
శాంసంగ్ గెలాక్సీ ఏ 2 కోర్
సాక్షి, న్యూఢిల్లీ : సౌత్ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ బడ్జెట్ ధరలో కొత్త గెలాక్సీ స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రధానంగా చైనా మొబైల్ తయారీదారు షావోమి తీసుకొచ్చిన బడ్జెట్ ఫోన్ రెడ్మిగో కి పోటీగా ఈ డివైస్ను లాంచ్ చేసింది. గెలాక్సీ ఏ2 కోర్ పేరుతో , ఆండ్రాయిడ్ గో ఆధారిత స్మార్ట్ఫోన్ను శాంసంగ్ ఆవిష్కరించింది. దీని ధర 5290 రూపాయలు గా నిర్ణయించింది.
గెలాక్సీ ఏ2 కోర్ ఫీచర్లు
5 అంగుళాల డిస్ప్లే
960x540 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1. 6 ఆక్టాకోర్ ప్రాసెసర్, 7870 సాక్
1జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్
256 దాకా విస్తరించుకునే అవకాశం
5 ఎంపీ రియర్ కెమెరా
5 ఎంపీ సెల్ఫీ కెమెరా
2600 ఎంఏహెచ్ బ్యాటరీ
కాగా షావోమి తీసుకొచ్చిన రెడ్మి గో ధర రూ. 4499. అలాగే రెడ్మి గో లో 8 ఎంపీ రియర్ కెమెరాను పొందుపర్చగా, బ్యాటరీ సామర్ధ్యం 3000 ఎంఏహెచ్ గా ఉంది.