోపణలు
ఆమిర్ ను తొలగించేలా స్నాప్ డీల్ పై ఒత్తిడి ఏకంగా ఐటీసెల్ చీఫ్ నుంచి ఆదేశాలు మాజీ వాలంటీర్ ఆరోపణలు గత ఏడాది నవంబర్ లో అసహనం వివాదంపై ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. మోదీ ప్రభుత్వాన్ని విమర్శించేరీతిలో ఆయన వ్యాఖ్యలు ఉండటంతో ఆయనను తన బ్రాండ్ అంబాసిడర్ గా తొలగించేలా ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ స్నాప్ డీల్ పై ఒత్తిడి తేవాలని ఏకంగా బీజేపీ సోషల్ మీడియా సెల్ నుంచి ఆదేశాలు వచ్చినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివాదంలో స్నాప్ డీల్ పై ఒత్తిడి పెంచేలా సోషల్ మీడియాలో, వాట్సాప్ లలో ప్రచారం ముమ్మరం చేయాలని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అరవింద్ గుప్తా తన శ్రేణులకు సూచించారని మాజీ వాలంటీర్ ఒకరు వెల్లడించారు. గతంలో బీజేపీ సోషల్ మీడియా సెల్ వాలంటీర్ గా పనిచేసిన సాధ్వి ఖోస్లా త్వరలో తీసుకువస్తున్న ఓ పుస్తకంలో ఈ ఆరోపణలు చేశారు. గత ఏడాది చివర్లో వాలంటీర్ గా తప్పుకొన్న ఆమె ప్రస్తుతం 'ఐ యామ్ ద ట్రోల్' పేరిట ఒక పుస్తకాన్ని తీసుకువస్తున్నారు. 2015 నవంబర్ 23న ఓ కార్యక్రమంలో ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ దేశంలో అసహనం వివాదం నేపథ్యంలో తన భార్య భారత్ విడిచివెళ్లిపోదామా? అని అడిగిందని, దేశంలోని భయానక పరిస్థితి ఆమెతో అలా అనిపించిందని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆమిర్ ను ఇరకాటంలో పెట్టే ప్రచారానికి బీజేపీ ఐటీ సెల్ పూనుకుందని, ఆయనను స్నాప్ డీల్ బ్రాండ్ అంబాసిడర్ గా తొలగించేలా ఒత్తిడి తెచ్చిందని ఆమె ఖోస్లా ఆరోపించారు. ఏకంగా పార్టీ ఐటీ సెల్ చీఫ్ అరవింద్ గుప్తా ఈ విషయంలో సూచనలు ఇస్తూ వాట్సాప్ లో తనకు మెసేజ్ లు పంపించారని, అంతేకాకుండా ఆమిర్ ను తొలగించేందుకు ఉద్దేశించిన ఆన్ లైన్ పిటిషన్ పై నెటిజన్లతో సంతకాలు చేయించాలని సూచిస్తూ లింక్ కూడా పంపించారని ఆమె పేర్కొన్నారు. ఈ వివాదం నేపథ్యంలో 2016 జనవరిలో బ్రాండ్ అంబాసిడర్ గా ఆమిర్ కాంట్రాక్టు ముగియగా.. దానిని స్నాప్ డీల్ కొనసాగించలేదు. అయితే, ఈ పుస్తకంలోని ఆరోపణలను అరవింద్ గుప్తా తిరస్కరించారు. ఆమె కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నదని, తాము ట్రోల్ ను ఎప్పుడూ ప్రోత్సహించలేదని చెప్పారు. -
ఏడురోజుల నష్టాలకు బ్రేక్...
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో స్వల్ప లాభాలతో ముగిశాయి. లాభనష్టాల మధ్య ఊగిసలాడినా, వరుసగా ఏడు సెషన్ల నష్టాలకు చెక్ పెట్టి చివరకు సెన్సెక్స్, నిఫ్టీలు పాజిటివ్గా ముగిశాయి. సెన్సెక్స్ 61పాయింట్ల లాభంతో 26,040వద్ద, నిఫ్టీ 7 పాయింట్ల లాభంతో్ 7,985.75 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ మరోసారి 26వేల పాయింట్ల కీలక స్థాయిలో, నిఫ్టీ 8 వేలకు దిగువన ముగిసింది. కేపిటల్ గూడ్స్, ఆటోమొబైల్, కన్జూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు లాభాలను ఆర్జించాయి. దివీస్ కు షాక్ నేపథ్యంలో ఫార్మా నష్టపోగా ఐటీ, టెక్నాలజీ షేర్లతో పాటు స్మాల్క్యాప్, మిడ్క్యాప్ రంగాలు కూడా నష్టపోయాయి.రోజంతా సెన్సెక్స్ నారో బ్యాండ్ లోట్రేడ్ అయింది. దీంతో ఫారిన్ ఇన్వెస్టర్ల అమ్మకాల కారణంగా మార్కెట్లు ఒత్తిడిలో ఉన్నట్టు విశ్లేషకుల అంచనా. సిప్లా, బాష్, మారుతి సుజుకి, బజాజ్ ఆటో, సన్ ఫార్మా టాప్గెయినర్స్గా, హెచ్సీఎల్ టెక్ యాక్సిస్ బ్యాంక్, ఐషర్ మోటార్స్ అరబిందో ఫార్మా టెక్ మహీంద్రా టాప్ లూజర్స్గా నిలిచాయి. అటు డాలర్ తో పోలిస్తే రూపాయి 16 పైసల లాభంతో రూ.67.83 వదఉంది. అలాగే ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రా. పుత్తడి రూ.33 క్షీణించి, రూ.26,935 వద్ద ఆకర్షణీయంగా ఉంది. -
ఇంటివద్దకే నగదు...స్నాప్డీల్ బంపర్ ఆఫర్
పెద్ద నోట్లు రూ.500, రూ.1000 రద్దుతో ఏర్పడిన నగదు కొరతకు దేశీయ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ దిగ్గజం స్నాప్డీల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది."Cash@Home" సర్వీసుల కింద ప్రజలకు కనీస అవసరార్థం నగదును ఇంటివద్దకే డెలివరీ చేయనున్నట్టు తెలిపింది. గురువారం నుంచి ఈ సర్వీసులను లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించింది. యూజర్ల అభ్యర్థన మేరకు ఈ సర్వీసుల కింద గరిష్టంగా ఒక బుకింగ్కు రూ.2000 వరకు నగదును స్నాప్ డీల్ డెలివరీ చేయనుంది. నగదు డెలివరీ చేసిన సమయంలోనే యూజర్లు తమ బ్యాంకు ఏటీఎం కార్డును పీఓఎస్ మిషన్లో స్వైప్ చేసి స్నాప్డీల్కు ఈ నగదు చెల్లించవచ్చు. అయితే నామమాత్రపు రుసుము కింద రూ. 1ను కంపెనీ చార్జ్ చేయనుంది. బుకింగ్ చేసుకునే సమయంలోనే ఈ ఫీజును డెబిట్ కార్డు ద్వారానైనా లేదా ఫ్రీఛార్జ్ ద్వారానైనా చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ సర్వీసులతో గంటల కొద్దీ బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు ఎలాంటి అవస్థలు పడకుండా సులభతరంగా నగదు అందేలా చేయనున్నామని కంపెనీ చెప్పింది. "Cash@Home" సర్వీసుల కింద మరే ఇతర ఆర్డర్లను స్నాప్డీల్ స్వీకరించదు. గుర్గావ్, బెంగళూరు వంటి ప్రాంతాల్లో ఇప్పటికే ఈ సర్వీసులను కంపెనీ లైవ్గా ప్రారంభించింది. మిగతా మేజర్ నగరాల్లో ఈ సర్వీసులను కొన్ని రోజుల్లోనే అందుబాటులోకి తీసుకురానున్నట్టు కంపెనీ పేర్కొంది. -
సీవోడీ లావాదేవీలు తగ్గాయ్: స్నాప్డీల్
కోల్కతా: కరెన్సీ నోట్ల రద్దు వల్ల క్యాష్ ఆన్ డెలివరీ (సీవోడీ) పేమెంట్స్పై ప్రతికూల ప్రభావం పడిందని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ స్నాప్డీల్ సహవ్యవస్థాపకుడు కూనల్ భల్ తెలిపారు. ఈ-కామర్స్ సంస్థల మొత్తం లావాదేవీల్లో సీవోడీ వాటా 70% వరకు ఉంటుందని, ప్రస్తుతం దీనిలో కొంత క్షీణత నమోదరుు్యందన్నారు. ఈ తగ్గుదల పాక్షికమని, మళ్లీ సీవోడీ బిజినెస్ యథాస్థితికి చేరుతుందని తెలిపారు. నోట్ల రద్ద వల్ల ప్రజలు క్రెడిట్, డెబిట్ కార్డు చెల్లింపులకు తొలి ప్రాధాన్యమిస్తున్నారని పేర్కొన్నారు. దీని వల్ల డిజిటల్ పేమెంట్స్ పెరుగుతాయని, తద్వారా దీర్ఘకాలంలో ఈ-కామర్స్ పరిశ్రమ కార్యకలాపాలు సులభతరం అవుతాయని భల్ తెలిపారు. -
స్నాప్డీల్ ఇన్స్టంట్ డిస్కౌంట్
ముంబై: నల్లధనానికి చెక్ పెట్టే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన రూ. 500, 1000 నోట్ల ఉపసంహరణ ప్రకటనతో ఈకామర్స్ సంస్థలుకూడా స్పందిస్తున్నాయి. నిన్న ఫ్లిప్కార్ట్, అమెజాన క్యాష్ ఆన్ డెలివరీ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తే స్నాప్ డీల్ మాత్రం విభిన్నంగా స్పందించింది. ఇప్పటికే వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చిన వాలెట్ ఆన్ డెలివరీ లో అన్ని రకాల కార్డుల లావాదేవీలపై తక్షణం 10శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. పరిమితి కాలానికి అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ సదుపాయంలో 5వేల రూపాయల కొనుగోలుపై సుమారు 500 వరకు డిస్కౌంట్ లభించనున్నట్టు సంస్థ ప్రకటించింది. నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించేందుగా వీలుగా కొన్ని రకాల స్మార్ట్ఫోన్లతో సహా, ఇతర ఉత్పత్తుల అమ్మకాలపై అన్ని క్రెడిట్ మరియు డెబిట్ కార్డులపై 10 శాతం 'తక్షణ డిస్కౌంట్' అందిస్తోంది. వెబ్ లేదా మొబైల్ ఆప్ ద్వారా చెల్లుబాటు అయ్యేలా ఉన్న ఈ ఆఫర్ నవంబర్ 10 వరకు మాత్రమే అందుబాటులో ఉంది. అంతేకాదు ఈఎంఐ ఆప్షన్తో చేసే కొనుగోళ్లకు కూడా ఈ ఆఫర్ను వర్తింప చేస్తున్నట్టు స్నాప్ డీల్ ఒక ప్రకటనలో తెలిపింది. -
ఆన్లైన్... పండగ చేస్కో!
పొద్దస్తమానం స్మార్ట్ఫోన్లో వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్ చెక్ చేసుకుంటున్న భర్తతో విసిగి వేసారిన భార్య అన్న మాట... ‘మీరు ఆ వెధవ వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్లలో ఎంతసేపు గడుపుతారో, అంతసేపు నేనూ ఫ్లిప్కార్ట్, అమెజాన్, శ్నాప్ డీల్ చూస్తా’. అంతే! సదరు భర్త గారు ఠక్కున స్మార్ట్ఫోన్ కట్టేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న జోక్ ఇది. ప్రతి వస్తువూ... పల్లె వాకిట్లో! గుంటూరు జిల్లా నరసరావు పేట సమీపంలోని మాచవరం గ్రామానికి చెందిన కృష్ణ ఇప్పుడు లేటెస్ట్ స్మార్ట్ఫోన్ నుంచి పెన్డ్రైవ్ దాకా దేనికీ ‘పేట’కో, గుంటూరుకో వెళ్ళాల్సిన పని లేదు. అక్కడ వాళ్ళు చెప్పినంత రేటు పెట్టి, కొనాల్సిన పనీ లేదు. అక్కడ అమ్మే ధర కన్నా కనీసం 30 శాతం తక్కువకే ఆ వస్తువులన్నీ ‘ఫ్లిప్ కార్ట్’తో ఇంటి గుమ్మంలోకే వస్తున్నాయి. ‘క్యాష్ ఆన్ డెలివరీ’ పుణ్యమా అని, ఇంటికి వచ్చి వస్తువు ఇచ్చి మరీ డబ్బులు కట్టించుకొనే వెసులుబాటూ వచ్చింది. తెలుగు నేలపై కృష్ణ లాంటి కొన్ని లక్షల మంది గ్రామీణవాసులు ఇప్పుడు ఈ పనే చేస్తున్నారు. ఈ ఆన్లైన్ రిటైల్ విక్రేతల పుణ్యమా అని నగరవాసులు కొనుక్కునేవన్నీ... చిన్న పట్నాల్లో, పల్లెల్లో ఉన్న వీళ్ళకు కూడా ఎంచక్కా అందుబాటులోకి వచ్చేశాయి. తాజా పండుగ సేల్స్లో కూడా చిన్న పట్నాలదే పెద్ద వాటా! ఢిల్లీ, ముంబయ్ లాంటి మెట్రో నగరాలే కాదు... ఈసారి జైపూర్, పుణే, లక్నో లాంటి ద్వితీయ శ్రేణి నగరాలు కూడా ఈ ఆన్లైన్ అమ్మకాల్లో ముందుంటున్నాయి. దేశం మూలమూలల్లోని మిజోరమ్, మేఘాలయ, గోవా, హిమాచల్ ప్రదేశ్, జమ్ము - కాశ్మీర్ల నుంచి ఇంటర్నెట్లో కొనుగోళ్ళు గతంలో ఎన్నడూ లేనంత పెరిగాయని ఆ సంస్థల వాళ్ళే లెక్కలతో సహా చెబుతున్నారు. దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి ఈసారి ఆన్లైన్ సేల్స్ ఏకంగా 20 రెట్లు పెరిగాయి. పండుగకు ‘ఆఫర్’ల సంత ఈ లాజిక్లకు తగ్గట్లు పండుగ సీజన్లు వస్తే స్టోర్స్లోనే కాదు... ఆన్లైన్ నిండా ఆఫర్ల వెల్లువే! ఓనమ్, వినాయక చవితితో మొదలుపెట్టి దసరాకు ఇది బాగా ఊపందుకుంటుంది. దీపావళి మీదుగా క్రిస్టమస్ దాకా ఈ పండుగ సేల్స్ సాగుతాయి. తాజాగా ఈ దీపావళికి ఆన్లైన్లో ధరల్లో డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, అదనపు భారం లేని ‘ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్’ (ఇ.ఎం.ఐ)లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు - ఇలా బోలెడు ఆకర్షణలు. ధరల్లో డిస్కౌంటే సగటున 40 నుంచి 50 శాతం పైనే ఉంది. అందుకే, అప్పటి దాకా కొనకుండా ఆగినవాళ్ళు కూడా ఆన్లైన్లో కావాల్సినవి బుక్ చేసేస్తున్నారు. ముఖ్యంగా మొబైల్ ఫోన్లకైతే ఆన్లైన్ సైట్లే పెద్ద అమ్మకాల వేదిక. మీకు తెలుసా? జియామీ, మోటరోలా, శామ్సంగ్ లాంటి మంచి బ్రాండ్ మొబైల్స్ ఉన్న ‘ఫ్లిప్కార్ట్’ ఈ దీపావళి సేల్లో మొదటి రోజే 8 లక్షల ఫోన్లు అమ్మేసింది. లెక్కగా చెప్పాలంటే, ఆ అమ్మకాల విలువ దాదాపు రూ. 70 కోట్లట! విచిత్రం ఏమిటంటే, ఈ ఆన్లైన్ కొనుగోళ్ళ కోసం ఎక్కువమంది వాడుతున్నది కూడా మళ్ళీ మొబైల్ ఫోన్లు, వాటిలోని యాప్లే! కంప్యూటర్లో నెట్ ఓపెన్ చేసే కన్నా చేతిలోని స్మార్ట్ఫోన్లోనే ఆన్లైన్ డీల్స్ చూసుకొని, ఆన్లైన్లోనే కొనుగోలు చేయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. ఆసియా - పసిఫిక్ ప్రాంతం, అందులోనూ మన లాంటి దేశాలు అందులో ముందున్నాయి. మొన్న దసరాల్లో అధిక శాతం మంది (దాదాపు 74 శాతం) ‘ఫ్లిప్కార్ట్’ ఇ-కామర్స్ మొబైల్ యాప్ వాడారని ఒక సర్వే తేల్చింది. ఆ తరువాతి స్థానాల్లో అమెజాన్, శ్నాప్డీల్ నిలిచాయి. తాజా ఫెస్టివల్ సీజన్లో ఏకంగా 20 నుంచి 25 వేల కోట్ల రూపాయల మేర ఆన్లైన్ సేల్స్ జరుగుతాయని అంచనా. నేరుగా రిటైల్ షాపుల్లో జరిగే బిజినెస్ మాత్రం 10 నుంచి 15 వేల కోట్లే ఉంటుందట! ఇప్పుడంతా... ‘ఇ’ షాపింగే! హైదరాబాద్లో ఊరికి కాస్తంత దూరంగా విశాలమైన విల్లాలో ఉంటున్న ప్రియదర్శినికి కూడా ఇప్పుడు షాపింగ్ అంటే, ‘ఇ-షాపింగే’! లేటెస్ట్ ఐ-7 ఫోన్లో నెట్ చూస్తున్నప్పుడు ఆమె తరచూ చూసేది ‘మింత్రా’ వెబ్సైట్. దానికి కారణం లేకపోలేదు. ఎక్కడికి వెళ్ళినా సరే అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలనుకొనే ఈ నడి వయసు మహిళ ఎప్పుడూ రకరకాల దుస్తులు, ఫ్యాషన్ గేర్ కొంటూనే ఉంటారు. అందుకే, ఫ్యాషన్ దుస్తులు, ఆభరణాలకు సంబంధించిన మోస్ట్ పాపులర్ ఇ-కామర్స్ వెబ్సైట్ ‘మింత్రా’ ఆమెకు ఆత్మీయ నేస్తం. ప్రతి నెలా ఆ సైట్ ద్వారా ఆమె వేలల్లో కొనుగోలు చేస్తారన్నదానికి ఆమె విల్లాలో వార్డ్రోబ్లోని దుస్తులు, ఆభరణాలే సాక్ష్యం. ‘ఊరవతలి విల్లా నుంచి కాలు కదపాల్సిన అవసరమే లేకుండా, ట్రాఫిక్లో కారు ప్రయాణం బాదరబందీ లేకుండా హాయిగా ఇంట్లో కూర్చొనే షాపింగ్ చేసే వసతి ఉన్నప్పుడు దాన్ని వాడుకుంటే తప్పేంటి? తెలివైన పనేగా’ అన్నది ప్రియదర్శిని లాజిక్. నెట్టు... ఆన్లైన్ కిరాణా కొట్టు! ఛలోక్తిగా చెప్పినా ఇందులో ఓ నిజం ఉంది. ఇప్పుడు జనం దృష్టి అంతా ఇంటర్నెట్టులోని ఆన్లైన్ సేల్స్ మీదే! ఆషాఢం, దసరా, దీపావళి లాంటి పండుగ సీజన్లు వస్తే ఒకప్పుడు దుకాణాల్లో డిస్కౌంట్ సేల్స్ పాపులర్. కానీ, ఇప్పుడు వాటన్నిటినీ పక్కకు నెట్టేస్తున్న ఆన్లైన్ ‘ఫెస్టివ్ ఆఫర్’లదే హవా! మొబైల్ ఫోన్ల నుంచి మంచి ఎల్.ఇ.డి. టీవీల దాకా అన్నిటికీ కేరాఫ్ అడ్రస్ - ఆన్లైనే! నెట్లో ‘ఫ్లిప్కార్ట్’ లాంటి ఇ-కామర్స్ వెబ్సైట్ల ద్వారా వస్తువులు కొనేవాళ్ళ సంఖ్య ఇప్పుడు రోజు రోజుకీ ఎక్కువవుతోంది. బయట దుకాణంలో కన్నా తక్కువ రేటుకే కొనుక్కొని లాభపడుతున్నవాళ్ళూ ఉన్నారు. ఈ రకం వెబ్సైట్స్తో వీర కొనుగోళ్ళ వ్యసనానికి లోనై, సాలెగూటిలో చిక్కుకుంటున్నవాళ్ళూ ఉన్నారు. వెరసి, ఏ టైమ్లోనైనా, ఎక్కడ నుంచైనా కావాల్సినవి కొనుక్కొనేందుకు వీలు కల్పిస్తున్న ‘ఇ- కామర్స్’ వెబ్సైట్లు మాత్రం ఇప్పుడు ఊరూవాడా పెద్ద హిట్! చిన్న పట్నాలు... పెద్ద గిడ్డంగులు మొత్తం మీద, ఆన్లైన్లో రిటైల్ అమ్మకాలు జరిపే ఈ ‘ఇ-కామర్స్’ వెబ్సైట్లకు ఇప్పుడు మన దేశం ఒక అతి పెద్ద మార్కెట్. ఇక్కడి అతి పెద్ద ‘ఇ-కామర్స్’ కంపెనీ ‘ఫ్లిప్కార్ట్’కి దేశం మొత్తం మీద 18 భారీ గిడ్డంగులున్నాయి. సింగపూర్ కేంద్రంగా నడిచే ఆ సంస్థ ఈ దసరా, దీపావళి పండుగల్లో జనం కొనుగోళ్ళ రద్దీని తట్టుకొనేందుకు గత నెలలోనే ఉత్తర ప్రదేశ్లో రెండో వేర్హౌస్ తెరిచింది. ఇక, అమెరికా వాళ్ళదైన ‘అమెజాన్ ఇండియా’ మన దేశంలో రెండో అతి పెద్ద సంస్థ. సుమారు 25 లక్షల చదరపుటడుగుల జాగాలో కేంద్రాలైతేనేం, గిడ్డంగులైతేనేం మొత్తం 27 నడుపుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న గిరాకీకి తగ్గట్లుగా ఈ ఆన్లైన్ వ్యాపార సంస్థలు తమ గిడ్డంగుల సామర్థ్యం పెంచుకుంటున్నాయి. చిన్న చిన్న పట్నాల్లో కొత్త గిడ్డంగుల కోసం జాగా తీసుకుంటున్నాయి. హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, పుణేల్లో మరింత జాగా కోసం చూస్తున్నాయి. ఢిల్లీ నుంచి నడిచే ‘శ్నాప్డీల్’ సంస్థ కూడా రెక్కలు చాస్తోంది. వెరసి, మరో నాలుగేళ్ళలో 2020 నాటి కల్లా ఈ ఆన్లైన్ రిటైల్ సంస్థల గిడ్డంగుల వైశాల్యం ఇప్పుడున్న దానికి రెట్టింపు (దాదాపు 2 కోట్ల 9 లక్షల చదరపుటడుగులు) అవుతుందని పరిశ్రమ వర్గాల అంచనా. ఇది వేల కోట్ల పండుగ! కొద్ది రోజులుగా పేరున్న ఇంగ్లీషు, తెలుగు పేపర్లలో రోజూ వస్తున్న ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు చూస్తున్నారా? ఫ్లిప్కార్ట్, అమెజాన్, శ్నాప్డీల్... ఇలా రకరకాల ఆన్లైన్ రిటైల్ వ్యాపారసంస్థల దీపావళి ధమాకా ఆఫర్లు ముంచెత్తుతున్నాయి. ఇప్పుడు ‘ఇ-కామర్స్’, ఈ పండగ సేల్ ఎంత పెద్దవంటే... మన దేశంలో జరిగే మొత్తం రిటైల్ వ్యాపారంలో ప్రతి 100 రూపాయల్లో 5 రూపాయలు ఆన్లైన్ ‘ఇ-కామర్స్’దే! చైనాలో ‘ఇ-కామర్స్’ మార్కెట్ దాదాపు 40 వేల నుంచి 50 వేల కోట్ల డాలర్లు. మనదేశంలో ‘ఇ-కామర్స్’ మార్కెట్ (ట్రావెల్ మినహా) దాదాపు 1000 కోట్ల డాలర్లు. అంటే సుమారు రూ. 70 వేల కోట్లు. 2014 నుంచి ఏటా మన దేశంలో ఇలా పండుగలకి ఆన్లైన్ ఫెస్టివ్ సేల్స్ ఆఫర్లు ఊపందుకున్నాయి. మొదట ‘ఫ్లిప్కార్ట్’ శ్రీకారం చుట్టింది. ఆ వెంటనే ‘అమెజాన్’ కూడా వరుస కట్టింది. ఈసారి కనీసం అయిదు అగ్రశ్రేణి ఆన్లైన్ రిటైల్ సంస్థలు పండగ చేస్తున్నాయి. ఈ సంస్థలు 80కి పైగా విభాగాల్లో ఉత్పత్తులు అమ్ముతున్నాయి. ధరల్లో భారీ డిస్కౌంట్లు, వడ్డీ లేని ఇ.ఎం.ఐ.లు, క్యాష్బ్యాక్ వసతుల లాంటివి కొనుగోలుదార్లను రా... రమ్మని ఆకర్షిస్తున్నాయి. ఈ ఆన్లైన్ సంస్థల వార్షిక అమ్మకాల్లో దాదాపు 30 నుంచి 35 శాతం ఈ అక్టోబర్ సీజన్లో, భారీ డిస్కౌంట్ ఇచ్చే రోజుల్లోనే జరుగుతాయని ఓ లెక్క. ఆన్లైన్లో ప్రధానంగా ఎలక్ట్రానిక్స్ వస్తువులు, మొబైల్ ఫోన్లకు గిరాకీ ఎక్కువ. ఈసారి దుస్తులు, షూస్కి కూడా డిమాండ్ బాగుంది. ఫర్నిచర్ లాంటి హోమ్ ప్రొడక్ట్స్కి సరే సరి! గత రెండేళ్ళుగా బయట షాపుల్లో జరిగే రిటైల్ బిజినెస్ మార్కెట్ వాటాను ఈ ఆన్లైన్ వెబ్సైట్లు తినేస్తున్నాయి. అవసరం కాదు... ‘ఆఫర్’ ఉందంతే! కానీ, ఈ ‘ఇ-కామర్స్’ వెబ్సైట్స్ వల్ల కొన్ని లాభాలతో పాటూ కొన్ని నష్టాలూ తప్పడం లేదు. మూడు పదుల వయసున్న ఎస్. ఈశ్వరరావు మంచి పనిమంతుడు. పాతికేళ్ళకే హైదరాబాద్లో మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. ఇంట్లో భార్య, ఇద్దరు పిల్లలు, అమ్మానాన్న... అంతే! ఆఫీసులో పని వల్ల ఎప్పుడూ కంప్యూటర్లో ఇంటర్నెట్ అందుబాటులో ఉండే ఈ యువకుడికి మూడేళ్ళ క్రితం ఫ్లిప్కార్ట్, అమెజాన్ పరిచయమయ్యాయి. కావాల్సినవి నెట్లో ఆర్డర్ చేయడానికి సుఖం, సులభంగా అనిపించాయి. ఈ సైట్స్ పరిచయం ఆ తరువాత అలవాటుగా మారింది. ఇప్పుడు ఓ వ్యసనంగా తయారైంది. ఆఫీసుకు వస్తూనే ఈ ఆన్లైన్ రిటైల్ వ్యాపారసైట్స్ ఓపెన్ చేయడం, ఎంత ఆఫీసు పనిలో ఉన్నా సరే, మధ్యలో ఆ సైట్స్లో కొత్త ఆఫర్లు చూసుకోవడం అతనికి పెద్ద బలహీనతగా మారింది. జేబుకు చిల్లు... క్యాష్లెస్ కొనుగోలు! చేతితో డబ్బు లెక్కపెట్టి ఇవ్వాల్సిన అవసరం లేకుండా, ఆన్లైన్లోనే డెబిట్, క్రెడిట్కార్డ్లతో కొనుగోళ్ళ వల్ల, కొనేవాడికి నొప్పి తెలియడం లేదు. దాంతో, కొనుగోళ్ళు పెరుగుతున్నాయి. ఈ క్యాష్లెస్ ఆన్లైన్ పేమెంట్ల పుణ్యమా అని వచ్చే దశాబ్ద కాలంలో ప్రపంచవ్యాప్తంగా జనం 10 లక్షల కోట్ల డాలర్ల (మన కరెన్సీలో దాదాపు రూ. 70 లక్షల కోట్ల) మేర మొత్తాన్ని అదనంగా ఖర్చు చేస్తారని ‘నీల్సెన్’ తదితర సంస్థల అంచనా. అతిగా కొనకండి! ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ల లెక్కల ప్రకారం ఈ అక్టోబర్ మొదటి వారంలోనే మన భారతీయులు దాదాపు రూ. 10 వేల కోట్ల విలువైన వస్తువులు కొన్నారు. అతిగా షాపింగ్ చేయడం ఇప్పుడు దేశమంతటా మనల్ని పట్టిపీడిస్తున్న జాడ్యం. దీన్ని వదిలించుకోవాలంటే... • అవసరం ఉన్న వస్తువులే కొనాలి. భారీ డిస్కౌంట్ ఉంది కదా అని, అవసరం ఉన్నా లేకపోయినా కనిపించిన ప్రతీదీ కొనేయకండి. • నవ తరం యువతీ యువకులు ఇవాళ తాము చేసే ప్రతి అనవసర షాపింగ్తో, రేపు ఇల్లు, వాహనం లాంటి అవసరమయ్యే దీర్ఘకాలిక లక్ష్యాలకు దూరమవుతామని గ్రహించాలి. • {Mెడిట్ కార్డుల లాంటివి ఎక్కువగా వాడకండి. వీలైనంత వరకు డబ్బులు పెట్టి, షాపింగ్ చేయండి. అప్పుడు ప్రతీదీ కొనాలనే వెంపర్లాటకు కళ్ళెం పడుతుంది. • {పతి నెలా జీతం రాగానే రికరింగ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్లలో ముందే మదుపు చేసేయండి. మదుపు చేయగా, మిగిలిన సొమ్ముతోనే ఇల్లు నడిపించండి. అప్పుడిక అతి షాపింగ్కు అవకాశమే ఉండదు. • ఏదైనా కొనాలనిపించగానే ఓ నెల రోజుల పాటు వాయిదా వేయండి. ఆ టైమ్లో ఆ వస్తువు నిజంగా అవసరమా అని ఆలోచించండి. తప్పనిసరి అనుకుంటే అప్పుడు కొనండి. గ్యాడ్జెట్లు, దుస్తులు, షూస్, ఆభరణాల లాంటి వాటి విషయంలో ఆకర్షణను ఆపుకోవడానికి ఇది అద్భుత మంత్రం. • మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి షాపింగ్ను మార్గంగా పెట్టుకోకండి. దాని కన్నా తోటి మనుషులతో మాట్లాడడమే బెటర్. అప్పటికప్పుడు జేబులో నుంచి డబ్బులు తీసి కట్టాల్సిన అవసరం లేకపోవడం, కాలు కదపకుండా ఏ వస్తువైనా ఇంటికే వచ్చే సౌకర్యం ఉండడంతో ఈశ్వర్ లాంటి చాలామంది ఇప్పుడు ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి సైట్స్కు తెలియకుండానే బానిసలు అవుతున్నారు. అవసరంతో సంబంధం లేకుండా తగ్గింపు ‘ఆఫర్’ ఉంది కదా అని, ఎడాపెడా నెట్లో రకరకాల వస్తువులు కొనేస్తున్నారు. క్రెడిట్, డెబిట్ కార్డుల్ని అవసరానికి మించి అతిగా వాడుతున్నారు. అందుకే, ఈ వీక్నెస్ నుంచి బయటపడకపోతే, ఆన్లైన్ సైట్లు బాగుపడ్డా, ఆర్థికంగా దెబ్బతినడం మన వంతు అవుతుంది. పెపైచ్చు, రానున్న అయిదేళ్ళలో దేశంలో ఇంటర్నెట్ యూజర్లు మరింత పెరగనున్నారు. వాళ్ళలో ఆడవాళ్ళు 29 శాతం నుంచి ఏకంగా 40 శాతానికి ఎగబాకనున్నారు. అంటే, ఆన్లైన్ షాపింగ్ ఇంకా ఇంకా పెరగడం తథ్యం. మరి, జాగ్రత్తగా ఉండాలంటున్నది అందుకే! - రెంటాల జయదేవ -
కొత్త ఐఫోన్7పై భలే డిస్కౌంట్!
పండుగ సీజన్లో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఈ-కామర్స్ దిగ్గజం స్నాప్డీల్ నిర్వహిస్తున్న అన్బాక్స్ సేల్ ఆఫర్లో చివరి రోజు కొత్త ఆపిల్ ఐఫోన్7పై స్పెషల్ డిస్కౌంట్ ప్రకటించింది. ధరపై రూ.7,000ల డిస్కౌంట్ అందిస్తున్నట్టు స్నాప్డీల్ పేర్కొంది. అయితే ఈ డిస్కౌంట్ కేవలం యస్ బ్యాంకు కార్డు హోల్డర్స్కేనని, నేటి మధ్యాహ్నం 12 గంటల వరకు లేదా స్టాక్స్ అయిపోయేంత వరకు ఈ ఆఫర్ వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నట్టు స్నాప్డీల్ తెలిపింది. అంతేకాక ఈ డిస్కౌంట్ ఐఫోన్7 యూజర్లకు మాత్రమే వర్తించనుంది. ఎవరైతే ఐఫోన్7 ప్లస్ కొనుకోవాలనుకుంటున్నారో వారికి ఈ ఆఫర్ను స్నాప్డీల్ ప్రకటించలేదు.ఈ ఆఫర్ కింద ఇతర మోడల్ ఫోన్ను ఎక్స్చేంజ్ చేసుకుని ఐఫోన్7ను కొనుగోలు చేసే వారికి రూ.20వేల వరకు ధర తగ్గించనుంది. అయితే వినియోగదారులు ఎక్స్చేంజ్ చేసుకునే మోడల్ బట్టి ఈ ఆఫర్ అందించనున్నట్టు తెలిపింది. గతవారం నిర్వహించిన మొదటి అన్బాక్స్ దివాళి సేల్ కింద ఇదేమాదిరి ఆఫర్ను స్నాప్డీల్ వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్స్పై ఫ్లాట్పై రూ.10,000ల డిస్కౌంట్ ఇచ్చింది. అయితే ఎలాంటి నోటీసులు లేకుండా అప్పుడు ఆ ఆఫర్ను స్నాప్డీల్ వెనక్కి తీసుకోవడంపై వినియోగదారులు నిరాశ చెందారు. నిరాశ పొందిన కస్టమర్ల కోసం మరోసారి ఈ ఆఫర్ను తీసుకొచ్చింది. ఐఫోన్ 7 ఆఫర్తో పాటు, హెచ్డీఎఫ్సీ కార్డు హోల్డర్లతోనూ స్నాప్డీల్ జతకట్టింది. తమ ప్లాట్ఫామ్పై హెచ్డీఎఫ్సీ కార్డుపై ఉత్పత్తులు కొనుగోలు చేసిన వారికి 10 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. అదేవిధంగాఎక్స్చేంజ్ ఆఫర్లను, ఆపిల్ ఐఫోన్ 6ఎస్, లీఎకో లీ మ్యాక్స్ 2, శాంసంగ్ గెలాక్సీ జే3 వంటి ఇతర స్మార్ట్ఫోన్లపై హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్యాష్ బ్యాక్ ఆఫర్లను స్నాప్డీల్ వినియోగదారుల ముంగిట్లోకి తీసుకొచ్చింది. -
స్నాప్డీల్ మరోవిడత ఫెస్టివల్ సేల్స్
• రేపటి నుంచి మూడు రోజులు • ఎస్బీఐ కార్డులపై 10 శాతం తగ్గింపు న్యూఢిల్లీ: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ స్నాప్డీల్ ఈ నెల 12 నుంచి 14 వరకు మరోసారి పండుగ విక్రయాలను నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. ప్రత్యర్థి సంస్థలు ఫ్లిప్కార్ట్, అమేజాన్లకు దీటుగా స్నాప్డీల్ ‘అన్బాక్స్ దివాళీ’ పేరుతో ఈ నెల 2-6 తేదీల మధ్య పండుగ తగ్గింపు విక్రయాలను చేపట్టింది. ఈ సందర్భంగా 11 మిలియన్ల ఉత్పత్తులను విక్రయించినట్టు ప్రకటించింది. భారీ స్పందనకుతోడు పండుగ వాతావరణంలో నేపథ్యంలో మరోసారి పెద్ద ఎత్తున విక్రయాలకు ముందుకు వచ్చింది. ఈ నెల 12-14 తేదీల మధ్య కొనుగోళ్లకు ఎస్బీఐ కార్డుల ద్వారా చెల్లింపులు చేయడం ద్వారా 10 శాతం ఇన్స్టంట్ తగ్గింపు పొందవచ్చని సంస్థ తెలిపింది. అలాగే, ఐఫోన్7, ఐఫోప్7 ప్లస్ మోడళ్లను అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డుల ద్వారా కొనుగోలు చేసే వారికి రూ.10వేలు తగ్గింపును ఆఫర్ చేస్తోంది. కాగా, ఫ్లిప్కార్ట్, అమేజాన్ సంస్థలు సైతం దిపావళి పండుగ లోపు మరోసారి తగ్గింపు విక్రయాలు చేపట్టే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
తొలిరోజే అదరగొట్టిన స్నాప్డీల్ సేల్స్
న్యూఢిల్లీ : ఈ-కామర్స్ దిగ్గజం స్నాప్డీల్ పండుగ సీజన్లో కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రారంభించిన 'అన్బాక్స్ దీపావళి సేల్' తొలిరోజు అదరగొట్టిందట. ఈ ఆఫర్ ద్వారా కంపెనీ విక్రయాలు తొమ్మిది రెట్లు ఎగిశాయని స్నాప్డీల్ ప్రకటించింది. స్నాప్డీల్ ప్లాట్ఫామ్పై అమ్మకాలు నిర్వహించే 37మంది విక్రయదారుల టర్నోవర్ రూ.1 కోట్లకు పైగా క్రాస్ అయినట్టు వెల్లడించింది. కేవలం ఇదంతా తొలిరోజే నమోదుకావడం విశేషం. ప్రతిరోజు నమోదవుతున్న అమ్మకాల కంటే కనీసం తొమ్మిది రెట్లు తమ విక్రయాలు ఎగిసినట్టు స్నాప్డీల్ ఓ ప్రకటనలో తెలిపింది. వీటిలో 80 శాతం ఆర్డర్స్ మొబైల్స్ నుంచి వస్తున్నట్టు పేర్కొంది. 2 టైర్,3 టైర్ నగరాల్లో ముందస్తు బుకింగ్స్ దాదాపు 20 శాతం పెరిగాయని, ఇతర మెట్రోలు మిజోరాం, మేఘాలయ, గోవా, హిమాచల్ప్రదేశ్, జమ్మూ అండ్ కశ్మీర్ ప్రాంతాల నుంచి కూడా ఎక్కువగానే ఆర్డర్స్ వస్తున్నట్టు వెల్లడించింది. మల్టిపుల్ ఫ్యాషన్ బ్రాండ్స్లోని ఫుట్వేర్ ఉత్పత్తుల్లో ఆకర్షించే డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయని, తొలిరోజే లక్షకు పైగా ఫుట్వేర్ పేర్స్ అమ్ముడు పోయినట్టు స్నాప్డీల్ పేర్కొంది. మొబైల్ ఫోన్లలో రెడ్మి నోట్3, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 5ఎస్, మి మ్యాక్స్, లీఎకో లీ మ్యాక్స్2లు టాప్ సెల్లింగ్ ఉత్పత్తులుగా నిలిచినట్టు వెల్లడించింది. ఎయిర్ కండీషర్లు, కిచెన్ ఉపకరణాలు, ప్రెషర్ కుక్కర్స్, కెమెరాలు, ల్యాప్టాప్స్ వంటివి కూడా ఎక్కువగా విక్రయించినట్టు స్నాప్డీల్ ఆ ప్రకటనలో తెలిపింది. -
పండుగ సీజన్లో ఈ-కామర్స్ దిగ్గజాల షాక్
న్యూఢిల్లీ : పండుగ సీజన్ను క్యాష్ చేసుకుని భారీగా ప్రకటనలు ఇచ్చేసుకునే ఉత్పత్తిదారులకు ఈ-కామర్స్ దిగ్గజాలు స్నాప్డీల్, ఫ్లిప్కార్ట్ షాకిచ్చాయి. దీపావళికి ముందు తమ ప్లాట్ఫామ్పై ప్రొడక్ట్ ప్రకటన ఇచ్చేవారికి భారీగా రేట్లను పెంచేశాయి.అక్టోబర్ 2 నుంచి 6వ తేదీ వరకు జరుగబోయే 'అన్బాక్స్ దీపావళి సేల్స్' ప్రోగ్రామ్ కింద అన్ని రకాల ఉత్పత్తులపై కాస్ట్ ఫర్ క్లిక్(సీపీఏ)లను స్నాప్డీల్ రెట్టింపు చేసింది. అదేవిధంగా ఫ్లిప్కార్ట్ సైతం ప్రొడక్ట్ లిస్టింగ్ యాడ్(పీఎల్ఏ) రేట్లను 50 శాతం పెంచేసింది. 'బిగ్ బిలియన్ డే సేల్' కింద లైఫ్స్టైల్, గృహోపకరణాలు, మొబైల్స్, ఎలక్ట్రానిక్ వంటి వస్తువులకు ఈ ప్రకటన ఖర్చులు భారం పడనుంది.మరో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా మాత్రం తాను నిర్వహించబోయే 'గ్రేట్ ఇండియన్ సేల్' నేపథ్యంలో ప్రకటన రేట్లలో ఎలాంటి మార్పులు చేపట్టలేదు.పెద్ద ఉత్పత్తుల బ్రాండులు తమ అడ్వర్టైజింగ్లను కోసం భారీ మొత్తంలో ఖర్చుచేసైనా సరే మీడియా ద్వారా ప్రకటనలు ఇచ్చేసుకుంటారని,కానీ చిన్న వర్తకులపైనే ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే పండుగ సీజన్లో ఉండే రద్దీకి అనుకూలంగా ఈ రేట్లను పెంచామని, టీవీ, ఇతర మీడియాలు కూడా ఈ సమయంలో ప్రకటన రేట్లను పెంచుతాయని ఫ్లిప్కార్ట్ సీనియర్ డైరెక్టర్ సంజయ్ రామకృష్ణ చెప్పారు. ప్రకటనదారులు దానికి సన్నద్దమయ్యే ఉంటారని పేర్కొన్నారు. -
డిస్కౌంట్ సేల్స్ అదుర్స్!
* లక్షల సంఖ్యలో ఉత్పత్తుల అమ్మకాలు * ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, అమెజాన్ ప్రకటన న్యూఢిల్లీ: పండుగల డిస్కౌంట్ అమ్మకాల్ని ప్రారంభించగానే లక్షలాది ఉత్పత్తుల అమ్మకాలు తమ సైట్ల ద్వారా జరిగినట్టు ఈ కామర్స్ అగ్రశ్రేణి సంస్థలు ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, అమెజాన్ ప్రకటించాయి. అమేజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ పేరుతో ఈ నెల 1 నుంచి 5 వరకు డిస్కౌంట్లతో ఆఫర్ సేల్స్ను ప్రకటించింది. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ పేరుతో, స్నాప్ డీల్ అన్బాక్స్ దివాళీ పేరుతో ఈ నెల 2 నుంచి ఐదు రోజుల పాటు విక్రయాలు నిర్వహిస్తున్నాయి. భారీ తగ్గింపులతో ఉత్పత్తులను ఆఫర్ చేస్తున్నట్టు ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ తెలిపాయి. 30 నిమిషాల్లో లక్ష ఉత్పత్తుల విక్రయం సాధారణ రోజుల్లో నిర్వహించే వ్యాపారం కంటే గ్రేట్ ఇండియా ఫెస్టివల్ మొదటి రోజు ( ఈనెల 1న) ఆరు రెట్లు అధికంగా లావాదేవీలు జరిగాయని అమేజాన్ ప్రకటించింది. మొదటి 30 నిమిషాల్లో లక్ష ఉత్పత్తులు అమ్ముడుపోయినట్టు తెలిపింది. మొదటి 12 గంటల్లో 15 లక్షల వస్తువులు విక్రయించామని వెల్లడించింది. 16 గంటల్లో 11 లక్షల లావాదేవీలు: అన్బాక్స్ దివాళీ పేరుతో ఆదివారం నుంచి ప్రత్యేక అమ్మకాలు ప్రారంభించిన స్నాప్డీల్ మొదటి రోజు మొదటి 16 గంటల్లో 2,800 ప్రాంతాల నుంచి 11 లక్షల మంది కొనుగోళ్లు చేసినట్టు తెలిపింది. శనివారం అర్ధరాత్రి తర్వాత అమ్మకాలు ప్రారంభం కాగా, సెకనుకు 180 ఆర్డర్లు బుక్ అయ్యాయని సంస్థ పేర్కొంది. సాయంత్రం 4 గంటల వరకు లావాదేవీల ప్రకారం... సాధారణ రోజుల్లో జరిగే లావాదేవీల విలువ కంటే ఆరు రెట్లు అధికంగా ఉన్నట్టు స్నాప్డీల్ వెల్లడించింది. గంటలో 5 లక్షల ఉత్పత్తులు: ఫ్లిప్కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్’ విక్రయాలు ఆదివారం ప్రారంభం కాగా మొదటి గంటలోనే ఐదు లక్షల ఉత్పత్తులు అమ్ముడుపోయాయని సంస్థ ప్రకటించింది. ఒక నెలలో ఆఫ్లైన్, ఆన్లైన్లో అమ్ముడుపోయే యాపిల్ వాచీల సంఖ్య కంటే అధికంగా తాము తొలి 10 నిమిషాల్లోనే విక్రయించినట్టు ఫ్లిప్కార్ట్ తన ప్రకటనలో పేర్కొంది. 2015లో బిగ్ బిలియన్ డేస్ మొదటి రోజు మొత్తం నమోదైన విక్రయాలను ఈ ఏడాది బిగ్బిలియన్ డేస్ మొదటి రోజు తొలి ఆరు గంటల్లోనే అధిగమించినట్టు తెలిపింది. తమ ఫ్యాషన్ ఉత్పత్తుల ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ మింత్రా సైతం గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి రోజు మొదటి గంటలో మూడు రెట్లు అధిక విలువ వ్యాపారాన్ని నమోదు చేసినట్టు తెలిపింది. తగ్గింపు అంతా కల్పితం... ఈ కామర్స్ సైట్లు ఇస్తున్న తగ్గింపు ఏమీ లేదంటూ ట్వీట్టర్లో కొందరు యూజర్లు కామెంట్లు పోస్ట్ చేయడం గమనార్హం. అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ షాపింగ్ ఫెస్టివల్ తగ్గింపు అంతా కల్పితమని, మార్కెటింగ్ గిమ్మిక్కు అనేది ఓ యూజర్ అభిప్రాయం. కొందరు యూజర్లు అయితే ఇతర సైట్లతో పోలిస్తే ఈ సైట్లలో ధరలు అధికంగా ఉన్నాయనేందుకు నిదర్శనంగా స్క్రీన్షాట్లను కూడా పోస్ట్ చేశారు. పేమెంట్ గేట్వే సమస్యలను కూడా కొందరు ప్రస్తావించారు. మరోవైపు ఈ కామర్స్ సైట్ల బిగ్ సేల్స్ ఎఫ్డీఐ పాలసీ ఉల్లంఘనగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ పేర్కొంది. -
‘అక్టోబర్’కు అంతా రెడీ!
♦ భారీ విక్రయాలకు ఈ-కామర్స్ సంస్థల రంగం ♦ 1-5 మధ్య అమెజాన్; 2-6 మధ్య ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ సేల్స్ ♦ భారీ డిస్కౌంట్లు ఉండకపోవచ్చంటున్న నిపుణులు ♦ అమ్మకాలు కూడా తగ్గవచ్చని రీసెర్చ్ సంస్థల అంచనా న్యూఢిల్లీ: దీపావళి, దసరా ఉత్సవాలకు ఈ-కామర్స్ సంస్థలు సిద్ధమైపోయాయి. భారీ విక్రయాలకు ఈ సారి అక్టోబర్ తొలి వారాన్ని అవి ముహూర్తంగా పెట్టుకున్నాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ ఇప్పటికే తేదీలను ఖరారు చేయగా... పేటీఎం, షాప్క్లూస్ వంటివి ఇంకా ప్రకటించలేదు. నిజానికి ఒక నెలలో సగటున జరిపే విక్రయాలకు రెండు మూడు రెట్లు అధికంగా ఈ ‘ఫెస్టివల్ డేస్’లో నమోదు చేయాలన్నది ఈ కామర్స్ సంస్థల వ్యూహం. నో కాస్ట్ ఈఎంఐ (వడ్డీ, ఇతర చార్జీలు లేకుండా వాయిదాల్లో చెల్లించడం), వేగంగా వస్తువుల డెలివరీ, ఈజీ ఎక్స్చేంజ్ ఇలా విభిన్న సదుపాయాలను ఆఫర్ చేస్తున్నాయి కూడా. అయితే ఎన్ని ఆఫర్లున్నా కస్టమర్ చూపు డిస్కౌంట్లపైనే ఉంటుందన్న విషయం వాటికి తెలియనిది కాదు. అందుకే భారీ ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. దీనికోసం అమెజాన్ ఇండియా రూ.125 కోట్లు, స్నాప్డీల్ రూ.200 కోట్లు కేటాయించాయి. మార్కెట్ లీడర్గా ఉన్న ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే ప్రచార ప్రకటనల కోసం రూ.30 కోట్లు వెచ్చించనుంది. స్నాప్డీల్ ‘ఈజీ ఎక్స్చేంజ్’ స్నాప్డీల్ అక్టోబర్ 2-6 మధ్య ఫెస్టివల్ సేల్ను నిర్వహిస్తోంది. పాత ఉత్పత్తిని కొత్త ఉత్పత్తితో ఎక్స్చేంజ్ చేసుకునే సదుపాయాన్నిస్తోంది. ఎలక్ట్రానిక్ పరిరకాలు, మొబైల్ ఫోన్లపై ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తున్నట్లు ప్రకటించింది. డెలివరీ కోసం తాత్కాలికంగా 10వేల మంది లాజిస్టిక్ సిబ్బందిని నియమించుకుందని రీసెర్చ్ సంస్థ రెడ్సీర్ వెల్లడించింది. ఫ్లిప్కార్ట్ బీబీడీ దేశీ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ‘బిగ్ బిలియన్ డే (బీబీడీ)’ విక్రయాలు అక్టోబర్ 2- 6 మధ్య సాగనున్నాయి. ‘నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్’ అమ్మకాలను వెల్లువెత్తిస్తుందని సంస్థ అంచనా వేస్తోంది. చాలా వరకు స్మార్ట్ఫోన్లు, టెలివిజన్లు, ఇతర గృహోపకరాణలను నో కాస్ట్ ఈఎంఐ కింద ఆఫర్ చేయనుంది. గతంలో పాపులర్ అయిన రూ.1 ఆఫర్, ఎక్స్చేంజ్ ఆఫర్లను సైతం ప్రకటించే అవకాశం ఉంది. డిస్కౌంట్లు ఉండకపోవచ్చు... పోటాపోటీగా అమ్మకాలు జరపనున్నప్పటికీ ఏ సంస్థా భారీ డిస్కౌంట్ల జోలికెళ్లే అవకాశాల్లేవన్నది నిపుణుల అంచనా. ఈ కామర్స్ సంస్థల డిస్కౌంట్లపై నిషేధం విధించాలని పారిశ్రామిక విధానాలు, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) ఇటీవల పేర్కొనటాన్ని వీరు గుర్తుచేస్తున్నారు. ఈ కామర్స్ సంస్థలు డిస్కౌంట్ భారాన్ని సాధ్యమైనంత వరకు విక్రయదారులకే వదిలేస్తాయని, తమ సొంత డిస్కౌంట్లను ఆఫర్ చేసే పరిస్థితిలో అవి లేవని ‘రెడ్సీర్’ పేర్కొంది. ఇది ఆన్లైన్ విక్రయదారులకు, కొనుగోలు దారులకు నిరుత్సాహం కలిగించవచ్చని కూడా ఈ సంస్థ తెలిపింది. ‘‘ఈ అక్టోబర్లో అన్ని ఈ-కామర్స్ సంస్థల విక్రయాలూ కలిపినా రూ.10వేల కోట్లు దాటక పోవచ్చు. ఎందుకంటే జనవరి - మార్చి త్రైమాసికంలో ఈ కామర్స్ సంస్థల విక్రయాలు 19 శాతం పడిపోయాయి. ఏప్రిల్-జూన్ మధ్య కూడా మరో 5-10 శాతం మేర తగ్గాయి’ అని రెడ్సీర్ వివరించింది. అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ అక్టోబర్ 1 - 5 మధ్య ‘ద గ్రేట్ ఇండియా ఫెస్టివల్’ పేరిట అమెజాన్ అమ్మకాలు జరపనుంది. అదే రోజు... ఒకరోజు... రెండ్రోజుల డెలివరీ ద్వారా కస్టమర్లను ఆకట్టుకోవాలని సంస్థ చూస్తోంది. పండుగ రోజుల్లో భారీ ఆర్డర్ల వల్ల డెలివరీ లేటయ్యే పరిస్థితులుండగా... అమెజాన్ ఇదే అంశాన్ని మార్కెటింగ్కు ఉపయోగిస్తోంది. -
ఏ సర్వీసు కావాలన్నా..!
• 85 రకాల సేవలందిస్తున్న అర్బన్క్లాప్ • ఇప్పటికే రూ.250 కోట్ల నిధుల సమీకరణ • ఇన్వెస్టర్లలో స్నాప్డీల్ ఫౌండర్లతో పాటూ రతన్టాటా కూడా.. • త్వరలోనే మధ్యప్రాచ్య దేశాలకూ విస్తరణ • ‘సాక్షి స్టార్టప్ డైరీ’తో అర్బన్క్లాప్ ఫౌండర్ అభిరాజ్ భాల్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : బిజినెస్ టైకూన్ రతన్ టాటా నుంచి పెట్టుబడులు పొందింది. ఈ-కామర్స్ దిగ్గజం స్నాప్డీల్ ఫౌండర్ల నుంచీ నిధులు సమీకరించింది. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ స్వయంగా కలసి సేవల గురించి తెలుసుకునే స్థాయికీ ఎదిగింది. .. అయితే ఇదేదో పెద్ద కంపెనీ అనుకుంటే పొరపాటే. పోనీ టెక్నాలజీ స్టార్టప్ అనుకుంటే కూడా అంతే. ఇది కేవలం ప్లంబింగ్, ఎలక్ట్రిషన్, ట్యూటర్, ఫిట్నెస్ ట్రెయినర్ వంటి సర్వీసులు కావాల్సినవారికి రోజూవారీ అవసరాలను తీర్చే ఓ స్టార్టప్! అసలేంటా స్టార్టప్.. దాని కథేంటో ఈవారం ‘స్టార్టప్డైరీ’లో.. ‘‘కార్పెంటర్, క్లీనింగ్, యోగా ట్రెయినర్, ప్యాకర్ అండ్ మూవర్స్ వంటివి చాలా వరకు సేవలు అసంఘటితంగా ఉన్నాయి. వేటికీ నిర్దిష్టమైన ధరలుండవు. కస్టమర్ల అవసరాన్ని అవకాశంగా మార్చుకొని నోటికి ఎంతొస్తే అంత ధర చెప్పేస్తుంటారు. మనకూ అత్యవసరం కాబట్టి జేబు గుల్ల చేసుకొని మరీ పని చేయించుకుంటుంటాం’’ సరిగ్గా ఇదే అనుభవం అభిరాజ్ భాల్కూ ఎదురైంది. అందరిలా అక్కడికే ఆగిపోకుండా.. ఆయా సేవలకు టెక్నాలజీని జోడించి ఒకే గొడుకు కిందకి తీసుకొచ్చి వ్యాపార అవకాశంగా మార్చుకుంటేపోలే అనుకున్నాడు. ఇంకేముంది.. మరో ఇద్దరు కో-ఫౌండర్స్ వరుణ్ కేతన్, రాఘవ చంద్రలతో కలిసి 2014 జూన్లో రూ.10 లక్షల పెట్టుబడితో గుర్గావ్ కేంద్రంగా ‘అర్బన్క్లాప్’ స్టార్టప్ను ప్రారంభించారు. ఇంటి వద్దే 85 రకాల సేవలు.. ప్రస్తుతం బ్యూటీషియన్స్, యోగాటీచర్స్, ఫిట్నెస్ ట్రెయినర్స్, ప్లంబర్స్, ఎలక్ట్రిషీయన్స్, కార్ క్లీనింగ్, అకాడమీ ట్యూటర్స్, వెడ్డింగ్, ఈవెంట్ ప్లానర్స్, ప్యాకర్స్ అండ్ మూవర్స్.. ఇలా 85 రకాల సర్వీస్ ప్రొవైడర్ల సేవలను అందిస్తున్నాం. కస్టమర్లకు సర్వీస్ ప్రొవైడర్లకు మధ్య అర్బన్క్లాప్ సంధానకర్తగా పనిచేస్తుంది. సేవల్లో నాణ్యత, నమ్మకం రెండూ కల్పించడం మా ప్రత్యేకత. ప్రస్తుతం 50 వేల మంది సర్వీస్ ప్రొవైడర్లు నమోదై ఉన్నారు. వారంతా కస్టమర్ల ఇంటివద్దకే వచ్చి సేవలు అందిస్తారు. ప్రొఫెషనల్స్ డేటాను పూర్తి స్థాయిలో వెరిఫై చేశాకే ఉద్యోగులుగా నియమించుకుంటాం. వారితో అగ్రిమెంటూ చేసుకుంటాం కాబట్టి సెక్యూరిటీ, నమ్మకమైన సర్వీసుపరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. దక్షిణాది వాటా 60 శాతం.. ఇప్పటివరకు 12 లక్షల మంది కస్టమర్లున్నారు. రోజుకు 5-6 వేల మంది మా సేవలను వినియోగించుకుంటున్నారు. మొత్తం వ్యాపారంలో దక్షిణాది రాష్ట్రాల వాటా 60 శాతం వరకుంటుంది. హైదరాబాద్ నుంచి 10-15 శాతం వాటా ఉంటుంది. ఏటా పది రెట్లు వృద్ధిని సాధిస్తున్నాం. సేవలను బట్టి 5-20 శాతం వరకు కమీషన్ రూపంలో తీసుకుంటాం. మా మొత్తం వ్యాపారంలో 20-25 శాతం వాటా అందం, ఆరోగ్యం విభాగాలదే. వచ్చే మూడు నెలల్లో దీన్ని 40 శాతానికి చేర్చాలన్నది లక్ష్యం. అందుకే సేవల సంఖ్యను వందకు చేర్చాలని నిర్ణయించాం. ఈ ఏడాది ముగింపు నాటికి పెద్ద మొత్తంలో పెట్టుబడులతో విస్తరణ చేయనున్నాం. డైటీషియన్, ఫిజియోథెరపిస్ట్, సేంద్రీయ తిండి వంటకాలు వంటివి తీసుకొస్తాం. మధ్యప్రాచ్య దేశాలకూ విస్తరణ.. ప్రస్తుతం మా సంస్థలో 320 మంది ఉద్యోగులున్నారు. ఈ ఏడాది ముంబై కేంద్రంగా పనిచేసే హ్యాండీహోమ్ను కొన్నాం. ప్రస్తుతం ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూరు, ముంబై, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, కోల్కత్తా నగరాల్లో సేవలందిస్తున్నాం. త్వరలోనే దేశవ్యాప్తంగా విస్తరణతో పాటూ మధ్య ప్రాచ్య దేశాలకూ విస్తరించాలని నిర్ణయించాం. ఇందుకోసమే ఇటీవలే రూ.165 కోట్లు పెట్టుబడులను సమీకరించాం. దీంతో మొత్తం రూ.250 కోట్ల పెట్టుబడులకు చేరింది. బెస్సీమెర్ వెంచర్, యాక్సెల్, సైఫ్ పార్టనర్స్, స్నాప్డీల్ ఫౌండర్లైన కునాల్బాల్, రోహిత్ బన్సల్, రతన్టాటాలు ఈ పెట్టుబడులు పెట్టారు. అద్భుతమైన స్టార్టప్ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
దీపావళి ధమాకా: 10వేల ఉద్యోగాలు
చేతిలో సరిపడా ఉద్యోగులు లేక, పండుగ సీజన్ల్లో వస్తువుల డెలివరీని జాప్యం చేయకూడదని దేశీయ ఈ-కామర్స్ కంపెనీ స్నాప్డీల్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పండుగ సీజన్లో తాత్కాలికంగా అదనపు ఉద్యోగులను నియమించుకోనున్నట్టు ప్రకటించింది. సెప్టెంబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు ఉన్నట్టుండి దాదాపు 10,000 తాత్కాలిక ఉద్యోగాలను సృష్టించనున్నట్టు స్నాప్డీల్ పేర్కొంది. ముఖ్యంగా డెలివరీలో ఎలాంటి సమస్యలు రాకుండా, వెనువెంటనే జరిపేటట్టు లాజిస్టిక్ పొజిషన్లలో వీరిని నియమించుకోనుంది. దీపావళి కానుకగా ఈ తాత్కాలిక ఉద్యోగాలు సృష్టించనున్నట్టు స్నాప్డీల్ పేర్కొంటోంది. దీపావళి పండుగ సీజన్ అంతా, అన్ని లాజిస్టిక్ సెంటర్లు 24X7 పనిచేయనున్నట్టు తెలిపింది. ఆర్డర్లు రిసీవ్ చేసుకుని, స్క్రీన్ చేసి, వాటిని డెలివరీ చేసేందుకు ఈ తాత్కాలిక ఉద్యోగులు పనిచేయనున్నారు. ఎస్డీ ప్లస్ సెంటర్లు ఆర్డర్లను ప్రాసెస్ను నిరంతరాయం కొనసాగిస్తాయని, అర్థరాత్రి స్వీకరించిన ఆర్డర్లను, తర్వాతి రోజు ఉదయం పూట అందించనున్నట్టు కంపెనీ తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న నగరాలు, పట్టణాల్లో ఈ దీపావళి సీజన్లో కస్టమర్లు ఆర్డరు చేసిన వస్తువులను ఒకటి రెండు రోజుల్లోనే డెలివరీ చేసే విధంగా అప్గ్రేట్ కావాలని నిర్ణయించుకున్నట్టు స్నాప్డీల్ చీఫ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్ జయంత్ సూద్ తెలిపారు. -
ఫ్లిప్కార్ట్ వైపు స్నాప్డీల్ చూపు?
• అమెజాన్తోనూ కలిసే అవకాశం • పోటీ దిగ్గజాల్లో విలీన యోచన • ఇన్వెస్ట్మెంట్ సంస్థ టైగర్ గ్లోబల్తో చర్చలు.. ముంబై : లాభాల ఊసు పక్కన పెట్టి.. కస్టమర్లను ఆక ర్షించడానికి భారీ డిస్కౌంట్లు, మార్కెటింగ్కు కోట్ల కొద్దీ నిధులు కుమ్మరించిన దేశీ ఈకామర్స్ దిగ్గజాలు ప్రస్తుతం నేలచూపులు చూస్తున్నాయి. సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు పోటీ సంస్థల వైపు చూస్తున్నాయి. హోరాహోరీగా పోరాడుతున్న పోటీ దిగ్గజాలు ఫ్లిప్కార్ట్, అమెజాన్లలో విలీన అవకాశాలపై స్నాప్డీల్ కసరత్తు చేస్తోందన్న వార్త దేశీ ఈకామర్స్ రంగంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ రెండు సంస్థల్లో ఏదో ఒకదానిలో విలీనానికి స్నాప్డీల్ సుముఖంగా ఉందని, ప్రస్తుతం ఈ ప్రతిపాదన ఆరంభ దశలోనే ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఫ్లిప్కార్ట్లో పెట్టుబడులు పెట్టిన అమెరికా హెడ్జ్ ఫండ్ టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్తో స్నాప్డీల్ సహ వ్యవస్థాపకుడు కునాల్ బెహల్ ఇటీవలే దీనిపై సమావేశం కూడా అయినట్లు తెలిపాయి. అయితే, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ సంస్థలు ఈ వార్తలను తోసిపుచ్చాయి. ఇవి నిరాధారమైనవని పేర్కొన్నాయి. ఇరవై పైగా ఇన్వెస్టర్లు.. భారత ఈకామర్స్ రంగంలో దేశీయంగా ఎదిగిన కంపెనీల్లో ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. స్నాప్డీల్ ఇప్పటిదాకా ఇరవై పైగా ఇన్వెస్టర్ల నుంచి సుమారు 1.65 బిలియన్ డాలర్లను సమీకరించింది. కొన్నాళ్ల క్రితం కెనడాకి చెందిన ఒంటారియో టీచర్స్ పెన్షన్ ప్లాన్ తదితర సంస్థల నుంచి స్నాప్డీల్ 200 మిలియన్ డాలర్లు సమీకరించినప్పుడు.. దాని వాల్యుయేషన్ను దాదాపు 6.5 బిలియన్ డాలర్లుగా లెక్కించారు. అప్పట్లో ఫ్లిప్కార్ట్ వేల్యుయేషన్ 15 బిలియన్ డాలర్లలో ఇది సగానికన్నా తక్కువ. స్నాప్డీల్లో ఇన్వెస్ట్ చేసిన వాటిలో జపాన్కి చెందిన టెలికం, ఇంటర్నెట్ దిగ్గజం సాఫ్ట్బ్యాంక్ గ్రూప్, దాని అండ ఉన్న చైనా ఈ-కామర్స్ సంస్థ ఆలీబాబా, తైవాన్ కాంట్రాక్ట్ ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం ఫాక్స్కాన్, అంతర్జాతీయ ఆన్లైన్ షాపింగ్ సంస్థ ఈబే, దేశీ మీడియా కంపెనీ బెనెట్ కోల్మన్ అండ్ కంపెనీ, బెసీమర్ వెంచర్ పార్ట్నర్స్, ఇంటెల్ క్యాపిటల్, ఐరన్ పిల్లర్, కలారీ క్యాపిటల్ వంటి వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్లతో పాటు పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కూడా ఉన్నారు. ♦ ఫ్లిప్కార్ట్లోనూ ఇన్వెస్టరుగా ఉన్న జాస్పర్ ఇన్ఫోటెక్.. ఇటు స్నాప్డీల్లో కూడా పెట్టుబడులు పెట్టింది. ప్రశ్నార్థకంగా సాఫ్ట్బ్యాంక్ నుంచి సాయం.. 2014లో దాదాపు 627 మిలియన్ డాలర్లు, గతేడాది మరో 500 మిలియన్ డాలర్లను కంపెనీకి సమకూర్చడంలో కీలక పాత్ర పోషించిన సాఫ్ట్బ్యాంక్కు స్నాప్డీల్లో సాఫ్ట్బ్యాంక్కు చెప్పుకోతగిన స్థాయిలో మైనారిటీ వాటాలు ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం దాకా భారత్కి చెందిన నికేశ్ అరోరా సాఫ్ట్బ్యాంక్ ప్రెసిడెంట్గా పనిచేసిన సమయంలో దేశీ స్టార్టప్ సంస్థలకు ఇబ్బడిముబ్బడిగా నిధులు లభించాయి. అయితే, చైర్మన్ మసయోషి సన్కి వారసుడిగా అంతా భావించినప్పటికీ.. వివిధ కారణాల రీత్యా అరోరా అకస్మాత్తుగా జూన్లో రాజీనామా చేశారు. ఆయన నిష్ర్కమణతో సాఫ్ట్బ్యాంక్ భారత ప్రణాళికలు ప్రశ్నార్థకంగా మారాయి. ప్రస్తుతానికి అదనంగా మరిన్ని నిధులు సమీకరించాల్సిన అవసరం లేకుండా సుమారు ఏడాదికి సరిపడా నగదు నిల్వలు స్నాప్డీల్ వద్ద్ ఉన్నాయని అంచనా. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో సాఫ్ట్బ్యాంక్ నుంచి కంపెనీకి భవిష్యత్లో అందే సహాయ సహకారాలపై సందేహాలు నెలకొన్నాయి. దీంతో స్నాప్డీల్ ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో పడి ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. నష్టాల ఊబిలో ఈ-కామర్స్ సంస్థలు స్నాప్డీల్, ఫ్లిప్కార్ట్తో పాటు పలు ఈ కామర్స్ సంస్థలు లాభాల సంగతి పక్కన పెట్టి ముందుగా కస్టమర్లను ఆకర్షించేందుకు గత ఐదారేళ్లుగా భారీ డిస్కౌంట్లు, ఆర్భాటప్రచారాలకు గణనీయంగానే ఖర్చు చేశాయి. దీంతో ఆయా సంస్థల నష్టాలు అంతకంతకూ పెరిగిపోతూ వస్తున్నాయి. అయితే ఇప్పటిదాకా నిధులు కుమ్మరిస్తూ వచ్చిన ఇన్వెస్టర్లు.. లాభాల వైపు దృష్టి మరల్చారు. పెట్టుబడులకు బ్రేకులు వేయడం మొదలుపెట్టారు. దీంతో ఈకామర్స్ సంస్థలు కార్యకలాపాలను, సిబ్బంది సంఖ్యను కుదించుకుంటూ.. నగదు నిల్వలు కరిగిపోకుండా చూసుకునే ప్రయత్నాల్లో పడ్డాయి. ఇప్పటికే పలు ఇంటర్నెట్ కంపెనీలు నిలదొక్కుకునేందుకు కన్సాలిడేషన్ లేదా వ్యూహాత్మక వాటాల విక్రయం వైపు చూస్తున్నాయి. ఫ్లిప్కార్ట్ కూడా అమెజాన్లో విలీనం కోసం గతేడాది ఆఖరు నాటి దాకా చర్చలు జరిపిందంటూ కొన్ని వార్తలు కూడా వచ్చాయి. చైనాకు చెందిన ఆలీబాబా గ్రూప్.. దేశీ ఈకామర్స్ సంస్థ షాప్క్లూస్ను కొనుగోలు చేసేందుకు చర్చలు జరిపిందంటూ తాజాగా వార్తలూ వచ్చాయి. ఆలీబాబాకు ఇప్పటికే స్నాప్డీల్లోనూ, మొబైల్ వాలెట్, ఈకామర్స్ సంస్థ పేటీఎంలోనూ వాటాలు ఉన్నాయి. భారత్ ఈ-టెయిలింగ్ మార్కెట్లో స్థానం పటిష్టం చేసుకునేందుకు కసరత్తు చేస్తున్న ఆలీబాబా ఈ ఏడాది ప్రారంభంలో ఫ్లిప్కార్ట్లోనూ ఇన్వెస్ట్ చేయడంపై చర్చలు సాగించింది. ఒకవైపు స్నాప్డీల్, ఫ్లిప్కార్ట్ మరిన్ని నిధు లు సమీకరించుకునేందుకు నానా తంటాలు పడుతుంటే .. పుష్కలంగా నిధులు ఉన్న పోటీ దిగ్గజం అమెజాన్.. భారత మార్కెట్లో దూసుకుపోతోంది. భారత కార్యకలాపాలపై ఏకంగా 3 బిలియన్ డాలర్లు వెచ్చించేందుకు ప్రణాళికలు వేసింది. -
ఒకేసారి 2 దుకాణాలు బంద్
♦ ట్యాక్సీ ఫర్ ష్యూర్ను నిలిపేస్తున్న ఓలా ♦ కనుమరుగవుతున్న ఎక్స్క్లూజివ్లీ డాట్ కామ్ ♦ దాన్ని తనలో కలిపేసుకుంటున్న స్నాప్డీల్ ఒకే రోజు రెండు పరిణామాలు. ఒకటి ట్యాక్సీ సేవలందించే ట్యాక్సీఫర్ ష్యూర్, మరొకటి ఫ్యాషన్ ఉత్పత్తుల విక్రయ పోర్టల్ ఎక్స్క్లూజివ్లీ డాట్ కామ్. ఈ రెండూ కూడా ప్రముఖ సంస్థలకు చెందిన ప్రత్యేక విభాగాలు. ట్యాక్సీఫర్ ష్యూర్ ఓలాకు చెందినది కాగా, ఎక్స్క్లూజివ్లీ డాట్కామ్ సంస్థ స్నాప్డీల్కు చెందినది. మరో చిత్రమేంటంటే... ఈ రెండింటినీ ఓలా, స్నాప్డీల్ సరిగ్గా 18 నెలల క్రితమే కొనుగోలు చేశాయి. యాధృచ్చికంగా... వాటిని ఒకేసారి మూసేస్తున్నాయి. ‘ట్యాక్సీ ఫర్ ష్యూర్’ సేవలకు ఓలా గుడ్బై న్యూఢిల్లీ: ట్యాక్సీ ఫర్ ష్యూర్ పేరుతో అందిస్తున్న సేవలను నిలిపివేయాలని ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ‘ఓలా’ నిర్ణయించింది. ఫలితంగా కాల్ సెంటర్, వ్యాపార అభివృద్ధి విభాగంలో పనిచేసే 700 మంది వరకు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ట్యాక్సీ ఫర్ ష్యూర్ సేవలు నిలిపివేస్తుండడంతో దీని కింద పనిచేస్తున్న డ్రైవర్-భాగస్వాములు, కస్టమర్లను ఓలా ప్లాట్ఫామ్తో అనుసంధానించినట్టు కంపెనీ తెలిపింది. తన ప్రత్యర్థిగా ఉన్న ట్యాక్సీ ఫర్ ష్యూర్ను 18 నెలల క్రితం 20 కోట్ల డాలర్లు వెచ్చించి ఓలా సొంతం చేసుకుంది. అప్పటి నుంచి ఎకానమీ సేవలను ఈ బ్రాండ్ కింద కొనసాగిస్తూనే ఉంది. అదే సమయంలో ఓలా మైక్రో పేరుతో ఏసీ క్యాబ్ సేవలను ప్రారంభించి తక్కువ బడ్జెట్ సేవలు కోరుకునే వారిని అటువైపు ఆకర్షించడం మొదలు పెట్టింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 90 పట్టణాల్లో ఓలా మైక్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు ట్యాక్సీ ఫర్ ష్యూర్ సేవలు నిలిపివేయడం వల్ల కోల్పోయే ఉద్యోగాలపై ఓలా స్పందించలేదు. సాధ్యమైనంత మందిని ఓలా ప్లాట్ఫామ్ కింద సర్దుబాటు చేసినట్టు తెలిపింది. అయితే, వ్యయం తగ్గించుకునే చర్యల్లో ఇదొక భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎక్స్క్లూజివ్లీ.కామ్ను మూసేస్తున్న స్నాప్డీల్ న్యూఢిల్లీ: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ స్నాప్డీల్ 18 నెలల క్రితం కొనుగోలు చేసిన బ్రాండెడ్ ఫ్యాషన్, లైఫ్స్టయిల్ ఉత్పత్తుల విక్రయ పోర్టల్ ఉ్ఠఛిఠటజీఠ్ఛిడ.ఛిౌఝను మూసేస్తున్నట్టు ప్రకటించింది. అయితే, ఎక్స్క్లూజివ్లీ డాట్ కామ్లో విక్రయించే అన్ని రకాల ఉత్పత్తులను స్నాప్డీల్ పోర్టల్లో అందుబాటులో ఉంచనుంది. ఇకపై వీటిని స్నాప్డీల్ పోర్టల్ వేదికగా కొనుగోలు చేసుకోవచ్చని స్నాప్ డీల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఎక్స్క్లూజివ్లీ పోర్టల్కు చెందిన ఉద్యోగులందరినీ స్నాప్డీల్లో సర్దుబాటు చేసినట్టు కంపెనీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. వచ్చే కొన్ని వారాల్లో ఎక్స్క్లూజివ్లీ సైట్ నిలిచిపోనుందని తెలిపారు. ఈ సైట్ను స్నాప్డీల్ 18 నెలల క్రితం బయటకు వెల్లడించని మొత్తానికి కొనుగోలు చేసింది. డిజైనర్ బ్రాండ్లు డీకేఎన్వై, అర్మాని, మైకేల్కోర్స్, పోర్షే డిజైన్, మార్క్ జాకబ్స్, వెరో మొడా, ఎఫ్సీయూకే, బిబా, ఏఎండీ, యూసీబీ, ప్యూమా వంటి బ్రాండెడ్ ఉత్పత్తులను ఈ సైట్ ప్రత్యేకంగా విక్రయిస్తోంది. ఫ్యాషన్ విభాగంలో స్నాప్డీల్లో మరిన్ని ఉత్పత్తులను అందుబాటులో ఉంచే దిశగా తీసుకున్న చర్యగా దీన్ని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎక్కువ లాభాల మార్జిన్లుండే ఈ విభాగంలో అధిక వాటా కోసం స్నాప్డీల్, ఫ్లిప్కార్ట్, అమేజాన్ తీవ్రంగా పోటీపడుతున్న విషయం తెలిసిందే. -
ఇక చకచకా... స్నాప్డీల్ డెలివరీ
♦ కొత్తగా ఆరు లాజిస్టిక్స్ హబ్ల ఏర్పాటు ♦ హైదరాబాద్లో ఒకటి న్యూఢిల్లీ: ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి సంస్థల కన్నా వేగంగా వస్తువులను డెలివరీ చేయడానికి ‘స్నాప్డీల్’ సిద్ధమయ్యింది. ఇది తన వేర్హౌస్, డెలివరీ కార్యకలాపాలను మరింత పటిష్టం చేసుకోవడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ఆరు మెగా హబ్లను ఏర్పాటు చేసింది. సంస్థ ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాం తంలో మూడు, లక్నో, హైదరాబాద్, కోల్కతాలలో ఒకటి చొప్పున హబ్లను ఏర్పాటు చేసింది. ఈ హబ్ల ఏర్పాటు కోసం ఎంత మొత్తాన్ని వెచ్చించిం దనేది మాత్రం వెల్లడించలేదు. ఈ ఆరు హబ్లను స్నాప్డీల్కు చెందిన పూర్తి అనుబంధ కంపెనీ ‘వెల్కన్ ఎక్స్ప్రెస్’ ఏర్పాటు చేసింది. ఉత్పత్తుల స్వీకరణ, వాటి నాణ్యతా పరీక్ష, డెలివరీకి సిద్ధం చేయడం, రిటర్న్ వస్తువుల పరిశీలన వంటి పనులన్నీ వీటిల్లో జరుగుతాయని కంపెనీ తెలియజేసింది. దీంతో విక్రయదారుడు అన్ని సేవలను ఒకే చోట పొందొచ్చని పేర్కొంది. డిమాండ్ వేగంగా పెరుగుతున్న ప్రాంతాల్లోనే తాజా హబ్లను ఏర్పాటు చేసినట్లు స్నాప్డీల్ చీఫ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్ జయంత్ సూద్ తెలిపారు. -
భారత్లోకి అమెజాన్ ప్రీమియం సర్వీస్ ‘ప్రైమ్’
1, 2 రోజుల్లోనే వస్తువుల కచ్చిత డెలివరీ న్యూఢిల్లీ : ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ వంటి పలు ఈ-కామర్స్ ప్రత్యర్థి కంపెనీలను ధీటుగా ఎదుర్కోవడమే లక్ష్యంగా అమెరికాకు చెందిన ఆన్లైన్ రిటైల్ దిగ్గజ కంపెనీ ‘అమెజాన్’ తాజాగా తన ప్రీమియం సర్వీస్ ‘ప్రైమ్’ను భారత్లో ప్రవేశపెట్టింది. ఇందులో ఆర్డర్ ఇచ్చిన ప్రొడక్ట్స్ను (ప్రైమ్ యూజర్లు) ఉచితంగా 1, 2 రోజుల్లోనే డెలివరీ పొందొచ్చు. కాగా ఈ సర్వీసులు అన్ని వస్తువులకు వర్తించదు. ఈ వెసులుబాటు ఉన్న ప్రొడక్ట్స్పై ప్రైమ్ లోగో కనిపిస్తుంది. ఇక ఈ సౌకర్యం దాదాపు 100 పట్టణాల్లో అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. ఈ సేవలకు మినిమమ్ ఆర్డర్ అంటూ ఎలాంటి షరతులు ఉండవు. అలాగే ప్రైమ్ సభ్యులు వివిధ ఆఫర్లు, డిస్కౌంట్లు సహా పలు ఎక్స్క్లూజివ్ డీల్స్ వివరాలను ఇతరుల కన్నా ముందే (30 నిమిషాలు) తెలుసుకోవచ్చు. ప్రైమ్ యూజర్లు 1,2 రోజుల డెలివరీతోపాటు స్వల్ప అదనపు చార్జీలతో (ఆర్డర్కు రూ.50లు) అదే రోజు, షెడ్యూల్ డెలివరీ వంటి సౌకర్యాన్ని కూడా పొందొచ్చు. ఈ సేవలు హైదరాబాద్, బెంగళూరు వంటి 20 పట్టణాల్లో అందుబాటులో ఉంటాయి. కాగా అమెజాన్ ప్రైమ్ సర్వీసులు.. ఫ్లిప్కార్ట్ ‘ఫ్లిప్కార్ట్ ఫస్ట్’ సేవలకు గట్టి పోటీనివ్వనున్నది. ప్రైమ్ సేవలు 60 రోజలు ఉచితం ఇండియన్ ఆన్లైన్ షాపర్స్ తాజా ప్రైమ్ సేవలను ట్రయల్ బేసిస్ పైన 60 రోజులు వరకు ఉచితంగా పొందొచ్చని సంస్థ తెలిపింది. తర్వాత ప్రైమ్ సేవలను అలాగే పొందాలనుకుంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలని పేర్కొంది. దీని ధర రూ.499 (వార్షిక ఫీజు)గా నిర్ణయించామని తెలిపింది. త్వరలో ప్రైమ్ వీడియో సర్వీసులను కూడా దేశంలో ప్రారంభిస్తామని వెల్లడించింది. -
ఇక స్నాప్డీల్ ద్వారా విమాన, బస్ టికెట్లు
♦ ఈ తరహా సేవలందిస్తున్న ♦ తొలి ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ ఇదే న్యూఢిల్లీ: ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ స్నాప్డీల్ ద్వారా ఇక నుంచి విమాన, బస్ టికెట్లు కూడా బుక్ చేసుకోవచ్చు. అంతే కాకుండా హోటల్ రిజర్వేషన్లు, ఆహార పదార్థాలను ఆర్డర్ చేయడం వంటి సర్వీసులు కూడా పొందవచ్చని స్నాప్డీల్ తెలిపింది. ఈ తరహా ఆన్లైన్ సర్వీసులందిస్తున్న తొలి ఈ-కామర్స్ మార్కెట్ ప్లేస్ తమదేనని స్నాప్డీల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన రోహిత్ బన్సాల్ చెప్పారు. జొమాటొ, క్లియర్ట్రిప్, అర్బన్క్లాప్, రెడ్బస్ తదితర సంస్థల భాగస్వామ్యంతో ఈ సేవలందిస్తున్నామని ఆయన వివరించారు. వినియోగదారుల అన్ని రకాలైన అవసరాలకు తగిన సేవలందిస్తున్నామని, స్నాప్డీల్ ద్వారా మరింత విస్తృతమైన సేవలను అందించే ప్రయత్నాలను కొనసాగిస్తామని బన్సాల్ పేర్కొన్నారు. 2020 నాటికల్లా 2 కోట్ల రోజువారీ లావాదేవీలు జరిపే యూజర్లున్న ఆన్లైన్ మార్కెట్ ప్లేస్గా అవతరించాలనేది తమ లక్ష్యమని ఈ సందర్భంగా వివరించారు. ఈ తరహా ఆన్లైన్ సర్వీసులందించడం ద్వారా ఆ లక్ష్య సాధనకు చేరువ కాగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. కాగా, స్నాప్డీల్ భాగస్వామ్యంలో మరింతమందికి చేరువ కాగలమని జొమాటొ సీఈఓ దీపిందర్ గోయల్ చెప్పారు. -
మార్కెట్ లీడర్స్ గా ఓల, ఫ్లిప్కార్ట్
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దేశీ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ మరోసారి రారాజుగా నిలిచింది. తన ప్రధాన ప్రత్యర్థులకు చెక్ పెట్టి దేశంలో నెం.1 గా నిలిచింది. అటు ఆన్లైన్ క్యాబ్ అగ్రిగేషన్ స్పేస్ లో ఓల ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది. రెడ్ సీర్ కన్సల్టింగ్ విడుదల చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడైనాయి. 50 శాతం మార్కెట్ షేర్ తో ఫ్లిప్ కార్ట్ తన స్థానాన్ని నిలబెట్టుకోగా స్నాప్ డీల్ రెండవస్థానం దక్కించుకుంది. అమెజాన్ మూడవ స్థానానికి పరిమితమైంది. ఈ కామర్స్ విభాగంలో ఫ్లిప్ కార్ట్ 35-37, స్నాప్డీల్ 21-23శాతం, అమెజాన్ 17-19 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది. అయితే, పరిస్థితి స్నాప్డీల్ కు ప్రకాశవంతంగా లేదని అభిప్రాయపడింది. 2016 మొదటి త్రైమాసికంలో అమెజాన్ అమ్మకాలు బావున్నాయని, స్నాప్ డీల్ ను అధిగమించిందనీ రెడ్ సీర్ సీఈఓ అనిల్ కుమార్ చెప్పారు. ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్ కేటగిరీలో అమెజాన్ దూకుడుగా ఉందని, రాయితీలు, ప్రకటనల మీద ఖర్చు కొనసాగిస్తోందని ఈ స్టడీ తెలిపింది. గత ఏడాది దేశ ఈ కామర్స్ బిజినెస్ 13 బిలియన్ల డాలర్లుగా నమోదైంది. 2012 లో కేవలం మూడు బిలియన్ డాలర్లు ఉన్న ఈ మార్కెట్ గణనీయమైన గ్రోత్ సాధించిందని స్టడీ తెలిపింది. 2016 మొదటి క్వార్టరలో అమ్మకాలు కొద్దిగా క్షీణించాయని వివరించింది. ప్రధాన ప్రత్యర్థి ఉబెర్ తో పోలిస్తే వ్యాపారంలో రెట్టింపు వేగంతో దూసుకుపోయిన ఓల మార్కెట్ లీడర్ గా నిలిచింది. 2015 లో 61 శాతం మొత్తం మార్కెట్ వాటాతో ఓల టాప్ లో నిలవగా, ఉబెర్ 26 శాతం వాటా తో సరిపెట్టుకుంది. ఆన్ లైన్ ట్యాక్సీ సెగ్మెంట్ లో ప్రతి క్వార్టర్ కి 25 శాతం పెరుగుదల కనిపిస్తోందని ఈ నేపథ్యంలో4 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అంచనా వేస్తున్నామన్నారు. ఇటీవల లాంచ్ చేసిన ఓల మైక్రో ఈ విజయంలో ప్రధాన పాత్ర పోషించిందని తెలిపింది. కాగా ఫ్లిప్ కార్ట్ ను తోసి రాజనే ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో అమెజాన్ పెట్టుబడుల వరదను పారిస్తోంది. అటు ఓల, ఉబర్ రవాణా నియమాలు ఉల్లంఘించారనే ఆరోపణలతో, అధిక చార్జీలు వస్తూలు చేస్తున్నారనే ఆరోపణలతో దేశ రాజధాని ఢిల్లీలోనూ, కర్ణాటకలో కేసులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. -
సఖ్యతకు నోచుకోని ఈ-టైలర్స్..!
భారత్ లో రిటైలర్ సంస్థలకున్న సఖ్యత ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలు ఉండట్లేదట. ఇష్టారీతిలో డిస్కౌంట్ ఆఫర్లు గుప్పిస్తూ భారీగా వ్యాపారాన్ని పెంచుకుంటున్న ఈ-టైలర్స్ కు చెక్ చెప్పేందుకు ప్రభుత్వం ఏప్రిల్ లో కొత్త నిబంధనలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆన్ లైన్ పోర్టల్ లో ధరల మధ్య భారీ వ్యత్యాసం ఉండొద్దని ఆదేశాలు జారీచేసింది. వివిధ రాష్ట్రాల పన్నులనూ ఈ-టైలర్స్ భరించాల్సి ఉంటుందని వెల్లడించింది. అయితే వీటిపై పోరాటానికి ఈ-కామర్స్ దిగ్గజాలు ఐకమత్యం లేదని తెలుస్తోంది. ఆఫ్ లైన్ రిటైలర్లకు, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకమైన పోరుకు మాత్రం ఈ-కామర్స్ దిగ్గజాలు ఒకే స్వరంలో ఉండటం లేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రభావం ఈ-కామర్స్ వ్యాపారాలపై పడనుందని అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ-కామర్స్ పరిశ్రమ విశ్లేషకులే దీనిపై పెదవి విరుస్తున్నారని తెలుస్తోంది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లు మాత్రం దీనిపై స్పందించడం లేదు. ముఖ్యమైన అంశాలపై కంపెనీ, స్టాక్ హోల్డర్స్ అందరితో కలిసే పనిచేస్తుందని స్నాప్ డీల్ ఏదో నామమాత్రంగా సమాధానమిచ్చిందని తెలుస్తోంది. ఆఫ్ లైన్ స్టోర్లు, వారు నిర్ణయించుకున్న ధర కంటే ఇసుమంతైనా తక్కువ చేసి మంచినీళ్ల బాటిళ్లను సైతం విక్రయించవని, ఇదే ఆన్ లైన్, ఆఫ్ లైన్ స్టోర్లకున్న ప్రధాన తేడా అని ఈ-టైలర్ ఓ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. మార్కెట్ ప్లేస్ ప్రమోషన్ ను అనుమతివ్వాలని కోరుతూ ఈ కంపెనీలు అసలు కలిసికట్టుగా ప్రభుత్వంతో సంప్రదింపులే జరపడం లేదని తేలింది. ఇటీవలే ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అమెరికా ఈ-టైలర్ దిగ్గజం అమెజాన్ స్పాన్సర్ చేసిన లేఖపై కూడా భారత ఈ-టైలర్ దిగ్గజాలు ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ లు సంతకం చేయలేదట. దీంతో లాబీ గ్రూప్ ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈ డ్రాప్ట్ లెటర్ ను ప్రభుత్వానికి పంపలేదట. గుజరాత్ ప్రభుత్వ పన్నులకు కూడా వ్యతిరేకంగా ఈ సంస్థలన్ని వేరువేరుగానే కేసులు ఫైల్ చేశాయి. అయితే ఈ-టైలర్స్ కు పోటీగా సమైక్యంగా పోరాడుతూ.. మార్కెట్లో తమ స్థానాలను మెరుగుపర్చుకునేందుకు రిటైల్ సంస్థలు రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఆర్ఏఐ)ను ఏర్పరుచుకున్నాయి. ఈ అసోసియేషన్ బేస్ చేసుకుని ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించిన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లపై వ్యతిరేకంగా రెండు కేసులు కూడా నమోదుచేశాయట. ఈ మొత్తం ఈ-టైలర్ల వ్యవహారాన్ని గేమ్ ఆఫ్ థ్రోన్స్ గా షాప్ క్లూస్.కామ్ సంస్థ సహా వ్యవస్థాపకుడు రాధిక అగర్వాల్ అభివర్ణించారు. -
భారత్ లో అమెజాన్ పెట్టుబడుల వర్షం
న్యూఢిల్లీ : భారత్ లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకోవడానికి ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ పెట్టుబడుల వర్షం కురిపిస్తోంది. ఫ్లిప్ కార్ట్ తో పోటీకి సై అంటూ.. టాప్ లో నిలిచేందుకు భారత్ కార్యకలాలపాల్లో అదనంగా 300 కోట్ల డాలర్లను(దాదాపు రూ.20,169.75 కోట్లు) పెట్టుబడులను పెడుతున్నట్టు అమెజాన్ ప్రకటించింది. భారత మార్కెట్లోకి ప్రవేశించిన ఏడాది అనంతరం 2014లో 200 కోట్ల డాలర్లను పెట్టుబడులుగా పెడతామని అమెజాన్ వెల్లడించింది. అనంతరం భారత మార్కెట్లో వస్తున్న స్థానిక ప్రత్యర్థుల పోటీని తట్టుకునేందుకు తన పెట్టుబడులను మరింత పెంచుతోంది. భారత్ లో కార్యకలాపాలకు అదనంగా 300 కోట్ల డాలర్ల పెట్టుబడులను పెంచే యోచనలో ఉన్నట్టు అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్ బెజోస్ ప్రకటించారు. దీంతో మొత్తం 500 కోట్ల డాలర్లను(రూ.30,750కోట్లు) భారత్ లో పెట్టుబడులుగా అమెజాన్ పెట్టనుంది. ఇప్పటికే భారత మార్కెట్లో 45 వేల ఉద్యోగాలను సృష్టించామని, భారత ఆర్థికవ్యవస్థలో మరింత వృద్ధిని సాధిస్తామని బెజోస్ ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ఉన్న నేపథ్యంలో బెజోస్ ఈ పెట్టుబడుల ప్రకటన చేయడం విశేషం. యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్(యూఎస్ఐబీసీ) గ్లోబల్ లీడర్ షిప్ అవార్డును, సన్ ఫార్మాస్యూటికల్ వ్యవస్థాపకుడు దిలీప్ సంఘ్వీతో కలిసి బెజోస్ ప్రధాని మోదీ చేతుల మీదుగా అందుకున్నారు. అతిపెద్ద మార్కెట్ చైనాను సొంతం చేసుకోవాలన్న అమెజాన్ కు అక్కడి స్థానిక ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబాతో గట్టి పోటీనే ఎదురైంది. అలీబాబాతో పోటీని తట్టుకోలేక చైనా మార్కెట్ ను కోల్పోయింది. ప్రస్తుతం భారత మార్కెట్ ను గెలవడం కూడా అమెజాన్ కు క్లిష్టమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2013 జూన్ లో భారత మార్కెట్లోకి ప్రవేశించిన అమెజాన్ గతవారమే మూడేళ్ల వార్షికోత్సవాన్ని జరుపుకుంది. అమెజాన్ ఇప్పటికే సరుకు రవాణాలో స్నాప్ డీల్ ను దాటేసింది. ఫ్లిప్ కార్ట్ మార్కెట్ షేరుకు చేరువలో ఉంది. -
ఈ-కామర్స్ డిస్కౌంట్లకు చెక్!
సెల్లర్ల నుంచి వసూలు చేసే కమిషన్ పెంపు ♦ అమెజాన్ బాటలోనే ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ ♦ ఇప్పుడే ఏమీ చెప్పలేమంటున్న పేటీఎం ♦ ఎలక్ట్రానిక్ వస్తువుల రిటర్న్ గడువు కుదింపు ♦ 30 నుంచి 10 రోజులకు తగ్గించిన ఫ్లిప్కార్ట్ ♦ నష్టాల్ని భరించలేక దిద్దుబాటుకు దిగిన కంపెనీలు ♦ 2015లో మూడు కంపెనీల నష్టం రూ.7వేల కోట్లు ♦ ఇదంతా ఆఫర్లు, డిస్కౌంట్ల వల్లేనంటున్న సంస్థలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిన్న మొన్నటి వరకూ ఈ-కామర్స్ అంటే డి స్కౌంట్లు... చౌకధరలు. తమ విలువల్ని పెంచుకోవటానికి, మార్కెట్లో పట్టు సంపాదించటానికి ఈ-కామర్స్ కంపెనీలు తమ సైట్లలో వస్తువులు విక్రయించే సెల్లర్లకు రాయితీలిచ్చి మరీ దీన్ని కొనసాగించాయి. అగ్రస్థానం కోసం ఒకదానితో ఒకటి పోటీ పడి ఆఫర్లు కురిపించాయి. కొన్ని సందర్భాల్లో కొందరికి ప్రింటర్ల వంటి వస్తువులు కేవలం రూపాయికే వచ్చాయంటే... పోటీని అర్థం చేసుకోవచ్చు. అయితే అదంతా గతం. ఈ పోటీ ఈ- కామర్స్ కంపెనీలకు వందల కోట్ల నష్టాలు తెచ్చింది. వాటి విలువల్నీ బాగా తగ్గించేసింది. ఫలితం.. వీటిలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు లాభాల కోసం ఒత్తిడి మొదలెట్టారు. దీనికి తలొగ్గిన కంపెనీలు... తాజాగా సెల్లర్ల నుంచి తీసుకునే కమిషన్ను పెంచేశాయి. సెల్లర్లు కూడా వస్తువుల ధరల్ని పెంచాల్సిన పరిస్థితి. ఇదీ... ఇప్పటి ఈ-కామర్స్ వెబ్సైట్ల పరిస్థితి. ఫ్లిప్కార్ట్, పేటీఎం, అమెజాన్ వంటి దేశీ అగ్రశ్రేణి ఈ-కామర్స్ కంపెనీలన్నీ సెల్లర్ల నుంచి వసూలు చేస్తున్న కమిషన్కు ప్రామాణికత తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలెట్టాయి. అంటే ఇక ఈ సైట్లన్నీ ఒకే మొత్తాన్ని కమిషన్గా వసూలు చేస్తాయన్నమాట. తాజాగా ఫ్లిప్కార్ట్ సంస్థ అన్ని విభాగాల్లోనూ సెల్లర్ల నుంచి వసూలు చేస్తున్న కమిషన్ శాతాన్ని పెంచింది. అమెజాన్, పేటీఎం, స్నాప్డీల్తో సమానం చేయటానికే ఇలా పెంచుతున్నట్లు ఫ్లిప్కార్ట్ వర్గాలు చెప్పాయి. ‘‘కమిషన్ శాతాన్ని స్పష్టంగా చెప్పలేం. ఎందుకంటే మా సైట్లో వివిధ రకాల వస్తువులుంటాయి. వాటిని బట్టే కమిషన్ ఉంటుంది’’ అని ఆ వర్గాలు చెప్పాయి. కాగా కమిషన్లు పెంచటం వల్ల సెల్లర్లు 9 శాతం వరకూ ధరలు పెంచే అవకాశమున్నట్లు సోమవారం ‘ఎకనమిక్ టైమ్స్’ పత్రిక వెల్లడించింది. మరోవంక ఫ్లిప్కార్ట్ ప్రయోగాత్మకంగా మొదలుపెట్టిన ‘జీరో కమిషన్’ స్కీమ్ను కూడా ఎత్తేసింది. ఇప్పటిదాకా బాగా ప్రాచుర్యం ఉన్న 350 మంది సెల్లర్ల నుంచి ఎలాంటి కమిషన్ వసూలు చేయకుండా... వారి ప్రొడక్ట్లను డిస్ప్లే చేసేచోట ప్రకటనలు వేస్తూ ఫ్లిప్కార్ట్ ఈ స్కీమ్ను అమలు చేసింది. అయితే కమిషన్ పెంచటమనేది సెల్లర్లలో పోటీ తత్వాన్ని పెంచటానికేనని, ఇప్పటికీ పోటీ కంపెనీలకన్నా తాము తక్కువే వసూలు చేస్తున్నామని ఫ్లిప్కార్ట్ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఇప్పటికే పెంచిన అమెజాన్... ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్తో పోటీపడుతూ ధరల యుద్ధానికి తెరతీసిన అమెజాన్... ఇటీవలే సెల్లర్ల నుంచి వసూలు చేసే కమిషన్ను పెంచింది. 2015లో... ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్నాప్డీల్ రూ.7,000 కోట్ల నష్టాలను ప్రకటించాయి. వీటిలో అధిక భాగం డిస్కౌంట్లు, ఆఫర్ల వల్ల సంభవించినవేనని ఈ సంస్థలు చెప్పాయి కూడా. ఇదే బాటలో పేటీఎం...! చైనా ఈ-కామర్స్ దిగ్గజానికి చెందిన పేటీఎం కూడా కమిషన్ పెంచాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే దీనిపై వ్యాఖ్యానించటానికి పేటీఎం ప్రతినిధి నిరాకరించారు. నిజానికి చైనాలో అలీబాబా తన సెల్లర్ల నుంచి తక్కువ కమిషన్నే వసూలు చేస్తోంది. కాకపోతే వారి ఉత్పత్తుల్ని ప్రదర్శించే చోట ప్రకటనల ద్వారా ఎక్కువ ఆదాయం ఆర్జిస్తోంది. వారి ఉత్పత్తుల ప్రకటనలకూ బాగానే వసూలు చేస్తోంది. ఈ సంస్థకు వచ్చే ఆదాయంలో సగం కేవలం ప్రకటనల నుంచే వస్తోందంటే పరిస్థితి తెలియకమానదు. దాన్నే ఇక్కడ కూడా అనుసరిస్తుందా? లేక మిగిలిన సంస్థల్లా కమిషన్ పెంచుతుందా అన్నది తెలియరాలేదు. రిటర్న్కు ఇక అంతా ఒకే సమయం! ప్రామాణికతలో భాగంగా ఈ-కామర్స్ సంస్థలన్నీ ఇక వస్తువుల్ని తిరిగి తీసుకునేందుకు ఒకే గడువు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమెజాన్ బాటలో ఫ్లిప్కార్ట్ కూడా ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ఫోన్లు, పుస్తకాల్ని తిప్పి పంపే గడువును 10 రోజులకు కుదించింది. గతంలో ఇది 30 రోజులుండేది. స్నాప్డీల్ వీటిని 7 రోజుల్లోగా తిప్పి పంపాలని చెబుతోంది. ‘‘ఫ్లిప్కార్ట్ ఉత్పత్తుల్లో తిరిగివచ్చేవాటిలో అధికం డెలివరీ అయిన 5 రోజుల్లోగానే జరుగుతున్నాయి. అందుకని మా రిటర్న్ పాలసీ మార్చటం వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు’’ అని ఫ్లిప్కార్ట్ ప్రతినిధి చెప్పారు. -
స్నాప్డీల్లో ఉద్యోగాల కోత?
బెంగళూరు : ఆన్లైన్ మార్కెట్ సంస్థ స్నాప్డీల్ బెంగళూరు, ముంబై, కోల్కతా, హైదరాబాద్ లాంటి ప్రాంతీయ కార్యాలయాల్లో తన కార్యకలాపాలను తగ్గించుకోనుంది. కంపెనీ కొత్తగా ఫండ్స్ను పెంచుకోలేని పరిస్థితుల్లో వచ్చే ఆరునెలల్లో కొన్ని ఆఫీసులను మూసేస్తుందని స్నాప్ డీల్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇప్పటికే బెంగళూరులోని అకౌంట్స్ అండ్ వెండర్ మేనేజ్ మెంట్ కు చెందిన టీమ్ ను 85 నుంచి 45 మందికి తగ్గించింది. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన పనితీరు మెరుగుదల ప్రణాళిక కింద 200 మంది ఉద్యోగులకు నోటీసులు జారీచేసింది. అయితే కంపెనీ డిమాండ్లను చేరుకోవడం చాలా కష్టమని చాలామంది ఉద్యోగులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. తమతో రాజీనామా చేయించొద్దని కొంతమంది ఉద్యోగులు ఢిల్లీకి వెళ్లి మరీ కంపెనీ అధినేతలతో చర్చించారు. ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లాంటి పెద్ద ఈ-కామర్స్ దిగ్గజాలతో స్నాప్డీల్కు తీవ్ర పోటీ నెలకొంటోంది. ఈ పోటీని తట్టుకోలేక కంపెనీ కొన్ని ప్రాంతీయ ఆఫీసులను మూసివేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం స్నాప్ డీల్ యాడ్ బిజినెస్ ల వైపు దృష్టిసారిస్తుందని అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. రీజనల్ ఆఫీసుల తగ్గింపుపై స్నాప్ డీల్ ఇంకా అధికారిక ప్రకటన ఏమీ చేయలేదు. రాజధాని ప్రాంత టీమ్ సభ్యులను తమ గుర్గావ్ క్యాంపస్కు తరలిస్తున్నట్టు పేర్కొంది. దీంతో లీజుకు తీసుకున్న చిన్న చిన్న కార్యాలయాలు తగ్గించుకోవచ్చని తెలిపింది. ఎవరైనా ఉద్యోగులు కంపెనీ నుంచి వెళ్లదలుచుకుంటే, ఎంప్లాయిమెంట్ కాంట్రాక్టు ప్రకారం అన్ని చెల్లింపులను అందుకోవాలని ఓ ప్రకటన విడుదల చేసింది. -
బంపర్ బొనాంజాతో దూసుకుపోతున్న ఐటీసీ
ముంబై : ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ ఐటీసీ సోమవారం నాటి మార్కెట్ లో దూసుకుపోతోంది. 12 వరుస త్రైమాసికాల క్షీణత తర్వాత ఈసారి లాభాలను నమోదు చేయడంతో ఐటీసీ షేర్లు మార్కెట్లో జోరుగా ట్రేడవుతున్నాయి. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక లాభాల్లో 5.67 శాతం వృద్ధిని నమోదు చేసింది. శుక్రవారం ఐటీసీ క్యూ 4 ఫలితాల్లో రూ 10, 060 కోట్ల అమ్మకాలతో దాదాపు రూ 2,500 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.2,361.18 కోట్ల లాభాలు నమోదు చేసుకుంది. మార్చి త్రైమాసికంలో కంపెనీ నికర అమ్మకాలు 9.51 శాతం పెరిగి రూ.10,062.38 కోట్లకు చేరాయని ఐటీసీ బీఎస్ఈకి వెల్లడించింది. 2014-15 ఇదే త్రైమాసికంలో రూ.9,188 కోట్ల అమ్మకాలను నమోదు చేసింది. బోనస్: మెరుగైన ఫలితాల నేపథ్యంలో 1:2 నిష్పత్తిలో (ప్రతి రెండు షేర్లు ఒక షేరు ) బోనస్ షేర్లను ప్రకటించింది. బోనస్ షేర్ల జారీతో పాటు ఒక రూపాయి ముఖ విలువ కలిగిన ఒక్కో సాధారణ షేరుకు రూ.8.50 డివిడెండ్ను(షేరుకు రూ .2 ప్రత్యేక డివిడెండ్ సహా ) ఇచ్చేందుకు బోర్డు సమ్మతి తెలిపింది. ఫలితంగా బీఎస్ఈలో సంస్థ షేరు పరుగులు తీస్తోంది. . బుల్లిష్ ట్రెండ్: ఐటీసీ లాభాలపై మార్కెట్ ఎనలిస్టులు, అంచనా సంస్థలు పాజిటివ్ గా స్పందించాయి. రాబోయే 2017సం.రానికి ఐటీసీ మరింత పుంజుకుని రెండంకెల ఆదాయ వృద్ధిని నమోదు చేస్తుందని క్రెడిట్ స్యూజ్ కంపెనీ భరోసా ఇస్తోంది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఎబిట్(ఈబీఐటి) 9 శాతం ఆదాయాన్ని సాధించి అగ్రస్థానంలో నిలస్తుందని మోర్గాన్ స్టాన్లీ తెలిపింది.అటు డ్యుయిష్ బ్యాంక్ సహా ట్రేడింగ్ సంస్థలన్నీ ఐటీసీ షేరు ధరలు మరింత పెరగనున్నాయని అంచనావేశాయి. సాధారణ వర్షపాతం అంచనాలతో ఎఫ్ ఎంసీజీ వ్యాపారాన్ని జోరు పెంచిందనా అంచనావేస్తున్నారు. ఒక్కో షేరు 400 రూ. లను చేరుతుందని భావిస్తున్నారు. కాగా సోమవారం ఐటిసి 5 అధిక శాతం పెరిగి రూ 347 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీలో అత్యధిక లాభాలతో మార్కెట్ ను లీడ్ చేస్తోంది. ఐటీసీ వ్యాపారంలో ప్రధానమైన సిగరెట్లపై10 శాతం ఎక్సైజ్ సుంకం వృద్ధితో కంపెనీ సిగరెట్ ధరలను 10-13 శాతం పెంచిందని షేర్ ఖాన్ తెలిపింది. ఐటీసీ అగ్రి వ్యాపారం రూ 1,800 కోట్లకు పెరగ్గా, కంపెనీ హోటళ్లు / పేపర్ వ్యాపారం 4.8 శాతం పెరిగింది. -
ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ ల పరిస్థితి ఏంటి?
బెంగళూరు: భారత్ ఈ-కామర్స్ బిజినెస్ను ఓ ఊపు ఊపిన ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్లకు ఈమధ్య కాలం కలిసి రావట్లేదు. ఆ కంపెనీలకు పెట్టుబడుల రాక తగ్గింది. ఫండ్స్ కోసం ఎంతమంది పెట్టుబడిదారులను కలిసినా అనుకున్నంత పెట్టుబడులు రావట్లేదని కంపెనీలు నిరాశ వ్యక్తం చేస్తున్నాయి. 15 బిలియన్ డాలర్ల కోసం ఆరునెలల కాలంలో ఫ్లిప్ కార్ట్ దాదాపు 15 మందికి పైగా పెట్టుబడిదారులతో మంతనాలు జరిపింది. కానీ ఎవరి నుంచి సానుకూల స్పందన రాలేదని తెలుస్తోంది. ఇక స్నాప్ డీల్ పరిస్థితి కూడా ఇదేనట. అలీబాబా గ్రూప్, ఫాక్స్ కాన్, అంటారియో టీచర్స్ పెన్షన్ ప్లాన్, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్ మెంట్ బోర్డులను ఫ్లిప్ కార్ట్ కలిసి, పెట్టుబడుల కోసం అభ్యర్థించింది. కానీ వారెవరూ పెట్టుబడి పెట్టడానికి సమ్మతంగా లేమన్నట్టు తెలిసింది. 2014 మొదలు నుంచి 2015 మధ్య వరకూ ఫ్లిప్ కార్ట్ కొత్త పెట్టుబడిదారులను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ కొత్త పెట్టుబడు విషయంలో అంచనాలను ఆ కంపెనీ అందుకోలేకపోయింది. టైగర్ గ్లోబల్, ఖతర్ ఇన్వెస్ట్ మెంట్ అథారిటీ, పాత పెట్టుబడిదారుల నుంచి జూలైలో కేవలం 700 మిలియన్ డాలర్ల పెట్టుబడులను మాత్రమే కంపెనీ రాబట్టుకోగలిగింది. కొత్త పెట్టుబడులు పెంచుకోవడానికి ఈ సంస్థలు తెగ తాపత్రయం పడుతున్నాయి. స్నాప్ డీల్ సహ వ్యవస్థపకులు కునాల్ బాల్, రోహిత్ బన్సల్ శాన్ ప్రాన్సిస్కోలో కొత్త పెట్టుబడిదారులతో సమావేశాలు జరిపినట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ కంపెనీలు పెట్టుబడులు రాబట్టుకోవడానికి పడుతున్న ఇబ్బందులు మార్కెట్లో వాటి అంచనాలను తగ్గిస్తాయని నిపుణులంటున్నారు. అమెజాన్ వంటి ప్రపంచ దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ పోటీని తట్టుకొని, వాటి బిజినెస్ ను పెంచుకోవాలంటే కచ్చితంగా ఈ రెండు సంస్థలు కొత్త పెట్టుబడులను రాబట్టుకోక తప్పదు. అమెజాన్ మార్కెట్లో తనకున్న క్రేజ్ తో తెగ ఇన్వెస్ట్ మెంట్లను రాబట్టుకుంటోంది. తనకున్న అధీకృత మూలధనం రూ.16 వేల కోట్ల కంటే రెండింతల మూలధనాన్ని ఆ కంపెనీ కలిగి ఉంది. ఈ-కామర్స్ ఇన్వెస్ట్ మెంట్ సంస్థలపై కొత్తగా ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు కూడా ఈ స్టార్టప్ కంపెనీలకు అడ్డంకిగా మారాయి. ఈ నిబంధనలపై ఈ సంస్థలకు అవగాహన తక్కువగా ఉండటంతో ఇబ్బందులకు గురవుతున్నాయి. ఆన్ లైన్ రిటైల్ లో 100 శాతం విదేశీ పెట్టుబడులకు ఆమోదం తెలుపుతూ మార్చి 29న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ కంపెనీలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇప్పటివరకూ ఈ కంపెనీలు అధికంగా ఆపర్ చేస్తున్న డిస్కౌంట్లను ప్రభుత్వ నిబంధనలతో తగ్గించడంతో, వినియోగదారులను ఆకట్టుకోలేక ఈ దీపావళి సీజన్లో తక్కువ అమ్మకాలను నమోదు చేశాయి. గత నవంబర్తో పోలిస్తే ఈ మార్చిలో కంపెనీల ఆదాయాలు కూడా పడిపోయాయి. -
హైటెన్షన్ వైర్లు తెగిపడి 11మంది మృతి
గౌహతి: అసోంలోని టిన్సుకియా జిల్లాలో నిరసనకారుల ఆందోళన పెను ప్రమాదానికి దారి తీసింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరపడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హై వోల్టేజీ కేబుల్ తెగిపడిన దుర్ఘటనలో 11మంది మరణించగా, మరో 20మందికి తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం..మూడు రోజుల క్రితం జరిగిన జంట హత్యలకు కారకులైన వారిని తమకు అప్పగించాలంటూ కొంతమంది...స్థానిక పోలీస్ స్టేషన్పై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. కత్తులు, కర్రలతో విధ్వంసం సృష్టించారు. పరిస్థితి అదుపు తప్పటంతో ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నంలో పోలీసులు కాల్పులు జరిపారు. అయితే గాల్లోకి దూసుకుపోయిన కొన్ని బుల్లెట్లు దగ్గరలో వున్న కరెంట్ పోల్కు తాకడంతో అది కుప్పకూలింది. అది నేరుగా ఆందోళన చేస్తున్న వారిపై పడటం, హై వోల్టేజి కేబుల్ వైర్లు వారిని తాకడం క్షణాల్లో జరిగిపోయింది. ఘటనా స్థలంలోనే 9 మంది చనిపోగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటనలో మరి కొంతమందికి బుల్లెట్ గాయాలు తగిలాయి. కాగా పరిస్థితి చేయి దాటడంతో గాల్లోకి, ఆందోళనకారులపై కాల్పులు జరపాల్సివ చ్చిందని డీజీపీ ముఖేష్ సహాయ్ చెప్పారు.కేంద్ర పారామిలిటరీ దళాలు, పోలీసు బలగాలను సంఘటనా స్థలానికి తరలించిన సీనియర్ అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆందోళనకారులతో చర్చలు జరుపుతున్నారు. -
కోరుకున్న వస్తువులు.. ఇక 4 గంటల్లోనే
అహ్మదాబాద్: స్నాప్ డీల్ లో ఏదైనా మొబైల్ ఫోన్ కొంటే, నాలుగు గంటల్లో మన చేతిలోకి వచ్చేస్తుంది. దీంతో మొబైల్ కొనుగోలులో స్నాప్ డీల్ కు ఫుల్ క్రేజ్ పెరిగింది. ఈ విధంగా అన్ని వస్తువులను నాలుగు గంటల్లోనే వినియోగదారుల ముందుంచాలని స్నాప్ డీల్ నిర్ణయించింది. డెలివరీ టైమ్ ను గతేడాది కంటే 70శాతం పెంచుకున్నామని, ఫోన్లకే పరిమితమైన ఈ నాలుగు గంటల డెలివరీని మరిన్ని వస్తువులకు అందజేయనున్నట్టు కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆశిష్ చిత్రవంశీ తెలిపారు. దాదాపు వినియోగదారులు కొనుకునే 99 శాతం ఉత్పత్తులను అదే రోజు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ ఉత్పత్తులను నాలుగు గంటలోనే అందించేలా ప్రణాళికలు చేస్తున్నామని చెప్పారు. భారత ఈ-కామర్స్ వ్యాపారంలో అగ్రగామిగా ఉన్న గూర్గావ్ కు చెందిన ఈ సంస్థ, దాదాపు రూ.1,300 కోట్లు పెట్టుబడులతో 2 మిలియన్ల చదరపు అడుగుల గిడ్డంగి సామర్థ్యంతో 2015లో మార్కెట్లోకి ప్రవేశించింది. 2015లో 7 శాతం ఉత్పత్తులను మాత్రమే తన గిడ్డంగి నుంచి అందజేసిన ఈ సంస్థ, ప్రస్తుతం 70శాతం ఉత్పత్తులను వినియోగదారులకు చేరవేస్తోంది. క్రమేపి తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ, ఉత్పత్తులను త్వరగా వినియోగదారులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని చిత్రవంశీ చెప్పారు. -
ట్విట్టర్లో దిగ్గజ కంపెనీ సీఈవోల వార్!
ఆన్లైన్ మార్కెట్ వచ్చాక భారత్ లో వ్యాపారం బాగా ఊపుకుంది. అదేవిధంగా కంపెనీల సీఈవోలు తమ మార్కెట్ విస్తరణ, వ్యాపారం లాభాల పంట పండించాలని ఆలోచిస్తారు. ప్రస్తుతం ఆన్ లైన్ మార్కెట్లో అవి రెండు పెద్ద మార్కెట్లు.. ఆ కంపెనీ సీఈవోలు మధ్య సహజంగానే పోటీ నెలకొని ఉంటుంది. అయితే ఆ పోటీ కాస్తా వాగ్వాదానికి దారితీయడం హాట్ టాపిక్ గా మారింది. ట్విటర్ వేదికగా చేసుకుని స్నాప్డీల్, ఫ్లిప్కార్ట్ సీఈవోలు ఒకరిపై మరొకరు వ్యాఖ్యలు చేసుకున్నారు. చైనాకు చెందిన ఆన్లైన్ దిగ్గజ సంస్థ అలీబాబా త్వరలో భారత్ మార్కెట్లలోకి నేరుగా ప్రవేశించనుంది. ఈ విషయంపై ఫ్లిప్కార్ట్ వ్యవస్థాపకులలో ఒకరైన సచిన్ బన్సాల్ (ఎగ్జిక్యూటీవ్ చైర్మన్) తీవ్రంగా స్పందించారు. అలీబాబా కంపెనీ మన దేశీయ మార్కెట్లోకి నేరుగా రావాలని చూస్తుందంటే మన దగ్గర పెట్టుబడులు పెట్టిన ఆ సంస్థలు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయో అర్థం చేసుకోవచ్చునని బన్సాల్ ట్విట్టర్ ద్వారా మాటల యుద్ధానికి తెరలేపారు. స్నాప్డీల్ సీఈవో కునాల్ బహల్ సీరియస్ అయ్యారు. 5 బిలియన్ డాలర్ల ఫ్లిప్కార్ట్ మార్కెట్ క్యాపిటెల్ను మోర్గాన్ స్టాన్లీ ముంచేసిన విషయం మరిచిపోయావా అంటూ చురకలు అంటించారు. వ్యాఖ్యలు చేయడం ఆపి, ఎవరి వ్యాపారం వాళ్లు చూసుకుంటే మంచిదని ట్విటర్లోనే కునాల్ బహల్ ఘాటుగా జవాబిచ్చారు. Didn't Morgan Stanley just flush 5bn worth market cap in Flipkart down the -
వైఫై రూటర్లు బుక్చేస్తే ఖాళీ డబ్బా వచ్చింది!
మహబూబాబాద్ : ఓ కంపెనీకి చెందిన వైఫై రూటర్లు ఆఫర్లో ఇస్తున్నామని ప్రచారం చేయడంతో ఓ వ్యాపారీ ఆన్లైన్లో బుక్ చేయగా రూటరుకు బదులుగా ఖాళీ డబ్బా మాత్రమే వచ్చింది. మహబూబాబాద్ పట్టణానికి చెందిన వ్యాపారి ప్రభాకర్ సెల్ వరల్డ్ షాపును నిర్వహిస్తున్నాడు. స్నాప్డీల్ కంపెనీ వైఫై రూటర్లను ఆఫర్లో ఇస్తున్నట్లుగా ప్రచారం చేసింది. ప్రభాకర్ మూడు వైఫై రూటర్ల కోసం ఆన్లైన్లో బుక్ చేశాడు. వాస్తవానికి ఆ వైఫై రూటర్ ధర రూ.1000 ఉండగా ఆఫర్లో రూ. 769కి మాత్రమే అని ప్రచారం చేయడంతో మూడు రూటర్లకు ఆన్లైన్లో డబ్బులు చెల్లించాడు. ఆ రూటర్లకు సంబంధించిన మూడు బాక్సులు తపాల శాఖ ద్వారా సిబ్బంది సోమవారం రాత్రి వ్యాపారికి అందజేశారు. ప్రభాకర్ మంగళవారం ఉదయం ఒక బాక్సును తీసి చూడగా ఖాళీగానే ఉంది. మిగిలిన రెండు బాక్సులు కూడా అలాగే ఉంటాయని భావించి వాటిని తెరిచి చూడలేదు. తిరిగి ఆ బాక్సులను సంబంధిత కంపెనీకి పంపిస్తామని ఆ వ్యాపారి తెలిపారు. కంపెనీ చేసిన ప్రచారాన్ని నమ్మి డబ్బులు చెల్లిస్తే ఈ విధంగా మోసం జరిగిందని ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశాడు. -
స్నాప్డీల్ లో టీవీఎస్ బైక్స్
చెన్నై: ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ టీవీఎస్ మోటార్ తాజాగా ఈ-కామర్స్ సంస్థ స్నాప్డీల్తో జతకట్టింది. దీంతో టీవీఎస్ మోటార్కు చెందిన తొమ్మిది టూవీలర్ ఉత్పత్తులు ఇకమీదట స్నాప్డీల్.కామ్లో వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి. కస్టమర్లు స్నాప్డీల్ మోటార్స్ ప్లాట్ఫామ్లోకి వెళ్లి వారికి న చ్చిన మోడల్ను, డీలర్షిప్ను ఎంపిక చేసుకోవచ్చు. కాగా ఇప్పుడు మిచెలిన్ టైర్స్కు చెందిన ప్యాసెంజర్ కారు టైర్లు కూడా స్నాప్డీల్లో అందుబాటులో ఉన్నాయి. -
ఈ నెల 21 నుంచీ ఇన్ఫీబీమ్ ఐపీఓ
ప్రైస్బాండ్ రూ.360-432 న్యూఢిల్లీ: ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ ఇన్ఫీబీమ్ ఇన్కార్పొ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ఈ నెల 21 నుంచి ప్రారంభ మై 23న ముగుస్తుంది. ఐపీఓకు వస్తున్న మొదటి ఈ కామర్స్ సంస్థ ఇది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.450 కోట్లు సమీకరించనున్నదని అంచనా. ఈ ఐపీఓకు రూ.360-432 ధరల శ్రేణిని కంపెనీ నిర్ణయించింది. ఈ కామర్స్ రంగంలో ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్నాప్డీల్, ఇతర కంపెనీలతో ఇన్ఫీబీమ్ పోటీపడుతోంది. 2007లో ప్రారంభమైన ఇన్ఫీబీమ్ కంపెనీ ఇన్ఫీబీమ్డాట్కామ్, బిల్డ్బజార్, ఇన్సెప్ట్, పిక్స్క్వేర్ వంటి పలు ఈకామర్స్ సేవలను అందిస్తోంది. -
ట్యాబ్ కొంటే సబ్బు బిళ్ల పంపారు
యడ్లపాడు (గుంటూరు): ఆన్లైన్ షాపింగ్లో ట్యాబ్ బుక్ చేసుకుంటే సబ్బు బిళ్ల చేతికి వచ్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా యడ్లపాడు రాజీవ్గాంధీ సెంటర్కు చెందిన టైలర్ భాస్కర్ ఫిబ్రవరి 16న సోలో కంపెనీ ట్యాబ్ను స్నాప్డీల్ ద్వారా బుక్ చేశాడు. అది సరిగ్గా నాలుగు రోజులకు చిలకలూరిపేట బ్లూడార్ట్ కొరియర్ సెంటర్కు వచ్చింది. అదే నెల 21న బ్లూడాట్ సెంటర్లో రూ.4వేలు డబ్బులు చెల్లించిన భాస్కర్ అక్కడే బాక్స్ తెరిచి చేసి చూశాడు. అంతే... అందులో డిటర్జెంట్ సబ్బు ఉండటాన్ని చూసి ఒక్కసారిగా కంగుతిన్నాడు. సబ్బుతో పాటు ఇయర్ ఫోన్, బ్యాటరీ ఉన్నాయి కానీ ట్యాబ్ లేదు. ఇదేమని ప్రశ్నిస్తే కొరియర్ వారు తమకు సంబంధం లేదని చెప్పడంతో యడ్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా... ఎస్సై ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
'స్నాప్డీల్' ఉద్యోగిని కిడ్నాప్ మరువకముందే..!
న్యూఢిల్లీ: 'స్నాప్డీల్' ఉద్యోగిని దీప్తి సర్నా కిడ్నాప్ వ్యవహారం సుఖాంతమై వారం రోజులు గడువకముందే దేశ రాజధాని న్యూఢిల్లీ శివార్లలో మరో మహిళ అదృశ్యమైంది. నోయిడాకు చెందిన షిప్రా మాలిక్ అనుమానాస్పద పరిస్థితుల్లో నడుమ కనిపించకుండాపోయారు. వృత్తిరీత్యా ఫ్యాషన్ డిజైనర్ అయిన ఆమె సోమవారం ఇంటి నుంచి చాందిన్చౌక్కు బయలుదేరారు. ఆమె మొబైల్ఫోన్ నుంచి చివరి కాల్ '100'కు చేసినట్టు కనిపిస్తోంది. చివరిసారిగా పోలీసులకు ఫోన్ చేసినప్పుడు.. ఆమె దక్షిణ ఢిల్లీలోని లజ్పత్ నగర్లో ఉన్నట్టు లోకేషన్ను గుర్తించారు. ఆమె ఇంటికి 500 మీటర్ల దూరంలో ఆమె మారుతి స్విఫ్ట్ కారు వదిలేసి ఉంది. నోయిడాలో 'బోటిక్' నడిపిస్తున్న ఆమె స్థానిక బిల్డర్ను వివాహం చేసుకుంది. షిప్రా కనిపించకపోవడంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఆమె కిడ్నాప్ అయిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎవరి నుంచి డబ్బు కోసం కుటుంబసభ్యులకు ఇప్పటివరకు ఎలాంటి ఫోన్ కాల్స్ రాలేదు. -
600మంది స్నాప్డీల్ ఉద్యోగులపై వేటు?
ప్రముఖ ఆన్లైన్ విక్రయ సంస్థ స్నాప్డీల్ మరో వివాదంలో ఇరుక్కుంది. దాదాపు 600మంది ఉద్యోగులపై వేటు వేసిందనే వార్త.. సోషల్ మీడియాలో భగ్గుమంది. మరో 200 మందికి పైగా ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధమైందన్న వార్తలు గుప్పుమన్నాయి. పూర్ పెర్ ఫార్మెన్స్ కారణంగా స్నాప్డీల్ మరికొంతమంది ఉద్యోగులకు పింక్ స్లిప్పులను జారీ చేసిందన్న వార్తలు హల్చల్ చేశాయి. మరోవైపు కంపెనీకి చెందిన కొంతమంది ఉద్యోగులు గుర్గావ్ లోని సంస్థ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళనకు దిగారు. దీంతో సోషల్ మీడియాలో వచ్చిన వార్తలకు మరింత బలం చేకూరింది. ఎంతమంది ఉద్యోగులను తొలగించారనే దానిపై స్పష్టత రానప్పటికీ ...ఇటీవలి కంపెనీ నష్టాల ప్రభావం సిబ్బందిపై భారీగా పడనుందనే ఆందోళన చెలరేగింది. అయితే సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై స్నాప్ డీల్ స్పందించింది. పనితనంలో మెరుగుదల కోసం శిక్షణా కార్యక్రమాలను చేపట్టామని వెల్లడించింది. మరి కొంతమంది స్వచ్ఛందంగా రాజీనామా చేశారని పేర్కొంది. కాగా అప్పట్లో అమీర్ ఖాన్ వ్యాఖ్యల అనంతరం నెటిజన్లు ఆయన ప్రచారం చేస్తున్న స్నాప్ డీల్ బహిష్కరించాలనే ప్రచారం లేవనెత్తింది. దీంతో సంస్థ భారీ నష్టాలను మూటగట్టుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన కొనసాగితే మరింత నష్టం తప్పదనే భావనతో అమీర్ ను తమ బ్రాండ్ అంబాసిడర్ గా తొలగించిన సంగతి తెలిసిందే. -
మనసు పడి.. 150 రెక్కీలు చేసి.. కిడ్నాప్!
తొలిసారి చూసినప్పటి నుంచే ఆమెను ఎంతగానో ఇష్టపడ్డాడు. ఆమె మనసు దోచుకోవాలని అనుకున్నాడు. అందుకోసం విశ్వ ప్రయత్నాలు చేశాడు.. చివరకు కిడ్నాప్ చేశాడు! అందుకోసం ఏకంగా 150 సార్లు రెక్కీ చేయడమే కాదు.. రెండు ఆటోలు కూడా కొన్నాడు. ఇదీ ఘజియాబాద్లో కిడ్నాపైన స్నాప్డీల్ ఉద్యోగిని దీప్తి సర్నా వెనుక జరిగిన కథ. అప్పటికే పెళ్లయిన దేవేందర్ (29) పాత నేరస్తుడు. అతడి మీద మూడు హత్యకేసులు కూడా ఉన్నాయి. తొలుత ఆమె బోయ్ఫ్రెండు తమను కిరాయికి మాట్లాడుకున్నాడని, కొంత డబ్బు తీసుకుని ఆమెను వదిలించుకోవాలనుకున్నాడని దీప్తితో దేవేందర్ చెప్పాడు. తర్వాత పోలీసులు తమదైన శైలిలో విచారణ మొదలుపెడితే అసలు విషయం బయటకు వచ్చింది. కిడ్నాపర్ల గ్యాంగు నుంచి తాను విడిపోయి.. ఆమెను విడిచిపెట్టానని, ఆమె మనసు గెలుచుకున్నానని చెబుతున్నాడు. తొలిసారి దీప్తిని 2015 జనవరిలో రాజీవ్ చౌక్ మెట్రోస్టేషన్లో చూశాడు. తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడ్డాడు. అప్పటినుంచి ఆమె వెనకాలే తిరిగి.. ఎక్కడ ఉంటోంది, ఏం పని చేస్తోంది.. అన్నీ తెలుసుకున్నాడు. ఆమె ఎక్కడికెళ్లినా వెనకాలే ఉండేవాడు. అలా మాల్స్, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు.. అన్నింటికీ వెళ్లాడు. తన మీద చాలా కేసులు ఉన్నాయని, ఇప్పుడు ప్రేమ కేసు ఎందుకు ఉండకూడదని పోలీసులను ప్రశ్నించాడంటే అతడి పిచ్చి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. అతగాడి మీద ఇప్పటికే మూడు హత్యకేసులు సహా మొత్తం 32 పాత కేసులున్నాయి. దీప్తి కిడ్నాప్ కేసులో దేవేందర్తో పాటు ప్రదీప్, ఫహీమ్, మోహిత్, మాజిద్ అనే నలుగురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. దీప్తిని కిడ్నాప్ చేస్తే ఒక్కొక్కరికి రూ. కోటి చొప్పున వస్తాయని వాళ్లకు చెప్పాడు. ఇదంతా హవాలా మార్గంలో వస్తుందని చెప్పడంతో.. వాళ్లు కూడా చాలా సులభంగా డబ్బు సంపాదించొచ్చని భావించారు. ఫిబ్రవరి 10వ తేదీన కిడ్నాప్ చేయాలని, నవంబర్ నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. దేవేందర్ రెండు కొత్త సీఎన్జీ ఆటోలు కొని.. వాటిని వైశాలి మెట్రో ప్రాంతంలో తిప్పడం మొదలుపెట్టాడు. దీప్తి ప్రతిరోజూ అక్కడి నుంచి ఘజియాబాద్ పాత బస్టాండు వద్దకు ఆటోలో వెళ్తుంది. అక్కడి నుంచి ఆమె తండ్రి కవినగర్లో ఇంటికి తీసుకెళ్తారు. ఇవన్నీ తెలుసుకునే అతడు కిడ్నాప్ ప్లాన్ వేశాడు. -
'ఆ సినిమాను తిట్టడం ఏం బాలేదు'
ముంబై: స్నాప్డీల్ ఉద్యోగిని దీప్తి సర్నా కిడ్నాప్ మిస్టరీ వీడటంతో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా షారుఖ్ఖాన్, జూహ్లీ చావ్లా జంటగా నటించిన 'డర్' (1993) సినిమా ఈ కిడ్నాప్ కు ప్రేరణ అని తేలడం కొత్త చర్చకు దారితీసింది. 'డర్' సినిమాలో షారుఖ్ తరహాలోనే దాదాపు ఏడాదిపాటు దీప్తిని రహస్యంగా వెంటాడిన కిడ్నాపర్.. ఆ సినిమా ప్రేరణతోనే ఆమెను కిడ్నాప్ చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ చిత్రాలపై మళ్లీ విమర్శలు వెల్లువెత్తాయి. అయితే 'డర్' సినిమాలో నటించిన హీరోయిన్ జూహ్లీ చావ్లా మాత్రం సమాజంలో జరిగే తప్పులకు సినిమాలను నిందించడం సరికాదు అంటున్నారు. ఈ కిడ్నాప్ వ్యవహారంలో 'డర్' చిత్రాన్ని తప్పుబట్టడం సరికాదని పేర్కొన్నారు. 'సినిమా ముగింపులో సత్యమే విజయం సాధించినట్టు మేం ఎప్పుడూ చూపిస్తాం. సినిమాను మధ్యలోనే వదిలేసి మీకు నచ్చింది ఎంచుకోమని, చెడు చేయమని ఎప్పుడూ ప్రేక్షకులకు బోధించం. ప్రజల జీవితాలపై బాలీవుడ్ చిత్రాలు మాత్రమే కాదు వ్యక్తిగత, కుటుంబ ప్రభావాలు కూడా ఉంటాయి' అని జూహ్లిలీచావ్లా అన్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేశ్ భట్ కూడా ఈ విషయంలో స్పందించారు. 'నిజజీవితంలోని ఘట్టాలే సినిమాలకు ప్రేరణ అవుతాయి. సినిమాలోని దృశ్యాలు నిజజీవితంలోనూ ప్రభావం చూపుతాయి. ఈ విషయంలో చర్చ ఎప్పుడూ ఉన్నదే. సినిమాలు, పుస్తకాలు సమాజాన్ని మార్చి ఉంటే ఈపాటికే ప్రపంచం స్వర్గధామం అయ్యేది' అని ఆయన అన్నారు. -
దీప్తి ఎలా అదృశ్యమైందంటే..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో స్నాప్ డీల్ ఉద్యోగిని దీప్తి సర్నాకు ఎలాంటి హానీ తలపెట్టకుండా, డబ్బు రూపంలో డిమాండ్లు చేయకుండా కిడ్నాపర్లు ఆమెను క్షేమంగా వదిలిపెట్టడంతో కథ సుఖాంతమైంది. ఓ మహిళతో కలసి ఇద్దరు దుండగులు ఆమెను కిడ్నాప్ చేశారు. కాగా ఆమెను ఎందుకు కిడ్నాప్ చేశారన్నది పోలీసుల విచారణలో తేలాల్సివుంది. దీప్తి తండ్రి మాత్రం.. ఈ వార్తను మీడియా ఎక్కువగా ఫోకస్ చేయడం, పోలీసులు వెంటనే రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టడంతో కిడ్నాపర్లు భయపడి తన కుమార్తెను క్షేమంగా విడిచిపెట్టారని చెబుతున్నారు. దీప్తి కిడ్నాప్ ఉదంతంలో ఎప్పుడు ఏం జరిగిందంటే.. బుధవారం రాత్రి గుర్గావ్లోని స్నాప్ డీల్ సంస్థలో విధులు ముగించుకొని తిరిగివెళ్తుండగా ఘజియాబాద్లో దీప్తి అదృశ్యమైంది దీప్తి షేర్ ఆటోలో వెళ్తుండగా అది చెడిపోవడంతో మరో ఆటోలోకి మారింది. ఈ ఆటోలో ఇద్దరు మగవాళ్లు, ఓ మహిళ ఉన్నారు ఆటోను దారి మళ్లించడంతో దీప్తి ఆటో డ్రైవర్ను ప్రశ్నించింది. వెంటనే ఆటోలో ఉన్న మహిళ కత్తి చూపించి దీప్తిని బెదిరించింది అదే సమయంలో దీప్తి ఫోన్ చేసి తన తండ్రికి విషయం చెప్పింది. ఆటో ఆపాల్సిందిగా దీప్తి వేసిన కేకలు ఫోన్లో తండ్రికి వినిపించాయి. కాసేపటికి ఫోన్ స్విచాఫ్ అయ్యింది దీప్తి తండ్రి ఫిర్యాదు మేరకు 200 మంది పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు కిడ్నాపర్లు రాజ్ నగర్ ఏరియాలో గుర్తుతెలియని ప్రాంతంలో దీప్తిని బంధించారు కిడ్నాపర్లు దీప్తికి ఎలాంటి హానీ తలపెట్టకుండా, భోజనం పెట్టారు (ఈ విషయం దీప్తి పోలీసులకు చెప్పింది) ఆ మరుసటి రోజు ఉదయం కిడ్నాపర్లు రైల్వే స్టేషన్ సమీపంలో దీప్తిని వదిలిపెట్టారు దీప్తి ఓ ప్రయాణికుడి ఫోన్ తీసుకుని తన తండ్రికి సమాచారం అందించింది -
కిడ్నాపర్లు నన్ను బాగా చూసుకున్నారు
కిడ్నాపర్లు తనను చాలా బాగా చూసుకున్నారని, సమయానికి భోజనం కూడా పెట్టారని.. అందువల్ల వాళ్లను ఏమీ చేయొద్దని స్నాప్ డీల్ ఉద్యోగిని దీప్తి సర్నా చెబుతోంది. తన నుంచి గానీ, తన తండ్రి నుంచి గానీ డబ్బులు కూడా ఏమీ డిమాండ్ చేయలేదని.. అందుకే వాళ్ల మీద కేసులు కూడా ఏమీ పెట్టొద్దని అంటోంది. బుధవారం రాత్రి గుర్గావ్లోని స్నాప్ డీల్ సంస్థలో విధులు ముగించుకొని తిరిగివెళ్తుండగా ఘజియాబాద్లో దీప్తి అదృశ్యమైన సంగతి తెలిసిందే. 40 గంటల తర్వాత హర్యానాలోని పానిపట్ వద్ద ఆమెను పోలీసులు గుర్తించారు. తన కూతురు తనకు శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో ఫోన్ చేసి, 'నాన్నా.. నేను క్షేమంగానే ఉన్నాను.. నన్ను పికప్ చేసుకోండి' అని చెప్పిందని ఆమె తండ్రి నరేంద్ర సర్నా చెప్పారు. బహుశా కిడ్నాప్ చేయడం వాళ్లకు ఇదే మొదటిసారి అయి ఉంటుందని అందుకే భయపడి వదిలిపెట్టేసి ఉంటారని ఆయన అన్నారు. ఆమె కళ్లకు గంతలు కట్టి తెల్లవారుజామున 3-4 గంటల సమయంలో ఏదో రైల్వేస్టేషన్ వద్ద వదిలేశారిన తన కూతురు చెప్పిందన్నారు. అయితే దీప్తి ఫోన్, బ్యాగ్ మాత్రం మిస్సయ్యాయి. పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకుని, కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు. -
స్నాప్డీల్ ఉద్యోగిని కిడ్నాప్
న్యూఢిల్లీ: ఆన్లైన్ మార్కెట్ సంస్థ స్నాప్ డీల్కు చెందిన ఉద్యోగినిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. తన విధులను ముగించుకొని ఇంటికి వెళుతున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మేరకు స్నాప్ డీల్ ఫౌండర్ కునాల్ బాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీడియా వర్గాలు సంపాధించిన వివరాలు ప్రకారం దీప్తీ సార్నా అనే యువతి గూర్గావ్లోని స్నాప్ డీల్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తోంది. ఆమె ప్రతి రోజు ఆఫీసు వేళలు ముగియగానే మెట్రో రైలు ద్వారా గజియాబాద్కు వెళుతుంది. అక్కడి రైల్వే స్టేషన్ నుంచి తన ఇంటికి ఆటోలో వెళుతుంది. రోజూ మాదిరిగానే ఇంటికి వెళుతున్న దీప్తి గత రాత్రి ఇంటికి వెళ్లలేదు. ఎక్కడ ప్రయత్నించినా ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో సంస్థ వ్యవస్థాపకులే పోలీసులకు ఫిర్యాదు చేసి ఆమెను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
ఆమిర్ ఖాన్ కు మరో షాక్
న్యూఢిల్లీ: దేశంలో అసహనం పెరిగిపోతోందని ఇటీవల వ్యాఖ్యానించిన బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ కు మరో షాక్ తగిలింది. కేంద్ర ప్రభుత్వం ఆగ్రహానికి గురై 'ఇన్క్రెడిబుల్ ఇండియా' బ్రాండ్ అంబాసిడర్ కాంట్రాక్ట్ను కోల్పోయిన ఆమిర్.. తాజాగా ఈ-కామర్స్ దిగ్గజం స్నాప్ డీల్ తో ఒప్పందాన్ని చేజార్చుకున్నాడు. ప్రస్తుతం స్నాప్ డీల్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ఆమిర్ తో కాంట్రాక్టును మళ్లీ పొడగించరాదని ఆ సంస్థ నిర్ణయించినట్టు సమాచారం. స్నాప్ డీల్ తో ఆమిర్ కాంట్రాక్టు జనవరి 31తో ముగిసింది. అయితే ఈ కాంట్రాక్టును రెన్యువల్ చేయలేదు. కాగా ఈ విషయంపై స్నాప్ డీల్ ప్రతినిధులు కానీ ఆమిర్ కానీ స్పందించలేదు. మూడు నెలల క్రితం దేశంలో మత అసహనం పెరిగిపోతోందని, దేశం విడిచిపొదామని తన భార్య కిరణ్ రావు కోరిందని ఆమిర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆమిర్ వ్యాఖ్యలపై నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. స్నాప్ డీల్ ఆప్ ను తొలగించి నిరసన తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఆమిర్ తో కాంట్రాక్టును స్నాప్ డీల్ పునరుద్ధరించకపోవడం గమనార్హం. -
స్మార్ట్ ఫోన్ ఆర్డర్ ఇస్తే.. బండరాయి
కాశిబుగ్గ: ఆన్లైన్ షాపింగ్లో తక్కువ ధరకే మంచి స్మార్ట్ ఫోన్ వస్తుందని ఎంతో ఆశపడి ఫోన్ బుక్ చేస్తే.. ప్యాకింగ్లో రాయి వచ్చింది. వరంగల్ నగరం కాశిబుగ్గ తిలక్రోడ్డు నివాసి కుసుమ సురభి ఈనెల 22న స్నాప్డీల్లో రూ.1,700 ధరకే మైక్రోమాక్స్ స్మార్ట్ ఫోన్ వస్తున్నట్లు చూసి ఆ ఫోన్ బుక్ చేసింది. బుధవారం కొరియర్ బాయ్ అడ్రస్ ప్రకారం ఇంటికి రావడంతో సురభి రూ.1,700 చెల్లించి ప్యాకెట్ తీసుకుంది. తీరా కవర్ సీల్ తీసి చూడగా.. ప్యాకింగ్లో చార్జర్ వైర్తో పాటు బండరాయి వచ్చింది. కొరియర్ బాయ్ను నిలదీయగా.. తాను కేవలం కొరియర్ బయ్నేనని, తిరిగి కంపెనీకి సమాచారం ఇవ్వండని సలహా ఇచ్చి వెళ్లిపోయాడు. బాధితురాలు కంపెనీకి ఫోన్ ద్వారా పలు మార్లు సమాచారం ఇచ్చినా సరైన స్పందన లేదు. -
ఆన్లైన్లో ఘరానా మోసం!
ఆన్లైన్లో మోసం కొత్తకోట రూరల్: ఇటీవల ఆన్లైన్లో బుక్ చేసిన వాటర్ ఫిల్టర్కు బదులు ఓ వినియోగదారుడికి ఇటుక రాయి వచ్చింది. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా కొత్తకోటలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పాలెం గ్రామానికి చెందిన బాల్రెడ్డి స్నాప్డీల్లో ఇటీవల రూ.8 వేలు వెచ్చించి వాటర్ ఫిల్టర్ను బుక్ చేసుకున్నాడు. మంగళవారం కొరియర్ బాయ్ వచ్చి కస్టమర్ బుక్ చేసుకున్న వస్తువుకు సంబంధించి ఓ బాక్స్ అందజేశాడు. దీంతో బాల్రెడ్డి బాక్స్ను తీసుకుని ఇంటివద్దకు వెళ్లి తెరిచి చూడగా వాటర్ఫిల్టర్కు బదులు ఇటుక రాయి కనిపించింది. దీంతో అతడు ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఈ మోసం ఆన్లైన్ వారి మూలంగా జరిగిందా.. లేదా కొరియర్ సంస్థ ద్వారా జరిగిందా అన్న తెలియాల్సి ఉంది. -
స్నాప్డీల్లో ఘరానా మోసం
-
ఆమిర్ వ్యాఖ్యలతో పెరిగిన బిజినెస్
ముంబై: వ్యతిరేక ప్రచారం కారణంగా కొన్ని సందర్భాల్లో నష్టం కన్నా లాభమే ఎక్కువ జరుగుతుంది. ఏ ప్రచారం లేకపోవడంకన్నా ఏదో ప్రచారం ఉండడం మేలని నమ్మే రాజకీయ నాయకుల గురించి మనకు తెల్సిందే. దేశంలో అసహన పరిస్థితులు పెరిగిపోతున్నాయంటూ బాలివుడ్ నటుడు ఆమిర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవడం, ఆయన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమైనవని, వాటితో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న ‘స్నాప్డీల్’ అప్లికేషన్ కంపెనీ చెప్పడం తెల్సిందే. ‘సుబ్బి పెళ్లి ఎంకి చావుకొచ్చింది’ అన్నట్టు ఆమిర్ ఖాన్ వ్యాఖ్యల వల్ల స్నాప్డీల్ మార్కెట్ పడిపోతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. వాస్తవానికి వారి అంచనాలు తలకిందులై స్నాప్డీల్ మార్కెట్ మరింత పుంజుకుంది. ఆమిర్ ఖాన్ వ్యాఖ్యలు చేసిన నవంబర్ 23వ తేదీనాడు గూగుల్ ప్లే స్టోర్లో స్నాప్డీల్ ఇండియా ర్యాంక్ 28వ స్థానంలో ఉండగా, ఆ మరుసటి రోజు కూడా అదే ర్యాంక్ కొనసాగింది. ఆ తదుపరి రోజు, అంటే 25వ రోజున ‘ఘర్వాప్సీ’ తరహాలో ‘యాప్వాప్సీ’ అనే వ్యతిరేక ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకొంది. తద్వారా స్నాప్డీల్ ఒక స్థానాన్ని అధిగమించి 27వ ర్యాంక్కు చేరుకుంది. నవంబర్ 26వ తేదీ నాడు ఒక్కసారిగా ఐదు ర్యాంకులు అధిగమించి 22వ ర్యాంక్కు చేరుకుంది. గత 30 రోజుల కాలంలో ఐదు ర్యాంక్లు అధిగమించడం ఇదే మొదటిసారి. -
స్నాప్ డీల్కు ఎసరు పెట్టిన ఆమీర్ ’అసహనం’
-
'ఆమిర్ వ్యాఖ్యలతో మాకేం సంబంధం లేదు'
న్యూఢిల్లీ: భారత్ లో పెరుగుతున్న అసహనంపై బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆయన వ్యాఖ్యలపై పలు వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. రాజకీయ, సినీ రంగ ప్రముఖుల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. అంతేకాకుండా ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ఈ-కామర్స్ కంపెనీ స్నాప్ డీల్ కు ఈ వ్యాఖ్యల సెగ తగిలింది. దేశంలో చోటుచేసుకుంటున్న అసహనపు ఘటనల నేపథ్యంలో దేశాన్ని విడిచి వెళ్లిపోదామా? అని తన భార్య కిరణ్ రావు అడిగిందని ఆమిర్ చెప్పడం.. తీవ్ర వివాదం రేపిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలతో ఆగ్రహం చెందిన పలువురు నెటిజన్లు గూగుల్ ప్లే స్టోర్ లో స్నాప్ డీల్ యాప్ పట్ల ప్రతికూల వ్యాఖ్యలు చేశారు. స్నాప్ డీల్ యాప్ కు పెద్ద ఎత్తున పూర్ రేటింగ్ ఇచ్చారు. వెంటనే ఆమిర్ ఖాన్ ను స్నాప్ డీల్ బ్రాండ్ అంబాసిడర్ గా తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ వివాదంపై మొదట మౌనంగా స్నాప్ డీల్ సంస్థ ఎట్టకేలకు బుధవారం పెదవి విప్పింది. ఈ వివాదంతో తమకేమీ సంబంధం లేదని ఆ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. 'ఆమిర్ ఖాన్ వ్యక్తిగత పరిధిలో చేసిన వ్యాఖ్యలలో స్నాప్ డీల్ కు ఎలాంటి పాత్ర కానీ, సంబంధం కానీ లేదు. స్నాప్ డీల్ భారత్ కు గర్వకారణమైన సంస్థ. యువ భారతీయులు అత్యంత ప్రేమతో నిర్మించిన ఈ సంస్థ.. సమ్మిళిత డిజిటల్ ఇండియా నిర్మాణంలో దృష్టి పెట్టింది. ప్రతిరోజూ మేం భారత్ లోని వేలాది చిన్న వ్యాపారులు, లక్షలాది వినియోగదారులకు మేలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. భారత్ లో పది లక్షలమంది విజయవంతమైన ఆన్ లైన్ వ్యాపారవేత్తలను తయారుచేయాలన్న పెట్టుకున్న లక్ష్యం దిశగా మేం ముందుకు సాగుతున్నాం' అని స్నాప్ డీల్ తెలిపింది. -
5 నిమిషాల్లో 60,000 మ్యాగీ కిట్స్ విక్రయం
న్యూఢిల్లీ: మోతాదుకు మించి సీసం ఉందనే కారణంగా దాదాపు ఐదు నెలల నిషేధాన్ని ఎదుర్కొన్న తర్వాత మళ్లీ మార్కెట్లోకి వచ్చిన మ్యాగీ ఇన్స్టెంట్ నూడుల్స్ వెల్కమ్ కిట్స్ స్నాప్డీల్లో కేవలం ఐదు నిమిషాల్లోనే 60,000 అమ్ముడుపోయాయి. నవంబర్ 9న మ్యాగీ కిట్స్ నమోదు ప్రక్రియ ప్రారంభమైతే.. వాటి అమ్మకాలు స్నాప్డీల్లో గురువారం ప్రారంభమయ్యాయి. కేవలం ఐదు నిమిషాల్లోనే తొలి బ్యాచ్కు చెందిన 60,000 మ్యాగీ కిట్స్ అమ్ముడుపోయాయి. ఒక మ్యాగీ కిట్లో 12 మ్యాగీ ప్యాకెట్స్, 2016 మ్యాగీ క్యాలెండర్, మ్యాగీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్, మ్యాగీ పోస్ట్కార్డ్స్, ఒక వెల్కమ్ బ్యాక్ లెటర్ ఉంటాయి. దీని ధర రూ.144గా ఉంది. అలాగే మరో కొత్త బ్యాచ్ మ్యాగీ కిట్స్ విక్రయాలు నవంబర్ 16న జరగనున్నాయి. మ్యాగీ విక్రయాలు ఇప్పటికే 300 డిస్ట్రిబ్యూటర్ల ద్వారా 100 పట్టణాల్లో పునఃప్రారంభమయ్యాయి. -
5 నిమిషాల్లో 60 వేల మ్యాగీ కిట్స్ అమ్మకం
న్యూఢిల్లీ: మ్యాగీ నూడుల్స్ సరికొత్త రికార్డును సృష్టించింది. ఇప్పటిదాకా దుకాణాల ద్వారా విక్రయాలకే పరిమితమైన మ్యాగీ నూడుల్స్ను ఆన్లైన్లోని స్నాప్ డీల్ లో పెట్టిన ఐదునిమిషాల్లోనే రికార్డు స్థాయిలో అమ్ముడు పోయాయి. 5 నిమిషాల్లో 60 వేల మ్యాగీ వెల్కమ్ బ్యాక్ కిట్స్ను ఆన్ లైన్ లో కొనుగోలు చేశారు. మ్యాగీ వెల్కమ్ బ్యాక్ కిట్స్లో 12 మ్యాగీ ప్యాకెట్లు, 2016 మ్యాగీ క్యాలెండర్, మ్యాగీ ఫ్రీజ్పై వాడే అయస్కాంతం, మ్యాగీ పోస్ట్ కార్డు, ఒక వెల్కమ్ బ్యాక్ లెటర్ ఉంటాయి. నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో... దాదాపు అయిదు నెలల తర్వాత మ్యాగీ నూడుల్స్ అమ్మకాలు పలు రాష్ట్రాల్లో సోమవారం నుంచి మళ్లీ ప్రారంభమయ్యాయి. సుమారు 100 పట్టణాల్లో దాదాపు 300 మంది పంపిణీదారుల ద్వారా వీటి విక్రయాలు మొదలయ్యాయి. మ్యాగీ నూడుల్స్లో హానికారక సీసం నిర్దేశిత స్థాయికి మించి ఉందన్న ఆరోపణలపై భారత ఆహార ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఈ ఏడాది జూన్లో వీటి అమ్మకాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. -
‘క్లిక్’ అవుతున్న పోస్ట్..
2008లో డాట్ కామ్ బూమ్ బద్దలయింది. బోలెడన్ని ఇంటర్నెట్ కంపెనీలు మూతపడ్డాయి. కాకపోతే... ఆ బూమ్లో వేసిన కేబుళ్లు, బ్రాడ్ బ్యాండ్ లైన్లు... దేశంలో కొత్త ఇంటర్నెట్ విప్లవానికి ఊపిరినిచ్చాయి. ఉత్తరాలు, పోస్టు కార్డులను ఈమెయిల్స్, ఎస్ఎంఎస్లు మరిపించేశాయి. మనీ ఆర్డర్లను డిజిటల్ బ్యాంకింగ్ మింగేసింది. ఇక తపాలా శాఖ ప్రాభవం తగ్గిందనే అనుకున్నారంతా!! కానీ దేశవ్యాప్తంగా పోస్టల్ విభాగానికున్న అద్వితీయ నెట్వర్క్... దాన్నిపుడు ఈ-కామర్స్లో హీరోను చేస్తోంది. కాలం మారుతున్నా అవకాశాలు ఎక్కడికీ పోవని చెప్పేవే ఈ రెండు ఉదాహరణలూ!!. టెక్నాలజీ పరంగా భారీ మార్పులు ♦ ఈ-కామర్స్ డెలివరీల్లో మూడంకెల అభివృద్ధి ♦ అమెజాన్, స్నాప్డీల్ వంటి దిగ్గజాలతో ఇప్పటికే జట్టు ♦ గ్రామాల్లో ఎవ్వరికీ లేనంత విసృ్తత నెట్వర్క్ దీని బలం ♦ అక్కడ డెలివరీలు పెరిగితే ఆదాయం భారీగా పెరిగే చాన్స్ ♦ సీఓడీ కోసం కార్డ్ ఆధారిత, మొబైల్ ఆధారిత పేమెంట్లు? ♦ ఏపీ, తెలంగాణల్లో పెరగనున్న ప్రత్యేక ప్రాసెసింగ్ కేంద్రాలు ♦ దసరా డెలివరీలకు సెలవులు సైతం రద్దు చేసుకుని విధులు ఇపుడెవరి నోట చూసినా ఈ-కామర్సే. డీల్స్, డిస్కౌంట్స్తో ఊదరగొట్టేస్తున్న ఈ-కామర్స్లో అన్నిటికన్నా ముఖ్యమైనది డెలివరీ యంత్రాంగమే. ఎందుకంటే అమ్మేవారు, కొనేవారు దేశమంతా ఉన్నారు. వారిని కలిపే టెక్నాలజీ ఈ-కామర్స్ కంపెనీలన్నిటి దగ్గరా ఉంది. మరి అమ్మేవారి నుంచి వస్తువుల్ని కొనుగోలుదారుకు చేర్చాలి కదా! అందుకే కొన్ని అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి దిగ్గజ కంపెనీలు సొంత లాజిస్టిక్స్ కంపెనీల్ని ఏర్పాటు చేసుకున్నాయి. మిగిలిన దిగ్గజాలు ప్రత్యేక ఒప్పందాలు చేసుకున్నాయి. కాకపోతే ఎందరెన్ని చేసినా వారికున్నది పరిమిత యంత్రాంగమే. మారుమూల గ్రామాలతో సహా దేశవ్యాప్త నెట్వర్క్ ఉన్న పోస్టల్కు ఏ కొరియర్ కంపెనీ కూడా సాటిరాదు. ఒకవేళ ఎవరైనా విస్తరించినా అది లాభదాయకం కాదు. అందుకే అమెజాన్, స్నాప్డీల్లు గతేడాది పోస్టల్ శాఖతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకున్నాయి. ఇపుడు అమెజాన్లో కొన్న వస్తువులు కొన్ని నేరుగా పోస్ట్మ్యాన్ అందిస్తున్నాడంటే కారణం అదే మరి. ఈ-కామర్స్కు ప్రత్యేక ఏర్పాట్లు ఈ-కామర్స్ను ప్రాధాన్యాంశంగా పరిగణిస్తున్న పోస్టల్ విభాగం దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు, టెక్నాలజీ ఆధునికీకరణ వంటివి చేపట్టింది. అందుకే... ఈ-కామర్స్ పార్శిళ్ల ద్వారా గతేడాది ఏప్రిల్ - డిసెంబరు మధ్య రూ.1,968 కోట్ల ఆదాయం ఆర్జించిన ఈ శాఖ... ఈ ఏడాది సెప్టెంబరు వరకూ ఏకంగా 115% వృద్ధిని సాధించింది. ఇక ఏపీ, తెలంగాణల్లో అయితే ఈ వృద్ధి 150%. ఇక్కడ సెప్టెంబరు వరకూ ఆర్జించిన ఆదాయం రూ.158 కోట్లు దాటింది. ఇది ఒకరకంగా రికార్డేనని చెప్పాలి. ఇక క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ల (సీఓడీ) బట్వాడాకు నాప్టోల్ వంటివి పూర్తిగా పోస్టల్ విభాగంపైనే ఆధారపడుతున్నాయి. స్టాంపుల విక్రయానికి స్నాప్డీల్, దేశవ్యాప్త డెలివరీ కోసం అమెజాన్ ప్రత్యేక ఒప్పందాలూ చేసుకున్నాయి. కేరళ, పశ్చిమబెంగాల్, అస్సాం సహా ఈశాన్య రాష్ట్రాల్లో ఈ-కామర్స్ లాజిస్టిక్స్ కంపెనీలకు తగినంత నెట్వర్క్ లేకపోవటంతో అవన్నీ పోస్టల్నే ఆశ్రయిస్తున్నాయి. ఉచిత పికప్; టెక్నాలజీ మార్పులు టెక్నాలజీని కూడా పోస్టల్ శాఖ వేగంగా అందిపుచ్చుకుంటోందని చెప్పాలి. తమతో ఒప్పందం చేసుకున్న కంపెనీలకు పోస్ట్మ్యాన్ను పంపి ఉచిత పికప్ సదుపాయం ఇవ్వటం... డెలివరీ రోజున కస్టమర్కు ఫోన్ లేదా ఎస్ఎంఎస్ చేయటం... కస్టమర్కు ఫోన్చేసి షెడ్యూలు మార్చుకునే అవకాశమివ్వటం వంటివన్నీ దీన్లో భాగమే. ఇక సీఓడీ రిటర్న్స్ విషయంలో ఒకవైపు మాత్రమే ఛార్జీలు వసూలు చేస్తుండటం దీనికి కలిసొస్తోంది. ఇక హబ్ల ఏర్పాటును కూడా సంస్థ వేగవంతం చేసింది. ఇటీవలే ముంబయిలో 12వేల చదరపుటడుగుల్లో ప్రత్యేక ఈ-కామర్స్ ప్రాసెసింగ్ కేంద్రాన్ని కూడా ఆరంభించింది. గ్రామాలకు ఈ-కామర్స్ వెళితే...! ఇపుడు ఈ-కామర్స్ కొనుగోలుదారులు ప్రధానంగా ప్రధాన నగరాల నుంచే చేస్తున్నారు. అందుకని వాటి సొంత లాజిస్టిక్స్ వ్యవస్థ కొంతవరకూ పనికొస్తోంది. దీన్లో గ్రామాల వాటా పెరిగితే మాత్రం పోస్టల్కు తిరుగులేని ఆధిక్యం వస్తుందనేది వాస్తవం. ‘‘ప్రస్తుతం విలువ పరంగా ఈ-కామర్స్లో 60 శాతం వాటా దేశంలోని టాప్-20 నగరాలదే. ఇది మారి గ్రామాల వాటా పెరిగితే పోస్టల్కున్న నెట్వర్క్తో అది చాలా బలోపేతమవుతుంది’’ అని రిటైల్ రంగ నిపుణుడు కలిశెట్టి నాయుడు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఇది మారుతుందని, ఇప్పటికే స్నాప్డీల్ వంటి సైట్లలో ఆ సంకేతాలొస్తున్నాయని చెప్పారాయన. ఈ సమస్యల్ని అధిగమిస్తేనే... నెట్వర్క్లో పోస్టల్ విభాగం నెంబర్-1 అనటంలో ఎవరికీ సందేహం లేదు. అయితే టెక్నాలజీ విషయంలో ఇంకా మెరుగుపడాల్సిన అవసరం చాలా ఉంది. రిటర్న్ ఆర్డర్లు చాలా ఆలస్యంగా హబ్లకు చేరుతుండటం, సీఓడీ రూపంలో తీసుకున్న నగదును కంపెనీలకు రెమిట్ చేయటంలో మిగతా కొరియర్లతో పోలిస్తే ఆలస్యమవుతుండటం వంటి సమస్యలున్నాయి. ఇక అన్ని సంస్థలకూ సాఫ్ట్వేర్ పరంగా మద్దతివ్వటం కూడా సాధ్యం కావాల్సి ఉంది. - సాక్షి, బిజినెస్ విభాగం ఇది మా ప్రాధాన్యాంశం... పోస్టల్ విభాగానికి ఈ-కామర్స్ను ప్రాధాన్యాంశంగా కేంద్రం నిర్దేశించిందని, ప్రతి నెలా కేంద్ర మంత్రి సారథ్యంలో సమీక్షలు జరుగుతున్నాయని హైదరాబాద్లోని పోస్ట్ మాస్టర్ జనరల్ పి.వి.ఎస్.రెడ్డి చెప్పారు. తాము కూడా దానికి తగ్గట్టే మార్పులు చేస్తున్నామని ‘సాక్షి’ ప్రతినిధితో చెబుతూ... ‘‘దసరాకు అన్ని కంపెనీలూ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. డెలివరీకి మమ్మల్ని ఆశ్రయించిన సంస్థల కోసం మేం 22, 24, 25 వంటి సెలవు రోజుల్లో కూడా సిబ్బందిని ప్రత్యేకంగా పిలిపిస్తున్నాం. ఈ-కామర్స్ పార్శిళ్లు డెలివరీ చేసిన సిబ్బందికి అదనపు ఇన్సెంటివ్లు ఇస్తున్నాం కనక వాళ్లూ ఉత్సాహంతో చేస్తున్నారు. కంపెనీలకు సీఓడీ రెమిటెన్స్లు ఆలస్యం కాకుండా కార్డు ఆధారిత పేమెంట్, మొబైల్ మనీ వంటి అంశాల్ని పరిశీలిస్తున్నాం. ఈ-కామర్స్ కోసం హైదారాబాద్ హుమయూన్ నగర్లో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటుచేశాం. హైదరాబాద్లో మరొకటి, గుంటూరు, తిరుపతిలో తలా ఒకటి ఏర్పాటు చేస్తున్నాం’’ అని వివరించారు. తమ విభాగం ముందడుగు వేస్తోందంటూ... మెరుగుపడాల్సింది ఇంకా చాలానే ఉందని కూడా అంగీకరించారాయన. -
'స్నాప్డీల్'ని డీల్ చేశారు..
గోదావరిఖని (కరీంనగర్) : ప్లిప్కార్ట్ కు ఓ వ్యక్తి రూ.20 లక్షల మేరకు టోకరా వేసిన ఘటన మరవక ముందే ...ఈసారి స్నాప్ డీల్ కు అదే తరహాలో కుచ్చుటోపి పెట్టారో ముగ్గురు యువకులు. తాము ఆర్డర్ చేసిన వస్తువుకు బదులు మరొకటి వచ్చిందంటూ ఆన్లైన్ వ్యాపార సంస్థ 'స్నాప్డీల్'కు రూ.9 లక్షల మేర నష్టం కలిగించారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో ఈఘటన చోటుచేసుకుంది. నగరంలోని గాంధీనగర్, విద్యానగర్, వినోభా నగర్ ప్రాంతాలకు చెందిన రాపెల్లి మహేష్(20), బండి యాదస్వామి(28), మంథని రమాకాంత్(21) లు స్నేహితులు. వీరిలో మహేష్ బీ ఫార్మసీ, రమాకాంత్ డిగ్రీ చదువుతుండగా, యాదస్వామి ఓ దుకాణంలో సేల్స్ మెన్ పని చేస్తున్నాడు. కాగా నాలుగు నెలల క్రితం మహేష్ స్నాప్డీల్లో ఓ వస్తువును ఆర్డర్ చేశాడు. అయితే మరో వస్తువును అతడు అందుకున్నాడు. అప్పుడే అతనికి ఓ ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా ఆ ఆలోచనలను మిగతా ఇద్దరికీ చెప్పాడు. అంతా సరేననుకుని రంగంలోకి దిగారు. అప్పటి నుంచి వస్తువులను ఆర్డర్ చేయటం, ఆ పార్శిల్ రాకమునుపే సంస్థ ప్రతినిధులకు ఫోన్ చేసి.. తనకు మరో వస్తువు వచ్చిందంటూ అబద్ధం చెప్పి చెల్లించిన డబ్బును వెనక్కి తీసుకోవటం పనిగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 63 వస్తువులు.. దుస్తులు, సెల్ఫోన్లు, ల్యాప్టాప్ వంటివి ఆర్డర్ చేసి, అవి రాలేదని డబ్బు తీసుకుంటూ రూ.9,14,407 మేర మోసం చేశారు. వీరి తీరుపై అనుమానం వచ్చిన స్నాప్డీల్ నిర్వాహకులు కూపీ తీయగా అసలు విషయం బయటపడింది. దీనిపై సంస్థ ప్రతినిధి శివం పటేలా కరీంనగర్ ఎస్పీ జోయెల్ డేనియల్కు ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ మల్లారెడ్డి శనివారం నిందితులు ముగ్గురినీ అదుపులోకి తీసుకుని, వారి నుంచి కొంతమేర నగదును రికవరీ చేశారు. -
‘ఆన్లైన్’ పండుగ..!
బెంగళూరు/ముంబై: ఈ పండుగల సీజన్లో ఆన్లైన్ వ్యాపారం వేడెక్కుతోంది. ఈ కామర్స్ దిగ్గజాల, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, అమెజాన్ సంస్థలు భారీ స్థాయిలో అమ్మకాలే లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఫ్లిప్కార్ట్ సంస్థ ద బిగ్ బిలియన్ డేస్ పేరుతో పండుగల సీజన్ అమ్మకాలను మంగళవారం నుంచి ప్రారంభించింది. పోటీ సంస్థలు, స్నాప్డీల్, అమెజాన్ సంస్థలు ఈ పండుగ సీజన్ను ఒక పేరుతో బ్రాండింగ్ చేయకపోయినా, ఇవి కూడా వినియోగదారులను ఆకట్టుకునే ఆఫర్లను అందిస్తున్నాయి. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు కాదంటూ పండుగల సీజన్ కొనుగోళ్ల కోసం ఫ్లిప్కార్ట్ భారీ ప్రచారం నిర్వహిస్తోంది. దాదాపు పది లక్షల ఫ్యాషన్ ఉత్పత్తులపై 80 శాతం వరకూ డిస్కౌంట్ను ఇస్తామని అంటోంది. ప్రతీ గంటకు కొత్త ఆఫర్లిస్తామని స్నాప్డీల్, రోజూ 1 కేజీ బంగారం గెల్చుకునే అవకాశముందని, ఒక్క రోజులోనే డెలివరీ ఇస్తామని అమెజాన్ ఇండియాలు ఊరిస్తున్నాయి. 10 గంటల్లో 10 లక్షల వస్తువుల అమ్మకాలు 13వ తేదీన 10 గంటల్లో పది లక్షలకు పైగా వస్తువులను విక్రయించామని దేశవ్యాప్తంగా 60 లక్షల హిట్స్ వచ్చాయని, ఒక సెకన్కు 25 వస్తువులను అమ్మామని ఫ్లిప్కార్ట్ పేర్కొంది. మెట్రో నగరాల్లో బెంగళూరు, ఢిల్లీ, చెన్నైల నుంచి, ఇతర నగరాల్లో లూధియానా, లక్నో, భోపాల్ల నుంచి ఎక్కువగా హిట్స్ వచ్చాయని పేర్కొంది. ఇప్పటివరకూ పాదరక్షలు, పురుషుల దుస్తులు, యాక్సెసరీలు బాగా అమ్ముడయ్యాయని ఫ్లిప్కార్ట్ హెడ్ ముకేష్ బన్సాల్ చెప్పారు. గత రెండు రోజుల్లో 16 లక్షల యాప్ డౌన్లోడ్లు జరిగాయని, 70 కేటగిరీల్లో 3 కోట్ల వస్తువులను ఆఫర్ చేసున్నట్లు పేర్కొన్నారు. ఉదయమే డెలివరీ అమెజాన్ అర్ధరాత్రి వరకూ ఆర్డర్ చేసిన వస్తువులను మరునాడు ఉదయం 11 గంటలలోపు డెలివరీ చేసే మార్నింగ్ డెలివరీ సర్వీస్ను అమెజాన్ అంది స్తోంది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ/ఎన్సీఆర్, ముంబైల్లో ఈ మార్నింగ్ డెలివరీ సర్వీస్ అందుబాటులో ఉంటుందని అమెజాన్ ఇండియా కస్టమర్ ఎక్స్పీరియన్స్ హెడ్ అక్షయ్ సాహి చెప్పారు. ఆర్డర్కు రూ.120 ఫ్లాట్ చార్జీతో ఈ ఆఫర్ను అందిస్తున్నామని తెలిపారు. ఒకవేళ ఉదయం 11 గంటలలోపు ఆర్డర్ చేస్తే, ఆ వస్తువులను అదే రోజు డెలివరీ చేసే వెసులుబాటు కూడా ఉందని వివరించారు. -
గోజావాస్లో స్నాప్డీల్ పెట్టుబడులు రూ.130 కోట్లు
న్యూఢిల్లీ: ఈ కామర్స్ దిగ్గజం స్నాప్డీల్ లాజిస్టిక్స్ సంస్థ గోజావాస్లో రూ.130 కోట్లు(2 కోట్ల డాలర్లు) పెట్టుబడులు పెట్టింది. డెలివరీ, లాజిస్టిక్స్ కార్యకలాపాలను మరింత పటిష్టం చేసుకోవడానికి 20 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టాలన్న తమ వ్యూహంలో భాగంగా గోజావాస్లో వాటా కొనుగోలు చేశామని స్నాప్డీల్ వెల్లడించింది. ఈ రూ.130 కోట్ల పెట్టుబడులతో వంద నగరాల్లో ఏడాది కాలంలో తన కార్యకలాపాలను గోజావాస్ విస్తరించనున్నదని స్నాప్డీల్ వ్యవస్థాపకుల్లో ఒకరు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రోహిత్ బన్సాల్ చెప్పారు. వస్తువుల డెలివరీ మరింత వేగవంతం చేయడానికి గత ఆర్నెళ్లలో రూ.650 కోట్ల వరకూ ఇన్వెస్ట్ చేశామని తెలిపారు. స్పాప్డీల్ అందించిన తాజా పెట్టుబడులతో భారత దేశ అతి పెద్ద వ్యక్తిగత లాజిస్టిక్స్ సంస్థల్లో ఒకటిగా నిలవడానికి తమకు దోహదపడతాయని గోజావాస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ విజయ్ ఘడ్గే చెప్పారు. కాగా ఈ ఏడాది మార్చిలో గోజావాస్లో స్నాప్డీల్ రూ.200 కోట్లు పెట్టుబడులు పెట్టింది. -
అమీర్.. ఐ లవ్యూ: సన్నీలియోన్
బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్షనిస్టు అమీర్ ఖాన్ మీద శృంగార తార సన్నీ లియోన్ మనసు పారేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా సన్నీయే తన ట్విట్టర్ ద్వారా నేరుగా అమీర్ఖాన్కు, మిగిలిన ప్రపంచానికి వెల్లడించింది. స్నాప్డీల్ యాడ్లో అమీర్ ఖాన్ను తాను చూశానని, 'మోట్ ఆర్ నాట్.. యు స్టిల్ లుక్ హాట్' అంటూ.. అందుకే లవ్యూ అంటూ మెసేజ్ పెట్టింది. దానికి అమీర్ఖాన్ కూడా మురిసిపోయాడు. సన్నీ లియోన్కు థాంక్స్ చెబుతూ, నువ్వు చాలా దయగలదానివి అంటూ ప్రశంసించాడు. లవ్యూ అంటూ రిప్లై పెట్టాడు. మొత్తానికి పొద్దున్నే సన్నీ, అమీర్ల మధ్య ఈ సంభాషణ నెటిజన్లకు కాస్తంత సరదాగా అనిపించింది. Thank you @SunnyLeone, you are too kind. Love. a. — Aamir Khan (@aamir_khan) September 24, 2015 Hey @aamir_khan saw you in the Snapdeal Ad. Motte or not, you still look hot! Love you -
స్నాప్డీల్ చేతికి రెడ్యూస్ డేటా స్టార్టప్
న్యూఢిల్లీ : అమెరికాకు చెందిన రెడ్యూస్ డేటా స్టార్టప్ను ఈ- కామర్స్ దిగ్గజం స్నాప్డీల్ కొనుగోలు చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రియల్-టైమ్ డేటా, ఇతర టూల్స్తో ప్రోగ్రామాటిక్ డిస్ప్లే అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్ను నిర్వహించే ఈ స్టార్టప్ను ఎంతకు కొనుగోలు చేసిన వివరాలను స్నాప్డీల్ వెల్లడించలేదు. ఫ్లిప్కార్ట్, అమెజాన్ సంస్థలతో పోటీపడేందుకు గాను చేసే ప్రయత్నాల్లో భాగంగా ఈ స్టార్టప్ను స్నాప్డీల్ కొనుగోలు చేసింది. 2012లో ఆసిఫ్ ఆలీ ఈ స్టార్టప్ను ప్రారంభించారు. అమెరికా, భారత్, ఇంగ్లాండ్ల్లో ఈ స్టార్టప్కు క్లయింట్లున్నారు. వెబ్ స్కేల్ టెక్నాలజీస్, ప్రోడక్ట్ మేనేజ్మెంట్ తదితర అంశాల్లో ఆసిఫ్ ఆలీకి 17 ఏళ్ల అపార అనుభవం ఉందని, ఈ స్టార్టప్ కొనుగోలుతో తమ సాంకేతిక సామర్థ్యం మరింత మెరుగుపడుతుందని స్నాప్డీల్ సహ వ్యవస్థాపకుడు రోహిత్ బన్సాల్ చెప్పారు. ఈ-కామర్స్ మార్కెట్లో వాటాను మరింత పటిష్టం చేసుకునే వ్యూహంలో భాగంగా స్నాప్డీల్ పలు స్టార్టప్లను కొనుగోలు చేస్తోంది. చెల్లింపుల, మొబైల్ రీచార్జ్ స్టార్టప్ ఫ్రీచార్జ్ను, మార్టిమోబి, లెట్స్గోమో ల్యాబ్స్ను కొనుగోలు చేసింది. డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్ఫామ్ రూపీపవర్, లాజిస్టిక్స్ వెంచర్ గోజావాస్లో వాటాలను కొనుగోలు చేసింది. -
స్నాప్డీల్లో రూ.3,269 కోట్ల తాజా పెట్టుబడులు
సాఫ్ట్బ్యాంక్, ఆలీబాబా, ఫాక్స్కాన్ నుంచి నిధులు న్యూఢిల్లీ: ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ స్నాప్డీల్ తాజాగా 50 కోట్ల డాలర్లు(రూ.3,269 కోట్లు) పెట్టుబడులు సమీకరించింది. చైనాకు చెందిన ఈ కామర్స్ దిగ్గజం ఆలీబాబా, తైవాన్కు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ ఫాక్స్కాన్, జపాన్కు చెందిన సాఫ్ట్బ్యాంక్ల నుంచి ఈ నిధులు సమీకరించామని స్నాప్డీల్ తెలి పింది. ఇప్పటికే తమ సంస్థలో ఇన్వెస్ట్ చేసిన టిమసెక్, బ్లాక్రాక్, మైరాయిడ్, ప్రేమ్జీ ఇన్వెస్ట్ల నుంచి కూడా ఈ తాజా రౌండ్ నిధుల సమీకరణలో పెట్టుబడులు వచ్చాయని స్నాప్డీల్ సీఈఓ, వ్యవస్థాపకుల్లో ఒకరైన కునాల్ బహాల్ చెప్పారు. ఇప్పటికే ఈ సంస్థ వంద కోట్ల డాలర్లుకు పైగా పెట్టుబడులను సాఫ్ట్బాంక్(62.7 కోట్ల డాలర్లు), పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాల నుంచి రాబట్టింది. కాగా పెట్టుబడి వివరాలను స్నాప్డీల్ వెల్లడించలేదు. అయితే ఫాక్స్కాన్కు చెందిన ఎఫ్ఐహెచ్ మొబైల్ సంస్థ స్నాప్డీల్లో 4.27 శాతం వాటాను 20 కోట్ల డాలర్లకు కొనుగోలు చేశామని పేర్కొంది. ఈ లెక్కన స్నాప్డీల్ విలువ 400-500కోట్ల డాలర్లు(రూ.25,200-31,500 కోట్లు) ఉంటుందని అంచనా. -
స్నాప్డీల్, హెచ్డీఎఫ్సీల కో బ్రాండెడ్ ఈ కామర్స్ క్రెడిట్ కార్డ్
హైదరాబాద్: ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ స్నాప్డీల్- హెచ్డీఎఫ్సీ బ్యాంక్లు విసా సహకారంతో కో-బ్రాండెడ్ ఈ కామర్స్ క్రెడిట్ కార్డ్ను అందుబాటులోకి తెచ్చాయి.ఈ కార్డ్తో ఆన్లైన్ చెల్లింపులు సులభతరంగా చేసుకోవచ్చని స్నాప్డీల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కార్డ్ద్వారా చెల్లింపులు చేసేవారికి రివార్డ్ పాయింట్లను కూడా ఇస్తామని పేర్కొంది. ఈ కార్డ్ కోసం స్నాప్డీల్ (వెబ్సైట్, మొబైల్ యాప్)ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వివరించింది. -
50 కోట్ల డాలర్ల సమీకరణ బాటలో స్నాప్డీల్
న్యూఢిల్లీ: ఆన్లైన్ షాపింగ్ సంస్థ స్నాప్డీల్ తాజాగా ఆలీబాబా, సాఫ్ట్బ్యాంక్, ఫాక్స్కాన్ తదితర సంస్థల నుంచి 50 కోట్ల డాలర్లు (రూ. 3,000 కోట్లకుపైగా) సమీకరించనుంది. ఇందుకోసం వాటితో చర్చలు జరుగుతున్నాయని, మరికొద్ది వారాల్లో ఫండింగ్ వివరాలు వెల్లడి కావొచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తాజా డీల్తో స్నాప్డీల్ విలువ 4-5 బిలియన్ డాలర్ల స్థాయికి చేరగలదని తెలిపాయి. దీనిపై స్నాప్డీల్, సాఫ్ట్బ్యాంక్ వ్యాఖ్యానించేందుకు నిరాకరించాయి. ఆలీబాబాతో ఇటీవలే నిధుల కోసం చర్చలు జరిపినప్పటికీ స్నాప్డీల్ భారీ వేల్యుయేషన్లు కోరడంతో అవి విఫలమయ్యాయి. వివిధ సంస్థల నుంచి స్నాప్డీల్ ఇప్పటికే 1 బిలియన్ డాలర్ల పైగా నిధులు సమీకరించింది. -
లావా బడ్జెట్ స్మార్ట్ఫోన్ @రూ.5,699
న్యూఢిల్లీ : లావా కంపెనీ బడ్జెట్ స్మార్ట్ఫోన్, ఫ్లెయిర్ జెడ్1ను శుక్రవారం మార్కెట్లోకి తెచ్చింది. ఆండ్రాయిడ్ లాలిపాప్ ఆపరేటింగ్ సిస్టమ్పై పనిచేసే ఈ బడ్జెట్ స్మార్ట్ఫోన్ ధర రూ.5,699 అని కంపెనీ తెలి పింది. ఈ ఫోన్లో 5 అంగుళాల డిస్ప్లే, 1.3 గిగా హెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ, 32 జీబీ ఎక్స్పాండబుల్ మెమెరీ, 5 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయని కంపెనీ పేర్కొం ది. వచ్చే వారం నుంచి దేశవ్యాప్తంగా రిటైల్ అవుట్లెట్లలో విక్రయాలు ప్రారంభిస్తామని, ఈ నెల 30 నుంచి స్నాప్డీల్లో కొనుగోలు చేయవచ్చని కంపెనీ వివరించింది. -
స్నాప్డీల్లో మైక్రోసాఫ్ట్ స్టోర్
న్యూఢిల్లీ: ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ స్నాప్డీల్లో సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ తన బ్రాండెడ్ ఆన్లైన్ స్టోర్ ను ప్రారంభించింది. స్నాప్డీల్లో మైక్రోసాఫ్ట్ ఆన్లైన్ స్టోర్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని స్నాప్డీల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్(ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్) టోనీ నవీన్ చెప్పారు. ఈ ఆన్లైన్ స్టోర్లో మైక్రోసాఫ్ట్ కంపెనీకి చెందిన ఫోన్లు, ట్యాబ్లు, పీసీలు, సాఫ్ట్వేర్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా కొనుగోళ్లు జరిపే వినియోగదారులు పెరుగుతున్నారని మైక్రోసాఫ్ట్ ఇండియా గ్రూప్ ఓఈఎం డెరైక్టర్ శర్లిన్ తాయిల్ చెప్పారు. తాము స్నాప్డీల్లో ఆన్లైన్లో ఏర్పాటు చేసిన స్టోర్ ద్వారా మంచి అమ్మకాలు సాధించగలమన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
స్నాప్డీల్ చేతికి లెట్స్గోమొ
న్యూఢిల్లీ: ఆన్లైన్ షాపింగ్ సంస్థ స్నాప్డీల్ తాజాగా మొబైల్ అప్లికేషన్ రంగంలో ఉన్న లెట్స్గోమొ ల్యాబ్స్ను కొనుగోలు చేసింది. అయితే, ఇందుకోసం ఎంత వెచ్చించిందీ వెల్లడి కాలేదు. మొబైల్ ఫోన్ మాధ్యమం ద్వారా అమ్మకాలను మరింత మెరుగుపర్చుకునేందుకు లెట్స్గోమొ కొనుగోలు తమకు ఉపకరిస్తుందని స్నాప్డీల్ ఈ సందర్భంగా పేర్కొంది. ప్రస్తుతం 75 శాతం పైగా అమ్మకాలు మొబైల్ ప్లాట్ఫామ్ ద్వారానే జరుగుతున్నాయని స్నాప్డీల్ సహ వ్యవస్థాపకుడు రోహిత్ బన్సల్ తెలియజేశారు. మొబైల్ సంబంధిత యాప్స్, సర్వీసులు మొదలైన వాటిని లెట్స్గోమొ అందిస్తోంది. ఇందులో 76 మంది ఉద్యోగులు ఉన్నారు. స్నాప్డీల్ ఇటీవలే ఆన్లైన్ రీచార్జ్ సంస్థ ఫ్రీచార్జ్ను, మొబైల్, వెబ్ కామర్స్ సైట్లు తయారు చేసే మార్ట్మొబి సంస్థలను కొనుగోలు చేసింది. -
వ్యాపార వైఫల్యాలకు దేశాన్ని నిందించవద్దు
ఫ్లిప్కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్ న్యూఢిల్లీ: వివిధ కంపెనీలు వారి వ్యాపార ప్రత్యర్థుల్ని విమర్శించడానికి సామాజిక మాధ్యమాలను విరివిగా ఉపయోగించుకునే సంస్కృతి ఈ మధ్య బాగా పెరిగింది. స్నాప్డీల్ సహ-వ్యవస్థాపకుడు రోహిత్ బన్సాల్ను ఉద్దేశించి ట్వీటర్లో ఫ్లిప్కార్ట్ సహ-వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్ చేసిన వ్యాఖ్యలను దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. భారత్లోని పరిస్థితుల గురించి ఆలోచిస్తే, చాలా ప్రొడక్ట్ కంపెనీలు దేశంలో పరిశ్రమల స్థాపనకు సాహసించవని రోహిత్ బన్సాల్ ఇటీవల ట్వీటర్లో పేర్కొన్నారు. దీనికి స్పందనగా నైపుణ్యం ఉన్న ఇంజనీర్లను నియమించుకోవడంలోని మీ వైఫల్యానికి భారత్ను నిందించొద్దని సచిన్ బన్సాల్ ట్వీటర్లో తన అభిప్రాయాన్ని చెప్పారు. -
స్నాప్డీల్ చేతికి మార్ట్మొబీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలోని ఈ-కామర్స్ కంపెనీల్లో ఒకటైన స్నాప్డీల్.. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్ కంపెనీ మార్ట్మోబీ.కామ్ను కొనుగోలు చేసింది. ఈ కొనుగోలుకు ఎంత ధర చెల్లించిందనేది మాత్రం రెండు సంస్థలూ వెల్లడించలేదు. ప్రస్తుతానికి ధర చెప్పలేమని మార్ట్మోబీ వ్యవస్థాపకుడైన సత్య కృష్ణ గన్ని తనను సంప్రతించిన ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధికి చెప్పారు. మార్ట్మోబీ అందించే సేవలపై ఇటీవలే ‘సాక్షి స్టార్టప్ డైరీ’ కాలమ్లో ప్రచురించడం తెలిసిందే. ఎం-కామర్స్ చేస్తున్న సంస్థలకు వెబ్సైట్లు, యాప్లను ఈ సంస్థ తయారు చేస్తుంది. ఇప్పటికే యూఎస్, యూకే, జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా, చైనా, దక్షిణాఫ్రికా, హాంకాంగ్, సింగపూర్ వంటి 20 దేశాలకు చెందిన సంస్థలకిది వెబ్సైట్లు, యాప్లు తయారు చేసింది. తాజా డీల్ అనంతరం ఇకపై స్నాప్డీల్లో వస్తువులు విక్రయించే సెల్లర్లకు మాత్రమే ఈ సంస్థ ప్రత్యేకంగా వెబ్సైట్లు, యాప్లు తయారు చేస్తుంది. -
రూ.3 వేలకే సెల్కాన్ క్వాడ్కోర్ మోడల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్స్ కంపెనీ సెల్కాన్.. క్యాంపస్ సిరీస్లో క్యూ405 మోడల్ను స్నాప్డీల్లో ప్రత్యేకంగా ఆవిష్కరించింది. 1.2 గిగాహెట్జ్ క్వాడ్కోర్ ప్రాసెసర్తో రూపొందిన ఈ మోడల్ ధర రూ.3,199 మాత్రమే. ఫీచర్ ఫోన్ ధరకే హై ఎండ్ ఫీచర్లను అందిస్త్తున్నట్టు సెల్కాన్ సీఎండీ వై.గురు ఈ సందర్భంగా తెలిపారు. టెక్స్ట్ వేగంగా కంపోజ్ చేసేందుకు వీలుగా అంతర్గతంగా స్విఫ్ట్కీ ఫీచర్ను పొందుపరిచారు. 4 అంగుళాల డబ్ల్యువీజీఏ డిస్ప్లే, ఆండ్రాయిడ్ కిట్క్యాట్ ఓఎస్, డ్యూయల్ సిమ్, ఫ్లాష్తో 3.2 ఎంపీ కెమెరా, 1.3 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ మెమరీ, 32 జీబీ ఎక్స్పాండబుల్ మెమరీ, 1,500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఇన్బిల్ట్ జీపీఎస్, 3జీ, వైఫై తదితర ఫీచర్లున్నాయి. -
స్నాప్డీల్, పేపాల్తో ఎస్బీఐ జట్టు
కోల్కతా: చిన్న, మధ్య తరహా సంస్థలకు(ఎస్ఎంఈ) తోడ్పాటు కోసం ఈ-కామర్స్ సంస్థ స్నాప్డీల్, డిజిటల్ పేమెంట్స్ కంపెనీ పేపాల్తో ఎస్బీఐ చేతు లు కలిపింది. స్నాప్డీల్తో అవగాహన ఒప్పం దం(ఎంవోయూ) ప్రకారం సదరు సైట్ ద్వారా లావాదేవీలు జరిపే విక్రేతలు లేదా తయారీ సంస్థలకు ఎస్బీఐ ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో రుణాలు అందిస్తుంది. మహిళా వ్యాపారవేత్తలకు వడ్డీ రేటుపై మరో 0.25% తగ్గింపు ఉంటుంది. రూ. కోటి దాకా రుణాలకు తనఖా అవసరం ఉండదు. నిధుల సమస్యల వల్ల వ్యాపారాలను విస్తరించలేకపోతున్న ఎస్ఎంఈలకు ఈ డీల్తో ప్రయోజనం లభిస్తుందని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య తెలిపారు. తమ ఎస్ఎంఈ కస్టమర్లు సీమాంతర ఆర్థిక లావాదేవీలు సురక్షితంగా, సులభతరంగా నిర్వహించుకునేలా పేపాల్తో ఎస్బీఐ ఎంవోయూ కుదుర్చుకుంది. -
ఆన్లైన్లో వెస్పాస్టోర్ స్నాప్డీల్ సహకారంతో అమ్మకాలు
న్యూఢిల్లీ: ఇటలీకి చెందిన ద్విచక్ర వాహన కంపెనీ పియాజియో వెహికల్స్ తన తొలి ఆన్లైన్ స్టోర్ను మంగళవారం ప్రారంభించింది. స్నాప్డీల్ సహకారంతో ఈ ఆన్లైన్ స్టోర్ను అందుబాటులోకి తెచ్చామని పియాజియో తెలిపింది. వెస్పా స్కూటర్ల అన్ని మోడళ్ల(వెస్పా, వీఎక్స్, వెస్పా ఎస్, వెస్పా ఎలిగంటె)ను ఈ ఆన్లైన్ స్టోర్లో డిస్ప్లే చేస్తామని పియాజియో వెహికల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్(టూ వీలర్ బిజినెస్) సంజీవ్ గోయల్ చెప్పారు. వినియోగదారులు ఒక్క క్లిక్తో తమకు నచ్చిన వెస్పా మోడల్ను రూ.5,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. కొనుగోళ్లకు ఎక్కువ సమయం వెచ్చించలేని, ఆన్లైన్ షాపింగ్ ఇష్టపడే యువతరాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఆన్లైన్ స్టోర్ను అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. వినియోగదారులు అన్ని రకాలైన వెస్పా మోడళ్లను యాక్సెస్ చేసుకునే విధంగా వినూత్నమైన షాపింగ్ అనుభూతిని పొందేలా ఈ ఆన్లైన్ వెస్పా స్టోర్ను రూపొందించామని స్నాప్డీల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ టోనీ నవీన్ చెప్పారు. -
అమెరికాలో స్నాప్డీల్ ఐపీఓ?
న్యూఢిల్లీ: ఈ కామర్స్ కంపెనీ స్నాప్డీల్ అమెరికాలో ఐపీఓకు రానుంది. దీని ద్వారా 500-600 కోట్ల డాలర్లు సమీకరించనున్నట్లు సమాచారం. దీనికోసం మర్చంట్ బ్యాంకర్లను నియమించినట్లు స్నాప్డీల్ వర్గాలు వెల్లడించాయి. ఈ ఐపీఓ 2016-17లో రావచ్చని అంచనా. ఈ కంపెనీలో రతన్ టాటా, విప్రో అజిమ్ ప్రేమ్జీల పెట్టుబడులు కూడా ఉన్నాయి. -
స్నాప్డీల్ చేతికి ఫ్రీచార్జ్
ఈ కామర్స్లో అతి పెద్ద డీల్ స్నాప్డీల్ నుంచి ఇక మొబైల్ రీచార్జ్లు, ఆర్థిక సేవలు బెంగళూరు: ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ స్నాప్డీల్, మొబైల్ లావాదేవీల ప్లాట్ఫామ్ ఫ్రీచార్జ్ను కొనుగోలు చేసింది. నగదు, స్టాక్ డీల్తో ఫ్రీచార్జ్ను కొనుగోలు చేశామని, భారత డిజిటల్ కామర్స్ రంగంలో ఇదే అతి పెద్ద కొనుగోలు అని స్నాప్డీల్ పేర్కొంది. అయితే ఫ్రీచార్జ్ను ఎంతకు కొనుగోలు చేసిందీ స్నాప్డీల్ వెల్లడించలేదు. గతంలో ఫ్లిప్కార్ట్ సంస్థ మైంత్రను రూ.2,000 కోట్లకు కొనుగోలు చేసింది. భారత ఇంటర్నెట్ పరిశ్రమలో ఇదే ఇప్పటివరకూ అతి పెద్ద డీల్గా చెబుతారు. ఫ్రీచార్జ్ మొబైల్ ప్లాట్ఫామ్ ద్వారా వినియోగదారులు మొబైల్ బిల్లులు, డీటీహెచ్ రీచార్జ్, ఇతర లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఫ్రీచార్జ్ కొనుగోలుతో తమ వినియోగదారుల సంఖ్య మరింతగా పెరిగిందని స్నాప్డీల్ సీఈఓ కునాల్ బహాల్ చెప్పారు. ఈ కొనుగోలు కారణంగా తమ సేవల పరిధి మరింతగా విస్తృతమవుతుందని, ఆర్థిక సేవలతో పాటు, మొబైల్ రీచార్జ్ కూడా అందిస్తామని పేర్కొన్నారు. తాము కొనుగోలు చేసినప్పటికీ, ఫ్రీచార్జ్ స్వతంత్ర ప్లాట్ఫామ్గానే కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఫ్రీచార్జ్లో 200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, వీరంతా కొనసాగుతారని వివరించారు. స్నాప్డీల్తో భాగస్వామ్యం సరైన సమయంలో కుదిరిందని, మరింత మందికి చేరువకాలగమని ఫ్రీచార్జ్ వ్యవస్థాపకుల్లో ఒకరు, సీఈఓ కూడా అయిన కునాల్ షా పేర్కొన్నారు. ఫ్లిప్కార్ట్, అమెజాన్ సంస్థల నుంచి ఎదురవుతున్న తీవ్రమైన పోటీని తట్టుకోవడానికి స్నాప్డీల్ సంస్థ తగిన ప్రయత్నాలు చేస్తోంది. దీంట్లో భాగంగానే గత వారం ఈ సంస్థ డిజిటల్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్ల ప్లాట్ఫామ్ రూపీపవర్ను కొనుగోలు చేసింది. లాజిస్టిక్స్ సంస్థ గోజావాస్ను చేజిక్కించుకుంది. మరిన్ని కొనుగోళ్లకు సిద్ధంగా ఉంది. -
స్నాప్డీల్ చేతికి రూపీపవర్
న్యూఢిల్లీ: డిజిటల్ ఫైనాన్షియల్ ఉత్పత్తులందించే రూపీ పవర్ సంస్థలో మెజారిటీ వాటాను ఈ కామర్స్ దిగ్గజం స్నాప్డీల్ కొనుగోలు చేసింది. నగదు, స్టాక్ డీల్తో ఈ వాటాను స్నాప్డీల్ కైవసం చేసుకుంది. అయితే ఎంత మొత్తం వెచ్చించిందీ వెల్లడించలేదు. ఈ వాటా కొనుగోలుతో రూ.4,500 కోట్ల ఆన్లైన్ ఫైనాన్షియల్ సర్వీసుల మార్కెట్లోకి స్నాప్డీల్ ప్రవేశించింది. రుణాలు, క్రెడిట్ కార్డులు ఇతర వ్యక్తిగత ఆర్థిక ఉత్పత్తులకు సంబంధించి డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్గా రూపీపవర్ సేవలందిస్తోంది. ప్రస్తుతం 40గా ఉన్న ఉద్యోగుల సంఖ్యను ఏడాదిలో 200కు పెంచుతామని రూపీపవర్ పేర్కొంది. -
స్నాప్డీల్లో ఆలీబాబా పెట్టుబడులకు బ్రేక్
కంపెనీ వాల్యుయేషన్పై ప్రతిష్టంభన న్యూఢిల్లీ: ఈకామర్స్ సంస్థ స్నాప్డీల్లో చైనా దిగ్గజం ఆలీబాబా పెట్టుబడులు పెట్టేందుకు వాల్యుయేషన్లు అడ్డంకిగా మారాయి. స్నాప్డీల్ భారీ స్థాయిలో విలువను డిమాండ్ చేస్తుండటంతో ఇరు సంస్థల మధ్య చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడినట్లు సమాచారం. స్నాప్డీల్లో 500-700 మిలియన్ డాలర్ల పెట్టుబడితో వాటాలు కొనుగోలు చేయాలని ఆలీబాబా భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం కంపెనీ విలువ 4-5 బిలియన్ డాలర్ల మేరంటుందని ఆలీబాబా లెక్క గట్టింది. కానీ తమ వేల్యుయేషన్ 6-7 బిలియన్ డాలర్ల మేర ఉంటుందని స్నాప్డీల్ పట్టుపడుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీని వల్ల రెండు సంస్థల మధ్య చర్చలు నిల్చిపోయినట్లు పేర్కొన్నాయి. స్నాప్డీల్ ఇప్పటిదాకా సుమారు 1 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. జపాన్కి చెందిన సాఫ్ట్బ్యాంక్, దేశీ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా ఈ సంస్థలో ఇన్వెస్టర్లుగా ఉన్నారు. ఇందులో వాటాలను కొనుగోలు చేసిన పక్షంలో ఆలీబాబాకు భారత మార్కెట్లో పెద్ద ఎత్తున విస్తరించే అవకాశం దొరికేది. ఆలీబాబా ఇప్పటికే మొబైల్ కామర్స్ కంపెనీ పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్లో 25 శాతం వాటాలను కొనుగోలు చేసింది. మరోవైపు భారత్లోని ఈకామర్స్ సంస్థల్లో ఇన్వెస్ట్ చేసేందుకు అనేక ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ సంస్థలు ఆసక్తిగా ఉన్నప్పటికీ వేల్యుయేషన్లు అసాధారణ స్థాయుల్లో ఉంటుండటం వల్ల ఆచితూచి వ్యవహరిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. -
స్నాప్డీల్ చేతికి గోజావాస్?
డీల్ విలువ రూ.200 కోట్లు! న్యూఢిల్లీ: ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం స్నాప్డీల్.. సరుకు రవాణా(లాజిస్టిక్స్) సంస్థ గోజావాస్ను చేజిక్కించుకునే ప్రయత్నాల్లో ఉంది. ఈ డీల్ విలువ రూ.150-200 కోట్లుగా ఉండొచ్చని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. డెలివరీ కార్యకలాపాలను మరింత పటిష్టం చేసుకునేందుకు వీలుగా స్నాప్డీల్ ఈ కొనుగోలుపై దృష్టిపెడుతోంది. రానున్న రెండు వారాల్లో డీల్ను ప్రకటించే అవకాశం ఉందని ఆయా వర్గాల సమాచారం. ఈ-కామర్స్ సంస్థ జబాంగ్కు చెందిన లాజిస్టిక్స్ విభాగమే గోజావాస్. జబాంగ్తోపాటు హెల్త్కార్ట్, యెప్మీ, లెన్స్కార్ట్ వంటి ఆన్లైన్ సంస్థలకు కూడా గోజావాస్ సేవలందిస్తోంది. సొంత డెలివరీ సంస్థ లేని కారణంగా స్నాప్డీల్ థర్డ్పార్టీ లాజిస్టిక్స్ కంపెనీలపై ఆధారపడుతోంది. కాగా, ఈ వార్తలపై స్నాప్డీల్ ప్రతినిధి స్పందిస్తూ.. ఊహాగానాలపై తాము వ్యాఖ్యానించబోమని పేర్కొన్నారు. గతేడాది సుమారు బిలియన్ డాలర్ల నిధులను సమీకరించిన(జపాన్ సాఫ్ట్బ్యాంక్ 62.7 కోట్ల డాలర్ల పెట్టుబడి సహా) స్నాప్డీల్... మొబైల్ టెక్నాలజీ, సరఫరా నెట్వర్క్ విభాగాల్లో కంపెనీల కొనుగోళ్లకు సిద్ధంగా ఉంది. -
స్నాప్డీల్ లో రూ. 4,400 కోట్ల పెట్టుబడి !
కంపెనీతో చైనా ఆలీబాబా చర్చలు న్యూఢిల్లీ: దేశీ ఆన్లైన్ షాపింగ్ సంస్థ స్నాప్డీల్లో ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా 500-700 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 3,100-రూ. 4,400 కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. ఇందుకోసం స్నాప్డీల్తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మార్కెట్ పరిశీలకుల అంచనా ప్రకారం స్నాప్డీల్ విలువ సుమారు 4-5 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 25,000 కోట్లు-రూ. 31,000 కోట్లు) ఉంటుంది. స్నాప్డీల్ ఇప్పటిదాకా 1 బిలియన్ డాలర్ల దాకా నిధులు సమీకరించింది. ఆలీబాబాలో కూడా ఇన్వెస్ట్ చేసిన జపాన్ టెలికం దిగ్గజం సాఫ్ట్బ్యాంక్ కూడా ఇటీవలే స్నాప్డీల్లో 627 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 3,762 కోట్లు) పెట్టుబడి పెట్టింది. టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా వ్యక్తిగత హోదాలో ఇందులో ఇన్వెస్ట్ చేశారు. మరోవైపు ఆలీబాబా గ్రూప్ గతేడాది అమెరికాలో పబ్లిక్ ఇష్యూ ద్వారా 25 బిలియన్ డాలర్లు సమీకరించింది. ప్రపంచంలోనే అతి పెద్ద ఆన్లైన్, మొబైల్ కామర్స్ కంపెనీ అయిన ఆలీబాబా గ్రూప్ .. వెబ్సైట్లో 127 బిలియన్ డాలర్ల మేర ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయని అంచనా. -
స్నాప్డీల్ చేతికి ఎక్స్క్లూజివ్లీ
న్యూఢిల్లీ: ఆన్లైన్ షాపింగ్ సంస్థ స్నాప్డీల్ తాజాగా లగ్జరీ ఫ్యాషన్ పోర్టల్ ఎక్స్క్లూజివ్లీ డాట్కామ్ను కొనుగోలు చేసింది. అయితే, ఇందుకు ఎంత వెచ్చించినదీ వెల్లడి కాలేదు. ప్రస్తుతం ఫ్యాషన్ వ్యాపార విభాగం కింద 1 బిలియన్ డాలర్ల మేర స్నాప్డీల్ ద్వారా విక్రయాలు జరుగుతుండగా.. కొత్త డీల్తో ఇది 2 బిలియన్ డాలర్ల స్థాయికి చేరగలదని అంచనా. 4 కోట్ల పైచిలుకు ఉన్న యూజర్లకు మరిన్ని లగ్జరీ ఉత్పత్తులు, సర్వీసులు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ఎక్స్క్లూజిలివ్లీని కొనుగోలు చేసినట్లు స్నాప్డీల్ సహ వ్యవస్థాపకుడు కునాల్ బెహల్ పేర్కొన్నారు. ఎక్స్క్లూజివ్లీ ఇకపై కూడా స్వతంత్ర వెబ్సైట్గానే పనిచేస్తుందని ఆయన వివరించారు. ప్రస్తుతం ఈ వెబ్సైట్ మనీష్ మల్హోత్రా, తరుణ్ తహ్లియానీ, మనీష్ అరోరా, రోహిత్ బాల్, నీతా లుల్లా వంటి ప్రముఖ డిజైనర్లు తయారు చేసిన డిజైన్స్ను విక్రయిస్తోంది. -
నిధులన్నీ ఈ కామర్స్ వెంటే...
సాక్షి, బిజినెస్ విభాగం: స్టార్టప్లయితే ‘ఫుడ్ ’కి సంబంధించిన కంపెనీలైతే చాలు. నిధులు భారీగా వస్తున్నాయి. అదే ఆరంభించి వివిధ దశల్లో ఉన్న కంపెనీల విషయానికొస్తే మాత్రం ఈ కామర్స్దే హవా. ఇదీ గతేడాది నిధుల ప్రవాహం తీరు. అంటే ఈ-కామర్స్ కంపెనీలను ఆరంభించిన వెంటనే నిధులు రావటం లేదు. పోటీని తట్టుకుని అవి నిలబడితే... వాటి వ్యాపార తీరుపై నమ్మకం కలిగితేనే విదేశీ ఇన్వెస్టర్లు వరస కడుతున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో మాత్రం కన్జూమర్ ఇంటర్నెట్, మొబైల్ యాప్స్, టెక్నాలజీ, వైద్యం, విద్య, మొదలైన విభాగాలకు చెందిన కంపెనీలు ఉన్నాయి. 2014 డేటా ప్రకారం అత్యధికంగా నిధులు అందుకున్న సంస్థల్లో నెంబర్-1 స్థానం ఫ్లిప్కార్ట్దే. ఇది అత్యధికంగా 1.9 బిలియన్ డాలర్లు సమీకరించింది. దాని పోటీ సంస్థ స్నాప్డీల్ 860 మిలియన్ డాలర్లు సాధించింది. ఈ రెండూ ఈ-కామర్స్ కంపెనీలే. ఇక 210 మిలియన్ డాలర్లతో ఓలా క్యాబ్స్, 192 మిలియన్ డాలర్లతో శుభం హౌసింగ్ ఫైనాన్స్, 157 మిలియన్ డాలర్లతో న్యూస్హంట్ ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఇలా దాదాపు 50 పైచిలుకు ఈ-కామర్స్ సంస్థలు దాదాపు 3.23 బిలియన్ డాలర్ల ఫండింగ్ అందుకున్నాయి. మరోవైపు, భారీ స్థాయిలో నిధులు దక్కించుకున్న స్టార్టప్లలో ఆహార సంబంధిత కంపెనీలే ఎక్కువగా ఉండటం విశేషం. ఇందులో.. ఫుడ్పాండా, జొమాటో చెరి 60 మిలియన్ డాలర్లు సమీకరించాయి. ఆన్లైన్ కిరాణాస్టోరు బిగ్బాస్కెట్డాట్కామ్ సైతం 60 మిలియన్ డాలర్ల పైచిలుకు నిధులు దక్కించుకుంది. రియల్టీ సంస్థల్లోనూ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. కామన్ఫ్లోర్, హౌసింగ్డాట్కామ్, ఇండియాహోమ్స్ వంటి సంస్థలూ చెప్పుకోతగ్గ స్థాయిలోనే ఫండింగ్ సాధించాయి. వ్యక్తిగత స్థాయిలో దిగ్గజాల పెట్టబడి... స్టార్టప్లకు నిధులందించటంలో వెంచర్ ఫండ్లే కాక వ్యక్తులూ ముందుంటున్నారు. పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా, విప్రో చైర్మన్ అజీం ప్రేమ్జీ మొదలైనవారు ఇందులో ఉన్నారు. రతన్ టాటా .. స్నాప్డీల్, బ్లూస్టోన్, అర్బన్ల్యాడర్ వంటి సంస్థల్లో ఇన్వెస్ట్ చేశారు. ప్రేమ్జీ ఇన్వెస్ట్ సంస్థ .. మింత్రాలో పెట్టుబడులు పెట్టింది. మింత్రాను ఆ తర్వాత ఫ్లిప్కార్ట్ కొనుగోలు చేసింది. మరోవైపు, తమ స్టార్టప్ కోసం ఫండింగ్ తెచ్చుకుంటున్న కొందరు వ్యక్తిగతంగా ఇతర స్టార్టప్లకూ తోడ్పాటు అందిస్తున్నారు. ఉదాహరణకు ఫ్లిప్కార్ట్ వ్యవస్థాపకులు సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్లు మాడ్ర్యాట్ గేమ్స్, న్యూస్ఇన్ షార్ట్స్, అథర్ వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేశారు. -
రెడీ..స్టడీ.. స్టార్టప్!
మొబైల్లో రెస్టారెంట్లను వెదుక్కునే అప్లికేషన్లా మొదలైంది జొమాటో చరిత్ర. ఇపుడు దాని విలువ దాదాపు బిలియన్ డాలర్లు. అంటే రూ.6 వేల కోట్ల పైమాటే. ఇక రోజూ మెయిళ్లకు డీల్స్ వివరాలు పంపించే కంపెనీగా ప్రస్థానం మొదలెట్టింది స్నాప్డీల్. ఇపుడు దాని విలువ 2 బిలియన్ డాలర్ల పైమాటే. ఇంటర్నెట్లో పుస్తకాలు అమ్మడానికి ఆరంభమైన ఫ్లిప్కార్ట్ది వీటన్నిటినీ మించిన చరిత్ర. విదేశీ పెట్టుబడులతో ఫ్లిప్కార్ట్ విలువ ఇపుడు ఏకంగా 11 బిలియన్ డాలర్లు. అంటే 66వేల కోట లపైమాటే. ఆరంభించిన అతితక్కువ కాలంలోనే ఈ కంపెనీలన్నీ భారీగా విస్తరించాయి. స్వదేశీ, విదేశీ నిధులతో వేల కోట్లకు పడగలెత్తి ఇంటర్నెట్ ప్రపంచానికి చిరునామాలుగా మారాయి. అందుకే ఇపుడు నిధులు సమకూర్చే సంస్థలన్నీ ‘స్టార్టప్’ల వెంట పడుతున్నాయి. ఆరంభ దశలోనే అభివృద్ధికి అవకాశమున్న కంపెనీలను గుర్తించి నిధులు గుమ్మరిస్తున్నాయి. తరవాత మంచి వేల్యుయేషన్ వచ్చాక వాటా విక్రయించి బయటపడుతున్నాయి. అన్నీ జొమాటో, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ మాదిరి ఎదుగుతాయని భావించకున్నా... ఇలా నిధులు అందుకుంటున్న సంస్థల్లో చాలా వరకూ చక్కని బిజినెస్ చేస్తున్నాయి. ఇన్వెస్టర్లకు కాసులు కురిపిస్తున్నాయి. అందుకే 2014వ సంవత్సరంలో దేశంలోని స్టార్టప్ కంపెనీల్లోకి ఏకంగా 5.2 బిలియన్ డాలర్ల నిధులు పెట్టుబడులుగా వచ్చాయి. ఏడాదిలో 229 స్టార్టప్లకు నిధులు ఒక అధ్యయనం ప్రకారం... 2014లో దాదాపు 229 దేశీ స్టార్టప్స్లోకి ఏకంగా 5.2 బిలియన్ డాలర్లు... అంటే సుమారు రూ. 32 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ 229 సంస్థల్లో అత్యధికం (దాదాపు 34 శాతం) 1 నుంచి 10 మిలియన్ డాలర్ల మేర నిధులు అందుకున్నవే. అంటే రూ.6 కోట్ల నుంచి రూ.60 కోట్లన్న మాట. 3% మేర సంస్థలు మాత్రం 100 మిలియన్ డాలర్లకు పైగా... అంటే రూ.600 కోట్లకు పైగా నిధులను అందుకున్నాయి. ఐటీ హబ్ బెంగళూరు... స్టార్టప్స్ కి ఫండింగ్లోనూ టాప్లోనే ఉంది. పెట్టుబడులు పొందిన సంస్థల్లో 30% బెంగళూరులోనే ఉండటం దీనికి నిదర్శనం. తర్వాత స్థానాల్లో ఢిల్లీ, ముంబై నిలిచాయి. 4% సంస్థలతో హైదరాబాద్.. పుణెతో కలిసి అయిదో స్థానంలో నిలిచింది. స్టార్టప్ల తోడ్పాటుకోసం... సాఫ్ట్వేర్ పరిశ్రమల సమాఖ్య నాస్కామ్ 10,000 స్టార్టప్స్ ప్రోగ్రామ్ తలపెట్టింది. 2013లో దీన్ని ఆరంభించి 150 స్టార్టప్స్కి ఫం డింగ్, కస్టమర్లు, మెంటార్లను అందించింది.2014-15లో స్టార్టప్స్, చిన్న.. మధ్య తరహా సంస్థల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.10,000 కోట్లతో ఫండ్ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా సాఫ్ట్వేర్ దిగ్గజాలతోను, స్టార్టప్ వర్గాలతోను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ భేటీ అవుతున్నారు.(స్టార్టప్లలోకి నిధులు వస్తున్నాయి సరే! అసలు ఏ రంగంలోకి ఎక్కువ వస్తున్నాయి? వాటి తీరుతెన్నులేంటి? తదుపరి సంచికలో)