New Smartphone
-
మార్కెట్లోకి షావొమీ రెడ్మీ-14సీ 5జీ.. బడ్జెట్ ఫోన్
సాక్షి, హైదరాబాద్: స్మార్ట్ఫోన్ల దిగ్గజ కంపెనీ షావొమీ (Xiaomi) సరికొత్త 5జీ ఫోన్ను విడుదల చేయనుంది. రెడ్మీ -14సీ 5జీ (Redmi 14C 5G) పేరుతో జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ స్మార్ట్ఫోన్ భారతీయ వినియోగదారుల ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరీ తయారు చేశామని కంపెనీ ప్రతినిధి సందీప్ శర్మ తెలిపారుహైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ సరికొత్త స్మార్ట్ఫోన్ ఫీచర్లను వివరించారు. భారత్లో 5జీ స్మార్ట్ఫోన్ల వినియోగం వేగంగా పెరుగుతున్నప్పటికీ ఇప్పటివరకూ కేవలం 16 శాతం మంది వినియోగదారులు మాత్రమే 5జీ ఫోన్లు కలిగి ఉన్నారని.. మరింత మంది అత్యధిక వేగంతో పని చేసే 5జీ ఫోన్లను అందుబాటులోకి తెచ్చే క్రమంలో భాగా షావొమీ రెడ్మీ-14సీని అందుబాటులోకి తెచ్చిందని ఆయన వివరించారు. స్టార్లైట్ బ్లూ, స్టార్డస్ట్ పర్పుల్, స్టార్గేజ్ బ్లాక్ పేరుతో ప్రత్యేకంగా డిజైన్తో కూడిన మూడు రంగుల్లో ఈ స్మార్ట్ఫోన్ లభిస్తుందని తెలిపారు.నాలుగు నానోమీటర్ల ప్రాసెసర్ డిజైన్..రెడ్మీ - 14సీ 5జీలో స్మార్ట్ఫోన్లో అత్యాధునిక స్నాప్డ్రాగన్ 4జెన్-2 ప్రాసెసర్ను ఉపయోగించారు. నాలుగు నానోమీటర్ల ప్రాసెసర్ (Processor) అర్కిటెక్చర్ కారణంగా సెకనుకు 2.5 జీబీబీఎస్ల వేగాన్ని అందుకోగలగడం దీని ప్రత్యేకత. 5జీ వేగాలను అందుకునేందుకు వీలుగా ఎక్స్-61 మోడెమ్ను ఏర్పాటు చేశారు. స్క్రీన్ సైజ్ 6.88 అంగుళాల హెచ్డీ (HD) డిస్ప్లే కాగా.. రెఫ్రెష్ రేటు 120 హెర్ట్ట్జ్. అలాగే డాట్ డ్రాప్ డిస్ప్లే కలిగి ఉండి.. గరిష్టంగా 600 నిట్స్ ప్రకాశాన్ని ఇస్తుంది.ఇక స్టోరేజీ విషయానికి వస్తే 12 జీబీల ర్యామ్ (RAM) (6జీబీ + అవసరమైతే మరో 6 జీబీ) కలిగి ఉంటుంది. 128 జీబీల రామ్ సొంతం. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా ఒక టెరాబైట్ వరకూ స్టోరేజీని పెంచుకోవచ్చు. 50 ఎంపీల ఏఐ-డ్యుయల్ కెమెరా వ్యవస్థతోపాటు 8 ఎంపీల సెల్ఫీ కెమెరాతో కూడిన ఈ స్మార్ట్ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత షావొమీ హైపర్ ఓఎస్పై పని చేస్తుంది.ధర.. అందుబాటులోకి ఎప్పుడు?రెడ్మీ 14సీ 5జీ ఈ నెల 10వ తేదీ నుంచి షావోమీ స్టోర్లతోపాటు ఫ్లిప్కార్ట్, అమెజాన్లలోనూ అందుబాటులోకి రానుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ కలిగగిన ప్రాథమిక మోడల్ ధర రూ.9999లు కాగా.. స్టోరేజీ 128 జీబీ, మెమరీ నాలుగు జీబీలుండే ఫోన్ ధర రూ.10,999లు.. 6 జీబీ మెమరీ, 128 జీబీ స్టోరేజీ ఉన్న ఫోన్ ధర రూ.11,999లు అని సందీప్ శర్మ తెలిపారు. -
వివో నుంచి సరికొత్త స్మార్ట్ఫోన్..
స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ వివో తాజాగా వై300 (Vivo Y300 5G)ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 21,999 నుంచి ప్రారంభమవుతుంది. 8 జీబీ+128 జీబీ అలాగే 8 జీబీ+256 జీబీ వేరియంట్లలో లభిస్తుంది. 6.67 అంగుళాల డిస్ప్లే, 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్882 మెయిన్ కెమెరా, 32 ఎంపీ ఫ్రంట్ పోర్ర్టెయిట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లు ఇందులో ఉంటాయి.వివో వై300 టైటానియం సిల్వర్, ఎమరాల్డ్ గ్రీన్, ఫాంటమ్ పర్పుల్ అనే మూడు రంగులలో లభిస్తుంది. ఈ పరికరం 8GB+128GB వేరియంట్ ధర రూ. 21,999 కాగా 8GB+256GB వేరియంట్ ధర రూ.23,999. ఈ ఫోన్కి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు నవంబర్ 21 నుండి ప్రారంభమవుతాయి.నవంబర్ 26 నుంచి వివో ఇండియా ఈ–స్టోర్తో పాటు అమెజాన్, ఫ్లిప్కార్ట్ తదితర ఈకామర్స్ సైట్ల ద్వారా కూడా కొనుగోలు చేయొచ్చు. ఎస్బీఐ కార్డ్, బీవోబీ కార్డ్ మొదలైన వాటిపై రూ. 2,000 వరకు క్యాష్బ్యాక్ వంటివి ఆఫర్లు పొందవచ్చు. తమ వై సిరీస్ స్మార్ట్ఫోన్లకు బాలీవుడ్ నటి సుహానా ఖాన్ ప్రచారకర్తగా వ్యవహరిస్తారని సంస్థ తెలిపింది. -
రూ.7,499లకే సరికొత్త స్మార్ట్ఫోన్..
లేటెస్ట్ ఫీచర్లు ఉన్న మంచి స్మార్ట్ ఫోన్ను తక్కువ ధరకు కొనాలనుకుంటున్నవారికి గుడ్న్యూస్. చౌక ధరలో స్మార్ట్ఫోన్లు అందించే చైనీస్ స్మార్ట్ఫోన్ కంపెనీ పోకో.. పోకో సీ65 (Poco C65) పేరుతో భారత్లో సరికొత్త మోడల్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. ఈ ఫోన్లు డిసెంబర్ 18 నుంచి కొనుగోలుదారులకు అందుబాటులోకి రానున్నాయి. పోకో సీ65 స్మార్ట్ఫోన్లు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్లో విక్రయానికి రానున్నాయి. వీటి సేల్ డిసెంబర్ 18న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. ఈ స్మార్ట్ఫోన్ ప్రారంభ వేరియంట్ను రూ.7,499 లకే కొనుగోలు చేయవచ్చు. మిగిలిన వేరియంట్లు కూడా రూ. 10,000 లోపే లభిస్తాయి. పోకో సీ65 మూడు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. 4జీబీ/128జీబీ వేరియంట్కు రూ. 8,499, 6జీబీ/128జీబీ వేరియంట్కు రూ. 9,499, 8+256GB 8జీబీ/256జీబీ వేరియంట్కు రూ. 10,999 ధరను కంపెనీ నిర్ణయించింది. అయితే స్పెషల్ సేల్ డే రోజున ఐసీఐసీఐ డెబిట్/క్రెడిట్ కార్డ్లు/ఈఎంఐ లావాదేవీలను ఉపయోగించి రూ. 1,000 తగ్గింపు, ఎక్సేంజ్ ఆఫర్ ద్వారా వీటిని వరుసగా రూ.7,499, రూ. 8,499, రూ. 9,999లకే సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్లు పాస్టెల్ బ్లూ, మాట్టే బ్లాక్ అనే రెండు రంగుల్లో లభ్యమవుతాయి.ప్రత్యేక మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా ఈ ఫోన్ మెమొరీని 1టీబీ వరకు పెంచుకోవచ్చు. పోకో సీ65 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు 6.74 అంగుళాల HD+ 90Hz డిస్ప్లే MediaTek Helio G85 ప్రాసెసర్ సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ 8MP ఫ్రంట్ కెమెరా, 2MP మాక్రో లెన్స్, 50MP AI ట్రిపుల్ రియర్ కెమెరా 5000mAh బ్యాటరీ 18W ఫాస్ట్ ఛార్జింగ్ 10 వాట్ C-టైప్ ఛార్జర్ సపోర్ట్ -
రూ.13 వేలకే.. తొలిసారి 3డీ కర్వ్డ్ స్మార్ట్ఫోన్
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ఐటెల్ (itel) కొత్తగా రూ. 15 వేల లోపు సెగ్మెంట్లో తొలిసారి 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే స్మార్ట్ఫోన్ ఎస్23ప్లస్ను ఆవిష్కరించింది. బ్యాంక్ ఆఫర్లు మొదలైనవన్నీ పరిగణనలోకి తీసుకుంటే దీని ధర రూ. 12,999గా ఉంటుందని ఐటెల్ ఇండియా సీఈవో అరిజిత్ తాళపత్ర తెలిపారు. లాంచ్ ఆఫర్ కింద రూ. 2,399 విలువ చేసే టీ11 ఇయర్బడ్స్ను ఉచితంగా పొందవచ్చని పేర్కొన్నారు. ఎస్23ప్లస్ ఫోన్ల అమ్మకాలు అక్టోబర్ 6 నుంచి ఈ–కామర్స్ సైట్ అమెజాన్ ఇండియాలో ప్రారంభమవుతాయని అరిజిత్ వివరించారు. 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ స్క్రీన్, 256జీబీ మెమరీ, 16 జీబీ ర్యామ్, 32 ఎంపీ ఫ్రంట్, 50 ఎంపీ రియర్ కెమెరా తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. -
రియల్మి ఏ2+ కొత్త వేరియంట్: ధర చూస్తే ఇంప్రెస్ అవుతారు!
Redmi A2+ 128GB Storage చైనా స్మార్ట్ఫోన్ మేకర్ రెడ్మీ సరికొత్త స్మార్ట్ఫోన్ వేరియంట్ను లాంచ్ చేసింది. రెడ్మి ఏ2+లో కొత్త ర్యామ్, స్టోరేజ్ వేరియంట్ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. ఇది ఈ ఏడాది మార్చిలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. కొత్తగా ఇపుడు 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్కాన్ఫిగరేషన్లో తీసుకొచ్చింది. MediaTek Helio G36 SoC , 5,000mAH బ్యాటరీ,మెమరీ ఫ్యూజన్ టెక్నాలజీతో లాంచ్అయింది. ఇది గరిష్టంగా 32 రోజుల స్టాండ్బై సమయాన్ని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. ధర, ఆఫర్ 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్రెడ్మి ఏ2+ వేరియంట్ ధర ఎంఐడాట్కామ్లో రూ.8,499గా ఉంది. అయితే ప్రస్తుతం పరిచయ ఆఫర్గా ప్రస్తుతం రూ. 7,999గా కొనుగోలు చేయవచ్చు. ఇది క్లాసిక్ బ్లాక్, సీ గ్రీన్ , ఆక్వా బ్లూ రంగులలో లభ్యం. రెడ్మి ఏ2+ స్పెసిఫికేషన్స్ 120Hz టచ్ శాంప్లింగ్ రేట్తో 6.52-అంగుళాల HD+ LCD డిస్ప్లే 1600 x 720 పిక్సెల్స్రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 13 8మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ , QVGA కెమెరాతో AI-బ్యాక్డ్ డ్యూయల్ రియర్ కెమెరా 5ఎంపీ ఫ్రంట్ కెమెరా సెన్సార్ 5,000mAh బ్యాటరీ -
బడ్జెట్ ధరలో అద్భుతమైన మోటో ఈ13 స్మార్ట్ఫోన్: స్పెషాల్టీ ఏంటంటే?
Motorola Launched 'moto e13' మోటరోలా సరికొత్త మొబైల్ను లాంచ్ చేసింది. మోటో ఈ13 పేరుతో కొత్త స్మార్ట్ఫోన్ను ప్రకటించింది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లో తీసుకొచ్చింది. సంస్థ అధికారిక వెబ్సైట్తోపాటు, ఆగస్టు 16 నుండి ఫ్లిప్కార్ట్, ప్రముఖ రిటైల్ స్టోర్లు బడ్జెట్ ధరలో లభించ నుంది. కాస్మిక్ బ్లాక్, అరోరా గ్రీన్, క్రీమీ వైట్ అనే మూడు రంగుల్లో రూ. 8,999కి అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. అద్భుతమైన టెక్నాలజీ, పెర్ఫామెన్స్తో దీన్ని తీసుకొచ్చినట్టు తెలిపింది. ఈ స్మార్ట్ఫోన్ లోని ఏఐ పవర్డ్ కెమెరా "ఆటో స్మైల్ క్యాప్చర్ వంటి ఇంటెలిజెంట్ ఫీచర్తో పర్ఫెక్ట్ షాట్ను తీయడంతోపాటు, ఫేస్ బ్యూటీ , పోర్ట్రెయిట్ మోడ్ మీ ఫోటోలను స్వయంచాలకంగా మెరుగుపరుస్తాయని స్మార్ట్ఫోన్ మేకర్ వెల్లడించింది. మోటో ఈ13 స్పెసిఫికేషన్స్ 6.5-అంగుళాల IPS LCD డిస్ప్లే UNISOC T606 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ప్రీమియం యాక్రిలిక్ గ్లాస్ (PMMA) బాడీ Dolby Atmos ఆడియో 13 ఎంపీ ఏఐ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000mAh బ్యాటరీ, 10W ఛార్జింగ్ సపోర్ట్ -
మోటో జీ14: ఫీచర్లు అదుర్స్! ధర తెలిస్తే వదిలిపెట్టరు!
Moto G14 : మెటరోలా ఇటీవల విడుదల చేసిన బడ్జెట్ స్మార్ట్ఫోన్ మోటో జీ 14 కొనుగోలుకు లభిస్తోంది. భారీ బ్యాటరీ, బిగ్ స్క్రీన్, మల్టీ కెమెరా,డాల్బీ అట్మోస్-ఆధారిత స్టీరియో స్పీకర్స్ లాంటి అదిరే ఫీచర్స్తో ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్లో కొనుగోలుకు అందుబాటులోకి వచ్చింది. మోటో జీ 14 ధర, ఆఫర్ మోటో జీ 14 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ (సింగిల్) వేరియంట్ ఫ్లిప్కార్ట్లో రూ.9,999 ధరతో లభిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు మాత్రమే ఆఫర్లకు అర్హులు. ఫోన్పై తక్షణం రూ.750 తగ్గింపును పొందవచ్చు. ఫోన్ను ప్రీ-ఆర్డర్ చేసిన వారు రూ. 3,200 విలువైన స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ప్లాన్కు అర్హులు. స్టీల్ గ్రే , స్కై బ్లూ రంగులలో లభ్యం. (‘ఎక్స్’ లో లక్షల్లో ఆదాయం: పండగ చేసుకుంటున్న కంటెంట్ క్రియేటర్లు) మోటో జీ 14 స్పెసిఫికేషన్స్ 6.5-అంగుళాల ఫుల్హెచ్డి+ డిస్ప్లే 2GHz క్లాక్ స్పీడ్ ఆక్టా-కోర్ Unisoc T616 ప్రాసెసర్ 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ డ్యుయల్రియర్కెమెరా : 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 2ఎంపీ మాక్రో లెన్స్, 8ఎంపీ సెల్ఫీకెమెరా 5,000 mAh బ్యాటరీ, 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇదీ చదవండి: కేంద్రం కీలక నిర్ణయం: టీసీఎస్కు బంపర్ ఆఫర్ -
ఒప్పో కొత్త ఫోన్, ప్రారంభ ఆఫర్, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?
Oppo A78 4g: ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ కంపెనీ ఒప్పో భారత మార్కెట్లో మరో మొబైల్ను లాంచ్ చేసింది. మిడ్ రేంజ్లో ఒప్పో ఏ సిరీస్లో 4 జీ స్మార్ట్ఫోన్ను మంగళవారం భారతదేశంలో విడుదల చేసింది. ఒప్పో ఏ78 4జీ స్మార్ట్ఫోన్ పేరుతో తీసుకొచ్చిన ఈ మొబైల్లో 50MP ప్రధాన కెమెరా, భారీ బ్యాటరీ,చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లను జోడించింది. ఒప్పో ఏ78 మోడల్ 5జీ వెర్షన్ ఎనిమిది నెలల క్రితమే లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. (టికెట్ల ధరలకు ‘రెక్కలు’: ప్రయాణీకులకు ఇక చుక్కలే!) కస్టమర్లు మెయిన్లైన్ రిటైల్ అవుట్లెట్ల నుండి గరిష్టంగా 10శాతం (రూ. 1,500) క్యాష్బ్యాక్ , SBI కార్డ్, కోటక్ మహీంద్రా బ్యాంక్ , బ్యాంక్ ఆఫ్ బరోడా, వన్ కార్డ్ వంటి ప్రముఖ బ్యాంకుల నుండి 3 నెలల వరకు నో-కాస్ట్ EMI. ఆన్లైన్ స్టోర్ల నుండి రూ. 500 వరకు ఎక్స్ఛేంజ్ + లాయల్టీ బోనస్ను పొందవచ్చు. (హార్లే-డేవిడ్సన్ లవర్స్కు భారీ షాక్, ఏకంగా పదివేలు!) ధర, ఆఫర్స్ ఒప్పో ఏ78 4జీ 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ ధర రూ.22,999. ప్రారంభ ఆఫర్లో భాగంగా రూ.17,499కే లభిస్తోంది. ఆక్వాగ్రీన్, మిస్ట్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. Check out the incredible OPPO A78! 🌟, having exquisite Style with its Diamond matrix design to make you look stylish wherever you go!!#OPPOA78 Know More: https://t.co/j0DeX3xW4Q pic.twitter.com/C313pb2co2 — OPPO India (@OPPOIndia) August 2, 2023 ఒప్పో ఏ78 4జీ ఫోన్ స్పెసిఫికేషన్లు 6.43 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ అమోలెడ్ డిస్ ప్లే 90 హెర్జ్ రీఫ్రెష్ రేటు, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా ColorOS 13.1 8 జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు పెంచుకోవచ్చు 50 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ పొట్రెయిట్ కెమెరా 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ సూపర్ వూక్ చార్జర్ Check out the incredible OPPO A78! 🌟, having exquisite Style with its Diamond matrix design to make you look stylish wherever you go!!#OPPOA78 Know More: https://t.co/j0DeX3xW4Q pic.twitter.com/C313pb2co2 — OPPO India (@OPPOIndia) August 2, 2023 -
రియల్మీ నార్జో సిరీస్ 5 జీ స్మార్ట్ఫోన్లు: 100ఎంపీ కెమెరా, ధర, ఇతర ఫీచర్లు
సాక్షి, ముంబై: రియల్మీ నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు వచ్చేశాయ్. రియల్మీ నార్జో 60, రియల్మీ నార్జో 60 ప్రొ భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ రెండు డివైజ్లు దేశవ్యాప్తంగా ఉన్న ఆఫ్లైన్ రిటైల్ స్టోర్లతో పాటు అమెజాన్ , రియల్మీ ఇండియా వెబ్సైట్ ద్వారా జూలై 15 నుంచి అందుబాటులో ఉంటాయి. రియల్మీ నార్జో 60 ప్రొ ప్రారంభ ధర రూ. 23,999, రియల్మీ నార్జో 60 ప్రారంభ ధర రూ.17,999గా ఉంటాయి. రియల్మీ నార్జో 60 రెండు స్టోరేజ్ మోడల్స్లో లభ్యం. బేస్ వేరియంట్ 8జీబీ ర్యామ్, , 128 జీబీ స్టోరేజ్ రూ. 17,999. 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 19,999 గా ఉంటుంది. రియల్మీ నార్జో 60 ప్రొ 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ రూ. 23,999 12జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999. రియల్మీ నార్జో 60 ప్రొ స్పెసిఫికేషన్స్ 6.9-అంగుళాల కర్వ్డ్ స్క్రీన్తో 120Hz రిఫ్రెష్ రేట్ MediaTek డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ Android 13 ఆపరేటింగ్ సిస్టమ్ 100 ఎంపీ+ 2ఎంపీ రియల్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 5,000mAh బ్యాటరీతో 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ రియల్మీ నార్జో 60 స్పెసిఫికేషన్స్ 6.43-అంగుళాల AMOLED స్క్రీన్ ,90Hz రిఫ్రెష్ రేట్ 64+2ఎంపీ రియర్ కెమెరా 16ఎంపీ సెల్ఫీకెమెరా 5,000mAh బ్యాటరీ, 33వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ప్రీ-ఆర్డర్ ఆఫర్: నార్జో 60 5జీ కొనుగోలుపై 1,000 కూపన్ లభ్యం. దీంతోపాటు ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లను ఉపయోగించి నార్జో 60 Pro 5జీ ని కొనుగోలు చేసే వారికి ఫ్లాట్ రూ. 1,500 తక్షణ తగ్గింపు. -
సరికొత్త టెక్నాలజీతో వివో వై36 లాంచ్: ధర తక్కువే!
ప్రముఖ స్మార్ట్ఫోన్ వివో సరికొత్త స్మార్ట్ఫోన్నులాంచ్ చేసింది. 50 ఎంపీ కెమెరా, భారీ బ్యాటరీతో వివో వై సిరీస్లో వివో వై 36 కెమెరాను భారత మార్కెట్లో తీసు కొచ్చింది. ఫ్లిప్కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్ ఇతర రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. సన్లైట్-రీడబుల్ డిస్ప్లే అంటే ప్రకాశవంతమైన సూర్యకాంతిలో కూడా స్మార్ట్ఫోన్ను ఉపయోగించడం ఈజీ అని పేర్కొంది. ఇదీ చదవండి: స్టార్ క్రికెటర్ కొత్త సూపర్ లగ్జరీ కారు, ధరెంతో తెలిస్తే షాకవుతారు! వివో వై36 ధరలు, లభ్యత 8జీబీ ర్యామ్ +128జీబీ స్టోరేయ్ వేరియంట్ రూ. 16,999గా నిర్ణయించింది. 'డైనమిక్ డ్యూయల్ రింగ్' డిజైన్తో వస్తున్న ఈ స్మార్ట్ఫోన్ వైబ్రాంట్ గోల్డ్ మెటోర్ బ్లాక్ అనే రెండు రంగులలో వస్తుంది. ICICI & HDFC కార్డ్ ద్వారా జరిపే కొనుగోళ్లపై రూ. 500 తగ్గింపు వివో వై36 ఫీచర్లు 6.64-అంగుళాల FHD+ హై-క్వాలిటీ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ 50+2 ఎంపీ రియర్కెమెరా ఆరా స్క్రీన్ లైట్తో 16MP ఫ్రంట్ కెమెరా 5000mAh బ్యాటరీ, 44W ఫ్లాష్ ఛార్జ్ (Global Chess League 2023 ఆనంద్ VS ఆనంద్: మహీంద్ర ట్వీట్ వైరల్) Here's another reason to amp up your style! Bringing you the all-new vivo Y36 with Stylish Glass Design and 44W Flash Charge. Buy now!#ItsMyStyle #vivoY36 pic.twitter.com/BI4ngPIJwi — vivo India (@Vivo_India) June 22, 2023 -
నోకియా సీ22 స్మార్ట్ఫోన్ వచ్చేసింది: అదిరే ఫీచర్లు, అతి తక్కువ ధర
సాక్షి, ముంబై: బడ్జెట్ ఫోన్ల సంస్థ నోకియా మరోసారి తన ఫ్యాన్స్ను మెస్మరైజ్ చేసింది. అతి తక్కువ ధరలో నోకియా సీ 22 ఫోన్నుభారత మార్కెట్లోలాంచ్ చేసింది. మెరుగైన డ్రాప్ ప్రొటెక్షన్తో భారత దేశంలో విడుదల చేస్తున్నట్లు హెచ్ఎండీ గ్లోబల్ గురువారం ప్రకటించింది. (BharatPe controversy: అష్నీర్ గ్రోవర్, ఫ్యామిలీకి భారీ షాక్ ) దీని ధర రూ. 7999 గా నిర్ణయించింది. చార్కోల్, సాండ్, పర్పుల్ కలర్స్ లభ్యం. 4జీబీ ర్యామ్ 2 జీబీ వర్చువల్ స్టోరేజ్, 4జీబీ (2GB + 2GB RAM), 6జీబీ(4GB + 2GB వర్చువల్ RAM) 64జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్తో లభించ నుంది. మూడు రోజుల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. ఏడాది రిప్లేస్మెంట్ గ్యారంటీతోపాటుఅందిస్తున్న నోకియా సీ 22 ఈ రోజు నుంచే( మే 11) కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఇంకా IP52గా రేట్ బ్యాటరీ సేవర్ ఫీచర్ , స్ప్లాష్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. (శాంసంగ్ 32 అంగుళాల స్మార్ట్టీవీ: కేవలం రూ. 5వేలకే) నోకియా సీ-సిరీస్ నమ్మదగిన, సరసమైన స్మార్ట్ఫోన్లను అందించడంలో కస్టమర్ల నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయదని హెచ్ఎండీ గ్లోబల్ ప్రొడక్ట్ మార్కెటింగ్ హెడ్ ఆడమ్ ఫెర్గూసన్ ఒక ప్రకటనలో తెలిపారు. నోకియా సీ22 ఫీచర్లు 6.5 అంగుళాల HD+ డిస్ప్లే ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ 13 ఎంపీ డ్యూయల్ రియల్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000 mAh బ్యాటరీ Introducing the all-new Nokia C22 comes with 4GB RAM + 2GB virtual RAM, 13MP dual rear camera, 1 year replacement guarantee and 3-day battery life to make you #LiveUntamed. Buy now: https://t.co/tKvqK84hWj#NokiaC22 pic.twitter.com/gVNg4kA7ki — Nokia Mobile India (@NokiamobileIN) May 11, 2023 -
వివో ఎక్స్ 90, 90ప్రొ స్మార్ట్ఫోన్లు లాంచ్, ధరలు చూస్తే
సాక్షి, ముంబై: చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ వివో ఎక్స్ సిరీస్లో కొత్త మోడల్స్ను భారతీయ మార్కెట్లోకి లాంచ్ చేసింది. వివో ఎక్స్90, ఎక్స్90 ప్రొ స్మార్ట్ఫోన్లను బుధవారం లాంచ్ చేసింది. MediaTek డైమెన్సిటీ 9200 SoC,కెమెరా-ఫోకస్డ్ Zeiss-బ్రాండెడ్ ట్రిపుల్ రియర్, V2 చిప్ ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయి. ఇప్పటికే చైనా, మలేషియాలో లభ్యమవుతున్న ఈ స్మార్ట్ఫోన్లు వచ్చే వారం దేశంలో అందుబాటులోకి వస్తున్నాయి గత ఏడాది ఎక్స్ 80 సిరీస్ను లాంచ్ చేసిసక్సెస్ అయిన సంగతి తెలిసిందే. వివో ఎక్స్ 90 ప్రొ, వివో ఎక్స్ 90 ధర, లభ్యత వివో ఎక్స్ 90 ప్రొ ధర సింగిల్ వేరియంట్ను తీసుకొచ్చింది. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 84,999. లెజెండరీ బ్లాక్ షేడ్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. (ఓర్నీ వయ్యారం..ఇదేమి ట్రైన్ భయ్యా! ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్న వీడియో) వివో ఎక్స్ 90 రూ. 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ 59,999గా ఉంది. అలాగే 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 63,999. ఆస్టరాయిడ్ బ్లాక్ , బ్రీజ్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభ్యం. (ముంబై ఇండియన్స్ బాస్ గురించి తెలుసా? అంబానీని మించి సంపాదన) ఈ రెండు మోడల్స్ ప్రస్తుతం ప్రీ-బుకింగ్కు సిద్ధంగా ఉన్నాయి . మే 5 నుండి అమ్మకాలు ప్రారంభం. ఫ్లిప్కార్ట్, వివో ఇండియా ఆన్లైన్ స్టోర్లు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటాయి.ఎస్బీఐ, ఐసీఐసీఐ,హెచ్డీఎఫ్సీ, ఐడీఎఫ్సీ బ్యాంక్ కార్డ్లను ఉపయోగించి కొత్త స్మార్ట్ఫోన్లను ప్రీ-బుకింగ్ చేసే కస్టమర్లు 10 శాతం వరకు క్యాష్బ్యాక్ పొందవచ్చు. ఇక స్పెసిఫికేషన్స్కి వస్తే..దాదాపు రెండు మోడల్స్ ఫీచర్లు దాదాపు ఒకేలా ఉన్నాయి. వివో ఎక్స్ 90 ప్రొ స్పెసిఫికేషన్స్ 6.78-అంగుళాల AMOLED 3D కర్వ్డ్ డిస్ప్లే 1,260x 2,800 పిక్సెల్స్ రిజల్యూషన్ Android 13-ఆధారిత FunTouch OS, 120Hz రిఫ్రెష్ రేట్ ఆక్టా-కోర్ 4nm MediaTek డైమెన్సిటీ 9200 SoC 50+50+12 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్, 4,870mAh బ్యాటరీ 8 నిమిషాల్లో సున్నా నుంచి 50 శాతం వరకు బ్యాటరీ ఛార్జ్ ఇదీ చదవండి: MG Comet EV: ఎంజీ కామెట్ కాంపాక్ట్ ఈవీ వచ్చేసింది..యూజర్లకు పండగే! -
పోకో సీ55 స్మార్ట్ఫోన్: రూ.10వేల లోపు బెస్ట్ ఫోన్!
సాక్షి, ముంబై: పోకో కొత్త స్మార్ట్ఫోన్ భారతీయ మార్కెట్లోలాంచ్ చేసింది. పోకో సీ 55 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ధరను పదివేల లోపే నిర్ణయించడం విశేషం. 5,000mAh బ్యాటరీ, లెదర్ ఫినిష్లాంటి ఫీచర్లతో బడ్జెట్ ఫోన్కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఫారెస్ట్ గ్రీన్, కూల్ బ్లూ మరియు పవర్ బ్లాక్ రంగులలో ఇది లభ్యం. పోకో సీ 55 ఫీచర్లు 6.71-అంగుళాల IPS LCD డిస్ప్లే MediaTek Helio G85 SoC MIUI 13 స్కిన్తో Android 12 OS 50 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా ఫ్లిప్కార్ట్ వివరాల ప్రకారం పోకో సీ 55 4జీ ప్రారంభ ధర 8,499 రూపాయలు. 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,499. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 10,999. ఈ బడ్జెట్ ఫోన్ ఫిబ్రవరి 28నుంచి సేల్స్ మొదలు. సేల్ ఆఫర్గా రూ. 500 ఫ్లాట్ తగ్గింపు, బ్యాంక్ కార్డ్లపై రూ. 500 తగ్గింపు కూడా అందుబాటులో ఉంది. -
ఓప్పో 5జీ స్మార్ట్ఫోన్ : ధర రూ. 20వేల లోపు
సాక్షి, ముంబై: ఒప్పో మరో 5జీ స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. అదీ రూ.20వేల లోపు ధరతో ఒప్పో ఏ78 ని తీసుకొచ్చింది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్తో సింగిల్ వేరియంట్లోనే తీసుకొచ్చిన ఒప్పో ఏ78 జనవరి 18నుంచి కొనుగోలుకు లభ్యం. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో లాంచ్ చేసిన ఈ 5జీ స్మార్ట్ఫోన్ ఫస్ట్ సేల్ సందర్భంగా కార్డ్ ఆఫర్ కూడా అందిస్తోంది. ధర, లభ్యత ఒప్పో ఏ78 5జీ ధర రూ.18,999గా నిర్ణయించిందికంపెనీ. సింగిల్ వేరియంట్లో (8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్) గ్లోయింగ్ బ్లాక్, గ్లోయింగ్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ-కామర్స్ సైట్ అమెజాన్, ఒప్పో ఈ-స్టోర్తో పాటు ఆఫ్లైన్ స్టోర్లలోనూ ఈనెల 18వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఒప్పో ఏ78 5జీ సేల్ షురూ అవుతుంది. ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. ఎస్బీఐ (SBI) క్రెడిట్, డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం వరకు గరిష్ఠంగా రూ.1,300 అదనపు తగ్గింపును పొందవచ్చు. అలాగే నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. ఒప్పో ఏ78 5జీ పూర్తి స్పెసిఫికేషన్స్ 6.56 ఇంచుల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే మీడియాటెక్ డైమన్సిటీ 700 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 13 (Android 13) బేస్డ్ కలర్ఓఎస్ 13 50+ 2 ఎంపీ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000mAh బ్యాటరీ , 33 వాట్స్ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ -
ఐకూ11 5జీ వచ్చేసింది: దీని ప్రత్యేకత, ఆఫర్లు తెలిస్తే ఫిదా
సాక్షి,ముంబై: ఐకూ 11 5జీ పేరుతో కొత్త స్మార్ట్ఫోన్ను ఇండియాలో లాంచ్ చేసింది. ప్రీమియం ఫీచర్లతో 2023లో తొలి ఫ్లాగ్షిప్ మొబైల్గా మంగళవారం (జనవరి10) ఆవిష్కరించింది. స్నాప్డ్రాగన్ 8 జెన్ 2 (Snapdragon 8 Gen 2) ప్రాసెసర్, 2K ఈ6 అమోలెడ్ డిస్ప్లేతో ఇండియాలో లాంచ్ అయిన తొలి ఫోన్ ఇదేనని ఐకూ తెలిపింది. రాత్రిపూట 4K వీడియోలను రికార్డ్ చేసేలా వివో V2 ఇమేజింగ్ చిప్తో ఈ స్మార్ట్ఫోన్ను తీసుకొచ్చింది. ఈ ఫోన్ ఎనిమిది నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. Ready your wishlist, because the #iQOO11 with India’s First 2K E6 AMOLED Display at just ₹51,999*. Sale starts 13th Jan, 12PM exclusively on https://t.co/ZK4Krrdztq & @amazonIN. 24 Hours Early Access* for Prime Members. *T&C Apply#MonsterInside #AmazonSpecials #iQOO11Launch pic.twitter.com/8iGVM3hDBE — iQOO India (@IqooInd) January 10, 2023 p> ఐకూ 11 5జీ స్పెసిఫికేషన్స్ 6.7 ఇంచుల 2K ఈ6 అమోలెడ్ డిస్ప్లే హెచ్డీఆర్10+, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ స్నాప్డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ 50+8 +13 ఎంపీ రియర్ ట్రిపుల్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000mAh బ్యాటరీ 120W ఫాస్ట్ ఛార్జింగ్ ఐకూ 11 5జీ ధరలు, తొలిసేల్ ఐకూ 11 5జీ బేస్ మోడల్, 8 జీబీ ర్యామ్ +256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.59,999. టాప్ వేరియంట్, 16జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర రూ.64,999గా ఉంది. జనవరి 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్, ఐకూ అధికారిక వెబ్సైట్ ద్వారా ఫస్ట్ సేల్ ప్రారంభం. ఆల్ఫా, లెజెండ్ కలర్స్లో ఈ స్మార్ట్ఫోన్ లభ్యం. ఆఫర్లు ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ కార్డుతో ఐకూ 11 5జీని కొనుగోలు చేస్తే రూ.5,000 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే నో కాస్ట్ ఈఎంఐ, 3 వేల రూపాయల దాకా స్పెషల్ ఎక్స్చేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. -
రియల్మీ10 వచ్చేసింది.. 5జీ సపోర్ట్ ఉందా? లేదా?
సాక్షి,ముంబై: చైనీస్ స్మార్ట్ఫోన్ మేకర్ రియల్మీ కొత్త స్మార్ట్షోన్ను తీసుకొచ్చింది. రియల్మీ 10 పేరుతో తన ఫ్లాగ్షిప్ మొబైల్ను భారత మార్కెట్లో సోమవారం లాంచ్ చేసింది. అయితే దేశీయంగా 5జీ వినియోగానికి ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో ఈ స్మార్ట్ఫోన్ 5జీకి సపోర్ట్ ఇవ్వకపోవడం రియల్మీ ఫ్యాన్స్ను నిరాశ పర్చింది. రియల్మీ 10 స్పెసిఫికేషన్లు 6.5అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్, ఆండ్రాయిడ్ 13 OS, MediaTek Helio G99 SoC 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 50 ఎంపీ ఏఐ, 2 ఎంపీ బ్లాక్&వైట్ పొట్రయిట్ రియర్ డ్యుయల్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 5,000mAh బ్యాటరీ ఫస్ట్ సేల్, ఆఫర్, ధర ఈ స్మార్ట్ఫోన్ క్లాష్ వైట్ రష్ బ్లాక్ అనే రెండు రంగులలో లభ్యం. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 13,999, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 16,999గా ఉంటుంది. తొలి సేల్, జనవరి 15నుంచి రియల్ మీ, ఫ్లిప్కార్ట్ ఇతర ఆన్లైన్ స్టోర్లలో లభ్యం. రియల్మీ, ఫ్లిప్కార్ట్లో ICICI డెబిట్, క్రెడిట్ కార్డ్, EMI లావాదేవీలపై 1000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. -
సరికొత్త స్మార్ట్ఫోన్ టెక్నో పోవా-4: ధర, ఫీచర్లపై ఓ లుక్కేసుకోండి!
సాక్షి,ముంబై: చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీదారు టెక్నో భారతదేశంలో పోవా-4 పేరుతో కొత్త స్మార్ట్ఫోన్ను బుధవారం విడుదల చేసింది. రూ. 11,999 ధరతో ఈ స్మార్ట్ఫోన్ డిసెంబర్ 13 నుండి ఇ-కామర్స్ ప్లాట్ఫారమ్ అమెజాన్ మరియు జియో మార్ట్లో అందుబాటులో ఉంటుంది. క్రయోలైట్ బ్లూ, యురానోలిత్ గ్రే , మాగ్మా ఆరెంజ్ రంగులలో ఇది లభ్యం. (సుజుకి కొత్త స్కూటర్, అదిరే ఫీచర్స్, ప్రీమియం లుక్, ధర ఎంతంటే?) స్మార్ట్ఫోన్లపై యూజర్ల అంచనాలకు అనుగుణంగా 15 వేల లోపు రేంజ్ 13 జీబీ ర్యామ్తో Helio G99 ప్రాసెసర్ని ఏకైక స్మార్ట్ఫోన్ పోవా-4ని పరిచయం చేయడం సంతోషంగా ఉందని టెక్నో మొబైల్ ఇండియా సీఈవో అరిజీత్ తలపాత్ర అన్నారు. (ట్రేడర్లకు గుడ్ న్యూస్: ఆర్బీఐ కీలక నిర్ణయం) టెక్నో పోవా-4 స్పెసిఫికేషన్లు 6.82-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత HiOS 12.0 MediaTek Helio G99 ప్రాసెసర్ 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 1 టీబీ దాకా విస్తరించుకునే సదుపాయం AI లెన్స్తో జతచేసిన 50 ఎంపీ డ్యుయల్రియర్ కెమెరా 8ఎంపీ సెల్పీ కెమెరా 6000ఎంఏహెచ్ బ్యాటరీ -
వివో వైఓ2, ట్రెండీ ఫీచర్లు, ధర పదివేల లోపే!
సాక్షి, ముంబై: వివో బడ్జెట్ ధరలో కొత్తస్మార్ట్ఫోన్ను తీసుకొచ్చింది. వై సిరీస్ కింద వివో వైఓ2 పేరుతో తీసుకొచ్చిన ఈ సరికొత్త స్మార్ట్ఫోన్ ప్రారంభ ధరను రూ. 8,999గా నిర్ణయించడం విశేషం. ఐ ప్రొటెక్షన్ మోడ్, ఆండ్రాయిడ్ 12, మీడియా టెక్ చిప్, 5000 mAh బ్యాటరీ ఈ స్మార్ట్ఫోన్లో జోడించింది, vivo ఇండియా ఇ-స్టోర్, ఇతర భాగస్వామ్య రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంది. వివో వైఓ2 ఫీచర్లు 6.51-అంగుళాల హాలో ఫుల్ వ్యూ డిస్ప్లే 720x1600 పిక్సెల్ రిజల్యూషన్ MediaTek ఆక్టా-కోర్ ప్రాసెసర్తో Android 12 గో ఎడిషన్-ఆధారిత Funtouch OS 12 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 1టీబీ వరకు విస్తరించుకునే అవకాశం 8 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 5000 mAh బ్యాటరీ Trendy style and unmatched vibe. Unveiling the new #vivoY02 Buy Now : https://t.co/eDzazkRLla#ItsMyStyle #BuyNow pic.twitter.com/Pziuht03RY — vivo India (@Vivo_India) December 5, 2022 -
ఒప్పో ఏ58 5జీస్మార్ట్ఫోన్లాంచ్: సూపర్ ఫీచర్లు, ధర తక్కువ
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ తయారీదారు ఒప్పో లేటెస్ట్ స్మార్ట్ఫోన్ను తాజాగా విడుదల చేసింది. గత కొన్ని రోజులుగా వస్తున్న లీక్ల తరువాత ఎట్టకేటలకు ఒప్పో ఏ58 5జీ స్మార్ట్ఫోన్ను చైనాలో అధికారికంగా లాంచ్ చేసింది. ధర, లభ్యత ఏ సిరీస్లో తీసుకొచ్చిన ఒప్పో ఏ58 5జీ 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్(ఏకైక) ధరను 234 డాలర్లు (రూ. 19,123)గా నిర్ణయించింది. ట్రాంక్విల్ సీ బ్లూ, స్టార్ బ్లాక్ బ్రీజ్ పర్పుల్ రంగుల్లో దీన్ని లాంచ్ చేసింది. ప్రీ-ఆర్డర్కు నేటి (నవంబరు 8) నుంచి అందుబాటులో ఉంచగా, నవంబరు 10నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉండనుంది. ముందుగా కొనుగోలు చేస్తే వినియోగదారులు ఒప్పో వైర్డ్ ఇయర్ఫోన్లను ఉచితంగా అందిస్తోంది. అయితే ఇండియాలో ఎపుడు లాంచ్ చేసేదీ వివరాలు అందుబాటులో లేవు. ఒప్పో ఏ58 5జీ స్పెసిఫికేషన్స్ 6.56 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే 1612 x 720 పిక్సెల్ పిక్సెల్స్ రిజల్యూషన్ MediaTek డైమెన్సిటీ 700 SoC డ్యూయల్-కెమెరా (50ఎంపీ ప్రైమరీ కెమరా + 2 ఎంపీ డెప్త్ సెన్సార్) 8ఎంపీ సెల్ఫీ కెమెరా 5000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ -
నోకియా జీ60 5జీ సేల్స్ షురూ, ధర ఎంతంటే?
సాక్షి,ముంబై: నోకియా లేటెస్ట్ స్మార్ట్ఫోన్ జీ60 5జీ స్మార్ట్ఫోన్ సేల్ ప్రారంభమైంది. గత వారం లాంచ్ చేసిన నోకియా జీ60 5జీ ఇండియాలో నేటి(మంగళవారం)నుంచి ఫస్ట్ సేల్కు సిద్ధం. 5జీ నెట్వర్క్ సపోర్ట్(నాన్-స్టాండలోన్, స్టాండలోన్) 50 మెగాపిక్సెల్ కెమెరా తోపాటు ట్రిపుల్ రియర్ కెమెరా లాంటి కీలక ఫీచర్లతో ఇది వినియోగదారులకు అందుబాటులో ఉంది. నోకియా ఇండియా సైట్ ద్వారా దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ఫోన్ నలుపు, ఐస్ రంగుల్లో లభ్యం. ధర: 6 జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999గా ఉంది. నోకియా జీ60 5జీ స్పెసిఫికేషన్స్ 6.58 అంగుళాల ఫుల్ HD+ డిస్ప్లే నోకియా G60 5G స్నాప్డ్రాగన్ 695 5G SoC 120Hz రిఫ్రెష్ రేట్,1,080x2,400 పిక్సెల్స్ రిజల్యూషన్ 50+5+2 ట్రిపుల్ రియర్ కెమెరా 8ఎంపీ సెల్పీ కెమెరా 4500mAh బ్యాటరీ -
అత్యంత చవకైన లావా బ్లేజ్ 5జీ సేల్: కమింగ్ సూన్!
సాక్షి,ముంబై: ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ లావా అత్యంత చౌక ధరలో 5జీ స్మార్ట్ఫోన్ను దేశీయ మార్కెట్లో అందుబాటులోకి తేనుంది. లావా బ్లేజ్ 5జీ పేరుతో గత నెల ఇండియా మొబైల్ కాంగ్రెస్ -2022లో ఆవిష్కరించిన సంస్థ ఇక యూజర్లకు త్వరలోనే అందించనుంది. దేశంలోనే అత్యంత చౌక 5జీ స్మార్ట్ఫోన్ ఇదని కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. భారీ డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా లాంటి ఫీచర్లున్న ఈ ఫోన్ ధర రూ. 10999గా ఉంటుందని అంచనా. గ్రీన్ , బ్లూ రంగుల్లో అమెజాన్ ద్వారా విక్రయానికి అందుబాటులోకి రానుంది. లావా 5జీ బ్లేజ్ స్పెసిఫికేషన్స్ 6.5-అంగుళాల హెచ్డీ + ఎల్సీడీ డిస్ప్లే డైమెన్సిటీ 700 ప్రాసెసర్ ,ఆండ్రాయిడ్ 12 ఓఎస్ 1600×720 పిక్సెల్ రిజల్యూషన్ 50+2+2 టట్రిపుల్ ఎంపీ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ For those who live in the fast lane. Blaze 5G. Only on Amazon.#ComingSoon #Blaze5G #IndiaJeele5G #LavaMobiles #ProudlyIndian pic.twitter.com/MH2OZm0a1t — Lava Mobiles (@LavaMobile) November 3, 2022 -
నోకియా జీ60 5జీ: ఫ్రీ ఇయర్ బడ్స్, పరిచయ ఆఫర్ కూడా
సాక్షి,ముంబై: దేశీయ స్మార్ట్ఫోన్ తయారీదారు నోకియా మళ్లీ దూసుకొస్తోంది. ఎక్కువగా బడ్జెట్, మధ్య-శ్రేణి ఫోన్లకు పరిమిత మైన నోకియా తాజాగా 5జీ స్మార్ట్ఫోన్ లాంచ్ చేసింది. నోకియా జీ60 పేరుతో దీన్ని తీసుకొచ్చింది. 5జీ కనెక్టివిటీతో పాటు భారీ డిస్ప్లే , ట్రిపుల్ రియర్ కెమెరా ఈ స్మార్ట్ఫోన్ ప్రత్యేకతలుగా నిలవనున్నాయి. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ నోకియా జీ60 5జీ ధర రూ. 32,999గా నిర్ణయించిన కంపెనీ పరిచయ ఆఫర్గా రూ. 29,999కే అందిస్తోంది. బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్స్లో నవంబర్ 8 నుండి లభ్యం కానుంది. అలాగే ముందుగా బుక్ చేసుకున్న వారికి రూ.3,599 విలువైన నోకియా పవర్ ఇయర్ బడ్స్ ఉచితంగా అందిస్తుంది. ఈ ఆఫర్ ఈ నెల ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ ప్రకటించింది. నోకియా జీ60 5జీ స్పెసిఫికేషన్స్ 6.5-అంగుళాల డిస్ప్లే విత్ రీఫ్రెష్ రేట్ 120హెర్ట్జ్ 1080×2400 పిక్సెల్స్ ఫుల్ హెచ్డీ రిజల్యూషన్ 50+5+2 ఎంపీ టట్రిపుల్ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్పీ కెమెరా 4500ఎంఏహెచ్ బ్యాటరీ 20వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ -
ఇన్ఫినిక్స్ హాట్ సిరీస్: మరో బడ్జెట్ ఫోన్
సాక్షి,ముంబై: ఇన్ఫినిక్స్ మరో బడ్జెట్ స్మార్ట్ఫోన్ను పరిచయం చేసింది. ఇన్ఫినిక్స్ హాట్ సిరీస్లో భారీ బ్యాటరీతోపాటు, మీడియా టెక్ ప్రాసెసర్, పంచ్ హోల్ సెటప్తో ‘ఇన్ఫినిక్స్ హాట్ 10 ప్లే’ స్మార్ట్ఫోన్ను రివీల్ చేసింది. రేసింగ్ బ్లాక్, లూనా బ్లూ, అరోరా గ్రీన్, ఫాంటసీ పర్పుల్ నాలుగు రంగుల్లో ఇన్ఫినిక్స్ హాట్ 10 ప్లే లభ్యం కానుంది. ఈ ఫోన్ ధర,భ్యత వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఇన్ఫినిక్స్ హాట్ 10 ప్లే స్పెసిఫికేషన్స్ 6.82అంగుళాల IPS LCD డిస్ప్లే 1640 x 720 పిక్సెల్ల రిజల్యూషన్ 90Hz రిఫ్రెష్ రేట్ మీడియా టెక్ హీలియో జీ 37ప్రాసెసర్ 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ (విస్తరించుకునే అవకాశం) 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 13 ఎంపీ రియర్ కెమెరా 6, 000mAh బ్యాటరీ 18W ఛార్జింగ్ -
ఎఫర్డబుల్ ప్రైస్లో శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ఫోన్ కమింగ్ సూన్
సాక్షి, ముంబై: దక్షిణ కొరియా సంస్థ శాంసంగ్ గెలాక్సీ ఏ సిరీస్లో మరో సరికొత్త స్మార్ట్ఫోన్ను రిలీజ్ చేయనుంది. కంపెనీ తన అధికారిక వెబ్సైట్లో కీలక స్పెసిఫికేషన్లు , ఫీచర్లతో గెలాక్సీ ఏ04ఈ (Galaxy A04e) లిస్ట్ చేసింది. బ్లాక్, బ్లూ, కాపర్ ఇలా మూడు కలర్ ఆప్షన్లలో రానున్న ఈ ఫోన్ ధర, లభ్యతను ఇంకా వెల్లడించలేదు. అయితే వచ్చే నెలలో ఈ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేయవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే 13,499 రూపాయలువద్ద Galaxy A04s ప్రారంభించిన కొన్ని రోజుల తర్వాత వస్తున్న ఈ ఫోన్ ధరను వినియోగదారులకు అందుబాటు ధరలో సుమారు పదివేలలోపే నిర్ణయించవచ్చని అంచనా. శాంసంగ్ గెలాక్సీ ఏ04ఈ ఫీచర్ల అంచనాలు 6.5 అంగుళాల HD+ ఇన్-సెల్ టచ్ LCD స్క్రీన్ 60Hz రిఫ్రెష్ రేట్, ఆక్టా-కోర్ చిప్సెట్ 720 x 1600 pixels, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ 4 జీబీ ర్యామ్ 126 జీబీ స్టోరేజ్ ( 1టీబీ వరకు విస్తరించుకునే అవకాశం) 13 ఎంపీ+2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమరా 5 000mAh బ్యాటరీ -
200ఎంపీ కెమెరా, మోటరోలా కొత్త వేరియంట్, భారీ లాంచింగ్ ఆఫర్
సాక్షి,ముంబై: మోటరోలా తన కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ను తాజాగా భారత మార్కెట్లో లాంచ్ చేసింది. మోటరోలా ఎడ్జ్ 30 అల్ట్రా పేరుతో దీన్ని తీసుకొచ్చింది. 12 జీబీ, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ. 65,000 గా నిర్ణయించింది. (Diwali Gifts: గిఫ్ట్స్, బోనస్లు అందుకున్నారా? మరి ట్యాక్స్ ఎంతో తెలుసా?) ధర, లాంచింగ్ ఆఫర్ ఫ్లిప్కార్ట్ సహా, ఇతర ఆన్లైన్స్టోర్లలో రూ. 64,999 ధర వద్ద అందుబాటులో ఉంది. అయితే లాంచింగ్ ఆఫర్గా 56,999 రూపాయలకే అందిస్తోంది. దీంతో పాటు ఎస్బీఐ కార్డ్ కొనుగోళ్లపై 10 శాతం తక్షణ తగ్గింపుకూడా లభ్యం. మోటరోలా ఎడ్జ్ 30 అల్ట్రా ఫోన్ 8జీబీ వేరియంట్ను ఈ ఏడాది సెప్టెంబర్లో ఇండియాలో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. (Dhanteras 2022: బంగారు, వెండిపై ఫోన్పే క్యాష్ బ్యాక్ ఆఫర్) మోటరోలా ఎడ్జ్ 30 అల్ట్రా స్పెసిఫికేషన్స్ 6.67 FHD+ OLED డిస్ప్లే 144Hz రిఫ్రెష్ రేట్, 1500నిట్స్ స్నాప్డ్రాగన్ 8+ Gen1, ఆండ్రాయిడ్ 12 200+50+12ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 60 ఎంపీ సెల్ఫీ కెమెరా 4610 mAh బ్యాటరీ 125 వాట్ ఛార్జింగ్ -
మోటరోలా బడ్జెట్ ఫోన్ వచ్చేసింది..ధర చూస్తే పండగే!
సాక్షి, ముంబై: మోటరోలా కంపెనీ భారతీయ మార్కెట్లో కొత్త బడ్జెట్ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. మోటో ఈ 22 ఎస్ పేరుతో దీన్ని సోమవారం తీసుకొచ్చింది. MediaTek చిప్సెట్తో రూ. 10,000 ధరలోపే దీన్ని తీసుకు రావడం విశేషం. (వాట్సాప్ లేటెస్ట్ అప్డేట్స్: 5 ఫీచర్లు కమింగ్ సూన్) మోటో ఈ 22 ఎస్ ధరను రూ. 8,999గా నిర్ణయించింది. అక్టోబర్ 22 నుండి ఫ్లిప్కార్ట్తోపాటు, ప్రముఖ రిటైల్ స్టోర్లలో కొనుగోలుకు లభ్యం. 64 జీబీ వేరియంట్లో ఆర్కిటిక్ బ్లూ , ఎకో బ్లాక్ అనే రెండు రంగుల్లో ఈ స్మార్ట్ఫోన్ అందుబాటులోఉంటుంది. (ఫ్లిప్కార్ట్ బిగ్ దివాలీ సేల్: కస్టమర్లకు మరో గుడ్ న్యూస్ ) మోటో ఈ 22 ఎస్ స్పెసిఫికేషన్స్ 6.5అంగుళాల IPS LCD డిస్ప్లే Android 12, 1600x720 రిజల్యూషన్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 16+2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000mAh బ్యాటరీ ఇదీ చదవండి: రిలాక్స్ అండ్ రీ-ఎనర్జైజ్: ఉద్యోగులకు బ్రహ్మాండమైన దివాలీ ఆఫర్ -
మోటరోలా కొత్త స్మార్ట్ఫోన్, ధర తక్కువ, ఇక జియో ఆఫర్ తెలిస్తే!
సాక్షి, ముంబై: మోటరోలా కొత్త బడ్జెట్ స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. మోటో ఈ32 పేరుతో కొత్త ఎంట్రీ-లెవల్ స్మార్ట్ఫోన్ను ఇండియన్ వెర్షన్గా తీసుకొచ్చింది. మీడియా టెక్ హీలియో జీ 37 ప్రాసెసర్ను ఇందులో జోడించింది. ఇంకా IP52 వాటర్-రిపెల్లెంట్ డిజైన్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, రెండు సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్తో స్టాక్ ఆండ్రాయిడ్ 12తో ఈ స్మార్ట్ఫోన్ను అందుబాటులోకి తెచ్చింది. ధర, ఆఫర్లు ఈ స్మార్ట్ఫోన్ కేవలం ఒక వేరియంట్లో లభిస్తుంది. ధర రూ.10,499గా కంపెనీ నిర్ణయించింది. ఆర్కిటిక్ బ్లూ, ఎకో బ్లాక్ అనే రెండు రంగుల్లో, ఈ ఫోన్ ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంది. రిలయన్స్ జియో కొనుగోలుదారులకు రూ. 2,549 విలువైన రిలయన్స్ జియో ప్రయోజనాలను ఉచితం. రూ. 2వేల రూపాయల క్యాష్బ్యాక్, వార్షిక Zee5 సభ్యత్వంపై రూ. 549 తగ్గింపు ఇందులో భాగం. మోటో ఈ32 ఫీచర్లు 6.5 అంగుళాల HD+ IPS LCD స్క్రీన్ 4 జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్, 1 టీబీ వరకు విస్తరించుకునే అవకాశం 2MP డెప్త్ సెన్సార్, 50MP రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000mAh బ్యాటరీ,10W ఛార్జింగ్ -
బిగ్ బ్యాటరీ, బిగ్ స్క్రీన్, ధర మాత్రం ఏడువేల లోపే!
సాక్షి,ముంబై: రెడ్మీ అందుబాటులో ధరలో కొత్త స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. క్లీన్ ఆండ్రాయిడ్ 12,హీలియో ఏ22 చిప్, వాటర్డ్రాప్-స్టైల్ నాచ్తో రెడ్మి ఏ1 పేరుతో దీన్ని లాంచ్ చేసింది.ఈ ఎంట్రీ-లెవల్ ఫోన్ ధర రూ. 6,499గా ఉంచింది. సెప్టెంబర్ 9 నుండి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. భారతదేశంలో రెడ్మి ఏ1 ధర, విక్రయ తేదీ 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.6,499. సెప్టెంబర్ 9నుంచి షావోమివెబ్సైట్, మై హోమ్, అమెజాన్ రిటైల్ అవుట్లెట్లలో లభ్యం. లేత ఆకుపచ్చ, లేత నీలం, నలుపు మూడు రంగుల్లో లాంచ్ అయింది. రెడ్మి ఏ1 స్పెక్స్, ఫీచర్లు 6.52 అంగుళాల 720p డిస్ప్లే 8 ఎంపీ రియర్కెమెరా 5 ఎంపీ సెల్పీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 10W మైక్రో-యూఎస్బీ ఛార్జింగ్ సపోర్ట్ -
వాయిస్ విని వైరస్ గుట్టు చెప్పేస్తుంది
లండన్: కృత్రిమ మేథ మరో కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. కోవిడ్ జాడను ఇట్టే పసిగట్టి చెప్పే నూతన స్మార్ట్ఫోన్ యాప్ను శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు. ‘మనిషి గొంతు విని అతనికి కోవిడ్ సోకిందో లేదో ఈ యాప్ చెప్పగలదు. కోవిడ్ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కంటే ఎక్కువ ఖచ్చితత్వంతో ఫలితాలు ఇస్తుంది. ఎలాంటి ఖర్చు లేకుండా, త్వరగా, సులభంగా కోవిడ్ జాడ కనిపెట్టే విధానమిది. వాయిస్ను రికార్డ్ చేసి చెక్ చేస్తే సరిపోతుంది. నిమిషంలో ఫలితం వచ్చేస్తుంది. అల్పాదాయ దేశాల్లో ఇది ఎంతో ఉపయోగకరం’ అని పరిశోధకులు చెప్పారు. స్పెయిన్లోని బార్సిలోనా నగరంలో నిర్వహించిన యురోపియన్ రెస్పిరేటరీ సొసైటీ ఇంటర్నేషనల్ కాంగ్రెస్లో ఈ యాప్ సంబంధ వివరాలను బహిర్గతంచేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఈ యాప్ 89 శాతం ఖచ్చితత్వంతో పనిచేస్తుందని రీసెర్చ్లో పాల్గొన్న అధ్యయనవేత్తలు పేర్కొన్నారు. కోవిడ్ కారణంగా వ్యక్తి గొంతులో శ్వాస మార్గం, స్వరపేటికలు ఇన్ఫెక్షన్కు గురవుతాయి. దాంతో వచ్చిన మార్పులను ఈ యాప్ గుర్తిస్తుందని నెదర్లాండ్స్లోని మాస్ట్రిచ్ యూనివర్సిటీ మహిళా పరిశోధకులు వఫా అజ్బవీ చెప్పారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ గణాంకాల నుంచి సేకరించిన స్వరనమూనాలను ఈ యాప్లో పొందుపరిచారు. ఆరోగ్యవంతులు, అస్వస్తులైన వారివి కలిపి 4,352 మందికి చెందిన 893 ఆడియో శాంపిళ్లను తీసుకున్నారు. ఇందులో 308 మంది కోవిడ్ రోగుల వాయిస్లూ ఉన్నాయి. యాప్ టెస్ట్లో భాగంగా నోటితో మూడు నుంచి ఐదుసార్లు గట్టిగా శ్వాస తీసుకోవాలి. మూడు సార్లు దగ్గాలి. స్క్రీన్ మీద చిన్న వాక్యాన్ని చదవాలి. వీటిని రికార్డ్ చేసిన యాప్ నిమిషంలో ఫలితాలు చూపిస్తుంది. -
పోకో ఎం5 వచ్చేసింది.. లాంచింగ్ ఆఫర్, ధర, ఫీచర్లు
సాక్షి,ముంబై: పోకో మరో సరికొత్త స్మార్ట్ఫోన్ను తీసుకొచ్చింది. ఇండియాతోపాటు ప్రపంచ మార్కెట్లో పోకో ఎం5ని లాంచ్ చేసింది. పోకో ఎం 4 M4 సిరీస్ సక్సెసర్ కొన్ని అప్గ్రేడ్లతో దీన్నివిడుదల చేసింది. భారతదేశంలో పోకో ఎం5 ధర, ఆఫర్ 4జీబీ ర్యామ్, 64 జీబీస్టోరేజ్ ధర రూ.12,499 6 జీబీ ర్యామ్, 128 జీబీస్టోరేజ్ మోడల్ ధర రూ.14,499 ఎల్లో, ఐసీ బ్లూ , పవర్ బ్లాక్ మూడు రంగుల్లో ఇవి లభ్యం. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్లో సెప్టెంబర్ 13న సేల్ షురూ కానుంది. అయితే పరిమిత కాలానికి విక్రయ ఆఫర్లను అందిస్తున్నట్లుపోకో తెలిపింది. రెండు వేరియంట్లపై రూ. 1500 తగ్గింపును అందిస్తోంది. అంటే వీటిని వరుసగా రూ. 10,999 ప్రారంభ ధరతో రూ. 12,999కి కొనుగోలు చేయవచ్చు. పోకో ఎం5 స్పెసిఫికేషన్స్ 6.58అంగుళాల డిస్ప్లే 2400x1080 పిక్సెల్స్ రిజల్యూషన్ 50+2+2ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000mAh బ్యాటరీ, 18W ఛార్జింగ్ సపోర్ట్ -
వివో నుంచి స్లిమ్ ఫోన్ ‘వై35’: ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
న్యూఢిల్లీ: వివో సంస్థ వై35 స్మార్ట్ఫోన్ను దేశీ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది చాలా స్లిమ్గా, నాజూకుగా ఉంటుందని సంస్థ ప్రకటించింది. ఇందులో స్నాప్డ్రాగన్ 680 చిప్సెట్ ఉంటుంది. 6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 90 గిగాహెర్జ్ రీఫ్రెష్ రేటు, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ ఫ్లాష్ చార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ ధర రూ.18,499. రెండు రంగుల్లో లభిస్తుంది. డాన్ గోల్డ్, అగేట్ బ్లాక్ రంగుట్లో వివో ఇండియా ఆన్లైన్ స్టోస్టోర్తోపాటు దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్లలో లభిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, కోటక్ బ్యాంక్ కార్డులపై రూ.1,000 క్యాష్బ్యాక్నుసెప్టెంబర్ 30వరకు అందిస్తున్నట్టు వివో ప్రకటించింది. -
రియల్మీ 5జీ ఫోన్, ఇయర్ బడ్స్ లాంచ్: ఇంత తక్కువ ధరలోనా సూపర్!
సాక్షి,ముంబై: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ రియల్ మీ కొత్త 5జీ మొబైల్ని విడుదల చేసింది. Realme 9i పేరుతో భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. దేశంలో 5జీ సేవలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో 9ఐకి 5జీ వెర్షన్ ఫోన్ను తీసుకొచ్చింది. మూడు రంగుల్లో రెండు వేరియంట్లలో ఇది అందుబాటులో ఉంటుంది. చదవండి : నా 30 ఏళ్ల అనుభవంలో తొలిసారి: ఎయిర్టెల్ చైర్మన్ ఆశ్చర్యం, ప్రశంసలు ధరలు, లభ్యత, ఆఫర్లు 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ. 14,999. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ ధర రూ. 16,999 ఈ స్మార్ట్ఫోన్ ఆగస్టు 24, మధ్యాహ్నం 12 గంటల నుంచి రియల్ మీషోరూంలు, ఫ్లిప్కార్ట్లో లభ్యం. అలాగే లాంచింగ్ ఆఫర్గా రూ. 1000 తగ్గింపు ఆఫర్ను కూడా సంస్థ ప్రకటించింది. అంటే ముందుగా కొనుగోలు చేసిన వారికి 13,999, 15999ల రేంజ్లో ఈ ఫోన్లను సొంతంచేసుకోవచ్చు. (చదవండి: ప్రత్యేక డిపాజిట్ స్కీమ్: లక్ష డిపాజిట్ చేస్తే దాదాపు లక్షా 28 వేలు!) Realme 9i 5జీ ఫీచర్లు 6.6 అంగుళాల డిస్ప్లే, Dimensity 810 చిప్సెట్ 2,400×1,800 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 12 ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ 90 హెర్జ్ రీఫ్రెష్ రేటు 50 ఎంపీ ప్రైమరీ కెమెరాగా ట్రిపుల్ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరాతో 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో 18 వాట్ చార్జర్ T100 ఇయర్ బడ్స్ Realme కొత్త 5G ఫోన్తో పాటు Realme Buds T100ని కూడా లాంచ్ చేసింది. T100 రూ. 1499 గాకంపెని నిర్ణయించింది. ఇవి మొత్తం 28 గంటల ప్లేబ్యాక్ సమయం, T100 ఫాస్ట్ ఛార్జింగ్కు మద్దతు ఇస్తాయని కంపెనీ తెలిపింది. రాకిన్ రెడ్, పాప్ వైట్, జాజ్ బ్లూ , పంక్ బ్లాక్ నాలుగు రంగుల్లో ఇవి లభ్యం. -
వన్ప్లస్ 10టీ 5జీ వచ్చేసింది.. ఆఫర్ అదిరింది!
సాక్షి,ముంబై: చైనా స్మార్ట్ఫోన్ మేకర్ వన్ప్లస్ కొత్త మొబైల్ను లాంచ్ చేసింది. వన్ప్లస్10టీ పేరుతో దీన్ని ఇండియన్ మార్కెట్లో తీసుకొచ్చింది. ఈ 5జీ మొబైల్ ప్రారంభ ధర రూ. 49,999గా ఉంచింది. వన్ప్లస్ 10 సిరీస్లో ఇంతకుముందు తీసుకొచ్చిన వన్ప్లస్ ప్రో కంటే అప్గ్రేడ్ వెర్షన్గా వచ్చింది. అలాగే తొలి వన్ఫ్లస్ 16 జీబీ స్మార్ట్ఫోన్. ఐకానిక్ అలర్ట్ స్లైడర్ను తొలగించిన తొలి వన్ప్లస్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ కూడా ఇదే.. (చదవండి: గుడ్ న్యూస్: డీజిల్ ఎగుమతులపై విండ్ఫాల్ ట్యాక్స్ కోత) ధర,ఆఫర్, లభ్యత) 8జీబీ/128 జీబీ స్టోరేజ్ధర రూ. 49,999. 12 జీబీ, 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 54,999. 16 జీబీ, 256 జీబీ ధర రూ.55,999. అయితే ఐసీఐసీఐ, లేదా ఎస్బీఐ కార్డుల ద్వారా OnePlus 10T 5జీని కొనుగోలు చేస్తే, వినియోగదారులు రూ. 5,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. అంటే 8జీబీ/128 జీబీ స్టోరేజ్ధర రూ. 44,999, 12 జీబీ, 256 జీబీ స్టోరేజ్రూ. 49,999, 16 జీబీ, 256 జీబీ రూ. 50,999లకే సొంతం చేసుకోవచ్చు. మూన్స్టోన్ బ్లాక్ , జేడ్ గ్రీన్ కలర్స్లో, మూడు స్టోరేజ్ ఆప్షన్లలో లభ్యం. OnePlus 10T ప్రీ బుకింగ్ షురూ అయ్యాయి. ఓపెన్ సేల్స్ ఆగస్టు 6న ప్రారంభం కానున్నాయి. అమెజాన్, వన్ప్లస్ అధికారిక వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. వన్ప్లస్ 10టీ 5జీ ఫీచర్లు 6.7 అంగుళాల ఫుల్ HD+ AMOLED ప్యానెల్ క్వాల్కం స్నాప్డ్రాగన్ 8+ Gen 1 చిప్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజన్ OS 12.1 50 + 8 + 2ఎంపీ ట్రిపుల్ వెనుక కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 4800mAh బ్యాటరీ 150W ఛార్జింగ్ ఇదీ చదవండి: Fortune Global 500: రిలయన్స్ హైజంప్, ర్యాంకు ఎంతంటే? -
వన్ప్లస్కి పోటీ: ఐకూ 9టీ 5జీ వచ్చేసింది..ధర ఎంతంటే?
సాక్షి, ముంబై: వివో అనుబంధ సంస్థ ఐకూ కొత్త స్మార్ట్ఫోన్ను ఇండియాలో లాంచ్ చేసింది. ఐకూ 9టీ 5జీ పేరుతో దీన్ని తీసుకొచ్చింది. స్నాప్డ్రాగన్ 8+ Gen 1 చిప్సెట్, పంచ్-హోల్ డిజైన్తో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, నాలుగు రియర్ కెమెరాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయ. ఆప్టిమైజ్ ఫోటోగ్రఫీ అనుభవం కోసం Vivo V1+ ఇమేజ్ ప్రాసెసింగ్ చిప్ ను ఇందులో అమర్చింది. మరోవైపు వన్ప్లస్ రేపే( ఆగస్టు 3న ) వన్ ప్లస్10టీ లాంచ్కు సిద్ధమవుతున్న తరుణంలో ఐకూ 9టీ 5జీ విడుదల కావడం విశేషం. ఐకూ 9టీ 5జీ ఫీచర్లు 6.78 అంగుళాల E5 AMOLED ఫ్లాట్ డిస్ప్లేను పూర్తి HD+ రిజల్యూషన్, ఆండ్రాయిడ్ 12 16మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 50ఎంపీ మెయిన్ కెమెరా, 13+2+12 ఎంపీ కెమెరాలు 4,700mAh బ్యాటరీ, W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ధరలు, లభ్యత 8జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్+ 256 స్టోరేజ్ రెండు కాన్ఫిగరేషన్లలో లాంచ్ అయింది. వీటి ధరలు వరుసగా రూ.49,999 , రూ.54,999. బ్లాక్ అండ్ వైట్ కలర్ ఆప్షన్స్లో లభ్యం. iQOO 9T 5G iQOO ఇండియా వెబ్సైట్ ద్వారా సేల్ షేరూ అయింది. iQOO.com ద్వారా 9Tని కొనుగోలు చేసిన వారికి రూ. 3,999 విలువైన గేమ్ప్యాడ్ ఉచితం. అమెజాన్ ఆగస్టు 4 నుంచి అందుబాటులో ఉంటుంది. ICICI బ్యాంక్ ఆఫర్తో, వినియోగదారులు రూ. 4,000 తగ్గింపును అందిస్తోంది.అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్ 12 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. -
టర్బో ప్రాసెసర్, భారీ కెమెరా, అతితక్కువ ధర: ‘వివో టీ1ఎక్స్’
సాక్షి, ముంబై: మొబైల్ మేకర్ వివో తన కొత్త స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. T-సిరీస్లో కొత్త వెర్షన్ను బడ్జెట్ ధరలో కస్టమర్లకు అందించనుంది. వివో టీ1 ఎక్స్ పేరుతో, మూడు వేరియంట్లలో ఈ మొబైల్ను బుధవారం తీసుకొచ్చింది. వివో టీ1 ఎక్స్ బేసిక్ మోడల్ ధరను ధర రూ. 11,999గా ఉంచింది. వివో టీ1 ఎక్స్ ఫీచర్లు 6.58 అంగుళాల FHD+ డిస్ప్లే క్వాల్కం స్నాప్డ్రాగన్ 680 చిప్సెట్ ఆండ్రాయిడ్ 12 OS 50MP డ్యూయల్ కెమెరాలు 8MP సెల్ఫీ కెమెరా 5000mAh బ్యాటరీ ,18W ఫాస్ట్ ఛార్జింగ్ ధరలు, లభ్యత 4 జీబీ ర్యామ్+ 64జీబీ స్టోరేజ్ రూ. 11,999, 4 జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ రూ. 10,999 6 జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్రూ. 14,999 గ్రావిటీ బ్లాక్ , స్పేస్ బ్లూ కలర్ ఆప్షన్స్లో లభ్యం. ఫ్లిప్కార్ట్ వివో ఇ-స్టోర్ ద్వారా జూలై 27వ తేదీ నుండి మధ్యాహ్నం 12 గంటలనుంచి కొనుగోలుకు అందుబాటులో ఉండనుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డుల కొనుగోళ్లపై రూ. 1,000 తక్షణ తగ్గింపును అందిస్తుంది. Arm yourself with the all-new #vivoT1x that gets you, and your action-packed life! Take your gaming experiences to the max with Turbo Snapdragon 680 Processor, while you stay uber cool with the Segment’s First Turbo 4 Layer Cooling System. Sale starts 27th July on @Flipkart pic.twitter.com/YhIlm5MQye — Vivo India (@Vivo_India) July 20, 2022 -
వన్ప్లస్ నార్డ్ 2టీ 5జీ లాంచ్, ఫీచర్లు చూశారా?
సాక్షి, ముంబై: ప్రముఖ మొబైల్ తయారీదారు వన్ప్లస్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ వన్ప్లస్ ‘నార్డ్ 2టీ’ 5జీ ని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. జూలై 5 నుంచి కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుది. ఈ స్మార్ట్ఫోన్ కొనుగోలుపై లాంచింగ్ ఆఫర్లు, డిస్కౌంట్లను కంపెనీ అందిస్తోంది. 8జీబీ ర్యామ్/ 125 స్టోరేజ్, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో లభించనుంది. ఆఫర్లు, లభ్యత: అమెజాన్, వన్ప్లస్ స్టోర్లతో పాటు దేశంలోని ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ను కొనుగోలు చేయవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్లు ఉపయోగించి కొనుగోలు చేసే వినియోగదారులు రూ.1,500 తక్షణ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. అంటే రూ. 27,499 లకే సొంతం చేసుకోవచ్చన్నమాట. 8జీబీ ర్యామ్, 125 స్టోరేజ్ వేరియంట్ ధర రూ. రూ. 28,999 12 జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజహ మోడల్ ధరను రూ. 33,999 గ్రే షాడో అలాగే జేడ్ ఫాగ్ రెండు కలర్ ఆప్షన్లలో లభ్యం. ‘నార్డ్ 2టీ’ 5జీ ఫీచర్లు 6.43 అంగుళాల AMOLED డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ ఆక్సిజన్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ 50+8+2 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 4500 ఎంఏహెచ్ డ్యూయల్-సెల్ బ్యాటరీ,80W SuperVOOC ఛార్జింగ్ Sorry to keep you waiting folks. But we're almost there. #OnePlusNord2T coming soon. Get Notified: https://t.co/oEqZLKClpD pic.twitter.com/73Z3jUD0Sc — OnePlus India (@OnePlus_IN) July 2, 2022 -
వన్ప్లస్ లవర్స్కు గుడ్ న్యూస్ ‘నార్డ్ 2 టీ’..కమింగ్ సూన్
సాక్షి, ముంబై: చైనీస్ స్మార్ట్ఫోన్ మేకర్ వన్ప్లస్ తన నార్డ్ 2 సిరీస్లో కొత్త మొబైల్ను లాంచ్ చేయనుంది. వన్ప్లస్ నార్డ్ 2 టీ (5జీ)పేరుతో జూలై 1న ఈ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేయనుంది. ఈ మేరకు నోటిఫై పేజ్ను కూడా లాంచ్ చేసింది. కంపెనీ అధికారిక వెబ్సైట్తో అమెజాన్ ద్వారా కూడా వన్ప్లస్ నార్డ్ 2 టీ లభించనుంది. ఇప్పటివరకు యూరప్ , యునైటెడ్ కింగ్డమ్లో మాత్రమే లభ్యమవుతున్న ఈ స్మార్ట్ఫోన్ జూలై 1న భారత మార్కెట్లో కూడా తీసుకొస్తోంది. ఈ మేరకు కమింగ్ సూన్ ల్యాండింగ్ పేజీని సెటప్ చేసింది. 6 జీబీ ర్యామ్, 128 జీబీస్టోరేజ్బేస్ వెర్షన్తోపాటు, హై-ఎండ్ వేరియంట్గా 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ను అందించనుంది. వన్ప్లస్ నార్డ్ 2 టీ ఫీచర్లు 6.43 అంగుళాల డిస్ప్లే ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 50 +8+2 ఎంపీ రియర్ ట్రిపుల్ కెమెరా 4,500mAh బ్యాటరీ 80W సూపర్ ఛార్జింగ్ ధరలు : బేస్ వేరియంట్ధర రూ. 28,999. హై ఎండ్ వేరియంట్ ధర రూ. 33,999 ఉంటుందని అంచనా. -
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 : ఫీచర్లు, ధర ఎలా ఉంటాయి?
సాక్షి,ముంబై: శాంసంగ్ బడ్జెట్ ధరలో ‘గెలాక్సీ ఎఫ్ 13’ అనే కొత్త స్మార్ట్ ఫోన్ను ఆవిష్కరించనుంది. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆన్లైన్ ద్వారా దీన్ని తీసుకొస్తోంది. శాంసంగ్ అధికారిక వెబ్సైట్తోపాటు, ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ గెలాక్సీ ఎఫ్13 ఫోన్ విక్రయానికి రానుంది. బడ్జెట్ ధరలో, అందులోనూ అంతేకాదు ఆటో డేటా స్విచింగ్ సదుపాయంతో కంపెనీ తొలిఫోన్ను లాంచ్ చేయనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 13 ఫీచర్లు , అంచనాలు 6.6 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే ఆండ్రాయిడ్ 12 ఓఎస్, ఎక్సినోస్ 850 ప్రాసెసర్ 8జీబీ ర్యామ్ 50 ఎంపీ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్ చార్జర్ పింక్, గ్రీన్, బ్లూ రంగుల్లో లభించనున్న గెలాక్సీ ఎఫ్ 13 ధర సుమారు రూ.12వేల గా ఉంటుందని అంచనా. -
అతి తక్కువ ధరలో రియల్మీ కొత్త ఫోన్ వచ్చేస్తోంది!
సాక్షి, ముంబై: చైనీస్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం రియల్మీ మరో కొత్త స్మార్ట్ఫోన్ను ఈరోజు భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. సీ-సిరీస్లో రియల్మీ సీ30 పేరుతో ఎంట్రీ లెవల్ ఫోన్ను ఈ రోజు (జూన్ 20) మధ్యాహ్నం తీసుకొస్తోంది. రియల్మీ వెబ్సైట్, ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ సార్ట్ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. మరికొద్ది గంటల్లో లాంచ్ కానున్న ఈ స్మార్ట్ఫోన్ ఫీచర్లపై అంచనాలు ఇలా ఉన్నాయి. రియల్మీ సీ 30 ఫీచర్లు 6.6-అంగుళాల ఫుల్ హెచ్ + డిస్ప్లే వాటర్డ్రాప్-స్టైల్ నాచ్ డిస్ప్లే ఆక్టా-కోర్ Unisoc T612 SoC 13 ఎంపీ ప్రైమరీ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 5,000ఎంఏహెచ్ బ్యాటరీని 2 జీబీ రామ్, 32 జీబీ స్టోరేజ్, 3జీబీ ర్యామ్+32 జీబీ స్టోరేజ్ అనే రెండు వేరియంట్లలో బ్యాంబూ గ్రీన్, డెనిమ్ బ్లాక్, లేక్ బ్లూ కలర్స్లో అందుబాటులో ఉండనుంది. ఖచ్చితమైన ధర ఇంకా వెల్లడి కాలేదు. అయితే ప్రారంభ ధర రూ. 7వేలుగా ఉంటుందని అంచనా. -
ఒప్పో సూపర్ 5జీ ఫోన్ లాంచ్, వివరాలు ఇలా ..
సాక్షి, ముంబై: ప్రముఖ మొబైల్ తయారీదారు ఒప్పో కొత్త స్మార్ట్ఫోన్ను తీసుకొచ్చింది. 33W ఫాస్ట్ ఛార్జింగ్కు మద్దతుతో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో ‘ఒప్పో కే 10 5జీ’ స్మార్ట్ఫోన్ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. వర్చువల్ ఈవెంట్ ద్వారా ఈ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. ఒప్పో కే10 5జీ ఫీచర్లు 6.56 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే ఆండ్రాయిడ్12 MediaTek డైమెన్సిటీ 810 సాక్ చిక్ 8జీబీ ర్యామ్ 128 జీబీ ఇంటర్నల్ మెమొరీ 48+2 ఎంపీ రియర్ డ్యూయల్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీకెమెరా 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఇంకాసైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు , 5జీబీ వరకు డైనమిక్ RAM విస్తరణ, సెల్ఫీ కెమెరాతో ఫేస్ అన్లాక్ మెకానిజం లాంటి ఇతర ఫీచర్లు ఈ స్మార్ట్ఫోన్లో పొందుపర్చింది. ఒప్పో కే10 5జీ ధర: ఇండియాలో ప్రస్తుతం ఒక వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఓషన్ బ్లూ , మిడ్నూట్ బ్లాక్ రెండు రంగుల్లో లభ్యం. దీని ధరను రూ. 17,499 గా నిర్ణయించింది. బ్యాంకు ఆఫర్స్: ఎస్బీఐ యాక్సిస్ బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్లతో బ్యాంక్ ఆఫర్లు కూడా అందిస్తోంది. వినియోగదారులు రూ. 1500 ఫ్లాట్ తగ్గింపును పొందవచ్చు. జూన్ 15, 2022 12 గంటలనుంచి ఫ్లిప్కార్ట్, ఒప్పో ఆన్లైన్ స్టోర్లో అందుబాటులో ఉంటుంది. Sleek style, fine features, and quick as light! The #OPPOK105G is here to raise the bar and give you the best experience a smartphone can. Sale starts from 15th June, 12PM on @Flipkart.#LiveWithoutLimits #Stylish5GPerformer Get notified: https://t.co/UEVFLOIg7G pic.twitter.com/rb4Y1MQUTT — OPPO India (@OPPOIndia) June 8, 2022 -
మోటోరోలా నుంచి మరో అద్భుతమైన స్మార్ట్ఫోన్..!
ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం మోటోరోలా భారత మార్కేట్లోకి మరో మోటో జీ సీరీస్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేయనుంది. తాజాగా మోటో జీ సిరీస్లో భాగంగా మోటో జీ52 అనే కొత్త స్మార్ట్ఫోన్ను యూరోప్ మార్కెట్లలోకి పరిచయం చేసింది. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లలో కి లాంచ్ చేసేందుకు మోటోరోలా సన్నాహాలను చేస్తున్నట్లు సమాచారం. మోటో జీ52 సంబందించిన పలు ఫీచర్స్ ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి. ఇక మోటో జీ 52 ఇండియా వెర్షన్ స్మార్ట్ ఫోన్ పీఓఎల్ఈడీ (pOLED) డిస్ప్లేతో రానుంది. ఈ స్మార్ట్ ఫోన్ అత్యంత తేలికైన, సన్నని స్మార్ట్ఫోన్ గా నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.మోటో జీ 52 స్మార్ట్ ఫోన్ కొద్ది రోజుల క్రితం లాంచ్ ఐనా.. మోటో జీ 51 కి కొనసాగింపుగా రానుంది. యూరప్ లో మోటో జీ 52 249 యూరోలు (దాదాపు రూ. 20,600)గా నిర్ణయించారు. ఇక భారత మార్కెట్లలో ఈ స్మార్ట్ ఫోన్ ధర 20 వేల కంటే తక్కువ ధరలో వుండే అవకాశం ఉంది. ఈ స్మార్ట్ఫోన్ చార్కోల్ గ్రే, పింగాణీ వైట్ (Porcelain White) కలర్ ఆప్షన్స్ లో వస్తుంది. మోటో జీ52 స్పెసిఫికేషన్ (అంచనా) 6.6-అంగుళాల FHD+ pOLED డిస్ప్లే స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ 4జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 12 50ఎంపీ+8ఎంపీ+2ఎంపీ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 30W టర్బో పవర్ ఛార్జింగ్ సపోర్ట్ 5,000ఎంఏహెచ్ బ్యాటరీ -
తక్కువ ధరలో వన్ప్లస్ నుంచి మరో సూపర్ స్మార్ట్ఫోన్..! ఫీచర్స్ లీక్..!
ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం వన్ప్లస్ తక్కువ ధరలో మరో సూపర్ స్మార్ట్ఫోన్ను భారత్లో రిలీజ్ చేయనుంది. ఈ స్మార్ట్ఫోన్ వన్ప్లస్ నార్డ్ సీఈకు కొనసాగింపుగా వన్ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ రానున్నట్లు తెలుస్తోంది. వన్ప్లస్ నార్డ్ సీఈ కంటే తక్కువ ధరలోనే..! గత ఏడాది వన్ప్లస్ బడ్జెట్ ఫ్రెండ్లీ 5జీ స్మార్ట్ఫోన్ కేటాగిరీలో వన్ప్లస్ నార్డ్ సీఈ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ఫోన్ కంటే తక్కువ ధరలోనే Nord CE 2 ను విడుదల చేసేందుకు వన్ప్లస్ సిద్ధమవుతోంది. అంతేకాకుండా మొదట భారత్లోనే లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వన్ప్లస్ నార్డ్ సీఈ స్మార్ట్ఫోన్ ధర రూ. 20 వేల నుంచి మొదలుకానుంది. దీనికంటే తక్కువ ధరకే వన్ప్లస్ నార్డ్ సీఈ 2 రానుంది. OnePlus Nord CE 2 Lite 5G ఫీచర్స్ అంచనా..! 6.59-అంగుళాల ఫుల్ HD+ ఫ్లూయిడ్ డిస్ప్లే ఆండ్రాయిడ్ 12 OxygenOS Qualcomm Snapdragon 695 చిప్సెట్ 64ఎంపీ+2ఎంపీ+2ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 16ఎంపీ ఫ్రంట్ కెమెరా 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ 5,000mAh బ్యాటరీ 5జీ సపోర్ట్ చదవండి: రూ. 2,83,666 కోట్ల విలువైన స్మార్ట్ఫోన్స్..! ఇండియన్స్ ఫేవరెట్ బ్రాండ్ అదే..! -
బడ్జెట్ ధరలో, బిగ్ బ్యాటరీ సపోర్ట్తో శాంసంగ్ నుంచి సరికొత్త స్మార్ట్ఫోన్..!
ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం శాంసంగ్ భారత మార్కెట్లలోకి కొత్త బడ్జెట్ స్మార్ట్ఫోన్ ‘శాంసంగ్ గెలాక్సీ ఏ3 కోర్’ను సోమవారం విడుదల చేసింది. ఈ స్మార్ట్ఫోన్ 5000ఎంఏహెచ్ బ్యాటరీతో రానుంది. బ్లాక్, బ్లూ కలర్ వేరియంట్స్తో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. 2జీబీ+32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తో శాంసంగ్ గెలాక్సీ ఏ3 కోర్ రానుంది. ఈ స్మార్ట్ఫోన్ను కంపెనీ అధికారిక వెబ్సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చును. అంతేకాకుండా ప్రముఖ ఆన్లైన్ పోర్టల్స్లో కూడా లభిస్తాయి. శాంసంగ్ గెలాక్సీ ఏ3 కోర్ ధర రూ. 7999. ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సిస్టమ్తో రానుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ3 కోర్ ఫీచర్స్..! 6.5-అంగుళాల ఇన్ఫినిటీ-V డిస్ప్లే ఆక్టా-కోర్ యునిసోక్ SC9863A ప్రాసెసర్ 2జీబీ ర్యామ్+32 ఇంటర్నల్ స్టోరేజ్ 8ఎంపీ రియర్ కెమెరా 5ఎంపీ ఫ్రంట్ కెమెరా 5000ఎంఏహెచ్ బ్యాటరీ చదవండి: గూగుల్లో పిజ్జా సింబల్ క్లిక్ చేస్తే ఏమవుతుంది? అసలు ‘పిజ్జా’ విలువ ఎంతంటే.. -
పవర్ఫుల్ ర్యామ్తో రెడ్మీ నుంచి సరికొత్త స్మార్ట్ఫోన్..! ధర ఎంతంటే..!
ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ భారత మార్కెట్లలోకి రెడ్మీ నోట్ 10 సిరీస్లో భాగంగా మరింత పవర్ఫుల్ స్టోరేజ్ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. రెడ్మీ నోట్ 10ఎస్ స్మార్ట్ఫోన్లో పవర్ఫుల్ ర్యామ్ను అమర్చారు. 8జీబీ ర్యామ్+128జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో రానుంది. రెడ్మీ నోట్ 10ఎస్ 6జీబీ ర్యామ్+64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ను ఎప్పుడో లాంచ్ చేసింది. 8జీబీ ర్యామ్ రెడ్మీ నోట్ 10ఎస్ వేరియంట్ కొనుగోలుదారులకు డిసెంబర్ 3 నుంచి అందుబాటులో ఉండనుంది. దీని ధర రూ. 17,499గా ఉండనుంది. ఈ స్మార్ట్ఫోన్ను కంపెనీ అధికారిక వెబ్సైట్ ఎంఐ. కామ్, అమెజాన్, ఎంఐ హోమ్స్ స్టోర్స్ కొనుగోలు చేయవచ్చును. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు లేదా ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 1000 వరకు తక్షణ డిస్కౌంట్ లాంచింగ్ ఆఫర్ను అందిస్తోంది. చదవండి: శాంసంగ్ నుంచి చౌవకైన 5జీ స్మార్ట్ఫోన్..! రెడ్మీ నోట్10ఎస్ ఫీచర్స్ 6.43-అంగుళాల పూర్తి-హెచ్డీప్లస్ అమ్లోడ్ డిస్ప్లే మీడియాటెక్ హెలియో జీ95 ప్రాసెసర్స్ 8జీబీ ర్యామ్+128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ 64 ఎంపీ+8ఎంపీ+2ఎంపీ+2ఎంపీ క్వాడ్ రియర్ కెమెరా 13ఎంపీ ఫ్రంట్ కెమెరా 5,000mAh బ్యాటరీ 33W ఫాస్ట్ ఛార్జింగ్ చదవండి: ఇది స్మార్ట్ఫోనా..ల్యాప్ట్యాపా...! వివో నుంచి కళ్లుచెదిరే గాడ్జెట్..! -
అదిరిపోయే ఫీచర్లతో షావోమీ నుంచి 5జీ స్మార్ట్ఫోన్..!
ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ భారత మార్కెట్లలోకి సరికొత్త రెడ్మీ నోట్ 11టీ5జీ లాంచ్ చేసింది. గత నెలలో ఈ స్మార్ట్ఫోన్ చైనాలో విడుదలైంది. స్టార్డస్ట్ వైట్, అక్వామెరైన్ బ్లూ, మాటే బ్లాక్ కలర్ వేరియంట్స్తో రానుంది. 6జీబీ ర్యామ్+128జీబీ ఇంటర్నల్స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 16,999 కాగా, 8జీబీ ర్యామ్+128 జీబీ ఇంటర్నల్స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 17,999గా ఉండనుంది. డిసెంబర్ 7 నుంచి కొనుగోలుదారులకు షావోమీ అధికారక వెబ్సైట్తో పాటుగా అమెజాన్లో కూడా అందుబాటులో ఉండనుంది. రెడ్మీ నోట్ 11టీ 5జీ ఫీచర్స్ 6.6 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే విత్ 90 గిగాహెట్జ్ రిఫ్రెష్ రేట్ మీడియాటెక్ డైమెంసిటీ 810 ఎస్ఓసీ ప్రాసెసర్ 8జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఆండ్రాయిడ్ 11 ఆధారిత 12 ఎంఐయూఐ 5000ఎంఏహెచ్ బ్యాటరీ 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ చదవండి: ఓలాకు గట్టిపోటీ..! భారీ ప్రణాళికతో ఏథర్..! -
షావోమీ నుంచి నయా 5జీ స్మార్ట్ఫోన్..! ధర ఏంతంటే...!
ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ తాజాగా భారత మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. షావోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ను బుధవారం లాంచ్ చేసింది. షావోమీ ఈ స్మార్ట్ఫోన్తో పాటు షావోమీ బియర్డ్ ట్రిమర్ 2ను కూడా రిలీజ్ చేసింది. ధర విషయానికొస్తే ఈ ఫోన్ 6జీబీ+128 స్టోరేజ్ జీబీ స్టోరేజ్ ఫోన్ రూ. 26,999, 8జీబీ+128జీబీ స్టోరేజ్ ఫోన్ రూ. 28,999కి అందుబాటులో ఉంది. షావోమి ప్రారంభ ధరలో భాగంగా రూ. 2000తో పాటు దీపావళి డిస్కౌంట్లో భాగంగా రూ. 1500 అందించనున్నారు. షావోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ ఫీచర్స్ 6.55 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778జీ 5జీ ప్రాసెసర్ 8 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ 64 మెగా పిక్సెల్ రియర్ కెమెరా 20 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ 4,250ఎమ్ ఏహెచ్ బ్యాటరీ యూఎస్బీ టైప్సీ సపోర్ట్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింటర్ చదవండి: ఈ స్మార్ట్ఫోన్ కొనుగోలుపై ఐదు సంవత్సరాల వారంటీ...! -
వివో నుంచి మరో కొత్త ఫోన్..! ధర ఎంతంటే..!
ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ వివో భారత మార్కెట్లలోకి కొత్త మొబైల్ను లాంచ్ చేసింది. వివో కంపెనీ వై సిరీస్లో భాగంగా వివో వై 53 ఎస్ స్మార్ట్ఫోన్ను రిలీజ్చేసింది. ఈ స్మార్ట్ఫోన్ రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్, శాంసంగ్ గెలాక్సీ ఎం 51 వంటి స్మార్ట్ఫోన్లకు గట్టిపోటీని ఇవ్వనుంది. వివో వై53 స్మార్ట్ఫోన్ను మొదటిసారిగా వియత్నాంలో గతనెలలో లాంచ్ చేసింది. భారత్ మార్కెట్లో వివో వై53ఎస్ 8జీబీ+128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 19,490గా నిర్ణయించారు. డీప్ బ్లూ, ఫెంటాస్టిక్ రెయిన్బో కలర్ వేరియంట్లలో లభించనుంది. ఈ స్మార్ట్ఫోన్లను అమెజాన్, ఫ్లిప్కార్ట్, పేటీఎం, టాటాక్లిక్, బజాజ్ స్టోర్, వివో ఇండియా ఈ-స్టోర్లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. లాంచింగ్ ఆఫర్లలో భాగంగా వివోవై53 ఎస్ స్మార్ట్ఫోన్ను హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్పై కొనుగోలు చేస్తే రూ. 1500 క్యాష్బ్యాక్ రానుంది. వివో వై53ఎస్ ఫీచర్లు ఆండ్రాయిడ్ 11 ఆపరేటిండ్ సిస్టమ 6.58-అంగుళాల ఫుల్-హెచ్డి+ (1,080x2,400 పిక్సెల్స్) డిస్ప్లే 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో పాటు 20: 9 యాస్పెక్ట్ రేషియో మీడియాటెక్హెలియో జీ20 ప్రాసెసర్ 8జీబీ ర్యామ్+128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ యూఎస్బీ టైప్ సీ పోర్ట్ 64ఎమ్పీ రియర్ కెమెరా 16ఎమ్పీ ఫ్రంట్ కెమెరా 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ 5000ఎమ్ఏహెచ్ బ్యాటరీ -
మోస్ట్ పవర్ఫుల్ ఫోన్...ధర ఎంతంటే!
న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ పోకో మరొక మొబైల్ను లాంచ్ చేసింది. భారత్లో పోకో ఎక్స్ 3 ప్రోను మంగళవారం లాంచ్ చేసింది. గత ఏడాది సెప్టెంబర్లో వచ్చిన పోకో ఎక్స్3 కి అప్గ్రేడ్గా ఈ ఫోన్ రానుంది. పోకో ఎక్స్ 3 ప్రోలో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 860 చిప్ను అమర్చారు. పోకో ఎక్స్ 3 ప్రో క్వాడ్ రియర్ కెమెరాతో పాటు 120 హెర్ట్జ్ డిస్ప్లేను కలిగి ఉంది. పోకో ఫోన్ 25 జీబీ వరకు ఆన్బోర్డ్ స్టోరేజ్ కలిగి ఉంది. పోకో ఎక్స్ 3 ప్రో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 62, రియల్ మీ ఎక్స్ 7, వివో వి 20 మొబైల్ ఫోన్లతో పోటీపడనుంది. కాగా, పోకో ఎక్స్ 3 ప్రో( 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్) వేరియంట్కు రూ. 18,999 కాగా, (8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్) మోడల్ ధర రూ. 20,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ గోల్డెన్ బ్రాంజ్, గ్రాఫైట్ బ్లాక్, స్టీల్ బ్లూ కలర్ లో రానుంది. ఈ మొబైల్ ప్రముఖ ఈ కామర్స్ ఫ్లిప్కార్ట్లో ఏప్రిల్ 6, మధ్యాహ్నం 12 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఇక ఆఫర్ విషయానికి వస్తే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వినియోగదారులకు రూ.1000 వరకు 10శాతం డిస్కౌంట్ రానుంది. పోకో ఎక్స్ 3 ప్రో ఫీచర్స్ 6.67 అంగుళాల(1080*2400 పిక్సెల్స్) ఫుల్ హెచ్ డీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 11 సపోర్ట్ చేసే ఎంఐయుఐ12 క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 860 ప్రాసెసర్ హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ 48+8 ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సార్, 2 ఎంపీ మాక్రో కెమెరా 20 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ 3.5ఎంఎం ఆడియో జాక్, స్టీరియో స్పీకర్స్ 5160ఎంఏహెచ్ బ్యాటరీ 33వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.20,999 6జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.18,999 చదవండి: ఆండ్రాయిడ్ ఫోన్లలో కొత్త మాల్వేర్..! -
రియల్మీ 8 ప్రో : సూపర్ కెమెరా ఫీచర్లు
సాక్షి, ముంబై: స్మార్ట్ఫోన్స్ తయారీ కంపెనీ రియల్మీ తొలిసారిగా 108 మెగాపిక్సెల్ అల్ట్రా క్వాడ్ కెమెరాతో ఒక స్మార్ట్ఫోన్ ఆవిష్కరించింది. రియల్మీ8 ప్రో పేరుతో దీన్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. క్వాడ్ కెమెరాతోపాటు ప్రపంచంలో తొలిసారిగా స్టారీ టైమ్ ల్యాప్స్ వీడియో, టిల్ట్ షిఫ్ట్ టైమ్ ల్యాప్స్ వీడియో ఫీచర్లను జోడించినట్టు కంపెనీ తెలిపింది. రియల్మీ8 ప్రో ఫీచర్లు 6.40 అంగుళాల సూపర్ అమోలెడ్ ఫుల్ స్క్రీన్ డిస్ప్లే 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 720 జీ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 11 16 ఎంపీ సెల్పీ కెమెరా 108+ 8 + 2+ 2 ఎంపీ క్వాడ్ రియల్ కెమెరా 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ధరలు 6 జీబీ వేరియంట్ ధర రూ.17,999 8 జీబీ వేరియంట్ రూ.19,999 -
సూపర్ ఫీచర్లతో మోటరోలా మరో అద్భుతమైన ఫోన్
సాక్షి, ముంబై: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీదారు మోటరోలా అద్భుతమైన స్మార్ట్ఫోన్ను తీసుకురానుంది. రెడ్మి, రియల్మీ తరహాలో 108 మెగా పిక్సెల్ భారీ రియర్ కెమెరాతో ఫోన్ను లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. జీసిరీస్లో భాగంగా జీ 60 పేరుతో ఫ్లాగ్షిప్ స్పెసిఫికేషన్లతో ఆవిష్కరించనుంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్, 120 హెర్ట్జ్ డిస్ప్లేతోసాటు, డ్యుయల్ సెల్ఫీ కెమెరా ప్రధాన ఆకర్షణగా రానుందని అంచనా. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్సిసి) నుండి ధృవీకరణ లబించినఅనంతరం ఈ ఫోన్ భారతదేశంలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. 870 చిప్సెట్తో కూడిన మరో మోటరోలా ఫోన్ ఇది కావచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే జీ సిరీస్లో మోటో జీ100 ను మార్చి 25న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే పలు ఊహాగానాలు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఫోన్ ఫీచర్లపై అంచనాలు ఇలా ఉన్నాయి. (ఐటెల్ ఆండ్రాయిడ్ టీవీలు వచ్చేశాయ్!) మోటో జీ 60 ఫీచర్లు 6.78 అంగుళాల ఫుల్ హెచ్డి + డిస్ప్లే ఆండ్రాయిడ్ 11 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 108 మెగాపిక్సెల్ శామ్సంగ్ ఐసోసెల్ హెచ్ఎం 2 ప్రైమరీ సెన్సార్ 16 ఎంపీ, 8 ఎంపీ సెన్సార్ 2 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ 32 +16 ఎంపీ డ్యుయల్ సెల్ఫీ కెమెరా 6000 ఎంఏహెచ్ బ్యాటరీని -
సూపర్ ఫీచర్లు, తక్కువ ధర : వివో కొత్త ఫోన్
సాక్షి,ముంబై : ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ వివో కొత్త స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. డ్యూయల్ రియర్ కెమెరాలు, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వివో వై 12ఎస్ ను భారత్లో లాంచ్ చేసింది. వాటర్డ్రాప్ తరహా డిస్ప్లే నాచ్ లాంటి ఫీచర్లతో వచ్చిన బడ్జెట్ ఫోన్గా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. వివో వై 12 ఎస్ ధర, లభ్యత సింగిల్ వేరియంట్లో వివోవై12 ఎస్ లభ్యం. 3 జీబీ+ 32జీబీ స్టోరేజ్ వేరియంట్కు 9,990 రూపాయలుగా నిర్ణయించింది. ఈ స్మార్ట్ఫోన్ ఫాంటమ్ బ్లాక్, గ్లేసియర్ బ్లూ కలర్ ఆప్షన్లలో వస్తుంది. వివో ఇండియా ఆన్లైన్ స్టోర్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, పేటీఎం, టాటా క్లిక్, దేశంలోని ఇతర భాగస్వామి రిటైల్ దుకాణాల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. వివో వై 12ఎస్ స్పెసిఫికేషన్లు 6.51అంగుళాల హెచ్డీ డిస్ప్లే 720x1,600 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 10 ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో పీ 35 సాక్ 13+2 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ -
అద్భుతమైన ఇన్ నోట్ 1 లాంచ్ : ధర, ఫీచర్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ స్మార్ట్ఫోన్ యూజర్లు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ‘ఇన్’ సిరీస్ స్మార్ట్ఫోన్లను మైక్రోమాక్స్ మంగళవారం లాంచ్ చేసింది. ఇన్ నోట్ 1, ఇన్1బీ పేరుతో స్మార్ట్న్లను మంగళవారం లాంచ్ చేసింది. భారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లో తిరిగి రాబోతున్నట్లు ఇటీవల ప్రకటించిన కంపెనీ అద్భుత ఫీచర్లు, బడ్జెట్ ధరలతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తద్వారా భారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లో టాప్లో కొనసాగుతున్న షావోమి,రియల్మి లాంటి సంస్థలకు భారీ షాక్ ఇవ్వనుంది. డిజైన్ పరంగా అద్భుతమైన లుక్లో ఆకట్టుకుంటోంది. “ఇల్యూమి నేటింగ్ ప్రిజం పాటర్న్ అంటూ వెనుక ‘ఎక్స్’ పాటర్న్ ఆకర్షణీయంగా ఉంది. ఇన్ నోట్ 1ఫీచర్లు 6.67అంగుళాల పూర్తి హెచ్డీ + డిస్ప్లే ఆండ్రాయిడ్ 10 (స్టాక్ యుఐ) మీడియా టెక్హీలియో జీ 85 ప్రాసెసర్ 48+5+2+2 ఎంపీరియర ఏఐ క్వాడ్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీకెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 18 వా (టైప్-సి) ఫ్లిప్కార్ట్, సంస్థ వెబ్సైట్ ద్వారా నవంబరు 24 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. గ్రీన్ , వైట్ కలర్స్లో లభ్యం. ఇన్ నోట్ 1 ధరలు 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ధర రూ. 10999 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 12499 -
హానర్ 10ఎక్స్ లైట్.. ధర, ఫీచర్లు
సాక్షి,న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్ మిడ్ రేంజ్ ల కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. హానర్ 10ఎక్స్ లైట్ పేరుతో దీన్ని ఆవిష్కరించింది. లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రస్తుతానికి యూరప్, రష్య, సౌదీ అరేబియాలో లాంచ్ అయింది. ఇండియాలో ఎపుడు లాంచ్ చేసేది అధికారిక ప్రకటన లేదు. కానీ త్వరలో భారత మార్కెట్లో కూడా విడుదల కానుందని అంచనా. భారత కరెన్సీలో దీని ధర సుమారు రూ.15,900 ఉండనుంది. ఈ ఫోన్ మిడ్ నైట్ బ్లాక్, ఐస్ల్యాండిక్ ఫ్రాస్ట్, ఎమరాల్డ్ గ్రీన్ రంగుల్లో లభ్యం. ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు. హానర్ 10ఎక్స్ లైట్ ఫీచర్లు 6.67 అంగుళాల ఫుల్హెచ్డీ+ ఎల్సీడీ డిస్ ప్లే ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం కిరిన్ 710 ప్రాసెసర్, 48+8+2+2 క్వాడ్ రియర్ కెమెరా సెటప్, 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ 256 జీబీదాకా విస్తరించుకునే అవకాశం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ -
సరికొత్త డిజైన్తో ఎల్జీ 'వెల్వెట్' లాంచ్
సాక్షి, ముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ, సౌత్కొరియా టెక్ దిగ్గజం ఎల్జీ కొత్త స్మార్ట్ ఫోను లాంచ్ చేసింది. సరికొత్త డిజైన్, డ్యూయల్ స్క్రీన్ యాక్సెసరీతో ఎల్జీ వెల్వెట్ స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్ లో విడుదల చేసింది. స్టీరియో స్పీకర్లు, అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 15వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ లాంటి ఇతర ఫీచర్లు ఈ స్మార్ట్ఫోన్లో ప్రధాన ఆకర్షణ. ధర లభ్యత ఎల్జీ వెల్వెట్ ప్రారంభం ధర 36,990 రూపాయలు. అయితే డ్యూయల్ స్క్రీన్ యాక్సెసరీ మోడల్ ధర 49,990 రూపాయలు. ఇది అక్టోబర్ 30 నుండి అన్ని ప్రముఖ ఆన్లైన్, ఆఫ్లైన్ రిటైలర్లలో అందుబాటులో ఉంటుంది. బ్లాక్ అరోరా సిల్వర్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఎల్జీ వెల్వెట్ ఫీచర్లు 6.8 అంగుళాల స్క్రీన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 10 విత్ ఎల్జీ యుఎక్స్ 9 2340 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ 6 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ 2 టీబీదాకా విస్తరించుకునే అవకాశం 48+8+5 ఎంపీ ట్రిపుల్ రియర్ 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 4300ఎంఏహెచ్ బ్యాటరీ -
ఒప్పో ఏ15... ధర ఎంతంటే..
సాక్షి, ముంబై: ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఒప్పో ఏ15 స్మార్ట్ ఫోన్ ను ఎట్టకేలకు కంపెనీ భారత మార్కెట్లో లాంచ్ చేసింది. బిగ్ డిస్ ప్లే, ట్రిపుల్ కెమెరాలు, మీడియాటెక్ ప్రాసెసర్తో బడ్జెట్ ధరలో దీన్ని లాంచ్ చేసింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అమ్మకానికి ముందు ఒప్పో కొత్త ఏ సిరీస్ ఫోన్ విడుదల చేయడం విశేషం. ఒప్పో ఏ15 ధర ఒప్పో ఏ15 సింగిల్ వేరియంట్లో లభ్యం. 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ .10,990. డైనమిక్ బ్లాక్ మిస్టరీ బ్లూ రంగులలో వస్తుంది. అ అమెజాన్లో ఆన్లైన్ ద్వారా దేశవ్యాప్తంగా ఆఫ్లైన్ స్టోర్ల నుండి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. అయితే ఎప్పటినుంచి కొనుగోలుకు అందుబాటులో ఉండేదీ ఒప్పో ఇంకా ప్రకటించలేదు. ఒప్పో ఏ15 ఫీచర్లు 6.52 అంగుళాల డిస్ ప్లే 720x1600 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత కలర్ఓఎస్ 7.2 ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో పీ 35 ప్రాసెసర్ 13+2+2 ఎంపీ రియల్ ట్రిపుల్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 4230 ఎంఏహెచ్ బ్యాటరీ The all new #OPPOA15 is ready to blow you away, with its sleek curved design, Triple camera and a 16.55cm Waterdrop Eye Protection Screen. All of this at just ₹10,990! Coming soon! https://t.co/hIIoYnmpNW pic.twitter.com/TDOlOprwtJ — OPPO India (@oppomobileindia) October 15, 2020 -
ఆండ్రాయిడ్ 11: తొలి స్మార్ట్ఫోన్ వివో వీ20
సాక్షి, ముంబై: చైనా స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ వివో మంగళవారం కొత్త స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. వీ సిరీస్ లో భాగంగా వివో వి 20 స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంతో మనదేశంలో లాంచ్ అయిన మొదటి ఫోన్ ఇదే కావడం విశేషం. వివో వీ20 ఫీచర్లు 6.44అంగుళాల అమోలేడ్ ఎఫ్హెచ్డి + హాలో ఫుల్ వ్యూ డిస్ప్లే 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 720 జీ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 11 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ 1 టీబీ వరకు విస్తరించుకునే అవకాశం 64+ 8 +2 ట్రిపుల్ రియర్ కెమెరా 44 మెగా పిక్సెల్ ఆటోఫోకస్ సెల్పీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ వివో వీ20 ధర, లభ్యత రెండు వేరియంట్లలో లభ్యం. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,990 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,990గా ఉంది ప్రీ-బుకింగ్స్ ఈరోజు నుంచి ప్రారంభం. అలాగే అక్టోబర్ 20 నుంచి సేల్ ప్రారంభం. లాంచింగ్ ఆఫర్ వీ-షీల్డ్ మొబైల్ ప్రొటెక్షన్ ద్వారా కొత్త ఫోన్ కొనేటప్పుడు దీనిపై రూ.2,500 అదనపు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ను పొందవచ్చు. 12 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. బ్యాండ్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, జెస్ట్ మనీ ద్వారా ఆఫ్ లైన్లో కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్ బ్యాక్ లభించనుంది. దీంతో పాటు వీఐ(వొడాఫోన్ ఐడియా) 819 రీచార్జ్ పై ఒక సంవత్సరం అదనపు వారంటీ కూడా లభ్యం. Out with the blurry, and in with clarity. Capture your life with the ultra-sleek #vivoV20 powered by 44MP Eye Autofocus Selfie to explore a new #DelightEveryMoment. Prebook now: https://t.co/PHsB9eFNXT pic.twitter.com/26zNlw9Mwh — Vivo India (@Vivo_India) October 13, 2020 -
టెక్నో కామన్ 16 : సూపర్ ఫీచర్లు, బడ్జెట్ ధర
సాక్షి, న్యూఢిల్లీ : టెక్నో కామన్ సరికొత్త స్మార్ట్ఫోన్ భారతదేశంలో ఆవిష్కరించింది. బిగ్ బ్యాటరీ, బిగ్ డిస్ ప్లే, ఏఐ లెన్స్తో కూడిన క్వాడ్ కెమెరా,18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి అద్భుతమైన ఫీచర్లతో టెక్నో కామన్ 16 ను లాంచ్ చేసింది. అంతేకాదు అందుబాటులో ధరలో తీసుకొచ్చింది. 34 గంటల కాలింగ్ సమయం, 16 గంటల వెబ్ బ్రౌజింగ్, 22 గంటల వీడియో ప్లేబ్యాక్, 15 గంటల గేమ్ ప్లే 180 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ సమాయాన్ని తమ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ అందిస్తుందని సుమారు రెండు గంటల్లో ఫోన్ పూర్తిగా ఛార్జ్ అవుతుందని టెక్నో పేర్కొంది. ధర, లభ్యత టెక్నో కామన్ 16 ధరను 10,999 రూపాయలుగా నిర్ణయించింది. అక్టోబర్ 16 నుండి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అమ్మకం సందర్భంగా టెక్నో కామన్ 16 అందుబాటులో ఉంటుంది. క్లౌడ్ వైట్, ప్యూరిస్ట్ బ్లూ అనే రెండు కలర్ వేరియంట్లలో లభ్యం. టెక్నో కామన్ 16 ఫీచర్లు 6.80 అంగుళాల ఫుల్ హెచ్ డీ హోల్ పంచ్ డిస్ప్లే ఆండ్రాయిడ్ 10 మీడియాటెక్ హెలియో జి 79 సాక్ 4 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 64+2+2+2 మెగాపిక్సెల్ రియర్ క్వాడ్ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం -
రియల్మీ 7ఐ: అద్భుత ఫీచర్లు, బడ్జెట్ ధర
సాక్షి, ముంబై: రియల్మీ మరో అద్భుత స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. రియల్మీ 7 సిరీస్లో 7ఐ పేరుతో బడ్జెట్ ధరలో అందిస్తోంది. భారీ బ్యాటరీ, క్వాడ్ రియర్ కెమెరా సెటప్, హై రిఫ్రెష్ రేట్ స్క్రీన్, ఆక్టా కోర్ ప్రాసెసర్తో ఈ ఫోన్ను రూపొందించింది. ధర, లభ్యత 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ రూ.11,999 4జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ రూ.12,999 అక్టోబరు 16 నుంచి రియల్మీ 7ఐ ఫోన్ సేల్స్ ప్రారంభం బిగ్ బిలియన్ డే సేల్లో భాగంగా ఫ్లిప్కార్ట్తో పాటు రియల్మీ.కామ్, ఇతర ఆఫ్లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంది. ఫ్లిప్కార్ట్ బిలియన్ డేస్లో ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డుతో 10శాతం డిస్కౌంట్ పాటు పేటీఎంపై క్యాష్బ్యాక్ సదుపాయం దీనికి కూడా వర్తిస్తుందని కంపెనీ ప్రకటించింది. రియల్మీ 7ఐ ఫీచర్లు 6.50 అంగుళాల హెచ్డీ పంచ్ హోల్ డిస్ప్లే ఆండ్రాయిడ్ 10 + రియల్మీ యూఐ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ 64+8+2+2ఎంపీ రియర్ క్వాడ్ కెమెరా 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 18 వాట్స్ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ -
పోకో ఎక్స్3 లాంచ్.. ధర, ఫీచర్లు
సాక్షి, ముంబై: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు పోకో మరో కొత్త స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేసింది. అద్భుతమైన ఫీచర్లు, భారీ బ్యాటరీ అందుబాటు ధరలో పోకో ఎక్స్3 పేరుతో భారతీయ మార్కెట్లో తీసుకొచ్చింది. పోకో ఎక్స్2 స్మార్ట్ ఫోన్కు కొనసాగింపుగా దీన్ని తీసుకొచ్చింది. గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న పోకో ఎక్స్3 ఎట్టకేలకు మనదేశంలో కూడా అందుబాటులోకి తెస్తోంది. గత నెలలో యూరోప్లో లాంచ్ అయిన పోకో ఎక్స్3 ఎన్ఎఫ్సీ మాదిరిగానే దీన్ని రూపొందించింది. పోకో ఎక్స్3 ధర, లభ్యత మూడు వేరియంట్లు, కోబాల్ట్ బ్లూ, షాడో గ్రే రంగుల్లో పోకో ఎక్స్ 3 లభ్యం. 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,499 హైఎండ్ వేరియంట్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999 ఫ్లిప్కార్ట్లో సెప్టెంబర్ 29వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి విక్రయానికి అందుబాటులో ఉంటుంది. పోకో ఎక్స్3 ఫీచర్లు 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లేను కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 12 ఆక్టాకోర్ క్వాల్కం స్నాప్ డ్రాగన్ 732జీ ప్రాసెసర్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 256 జీబీ వరకు పెంచుకునే అవకాశం 64 +13 +2 +2 మెగా పిక్సెల్ రియర్ క్వాడ్ కెమెరా 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 6000 ఎంఏహెచ్ బ్యాటరీ Everything you need to know about the #POCOX3. - @qualcomm_in #Snapdragon 732G - 64MP Sony IMX682 Quad Cameras - 120Hz FHD+ Display with 240Hz touch sampling rate - 6000mAh battery with 33W fast charger (in-box) - LiquidCool Technology 1.0 Plus 3000 RTs & we'll giveaway one. pic.twitter.com/RSJwwuTfzQ — POCO India #POCOX3 (@IndiaPOCO) September 22, 2020 -
అద్భుత ఫీచర్లు, సరసమైన ధర పోకో ఎం2
సాక్షి, ముంబై: స్మార్ట్ఫోన్ మేకర్ పోకో పోకో ఎం2 స్మార్ట్ఫోన్ ను ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేసింది. వర్చువల్ ఈవెంట్ ద్వారా పోకో ఎం 2 ను ఆవిష్కరించింది. రెండు వేరియంట్లలో, పిచ్ బ్లాక్, స్లేట్ బ్లూ, బ్రిక్ రెడ్ అనే మూడు కలర్ ఆప్షన్లలో పోకో ఎం2 స్మార్ట్ఫోన్ ను విడుదల చేసింది. మీడియాటెక్ హీలియో జీ80ప్రాసర్, క్వాడ్ రియర్ కెమెరా, భారీ కెమెరా ప్రధాన ఫీచర్లుగా అందుబాటు ధరలో దీన్ని లాంచ్ చేసింది. భారతదేశంలో పోకో ఎం 2 ధర, లభ్యత 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో తీసుకొచ్చింది. బేస్ వేరియంట్ ధర రూ. 10,999 టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 12,499. సెప్టెంబర్ 15 నుండి మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. పోకో ఎం2 ఫీచర్స్ 6.53 అంగుళాలు స్ర్రీన్ 1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 10 మీడియాటెక్ హెలియో జి 80ప్రాసెసర్ 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 13+ 8+5+2మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం -
ఒప్పో ఎఫ్ 17 సిరీస్ స్మార్ట్ ఫోన్లు లాంచ్
సాక్షి, ముంబై: మొబైల్ మేకర్ ఒప్పో ఎఫ్ 17 సిరీస్ లో ఒప్పో ఎఫ్ 17, ఒప్పో ఎఫ్ 17 ప్రో అనే స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది ఒప్పో ఎఫ్ 17 ప్రో ధర రూ. 22990 ఈ రోజు నుంచే ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. సెప్టెంబరు 7నుంచి మొదటి సేల్. దీంతొ పాటు ఒప్పో ఇయర్ బడ్స్ ను కూడా లాంచ్ చేసింది. ఒప్పో ఎఫ్ 17 ప్రో 6.43అంగుళాల సూపర్ అమోలేడ్ ఎఫ్హెచ్డి + డిస్ప్లే మీడియాటెక్ హెలియో పి 95 ప్రాసెసర్1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్ 8 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ 48+8+2+2 ఎంపీ క్వాడ్-కెమెరా 16 +2 ఎంపీ డ్యుయల్ ఫ్రంట్ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీని ధర : రూ. 22990 మాట్ బ్లాక్, మ్యాజిక్ బ్లూ, మెటాలిక్ వైట్ రంగులలో లభిస్తుంది. ఒప్పో ఎఫ్ 17 ఫీచర్లు 6.44 అంగుళాలఫుల్ హెచ్డి +వాటర్డ్రాప్ నాచ్ డిస్ప్లే ఆండ్రాయిడ్ 10 లో కలర్ఓఎస్ 7.2 క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 662 ఒకే 6 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ 16 +8 +2+2 క్వాడ్ రియర్ కెమెరా 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఒప్పో ఎఫ్ 17 4జీబీ ర్యామ్ ,64జీబీ స్టోరేజ్,128 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ , 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లభ్యం. అయితే దీని ధరలు, లభ్యత వివరాలను కంపెనీ ప్రకటించలేదు. You’re not going to believe how unbelievably priced the #SleekestPhoneOf2020 is! 😱 Drumroll please 🥁 #OPPOF17Pro is priced at ₹22,990 so that you can #FlauntItYourWay. Pre-order now: https://t.co/x0jqrik5nV pic.twitter.com/YbccHPVUhW — OPPO India (@oppomobileindia) September 2, 2020 -
ఎల్జీ అద్భుత ఆవిష్కారం: త్వరలో
సాక్షి, ముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ఎల్జీ తన దూకుడును పెంచింది. విలక్షణమైన ఇంకా ఎవరూ కనిపెట్టని కొత్త వినియోగ అనుభవాలతో కొత్త స్మార్ట్ఫోన్లను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నఎల్జీ తన ఎక్స్ప్లోరర్ ప్రాజెక్ట్ను ప్రారంభిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఇందులో భాగంగా తొలి మోడల్ సెప్టెంబర్ 14న లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు టీజర్ వీడియోను విడుదల చేసింది. ఎల్జీ తన గ్లోబల్ యూట్యూబ్ ఛానెల్లో విడుదల చేసిన వీడియో ప్రకారం రొటేటింగ్, డ్యుయల్ స్క్రీన్ హ్యాండ్సెట్ను టీ షేప్ డిజైనుతో ఆవిష్కరించనుంది. ఎల్జి మొబైల్ గ్లోబల్ ఫేస్బుక్ , యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా సెప్టెంబర్ 14 న వర్చువల్ గా ఈ డివైస్ ను లాంచ్ చేయనుంది. దీని ఫీచర్లు, స్పెసిఫికేషన్లపై ఎటువంటి నిర్దిష్ట వివరాలను కంపెనీ అందించలేదు. అయితే క్వాల్కమ్, రేవ్, ఫిక్టో, ట్యూబి, నావర్లతో సహా ఇతర భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నట్టు సమాచారం. ఎల్జీ వింగ్ గా భావిస్తున్న కొత్త స్మార్ట్ఫోన్ ఫీచర్లపై ఇలా ఉన్నాయి. ఎల్జీ వింగ్ స్మార్ట్ఫోన్ ఫీచర్లు 6.8 అంగుళాల డిస్ ప్లే 1:1 యాస్పెక్ట్ రేషియోతో 4 అంగుళాల మరో స్క్రీన్ స్నాప్డ్రాగన్ 765 జి సాక్ 8జీబీ ర్యామ్ ట్రిపుల్ రియర్ కెమెరాలు ధర సుమారు రూ. 73,000 -
దేశ్ కా స్మార్ట్ఫోన్ : బడ్జెట్ ధరలో
సాక్షి, ముంబై: చైనా మొబైల్ తయారీదారు షావోమి మరో బడ్జెట్ స్మార్ట్ఫోన్ ను లాంచ్ చేసింది. రెడ్మీ ఏ సిరీస్లో భాగంగా ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్లో రెడ్మీ 9ఏ ను తీసుకొచ్చింది. 5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్ తో ఈ స్మార్ట్ ఫోన్ ప్రారంభించింది. ప్రారంభ ధర రూ.6,799 గా నిర్ణయించింది. (రెడ్మీ తొలి 5జీ స్మార్ట్ ఫోన్ వస్తోంది..) 2జీబీ ర్యామ్+32జీబీ స్టోరేజ్, 3జీబీ ర్యామ్+32జీబీ స్టోరేజ్ వేరియంట్లలో రెడ్మీ 9ఏ అందుబాటులో ఉంటుంది. అమెజాన్, ఎంఐ ఆన్ లైన్ స్టోర్లలో సెప్టెంబర్ 4న సేల్ ఆరంభం. త్వరలోనే ఆఫ్లైన్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉండనుంది. మూడు రంగుల్లో వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర రూ.6,799, 3జీబీ ర్యామ్+32జీబీ స్టోరేజ్ 7499 రూపాయలుగా ఉంచింది. రెడ్మీ 9ఏ ఫీచర్లు 6.53 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్ 13 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ -
భారీ బ్యాటరీ : గెలాక్సీ ఎం51 స్మార్ట్ ఫోన్
సాక్షి,ముంబై: శాంసంగ్ గెలాక్సీ ఎం51 స్మార్ట్ ఫోన్ త్వరలో భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. జర్మనీలో లాంచ్ అయిన ఈ మొబైల్ ను సెప్టెంబరు 10న భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. భారీ బ్యాటరీ, హోల్ పంచ్ డిస్ ప్లే, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, సూపర్ అమోఎల్ఈడీ ప్లస్ ఇన్ ఫినిటీ-ఓ డిస్ ప్లే ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. ధర సుమారు 31,500 రూపాయలుగా ఉండనుంది.. గెలాక్సీ ఎం51 స్మార్ట్ ఫోన్ ఫీచర్లు 6.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే క్వాల్కం స్నాప్ డ్రాగన్ 730 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత వన్ యూఐ ఆపరేటింగ్ సిస్టం 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ 128 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 64 +12 +5 5 మెగా పిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా 32 మెగాపిక్సెల్ సెల్ఫీకెమెరా 7000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ Quick update people. We spotted Mo-B arriving in town for the Meanest Monster Face-off starting 6th Sep. We just hope he shows up and doesn’t get cold feet. It will be a matter of pride for the new #SamsungM51 to prove once and for all, why it’s called the #MeanestMonsterEver. pic.twitter.com/hFU619BVtf — Samsung India (@SamsungIndia) August 31, 2020 -
రెడ్మీ తొలి 5జీ స్మార్ట్ ఫోన్ వస్తోంది..
సాక్షి,ముంబై: చైనా మొబైల్ మేకర్ షావోమి రెడ్మీ 5జీ స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోలాంచ్ చేయనుంది. రెడ్మీ కే30 5 జీ భారతదేశంలో త్వరలో దీన్ని తీసుకురానుంది. గత ఏడాదే బీఐఎస్ సర్టిఫికేషన్ అందుకున్నప్పటికీ, ఈ ఫోన్ లాంచింగ్ ఆలస్యమవుతోంది. అయితే తాజా నివేదికల ప్రకారం రానున్న కొద్ది రోజుల్లోనే రెడ్మీ తన తొలి 5జీ స్మార్ట్ ఫోన్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. తాజా నివేదిక ప్రకారం, 6జీబీ, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ, 28 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో, ఫ్రాస్ట్ వైట్ మిస్ట్ పర్పుల్ రంగులలో అందించనుంది. పాప్-అప్ సెల్ఫీ కెమెరాతో రెడ్మి కె 20 ప్రో మాదిరిగానే ఉండనుందని అంచనా. రెడ్మీ కే30 5జీ స్పెసిఫికేషన్లు 6.67-అంగుళాల అమోలెడ్ డిస్ప్లేతో 1080 x 2400 ఫుల్ హెచ్డి + రిజల్యూషన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 765 జి ప్రాసెసర్ 20+2 మెగాపిక్సెల్ డబుల్ సెల్ఫీ కెమెరా 64+ 8 +5 + 2 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ధర : సుమారు 21,350 రూపాయల నుంచి ప్రారంభం -
జియోనీ రీఎంట్రీ : కొత్త స్మార్ట్ ఫోన్
సాక్షి, ముంబై: చైనా ఉత్పత్తులపై నిషేధించాలన్న డిమాండ్ నేపథ్యంలో పలు స్మార్ట్ ఫోన్ల కంపెనీలు తిరిగి మార్కెట్లోకి రీఎంట్రీ ఇస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో జియోని చేరింది. దాదాపు ఒక సంవత్సరం తరువాత ఈ జియోని బ్రాండ్ జియానీ మాక్స్ స్మార్ట్ఫోన్ తో తిరిగొచ్చింది. ప్రధానంగా బిగ్ బ్యాటరీ, ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఫీచర్లతో ఎంట్రీ లెవల్ ధర వద్ద జియోనీ మాక్స్ లాంచ్ అయింది. బ్లాక్, రెడ్ , రాయల్ బ్లూ మూడు రంగుల్లో లభించనుంది. జియోనీ మాక్స్ ధర, లభ్యత జియోనీ మాక్స్ 2 జీబీ ర్యామ్ +32 జిబి స్టోరేజ్ తో వస్తుంది. దీని ధర రూ. 5,999 మాక్స్ ఆగస్టు 31 నుండి ఫ్లిప్కార్ట్ ద్వారా లభ్యం. జియోనీ మాక్స్ ఫీచర్లు 6.1అంగుళాల హెచ్డీ డిస్ ప్లే 720 x1560 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 10 ఆక్టా-కోర్ యునిసోక్ 9863ఏసాక్ 13 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 2 జీబీ ర్యామ్ 32 జీబీ స్టోరేజ్ 256 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం -
సమ్థింగ్ బిగ్ : మోటరోలా కొత్త స్మార్ట్ఫోన్
సాక్షి, ముంబై: ప్రముఖ మొబైల్ తయారీదారు మోటరోలా త్వరలో భారతీయ మార్కెట్లో కొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేయనుంది. అద్భుతమైన పనితనం, అద్భుతమైన కెమెరా.. సిద్ధంగా ఉండండి అంటూ ఒక టీజర్ రిలీజ్ చేసింది. దేశంలో తమ స్మార్ట్ఫోన్ను ఫ్లిప్కార్ట్ ద్వారా లాంచ్ చేయనున్నామని ట్వీట్ చేసింది. ఆగస్టు 24 న లాంచ్ చేయనున్నట్లు వెల్లడించింది. అయితే ఈ స్మార్ట్ఫోన్ పేరు, ఫీచర్లను స్పష్టం చేయనప్పటికీ, మోటో ఈ7 ప్లస్ పేరుతో దీన్ని తీసుకు రానుందని అంచనా. బిగ్ స్క్రీన్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, స్పీకర్ గ్రిల్ను టీజర్లో గుర్తించవచ్చు. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ఆక్టా-కోర్ ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీబీ ర్యామ్, 64 జిబి స్టోరేజ్ , డ్యూయల్-రియర్ కెమెరా ప్రధాన ఆకర్షణీయంగా ఉండనున్నాయని భావిస్తున్నారు. Gear up for a spectacular performance and stunning camera! Launching soon on @Flipkart. pic.twitter.com/SWMv26zTOG — Motorola India (@motorolaindia) August 20, 2020 -
వన్ప్లస్ నార్డ్ వచ్చేసింది..ధర ఎంతంటే
సాక్షి, ముంబై: వన్ప్లస్ కొత్త మొబైల్ ‘నార్డ్’ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. 5జీ కనెక్టివిటీ, పంచ్ హోల్ డిస్ప్లే డిజైన్, క్వాడ్ రియర్ కెమెరా ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయని కంపెనీ ప్రకటించింది. అంతేకాదు "ఫాస్ట్ అండ్ స్మూత్" అనుభవాన్ని అందించడానికి వన్ప్లస్ నార్డ్కు దాదాపు 300 ఆప్టిమైజేషన్లను అందించినట్లు కంపెనీ పేర్కొంది. మూడు వేరియంట్లలో లాంచ్ చేసిన వన్ప్లస్ నార్డ్ ఆగస్టు 4 నుండి అమెజాన్, వన్ప్లస్.ఇన్ ద్వారా భారతదేశంలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. అయితే, ప్రారంభంలో 8 జీబీ, 12 జీబీ ర్యామ్ వేరియంట్లు మాత్రమే ఇవ్వబడతాయి. 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వెర్షన్ సెప్టెంబర్లో వస్తుంది. షావోమి ఇతర సంస్థల మాదిరిగా కాకుండా, వన్ప్లస్ మొదటి రోజు నుండి నార్డ్ను ఓపెన్ సేల్గా అందించనుంది. ప్రీ-బుకింగ్ వన్ప్లస్ ఎక్స్పీరియన్స్ స్టోర్స్ ద్వారా జూలై 22 నుంచి, జూలై 28 నుంచి అమెజాన్ ఇండియ లో అందుబాటులో ఉంటుంది. ఇక ఆఫర్ల విషయానికొస్తే, అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డులను ఉపయోగించి చేసిన కొనుగోళ్లతో 2 వేల రూపాయల తగ్గింపు. అదనంగా రిలయన్స్ జియో ద్వారా 6,000 విలువైన ప్రయోజనాలు లభ్యం. వన్ప్లస్ రెడ్ కేబుల్ క్లబ్ సభ్యులకు ప్రత్యేకంగా పొడిగించిన వారంటీ , బైబ్యాక్ ఆఫర్, 50 జీబీ విలువైన ఉచిత వన్ప్లస్ క్లౌడ్ స్టోరేజ్, ఇతర థర్డ్ పార్టీ ప్రయోజనాలు లభిస్తాయి. వన్ప్లస్ నార్డ్ ధర 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 24,999 రూపాయలు 8 జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్ ధర 27,999 రూపాయలు 12 జీబీ+ 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర 29, 999 రూపాయలు వన్ప్లస్ నార్డ్ ఫీచర్లు 6.44 అంగుళాల డిస్ ప్లే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 765 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 10 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్ 32 + 8 మెగాపిక్సెల్ డబుల్ సెల్ఫీ కెమెరా 48+ 8+ 5+ 2మెగాపిక్సెల్స్ క్వాడ్ రియర్ కెమెరా 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 4100ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం Here's what Pretty Much Everything You Could Ask for, looks like With a Quad Camera setup, ultra wide selfie cameras , 90Hz Fluid AMOLED display, Snapdragon 765G 5G & upto 12GB RAM#OnePlusNord will be available starting from ₹24,999 Know more - https://t.co/aWOZnUyBEW pic.twitter.com/T1582FlhtH — OnePlus India (@OnePlus_IN) July 21, 2020 -
లావా మేడిన్ ఇండియా స్మార్ట్ఫోన్
సాక్షి, న్యూఢిల్లీ : చైనా వస్తువులు, దిగుమతులపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ స్మార్ట్ఫోన్ సంస్థ లావా వేగం పెంచింది. ఎంట్రీ లెవల్ విభాగంలో ఒక స్మార్ట్ఫోన్ లాంచ్ చేసింది. ‘లావా జెడ్61 ప్రో’ పేరుతో చాలా అందుబాటు ధరలో ఆవిష్కరించింది. లావా జెడ్61 ప్రో మేడిన్ స్మార్ట్ ఫోన్ అని లావా ఇంటర్నేషనల్ ప్రొడక్ట్ హెడ్ తేజిందర్ సింగ్ వెల్లడించారు. ఫేస్ అన్లాక్తో ఈ స్మార్ట్ఫోన్ కేవలం 0.6 సెకన్లలో అన్లాక్ అవుతుందన్నారు. తక్కువ ధరలో చాలా ఆకర్షణీయంగా, బడ్జెట్ ధరలను కోరుకునే వినియోగదారులకు లేదా ఫీచర్ ఫోన్ నుండి స్మార్ట్ఫోన్కు మారేవారికి సరిపోతుందనీ, భారతీయులుగా గర్వపడతారని వ్యాఖ్యానించారు. ధర, లభ్యత లావా జెడ్61 ప్రో ధర 5,774 రూపాయలు. రెడ్, బ్లూ, రెండు రంగుల్లో ఇది లభించనుంది. ఫ్లిప్కార్ట్, అమెజాన్ తోపాటు ఆఫ్లైన్ మార్కెట్లో కూడా అందుబాటులో ఉంటుంది. లావా జెడ్ 61 ప్రో ఫీచర్లు 5.45 అంగుళాల హెచ్డి + డిస్ప్లే 1.6 గిగాహెడ్జ్ ప్రాసెసర్ 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ 128 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం 8 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీకెమెరా 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ -
గెలాక్సీ నోట్ 20 అల్ట్రా: ఆసక్తికర లీక్
సాక్షి, న్యూఢిల్లీ: స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ 20 అల్ట్రాకు సంబంధించి అనేక రూమర్లు, ఆసక్తికర మైన అంశాలు ఇప్పటికే మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా 108 మెగాపిక్సెల్ భారీ కెమెరాతో, 5జీ టెక్నాలజీతో ఈ స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేయనుందని తాజా లీక్ ద్వారా తెలుస్తోంది. ఈ ఫోన్ ఆగస్టు 5న ఆవిష్కరించనుందని సమాచారం. గెలాక్సీ ఎస్ 20 అల్ట్రాలో108 మెగాపిక్సెల్ కెమెరా ఖాయం అంటూ ప్రముఖ టిప్స్టర్ రోలాండ్ క్వాండ్ ట్వీట్ చేశారు. 108 మెగాపిక్సెల్ కెమెరాతోపాటు 6.9 అంగుళాల భారీ స్క్రీన్ తో గెలాక్సీ ఎస్ 20 అల్ట్రా ను తీసుకు రానుందని అంచనా. అలాగే ఎస్-పెన్ స్థానాన్ని మార్చనుందని భావిస్తున్నారు. అయితే, ప్లస్ మోడల్ ను కూడా లాంచ్ చేయనుందా, లేదంటే రెగ్యులర్ నోట్ 20, అల్ట్రా తీసుకొస్తుందా అనే దానిపై స్పష్టత లేదు. (గెలాక్సీ నోట్ 10 లైట్ ధర తగ్గింది : క్యాష్బ్యాక్ కూడా) Samsung Galaxy Note 20 "Ultra" ("Canvas2") has a 108MP main cam. I know we knew, but I've seen hard evidence now, so consider it confirmed from my end. — Roland Quandt (@rquandt) June 25, 2020 -
అద్భుత ఫీచర్లతో ఒప్పో స్మార్ట్ఫోన్
ముంబై: ప్రముఖ చైనీస్ బ్రాండ్ స్మార్ట్ఫోన్ 'ఒప్పో' ఆకర్శనీయమైన ఫీచర్లతో వినియోగదారులను అకర్శిస్తున్న విషయం తెలిసిందే. ఒప్పో తాజాగా రెండు 5జీ స్మార్ట్ఫోన్లను బుధవారం తీసుకొచ్చింది. ఒప్పో సిరీస్లో భాగంగా ఒప్పో ఫైండ్ ఎక్స్ 2, ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 ప్రొ మోడళ్లను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. కాగా ఈ ఫోన్ సెరామిక్ నలుపు వర్ణంలో ఉంటుందని తెలిపింది. దేశంలో ఒప్పో ఫైండ్ ఎక్స్ 2, 12జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.64,900గా ఒప్పో సంస్థ నిర్ణయించింది. అయితే ఒప్పో ఫైండ్ ఎక్స్2 ప్రొ ధరను ఇంకా ప్రకటించలేదు. ఇటీవల అద్భుత ఫీచర్లతో వన్ప్లస్ 8సిరీస్, సామ్సాంగ్ గ్యాలెక్సీ ఎస్ 20 మార్కెట్లోకి వచ్చాయి. వాటికి దీటుగా అత్యుత్తమ ఫీచర్లతో వినియోగదారులను అలరిస్తాయని ఒప్పో సంస్థ వర్గాలు తెలిపాయి. కాగా రెండు సిరీస్ ఫోన్లకు స్టీరియో స్పీకర్లు ప్రధాన ఆకర్షణని, ఆండ్రాయిడ్ 10 సాఫ్ట్వేర్ను అమర్చామని సంస్థ పేర్కొంది. ఫైండ్ ఎక్స్2 ప్రొ ఫీచర్లు డిస్ప్లే:6.70 అంగుళాలు ప్రాసెసర్:క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 865 డిస్ప్లే ఫ్రంట్ కెమెరా: 32 మెగా పిక్సల్ రియర్ కెమెరా: 48+48+13 మెగా పిక్సల్ ర్యామ్:12జీబీ స్టోరేజ్:512జీబీ బ్యాటరీ కెపాసిటీ:4260ఎమ్ఎహెచ్ ఓఎస్:ఆండ్రాయిడ్ 10 ఫైండ్ ఎక్స్2 ఫీచర్లు డిస్ప్లే: 6.70 అంగుళాలు ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 865 ఫ్రంట్ కెమెరా: 32 మెగా పిక్సల్ రియర్ కెమెరా: 48+12+13 మెగా పిక్సల్ ర్యామ్: 12జీబీ స్టోరేజ్:256జీబీ బ్యాటరీ కెపాసిటీ: 4200mAh ఓఎస్: ఆండ్రాయిడ్ 10 -
శాంసంగ్ గెలాక్సీ కొత్త స్మార్ట్ ఫోన్
సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ సరికొత్త మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్ గెలాక్సీ ఏ21ఎస్ ను భారతదేశంలో లాంచ్ చేసింది. 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాగా క్వాడ్-కెమెరా రియర్ కెమెరా సెటప్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ రికగ్నిషన్ లాంటివి ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి. (శాంసంగ్ కొత్త టీవీలు: ఫీచర్లు అదుర్స్) గెలాక్సీ ఏ 21ఎస్ ఫీచర్లు 6.50 అంగుళాల డిస్ ప్లే ఆండ్రాయిడ్ 10 720x1600 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆక్టా-కోర్ ఎక్సినోస్ 850 ప్రాసెసర్ 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 48+ 8+2+2 ఎంపీ క్వాడ్ కెమెరా 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 512జీబీ వరకు విస్తరించుకునే అవకాశం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ధరలు: 4 జీబీ ర్యామ్/ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ 16499 రూపాయలు 6 జీబీ ర్యామ్/ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 18499 రూపాయలు. బ్లాక్, బ్లూ , వైట్ కలర్ ఆప్షన్లలో ఫ్లిప్కార్ట్, శాంసంగ్.కామ్, ఇతర ప్రధాన ఆన్లైన్, ఆఫ్లైన్ రిటైలర్ల ద్వారా ఈ రోజు (బుధవారం) నుండి లభ్యం. Show More -
"ది జెయింట్'' వస్తోంది..బడ్జెట్ ధరలో
సాక్షి, ముంబై : టెక్నో మొబైల్ ఇండియా బడ్జెట్ ధరలో మరో స్మార్ట్ఫోన్ విడుదల చేయనుంది.. జూన్ 17 బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు టెక్నో స్పార్క్ పవర్ 2 పేరుతో దీన్ని లాంచ్ చేస్తున్నట్టు కంపెనీ ట్విటర్ ద్వారా ప్రకటించింది. ఈ మేరకు ఒక టీజర్ వీడియోను షేర్ చేసింది. టెక్నో స్పార్క్ 2 ధర రూ. భారతదేశంలో ఉంచింది. ఫ్లిప్కార్ట్లో ప్రత్యేకంగా లభ్యం కానుంది. 10 నిమిషాల ఛార్జింగ్ తో 3 గంటల బ్యాటరీ, . బిగ్గెస్ట్ స్క్రీన్, బెస్ట్ బ్యాటరీ, స్మార్ట్ ఫోన్ అనే హ్యాష్ట్యాగ్ ను జోడించింది 6000 ఎంఏహెచ్ బిగ్ బ్యాటరీ క్వాడ్ రియర్ కెమెరా, స్టీరియో సౌండ్ స్పీకర్లు, వాటర్డ్రాప్-స్టైల్ నాచ్ ప్రధాన ఫీచర్లుగా ఉంటాయని భావిస్తున్నారు. గత ఏడాది నవంబర్లో భారతదేశంలో లాంచ్ చేసిన టెక్నో స్పార్క్ పవర్కు కొనసాగింపుగా ఈ స్మార్ట్ఫోన్ ను తీసుకొస్తోంది. టెక్నో స్పార్క్ పవర్ 2 ఇతర స్పెసిఫికేషన్స్ ఇతర ఆఫర్ వివరాలు లాంచింగ్ రోజు రివీల్ కానున్నాయి. Are you ready to play big? Get ready to binge watch with an amazing theater-like experience. Spark Power 2 is launching on Flipkart on 17th of June. Stay Tuned to know more. #SparkPower2 #BestBatterySmartphone #TecnoSpark #Flipkart #BiggestScreen pic.twitter.com/bXsL05ZcwH — TecnoMobileInd (@TecnoMobileInd) June 15, 2020 -
వన్ప్లస్ జెడ్ కమింగ్ సూన్
సాక్షి, న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ వన్ప్లస్ మరో స్మార్ట్ఫోన్ను తీసుకురానుంది. వన్ప్లస్ జెడ్ పేరుతో మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ ను జూలై 10 న భారతదేశంలో ప్రవేశపెట్టనుంది. ట్రిపుల్ రియర్ కెమెరాలతో రానున్న వన్ప్లస్ జెడ్ ధర రూ .24,990 గా ఉంటుందని అంచనా. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ తో పాటు, 12 జీబీ ర్యామ్ హై ఎండ్ వేరియంట్ ను తీసుకురానుందని ఇటీవల పలు నివేదికలు వెలువడిన సంగతి తెలిసిందే. (బడ్జెట్ ధరల్లో వన్ప్లస్ స్మార్ట్ టీవీలు!) వన్ప్లస్ 8, వన్ప్లస్ 8 ప్రో మాదిరిగానే వన్ప్లస్ జెడ్ లో కూడా ఫింగర్ ప్రింట్ స్కానర్ను జోడించినట్టు సమాచారం. ఈ ఊహాగానాలకు సంస్థ అధికారిక ప్రకటనతో మాత్రమే తెరపడనుంది. వన్ప్లస్ జెడ్ ఫీచర్లపై అంచనాలు ఈ విధంగా ఉన్నాయి. (వన్ప్లస్ 8 ఫ్లాష్ సేల్ : ఆఫర్లు) వన్ప్లస్ జెడ్ ఫీచర్లు 6.40 అంగుళాల డిస్ ప్లే ఆండ్రాయిడ్ 10 64+16 (అల్ట్రా-వైడ్) 2 డెప్త్ సెన్సార్ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్పీ కెమెరా 4300 ఎంఏహెచ్ బ్యాటరీ -
వన్ప్లస్ 8 ఫ్లాష్ సేల్ : ఆఫర్లు
సాక్షి, ముంబై : చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీ సంస్థ వన్ప్లస్ నూతన ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ వన్ప్లస్ 8 అమ్మకాలను ఇండియాలో మరోసారి ప్రారంభించనుంది. అమెజాన్ , వన్ప్లస్ వెబ్సైట్ ద్వారా సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. మూడు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.. వన్ప్లస్ 8 స్పెసిఫికేషన్లు : 6.55 అంగుళాల ఫుల్హెచ్డి +ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్ప్లే, 5జీ, స్నాప్డ్రాగన్ 865 చిప్సెట్, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 48 +16+2 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా, 4300 ఎంఏహెచ్ బ్యాటరీ, 30 టి సపోర్టింగ్ టైప్-సి పోర్ట్ లాంటి ప్రధాన ఫీచర్లు ఉన్నాయి. ధరలు 6 జీబీ ర్యామ్ /128 స్టోరేజ్ ధర రూ.41,999 8 జీబీ ర్యామ్ /128 స్టోరేజ్ ధర రూ.44,999 12 జీబీ ర్యామ్ /256 జీబీ ధర రూ 49,999 సేల్ ఆఫర్లు: అమెజాన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్లకు రూ .2000 తక్షణ తగ్గింపును అందిస్తోంది. అలాగే ప్రీపెయిడ్ ఆర్డర్లపై అమెజాన్ పే బ్యాలెన్స్గా అదనంగా రూ.1,000 క్యాష్బ్యాక్ను అందిస్తోంది. అంతేకాకుండా, అన్ని ప్రధాన బ్యాంకులలో చెల్లుబాటు అయ్యేలా వడ్డీ లేని 12 నెలల వాయిదాల పథకం ఉంది. -
శాంసంగ్ గెలాక్సీ ఏ 31 లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ కొత్త స్మార్ట్ఫోన్ ను భారత మార్కట్లో లాంచ్ చేసింది. గెలాక్స్ ఏ30కి కొనసాగింపుగా శాంసంగ్ ఏ 31 ను గురువారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఇప్పటికే గ్లోబల్ గా ప్రారంభించింది. శాంసంగ్ గెలాక్సీ ఏ 31 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇన్బిల్ట్ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ. 21,999 గా ఉంచింది. ఈ రోజు (జూన్ 4 ) నుండే దేశంలో అమ్మకాలు మొదలు. శాంసంగ్ ఒపెరా హౌస్తో సహా ఆఫ్లైన్ రిటైలర్లతో పాటు అమెజాన్, ఫ్లిప్కార్ట్, బెనో, అలాగే శాంసంగ్ ఇండియా ఈస్టోర్ ద్వారా అందుబాటులో ఉంటుంది. శాంసంగ్ ఏ31 ఫీచర్లు 6.40 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే మీడియాటెక్ హెలియో పి 65ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 10 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్ 6 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 48+8+5+5 మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం -
రెడ్మీ 10 ఎక్స్ వచ్చేసింది..
న్యూఢిల్లీ, బీజింగ్: చైనా మొబైల్ తయారీ దారు షావోమికి చెందిన రెడ్మీ మరో మూడు స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. రెడ్మీ 10ఎక్స్ 5జీ, రెడ్మీ 10ఎక్స్ 5జీ ప్రో, రెడ్మీ 10ఎక్స్ 4జీ స్మార్ట్ఫోన్లను చైనాలో ఆవిష్కరించింది. మూడు స్మార్ట్ఫోన్ల ఫీచర్లు దాదాపు ఒకేలా ఉన్నాయి. ఈ ఫోన్లు గ్లోబల్ మార్కెట్లు, ఇండియాలో ఎపుడు అందుబాటులోకి వచ్చేదీ స్పష్టత లేదు ఈ ఫోన్లలో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, మీడియాటెక్ డిమెన్సిటీ 820 ప్రాసెసర్, 4520 ఎంఏహెచ్ బ్యాటరీ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. (మరో సంచలనం దిశగా షావోమి) (రెడ్మి ఎక్స్ సిరీస్ స్మార్ట్టీవీలు త్వరలో) రెడ్మీ 10ఎక్స్ 5జీ ఫీచర్లు 6.57 అంగుళాల పుల్ హెచ్డీ+డిస్ప్లే ఎంఐయూఐ 11 మీడియాటెక్ డిమెన్సిటీ 820 6జీబీ, 8జీబీ ర్యామ్ 64జీబీ, 128జీబీ, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 48+8+2+2 ఎంపీ క్వాడ్ రియర్ కెమెరా 16 సెల్పీ కెమెరా 4520 ఎంఏహెచ్ బ్యాటరీ బ్లూ, పింక్, గోల్డ్, వైట్ కలర్లలో లభ్యం చదవండి : ఆకర్షణీయ ధరల్లో రియల్మీ స్మార్ట్ టీవీలు ధరలు సుమారుగా 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.17000 6జీబీ+128జీబీవేరియంట్ ధర రూ.19,100 8జీబీ+128జీబీవేరియంట్ ధర రూ.22,300 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.25,500 రెడ్మీ 10ఎక్స్ ప్రో 5జీ ఇందులో 48+8+5+5 క్వాడ్ రియర్ కెమెరా 20 ఎంపీ సెల్పీ కెమెరా ధరలు సుమారుగా 8జీబీ+128జీబీ- రూ.24,300 8జీబీ+256జీబీ- రూ.27,500 ఇండియాలో రిలీజ్ అయిన రెడ్మీ నోట్ 9 తరహాలోనే రెడ్మీ 10ఎక్స్ 4జీ తీసుకొచ్చింది. రెడ్మీ 10ఎక్స్ 4జీ ఫీచర్లు 6.53 అంగుళాల పుల్ హెచ్డీ+డిస్ప్లే మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ 4/6జీబీ ర్యామ్ 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 48+8+2+2 ఎంపీ రియర్ కెమెరా 13 ఎంపీ సెల్ఫీ కెమెరా 5020 ఎంఏహెచ్ బ్యాటరీ ధరలు సుమారుగా 4జీబీ+128జీబీ ధర రూ.10,500 6జీబీ+128జీబీ ధర రూ.12,700 -
బడ్జెట్ ధరలో మోటో జీ 8 పవర్ లైట్
సాక్షి, న్యూఢిల్లీ: జీ సిరీస్లో భాగంగా మోటోరోలా మరో స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. మోటో జీ8 పవర్ లైట్ పేరుతో బడ్జెట్ ధరలో గురువారం తీసుకొచ్చింది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్,ట్రిపుల్ రియర్ కెమెరా, అద్భుతమైన పవర్ ప్రధాన ప్రత్యేకతలుగా ఉన్నాయి. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్లో విడుదలైన ఈ ఫోన్ ధరను రూ.8999గా ఉంచింది. మే 29 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్కార్ట్లో సేల్ ప్రారంభమవుతుంది. రెండు కలర్స్ లో లభ్యం. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోళ్లపై 5 శాతం క్యాష్బ్యాక్ లభించనుంది. మోటరోలా జీ8 పవర్ లైట్ ఫీచర్స్ 6.5 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే మీడియాటెక్ హీలియో పీ35ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 10 4 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 16 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ చదవండి : జియోలో కేకేఆర్ పెట్టుబడులు : మరో మెగా డీల్? బీఎండబ్ల్యూ సూపర్ బైక్స్ లాంచ్ ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 నియో లాంచ్.. ధర ఎంతంటే? The all-new Moto g8 power lite packs the #UltimatePower of a 5000mAh battery, 4GB RAM + 64GB storage, 16MP triple camera system & more. Are you ready to experience the #UltimatePower? Available on @Flipkart at just ₹8,999 starting 29 May, 12 PM onwards! https://t.co/v2Tn740HBT pic.twitter.com/djdG112iZ8 — Motorola India (@motorolaindia) May 21, 2020 -
ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 నియో లాంచ్.. ధర ఎంతంటే?
సాక్షి, ముంబై: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో కొత్త ఫోన్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అనేక రూమర్లు, లీకేజీ తరువాత 5జీ సపోర్ట్తో ఈ స్మార్ట్ఫోన్ను తాజాగా లాంచ్ చేసింది. ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 నియో పేరుతో దీన్ని తీసుకొచ్చింది. క్వాడ్ కెమెరా, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ , వూక్ ఫ్లాష్ ఛార్జ్ 4.0.90 హెర్ట్జ్ డిస్ప్లే ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. కాగా ఒప్పో స్మార్ట్ఫోన్ ఫైండ్ ఎక్స్ 2 సిరీస్లో ఇది నాలగవది. ఒప్పో ఫైండ్ ఎక్స్ 2, ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 ప్రో, ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 లైట్ ఇప్పటికే లాంచ్ చేసింది. వీటి ధరలు దాదాపు లక్ష రూపాయలుగా ఉంచిన సంగతి తెలిసిందే. (బీఎండబ్ల్యూ సూపర్ బైక్స్ లాంచ్) ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 నియో ఫీచర్లు 6.5-అంగుళాల అమోలెడ్ డిస్ప్లే 2400 x 1080 రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 10-బేస్డ్ కలర్ ఓఎస్ 7 క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 765 జి సాక్ 12 జీబీ ర్యామ్ 256 జీబీ ఇన్బిల్ట్ స్టోరేజ్ 48+13+ 8+2 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా 44 మెగాపిక్సెల్ సెల్పీకెమెరా 4025 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ధర : సుమారు రూ. 58,000 -
హానర్ ఎక్స్ 10 లాంచ్ : ఫీచర్లు, ధర
సాక్షి,న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ తయారీదారు హానర్ లేటెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ను బుధవారం చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. హానర్ ఎక్స్ 10 పేరుతో దీన్ని తీసుకొచ్చింది. 5జీ , ట్రిపుల్ రియర్ కెమెరా, పాప్ అప్ సెల్పీ కెమెరా, ఆక్టా-కోర్ ప్రాసెసర్ లాంటి ప్రధాన ఫీచర్లను ఇందులో జోడించింది.. హానర్ ఎక్స్ 10 మూడు కలర్ ఆప్షన్లతో పాటు , స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో లభ్యం కానుంది. 256 జీబీ వరకు స్టోరేజ్ను ఎక్స్ పాండ్ చేసుకోవచ్చు. చైనా మార్కెట్లో మే 26 నుండి ఫోన్ అమ్మకానికి లభిస్తుండగా, అంతర్జాతీయంగా ఎపుడు అందుబాటులోకి వచ్చేదీ స్పష్టతలేదు. హానర్ ఎక్స్ 10 ఫీచర్లు 6.63 అంగుళాల డిస్ప్లే హై సిలికాన్ కిరిన్ 820 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 10 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్ 16 ఎంపీ సెల్పీ పాప్ అప్ కెమెరా 40+8+2 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 4300 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం 6 జీబీ, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 20,200 6 జీబీ, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 23,400 8 జీబీ, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్, ధరసుమారు రూ .25,500 -
అద్భుతమైన ఫీచర్లతో ఫోకో ఎఫ్ 2 ప్రొ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ: పోకో ఎఫ్ సిరీస్లో సెకండ్ జనరేషన్ ఫోన్ను లాంచ్ చేసింది. చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమి సబ్ బ్రాండ్ అయిన పోకో తన కొత్త ఫ్లాగ్షిప్ పోకో ఎఫ్ 1 ప్రారంభించిన రెండు సంవత్సరాల తరువాత పోకో ఎఫ్ 2 ప్రొ పేరుతో కొత్త మొబైల్ను గ్లోబల్గా లాంచ్ చేసింది. (షావోమి ఎంఐ10 లాంచ్, ఫీచర్లు ఏంటంటే..) పోకో ఎఫ్2 ప్రొ ఫీచర్లు 6.67అంగుళాల పూర్తి హెచ్డీ అమోలెడ్ డిస్ప్లే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 865 6 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ 64 +13+5+2 ఎంపీ క్వాడ్ రియర్కెమెరా 20 ఎంపీ సెల్పీ పాప్ అప్ కెమెరా 4700 ఎంఏహెచ్ బ్యాటరీ 5 జీ కనెక్టివిటీ, వెనుక వైపున ఆప్టికల్ ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 , పాప్ అప్ సెల్పీ కెమెరా ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. 30వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో, బాక్స్ లోనే దీనికి సరిపడిన ఛార్జర్ తో వస్తుందనీ కేవలం 63 నిమిషాల్లో ఫోన్ పూర్తిగా ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. నియాన్ బ్లూ, ఫాంటన్ వైట్, ఎలక్ట్రిక్ పర్పుల్, సైబర్ గ్రే నాలుగు రంగులలో లభ్యం. ధర రెండు వేరియంట్లలో ఇది లభ్యం కానుంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర సుమారు రూ. 41500 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర సుమారు రూ. 50 000 -
రియల్ మి 6 ఫస్ట్ సేల్
సాక్షి, ముంబై: చైనా స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ రియల్మి ఇటీవల విడుదల చేసిన రియల్మి6 స్మార్ట్ఫోన్ అమ్మకాలను రేపటి(మార్చి11, బుధవారం)నుంచి ప్రారంభించనుంది. రియల్మి.కామ్, ఫ్లిప్కార్ట్తో పాటు ఇతర ఆఫ్లైన్ స్టోర్లలో తొలి సేల్కు అందుబాటులో వుంచినట్టు సంస్థ ప్రకటించింది. అలాగే ఫ్లిప్కార్ట్.కామ్లో స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేసేటప్పుడు యూజర్లు ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ .750 తగ్గింపు పొందవచ్చని వెల్లడించింది. ఈ స్మార్ట్ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. ధరలు: 4జీబీ + 64 జీబీ స్టోరేజ్ ధర రూ .12,999, 6 జీబీ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 14,999 8 జీబీ+ 128 జీబీ స్టోరేజ్ ధర రూ .15,999 రియల్ మి 6 ఫీచర్లు 6.5-అంగుళాల డిస్ప్లే మీడియాటెక్ హెలియో జీ 90 టీ సాక్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 10 64 +8+2+ ఎంపీ క్వాడ్ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 4300 ఎంఏహెచ్ బ్యాటరీ 30వాట్స్ ఫ్లాష్ ఛార్జ్, ఫింగర్ ప్రింట్ సెన్సర్ Time for a Pro worthy upgrade with #realme6! Get the 64MP #ProCameraProDisplay smartphone in the first sale starting tomorrow at 12 PM on @Flipkart & https://t.co/HrgDJTZcxv. Get flat INR 750 off on ICICI Credit Cards & Credit EMI Transactions on Flipkart.https://t.co/ePGTGUwKKu pic.twitter.com/iw0lNUVb7h — realme (@realmemobiles) March 10, 2020 -
బడ్జెట్ ధరలో రెడ్మి 8ఏ డ్యుయల్ లాంచ్
సాక్షి, బెంగళూరు : చైనా మొబైల్ దిగ్గజం షావోమి మరోసారి బడ్జెట్ ధరల ఫోన్లతో భారత మార్కెట్లో సందడి చేస్తోంది. రెడ్మి ఏ సిరీస్కు కొనసాగింపుగా రెడ్మి 8ఏ డ్యూయల్ దేశ్ కా దమ్ దార్ స్మార్ట్ఫోన్ అంటూ మంగళవారం లాంచ్ చేసింది. అంతేకాదు మొదటిసారి రెడ్మి ఎ సిరీస్కు డ్యూయల్ కెమెరాలను జోడించింది. కొత్త "ఆరా ఎక్స్గ్రిప్" డిజైన్, డ్యూయల్ రియర్ కెమెరాలతో, రెండు వేరియంట్లలో తీసుకొచ్చిన ఈ రెడ్మి స్మార్ట్ఫోన్ ప్రారంభ ధరను రూ. 6499గా నిర్ణయించింది. దీంతోపాటు రెడ్మి 10,000ఎంఏహెచ్ పవర్ బ్యాంక్, 20,000 ఎంఏహెచ్ లను కూడా తీసుకొచ్చింది. వీటి ధరలను వరుసగా రూ .799, రూ .1,499 ధరలతో వినియోగదారులకు అందిస్తోంది. వైర్లెస్ ఎంఫ్ రేడియో, పవర్ ఫుల్ స్పీకర్స్ ప్రత్యేక ఆకర్షణగా రెడ్మి వెల్లడించింది. ఎంఐ.కామ్, అమెజాన్, ఎంఐ హోమ్స్లో ఫిబ్రవరి 18వ తేదీనుంచి వినియోగదారులకు అందుబాటులో వుంటాయి. వినియోగదారులు, అభిమానులు తమ ఉత్పత్తులను తప్పక ఇష్టపడతారని విశ్వసిస్తు న్నామని షావోమి ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అనుజ్ శర్మ అన్నారు. ధరలు 2జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ .6,499 3జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ రూ .6,999 రెడ్మి 8 ఏ డ్యూయల్ ఫీచర్లు 6.2 అంగుళాల డాట్నాచ్ డిస్ప్లే 1520x720 పిక్సెల్స్ రిజల్యూషన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 439 ఆక్టా-కోర్ చిప్సెట్ 13+2 ఎంపీ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్పీ కెమెరా 5000 ఎంఏహచ్ బ్యాటరీ టైప్-సి పోర్ట్ ద్వారా రివర్స్ ఛార్జింగ్ రెడ్మి లాంచ్ చేసిన పవర్బ్యాంకులు -
అద్భుత ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఎం 31 త్వరలో
సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ సరికొత్త స్మార్ట్ఫోన్ త్వరలోనే విడుదల చేయనుంది. గెలాక్సీ ఎం సీరీస్లో భాగంగా 'గెలాక్సీ ఎం 31' స్మార్ట్ఫోన్ను ఫిబ్రవరి 25న భారత మార్కెట్లో ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది. అధికారిక ప్రకటనకు ముందే కొన్ని కీలక వివరాలు ఆన్లైన్లో వెల్లడైనాయి. భారీ బ్యాటరీసామర్థ్యంతో క్వాడ్ కెమెరా సెటప్తో వస్తున్న ఈ స్మార్ట్ఫోన్ ధరను రూ. 16-18 వేల మధ్య నిర్ణయించే అవకాశం వుందని బీబాం ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. శాంసంగ్ 'గెలాక్సీ ఎం 31' ఫీచర్లు : 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 6జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ రెండు వేరియంట్లలో లాంచ్ చేసే అవకాశం వుంది. 6.4 అంగుళాల డిస్ప్లే , ఎక్సినోస్ 9611 సాక్, 64 ఎంపీ ప్రధాన కెమెరా వెనుక క్వాడ్ కెమెరాలు, సెల్పీ కెమెరాను అమర్చింది. ఇన్ఫినిటీ యు కటౌట్తో 6.40 అంగుళాల పూర్తి హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లే, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లతో ఈ స్మార్ట్ఫోన్ విడుదల కానుందని భావిస్తున్నారు. అంతేకాదు గెలాక్సీ ఎం 11, ఎం 21 రెండు కొత్త మోడళ్లను కూడా ప్రకటించనుందని అంచనా. Samsung is all set to launch the all new Galaxy M31. This new #MegaMonster will come with a quad camera set up and as per our sources, the phone could be priced between 16-18K. Well, we can’t wait to know more details! @SamsungIndia pic.twitter.com/JVBmI6EKma — Beebom (@beebomco) February 7, 2020 -
ఎంటర్టైన్మెంట్ కా సూపర్స్టార్, బడ్జెట్ ధరలో
సాక్షి, ముంబై: రియల్మి సంస్థ భారత మార్కెట్లో సరికొత్త స్మార్ట్ఫోన్ను గురువారం లాంచ్ చేసింది. రియల్ మి సీ సిరీస్లో భాగంగా ఎంటర్టైన్మెంట్ కా సూపర్ స్టార్ పేరుతో రియల్మి సీ3ని ఆవిష్కరించింది. 3 జీబీ, 32 జీబీ స్టోరేజ్, 4జీబీ, 64జీబీ స్టోరేజ్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ను విడుదల చేసింది. రియల్మీసీ 1 సీ2 స్మార్ట్ఫోన్లకు ఇండియాలో మంచి ఆదరణ లభించిందని రియల్మి సీఈవో మాధవ్ సేథ్ వెల్లడించారు. ఈ స్మార్ట్ఫోన్ల 10 మిలియన్ యూనిట్లకు పైగా ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యాయని ఆయన పేర్కొన్నారు. రియల్మీ సీ3 ఫీచర్లు 6.5 అంగుళాల హెచ్డి + స్క్రీన్ ఆండ్రాయిడ్ 10 ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో జీ 70 సాక్ 12+2 ఎంపీ రియల్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ధరలు బేస్ వేరియంట్ 3 జీబీ, 32 జీబీ స్టోరేజ్ రూ. 6,999 హై ఎండ్ వేరియంట్ 4జీబీ, 64జీబీ స్టోరేజ్ రూ. 7.999. రియల్మి.కామ్, ఫ్లిప్కార్ట్ ద్వారా ఫిబ్రవరి 14 మధ్యాహ్నం 12 గంటల (మధ్యాహ్నం) నుంచి అమ్మకానికి లభ్యం. త్వరలో ఆఫ్లైన్ దుకాణాల్లో కూడా అందుబాటులోకి రానుంది. ఆఫర్ల విషయానికొస్తే రియల్మే సీ3 కొనుగోలుదారులకు రూ. 7,550 రిలయన్స్ జియో ఆఫర్. Presenting #EntertainmentKaSuperstar #realmeC3 starting at ₹6,999. -MediaTek Helio G70 AI Processor -5000mAh Battery -16.5cm (6.5") mini-drop full screen display -AI Dual Rear Camera 1st sale starts at 12 PM, 14 Feb on @Flipkart & https://t.co/HrgDJTZcxvhttps://t.co/VIVwlwDtaT pic.twitter.com/Pd6mQF0zww — realme (@realmemobiles) February 6, 2020 -
అద్భుతమైన డిస్ప్లేతో పోకో ఎక్స్ 2 వచ్చేసింది..
సాక్షి,ముంబై: షావోమి నుంచి విడిపోయిన పోకో తన మొట్టమొదటి స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. వేగవంతమైన ప్రాసెసర్తో ఆకట్టుకున్న పోకో ఎక్స్ 1 తరువాత, ఈ సిరీస్లో రెండవ స్మార్ట్ఫోన్ను పోకో ఎక్స్ 2 పేరుతో తీసుకొచ్చింది. 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉన్న పోకో ఎక్స్ 2 బేస్ వేరియంట్ రూ రూ.15,999 గా ఉంచింది. అలాగే ఎయిర్టెల్ లేదా జియో నెట్వర్క్లో ద్వారా వై ఫై కాలింగ్ సదుపాయాన్ని కూడా ఈ స్మార్ట్ఫోన్లో అందిస్తోంది. పోకో ఎక్స్ 2 అట్లాంటిక్ బ్లూ, మ్యాట్రిక్స్ పర్పుల్ , ఫీనిక్స్ రెడ్ అనే మూడు కలర్ వేరియంట్లలో లభిస్తుంది. పోకో ఎక్స్ 2 ఫీచర్లు 6.67 అంగుళాల డిస్ప్లే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 730జీ ప్రాసెసర్ 1080x2380 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 10 64+8+2+2 ఎంపీ రియర్ ఎమెరా 20 +2 ఎంపీ ఎంపీ సెల్ఫీ కెమెరా 4500 ఎంఏహెచ్బ్యాటరీ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో డిస్ప్లే, క్విడ్ కూలింగ్, యుఎస్బి టైప్-సి పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్, 27 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్, 960 ఎఫ్పీఎస్లో స్లో-మోషన్ వీడియోలను రికార్డింగ్ ఇతర ప్రధానపీచర్లుగా ఉన్నాయి. ధరలు : 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ రూ .16,999 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ టాప్ ఎండ్ వేరియంట్ రూ .19,999 పోకో ఎక్స్ 2 ఫిబ్రవరి 11 మధ్యాహ్నం 12 నుండి ఫ్లిప్కార్ట్లో మాత్రమే కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ క్రెడిట్ కార్డ్ కొనుగోలుపై అదనంగా రూ .1000 మినహాయింపు పొందవచ్చు. #POCOX2 key specs: - #120HzDisplay. - 64MP IMX686 Quad cam. - 20MP+2MP in-screen front cam. - SD 730G+LiquidCool Tech. - 4500mAh battery+27W in box charger. - Up to 8GB+256GB. - Starts @ 15,999. Let's see if can get 10K RTs. If we do, we give away, not 1 but 2 #POCOX2. #SmoothAF pic.twitter.com/i7k7IknIA5 — POCO India (@IndiaPOCO) February 4, 2020 -
అద్భుత ఫీచర్లతో ఒప్పో ఎఫ్15, వారే టార్గెట్
సాక్షి, ముంబై: ప్రముఖ మొబైల్ కంపెనీ ఒప్పో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. ప్రధానంగా యువ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని అత్యాధునిక ఫీచర్లతో ఒప్పో ఎఫ్ 15 స్మార్ట్ఫోన్ను గురువారం తీసుకొచ్చింది. వాటర్డ్రాప్-స్టైల్ నాచ్ డిజైన్తో అమోలెడ్ డిస్ప్లేతో వస్తున్న ఈ స్మార్ట్ఫోన్లో ఆకర్షణీయమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత వీడియో బ్యూటిఫికేషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్, వూక్ 3.0 ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, వెనుక భాగంలో క్వాడ్ కెమెరా ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. ఒప్పో ఎఫ్15 ఫీచర్లు 6.4 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే ఆండ్రాయిడ్ 9 పై 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్ 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 128 దాకా విస్తరించుకునే అవకాశం 48+8+2+2ఎంపీ రియర్ క్వాడ్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీకెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ధర : రూ. 19,990 అమెజాన్.ఇన్, ఫ్లిప్కార్ట్ , ఒప్పో ఇండియా ఆన్లైన్ స్టోర్ ద్వారా ప్రీ-ఆర్డర్లలో ఈ రోజు నుండి ప్రారంభం. మొదటి అమ్మకం జనవరి 24 న జరగనుంది. లాంచింగ్ ఆఫర్లు: వన్-టైమ్ స్క్రీన్ రీప్లేస్మెంట్, హెచ్డిఎఫ్సి కార్డ్ వినియోగదారులకు 10 శాతం క్యాష్బ్యాక్ -
సంక్రాంతి స్పెషల్: రియల్మి 5ఐ స్మార్ట్ఫోన్
సాక్షి, ముంబై: మొబైల్ తయారీదారు రియల్మి తన నూతన స్మార్ట్ఫోన్ రియల్మి 5ఐని నేడు (జనవరి 9) విడుదల చేసింది. నాలుగు కెమెరాలు, భారీ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ లాంటి మెరుగైన ఫీచర్లతో, బడ్జెట్ ధరలో భారత వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫ్లిప్కార్ట్, రియల్మి ద్వారా జనవరి15వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ స్మార్ట్ఫోన్ విక్రయాలు మొదలవుతాయి. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్వేరియింట్ ధరను రూ. రూ.8999 గా నిర్ణయించింది. రియల్మి 5ఐ ఫీచర్లు 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే 720x1600 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 9.0 పై ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 12+8+2+ 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ -
వివో ఎస్1 ప్రొ, జియో భారీ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ఫోన్ మేకర్ వివో సరికొత్త స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. మిడ్-బడ్జెట్ రేంజ్లో ఎస్ 1 ప్రొ భారతదేశంలో విడుదల చేసింది. ఎస్ సిరీస్లో భాగంగా దీన్ని తీసుకొచ్చింది. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ రూ. 19,990 ధర వద్ద నేటి (శనివారం) నుంచి వివోపాటు అమెజాన్, ఫ్లిప్కార్ట్ సహా అన్ని ఆన్లైన్,ఆఫ్లైన్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులో వుంచింది. వివో ఇండియా తన అధికారిక ట్విటర్లో షేర్ చేసిన వివరాల ప్రకారం వైట్, బ్లూ, బ్లాక్ మూడు కలర్ వేరియంట్లలో వచ్చింది. ఈ మేరకు ఒక టీజర్ వీడియోను షేర్ చేసిన సంగతి తెలిసిందే. లాంచింగ్ ఆఫర్లు జనవరి 31 వరకు వన్ టైం స్క్రీన్ రీప్లేస్మెంట్ ఐసీఐసీఐ క్రెడిట్కార్డు కొనుగోలుపై 10శాతం క్యాష్బ్యాక్ జనవరి 31 వరకు 12వేల రూపాయల విలువ చేసే జియో ఆఫర్ వివో ఎస్ 1 ప్రొ ఫీచర్లు 6.39 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే 2340 X 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ క్వాల్కం స్నాప్ డ్రాగన్ 665 సాక్ 48+8+2+2 ఎంపీ రియర్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 8 జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ 4500 ఎంఏహచ్ బ్యాటరీ -
సూపర్ నైట్ క్వాడ్ కెమెరాతో వివో వీ17
సాక్షి, ముంబై: చైనా మొబైల్ తయారీ సంస్థ వీవో కొత్త స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. తన వి సీరిస్లో భాగంగా వివో వి 17 స్మార్ట్ఫోన్ను వివో సోమవారం భారత్లో విడుదల చేసింది, క్వాడ్ రియర్ కెమెరా, సూపర్ అమోలెడ్ స్క్రీన్ "ఐవ్యూ" డిస్ప్లేతో వస్తున్న ఈ స్మార్ట్ఫోన్ రేటును రూ .22,990 గా నిర్ణయించింది. వివో ఇండియా ఇ-స్టోర్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, పేటీఎం మాల్, టాటాక్లిక్, బజాజ్ ఫిన్సర్వ్ స్టోర్లతోపాటు అన్ని రిటైల్ దుకాణాల్లో డిసెంబర్ 17 నుండి అందుబాటులో ఉంటుంది. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్ ద్వారా జరిపై కొనగోళ్లపై క్యాష్బ్యాక్ సౌకర్యం అందించనుంది. అలాగే సులభ వాయిదాల ద్వారా కూడా ఈ స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేయవచ్చు. డ్యూయల్ ఇంజిన్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కారణంగా ఇంటెన్సివ్గా రోజంతా వాడినా తమ లేటెస్ట్స్మార్ట్ఫోన్లో చార్జింగ్ సమస్య వుండదని వివో ప్రకటించింది. అలాగే తక్కువ లైట్లో కూడా మెరుగైన ఫోటోగ్రఫీ కోసం వెనుక కెమెరాలో సూపర్ నైట్ కెమెరాను అమర్చినట్టు తెలిపింది. వివో వి 17 ఫీచర్లు 6.4 ఫుల్హెచ్డీ డిస్ప్లే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 675 48+8+2+2 ఎంపీ క్వాడ్ రియర్ కెమెరా 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 4500 ఎంఏహెచ్ బ్యాటరీ -
అద్భుత ఫీచర్లు, బడ్జెట్ ధర ‘యూ 20’
సాక్షి, న్యూఢిల్లీ: చైనా మొబైల్ సంస్థ వివో కొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. యు-సిరీస్లో భాగంగా ‘యు 20’ స్మార్ట్ఫోన్ను శుక్రవారం లాంచ్ చేసింది. రేసింగ్ బ్లాక్, బ్లేజ్ బ్లూలో 4జీబీ/64జీబీ స్టోరేజ్, 6జీబీ/ 64జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఇది లభించనుంది. హాలో ఫుల్వ్యూ డిస్ప్లే, ఏఐ ట్రిపుల్ కెమెరా సెటప్,18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. దేశీయంగా గ్రేటర్ నోయిడాలో యూ 20ను తయారు చేశామని వివో వెల్లడించింది. ఈ స్మార్ట్ఫోన్ అమెజాన్, వివో ఇ-స్టోర్లలో నవంబర్ 28 నుండి అందుబాటులోకి రానుందని వివో ఇండియా డైరెక్టర్ నిపుణ్ మారియా ఒక ప్రకటనలో తెలిపారు. వివో యూ 20 ఫీచర్లు 6.53 అంగుళాల ఫుల్హెచ్ఢీ స్ర్కీన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 675 ప్రాససర్ 16+8+2 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ధరలు 4జీబీ+64జీబీ స్టోరేజ్ రూ.10,990 6జీబీ+64జీబీ స్టోరేజ్ రూ.11,990 -
అదిరిపోయే ఫీచర్లతో రియల్మి స్మార్ట్ఫోన్
సాక్షి, ముంబై: భారతీయ స్మార్ట్ఫోన్లో దాదాపు బడ్జెట్ ఫోన్లకే పరిమితమైన రియల్ మీ ఖరీదైన ఫోన్ల జాబితాలో అదిరిపోయే అడ్వాన్స్డ్ ఫీచర్లతో ఒక ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ నుబుధవారం లాంచ్ చేసింది. ఇంప్పటికే చైనాలో అందుబాటులోకి తీసుకొచ్చిన రియల్ ఎక్స్ 2 ప్రొ స్మార్ట్ఫోన్ ఇపుడు భారత మార్కెట్లలో కూడా తీసుకొచ్చింది. రియల్ మీ ఎక్స్2 ప్రోలో రెండు వేరియంట్లు అందుబాటులో ఉండనున్నాయి. అంతేకాదు దీంతోపాటు రియల్ ఎక్స్ 2 ప్రొ మాస్టర్ ఎడిషన్ను కూడా లాంచ్ చేసింది. ధరలు ప్రారంభ వేరియంట్ 8 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర : రూ.29,999 హై ఎండ్ వేరియంట్ 12 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర : రూ.33,999 మాస్టర్ ఎడిషన 12 జీబీ ర్యామ్, 256 జీబీ వేరియంట్ ధర : రూ.34,999 ఫ్లిప్కార్ట్, రియల్మి ఆన్లైన్ స్టోర్ల ద్వారా ఈ నెల 26నుంచి అందుబాటులోకి రానున్నాయి. రియల్ మీ ఎక్స్2 ప్రో మాస్టర్ ఎడిషన్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ గల ఒక్క వేరియంట్ లో మాత్రమే లభిస్తుంది. ఇది క్రిస్మస్నాటికి అందుబాటులోకి వస్తుంది. రియల్ మి ఎక్స్ 2 ప్రో ఫీచర్లు 6.50 అంగుళాల ఫుల్హెచ్డీ డిస్ప్లే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 855+ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 9పై 1080x2400 పిక్సె ల్స్ రిజల్యూషన్ 8జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 64+13 +8+ 2 ఎంపీ క్వాడ్ రియర్కెమెరా 4000ఎంఏహెచ్ బ్యాటరీ దీంతో పాటు రియల్మి ఎస్ పేరుతో మరో స్మార్ట్ఫోన్ను కూడా కంపెనీ లాంచ్ చేసింది. 48 ఎంపీ ప్రైమరీ క్వాడ్ రియర్ కెమెరా సెటప్తో రెండు వేరియంట్లలో లాంచ్ చేసింది. రూ. 9999, రూ 10,999 ధరలతో ఈ నెల 29 నుంచి విక్రయానికి లభ్యం. -
షావోమి అద్భుతమైన స్మార్ట్ఫోన్ వచ్చేసింది
షావోమి తన అద్భుతమైన కెమెరాను అధికారికంగా లాంచ్ చేసింది. 108 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్తో సహా ఐదు వెనుక కెమెరాలుతో ప్రతిష్టాత్మక స్మార్ట్ఫోన్ను నేడుబీజింగ్లోఆవిష్కరించింది. ఎంఐ సిరీస్లో భాగంగా ఎంఐ సీసీ9 ప్రొ పేరుతో దీన్ని లాంచ్ చేసింది. ఎంఐ సీసీ 9 ప్రో ధర బేసిక్ వేరియంట్ 6జీబీ ర్యామ్/ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సిఎన్వై 2,799 (సుమారు రూ .28,000) హై-ఎండ్ 8జీబీ ర్యామ్/ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సిఎన్వై 3,099 (సుమారు రూ. 31,000) ప్రీమియం ఎడిషన్ ధర 8జీబీ ర్యామ్/ 256 జీబీ స్టోరేజ్ సిఎన్వై 3,499 (సుమారు రూ .35,000) ఎంఐ సీసీ 9 ప్రో స్పెసిఫికేషన్లు డ్యూయల్ సిమ్ (నానో) మి సిసి 9 ప్రో MIUI 11 ను నడుపుతుంది. ఈ ఫోన్లో 6.47-అంగుళాల కర్వ్డ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే 1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 730జీ ప్రాసెసర్ 108 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఎఫ్ / 1.69 ఎపర్చరు ఫోర్-యాక్సిస్ ఓఐఎస్ (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) 117డిగ్రీల 20 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా, 2x ఆప్టికల్ జూమ్తో12 ఎంపీ షార్ట్ టెలిఫోటో లెన్స్ 50x డిజిటల్ జూమ్ సపోర్ట్తో 8 ఎంపీ లాంగ్ టెలిఫోటో లెన్స్ 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఎఫ్ / 2.0 ఎపర్చర్ 5260 ఎంఏహెచ్ బ్యాటరీ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ నవంబర్ 11 న చైనాలో విక్రయాలు ప్రారంభం. ప్రారంభమవుతుంది. ఇతర మార్కెట్లలో దీని లభ్యతపై ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. హువావే మేట్ 30 ప్రో, గెలాక్సీ నోట్ 10+, గూగుల్ పిక్సెల్ 4 ఫోన్లకు ఇది గట్టిపోటీ ఇవ్వనుందని భావిస్తున్నారు. -
రియల్మి తొలి ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్
రియల్ మీ సంస్థ కూడా ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోను మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సెగ్మెంట్లో తన మొట్టమొదటి డివైస్ రియల్ మి ఎక్స్ 2 ప్రొను సంస్థ ప్రకటించింది. చైనా, తదితర మార్కెట్లలో నవంబరు 4 నుంచి ప్రీ ఆర్డర్కు ఈ స్మార్ట్ఫోన్ లభిస్తుండగా, భారత మార్కెట్లో మాత్రం నవంబరు 20న ఆవిష్కరించనుంది. 8జీబీ ర్యామ్, 123 జీబీ స్టోరేజ్, 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ రెండు వేరియంట్లలో ఇది లభ్యంకానుంది. భారత్లో డిసెంబర్ మొదటి వారంలో అమ్మకాలు ప్రారంభం కావచ్చునని తెలుస్తోంది. రియల్మి ఎక్స్ 2 ప్రొ ఫీచర్లు 6.5-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ప్లే 1080 x 2400 పిక్సెల్స్ రిజల్యూషన్ స్నాప్డ్రాగన్ 855 ప్లస్ సాక్ 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 64 +8+13+2 ఎంపీ రియర్ కెమెరా, 16ఎంపీ సెల్పీకెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇన్ డిస్ప్లే వేలిముద్ర సెన్సార్, వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నలాజీ ఇతర ప్రధాన ఫీచర్లుగా ఉండనున్నాయి. -
మోటో జీ8 ప్లస్ : బడ్జెట్ ధర, అద్భుత ఫీచర్లు, జియో ఆఫర్
సాక్షి, ముంబై: ప్రముఖ మొబైల్తయారీదారు మోటరోలా జి సిరీస్లో కొత్త స్మార్ట్ఫోన్ను శుక్రవారం లాంచ్ చేసింది. బడ్జెట్ ధరలో జీ8 ప్లస్ను తీసుకొచ్చింది. కాస్మిక్ బ్లూ, క్రిస్టల్ పింక్ రంగుల్లో, అక్టోబర్ 29 నుంచి ఫ్లిప్కార్ట్ ద్వారా ప్రత్యేకంగా లభ్యం కానుంది. జియో ఆఫర్ : వినియోగదారులకు 2200 తక్షణ క్యాష్బ్యాక్ సదుపాయంతో పాటు రూ. 3వేల క్లియర్ ట్రిప్ కూపన్, రూ. 2వేల జూమ్ కార్ వోచర్ లభిస్తాయి. ధర రూ. రూ.13,999 మోటో జీ 8 ప్లస్ ఫీచర్లు 6.3 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లే ఆండ్రాయిడ్ 9పై క్వాల్కోమ్ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ 4 జీబీ ర్యామ్, 64 జీబీమ స్టోరేజ్ 512 వరకు విస్తరించుకునే అవకాశం 25 ఎంపీ సెల్ఫీ కెమెరా ట్రిపుల్ రియర్ కెమెరా 48+16 ఎంపీ అల్ట్రా వైడ్, 5 ఎంపీ డెప్త్ సెన్సర్ 4000 ఎంఏహెచ్ వాటర్ రిపెల్లెంట్ డిజైన్, డాల్బీ స్టీరియో స్పీకర్స్, ఫింగర్ ప్రింట్ సెన్సర్, టైప్ సీ ఛార్జర్ ఇతర ప్రత్యేకతలు. The next g is here! Get ready for anything with the all-new #motog8plus. 😎 The class-leading Quad Pixel camera system delivers 4x low light sensitivity, making sure you #DontMissAThing. Available soon on @Flipkart for ₹13,999. pic.twitter.com/pYmeCeYRsN — Motorola India (@motorolaindia) October 24, 2019 -
మరో అద్భుతమైన హానర్ స్మార్ట్ఫోన్
చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్, హువావే ఉపసంస్థ హానర్ మరో కొత్త ఫోన్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. హానర్ 20 సిరీస్ లో భాగంగా హానర్ 20 లైట్(యూత్ ఎడిషన్)ను హానర్ సంస్థ బుధవారం చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ మొబైల్ మరి కొన్ని నెలల్లోనే భారత్ సహా ఇతర అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మొత్తం నాలుగు వేరియంట్లు ఈ స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. బ్లాక్, గ్రీన్, బ్లూ-పింక్ గ్రేడియంట్ రంగుల్లో ఇది లభించనుంది. చైనాలో దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభం కాగా, అమ్మకాలు అక్టోబర్ 25 నుంచి ప్రారంభం. వాటర్ డ్రాప్ నాచ్ ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్, రియర్ ట్రిపుల్ కెమెరా. సూపర్ నైట్ సీన్ మోడ్, ఏఐ సీన్ రికగ్నిషన్, పొర్ ట్రెయిట్ మోడ్ లాంటి ప్రధాన ఆకర్షణలో ఈ స్మార్ట్ఫోన్లో పొందుపర్చారు. హానర్ 20 లైట్ ఫీచర్లు 6.3 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లే 2400 × 1080 రిజల్యూషన్ కిరిన్ 710F ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 9 పై ఈఎంయూఐ 9.1.1 16 ఎంపీ సెల్పీకెమెరా 48 +8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ + 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ధరలు 4 జీబీ ర్యామ్/ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,399 యువాన్లు (సుమారు రూ.14 వేలు) 6 జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,499 యువాన్లు (సుమారు రూ.15 వేలు) 6 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,699 యువాన్లు (సుమారు రూ.17 వేలు) టాప్ ఎండ్ వేరియంట్ 8 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ ధర 1,899 యువాన్లు (సుమారు రూ.19 వేలు) -
రూ.3899 కే స్మార్ట్ఫోన్
సాక్షి, న్యూఢిల్లీ : లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఒక కొత్త స్మార్ట్ఫోన్నుతీసుకొచ్చింది. ‘లావా జెడ్ 41’ పేరుతో ఎంట్రీ లెవల్ స్మార్ట్ఫోన్ను మంగళవారం లాంచ్ చేసింది. దీని ధర రూ. 3,899. మిడ్నైట్ బ్లూ, యాంబర్ రెడ్ రంగుల్లో ఇది లభిస్తుంది. స్మార్ట్ఫోన్ యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్లాంటి సోషల్మీడియా ప్లాట్ఫాంలతో వినియోగదారుల అన్ని సోషల్ మీడియా అవసరాలను తీర్చగలదు. యూట్యూబ్ గో వంటి డేటా యాప్ప్ సర్ఫింగ్కు కూడా ఈ స్మార్ట్ఫోన్ సపోర్ట్ చేస్తుంది. 5 అంగుళాల డిస్ప్లే ఆండ్రాయిడ్ 9 పై (గో ఎడిషన్) 5 ఎంపీ రియర్ కెమెరా 1 జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ 2500 ఎంఏహెచ్ బ్యాటరీ స్పెసిఫికేషన్ల పరంగా, 9 లెవల్ ఫిల్టర్లు, నైట్ షాట్, స్మార్ట్ స్లీప్, బర్స్ట్ మోడ్ ఎఫెక్ట్తో పాటు రియల్ టైమ్ బోకె ఫీచర్లతో రూ. 4వేల విభాగంలో ఉన్న ఏకైక స్మార్ట్ఫోన్ ఇదేనని లావా ఇంటర్నేషనల్ హెడ్ (ప్రొడక్ట్) తేజిందర్ సింగ్ వెల్లడించారు. -
నోకియా 6.2పై రూ.10వేల ఎక్స్చేంజ్ ఆఫర్
సాక్షి, ముంబై: నోకియా మరో అద్భుతమైన స్మార్ట్ఫోన్ భారత మార్కెట్లలో శుక్రవారం విడుదలైంది. గత నెలలో బెర్లిన్లో జరిగిన ఐఎఫ్ఎ టెక్ ఫెయిర్లో మొదట హెచ్ఎండి గ్లోబల్ ఈ ఫోన్ను ఆవిష్కరించింది. మిడ్ రేంజ్ సెగ్మెంట్లో నోకియా 6.2 పేరుతో లాంచ్ అయిన ఈ స్మార్ట్ఫోన్లో వాటర్డ్రాప్-స్టైల్ నాచ్, 3,500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫుల్-హెచ్డి + డిస్ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా, హెచ్డిఆర్ 10 సపోర్ట్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లాంటివి ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. భారతదేశంలో నోకియా 6.2 ధర 4జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్ ధర రూ. 15,999. అమెజాన్లో నోకియా 6.2 (సిరామిక్ బ్లాక్ వెర్షన్ ) అమ్మకాలు మొదలయ్యాయి. ఆఫర్ల విషయానికి వస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ డెబిట్ కార్డులను ఉపయోగించి చేసిన కొనుగోళ్లపై 2,000 రూపాయలు క్యాష్బ్యాక్. కొనుగోలుదారులు తమ పాత స్మార్ట్ఫోన్ను మార్పిడి చేసుకుంటే 10,100 వరకు ఆఫర్ను అందిస్తోంది. నోకియా 6.2 ఫీచర్లు 6.3 అంగుళాల ఫుల్-హెచ్డి + డిస్ప్లే ఆండ్రాయిడ్ 9 పై ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 636 సాక్ 4జీబీ ర్యామ్/64జీబీ స్టోరేజ్ 512 జీబీ దాకా విస్తరించుకునే సదుపాయం 16+ 5 + 8 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 3500 ఎంఏహెచ్ బ్యాటరీ -
అద్భుత ఫీచర్లతో వన్ ప్లస్ 7టీ ప్రొ..త్వరలోనే
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్ ప్లస్ దూకుడు పెంచింది. తాజాగా వన్ప్లస్ 7 సిరీస్లో వచ్చిన వన్ ప్లస్ 7టీకి కొనసాగింపుగా ‘వన్ ప్లస్ 7టీ ప్రొ’ పేరుతో మరో కొత్త ఫోన్ను తీసుకురానుంది. ఈనెల 10న లండన్ లో నిర్వహించే ఈ వెంట్లోలాంచ్ చేయనుంది. భారతదేశంలో కూడా అదే రోజు ఆవిష్కరించనుందని అంచనా.అమెజాన్లో ప్రత్యేకంగా అందుబాటులోకి రానుంది. ఇక ఫీచర్ల విషయానికి స్తే వన్ ప్లస్ 7టీ మాదిరిగానే వన్ ప్లస్ 7టీ ప్రో ఫీచర్లు ఉండనున్నాయట. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంతో రానున్న మొదటి ఫోన్ ఇదే. వన్ ప్లస్ 7టీ ప్రొ ఫీచర్లు 6.65 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ స్నాప్ డ్రాగన్ 855+ ప్రాసెసర్ 1440 x 3120 పిక్సెల్స్ రిజల్యూషన్ 8 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్ 48+8+16 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 16ఎంపీ సెల్పీ కెమెరా 4085 ఎంఏహెచ్ బ్యాటరీ ప్రారంభ ధర సుమారు రూ.49,999 Thought we were done? Oh we're just getting started. Watch out for something special | Oct 10 🤩 Get notified on https://t.co/V7hq4ZjFIt - https://t.co/mFNfvH7GTi pic.twitter.com/hJizQmyhvm — OnePlus India (@OnePlus_IN) October 5, 2019 -
వన్ప్లస్ 7టీ ధర తెలిస్తే..
సాక్షి, న్యూఢిల్లీ: చైనా సంస్థ వన్ప్లస్ వన్ ప్లస టీవీలతో పాటు మరో అద్భుతమైన స్మార్ట్ఫోన్ను తీసుకొచ్చింది. సెప్టెంబర్ 26 న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో వన్ప్లస్ 7 టీ పేరుతో ప్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ను భారత్లో విడుదల చేసింది. మే 2019 లో విడుదలై బహుళ ప్రజాదరణ పొందిన వన్ప్లస్ 7కు సక్సెస్సర్గా దీన్ని తీసుకొచ్చింది. రెండు స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 128 జీటీ స్టోరేజ్ ధర రూ. 37,999, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 39,999 గా ఉంచింది. ఇవి సెప్టెంబరు 28నుంచి కొనుగోలుకు లభ్యం. వన్ప్లస్ 7టీ ఫీచర్లు 6.55-అంగుళాల ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్ ప్లే స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్ 1080X2340పిక్సెల్స్ రిజల్యూషన 8జీబీ ర్యామ్ 48 48+16+12ట్రిపుల్ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 3800 ఎంఏహెచ్ బ్యాటరీ Introducing the OnePlus 7T pic.twitter.com/9posGe1E0n — OnePlus India (@OnePlus_IN) September 26, 2019 -
‘క్లియర్ యాజ్ రియల్’ : ప్రపంచంలోనే తొలి ఫోన్
సాక్షి, ముంబై : వివో తన నూతన స్మార్ట్ఫోన్ వివో వీ 17 ప్రోను శనివారం విడుదల చేసింది. ఎప్పటినుంచోటీజర్లతో భారత వినియోగదారులను ఊరిస్తున్న కంపెనీ ఎట్టకేలకు వివో ఈ స్మార్ట్ఫోన్ను ఇండియాలో విడుదల చేసింది. రెండు సెల్పీ కెమెరాలతో పాటు, డ్యుయల్ పాప్-అప్ రియర్ కెమెరా, మరోరెండు కెమెరా సెటప్తో దీన్ని ఆవిష్కరించడం విశేషం. అంటే నాలుగు రియర్ కెమెరాలను ఈ స్మార్ట్ఫోన్లో అమర్చింది. ఈ తరహా ఫీచర్లతో వస్తున్న ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్ఫోన్ ఇదేనని కంపెనీ చెబుతోంది. వివో వీ17 ప్రో స్మార్ట్ఫోన్ ధరను ఇండియాలో రూ. 29,990గా నిర్ణయించింది. వివో వీ17 ప్రొ 6.59 సూపర్ అమోలెడ్ డిస్ప్లే 2400x1080 పిక్సెల్స్రిజల్యూషన్ క్వాల్కం స్నాప్బ్రాగన్ 675 సాక్ 8 జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ 48+13 ఎంపీ పాప్ అప్ కెమెరా, 8+2 ఎంపీ రియర్ కెమెరా 32+8 ఎంపీ సెల్పీ కెమెరా 4100 ఎంఏహెచ్ బ్యాటరీ రెండు రంగుల్లో లభించనున్న ఈ స్మార్ట్ఫోన్ ప్రీ ఆర్డర్కు ప్రస్తుతం అందుబాటులో ఉండగా, సెప్టెంబరు 27 నుంచి కొనుగోలుకు లభ్యం. Double the clarity, double the fun. Make the most of the ordinary moments with the world's first 32MP Dual Pop-Up Selfie & 48MP AI Quad Rear Camera. Experience #ClearAsReal , brighter pictures. Starts at INR 29,990/- . Know more : https://t.co/DEvRS2izRp pic.twitter.com/AfcTJsxYhr — Vivo India (@Vivo_India) September 20, 2019 -
శాంసంగ్ ఎం30ఎస్ : భలే ఫీచర్లు
సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ సరికొత్త మొబైల్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. గెలాక్సీ ఎం30ఎస్ పేరుతో విడుదల చేసిన ఈ స్మార్ట్ఫోన్లో వాటర్డ్రాప్ డిస్ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ప్రధాన ఆకర్షణ. శాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్లో భాగంగా దీన్ని ఆవిష్కరించింది. 4జీబీ ర్యామ్/ 64జీబీ స్టోరేజ్, 6జీబీర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్లలో వినియోగదారులకు లభించనుంది. ఇప్పటికే గెలాక్సీ ఎం10, గెలాక్సీ ఎం20 స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. శాంసంగ్ ఎం30 ఎస్ ఫీచర్లు 6.4 అంగుళాల ఆమోల్డ్ డిస్ప్లే స్క్రీన్ ఆండ్రాయిడ్ ఓరియో 8.1 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 48+5+8 ఎంపీ ట్రిపుల్ కెమెరా 6000 ఎంఏహెచ్ బ్యాటరీ 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ధర : 13,999 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర : 16,999 సెప్టెంబరు 29నుంచి విక్రయానికి లభ్యం. -
వివో జెడ్1 ఎక్స్ : సూపర్ ఫీచర్లు
సాక్షి, న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్ తయారీదారు వివో తన జెడ్ సిరీస్లో మరో స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించింది. వివో జెడ్ 1 ఎక్స్ పేరుతో భారతదేశంలో ప్రారంభించింది. వివో జెడ్-సిరీస్లో ఇది కంపెనీ రెండవ ఫోన్. ఇందులో 48 మెగా పిక్సెల్ ట్రిపుల్ కెమెరా, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, అమోలేడ్ డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 712 సాక్, 22 వాట్ ఫ్లాష్చార్జ్ స్పెషల్ ఫీచర్లుగా ఉన్నాయి. ఫాంటమ్ పర్పుల్, ఫ్యూజన్ బ్లూ రంగులలో లాంచ్ అయిన ఈ స్మార్ట్ఫోన్, ఫ్లిప్కార్ట్, వివో ఆన్లైన్ స్టోర్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. వివో జెడ్ 1 ఎక్స్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 6 జీబీర్యామ్/ 64 జిబి స్టోరేజ్ మోడల్ ధర రూ .16,990. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.18,990 ఆఫర్ల విషయానికొస్తే, వివో జెడ్ 1 ఎక్స్ ఫోన్ కొనుగోలుపై రిలయన్స్ జియో రూ .6,000 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. అంతేకాకుండా, వినియోగదారులు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డు రూ .1,250 ఆఫర్ కూడా ఉంది. సెప్టెంబర్ 13 నుండి అమ్మకానికి లభ్యం. వివో జెడ్ 1 ఎక్స్ ఫీచర్లు 6.38-అంగుళాల సూపర్ అమోలెడ్ వాటర్డ్రాప్ నాచ్ డిస్ప్లే స్నాప్డ్రాగన్ 712 ఎఐఈ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 9 పై 48+ 2+8 ఎంపీ రియర్ ట్రిపుల్ కెమెరా . 32 ఎంపీ సెల్పీ కెమెరా 4500 ఎంఏహెచ్ బ్యాటరీ -
జియోనీ ఎఫ్ 9 ప్లస్ : అద్భుత ఫీచర్లు, బడ్జెట్ధర
సాక్షి, ముంబై: మొబైల్ సంస్థ జియోనీ ఎఫ్ 9 ప్లస్ పేరుతో మరో స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. భారీ డిస్ప్లే, బ్యాటరీ, డ్యుయల్ రియర్ కెమెరాలాంటి అద్భుత ఫీచర్లతో ఈ డివైస్ను తీసుకొచ్చింది. 6.26-అంగుళాల హెచ్డి + ఫుల్ వ్యూ డిస్ప్లే, వాటర్డ్రాప్ నాచ్తో ఫీచర్తో తీసుకొచ్చింది. ధర: రూ.7690 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభించనుంది. జియోనీ ఎఫ్9 ప్లస్ ఫీచర్లు 6.26 ఇంచ్ డిస్ప్లే 1.65 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 9.0 పై 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 13 +2 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరా 13ఎంపీ సెల్ఫీ కెమెరా 4050 ఎంఏహెచ్ బ్యాటరీ వినియోగదారుల మారుతున్న ప్రాధాన్యతలతో బ్రాండ్లు అభివృద్ధి చెందాలి ,సాంకేతిక పరిజ్ఞానం, మారుతున్న ధోరణులకనుగుణంగా ఉత్పత్తులు ఉండాలి. ముఖ్యంగా కస్టమర్ల స్పష్టమైన అభిరుచిని చేరుకునేందుకు జియోనీ ఎల్లపుడూ ప్రయత్నిస్తుందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ జైన్ తెలిపారు. అంతేకాదు ఈ స్మార్ట్ఫోన్తో పాటు, జియోనీ ‘జీబడ్డీ’ పేరుతో కొత్త సబ్ బ్రాండ్ను కూడా ప్రకటించింది. ఈ బ్రాండ్ కింద వైర్లెస్ హెడ్ఫోన్స్, వైర్లెస్ నెక్బ్యాండ్ హెడ్సెట్, ఇయర్ఫోన్స్ , పవర్ బ్యాంక్లను ఆవిష్కరించింది. -
శాంసంగ్ గెలాక్సీ ఏ 90 5జీ స్మార్ట్ఫోన్ లాంచ్
సియోల్ : దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ ‘ఎ’ సిరీస్లో మరో ఫోన్ను పరిచయం చేసింది. అందరూ ఊహించినట్టుగా శాంసంగ్ గెలాక్సీ ఏ 90 పేరుతో ఈ స్మార్ట్ఫోన్ను నేడు (మంగళవారం, సెప్టెంబరు 3) దక్షిణ కొరియాలో తీసుకొచ్చింది. ఇది గెలాక్సీ ఏ సిరీస్లో మొట్ట మొదటి 5జీ డివైస్ కాగా, శాంసంగ్ డెక్స్ సపోర్ట్తో వచ్చిన తొలి ఫోన్ కూడా. అంతేకాదు శాంసంగ్ ఎస్10, శాంసంగ్ నోట్ 10, నోట్ 10 ప్లస్ తరువాత వస్తున్న నాల్గవ 5జీ స్మార్ట్ఫోన్ శాంసంగ్ ఏ 90 కావడం మరో విశేషం. స్లిమ్ బెజెల్స్ ఇన్ఫినిటీ యూ డిస్ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా, సూపర్-ఫాస్ట్ ఛార్జింగ్ ప్రధాన ఆకర్షణ కానున్నాయి. 64, 128 జీబీ స్టోరేజ్ రెండు వేరియంట్లలో ఈ స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించింది. అయితే 64 జీబీ స్టోరేజి వేరియంట్ను 512 జీబీ వరకు విస్తరించుకునే అవకాశాన్ని కల్పించింది. రేపటి నుంచి కొరియన్ మార్కెట్లలో విక్రయానికి లభ్యం. అయితే ధర వివరాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. అలాగే ఇండియాలో 5జీ వచ్చే ఏడాది నాటికి సిద్ధం కానుంది. ఈ నేపథ్యంలో శాంసంగ్ ఏ 90 4జీ వేరియంట్ను ఇండియాలో తీసుకొస్తుందా లేదా, వచ్చే ఏడాది దాకా వెయిట్ చేస్తుందా అనేది ప్రస్తుతానికి స్పష్టత లేదు. శాంసంగ్ ఏ 90 ఫీచర్లు 6.7 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే ఆక్టా-కోర్ చిప్ స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్ 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 48+8+5 ఎంపీ రియర్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 4500 ఎంఏహెచ్ బ్యాటరీ -
సూపర్ అప్డేట్స్తో ఎంఐ ఏ3
సాక్షి, ముంబై : చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమి మరో స్మార్ట్ఫోన్ తీసుకొచ్చింది. ఎంఐ ఏ సిరీస్లో భాగంగా తాజాగా ‘ఎంఐ ఏ3’ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. భారీ అప్డేట్స్తో అద్భుత ఫీచర్లతో రెండు వేరియింట్లలో మూడు రంగుల్లో దీన్ని తీసుకొచ్చింది. 4జీబీ/ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,999 వద్ద, 6జీబీ/128 జీబీ స్టోరేజ్ ధర రూ.15,999 వద్ద అందుబాటులోకి తీసుకొచ్చింది. ట్రిపుల్ రియర్ కెమెరా డాట్నాచ్, సూపర్ అమోలెడ్ డిస్ప్లే, తొలి ఆండ్రాయిడ్ క్వాల్కం అపడేట్ ఫోన్ లాంటి సూపర్ అప్డేట్స్ తో ఎంఐఏ3 ఆవిష్కరించామని షావోమి ప్రకటించింది. ఎంఐ ఏ3 ఫీచర్లు 6.08అంగుళాల డిస్ప్లే క్వాల్కం స్నాప్డ్రాగన్ 665 ప్రాససర్ 720x1560 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 9.0 4జీబీర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 48+8+2 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 4030 ఎంఏహెచ్ బ్యాటరీ -
ఐఫోన్ 11 ఆవిష్కరణ.. త్వరలోనే
అమెరికా స్మార్ట్పోన్ దిగ్గజం ఆపిల్ తన తదుపరి ఐఫోన్ను త్వరలోనే లాంచ్ చేయనుందట. ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ ఐఫోన్ 11ను సెప్టెంబర్లో లాంచ్ చేయనుందని తాజా లీక్ల ద్వారా తెలుస్తోంది. సెప్టెంబర్ రెండవ వారంలో ఐఫోన్ 11 స్మార్ట్ఫోన్ను 11 ప్రొ, 11 ఆర్, 11 మాక్స్ పేరుతో మూడు మోడళ్లలో లాంచ్ చేయనుంది. 5జీ టెక్నాలజీ అప్గ్రేడ్, ట్రిపుల్ రియర్ కెమెరా లాంటి ఫీచర్లతో వీటిని తీసుకురానుందని సమాచారం. సాధారణంగా సెప్టంబరు మాసంలో తన ఫ్లాగ్షిప్ డివైస్లను లాంచ్ చేయడం ఆపిల్ ఆనవాయితీగా పాటిస్తూ వస్తోంది. ఈ సాంప్రదాయాన్ని గత రెండేళ్లుగా మిస్ అవుతూ వస్తోంది. 2017 లో, ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ సెప్టెంబరులో విడుదల చేయగా , ఐఫోన్ ఎక్స్ను నవంబర్లో తీసుకొచ్చింది. అయితే 2018 లో, ఐఫోన్ ఎక్స్ సెప్టెంబరులో, లోయర్-ఎండ్ ఐఫోన్ ఎక్స్ అక్టోబర్లో ప్రారంభించింది. 2019లో మాత్రం సెప్టెంబర్ సెంటిమెంట్ను ఫాలో కావాలని ఆపిల్ భావిస్తోందట. మరోవైపు అమెరికా చైనా ట్రేడ్వార్ నేపథ్యంలో సెప్టెంబరు 1 నుంచి అమెరికాలో చైనా దిగుమతులపై 10శాతం సుంకాల విధింపు ప్రకటన చైనాలో ఆపిల్ విక్రయాలపై ప్రభావం చూపుందని ఎనలిస్టులు భావిస్తున్నారు. తాజాగా సుంకాల విధింపును డిసెంబరు వరకు వాయిదా వస్తూ ట్రంప్ సర్కారు నిర్ణయం తీసుకుంది. -
హువావే వై 9 ప్రైమ్ లాంచ్
చైనా రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మేకర్ హువావే నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. హువావే వై 9 ప్రైమ్ పేరుతో నేడు (ఆగస్టు 1, గురువారం) ఇండియన్ మార్కెట్లో తీసుకొచ్చింది. పాప్ అప్ కెమెరా సెల్ఫీ కెమెరా, ట్రిపుల్ రియర్ కెమెరా ప్రధాన ఫీచర్లుగా కంపెనీ తెలిపింది. ధర రూ.15,990 గా ఉంచింది. అమెజాన్లో ప్రైమ్ కస్టమర్లకు ఆగస్టు 7వ తేదీ నుంచి, మిగిలిన వారికి 8వ తేదీనుంచి ఈ ఫోన్ను విక్రయించనున్నారు. లాంచింగ్ ఆఫర్ల విషయానికి వస్తే నో కాస్ట్ ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు చేసే సౌకర్యంతోపాటు, ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో ఈ ఫోన్ను కొంటే 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. అమెజాన్ పే ద్వారా కొంటే రూ.500 డిస్కౌంట్ ఇస్తారు. అలాగే జియో కస్టమర్లకు రూ.2200 విలువైన ప్రయోజనాలు లభిస్తాయి. హువావే వై9 ప్రైమ్ ఫీచర్లు 6.7 అంగుళాల ఫుల్ వ్యూ డిస్ప్లే ఆక్టాకోర్ కిరిన్ 710 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 9.0 పై 4 జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ 16+ 8+ 2 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 4 000 ఎంఏహెచ్ బ్యాటరీ -
రెడ్మి కే 20 ప్రొ వచ్చేసింది
సాక్షి, న్యూఢిల్లీ : స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమి ఫ్లాగ్షిప్ కిల్లర్ స్మార్ట్ఫోన్ సిరీస్ను లాంచ్ చేసింది. బుధవారం న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో రెడ్మి కే సీరిస్లో రెడ్మి 20కే, 20కే ప్రొస్మార్ట్ఫోన్లను ఆవిష్కరించింది. కార్బన్ బ్లాక్, ఫ్లేమ్ రెడ్, గ్లేసియర్ బ్లూ కలర్స్లో ఆప్షన్లో వీటిని తీసుకొచ్చింది. హొరైజన్ అమోలెడ్ డిస్ప్లే, ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్లాక్, థియేటర్ గ్రేడ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్, ఏఐ ట్రిపుల్ కెమెరా, కెమెరా ఎడ్జ్ లైటింగ్ సిస్టం పాప్ అప్కెమెరా, 20 వాట్స్ సోనీ చార్జ్ సపోర్ట్ ప్రత్యేకతలుగా షావోమి పేర్కొంది. రెడ్మి కే 20 ప్రొ ఫీచర్లు 6.39 అంగుళాల ఫుల్హెచ్డీ హొరైజన్ అమోలెడ్ డిస్ప్లే క్వాల్కం స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ 48+13+8 ఏఐ ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 20 ఎంపీ పాపప్ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ డ్రాప్ ప్రొటెక్షన్: జారిపోతున్న క్రమంలో సీపీయూ పాప్అప్ కెమెరాను అలర్ట్ చేస్తుందట. ధరలు రెడ్మి 20 కే ప్రొ 6 జీబీర్యామ్, 128 స్టోరేజ్ 27,999 8 జీబీర్యామ్, 256 స్టోరేజ్ 30,990 రెడ్ మి కే 20ఫీచర్ల విషయానికి వస్తే.. క్వాల్కం స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్ తప్ప మిగతా అన్ని ఫీచర్లను రెడ్మికే 20 ప్రొ ఫీచర్ల మాదిరిగానే ఉంచింది. మిహోం, ఎంఐ, ఫ్లిప్కార్ట్ ద్వారా 22 జులై నుంచి ఈ స్మార్ట్ఫోన్లు విక్రయానికి అందుబాటులో ఉంటాయి. రెడ్మి కే 20 6 జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ రూ. 23,999 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ రూ. 21,999 -
రియల్మి ఎక్స్..రెడ్మి కె20కు షాకిస్తుందా?
సాక్షి, ముంబై : ఒప్పో చెందిన సబ్బ్రాండ్ రియల్మి కొత్త స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించనుంది. ఈ నెల 15వ తేదీన రియల్మి ఎక్స్ పేరుతో ప్రీమియం స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. ఫ్లిప్కార్ట్లో ఎక్స్క్లూజివ్గా ఈ ఫోన్ను అందుబాటులోకి తేనుంది. చైనాలో లాంచ్ చేసిన రియల్మి ఎక్స్ కంటే భిన్నంగా భారత్లో ఈ స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తున్నామని రియల్మీ సీఈవో మాధవ్ సేత ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. పాప్ అప్ కెమెరా, వూక్ ప్లాష్ చార్జ్ 3.0, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్లతో 4జీబీ, 6 జీబీ ర్యామ్ / 64 జీబీ స్టోరేజ్ , 8జీబీ ర్యామ్ /128జీబీ స్టోరేజ్ మూడు వేరియంట్లలో ఇది లభ్యం కానుంది. ప్రీమియం వెర్షన్ ధరను రూ.18,000గా నిర్ణయించే అవకాశం ఉందని అంచనా. రియల్మి ఎక్స్ ఫీచర్లు 6.53 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లే 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఆండ్రాయిడ్ 9.0 పై ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 48 + 5 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 3765 ఎంఏహెచ్ బ్యాటరీ Charge Xponentially fast and shoot your phone’s battery to 55% in just 30 mins without any heating issue! Meet VOOC Flash Charge 3.0 on #realmeX. Witness the launch of #realmeX at 12:30 PM, 15th July on https://t.co/reDVoAlOE1. Know more: https://t.co/BYqF48ZiWb#LeapToPremium pic.twitter.com/Ynhjxr1h4y — realme (@realmemobiles) July 8, 2019 -
బడ్జెట్ ధరలో వివో జెడ్ 1 ప్రొ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ : మొబైల్ తయారీదారు వివో కొత్త స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. జెడ్ సిరీస్లో భాగంగా వివో జెడ్ 1 ప్రొ స్మార్ట్ఫోన్ను బుధవారం తీసుకొచ్చింది. 11 జూలై 11వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్కార్ట్ ద్వారా వివో జెడ్1 ప్రొ లభ్యం కానుంది. మూడు వేరియంట్లలో ఈ స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించింది. ఏఐ ఆధారితి ట్రిపుల్ రియర్ కెమెరా, డెడికేటెడ్ గేమ్ మోడ్, పంచ్ హోల్ డిజైన్ తదితర ముఖ్య పీచర్లతోపాటు స్నాప్డ్రాగన్ 712 సాక్తో తీసుకొస్తున్న తొలి మొబైల్ ఇదని వివో స్ట్రాటజీ డైరెక్టర్ నిపుణ మార్య ప్రకటించారు. వివో జెడ్ 1 ప్రొ ఫీచర్లు ఆండ్రాయిడ్ 9 స్నాప్డ్రాగన్ 712 సాక్ 8+16+2ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 4జీబీ ర్యామ్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ. 14,999 6జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ ధర రూ. 16,999 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ రూ. 18,999 ధరల్లో ఈ స్మార్ట్ఫోన్ అందుబాటులో వుంటుంది. సోనిక్బ్లూ, సోనిక్ బ్లాక్, మిర్రర్బ్లాక్ కలర్స్లో లభ్యం. -
స్మార్ట్దేశ్ కా స్మార్ట్ఫోన్.. కమింగ్ సూన్
చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమి మరో బడ్జెట్ స్మార్ట్ఫోన్తో భారతీయ వినియోగదారులను ఆకట్టుకునేందుకు రడీ అవుతోంది. రెడ్ మి సిరీస్లో రెడ్మి 7ఏ పేరుతో ఒక స్మార్ట్ఫోన్ను లాంచ్ చేయబోతోంది. ఈ విషయాన్ని షావోమి ఇండియా ప్రెసిడెంట్ మనుకుమార్జైన్ ట్విటర్ద్వారా వెల్లడించారు. జూలై 4న స్మార్ట్ దేశకా స్మార్ట్ఫోన్ వస్తోందంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు ఈ డివైస్లో చైనాలో అందుబాటులో లేని పీచర్ను జోడిస్తున్నామంటూ ఊరిస్తున్నారు. రెడ్మి 6ఏ తరువాత ఆ పరంపరలో రెడ్మి7ఏ ను లాంచ్ చేస్తోంది. ఇప్పటికై చైనాలో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ఫోన్ ధరను ఇండియాలో రూ.6 వేల వద్ద నిర్ణయించ వచ్చని అంచనా. ఇక ఫీచర్లు ఇలా ఉండనున్నాయట. రెడ్మి 7ఏ ఫీచర్లు 5.4 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే క్వాల్కం స్నాప్ డ్రాగన్ 439 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 9 పై 3జీబీ ర్యామ్ 32 జీబీ స్టోరేజ్ 13ఎంపీ రియర్ కెమెరా 5ఎంపీ సెల్పీ కెమెరా 4000 బ్యాటరీ Mi fans, here’s something exciting 😉. We are set to launch the #Redmi7A on 4th July. Let’s welcome #SmartDeshKaSmartphone and get ready to see it conquer the world. Can’t wait! 😎 How long will it take for 7A to become #1? 😉Any guesses? 😍#Xiaomi #Redmi pic.twitter.com/NNg9lfppmS — Manu Kumar Jain (@manukumarjain) July 1, 2019 -
నోకియా 2.2 లాంచ్..పరిమిత కాల ధరలు
నోకియా సంస్థ నోకియా 2.2 స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. నోకియా 2.1 కి సక్సెసర్గా బడ్జెట్ ధరలో ఈ స్మార్ట్ఫోన్ను హెచ్ఎండీ గ్లోబల్ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఇది షావోమి రెడ్మి 7కి గట్టిపోటీ ఇస్తుందని భావిస్తున్నారు. వాటర్డ్రాప్ నాచ్, ఏఐ ఆధారిత రియర్, సెల్ఫీ కెమెరాలు ప్రధాన ఆకర్షణ. నోకియా 2.2 ఫీచర్లు 5.71 అంగుళాల డిస్ప్లే 720×1520 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ పై 9.0 13ఎంపీ రియర్ కెమెరా 5 ఏంపీ సెల్ఫీ కెమరా 3000 ఎంఏహచ్ బ్యాటరీ లాంచింగ్ ఆఫర్: నోకియా 2.2 కొనుగోలు చేసిన జియో వినియోగదారులకు 2,200 క్యాష్బ్యాక్తోపాటు, 100 జీబీ డాటా ఉచితం. ప్లిప్కార్ట్, నోకియా తదితర ఈ స్టోర్ల ద్వారా జూన్ 11 నుంచి అందుబాటులోకి రానుంది. అయితే ప్రీబుకింగ్స్ నోకియా ఈ స్టోర్ల ద్వారా నేటి నుంచే ప్రారంభం. ధరలు 2జీబీ ర్యామ్ /16జీబీ స్టోరేజ్ధర రూ. 6,999 3జీబీ ర్యామ్/32 జీబీ స్టోరేజ్ ధర రూ. 7,999 ఈ ధరలు పరిమిత కాలానికి మాత్రమే పరిమితం. జూన్ 30 తరువాత నోకియా 2.2 ధరలు ఇలా ఉండనున్నాయి. 2జీబీ ర్యామ్ /16జీబీ స్టోరేజ్ధర రూ. 7,699 3జీబీ ర్యామ్/32 జీబీ స్టోరేజ్ ధర రూ. 8,699 -
నోకియా 6.2 కమింగ్ సూన్
నోకియా మరో కొత్త స్మార్ట్ఫోన్ను లాంచ్ చేయబోతోంది. నోకియా 6.2 పేరుతోహెచ్ఎండీ గ్లోబల్ జూన్ 6న మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్ను తీసుకురానుంది. ఈ మేరకు నోకియా ఒక టీజర్ను వదిలింది. ఇందులో స్మార్ట్ఫోన్ ఫీచర్లు, తదితర పూర్తి వివరాలను అందించనప్పటికీ జూన్ 6వ తేదీన ఒక ఈవెంట్లో ఒక గ్లోబల్ ఇటలీ, ఇండియా మార్కెట్లలో) లాంచ్ ఉండబోతోందని తెలిపింది. అయితే ఈ స్మార్ట్ఫోన్ ధర రూ. 20200గా ఉండవచ్చని అంచనా. ఫీచర్లపై వివిధ అంచనాలు ఇలా ఉన్నాయి. #GetAhead with a sleek design & customizability. Stay tuned! 👉 06 June 2019 pic.twitter.com/hBUVc1BpGa — Nokia Mobile (@NokiaMobile) June 1, 2019 నోకియా 6.2 ఫీచర్లు 6.39 అంగుళాల ఫుడ్ హెచ్డీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 9పై 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ 48+8+5 ఎంపీ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్పీ కెమెరా 3500బ్యాటరీ See things in a new light on 06 June 2019. 😎 Stay tuned to #GetAhead in life. pic.twitter.com/Jy01t9Zyp5 — Nokia Mobile (@NokiaMobile) May 30, 2019 -
సూపర్ ఫీచర్లు, బడ్జెట్ధర : మెయ్జు 16ఎక్స్ఎస్
బీజింగ్: అధునాతన ఫీచర్లతో చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ సంస్థ మెయ్జు సరికొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. 16ఎక్స్ఎస్ పేరుతో ఈ స్మార్ట్ఫోన్ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. ప్రధానంగా ఈ స్మార్ట్ఫోన్లో 48మెగాపిక్సెల్ కెమెరా సహా ట్రిపుల్ రియర్ కెమెరాలను రియర్ సైడ్లో ఏర్పాటు చేసింది. ఇంకా భారీ స్క్రీన్, ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫాస్ట్ ఫేస్ అన్లాక్ ఫీచర్ను అందిస్తోంది. అదీ బడ్జెట్ ధరలో. రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానున్న ఈ స్మార్ట్ఫోన్ ప్రారంభ ధరను రూ.17,150 గా నిర్ణయించింది. మెయ్జు 16ఎక్స్ఎస్ ఫీచర్లు 6.2 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే 1080 x 2232 పిక్సల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 9.0 పై 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్ 48+8+5 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరా 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ -
భారీ బ్యాటరీతో వివో వై3 లాంచ్
బీజింగ్ : చైనా స్మార్ట్ఫోన్ మేకర్ వివో సరికొత్త స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించింది. వై సిరీస్లో భాగంగా వై 3 పేరుతో మొబైల్ను చైనాలో లాంచ్ చేసింది. ట్రిపుల్ రియర్ కెమెరా, భారీ బ్యాటరీ ప్రధాన ఆకర్షణగా ఉంది. భారత్ మార్కెట్లో ఎపుడు విడుదలయ్యేది స్పష్టత ఇవ్వలేదు వివో. వివో వై 3 ఫీచర్లు 6.35 అంగుళాల డిస్ప్లే 720x1544 పిక్సెల్స్ రిజల్యూషన్ మీడియా టెక్ హీలియో పీ 35 ప్రాసెసర్ 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 13+8+2 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ధర సుమారు రూ. 15,200 -
అధ్బుత ఫీచర్లతో ఆసుస్ స్మార్ట్ఫోన్
ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ దారు ఆసుస్ తాజాగా మరో కొత్త స్మా్ర్ట్ఫోన్ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. జెన్ ఫోన్ సిరీస్లో ‘జెన్ఫోన్ 6’ పేరుతో సరికొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ను గ్లోబల్గా లాంచ్ చేసింది. స్పెయిన్లో గురువారం రాత్రి జరిగిన ఒక కార్యక్రమంలో కంపెనీ ఈ ఫోన్ను ఆ విష్కరించింది. ఈ ఫోన్ త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి కూడా రానుంది. రొటేటింగ్ కెమెరా జెన్ఫోన్ 6 స్పెషల్ ఎట్రాక్షన్ అని కంపెనీ చెబుతోంది. ఈ స్మార్ట్ఫోన్లోని కెమెరాను మనకను గుణంగా ముందుకు, వెనక్కు రొటేట్ చేసుకోవచ్చన్నమాట. 8 జీబీ ర్యామ్/256 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ 6 జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్ ఇలా మూడు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. ఆసుస్ జెన్ఫోన్ 6 ఫీచర్లు 6.4 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 855 ఆండ్రాయిడ్ 9.0 పై 48+13 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ ధర : రూ.39,000 నుంచి ప్రారంభం -
రెడ్మికి షాక్ : చౌక ధరలో స్మార్ట్ఫోన్
సాక్షి, న్యూఢిల్లీ: ఆధునిక ఫీచర్లు, సరసమైన ధరలో అదిరిపోయే స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. బడ్జెట్ స్మార్ట్ఫోన్లకు పెట్టింది పేరైన ఐటెల్ కంపెనీ దీన్ని ఆవిష్కరించింది. ఐ టెల్ ఏ 46 పేరుతో దీన్ని ఆవిష్కరించింది. ప్రముఖ మొబైల్ సంస్థ రెడ్మికి చెందిన రెడ్ మి 6ఏ కు పోటీగా నిలుస్తుందని మార్కెట్వర్గాలు భావిస్తున్నాయి. భారీ స్క్రీన్, డ్యూయెల్ రియర్ కెమెరా, ఫింగర్ప్రింట్ సెన్సర్, ఐటెల్ ఏ46 స్మార్ట్ఫోన్ ప్రత్యేకతగా కంపెనీ చెబుతోంది. దీని ధరను రూ.4,999గా వెల్లడించింది. ఫోన్తోపాటు స్క్రీన్ గార్డ్, బ్యాక్ కేస్ను కూడా ఉచితంగా అందిస్తోంది. 1జీబీర్యామ్, 2 జీబీ ర్యామ్ రెండు వేరియంట్లలో నాలుగు రంగుల్లో లభ్యం. అలాగే జియో రూ. 198, 299 ( 24 నెలలపాటు) రీచార్జ్ ప్యాక్లపై రూ.1200 ఇన్స్టెంట్ క్యాష్బ్యాక్ను కూడా ఆఫర్ చేస్తోంది. ఐటెల్ ఏ46 ఫీచర్లు 5.45 అంగుళాల డిస్ప్లే 1.6 గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ 1440 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్ 2 జీబీ ర్యామ్+ 16 జీబీ మెమరీ 128జీబీ వరకు విస్తరించుకనే అవకాశం 8 ఎంపీ+వీజీఏ సెన్సర్ డ్యూయెల్ రియర్ కెమెరా 2400 ఎంఏహెచ్ బ్యాటరీ -
వివో ఎస్1 ప్రొ స్మార్ట్ఫోన్ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ : చైనా స్మార్ట్ఫోన్ కంపెనీ వివో కొత్త స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న పాప్ అప్ సెల్ఫీ కెమెరాతో దీన్నితీసుకొస్తోంది. వివో ఎస్1 ప్రొ పేరుతో చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. ఇటీవల భారత్లో తీసుకొచ్చిన వివో వీ 15 ప్రొ ఫీచర్లతోనే దీన్ని అందుబాటులోకి తెచ్చింది. 6జీబీ, 8 జీబీ రెండు వేరియంట్లో అందుబాటులో ఉండనుంది. అలాగే ట్రిపుల్ రియర్కెమెరా, 32 ఎంపీ సెల్పీ కెమెరా ప్రధాన ఆకర్షణ. ధర రూ. 27,700గా ఉంది. వివో ఎస్ 1 ప్రొ ఫీచర్లు 6,39 డిస్ప్లే 2340 X 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ 28+8+5 ఎంపీ రియర్ కెమెరా 48ఎంపీ సెల్ఫీ కెమెరా 6జీబీ, 256 జీబీ ర్యామ్, 8 జీబీ ర్యామ్/128జీబీ ర్యామ్ 3700 ఎంఏహచ్ బ్యాటరీ -
5 కెమెరాల నోకియా ఫోన్ వచ్చేస్తోంది!
ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదరు చూస్తున్న నోకియా పెంటా కెమెరా నోకియా 9 ప్యూర్ వ్యూ స్మార్ట్ఫోన్ అతి త్వరలోనే భారత మార్కెట్లో రిలీజ్ కానుంది. హెచ్ఎండీ గ్లోబల్ ద్వారా స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన నోకియా అదిరిపోయే ఫోన్లతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐదు రియర్ కెమెరాలతో కొత్త ఫోన్ను తీసుకురానున్నట్టు గతంలోనే నోకియా ప్రకటించిన సంగతి తెలిసిందే. 12 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న 5 ఇన్ఫ్రారెడ్ సెన్సార్ కెమెరాలతో నోకియా 9 ప్యూర్ వ్యూ స్మార్ట్ఫోన్ రిలీజ్ కానుంది. దీనికి సంబంధించి బ్యూరో ఆప్ బిజినెస్స్టాండర్డ్ (బీఐఎస్) సర్టిఫికెట్ను పొందినట్టుత తెలుస్తోంది. ఇక ఫీచర్ల విషయంలో అంచనాలు ఇలా ఉన్నాయి. నోకియా 9ఫ్యూర్ వ్యూ ఫీచర్లు 6 అంగుళాల క్యూహెచ్డీ డిస్ప్లే స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 12 ఎంపీ పెంటా రియర్ కెమెరా 20 ఎంపీ సెల్ఫీ కెమెరా 4150 ఎంఏహెచ్ బ్యాటరీ 2019 ఫిబ్రవరిలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ట్రేడ్ షోలో పరిచయం చేసిన నోకియా 9 ప్యూర్ వ్యూ ధర దాదాపు రూ.50 వేలుగా ఉండవచ్చని అంచనా. -
అద్భుత ఫీచర్లు, బడ్జెట్ ధరలో ఒప్పో ఫోన్
ఒప్పో మరో సరి కొత్త స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. ఏ1కె పేరుతో బడ్జెట్ ధరలో మంగళవారం ఈ స్మార్ట్ఫోన్ను తీసుకొచ్చింది. 6.1 అంగుళాల వాటర్ డాప్ డిస్ప్లే, ఫేస్ అన్లాక్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం ఉన్న ఈ ఏ1కే స్మార్ట్ఫోన్ ధరను రూ.8490గా ఉంచింది. ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్నాప్ డీల్, ఇతర ఆఫ్లైన్ స్టోర్ల ద్వారా రెడ్ అండ్ బ్లాక్ కలర్స్లో నేటి నుంచే లభ్యం. ఏ1కెపీచర్లు 6.1 అంగుళాల డిస్ప్లే ఆండ్రాయిడ్ 9.0పై 1560 × 720 పిక్సెల్స్ రిజల్యూషన్ 2జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ 256 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 8 ఎంపీ రియర్ కెమెరా 5ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ -
మాసివ్ అప్డేట్తో రెడ్మి 7, జియో బంపర్ ఆఫర్
రెడ్మి సిరీస్లో భాగంగా రెడ్మి 7 స్మార్ట్ఫోన్ను షావోమి బుధవారం లాంచ్ చేసింది. ఇన్బిల్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, స్పెషల్ డిజైన్తో లూనర్ రెడ్, కమెంట్ బ్లూ, బ్లాక్ కలర్స్లో ఆవిష్కరించింది. రెడ్మి 6 తో పోలిస్తే స్క్రీన్, కెమెరా, బ్యాటరీ తదితరవాటిల్లో అద్భుతమైన అప్డేట్స్తో రెడ్మి 7 లాంచ్ చేసినట్టు షావోమి ఇండియా ఎండీ మనుకుమార్ జైన్ వెల్లడించారు. ఏప్రిల్ 29నుంచి అమెజాన్తో పాటు ఎంఐ స్టోర్లలో లభ్యం. జియో ఆఫర్ : రెడ్మి 7 కొనుగోలు చేసిన వినియోగదారులకు నాలుగేళ్లపాటు డబుల్ డేటా, 2400 రూపాయల క్యాష్బ్యాక్ జియో ద్వారా లభ్యం కానుంది. 2జీబీ ర్యామ్, 32 స్టోరేజ్ ధర రూ.7,999 3జీబీ ర్యామ్, 32 స్టోరేజ్ ధర రూ. 8.999 రెడ్మి 7 ఫీచర్లు 6. 26 డిస్ప్లే డాట్ నాచ్ డిస్ప్లే 12+2 ఎంపీ ఏఐ డ్యుయల్ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీకెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ స్మార్ట్ ఎల్ఈడీ బల్బ్ అలాగే ఎల్ఈడీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన షావోమి ఒక ఎల్ఈడీ స్మార్ట్బల్బ్ను కూడా ఈ ఈవెంట్లో లాంచ్ చేసింది. ఏకంగా 16 మిలియన్ల రంగుల్లో ఎల్ఈడీ స్మార్ట్ బల్బ్ను భారత్లో లాంచ్ చేసింది. 11 ఏళ్ల లాంగ్ లైఫ్ అందించే ఈ స్మార్ట్బల్బ్ను ఎంఐ హోం యాప్, ఎలెక్సా , గూగుల్ అసిస్టెంట్ ద్వారా దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది ఎంఐడాట్ కామ్ ద్వారా మాత్రమే లభ్యం. -
సూపర్ సెల్ఫీ కెమెరాతో రెడ్మి వై3
షావోమి రెడ్మి సిరీస్ సరికొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. రెడ్మి వై సిరీస్లో భాగంగా వై 2 తరువాత రెడ్మి వై3 స్మార్ట్ఫోన్ను తీసుకొచ్చింది. దీంతోపాటు ఇప్పటికే చైనాలో విడుదల చేసిన రెడ్మి 7 స్మార్ట్ఫోన్ను బుధవారం ఆవిష్కరించింది. 32 ఎంపీ సూపర్ సెల్ఫీ కెమెరాతో సెల్ఫీ సెంట్రిక్ డివైస్గా రెడ్మి వై 3ని తీసుకొచ్చినట్టు కంపెనీ తెలిపింది. ధరలు: 3జీబీ ర్యామ్ , 32 జీబీ స్టోరేజ్ = రూ. 9999 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ = రూ. 11,999 30, ఏప్రిల్ నుంచి అమెజాన్, ఎంఐ, ఆన్లైన్, ఆఫ్లైన్ స్టోర్ల ద్వారా లభ్యం. రెడ్ మి వై 3 కొనుగోలుదారులకు ఎయిర్టెల్ ద్వారా 1000 జీబీ 4జీ డేటా ఉచితం, అన్లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని అందిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. రెడ్మి వై 3 ఫీచర్లు 6.26 డాట్నాచ్ డిస్ప్లే స్నాప్డ్రాగన్ కాల్కామ్ 632 సాక్ ఆండ్రాయిడ్ పై 9 1440x720 పిక్సెల్స్ స్ర్కీన్ రిజల్యూషన్ 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 32 ఎంపీ సూపర్ సెల్ఫీ కెమెరా 12+2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ -
బిగ్ బ్యాటరీ, బడ్జెట్ ధర : రియల్మి సీ 2
సాక్షి, న్యూఢిల్లీ : చైనాకు చెందిన మొబైల్ తయారీదారు ఒప్పో తన సబ్ బ్రాండ్ ద్వారా భారతీయ స్మార్ట్ఫోన్ రంగంలో దూసుకుపోతోంది. సోమవారం ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ రియల్మి 3 ప్రొ తోపాటు, బడ్జెట్ ధరలో సీ2 స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. రియల్మి సీ2 పేరుతో లాంచ్ చేసిన ఈ స్మార్ట్ఫోన్ ధర మే15నుంచి ఫ్లిప్కార్ట్, రియల్మి. కామ్ ద్వారా అందుబాటులో ఉండనుంది. డైమండ్ కట్ డిజైన్, డ్యూ డ్రాప్ డిస్ప్లే, డబుల్ రియర్ కెమరా, భారీ కెమెరా సీ2 ప్రత్యేకతలని కంపెనీ చెప్పంది. రియల్మి సీ2 ఫీచర్లు 6.1 అంగుళాల డిస్ప్లే ఆండ్రాయిడ్ పై 13+2 ఎంపీ రియర్ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ 2జీబీ/3జీబీ, 16జీబీ /32స్టోరేజ్ ధరలు : రూ. 5999, రూ. 7999 -
అద్భుతమైన రియల్మి 3 ప్రొ వచ్చేసింది
ఒప్పో తన సబ్ బ్రాండ్ రియల్మి ద్వారా మరో స్మార్ట్ఫోన్ను విడుదల చేయనుంది. రియల్ మి 3 ప్రో ను ఇవాళ (సోమవారం, ఏప్రిల్ 22) ఢిల్లీలో లాంచ్ చేసింది. రియల్ మి2 ప్రొకి కొనసాగింపుగా తీసుకొస్తున్న ఈ స్మార్ట్ఫోన్ ధరను అంచనాలకు కనుగుణంగానే రూ. 13,999గా నిర్ణయించింది. రెండు వేరియంట్లలో ఈ స్మార్ట్ఫోన్నున లాంచ్ చేసింది. పబ్జీ లాంటి గేమింగ్, వూక్3.0 ఫ్లాష్ చార్జ్, అద్భుతమైన సోనీ కెమెరాలు ప్రధాన ఫీచర్లుగా కంపెనీ పేర్కొంది. 29, ఏప్రిల్ నుంచి ఫ్లిప్కార్ట్, రియల్మి. కామ్ ద్వారా అందుబాటులో ఉండనుంది. అలాగే హెచ్డీఎఫ్సీ కార్డుల ద్వారా వెయ్యిరూపాయల డిస్కౌంట్ లభ్యం. రియల్ మి 3 ప్రో ఫీచర్లు 6.30అంగుళాల డిస్స్లే క్వాల్కం స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ పై 9.0 4జీబీ/6జీబీ ర్యామ్, 64/128 జీబీస్టోరేజ్ 25 ఎంపీ రియర్ కెమెరా విత్ అల్ట్రాహెచ్డీ మోడ్ 16+5 ఎంపీ రియర్ కెమెరా 4045 ఎంఏహెచ్ బ్యాటరీ 4జీబీ ర్యామ్, 32 జీబీస్టోరేజ్ రూ.13999 6జీబీ ర్యామ్ 128 జీబీస్టోరేజ్ ధర రూ. 16,999 దీంతో పాటో రియల్మి సీ స్మార్ట్ఫోన్ కూడా ఒప్పో లాంచ్ చేసింది. రూ. 5999 ధరలో ఇది లభ్యం. -
రెడ్మికి షాక్: రియల్మి 3 ప్రొ నేడే లాంచింగ్
సాక్షి, న్యూఢిల్లీ: ఒప్పో తన సబ్ బ్రాండ్ ద్వారా మరో స్మార్ట్ఫోన్ను విడుదల చేయనుంది. రియల్ మి 3 ప్రో ను ఈ రోజు (సోమవారం, ఏప్రిల్ 22) ఢిల్లీలో మధ్యాహ్నం 12.30లకు లాంచ్ చేయనుంది. రియల్ మి2 ప్రొకి కొనసాగింపుగా తీసుకొస్తున్న ఈ స్మార్ట్ఫోన్ ధర రూ. 13 వేల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రధానంగా షావోమి రెడ్మి నోట్ 7ప్రొకి పోటీగా ఈ స్మార్ట్ఫోన్ తీసుకొస్తోందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఫ్లిప్కార్ట్లో ఈ స్మార్ట్ఫోన్ ప్రత్యేకంగా లభించనుందని సమాచారం. ఇక ఫీచర్లపై అంచనాలు ఈ విధంగా ఉన్నాయి. రియల్మి 3 ప్రో ఫీచర్లు 6.30అంగుళాల డిస్స్లే క్వాల్కం స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ పై 9.0 6జీబీ ర్యామ్, 32/64 జీబీస్టోరేజ్ 128 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం 48 ఎంపీ రియర్ కెమెరా విత్ అల్ట్రాహెచ్డీ మోడ్ 12ఎంపీ సెల్ఫీ కెమెరా 3960 ఎంఏహెచ్ బ్యాటరీ -
రెడ్మికి షాక్ : బడ్జెట్ ధరలో గెలాక్సీ స్మార్ట్ఫోన్
సాక్షి, న్యూఢిల్లీ : సౌత్ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ బడ్జెట్ ధరలో కొత్త గెలాక్సీ స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రధానంగా చైనా మొబైల్ తయారీదారు షావోమి తీసుకొచ్చిన బడ్జెట్ ఫోన్ రెడ్మిగో కి పోటీగా ఈ డివైస్ను లాంచ్ చేసింది. గెలాక్సీ ఏ2 కోర్ పేరుతో , ఆండ్రాయిడ్ గో ఆధారిత స్మార్ట్ఫోన్ను శాంసంగ్ ఆవిష్కరించింది. దీని ధర 5290 రూపాయలు గా నిర్ణయించింది. గెలాక్సీ ఏ2 కోర్ ఫీచర్లు 5 అంగుళాల డిస్ప్లే 960x540 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 1. 6 ఆక్టాకోర్ ప్రాసెసర్, 7870 సాక్ 1జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ 256 దాకా విస్తరించుకునే అవకాశం 5 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 2600 ఎంఏహెచ్ బ్యాటరీ కాగా షావోమి తీసుకొచ్చిన రెడ్మి గో ధర రూ. 4499. అలాగే రెడ్మి గో లో 8 ఎంపీ రియర్ కెమెరాను పొందుపర్చగా, బ్యాటరీ సామర్ధ్యం 3000 ఎంఏహెచ్ గా ఉంది. -
అద్భుత కెమెరాతో శాంసంగ్ గెలాక్సీ ఏ80
స్మార్ట్ఫోన్ దిగ్గజం శాంసంగ్ సరికొత్త టెక్నాలజీతో గెలాక్సీ కొత్త ఫోన్లను పరిచయం చేసింది. గెలాక్సీ ఏ సిరీస్లోభాగంగా గెలాక్సీ ఏ 80, ఏ 70, గెలాక్సీ ఏ 40 పేరుతో మూడు స్మార్ట్ఫోన్లను బ్యాంకాక్లో బుధవారం నిర్వహించిన శాంసంగ్ ఈవెంట్లో ఆవిష్కరించింది. గెలాక్సీ ఏ 80 స్మార్ట్ఫోన్లో 48 ఎంపీ రొటేటింగ్ పాప్ అప్ కెమెరా ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అంటే సెల్పీ తీసుకోవాలంటే..సెల్ఫీ మోడ్ సెలెక్ట్ చేయగానే ఈ కెమెరా రొటేట్ అవుతుందన్నమాట. బ్లాక్ గోల్డ్, వైట్ కలర్స్లో ఈ స్మార్ట్ఫోన్ లభ్యం కానుంది. అలాగు వాటర్డ్రాప్ డిస్ప్లే 4500 ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ఫీచర్లతో ఏ 70ని తీసుకొచ్చింది. ఇది బ్లాక్బ్లూ, వైట్ ,పింక్ కలర్స్లో లభ్యం కానుంది. గెలాక్సీ ఏ80 స్మార్ట్ఫోన్ను మే 29న, గెలాక్సీ ఏ 70ని ఏప్రిల్ 26న గ్లోబల్ లాంచ్ చేయనుంది. అయితే ఈరెండు స్మార్ట్ఫోన్ల ధరలను ఇంకా రివీల్ చేయలేదు. గెలాక్సీ ఏ 80 ఫీచర్లు 6.7 ఫుల్ హెచ్డీ డిస్ప్లే 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్ కాల్కం స్నాప్డ్రాగన్ 730 జీ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 9.0పై 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 48+8+3డీ డెప్త్ టీఓఎఫ్ ఎంపీ రియర్ కెమెరా 3700 ఎంఏహెచ్ బ్యాటరీ గెలాక్సీ ఏ 70 ఫీచర్లు 6.7 ఫుల్హెచ్డీ (వాటర్డ్రాప్) డిస్ప్లే 1080 x 2400 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 32+8+5 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 32ఎంపీ సెల్ఫీ కెమెరా 4500 ఎంఏహెచ్ బ్యాటరీ గెలాక్సీ ఏ 40 5.9 ఫుల్ హెచ్డీ డిస్ప్లే 1080 x 2280 పిక్సెల్స్ రిజల్యూషన్ 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 512 వరకువిస్తరించుకనే అవకాశం 16+5 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 25ఎంపీ సెల్పీ కెమెరా 3100 ఎంఏహెచ్ బ్యాటరీ, బ్లూ , బ్లాక్, కోరల్, వైట్ కలర్స్లో ల భ్యం కానుంది. దీని ధర సుమారు రూ. 19500 #GalaxyA80 is for Rotating Camera. Epic on both sides. Learn more: https://t.co/bbVzsoWlIW pic.twitter.com/faYlI5I6uM — Samsung Mobile (@SamsungMobile) April 10, 2019 -
హువావే పీ 30 ప్రొ, పీ 30 లైట్ లాంచ్
చైనా మొబైల్ మేకర్ హువావే భారతీయ స్మార్ట్ఫోన్ సెగ్మెంట్లో సరికొత్త డివైస్లతో దూకుడును ప్రదర్శిస్తోంది. ఇటీవలే పీ 30 సిరీస్లో భాగంగా హువావే పీ 30, పీ 30 ప్రొ పారిస్లో ఆవిష్కరించిన సంస్థ తాజాగా పీ30 ప్రొ, పీ 30 స్మార్ట్ఫోన్లను మంగళవారం భారత మార్కెట్లో విడుదల చేసింది. భారత్లో విడుదలైన హువావే లేటెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ ఇదే కావడం విశేషం. భారీ డిస్ప్లే, భారీ బ్యాటరీతో పాటు ట్రిపుల్ బ్యాక్ కెమెరా, సూపర్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్, వైర్లెస్ చార్జింగ్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ను ఇందులో అందిస్తోంది. హువావే పీ30 ప్రొ ఫీచర్లు 6.47 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ హువావే కిరిన్ 980 ఆక్టాకోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 9.0 పై 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 256 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ 40+ 20+ 8 ఎంపీ ట్రిపుల్ బ్యాక్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 4200 ఎంఏహెచ్ బ్యాటరీ హువావే పీ 30 లైట్ ఫీచర్లు 6.15 ఫుల్హెచ్డీ డిస్ప్లే కిరిన్ 710 సాక్ ప్రాసెసర్ 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ 24+8+2 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 3340 ఎంఏహెచ్ బ్యాటరీ 4జీబీ, 6జీబీ రెండు వేరియంట్లలో హువావే పీ 30 లైట్ లభ్యమవుతుంది. కాగా 4జీబీ వేరియంట్ ధర రూ. 19,990గా ఉండగా, 6జీబీ వేరియంట్ ధర రూ. 22,990గా ఉంది. ఈ రెండు ఫోన్లు అమెజాన్లో ఎక్స్క్లూజివ్గా లభ్యం కానున్నాయి. ఈ నెల 15వ తేదీ నుంచి ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తుంది. హువావే పీ30 ప్రొ స్మార్ట్ఫోన్ ధర రూ.71,990 గా ఉంది. -
అద్భుత ఫీచర్లతో నోకియా ఎక్స్ 71
అద్భుత ఫీచర్లతో నోకియా సంస్థ మరోకొత్త స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. నోకియా బ్రాండ్పై పలు స్మార్ట్ఫోన్లను ఆవిష్కరిస్తున్న హెచ్ఎండీ గ్లోబల్ మంగళవారం తైవాన్లో జరిగిన కార్యక్రమంలో మరొక స్మార్ట్ఫోన్ను మార్కెట్లో విడుదల చేసింది. హోల్ పంచ్ డిస్ప్లేతో తొలి స్మార్ట్ఫోన్ కాగా, రియర్ ట్రిపుల్ కెమెరా ముఖ్యంగా 48 ఎంపీ భారీ కెమెరా ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. దీని ధరను 11,900 తైవాన్ డాలర్లుగా నిర్ణయించింది. అంటే భారత కరెన్సీలో ఇది సుమారు రూ. 26700. అక్కడి ఏప్రిల్ 30నుంచి విక్రయానికి అందుబాటులో ఉంటుంది. అయితే, భారత్లో నోకియా ఎక్స్ 71 స్మార్ట్ఫోన్ను ఎప్పుడు విడుదల చేసేదీ కంపెనీ స్పష్టం చేయలేదు. నోకియా ఎక్స్71 ఫీచర్లు 6.3 అంగుళాల ఫుల్హెచ్డీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 9.0 స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 256జీబీ వరకూ విస్తరించుకునేఅవకాశం 48+5+8 రియర్ ట్రిపుల్ కెమెరాలు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 3500 ఎంఏహెచ్ బ్యాటరీ -
అద్భుత ఫీచర్లతో లెనోవో స్మార్ట్ఫోన్
సాక్షి, న్యూఢిల్లీ : చైనా మొబైల్ మేకర్ మరో విప్లవాత్మక స్మార్ట్ఫోన్ను తీసుకురానుంది. జెడ్ సిరీస్లో భాగంగా అదిరిపోయే ఫీచర్లతో జెడ్6 ప్రొ పేరుతో లెనోవో 5జీ స్మార్ట్ఫోన్ను త్వరలో లాంచ్ చేయనుంది. 100 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ హైపర్ విజన్ కెమెరాతోపాటు, ఎలక్షన్ సందర్భంగా ఫేక్న్యూస్ను అడ్డుకునేందుకు తీసుకొచ్చిన ఫేస్బుక్ కొత్త టూల్, వాట్సాప్ డార్క్మోడ్ అథెంటిఫికేషన్ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిసింది. 100ఎంపీ కెమెరా సామర్థ్యం ఉన్న తొలి ఫోన్ ఇదే కానుంది. ఈ మేరకు ఈ ఫోన్కు చెందిన ఓ ఇమేజ్ను, వీడియోను ఆ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ చాంగ్ చెంగ్ మార్చి 27వ తేదీన చైనా సోషల్ మీడియా వైబోలో పోస్ట్ చేశారు.ఈ ఏడాది మొబైల్ వరల్డ్కాంగ్రెస్లో దీనిపై ప్రకటించిన సంస్థ జూన్ నెలలో మార్కెట్లలో తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫీచర్లపై ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ, అంచనాలు ఇలా ఉన్నాయి. స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ప్రధానంగా వెలుగులోకి వచ్చిన లెనోవో జడ్6 ప్రొ ఫీచర్లు. -
శాంసంగ్ దూకుడు : తొలి 5జీ ఫోన్ వెరీ సూన్
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స దిగ్గజం శాంసంగ్ దూకుడుగా ఉంది. 5జీ ఫోన్ను వచ్చే నెలలోనే లాంచ్ చేయనుందని స్థానిక మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. తద్వారా మార్కెట్లో యాపిల్పై పైచేయి సాధించేందుకు సన్నద్ధమవుతోంది. శాంసంగ్ ‘గెలాక్సీ ఎస్ 10’ 5జీ స్మార్ట్ఫోన్ను సౌత్ కొరియాలో లాంచ్ చేయనుంది. ప్రపంచంలోనే తొలి 5జీ మొబైల్గా దీన్ని ఏప్రిల్ 5న ఆవిష్కరించనుంది. దీనికి సంబంధించి సిగ్నల్ వెరిఫికేషన్ పరీక్షలో గ్రీన్ సిగ్నల్ కూడా సాధించింది. ఆ రోజునుంచే సేల్స్ కూడా మొదలవుతాయట. అయితే ధర వివరాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. అయితే రూ.91300గా నిర్ణయించవచ్చని పరిశ్రమ వర్గాల అంచనా. శాంసంగ్ ఎస్10 5జీ 6.70 ఇంచెస్ డిస్ప్లే ఆండ్రాయిడ్ 9.0 12+12+16+0.038 ఎంపీ రియల్ కెమెరా 100.038 ఎంపీ సెల్ఫీకెమెరా 8జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజ్ 4500 ఎంఏహెచ్ బ్యాటరీ -
హువావే హానర్ 10ఐ స్మార్ట్ఫోన్
చైనా స్మార్ట్ఫోన్ కంపెనీ హువావే నూతన స్మార్ట్ఫోన్ను రష్యాలో లాంచ్ చేసింది. ఎంట్రీ లెవర్ సెగ్మెంట్లో బడ్జెట్ ధరలో హానర్ 10ఐ ని విడుదల చేసింది. వీటితో పాటు నోవా 4 ఇ, పి స్మార్ట్ ప్లస్ స్మార్ట్ఫోన్లను కూడా పరిచయం చేసింది. 3డీ,గ్రాడియంట్ ఫినిష్, ట్రిపుల్ కెమెరా, వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే ప్రధాన ఆకర్షణగా ఉంది. అయితే ధరను ఇంకా రివీల్ చేయలేదు. హానర్ 10ఐ ఫీచర్లు 6.21 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఆండ్రాయిడ్ 9.0 పై 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆక్టాకోర్ కైరిన్ 710 ప్రాసెసర్ 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 512 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ 24 + 2+8 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 3400 ఎంఏహెచ్ బ్యాటరీ -
తక్కువ ధరలో రెడ్మిగో.. జియో భారీ క్యాష్బ్యాక్
షావోమి బడ్జెట్ ధరలో మరో స్మార్ట్ఫోన్నులాంచ్ చేసింది. రెడ్మి గో పేరుతో దీన్ని మంగళవారం విడుదల చేసింది. ఇది తొలి ఆండ్రాయిడ్ గో ఫోన్ కూడా. దీని ధర రూ. 4499 లు. 22 మార్చి మధ్యాహ్నం 1 గంట నుంచి ఎం.కాం, ఫ్లిప్కార్ట్ ద్వారా విక్రయానికి అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. రెడ్మి గో ఫీచర్లు 5 అంగుళాల డిస్ప్లే 1.4 గిగా హెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ 720x1280 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషనన్ ఆండ్రాయిడ్8.1 ఓరియో ( గో ఎడిషన్) 1జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్ 8 ఎంపీ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ దీనికి లాంచింగ్ ఆఫర్ విషయానికి వస్తే జియో రీ చార్జ్ ద్వారా రూ. 2200 క్యాష్బ్యాక్, 100 జీబీ ఉచిత ఆఫర్ను అందిస్తోంది. Mi fans, presenting #RedmiGo #AapkiNayiDuniya - Qualcomm® Snapdragon™ 425 - Android™ Oreo™ (Go Edition) - 3000mAh Battery - 8MP Rear camera with LED Flash - 5MP Selfie camera - 5" HD display - 4G Network Connectivity - Color: Blue & black - Price: ₹4,499 RT & spread the ❤️ pic.twitter.com/aanAoiauqj — Mi India (@XiaomiIndia) March 19, 2019 -
వివో : బిగ్ బ్యాటరీ, బిగ్ స్క్రీన్, బడ్జెట్ ధర
సాక్షి,ముంబై: చైనా మొబైల్ మేకర్ వివో వై సిరీస్లో కొత్త మొబైల్ను లాంచ్ చేసింది. వై 91 ఐ పేరుతో బడ్జెట్ ధరలో తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ఫోన్ బేసిక్ ధరను రూ. 7,990గా నిర్ణయించింది. 32జీబీ వేరియంట్ ధరను రూ. 8490గా ఉంచింది. వివో వై91ఐ ఫీచర్లు 6.22 ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 520×720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 2 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్ 256 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ 13 ఎంపీ బ్యాక్ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 4030 ఎంఏహెచ్ బ్యాటరీ -
అద్భుత ఫీచర్లతో ఒప్పో ఎఫ్ 11 ప్రొ
సాక్షి, ముంబై: చైనా ఒప్పో మరో అద్భుతమైన ఫీచర్లతో స్మార్ట్ఫోన్ను తీసుకొచ్చింది. ఒప్పో ఎఫ్ 11 ప్రొ పేరుతో దీన్ని మంగళవారం ముంబైలో లాంచ్ చేసింది. థండర్బ్లాక్, అరోరా గ్రీన్ రెండు కలర్స్లో ఇది లభ్యం కానుంది. ఎఫ్ 11 ప్రొ ఫీచర్లు 6.5ఇంచెస్ డిస్ప్లేస్ మీడియాటెక్ హీలియో పీ70 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 9.0 పై 6 జీబీ ర్యామ్, 128 స్టోరేజ్ 48 +5 ఎంపీ రియర్ 16ఎంపీ పాప్ అప్ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ ధరలు హై ఎండ్ వెర్షన్ ధర : రూ. 24,990 బేసిక్ మోడల్ ధర : రూ.19,990 తొలి ఫ్లాష్ సేల్ : మార్చి ,15 -
హువావే వై6(2019)
మొబైల్స్ తయారీదారు హువావే తన నూతన స్మార్ట్ఫోన్ వై6 2019 ను రష్యా మార్కెట్లో విడుదల చేసింది. మిడ్ రేంజ్ సెగ్మెంట్లో డ్యూ డ్రాప్ నాచ్డిస్ప్లే , మీడియా టెక్ హీలియో ఏ22 సాక్ ప్రాసెసర్ దీన్ని లాంచ్ చేసింది. రూ.9,770 ధర నిర్ణయించింది. హువావే వై6 2019 ఫీచర్లు 6.09 ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 1560 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 9.0 మీడియా టెక్ హీలియో ఏ22 సాక్ ప్రాసెసర్ 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 512 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్, 13 ఎంపీ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 3020 ఎంఏహెచ్ బ్యాటరీ -
రియల్మి 3 లాంచ్
సాక్షి,న్యూఢిల్లీ : ఒప్పో సబ్బ్రాండ్ రియల్ మి తన నూతన స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. రియల్ మి సిరీస్లో తన 3వ స్మార్ట్ఫోన్ను నేడు (మార్చి,4)న విడుదల చేసింది. రియల్ మి 2తో పోలిస్తే డ్యూ డ్రాప్డిస్ప్లే, ఆండ్రాయిడ్ పై కలర్ ఓఎస్తో 3వ డివైస్ను అప్గ్రేడ్ చేసింది. రియల్మి3 పేరుతో గఆవిష్కరించిన ఈ రియల్ మి3 స్మార్ట్ఫోన్లో డ్యుయల్ బ్యాక్ కెమెరాను జోడించింది. రెండు వేరియంట్లుగా రియల్మి3 స్మార్ట్ఫోన్ను తీసుకు రాగా 3జీబీ ర్యామ్,32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ. 8999గా నిర్ణయించింది. 4జీబీ ర్యామ్,32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ. 10999గా నిర్ణయించింది. ఫ్లిప్కార్ట్లో మార్చి 12వ తేదీమధ్యాహ్నం 12 గంటల నుంచి ఎక్స్క్లూజివ్గా విక్రయించనుంది. రియల్మి 3 ఫీచర్లు 6.2 ఇంచెస్ హెచ్డీ డిస్ప్లే 1520x72 రిజల్యూషన్ ఆండ్రాయిడ్ పై 2.1 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ హీలియో పీ 70 ప్రాసెసర్ 3/4జీబీ ర్యామ్,32 జీబీ స్టోరేజ్ 13+2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 13 ఎంపీ సెల్ఫీ కెమెరా 4230 ఎంఏహెచ్ బ్యాటరీ Introducing #realme3! 👉🏻3D Unibody Gradient design in 3 colours 👉🏻Helio P70 processor 👉🏻13+2MP Dual Rear Camera & more. Available in: 👉🏻3+32 GB, ₹8999 👉🏻4+64 GB, ₹10999 Sale begins at 12 pm, 12th Mar on @flipkart & https://t.co/HrgDJTZcxv https://t.co/Y8mVPCZjq3#PowerYourStyle pic.twitter.com/0lyrzjqbM8 — Realme (@realmemobiles) March 4, 2019 -
ఊహించని ధరల్లో రెడ్మి నోట్ 7
సాక్షి, న్యూఢిల్లీ: చైనాస్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమి తన నోట్ సిరీస్లో నూతన స్మార్ట్ఫోన్ రెడ్మీ నోట్ 7ను గురువారం (ఫిబ్రవరి 28) భారత మార్కెట్లో లాంచ్ చేసింది. స్మార్ట్ఫోన్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ స్మార్ట్ఫోన్లను ఎట్టకేలకు న్యూఢిల్లీలో ఆవిష్కరించింది. అనూహ్యంగా ప్రారంభ ధర రూ.9999గా ఉంచి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇప్పటికే చైనా మార్కెట్లో మిలియన్ అమ్మకాలతో రెడ్మి నోట్ 7 దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రెడ్మి నోట్ 7లో 48 మెగా పిక్సెల్ భారీ కెమెరాకు బదులుగా ఇండియాలో కేవలం డ్యుయల్ రియర్ కెమెరాను అమర్చింది. రెండు వైపులా గొరిల్లాగ్లాస్ రక్షణ, క్విక్ చార్జ్ ఫీచర్లు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. బ్లాక్, బ్లూ, పర్పుల్ కలర్ ఆప్షన్లలో లభించనుంది. రెడ్మి నోట్ 7 తొలి ఫ్లాష్ సేల్: ఫ్లిప్కార్ట్, ఎం.ఐకాం ద్వారా మార్చి 6వ తేదీ మధ్యాహ్నం 12గంటలనుంచి రెడ్మి నోట్ 7 ఫీచర్లు 6.3 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ ప్లే 1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్ స్నాప్డ్రాగన్ 660ఆక్టాకోర్ ప్రొసెసర్ ఆండ్రాయిడ్ 9 పై 3జీబీ, 32 జీబీ స్టోరేజ్ 12+2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 13 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000ఎంఏహెచ్ బ్యాటరీ 3జీబీ/32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర : రూ.9999 4జీబీ/64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర : రూ. 11,999 దీంతో పాటు దాదాపు ఇదే ఫీచర్లతో రెడ్మి నోట్ 7 ప్రొను కూడా తీసుకొచ్చింది. అయితే క్వాల్కం స్నాప్ డ్రాగన్ 675 క్రియో ప్రాసెసర్ , 48+5 మెగా పిక్సెల్ డ్యుయల్ రియర్ కెమెరాను అమర్చడం విశేషం. 4జీబీ, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర : రూ.13,999 6జీబీ, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర : రూ.16,999 ఫస్ట్ ఫ్లాష్ సేల్ : ఫ్లిప్కార్ట్, ఎంఐ.కాం ద్వారా మార్చి 13వ తేదీ మధ్యాహ్నం 12గంటలనుంచి -
షావోమికి పోటీ : వివో కొత్త స్మార్ట్ఫోన్
బీజింగ్ : చైనా స్మార్ట్ఫోన్ తయారీదారు వివో మరో కొత్తస్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. యూ సిరీస్లో వివో యూ1 పేరుతో చైనా మార్కెట్లో అవిష్కరించింది. వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే, రెండు ఏఐ ఆధారిత రియర్ కెమెరాలతో దీన్ని తీసుకొచ్చింది. షావోమి ఈ నెల 28న భారత మార్కెట్లో ఆవిష్కరించినున్న రెడ్ మినోట్ 7కు ఇది గట్టిపోటీ ఇవ్వనుందట. వివో యూ1 ఫీచర్లు 6.2 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే 1520 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్ స్నాప్డ్రాగన్ 439 12ఎంఎం సాక్ ఆండ్రాయిడ్ 9.1 ఓరియో 3, 4జీబీ ర్యామ్/32జీబీ/64 జీబీస్టోరేజ్ 13+2 డ్యూయల్ రియర్ కెమెరా 8ఎంపీ సెల్ఫీకెమెరా 4030 ఎంఏహెచ్ బ్యాటరీ మూడు రంగుల్లో చైనాలో ఇప్పటికే లభ్యం అవుతున్న వివో యూ 1 స్మార్ట్ఫోన్ ప్రారంభ ధర సుమారు రూ. 8430గా ఉంది. 4జీబీ/64జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 12,645గా ఉంది. ఈ డివైస్ను ఎపుడు భారత మార్కెట్లోకి తీసుకొచ్చేదీ కంపెనీ ఇంకా వెల్లడి చేయలేదు. -
మెగా బ్యాటరీతో మోటరోలా జీ7 పవర్
సాక్షి, న్యూఢిల్లీ : ఆకట్టుకునే ఫీచర్లతో మోటరోలా కొత్త స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. 5వేల ఎంఏహెచ్ మెగా బ్యాటరీతో మోటరోలా జీ7 పవర్ మొబైల్ను శుక్రవారం ఆవిష్కరించింది. 15వాట్స్ టర్బోపవర్ సపోర్ట్ బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్ ప్రత్యేక ఫీచర్లని కంపెనీ చెబుతోంది. మొదటిసారిగా ఇండియాలో ఆఫ్లైన్ స్టోర్లల్లో కూడా ఈ ఫోన్ విక్రయానికి లభ్యం. మోటరోలా.ఇన్ వెబ్సైట్, మోటో స్టోర్ లేదా మోటో హబ్, సిటీ, స్టేట్ ఎంచుకొని ఈ ఫోన్ను కొనుగోలు చేయవచ్చు. త్వరలో ఫ్లిప్కార్ట్లో కూడా ఈ మొబైల్ అందుబాటులోకి రానుంది. మోటరోలా జీ7 పవర్ ఫీచర్లు 6.24 అంగుళాల ఫుల్ హెచ్డీ+డిస్ప్లే 720x1570 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 9.0 స్నాప్డ్రాగన్ 632 ప్రాసెసర్ 4 జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ 12ఎంపీ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ధర: రూ.13,999 -
వాటికి షాకే.. భారీ కెమెరాతో సోనీ స్మార్ట్ఫోన్
ఎలక్ట్రానిక్స్ తయారీదారు సోనీ తన నూతన స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించనుంది. బార్సిలోనాలో జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2019లో ఫిబ్రవరి 25న దీన్ని లాంచ్ చేయనుందట. తాజా నివేదికల ప్రకారం 52 మెగాపిక్సెల్ మెగా కెమెరాతో ఎక్స్పీరియా ఎక్స్జడ్4 పేరుతో ఈ స్మార్ట్ఫోన్ ప్రారంభించనుంది. దీంతో పాటు వెనుక భాగంలో మరో రెండు కెమెరాలను అంటే మొత్తం మూడు కెమెరాలను అమర్చినట్లు సమాచారం. 52+16 ఎంపీ టెలిఫోటో లెన్స్ + 0.3 ఎంపీ కెపాసిటీ ఉన్న 3డీ కెమెరాలను పొందపర్చడం విశేషం. అయితే ప్రస్తుతం హానర్ వ్యూ20, రెడ్మీ నోట్ 7 ఫోన్లలోమాత్రమే అతి పెద్ద రియర్ కెమెరా(48ఎంపీ)తో స్మార్ట్ఫోన్లు లాంచ్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కంపెనీలకు పోటీగా సోనీ తన ఎక్స్పీరియా ఎక్స్జడ్4 ఫోన్ను తీసుకు రానుంది. ఈ స్మార్ట్ ఫోన ఆవిష్కారమైతే సోనీ ఈ విషయంలో టాప్లోకి దూసుకు రావడం ఖాయం. అటు ఈ ఫోన్కు సంబంధించిన ఇతర స్పెసిఫికేషన్ల ఇంకా స్పష్టత లేదు. అయితే మాత్రం అంచనాలు ఇలా ఉన్నాయి ఎక్స్పీరియా ఎక్స్జడ్ 4 ఫీచర్లు 6.5 అంగుళాల ఓల్ఈడీ డిస్ప్లే విత్ 21.9 యాస్పెక్ట్ రేషియో 1440×3360 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 9పై 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ 4400 ఎంఏహెచ్ బ్యాటరీ -
నోకియా 8.1 కొత్త వేరియంట్..లాంచింగ్ ఆఫర్లు
సాక్షి, ముంబై : గత డిసెంబరు లాంచ్ చేసిన నోకియా 8.1 స్మార్ట్ఫోన్లో కొత్త వేరియంట్ను నోకియా గురువారం లాంచ్ చేసింది. 6జీబీ ర్యామ్, 128స్టోరేజ్ కెపాసిటీ స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించింది. ఫిబ్రవరి 6వ తేదీనుంచి అమెజాన్ ద్వారా ప్రత్యేకంగా లభ్యం కానుంది. దీనిధర రూ. 29,999గా ఉంచింది. ప్రీ బుకింగ్లు రేపటి (ఫిబ్రవరి 1) నుంచి ప్రారంభం. 6.8ఫుల్ హెచ్డీ డిస్ప్లేనోకియా 1080x2244 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆక్టాకోర్ క్వాల్కం స్నాప్ డ్రాగన 710 సాక్ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ 400జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 13+14 డ్యుయల్ రియర్ కెమెరా 20ఎంపీ సెల్ఫీ కెమెరా 3500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇక ఎయిర్టెల్ ద్వారా రూ.199 ప్రారంభమయ్యే ఎయిర్టెల్ ప్రీపెయిడ్ రీచార్జ్లపై దాదాపు 1 టీబీ 4జీబీ దాకా డేటాను ఆఫర్ అందిస్తోంది. లాంచింగ్ ఆఫర్గా హెచ్డీఎఫ్సీ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ఫిబ్రవరి 6నుంచి 17 మధ్య కొనుగోలు చేస్తే 10శాతం క్యాష్బ్యాక్ అందిస్తుంది. దీంతోపాటు ఇంకా చాలా ఆఫర్లను నోకియా ప్రకటించింది. పూర్తి వివరాలు అధికారిక వెబ్సైట్లో లభ్యం. నోకియా 8.1 ఫీచర్లు -
కొత్త రియల్మి సీ1 స్మార్ట్ఫోన్
సాక్షి, న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్దిగ్గజం శాంసంగ్కు దీటుగా రియల్మీ సీ1 (2019) వేరియంట్ను సోమవారం లాంచ్ చేసింది. ఇటీవల భారత్లో విడుదల చేసిన రియల్మీ ఇప్పుడు ఇందులోని మరో రెండు వేరియంట్లను భారత్లో విడుదల చేసింది. 2 జీబీ ర్యామ్/32 జీబీ వేరియంట్ ధర భారత్లో రూ. 7,499 కాగా, 3జీబీ ర్యామ్/32 జీబీ వేరియంట్ ధర రూ.8,499. ఫిబ్రవరి 5 నుంచి ఈ రెండింటినీ ప్లిప్కార్ట్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. రియల్మీ సీ1ను గతేడాది సెప్టెంబరులో భారత్లో విడుదల చేసింది. ధర రూ.6,999. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో కూడిన డ్యూయల్ రియర్, సెల్పీ కెమెరాలు ఉన్నాయి. ఫేసియల్ అన్లాక్, స్మార్ట్ లాక్ ఫీచర్, పవర్ సేవింగ్ ఫీచర్లు, యాప్ ఫ్రీజింగ్ పవర్ సేవర్, క్విక్ యాప్ ఫ్రీజింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రియల్మీ సీ1(2019) ఫీచర్లు 6.2 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 720x1520 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 450 సాక్ 4230 ఎంఏహెచ్ బ్యాటరీ -
భారీ కెమెరాతో ‘హానర్’ స్మార్ట్ఫోన్
హువావే సబ్ బ్రాండ్ హానర్ ప్రకటించిన విప్లవాత్మక స్మార్ట్ఫోన్ భారతీయ మార్కెట్లోకి అడుగపెట్టబోతోంది. లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ అయిన హానర్ వ్యూ20ని ప్రపంచవ్యాప్తంగా నేడు (జనవరి 22) లాంచ్ చేస్తోంది. అలాగే ఈ నెల 29న భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. అమెజాన్లో ప్రత్యేకంగా విక్రయానికి లభ్యం కానుంది. దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్స్కు ప్రారంభమైనాయని కంపెనీ ప్రకటించింది. అద్భుతమైన ఫీచర్లు, ప్రపంచంలోనే భారీ కెమెరాతో తొలి స్మార్ట్ఫోన్గా, వ్యూ సిరీస్లో టాప్ ఎండ్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ వ్యూ20 నిలవనుంది. ఈ స్మార్ట్ఫోన్ మూడు వేరియంట్స్లో అందుబాటులో ఉంటుంది. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.35,500. 8జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 40,600గా ఉంది. ఇక ఈ డివైస్ ఫీచర్లపై అంచనాలు ఇలా ఉన్నాయి. హానర్ వ్యూ20 ఫీచర్లు 6.4 ఇంచెస్ డిస్ప్లే కిరిన్ 980 ఆక్టాకోర్ సాక్ ఆండ్రాయిడ్ 9 1080x2310 పిక్సెల్స్ రిజల్యూషన్ 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 48 ఎంపీ రియర్ కెమెరా 25 ఎంపీ సెల్పీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ మరోవైపు ఈ స్మార్ట్ఫోన్ చైనా మార్కెట్లో ఇప్పటికే లాంచ్ కాగా హానర్ వ్యూ 20 మోషినో రెడ్ ఎడిషన్ను లేటెస్ట్ గా విడుదల చేసింది. Sung too many tunes about reimagining your memories? Upgrade to newer inventions with the #WorldsFirstTechnology of 48MP AI Camera on the #HONORView20!#SeeTheUnseen launching on 29th January! Pre-book!#HONOR Store: https://t.co/rxo3bqIoma@amazonIN : https://t.co/6UArGjoHOJ pic.twitter.com/rvH7NVJ66s — Honor India (@HiHonorIndia) January 21, 2019 -
‘ఎల్జీ వీ40 థింక్యూ’పై భారీ ఆఫర్
ట్రిపుల్ రియర్ కెమెరాలతో ఎల్జీ వీ40 థింక్యూ స్మార్ట్ఫోన్ ఇపుడు మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. నేటి (జనవరి 19) నుంచి ఈ స్మార్ట్ఫోన్ విక్రయానికి లభ్యం కానుంది. ఎల్జీ వీ40 థింక్యూ రియర్వైపు మూడు, రెండు సెల్ఫీ కెమెరాలు ఉండటం విశేషం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే ఈ కెమెరాలు యూజర్లకు ఫోటోగ్రఫీలో కొత్త ఎక్స్పీరియన్స్ను అందించనున్నాయి. ఈ స్మార్ట్ఫోన్ గ్రే, బ్లూ కలర్స్లో లభ్యం కానుంది. భారత మార్కెట్లో ధర రూ. 60వేలు. అయితే అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్లో ప్రైమ్ సభ్యులకు మాత్రమే. రూ.49,900కే లభిస్తోంది. వీరికి జనవరి19వ తేదీ మధ్యాహ్నం నుంచి కొనుగోలు చేసే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. ఎల్జీ వీ40 థింక్యూ ఫీచర్లు 6.40 ఇంచెస్ డిస్ప్లే స్నాప్డ్రాగన్ 845 సాక్ 1440x3120 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 9 పై 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 8+5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 12+12+16 రియర్ కెమెరా 3300 ఎంఏహెచ్ బ్యాటరీ -
హానర్ 10 లైట్ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ : చైనా కంపెనీలలో షావోమి తరువాత హువావే బ్రాండ్కింద హానర్ స్మార్ట్ఫోన్లు భారతీయ కస్టమర్లను పలకరిస్తున్నాయి. అద్భుత ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా హానర్ 10 లైట్ అనే స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో కంపెనీ విడదల చేసింది హానర్. హానర్ 8 లైట్, 9 లైట్ డివైస్ల వరుసలో ఈ స్మార్ట్ఫోన్ను తీసుకొచ్చింది. డ్యూ డ్రాప్ డిస్ప్లే, ఏఐ ఆధారిత 24ఎంపీ సెల్ఫీ కెమెరా ప్రత్యేక ఆకర్షణగా ఉండనున్నాయి. రెండు వేరియంట్లలో దీన్ని తీసుకొచ్చింది. ధరలు 13,999 రూపాయల నుంచి ప్రారంభం. ప్రత్యేకంగా ఫ్లిప్కార్ట్ జనవరి 20నుంచి ఈ స్మార్ట్ఫోన్ విక్రయానికి లభ్యం. అలాగే జియో నుంచి 2200 క్యాష్బ్యాక్తో పాటు రూ.2800 క్లియర్ట్రిప్ వోచర్ను కూడా ఆఫర్ చేస్తోంది. హానర్ 10 లైట్ ఫీచర్లు 6.21 అంగుళాల డిస్ప్లే ఆండ్రాయిడ్ పై9 ఆక్టాకోర్ కిరిన్710 ప్రాసెసర్ 4జీబీ/6జీబీ ర్యామ్ 64జీబీస్టోరేజ్/ 13+2 ఎంపీ రియర్ కెమెరా 24 ఎంపీ సెల్ఫీ కెమెరా 3400 ఎంఏహెచ్ బ్యాటరీ -
అద్భుత ఫీచర్లతో రెడ్మి నోట్ 7 లాంచ్
బీజింగ్ : షావోమి రెడ్ మి నోట్ సిరీస్లో మరో కొత్త డివైస్ను గురువారం విడుదలచేసింది. చైనా రాజధాని బీజింగ్లో నిర్వహించిన ఒక ఈవెంట్లో రెడ్ మి నోట్ 7ను లాంచ్ చేసింది. అంతేకాదు డిఫరెంట్ డిజైన్, డ్యూడ్రాప్ న్యాచ్తో షావోమి తొలి స్మార్ట్ఫోన్గా రెడ్మి నోట్ 7 నిలవనుంది. మూడు వేరియంట్లలో, బడ్జెట్ ధరల్లో వీటిని ఆవిష్కరించింది. దీంతోపాటు రెడ్మి నోట్ 7ప్రొను కూడా తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ఫోన్లో ఒక్క కెమెరా తప్ప మిగిలిన ఫీచర్లన్నీ ఒకేలా ఉన్నాయి. చైనా మార్కెట్లో వీటి ధరలు మన కరెన్సీ ప్రకారం సుమారుగా ఇలా ఉన్నాయి. 3జీబీ ర్యామ్/ 32జీబీ స్టోరేజ్ ధర : 10వేల రూపాయలు 4జీబీ ర్యామ్/ 64జీబీ స్టోరేజ్ ధర : రూ.12,500 6జీబీ ర్యామ్/64జీబీ స్టోరేజ్ ధర : రూ.14, 500 స్పెసిఫికేషన్స్ 6.3 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే 2340x1080 పిక్సెల్స్ రిజల్యూషన్ స్నాప్డ్రాగన్ 660 సాక్ 48+5 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా(ఏఐ ఆధారిత) 13ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ -
బిగ్గర్ ఫర్ బెటర్.. హువావే వై 9
చైనా స్మార్ట్ఫోన్ తయారీదారు హువావే మరో స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. వై సిరీస్లో భాగంగా తొలి స్మార్ట్ఫోన్ను వై 9 పేరుతో నేడు (జనవరి 10) విడుదల చేసింది. బిగ్గర్ ఫర్ బెటర్.. ముందూ, వెనక మొత్తం నాలుగు బిగ్ కెమెరాలతో.. యూజర్లు ఫోటోగ్రఫీలో మాస్టర్ అయిపోతారంటూ లాంచింగ్ సందర్బంగా కంపెనీ వ్యాఖ్యానించింది. కాగా ఆ స్మార్ట్ఫోన్ను ఇప్పటికే చైనాలో గత ఏడాది తీసుకొచ్చింది. జనవరి 15నుంచి అమెజాన్ద్వారా ప్రత్యేకంగా విక్రయానికి అందుబాటులో ఉండనుంది. వై 9 ఫీచర్లు 6.5 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే 2340x1080 రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 2.2 ఆక్టాకోర్ కిరిన్ 710 సాక్ 4జీబీ, 64జీబీ స్టోరేజ్ 256దాకా స్టోరేజ్ను విస్తరించుకునే అవకాశం 16+2ఎంపీ డ్యుయల్ రియర్కెమెరా 13+2 ఎంపీ డ్యుయల్ సెల్ఫీ కెమెరా 4000ఎంఏహెచ్ బ్యాటరీ ధర : రూ.15,999 -
హువావే వై 9.. త్వరలో
చైనాకు స్మార్ట్ఫోన్ తయారీదారు హువావే మరో స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. వై సిరీస్లో భాగంగా తొలి స్మార్ట్ఫోన్ను వై 9 పేరుతో జనవరి 10వ తేదీని ఈ విడుదల చేయనుంది. ఇప్పటికే చైనాలో గత ఏడాది తీసుకొచ్చిన వై 9 ఫీచర్లపై అంచనాలు ఈ కింది విధంగా ఉండనున్నాయి. వై 9 ఫీచర్లు 6.5 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే 2340x1080 రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆక్టాకోర్ కిరిన్ 710 సాక్ 4జీబీ/6జీబీ ర్యామ్, 64జీబీ/128 స్టోరేజ్ 16+2ఎంపీ డ్యుయల్ రియర్కెమెరా 13+2 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000ఎంఏహెచ్ బ్యాటరీ ధర : సుమారు రూ.20వేలు అమెజాన్లో ఈ స్మార్ట్ఫోన్ పత్ర్యేకంగా అందుబాటులోకి రానుంది. ప్రీ బుకింగ్ కోసం నోటిఫై మి ఆప్షన్ కనిపిస్తోంది.