
సాక్షి, న్యూఢిల్లీ: ఎల్జీ కొత్త మొబైల్ను లాంచ్ చేసింది. వి 30+ పేరుతో ఈ స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. రూ. 44,990 ధర నిర్ణయించింది. డిసెంబర్ 18నుంచి విక్రయాలు మొదలు కానున్నాయిని ఎల్జీ వెల్లడించింది. అలాగే ఫ్రీ వైర్లెస్ చార్జర్, స్ర్కీన్ రీప్లేస్ మెంట్గ్యారంటీ కూడా అందిస్తోంది. డ్యుయల్ రియర్ కెమరాలు, భారీ స్టోరేజ్, ఎఫ్ 1.6 భారీ ఎపర్చర్, క్లిస్టర్ క్లియర్ గ్లాస్, హై ఫై వీడియో రికార్డింగ్ తమ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ ప్రత్యేకతలుగా లాంచింగ్ సందర్భంగా ఎల్జీ పేర్కొంది.
ఎల్జీ వీ 30 ప్లస్ స్పెసిఫికేషన్స్
6 అంగుళాల డిస్ప్లే ఓలెడ్ ఫుల్విజన్
1440x2880పిక్సెల్స్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ నౌగట్ 7.1.2
క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 835 ఎస్ ఓసి
4జిబి ర్యామ్
128 జీబీ స్టోరెజీ
2టీబీ దాకా విస్తరించుకునే సదుపాయం
16+13ఎంపీ ఎంపీ రియర్ కెమెరా
5 ఎంపీ ఫ్రంట్కెమెరా
3300 ఎంఏహెచ్ బ్యాటరీ

Comments
Please login to add a commentAdd a comment