Xiaomi
-
అమ్మకాల్లో షావోమీ ఎలక్ట్రిక్ కార్ సరికొత్త రికార్డ్లు
చైనా టెక్ దిగ్గజం షావోమీ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కార్లు ఊహించని విధంగా అమ్ముడు పోతున్నట్లు తెలుస్తోంది. షావోమీ గతేడాది ఎస్యూ7 (ఎస్యూ అంటే స్పీడ్ ఆల్ట్రా) ను ఎలక్ట్రిక్ కారును మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ కారును గత నెల చివరి వారంలో విడుదల చేసింది. టెస్లా, బీవైడీ కార్లను తట్టుకుని నిలబడేందుకు ధర 2,15,900 యువాన్లు (సుమారు రూ.24,90లక్షలు)గా నిర్ణయించింది. ఇప్పుడు ఈ మోడల్ కార్లను విడుదల చేసిన మొదటి నెలలో సుమారు 70వేల ఆర్డర్లు వచ్చినట్లు తెలిపింది. ఈ సందర్భంగా సంస్థ సీఈఓ లీ జున్ మాట్లాడుతూ.. ఎస్యూ 7ను ఈ ఏడాది మొత్తం లక్ష యూనిట్లను అమ్మాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. కాగా షావోమీ ఎస్యూ7 సెడాన్ మూడు వేరియంట్ ధరల్లో లభ్యమవుతుంది. స్టాండర్డ్ ధర 215,900 యువాన్లు, హై ఎండ్ ఎస్యూ7 ప్రో 245,900 యువాన్లు, ఎస్యూ 7 మ్యాక్స్ 299,900 యువాన్లుగా ఉంది. -
ఒకసారి ఛార్జ్ చేస్తే హైదరాబాద్ టు శ్రీకాకుళం!
చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ షావోమీ తాజాగా తమ తొలి విద్యుత్ కారును ఆవిష్కరించింది. బీజింగ్లో జరిగిన కార్యక్రమంలో కంపెనీ సీఈఓ ‘లీ జున్’ దీన్ని పరిచయం చేశారు. ఎస్యూ7గా వ్యవహరించే ఈ కారును మార్చి 28న చైనాలో విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఈ సెడాన్లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ కంపెనీ ప్రముఖ ఫోన్లతో అనుసంధానమయ్యేలా రూపొందించారు. చైనాలో దిగ్గజ కంపెనీలుగా పేరొందిన ‘కాన్టెంపరరీ యాంపరెక్స్ టెక్నాలజీ’, బీవైడీ నుంచి తీసుకున్న బ్యాటరీలను ఈ కార్లలో వాడుతున్నారు. భవిష్యత్తులో ప్రపంచంలో తొలి ఐదు దిగ్గజ వాహన తయారీ సంస్థల్లో ఒకటిగా నిలుస్తామని లీ జున్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కారుని ‘సెల్-టు-బాడీ’ టెక్నాలజీతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. దీంతో బ్యాటరీని నేరుగా వాహన నిర్మాణానికే అనుసంధానం చేసినట్లు వివరించారు. ఫలితంగా కారు దృఢత్వం పెరిగిందని పేర్కొన్నారు. ఇప్పటికే కంపెనీ రూపొందించిన అనేక యాప్లకు ఈ కారులో యాక్సెస్ ఉంటుందన్నారు. ఈ కారు ఎస్యూ7, ఎస్యూ7 మ్యాక్స్ పేరిట రెండు వేరియంట్లలో లభించనుంది. ఎస్యూ 7 విషయానికి వస్తే.. 0-100 kmph వేగాన్ని 5.28 సెకన్లలో అందుకుంటుందని కంపెనీ తెలిపింది. అలాగే ఒక్కసారి ఛార్జ్ చేస్తే 668 కిలోమీటర్లు వెళ్తుంది. గరిష్ఠ వేగం 210 కి.మీ/గం. అత్యధికంగా 400 ఎన్ఎం టార్క్ వద్ద 299 పీఎస్ శక్తిని విడుదల చేస్తుంది. ఇదీ చదవండి: కంపెనీని బురిడీ కొట్టించి రూ.180 కోట్లు గ్యాంబ్లింగ్.. అసలేం జరిగిందంటే.. మరోవైపు ఎస్యూ7 మ్యాక్స్ 2.78 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకుంటుంది. ఒక్క ఛార్జింగ్తో 800 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. దీని గరిష్ఠ వేగం 265 కి.మీ/గం. 838 ఎన్ఎం టార్క్ వద్ద 673 పీఎస్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కార్ల ధరలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. -
షావోమీ స్మార్ట్ ఫోన్ యూజర్లకు అలెర్ట్!
స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ షావోమీ తన వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది. లిక్విడ్ యూవీ స్క్రీన్ ప్రొటెక్టర్లను వాడొద్దని సూచించింది. వాటిల్లో ద్రవరూపంలో ఉండే రసాయన జిగురు స్మార్ట్ఫోన్ చార్జింగ్ పోర్ట్, స్పీకర్, ఇతర భాగాల్లోకి వెళ్లి.. ఫోన్ పనితీరును దెబ్బతీస్తుందని హెచ్చరించింది. దీంతో పరికరం వారంటీ పూర్తి కాలం రాదని తెలిపింది. స్మార్ట్ ఫోన్ లలో స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాస్ అమర్చబడి ఉంటుంది. అయినప్పటికి ఫోన్ కింద పడినప్పుడు డిస్ ప్లేకి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు యూజర్లు అదనంగా స్క్రీన్ ప్రొటెక్టర్ లను ఉపయోగిస్తుంటారు. అయితే మార్కెట్లో లభించే వివిధ రాకలైన స్క్రీన్ ప్రొటెక్ట్ లలో లిక్విడ్ యూవీ అడెసివ్ ప్రొటెక్టర్లు మంచివని అంటుంటారు. ముఖ్యంగా కర్డ్వ్ ఫోన్ లకు ఫోన్ స్క్రీన్ కు, గ్లాస్ లేయర్ లు భద్రతగా ఉంటాయని వ్యాపారస్తులు నమ్మిస్తుంటారు. కానీ అలాంటి స్క్రీన్ ప్రొటెక్ట్ ల పట్ల జాగ్రత్తగా ఉండాలని షావోమీ ఓ నోట్ ను షేర్ చేసింది. ఈ ప్రొటెక్టర్లలో ఉపయోగించే లిక్విడ్ అంటుకునే పదార్థం ఫిజికల్ కీలు, ఛార్జింగ్ పోర్ట్, స్పీకర్ హోల్, బ్యాటరీ కవర్లోకి ప్రవేశించి, ఊహించని రీస్టార్ట్లు, బటన్ పనిచేయకపోవడం, స్పీకర్ శబ్దం, బ్యాటరీ కవర్ లెదర్ ఊడిపోవడం వంటి సమస్యలకు దారి తీస్తుందని నోట్ లో పేర్కొంది. వాటికి బదులుగా టెంపర్డ్ గ్లాస్, నాన్ టెంపర్డ్ లేదా ఎలక్ట్రోస్టాటిక్ ఫిల్మ్ల వంటి ప్రత్యామ్నాయాలను వినియోగించాలని సిఫార్సు చేస్తోంది. -
షావోమీ 14 సిరీస్ వచ్చేస్తోంది.. ధర ఎంతంటే?
చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ తన షావోమీ 14 సిరీస్ ను మార్కెట్ కు పరిచయం చేసేందుకు సిద్ధమైంది. వచ్చే నెల 7న షావోమీ 14తో పాటు షావోమీ 14 ప్రో, షావోమీ 14 ఆల్ట్రా సహా షావోమీ 14 సిరీస్ ఫోన్లలో తొలుత షావోమీ 14 ఫోన్ మాత్రమే భారత్ మార్కెట్ లో విడుదల చేయనుంది. కాగా, ఈ సిరీస్ ఫోన్లను షావోమీ ఇప్పటికే చైనా మార్కెట్ లో విడుదల చేసింది. ఇప్పుడు గ్లోబుల్ మార్కెట్ లో ఆవిష్కరించనుంది. షియోమీ 14 ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 6.36 అంగుళాల 1.5 కే ఎల్టీపీఓ ఓలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. 3000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో వస్తున్నది. షావోమీ 14 120హెచ్ జెడ్ వరకు రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్తో 1.5కే ఎల్ టీ పీ ఓ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ డాల్బీ విజన్తో పాటు స్టీరియో స్పీకర్లతో కూడిన డాల్బీ అట్మోస్కు సపోర్ట్ చేస్తుందని తెలిపింది. హ్యాండ్సెట్ 90డబ్ల్యూ వైర్డ్ హైపర్ఛార్జ్, 50డబ్ల్యూ వైర్లెస్ టర్బో ఛార్జ్కు సపోర్ట్ ఇస్తుంది. ఇది ఫోన్ను 10 నిమిషాల కంటే తక్కువ సమయంలో సున్నా నుండి 50కి ఛార్జ్ చేస్తుందని షావోమీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇందులో లైకా కో-ఇంజినీర్డ్ కెమెరా సెటప్ ఉంటది. ఓఐఎస్ 50 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 50 మెగా పిక్సెల్ టెలిఫోటో లెన్స్, 50-మెగా పిక్సెల్ ఆల్డ్రావైడ్ యాంగిల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. సెల్పీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా సైతం యూజర్లను అలరిస్తుంది. షియోమీ 14 ఫోన్ 90వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50వాట్ల వైర్ లెస్ చార్జింగ్ మద్దతుతో 4610 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. జేడ్ గ్రీన్, బ్లాక్, వైట్, స్నో మౌంటేన్ పింక్ వేరియంట్స్ కలర్స్ లో రానున్న ఈ ఫోన్ ధర రూ.50 వేల నుంచి రూ.60 వేల మధ్య ఉండొచ్చునని అంచనా -
అదిరిపోయే ఫీచర్లతో.. భారత్లో రెడ్మీ ఏ3 విడుదల.. ధర ఎంతంటే?
స్మార్ట్ ఫోన్ ప్రియులకు శుభవార్త. ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ తన స్మార్ట్ఫోన్ బ్రాండ్ రెడ్మీ సిరీస్లో రెడ్మీ ఏ2కి కొనసాగింపుగా రెడ్మీ ఏ3ని తీసుకొచ్చింది. మూడు కలర్ ఆప్షన్లు, మూడు స్టోరేజ్ వేరియంట్లలో లభ్యమవుతున్న ఫోన్ ధర రూ.7,299గా ఉంది. రెడ్ మీ ప్రీమియం ఫోన్లలో కనిపించే హాలో డిజైన్ ఈ బడ్జెట్ ఫోన్లలో కనిపిస్తుంది. రెడ్మీ ఏ3 ధర ఫిబ్రవరి 23 నుండి రిటైల్ అవుట్లెట్లలో లభ్యమయ్యే రెడ్మీ ఏ3 ధర 3జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 7,299 ఉండగా.. 4జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 8,299, 6జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 9,299 అందుబాటులో ఉంటుంది. రెడ్మీ ఏ3 స్పెసిఫికేషన్స్ రెడ్మీ ఏ3 1650*720 పిక్సెల్ల రిజల్యూషన్తో 6.7 అంగుళాల హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లేను కలిగి ఉంది. 90హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్కు సపోర్ట్ చేస్తుంది. బడ్జెట్ స్మార్ట్ఫోన్ వాటర్డ్రాప్ స్టైల్ నాచ్ను కలిగి ఉంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియా జీ36 చిప్సెట్తో 6జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జీబీ వరకు ఈఎంఎంసీ 5.1 స్టోరేజ్తో పనిచేస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కోసం బడ్జెట్ స్మార్ట్ఫోన్లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్, కనెక్టివిటీ పరంగా రెడ్మీ ఏ3 సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3.5 ఎంఎం హెడ్ఫోన్ జాక్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, డ్యూయల్ 4జీ సిమ్ కార్డ్ స్లాట్లు, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.3లు ఉన్నాయి. 8ఎంపీ ప్రైమరీ సెన్సార్, 0.08 ఎంపీ సెకండరీ సెన్సార్తో సహా వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్, సెల్ఫీ, వీడియో కాల్ సంబంధిత అవసరాలను తీర్చడానికి 5ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ షూటర్ ఉంది. -
స్మార్ట్ఫోన్ కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ కారు - సింగిల్ ఛార్జ్తో 800కిమీ రేంజ్
చైనాలోని బీజింగ్లో గురువారం జరిగిన 'షావోమి' (Xiaomi) ఈవీ టెక్నాలజీ లాంచ్ ఈవెంట్ వేదికగా.. కంపెనీ తన సరికొత్త ఎలక్ట్రిక్ కారుని ఆవిష్కరించింది. చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ఆవిష్కరించిన ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. షావోమి కంపెనీ మార్కెట్లో విడుదల చేయనున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు 'SU7' (స్పీడ్ అల్ట్రా7). ఇది ప్రపంచ మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న అగ్ర సంస్థల ఎలక్ట్రిక్ కార్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉండనున్నట్లు సమాచారం. రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహన విభాగంలో తప్పకుండా గొప్ప గుర్తింపు పొందటానికి కంపెనీ కృషి చేస్తున్నట్లు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. SU7 అనేది నాలుగు డోర్స్ కలిగిన ఎలక్ట్రిక్ కారు. ఇది అద్భుతమైన డిజైన్ కలిగి, ఆధునిక ఫీచర్స్ పొందనుంది. పరిమాణం పరంగా ఉత్తమంగా ఉండే ఈ కారు 73.6 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి, ఒక సింగిల్ చార్జితో గరిష్టంగా 800కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. 2025నాటికి లాంచ్ షావోమి ఎలక్ట్రిక్ కారు 2025 నాటికి మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఈ కార్లు మొత్తం చైనాలోని బీజింగ్ తయారీ కర్మాగారంలోనే తయారవుతాయని కంపెనీ వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తే ఈ కార్లు చైనా నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదీ చదవండి: రతన్ టాటా గురించి ఐదు ఆసక్తికర విషయాలు అంచనా ధర SU7 ధరలు 200000 యువాన్ల నుంచి 300000 యువాన్ల వరకు ఉండే అవకాశం ఉంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ రూ. 25 లక్షల నుంచి రూ. 35 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ఈ కారు భారతీయ మార్కెట్లో విడుదలవుతుందా.. లేదా అనేదానిపైన అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. #XiaomiSU7 makes a significant #Stride as Xiaomi expands from the smartphone industry to the automotive sector, completing the Human x Car x Home smart ecosystem. #XiaomiSU7 will forever journey alongside those steering toward their dreams.#XiaomiEVTechnologyLaunch pic.twitter.com/ZLW5m7PTQN — Xiaomi (@Xiaomi) December 28, 2023 -
ఎలక్ట్రిక్ కారు తయారీలో చైనా స్మార్ట్ఫోన్ కంపెనీ - సింగిల్ చార్జ్తో 265 కిమీ రేంజ్!
గ్లోబల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతున్న తరుణంలో కేవలం ఆటోమొబైల్ తయారీ సంస్థలు మాత్రమే కాకుండా ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం 'షావోమీ' (Xiaomi) కూడా ఎలక్ట్రిక్ వెహికల్ విభాగంలో అడుగుపెట్టింది. ఇందులో భాగంగానే తన మొట్ట మొదటి ఎలక్ట్రిక్ కారు SU7 ఆవిష్కరించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. SU7, SU7 ప్రో, SU7 మాక్స్ అనే మూడు వేరియంట్లలో విడుదలకానున్న కొత్త షావోమీ SU7 ఎలక్ట్రిక్ కారు రియర్-వీల్ డ్రైవ్ (RWD), ఆల్-వీల్ డ్రైవ్ (AWD) అనే రెండు పవర్ట్రెయిన్ ఎంపికలతో లభించనుంది. రియర్-వీల్ డ్రైవ్ పవర్ట్రెయిన్ కలిగిన షావోమీ ఎలక్ట్రిక్ కారు 295 Bhp పవర్ అందించే ఎలక్ట్రిక్ మోటారు పొందుతుంది. అయితే ఆల్-వీల్ డ్రైవ్ మోడల్ 663 Bhp పవర్ అందిస్తుంది. ఇందులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు అందుబాటులో ఉంటాయి. ఇదీ చదవండి: లాంచ్కు ముందే రూ.10 కోట్ల కారు కొన్న చెన్నై వాసి - ఫోటోలు వైరల్ షావోమీ ఎలక్ట్రిక్ కారు LFP బ్యాటరీ ప్యాక్లను కలిగి ఉంటడం వల్ల మంచి రేంజ్ అందిస్తాయి. బేస్ మోడల్స్ ఒక ఫుల్ చార్జ్తో 210 కిమీ/గం, హై ఎండ్ వేరియంట్స్ 265 కిమీ/గం రేంజ్ అందిస్తాయి. బేస్ మోడల్స్ బరువు 1980 కేజీలు కాగా, టాప్ ఎండ్ మోడల్స్ 2205 కేజీల వరకు ఉంటుంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారు ఉత్పత్తిని 2023 డిసెంబర్ నుంచి ప్రారంభించే అవకాశం ఉంటుంది. డెలివరీలు 2024 ఫిబ్రవరి నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే సంస్థ బీజింగ్ ఫ్యాక్టరీలో ట్రయల్ ప్రొడక్షన్ కూడా ప్రారంభించింది. ఈ ఎలక్ట్రిక్ కారు డిజైన్, ఇతర ఫీచర్స్, ధరలు వంటి మరిన్ని అధికారిక వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. -
టెక్ దిగ్గజం యాపిల్కు భారీ షాక్!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్కు భారీ షాక్ తగిలింది. చైనాలో యాపిల్ అమ్మకాలు తగ్గగా.. స్థానిక కంపెనీ షావోమీకి మాత్రం కొనుగోలు దారులు పట్టం కట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఏడాది జూన్ నుంచి ప్రస్తుతం వరకు మొత్తం 20 బిలియన్ డాలర్లకు మార్కెట్ విలువ పెరిగింది. ఆ సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్స్తో పాటు ఇతర రంగాల్లోని వ్యాపారాలు గణనీయమైన వృద్దిని సాధించాయి. ఫలితంగా హాంకాంగ్ స్టాక్ మార్కెట్లో షావోమీ స్టాక్ విలువ 60 శాతం పెరిగినట్లు హాంగ్ సెంగ్ టెక్ ఇండెక్స్ తెలిపింది. ఇటీవల యాపిల్ క్యూ4 ఫలితాలు విడుదల చేసింది. ఆ ఫలితాల్లో కంపెనీకి రెవెన్యూ తగ్గినా.. కొత్తగా విడుదల చేసిన ఐఫోన్ 15 సిరీస్ కొనుగోళ్లు భారీగా జరిగినట్లు నివేదించింది. జులై నుంచి సెప్టెంబర్ నెల ముగిసే సమయానికి ఈ లేటెస్ట్ సిరీస్ ఫోన్ల 73.5 బిలియన్ డాలర్ల విలువైన అమ్మకాలు జరిగాయి. ఈ మొత్తం గత ఏడాదితో పోలిస్తే 1శాతం తగ్గింది. అయితే ఆండ్రాయిడ్ మార్కెట్లో యాపిల్ సేల్స్ తగ్గినా.. రానున్న రోజుల్లో ఆ సంస్థకు ఆశించిన స్థాయిలో మార్కెట్ ఫలితాలు ఉంటాయని అంచనాలు నెలకొన్నాయి. ఫలితంగా చైనాలో ఇతర ఆండ్రాయిడ్ ఫోన్ల తయారీ సంస్థలు సైతం అమ్మకాలు పెరుగుతాయని ఆశిస్తున్నాయి. షోవోమీ 14 సిరీస్ అమ్మకాల జోరు చైనా స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ షావోమీ గత నెల 26న ‘షావోమీ 14’ సిరీస్ను విడుదల చేసింది. అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు మొత్తం 10 లక్షల ఫోన్లు అమ్ముడు పోయాయి. చైనా స్మార్ట్ఫోన్ మార్కెట్లో ఈ అమ్మకాల్ని షావోమీ రెండో సారి సాధించింది. షావోమీ తర్వాతి స్థానంలో హువావే టెక్నాలజీ విడుదల చేసిన స్మార్ట్ఫోన్ మేట్ 60 ప్రొ ఉంది. కాగా, షావోమీ ఫోన్లే కాకుండా ఎలక్ట్రిక్ వెహికల్, ఏఐ ఆధారిత ఉత్పత్తులకు మార్కెట్ అదే స్థాయిలో ఉందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చైనా కంపెనీల ఫోన్ల జోరు డ్రాగన్ దేశం ఆర్ధిక మాంద్యం దెబ్బకు ఉక్కిరి బిక్కిరవుతుంది. కాబట్టే అక్కడి పౌరులు ఖర్చు పెట్టే విషయంలో ఆలోచిస్తున్నారు. వారి నిర్ణయం స్మార్ట్ ఫోన్ కొనుగోళ్లపై పడింది. ఇటీవల ప్రముఖ రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ నివేదికలో క్యూ3లో స్మార్ట్ఫోన్ సేల్స్ 3 శాతం పడిపోయాయి. దీనిపై అమెరికా పెట్టుబడి సంస్థలు మోర్గాన్ స్టాన్లీ, సిటీ గ్రూప్లు స్పందిస్తూ.. వచ్చే ఏడాది నాటికి చైనాలో స్మార్ట్ఫోన్ సేల్స్ పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశాయి. చదవండి👉 ఆస్తులన్నీ పోగొట్టుకుని దీనస్థితిలో అమితాబ్.. నలుగురిలో నిలబెట్టిన ధీరూభాయ్.. -
రెడ్మీ నోట్ 13 సిరీస్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్ - సూపర్ ఫీచర్లు
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ.. షావోమీ రెడ్మీ నోట్ 13 సిరీస్ స్మార్ట్ ఫోన్లను మార్కెట్కు పరిచయం చేసింది. షావోమీ 12 సిరీస్ సూపర్ హిట్ కావడంతో.. లేటెస్ట్ సిరీస్ షోవోమీ 13పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ సిరీస్లో రెడ్మీ నోట్ 13, రెడ్మీ నోట్ 13 ప్రో, రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ మోడళ్లను సెప్టెంబర్ 22న చైనాలో లాంచ్ చేసింది. రేపటి నుంచి ఈ సిరీస్ ఫోన్ల అమ్మకాలు ప్రారంభమవుతున్నాయి. రెడ్మీ నోట్ 13 స్పెసిఫికేషన్లు 6.67-అంగుళాల అమోలెడ్ డిస్ప్లే ఉన్న రెడ్మీ నోట్ 13లో 120హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్, మీడియా టెక్ డైమెన్సిటీ 6080 SoC, 12జీబీ ర్యామ్ 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ను అందిస్తుంది. దీంతో పాటు ఈ ఫోన్లో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్లో 100-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్లు ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ సెన్సార్ సౌకర్యం ఉండగా..ఫోన్ 33డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. రెడ్మీ నోట్ 13 ప్రో స్పెసిఫికేషన్లు ప్రో మోడల్లో 6.67-అంగుళాల 1.5కే హెచ్డీ ప్లస్ అమోలెడ్ ప్యానల్,120హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జనరేషన్ 2 చిప్సెట్తో పాటు 16జీబీ ర్యామ్ 512జీబీ ఆన్బోర్డ్ స్టోరేజ్తో వస్తుంది. ఫోటోగ్రఫీ విభాగంలో నోట్ 13 ప్రో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 200-మెగాపిక్సెల్ శాంసంగ్ ISOCELL హెచ్పీ3 ప్రైమరీ రియర్ సెన్సార్, అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్తో 8 మెగాపిక్సెల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, ఫ్రంట్ అండ్ బ్యాక్ 16 మెగాపిక్సెల్ సెన్సార్తో వస్తుండగా 67డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5,100ఎంఏహెచ్ బ్యాటరీని పొందవచ్చు. రెడ్మీ నోట్ 13ప్రో ప్లస్ స్పెసిఫికేషన్లు ఈ రెడ్మీ నోట్ 13 ప్రో+ రేర్లో లో 200ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రా వైడ్, 2ఎంపీ షూటర్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఫ్రెంట్లో 16ఎంపీ కెమెరా వస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా ప్రాసెసర్, 16జీబీ ర్యామ్- 512జీబీ స్టోరేజ్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 120 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, యూఎస్బీ-సీ పోర్ట్, 3.5ఎంఎం హెడ్ఫోన్ జాక్, ఐఆర్ బ్లాస్టర్, 5జీ, వైఫై-6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్సీ వంటి కనెక్టివిటీ ఫీచర్స్ సైతం ఉన్నాయి. రెడ్మీ నోట్ 13, రెడ్ మీ నోట్ 13 ప్రో, రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ ధరలు రెడ్మీ నోట్ 13, 6జీబీ ప్లస్ 128జీబీ వేరియంట్ ఫోన్ ధర దాదాపు రూ. 13,900, 8జీబీ ప్లస్ 128 జీబీ, 8జీబీ ప్లస్ 256 జీబీ వేరియంట్ల ఫోన్ ధరలు రూ. 15,100, రూ. 17,400గా ఉంది. 12జీబీ ప్లస్ 256 జీబీ ఫోన్ ధర రూ. 19,700గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. రెడ్మీ నోట్ 13 ప్రో 8జీబీ ర్యామ్, 128 జీబీ, 256 జీబీ వేరియంట్ ఫోన్ల ధరలు రూ. 17,400, రూ. 19,700 వద్ద అందుబాటులో ఉన్నాయి. నోట్ 13 ప్రో 12జీబీ ప్లస్ 256జీబీ వేరియంట్ రూ. 22,000, 12జీబీ ప్లస్ 512 జీబీ వేరియంట్ ఫోన్ ధర రూ. 23,100కే కొనుగోలు చేయొచ్చు.హై-ఎండ్ ప్రో మోడల్ 16జీబీ ప్లస్ 512 జీబీ వేరియంట్ ఫోన్ ధర రూ. రూ. 24,300గా ఉంది. -
దిగొచ్చిన చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమి: సంచలన నిర్ణయం
Xiaomi smartphone plant: చైనా స్మార్టఫోన్ తయారీదారులపై కొనసాగుతున్న ఒత్తిడి నేపథ్యంలో చైనా కంపెనీ షావోమి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాలతో, చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీదారు షావోమి సప్లయిర్ డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ న్యూఢిల్లీ శివార్లలో భారీ ఫ్యాక్టరీని నిర్మించనుంది. దీంతో ఐఫోన్ తయారీ దారు తైవాన్ కంపెనీ ఫాక్స్కాన్కు పోటీగా డిక్సన్కు షావోమి పార్టనర్ షిప్ మరింత బలాన్నివ్వనుందని అంచనా. అయితే ఈ వార్తలపై అటు షావోమిగానీ, డిక్సన్గానీ అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదు. (ఎమర్జెన్సీ అలర్ట్ సివియర్..ఈ ఫ్లాష్ మెసేజ్మీకూ వచ్చిందా?) బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం 300,000 చదరపు అడుగులకు మించి, దాదాపు ఆరు ఫుట్బాల్ మైదానాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఫ్యాక్టరీలో డిక్సన్ మూడు సంవత్సరాలలో రూ. 400 కోట్ల రూపాయలు (48.2 మిలియన్ డాలర్లు) కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టనుంది. ప్రధానంగా ఇక్కడ షావోమి స్మార్ట్ఫోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్లాంట్ను ఈ నెలాఖరులో ప్రభుత్వ అధికారి ప్రారంభించనున్నారు. (తొలి భారతీయ కంపెనీగా ఇన్ఫోసిస్ ఘనత: దిగ్గజ కంపెనీల ప్లేస్ ఎక్కడ?) అలాగే షావోమీ గతంలో చైనానుంచి దిగుమతి చేసుకున్న బ్లూటూత్ నెక్బ్యాండ్ ఇయర్ఫోన్లను తయారు చేయడానికి దేశీయ ఆప్టిమస్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీకి కాంట్రాక్ట్ను కుదుర్చుకుంది. ఇది గతంలో చైనా నుండి దిగుమతి అయ్యేవి. డిక్సన్ వేగంగా విస్తరిస్తున్న ఎలక్ట్రానిక్స్ కంపెనీ. మోటరోలా, శాంసంగ్ వంటి బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లు, వాషింగ్ మెషీన్లు, టెలివిజన్ సెట్లతో సహా ఇతర ఉత్పత్తులను తయారు చేస్తుంది. మూడు దశాబ్దాల క్రితం డిల్లీ శివార్లలో సునీల్ వచాని డిక్సన్ను ప్రారంభించారు. కాగా ఇండియా స్మార్ట్ఫోన్ మార్కెట్లో ఒకపుడు టాప్లో ఎదురు లేకుండా ఉన్న షావోమి కేంద్ర నిబంధనలు, నియంత్రణలతో అధిక నియంత్రణ త తర్వాట్ మార్కెట్ షేర్ను కోల్పోయింది. దీన్నుంచు కోలుకునే చర్యల్లో భాగంగా మేడిన్ ఇండియా 5G స్మార్ట్ఫోన్లను సరసమైన ధరలో అందించాలని ప్లాన్ చేస్తోంది. Leadership of @XiaomiIndia met me tdy - hv set out to them our expectations of thm increasing exports, deepening supply chain eco-system n value addition in India n all products to be data privacy compliant @PMOIndia @GoI_MeitY pic.twitter.com/Y8E1YXnOxv — Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) July 6, 2022 -
చైనా స్మార్ట్ఫోన్ కంపెనీలకు భారీ షాక్! కేంద్రం సీరియస్
GST Evasion: చైనా స్మార్ట్ఫోన్ కంపెనీలకు భారత ప్రభుత్వం భారీ షాకిచ్చింది. జీఎస్టీ ఎగవేత ఆరోపణలపై షావోమీ, ఒప్పో, వివో,లెనోవో కంపెనీలపై విచారణ జరుగుతోందని కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని, దర్యాప్తు ప్రారంభించామని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రాజ్యసభలో తెలిపారు. పన్ను మొత్తం/వడ్డీ/పెనాల్టీని వర్తించే విధంగా జమ చేయాలని ఆదేశించినట్టు కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. షావోమి, రియల్మి, ఒప్పో, వివో, వన్ప్లస్ లాంటి చైనా స్మార్ట్ఫోన్ తయారీదారులు 2023-24 వరకు గత ఐదేళ్లలో రూ. 1,108.98 కోట్ల జీఎస్టీ, రూ. 7,966.09 కోట్ల కస్టమ్ డ్యూటీలను ఎగవేసినట్లు కేంద్రం శుక్రవారం పార్లమెంటుకు తెలిపింది. ఇది 2017-18, 2023-24 మధ్య (జూలై 1 వరకు) డేటా రాజీవ్ చంద్రశేఖర్ రాజ్యసభ ఎంపీ నారాయణ్ దాస్ గుప్తా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా తెలిపారు. 2019-20లో, షావెమి రూ. 653.02 కోట్ల కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసింది, అందులో కేవలం రూ. 46 లక్షలు మాత్రమే చెల్లించింది. కంపెనీ లోటుపై ప్రభుత్వం షోకాజ్ నోటీసు జారీ చేసిందని చంద్రశేఖర్ తెలిపారు. అదే విధంగా, 2020-21లో, ఒప్పో మొబైల్ ఇండియా రూ. 4,389 కోట్ల కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసింది, అందులో రూ. 450 కోట్లు మాత్రమే చెల్లించింది. (లండన్లో లగ్జరీ భవనాన్ని దక్కించుకున్న భారత బిలియనీర్) వివో ఇండియా అదే సంవత్సరంలో రూ.2,217 కోట్ల కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసింది, అందులో కేవలం రూ.72 కోట్లు మాత్రమే చెల్లించింది. మొత్తంగా వివో ఈ రెండేళ్లలో 2,875 కోట్ల కస్టమ్స్ డ్యూటీలను ఎగవేసినట్లు ఆరోపణలు రాగా, కేవలం రూ. 117 కోట్లను రికవరీ చేసిందని మంత్రి తెలిపారు. జీఎస్టీ పరంగా కంపెనీ రూ.48.25 కోట్లు ఎగవేసిందని, ఎగవేతలో కొంత భాగం ఇంకా ప్రాసెస్లో ఉందని మంత్రి చెప్పారు. ఇప్పటి వరకు కంపెనీ నుంచి రూ.51.25 కోట్లను ప్రభుత్వం వసూలు చేసింది. ( జస్ట్ పోజింగ్...ఆనంద్ మహీంద్రా హనీమూన్ పిక్ వైరల్) భారతదేశంలో మోటరోలా బ్రాండ్ను కూడా నిర్వహిస్తున్న లెనోవా ఇంకా రికవరీలు నమోదు చేయనప్పటికీ, రూ. 42.36 కోట్ల జీఎస్టీ ఎగవేసిందన్నారు. ప్రధాన చైనీస్ మొబైల్ హ్యాండ్సెట్ బ్రాండ్లు భారతదేశంలో 2022 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.5 లక్షల కోట్ల టర్నోవర్ను కలిగి ఉన్నాయని, అలాగే నేరుగా 75 వేల మందికి పైగా , అమ్మకాలు ,కార్యకలాపాలలో మరో 80,000 మందికి ఉపాధి కల్పించారని మంత్రి చెప్పారు. -
రూ.10 వేల ధరలో షావొమీ 5జీ!
న్యూఢిల్లీ: స్మార్ట్ ఉపకరణాల తయారీలో ఉన్న షావొమీ రూ.10–15 వేల ధరల శ్రేణిలో 5జీ మోడళ్లను పెద్ద ఎత్తున తీసుకు రానుంది. మార్కెట్ వాటాను తిరిగి చేజిక్కించుకోవాలన్న వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ప్రకటించింది. ‘ప్రస్తుతం 5జీ మోడళ్లు ఎక్కువగా రూ.20 వేలకుపైగా ధర పలుకుతున్నాయి. రూ.15–20 వేల ధరల శ్రేణిలో విస్తృతి పెరిగింది. రూ.10–15 వేల ధరల విభాగంలో మార్కెట్ ఉండబోతోంది. షావొమీకి ఈ సెగ్మెంట్లో భారీ అవకాశాలు ఉన్నాయి. 4జీ స్మార్ట్ఫోన్ల రంగంలో అమలు చేసిన విధానాన్ని పునరావృతం చేయడానికి, 5జీ మ్యాజిక్ను మళ్లీ సృష్టించడానికి కంపెనీకి స్పష్టమైన అవకాశం ఉంది’ అని షావొమీ ఇండియా ప్రెసిడెంట్ బి.మురళీకృష్ణన్ తెలిపారు. రిటైల్ స్టోర్ల లో సేల్స్ ప్రమోటర్ల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 4,000 నుంచి 2023 డిసెంబర్ నాటికి రెండింతలకు చేస్తామన్నారు. -
షావోమి కూడా రంగంలోకి: ఆందోళనలో ఉద్యోగులు
చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమి కూడా ఉద్యోగాల తీసివేత దిశలో మరింతగా అడుగులు వేస్తోంది. ఇటీవలి కాలంలో భారత ప్రభుత్వ ఏజెన్సీల నుంచి పెరిగిన ఒత్తిడి, మార్కెట్ వాటా క్షీణత తదితర కారణాల నేపథ్యంలో ఉద్యోగులను, తద్వారా తగ్గించుకునే పనిలో పడినట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే షావోమి ఇండియా మరికొంత మందికి ఉద్వాసన పలకనుంది. తద్వారా మొత్తం సిబ్బంది సంఖ్యను దాదాపు వెయ్యికి తగ్గించుకోవాలని చూస్తోందట. దీంతో ఎపుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందో తెలియని ఆందోళనలో ఉద్యోగులున్నారు. అయితే ఎంతమందిని, ఏయే విభాగాల్లో తొలగింనుందని అనేది స్పష్టత లేదు. (ఆషాఢంలో శుభవార్త: తగ్గుతున్న బంగారం,వెండి ధరలు) ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం షావోమి ఇండియా 2023 ప్రారంభంలో సుమారు 1400-1,500 మంది ఉద్యోగులను నియమించుకుంది. కానీ ఇటీవల దాదాపు 30 మంది ఉద్యోగులను తొలగించింది. రాబోయే నెలల్లో మరింత మందిని తొలగించాలని భావిస్తోంది. సంస్థాగత నిర్మాణాన్ని క్రమబద్ధీకరణ, వనరుల కేటాయింపును ఆప్టిమైజ్ చేసే వ్యూహంలో భాగంగా తాజా నిర్ణయం తీసుకున్నట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. (థ్యాంక్స్ టూ యాపిల్ స్మార్ట్ వాచ్, లేదంటే నా ప్రాణాలు: వైరల్ స్టోరీ) ఇదీ చదవండి: తొలి జీతం 5వేలే...ఇపుడు రిచెస్ట్ యూట్యూబర్గా కోట్లు, ఎలా? -
షావోమీ సరికొత్త ట్యాబ్లెట్ వచ్చేసింది, ధర, ఆఫర్లు ఎలా ఉన్నాయంటే?
చైనా స్మార్ట్మేకర్ షావోమీ కొత్త ట్యాబ్లెట్ను లాంచ్ చేసింది. హైఎండ్ ఫీచర్స్తో షావోమీ ప్యాడ్ 6 మోడల్ను తీసుకొచ్చింది. షావోమీ ప్యాడ్ 5 అప్గ్రేడ్ వేరియంట్గా ఆల్ మెటల్ డిజైన్తో దీన్ని ఆవిష్కరించింది. ధర, ఆఫర్ షావోమీ ప్యాడ్ 6 రెండు వేరియంట్లలో లభిస్తుంది. 6జీబీ ర్యామ్ , 128జీబీ స్టోరేజ్ ధర రూ.26,999గా నిర్ణయించింది.అలాగే 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.28,999. జూన్ 21న సేల్ ప్రారంభం. షావోమీ ఆన్లైన్ స్టోర్లతోపాటు,అమెజాన్లో లభిస్తుంది. (స్టార్ క్రికెటర్ కోహ్లీ పార్టనర్, ఈ బిలియనీర్ గురించి తెలుసా? నెట్వర్త్ ఎంతంటే?) ఇక ఆఫర్ విషయానికి వస్తే..ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వారికి రూ.3,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.ఫలితంగా షావోమీ ప్యాడ్ 6 ట్యాబ్లెట్ 6జీబీ+128జీబీ వేరియంట్ రూ.23,999కు, 8జీబీ+256జీబీ వేరియంట్ రూ.26,999 ధరకు కొనుగోలుచేయవచ్చు. షావోమీ ప్యాడ్ 6 స్పెసిఫికేషన్స్ 11 అంగుళాల 2.8K ఎల్సీడీ డిస్ప్లే 144Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 స్క్రీన్ ప్రొటెక్షన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 13 + ఎంఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టమ్ HDR10+, డాల్బీ విజన్ ఫీచర్స్ 13 ఎంపీ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్పీ కె కెమెరా 8,840mAh బ్యాటరీ 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ -
46 శాతం డిస్కౌంట్తో ప్రీమియం మొబైల్.. ఇలా చేస్తే మీ సొంతం!
Xiaomi 12 Pro: మార్కెట్లో అత్యంత ఖరీదైన స్మార్ట్ఫోన్ల జాబితాలో 'షావోమి 12 ప్రొ' (Xiaomi 12 Pro) ఒకటి. ఈ మొబైల్ ఇప్పుడు ఏకంగా 46 శాతం డిస్కౌంట్తో సరసమైన ధరకే లభిస్తుంది. ఈ లేటెస్ట్ మొబైల్ని అందుబాటు ధరకు ఎలా కొనాలి? ఎక్కడ కొనాలి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఫ్లిప్కార్ట్లో సేవింగ్స్ డేస్ సేల్స్లో భాగంగా షావోమి 12 ప్రొ మొబైల్ 46 శాతం తక్కువ ధరకే లభిస్తుంది. ఈ సేల్స్లో కేవలం ఈ మొబైల్ ఫోన్ మీద మాత్రమే కాకుండా.. ఇతర ప్రీమియం స్మార్ట్ఫోన్స్, బడ్జెట్ స్మార్ట్ఫోన్ల మీద కూడా ఆకర్షణీయమైన తగ్గింపు లభిస్తుంది. 8 జీబీ ర్యామ్, 256 స్టోరేజ్ కలిగిన షావోమి 12 ప్రొ 5జీ ఫోన్ అసలు ధర రూ. 79999. అయితే డిస్కౌంట్ పొందిన తరువాత ఇది రూ. 42,499కే లభిస్తుంది. అంతే కాకుండా బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ ఆఫర్స్ కింద ఈ ధర మరింత తగ్గుతుంది. అన్ని ప్రీమియం ఫీచర్స్ కలిగిన ఈ మొబైల్ ఫోన్ 5జీ నెట్వర్క్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్ సెట్ అమర్చారు. 120 హెర్జ్స్ రిఫ్రెష్ రేటుతో 6.72 ఇంచెస్ అమొలెడ్ డిస్ప్లే, అద్భుతమైన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. (ఇదీ చదవండి: ఒక్క బిజినెస్.. వందల కోట్ల టర్నోవర్ - వినీత సింగ్ సక్సెస్ స్టోరీ!) షావోమి 12 ప్రొ కొనాలనుకునే వారు HDFC క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ. 1000 డిస్కౌంట్ లభిస్తుంది. అంతే కాకుండా మంచి కండిషన్లో ఉన్న మొబైల్ని ఎక్స్చేంజ్ చేసుకుంటే ధర ఇంకా తగ్గుతుంది. దాదాపు రూ. 80వేల మొబైల్ సగం ధరకే కొనుగోలు చేయడానికి తప్పకుండా ఈ కండిషన్స్ పాటించాలి. -
ఫెమా ఉల్లంఘనకు షావోమీకి ఈడీ షోకాజ్ నోటీసులు
న్యూఢిల్లీ: విదేశీ మారక నిర్వహణ చట్ట (ఫెమా) నిబంధనల ఉల్లంఘనకు గాను చైనా మొబైల్ తయారీ దిగ్గజం షావోమీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షోకాజ్నోటీసులు జారీ చేసింది. రాయల్టీ ముసుగులో అనధికారికంగా రూ. 5,551.27 కోట్ల విలువ చేసే మొత్తాన్ని విదేశాలకు బదలాయించడానికి సంబంధించి ఈడీ ఈ మేరకు చర్యలు తీసుకుంది. సదరు మొత్తాన్ని జప్తు చేస్తూ.. షావోమీ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సమీర్ రావు, మాజీ ఎండీ మను జైన్తో పాటు సిటీ బ్యాంక్, హెచ్ఎస్బీసీ బ్యాంక్, డాయిష్ బ్యాంక్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. -
సగ భాగం 5జీ ఫోన్లే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఈ ఏడాది అమ్ముడయ్యే స్మార్ట్ఫోన్లలో సగ భాగం 5జీ మోడళ్లు ఉంటాయని షావొమీ ఇండియా ప్రెసిడెంట్ మురళీకృష్ణన్ తెలిపారు. వివిధ నివేదికలూ ఈ విషయాన్నే వెల్లడిస్తున్నాయని ఆయన అన్నారు. హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. ‘భారత్లో రూ.20 వేలకుపైగా ఖరీదు చేసే స్మార్ట్ఫోన్లు అన్నీ 5జీ మోడళ్లే. రూ.15–20 వేల ధరల విభాగంలో 5జీ వాటా 80 శాతం కాగా, రూ.10–15 వేల సెగ్మెంట్లో 40–50 శాతం కైవసం చేసుకుంది. రూ.10 వేల లోపు ధరల శ్రేణిలో ఈ ఏడాది 5జీ వచ్చే అవకాశం లేదు. 4జీతో పోలిస్తే 5జీ చిప్సెట్ కనీసం రూ.3,000 ఖరీదు ఎక్కువగా ఉంటుంది’ అని వివరించారు. మూడు పునాదులు.. ఉత్తమ ఫీచర్లు, అత్యంత నాణ్యత, ధర విషయంలో నిజాయితీ.. ఈ మూడు అంశాలు పునాదులుగా వ్యాపారం సాగిస్తున్నామని మురళీకృష్ణన్ తెలి పారు. ‘2014 నుంచి ఇప్పటి వరకు దేశంలో 20 కోట్ల ఫోన్లు విక్రయించాం. కంపెనీ అమ్మకాల్లో ఆన్లైన్, ఆఫ్లైన్ వాటా సమంగా ఉంది. పరిశ్రమలో ఆఫ్లైన్ వాటా 60 శాతం కైవసం చేసుకుంది. ఒక్కో ఉత్పాదన అభివృద్ధికి 9–12 నెలల సమయం తీసుకుంటున్నాం. కనీసం 4జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమరీ కావాల్సిందేనని కస్టమర్లు కోరుతు న్నారు. ఫాస్ట్ చార్జింగ్, అమోలెడ్ డిస్ప్లే, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ డిమాండ్ చేస్తున్నారు’ అని వివరించారు. -
రెడ్మీ నోట్ 12 5జీపై భారీ డిస్కౌంట్, రూ.12,999కే కొనుగోలు చేయొచ్చు!
ఈ ఏడాది జనవరిలో విడుదలైన 5జీ స్మార్ట్ఫోన్ రెడ్మీ నోట్ 12 5జీ ఫోన్పై ప్రముఖ ఫోన్ తయారీ సంస్థ షావోమీ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. వీటితో పాటు రెడ్మీ నోట్ 12ప్రో 5జీ, రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్ 5జీ రేట్లను సవరించింది. అమెజాన్, ఎంఐ.కామ్ డిస్కౌంట్లలో ఫోన్ను కొనుగోలు చేయొచ్చని తెలిపింది. విడుదల సమయంలో రెడ్మీ నోట్ 5జీ స్మార్ట్ఫోన్ 4జీబీ ర్యామ్ ప్లస్ 128 స్టోరేజ్ వేరియంట్ ఫోన్ ధర రూ.17,999 ఉండగా.. తాజాగా ఆఫోన్ ధరను వెయ్యిరూపాయలు తగ్గించింది. దీంతో పాటు ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసిన కస్టమర్లు రూ.2,000 వరకు డిస్కౌంట్ను సొంతం చేసుకోవచ్చు. ఆ ఫోన్ ధర రూ.14,999కే తగ్గుతున్నట్లు షావోమీ కంపెనీ పేర్కొంది. కొనుగోలు దారులు హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్ను ఉపయోగించి ఈఎంఐ ఆప్షన్ను ఎంపిక, ఐసీఐసీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫోన్ను కొనుగోలు చేస్తే రూ.2,000 ఇన్స్టంట్ డిస్కౌంట్, మరో రెండు వేలు ఎక్ఛేంజ్ బోనస్ను పొందవచ్చు. ఇలా రూ.17,999 ఉన్న ఫోన్ ధర రూ.12,999కి తగ్గుతుంది. అలాగే, 6జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ మోడల్ రెడ్మీ నోట్ 12 5జీ ధర రూ.18,999 ఉండగా 8జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,999గా ఉంది. ఇప్పుడు ఆ రెండు వేరియంట్ ఫోన్ ధరల్ని షావోమీ తగ్గించడంతో బ్యాంక్ డిస్కౌంట్తో కలిపి రూ.16,999, 18,999కే లభిస్తుంది. రెడ్మీ నోట్ 12 5జీ స్పెసిఫికేషన్లు రెడ్మీ నోట్ 12 5జీ (1,080*2,400) పిక్సెల్స్తో 6.67 అంగుళాల అమోలెడ్ డిస్ప్లేతో 120 హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్, 5000 ఏఎంహెచ్ బ్యాటరీ, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 4జెనరేషన్ 1 ఎస్ఓఎస్, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 13 మెగా పిక్సెల్ సెల్ఫీ సెన్సార్, 128 జీబీ స్టోరేజ్, 33 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. చదవండి👉 ‘విలాసాల రుచి మరిగి’.. అశ్నీర్ గ్రోవర్ దంపతులకు మరో ఎదురు దెబ్బ! -
రూ. 6 వేలకే సరికొత్త స్మార్ట్ఫోన్లు.. లాంచ్ చేసిన షావోమీ
అతి తక్కువ ధరలో సరికొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది షావోమీ (Xiaomi). రెడ్మీ ఏ2 (Redmi A2), రెడ్మీ ఏ2 ప్లస్ (Redmi A2 Plus) ఫోన్లు భారత్లో అధికారికంగా విడుదలయ్యాయి. ఇదీ చదవండి: Motorola Edge 40: మోటరోలా ఎడ్జ్ 40 లాంచ్కు రెడీ.. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు భలే ఉన్నాయే! రెడ్మీ ఏ2 సిరీస్ గత సంవత్సరం వచ్చిన రెడ్మీ ఏ1 సిరీస్కు కొనసాగింపు. పైకి చూడటానికి ఒకేలా ఉన్నా ఏ2 సిరీస్లో మరికొన్ని హంగులు చేర్చారు. మరింత శక్తివంతమైన చిప్ను జోడించారు. తాజా ఆండ్రాయిడ్ ( Android 13 Go) ఎడిషన్ సాఫ్ట్వేర్ను జత చేశారు. ఇక రెడ్మీ ఏ2, ఏ2 ప్లస్ డిజైన్ పరంగా రెండూ ఒకే రకంగా ఏ2 ప్లస్ ఫోన్లో అదనంగా ఫింగర్ప్రింట్ రీడర్ ఫీచర్ ఉంటుంది. రెడ్మీ ఏ2 సిరీస్ ధర రూ. 5,999 నుంచి ప్రారంభమవుతుంది. మే 23 తర్వాత ఈ ఫోన్లు కొనుగోలుదారులకు అందుబాటులోకి వస్తాయి. రేట్లు ఎంత.. ఎక్కడ కొనాలి.. ఆఫర్ల సంగతేంటి? రెడ్మీ ఏ2 2జీబీ/32జీబీ వేరియంట్ ధర రూ.5,999. 2జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ వెర్షన్ ధర రూ.6,499. ఇది 4జీబీ/64జీబీ కాన్ఫిగరేషన్లో కూడా కూడా అందుబాటులో ఉంది. దీని ధర రూ.7,499. ఇక రెడ్మీ ఏ2 ప్లస్ ధర రూ. 8,499. ఇది 4జీబీ/64జీబీ కాన్ఫిగరేషన్లో మాత్రమే వస్తుంది. సీ గ్రీన్, కామింగ్ ఆక్వా బ్లూ, క్లాసిక్ బ్లాక్ కలర్స్లో ఈ ఫోన్స్ లభిస్తాయి. ఈ ఫోన్లను ఆన్లైన్లో అయితే అమెజాన్, షావోమీ ఆన్లైన్ స్టోర్లో, అదే ఆఫ్లైన్లో అయితే ఎంఐ హోమ్ స్టోర్లతో పాటు కంపెనీ ఇతర రిటైల్ పార్టనర్ స్టోర్లలో మే 23 (మధ్యాహ్నం 12 తర్వాత) నుంచి కొనుగోలు చేయవచ్చు. ఇక ఆఫర్ల విషయానికి వస్తే షావోమీ ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ వినియోగదారులకు ఈ ఫోన్ల కొనుగోలుపై రూ. 500 వరకు అదనపు తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఈ మోడళ్లపై 2 సంవత్సరాల వారంటీ ఉంటుందని కంపెనీ పేర్కొంది. సీనియర్ సిటిజన్లకైతే ఈ ఫోన్లను హోం సర్వీస్లో అందించనున్నట్లు తెలిపింది. స్పెసిఫికేషన్లు, ఫీచర్లు వాటర్డ్రాప్-స్టైల్ నాచ్తో 6.52 అంగుళాల 720p డిస్ప్లే MediaTek Helio G36 చిప్సెట్ 4GB ర్యామ్ 64GB ఎక్స్పాండబుల్ స్టోరేజ్ Android 13 Go సాఫ్ట్వేర్. వెనుకవైపు 8MP ప్రధాన సెన్సార్తో డ్యూయల్ కెమెరా సెటప్, ముందువైపు మరో 5MP కెమెరా 10W మైక్రో USB ఛార్జింగ్ సపోర్ట్తో 5,000mAh బ్యాటరీ. ఇదీ చదవండి: అదిరిపోయే రంగులో శాంసంగ్ గెలాక్సీ ఎస్23.. ధర ఎంతంటే.. -
‘వావ్’ కొత్త ఫోన్ అదిరింది.. ధర ఎంతంటే?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షోవోమీ ‘షావోమీ13 ఆల్ట్రా’ ఫోన్ను లాంఛ్ చేసింది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2ఎస్వోసీ చిప్ సెట్, 12 బిట్ డిస్ప్లే, ఎల్టీపీవో సపోర్ట్, 90 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉన్నాయి. షావోమీ13 ఆల్ట్రా ఫీచర్లు షావోమీ13 ఆల్ట్రా 120 హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్తో 6.73 అంగుళాల 2కే అమోలెడ్ ఎల్టీపీవో డిస్ప్లే, Dolby Visionతో హెచ్డీఆర్ 10 ప్లస్ రెజెల్యూషన్, పీ3 కలర్ గమ్ముట్,1920 హెచ్జెడ్ పీడబ్ల్యూఎం డిమ్నింగ్, 2600నిట్స్ పీక్ బ్రైట్ నెస్, హెడ్సెట్ కర్వడ్ ఎడ్జ్, ఫోన్ ముందు భాగంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్, ప్రీమియం లెథర్ ఫినిష్ సౌకర్యం ఉంది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ సపోర్ట్, 50 వాట్ల వైర్ లెస్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, సెల్ఫీ కోసం ముందు భాగంలో 32 ఎంపీ కెమెరా, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8జనరేషన్ 2 చిప్ సెట్, 16జీబీ 16జీబీ ఎల్పీడీడీఆర్5ఎక్స్ రామ్ అండ్ 1టిగా బైట్ ఆఫ్ యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ. వీటితో పాటు వెనక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ . 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ ప్రైమరీ సెన్సర్ కెమెరా విత్ హైపర్-ఓఐఎస్, 8పీ లెన్స్ ఈఐఎస్, ఎల్ఈడీ ఫ్లాష్, వారియబుల్ అపెర్చర్ (ఎఫ్/1.9 టూ ఎఫ్/4.0 అండ్ ఎల్ఈడీ ఫ్లాష్. 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 858 ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, ఐఓఎస్తో 50 ఎంపీ సూపర్ టెలిఫొటో సెన్సార్, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్తో 50 ఎంపీ టెలిఫోటో సెన్సార్లు ఉన్నాయి. షావోమీ13 ఆల్ట్రా ఫోన్ ధరలు షావోమీ13 ఆల్ట్రా బేస్ వేరియంట్ 12 జీబీ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.71,600.16జీబీ రామ్ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.77,600.16 జీబీ రామ్ విత్ ఒక టిగా బైట్ వర్షన్ ఫోన్ ధర సుమారు రూ.87,200.గా ఉంది. చదవండి👉 షాకిచ్చిన మెటా.. ఊహించినట్టే భారీగా ఊడుతున్న ఉద్యోగాలు! -
రెడ్మి 12సీ, రెడ్మి నోట్12 వచ్చేశాయ్! అందుబాటు ధరలే
సాక్షి, ముంబై: చైనా స్మార్ట్ఫోన్కు షావోమి రెడ్ మి 12 సిరీస్లో రెండు కొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. గత వారం యూరప్లో విడుదల చేసిన రెడ్మినోట్12 4జీతోపాటు, రెడ్మి12 సీనిక ఊడా ఇపుడు భారతదేశంలో తీసుకొచ్చింది. రెడ్మినోట్12 4జీ 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ అనే రెండు స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంటుంది రెడ్మినోట్12 4జీ ధర , లభ్యత 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ.16,999 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ధర రూ.14,999గా ఉంది. లూనార్ బ్లాక్, ఫ్రాస్టెడ్ ఐస్ బ్లూ సన్రైజ్ గోల్డ్ కలర్స్లో లభ్యం. అలాగే లిమిటెడ్ ఆఫర్ కింద కొనుగోలుదారులు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లపై రూ. 1,000 తగ్గింపుకు అర్హులు. ఏప్రిల్ 6 నుండి ఎం స్టేర్లతోపాటు, అమెజాన్, ఇతర రిటైల్ స్టోర్ల ద్వారా విక్రయంజ రెడ్మినోట్12 4జీ స్పెసిఫికేషన్స్ 6.67అంగుళాల పంచ్-హోల్ AMOLED FHD+ డిస్ప్లే | 2400 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ 120Hz వరకు రిఫ్రెష్ రేట్ Qualcomm Snapdragon 685 చిప్సెట్ Android 13 ఆధారంగా MIUI 14 50+ 8+ 2ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 13ఎంపీ సెల్ఫీ కెమెరా 33W ఫాస్ట్ ఛార్జింగ్కు 5,000mAh బ్యాటరీ రెడ్మి 12 సీ స్పెసిఫికేషన్స్ 6.71-అంగుళాల HD+ డిస్ప్లే MediaTek Helio G85 SoC ఆండ్రాయిడ్ 12 OS 50 + 2 ఎంపీ రియర్ డ్యూయల్ కెమెరాలు 5ఎంపీ సెల్ఫీ కెమెరా 5,000W బ్యాటరీ రెడ్మి 12 సీ లభ్యత,ధరలు 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ ధర : రూ. 8,999 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ రూ. 10,999 ఏప్రిల్ 16నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. బ్యాంక్ కార్డ్తో 500 తక్షణ తగ్గింపు -
అదిరిపోయే షావోమీ ఎలక్ట్రిక్ కార్.. ఒక్క ఫుల్ చార్జ్తో 1000 కి.మీ మైలేజ్
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ ఎలక్ట్రిక్ వాహన తయారీ రంగంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సంస్థ తయారు చేస్తున్న ఎలక్ట్రిక్ కారు గురించి ఇంట్రస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. షావోమీ వచ్చే ఏడాది ప్రారంభంలో తన మొదటి ఎలక్ట్రిక్ వాహనం విడుదలతో పాటు ఉత్పత్తి పెంచుతున్నట్లు తెలిపింది. ఇటీవల చైనా వార్షిక పార్లమెంటరీ సమావేశంలో షావోమీ సీఈవో లీ జున్ ఈవీ కార్ల తయారీ, పెట్టుబడుల గురించి మాట్లాడారు. అయితే షావోమీ తయారు చేసే కారు ఎలా ఉంటుందో చెప్పేలా షావోమీ కార్ల ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. కానీ ధరపై ఎలాంటి స్పష్టత రాలేదు. అయినప్పటికీ ఆ ఫోటోల్ని బట్టి చూస్తుంటే కారు మెక్లారెన్ 720ఎస్ మాదిరిగానే కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు పెద్ద విండ్షీల్డ్, మంచి సైడ్ గ్లాస్ ఏరియా, పనోరమిక్ సన్రూఫ్, చక్రాల మధ్యలో షావోమీ లోగో, విండ్షీల్డ్ పైన కూర్చునే సెన్సార్ కూడా ఉంది. షావోమీ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1,000 కి.మీ వరకు ప్రయాణించగలదని ఆటోమొబైల్ వర్గాలు చెబుతున్నాయి. ఈవీ దాదాపు 260 కిలోవాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయగల 800 వోల్ట్ సిస్టమ్తో వస్తుంది. ఈ కారు గురించి తెలుసుకునేందుకు వాహనదారులు మక్కువ చూపుతున్నారు. -
Redmi Fire TV: కొత్త ఓఎస్తో, కొత్త కొత్తగా వచ్చేస్తోంది!
సాక్షి,ముంబై:బడ్జెట్ ధరల స్మార్టఫోన్లు, స్మార్ట్ టీవీలతో ఆకట్టుకున్న చైనా స్మార్ట్ఫోన్ మేకర్ షావోమికి చెందిన రెడ్మీ స్మార్ట్ టీవీని తీసుకొచ్చింది. ఇండియన్ మార్కెట్లో తొలిసారిగా ఫైర్ ఓఎస్తో సరికొత్త టీవీని పరిచయం చేసింది. ఈమేరకు షావోమీ ట్విటర్లో షేర్ చేసింది. రెడ్మీ ఫైర్ స్మార్ట్ టీవీ ఈ నెల (మార్చి) 14వ తేదీన లాంచ్ కానుంది. అమెజాన్కు చెందిన ఫైర్ ఓఎస్ 7 (Fire OS7)పై ఈ స్మార్ట్ టీవీ రన్ అవుతుంది. రెడ్మీ ఫైర్ టీవీని లాంచ్ కోసం మైక్రోపేజీని క్రియేట్ చేసింది. అమెజాన్ భాగస్వామ్యంతో ఈ టీవీని షావోమీ రూపొందించింది. అమెజాన్ ద్వారా ఈ టీవీ అందుబాటులోకి రానుంది. రెడ్మీ ఫైర్ టీవీ ఫీచర్లు, అంచనాలు రెడ్మీ ఫైర్ టీవీ బెజిల్లెస్ డిజైన్, క్వాడ్-కోర్ ప్రాసెసర్, మెటాలిక్ బాడీ డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 వెర్షన్ కనెక్టివిటీ ఫోన్, ల్యాప్టాప్, టాబ్లెట్ టీవీ స్క్రీన్ కాస్టింగ్ కోసం మిరాకాస్ట్, యాపిల్ ఎయిర్ ప్లే , అలెక్సా వాయిస్ అసిస్టెంట్ ప్రధాన ఫీచర్లుగా ఉండనున్నాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగాఫైర్ ఓఎస్తో గ్లోబల్గా ఇటీవల షావోమీ ఎఫ్2 సిరీస్లో కొన్ని టీవీలను లాంచ్ చేసింది. 4K అల్ట్రా స్క్రీన్ రిజల్యూషన్, 43, 50, 55 అంగుళాల సైజుల్లో మెటల్ యూనీబాడీ డిజైన్తో వీటిని రూపొందించినట్టు తెలుస్తోంది. ఇక ధర, ఇతర స్పెషికేషన్లపై లాంచింగ్ తరువాత మాత్రమే క్లారిటీ రానుంది. Experience the excitement of curtain raiser performances from the comfort of your home. Stay Tuned!#FireUp pic.twitter.com/mcQv20qN09 — Xiaomi TV India (@XiaomiTVIndia) March 2, 2023 -
Xiaomi AR Smart Glass: కళ్ళముందున్న ప్రపంచాన్ని చేతితో..
చైనా స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ షియోమీ తన వైర్లెస్ AR గ్లాస్ డిస్కవరీ ఎడిషన్ ప్రోటోటైప్ను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023లో ప్రదర్శించింది. ఇది ఏఆర్ హెడ్సెట్ స్నాప్డ్రాగన్ ఎక్స్ఆర్2 జెన్ 1 చిప్సెట్ ద్వారా పనిచేస్తుంది. ఇది వైర్లెస్గానే మొబైల్ ఫోన్కి కనెక్ట్ అవుతుంది. వైర్లెస్ ఏఆర్ గ్లాసెస్ చూడటానికి సింపుల్గా ఉండటమే కాకుండా, చాలా తేలికగా కూడా ఉంటుంది. కంపెనీ ఇందులో కార్బన్ ఫైబర్, మెగ్నీషియం టైటానియం వంటి మిశ్రమాలను ఉపయోగించింది. దీని బరువు కేవలం 126 గ్రాములు మాత్రమే. ఇది కస్టమ్ సిలికాన్-ఆక్సిజన్ యానోడ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. షియోమీ ఏఆర్ గ్లాసెస్ తేలికగా ఉండటమే కాకుండా ఒక జత మైక్రో OLED స్క్రీన్లను కలిగి ఉండటం వల్ల లైట్ గైడింగ్ ప్రిజమ్లకి కనెక్ట్ చేయబడతాయి. ఇది 12 నకిల్స్ ఫంక్షన్కి సపోర్ట్ చేస్తుంది. చైనీస్ నైన్-కీ ఇన్పుట్ మాదిరిగా ఇది వినియోగదారుల థంబ్ ద్వారా టెక్స్ట్ ఇన్పుట్ చేయడానికి అనుమతిస్తుంది. ఏఆర్ గ్లాస్లో లెన్స్లు ఎలెక్ట్రోక్రోమిక్ టెక్నాలజీని ఉపయోగిస్తాయి, కావున ఆన్ చేయడం ఆఫ్ చేయడం రెండు సులభంగా ఉంటాయి. ఇది కేవలం స్ట్రీమింగ్కు మాత్రమే కాకుండా అంతకు మించిన ఉపయోగాలను వినియోగదారులకు అందిస్తుంది. ఇందులో హ్యాండ్ ట్రాకింగ్ టెక్నాలజీ కూడా ఉంది. షియోమీ విడుదల చేయనున్న లేటెస్ట్ ఏఆర్ గ్లాసెస్ చాలా ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. అయితే కంపెనీ దీనిని ఎప్పుడు లాంచ్ చేస్తుంది, ధరలు ఎలా ఉంటాయనేది తెలియాలి. అయితే కంపెనీ దీనిని త్వరలోనే మార్కెట్లో విడుదల చేయడానికి కావలసిన అన్ని సన్నాహాలు చేస్తోంది. Boasting a retina-level near-eye display for AR glasses, Xiaomi Wireless AR Glass Discovery Edition delivers a truly immersive visual experience. Moreover, our self-developed Xiaomi AR Gesture Control empowers effortless control between virtual and real space. pic.twitter.com/EipqBWxkpW — Lei Jun (@leijun) February 27, 2023 -
పవర్ఫుల్ షావోమీ 13 ప్రో వచ్చేసింది: రూ. 22 వేల దాకా ఆఫర్
సాక్షి, ముంబై: చైనా స్మార్ట్ఫోన్ మేకర్ షావోమీ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇటీవల మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2023లో ఆవిష్కరించిన షావోమీ 13 ప్రోని తీసుకొచ్చింది. పవర్ఫుల్ చిప్సెట్తో ఐఫోన్ 14 పోటీగా దీన్ని లాంచ్ చేసిందని టెక్ వర్గాల అంచనా. షావోమీ 13 ప్రో స్పెసిఫికేషన్స్ 6.73 2K E6 AMOLED LTPO కర్వ్డ్ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 1900నిట్స్ పీక్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 LPDDR5X UFS 4.0 ఆండ్రాయిడ్ 13 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 50+50+50 ట్రిపుల్రియర్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 4820mAh బ్యాటరీ 120 వాట్ 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ ధర, సేల్, ఆఫర్: మార్చి 10 నుండి షావోమీ 13 ప్రో సేల్ మొదలవుతుంది. ధర రూ. 79,999 అమెజాన్, ఎంఐ రిటైల్ స్టోర్లలో రూ.79,999కి అందుబాటులో ఉంటుంది. ఐసీఐసీఐ కార్డ్ హోల్డర్లకు ప్రత్యేక తక్షణ బ్యాంక్ తగ్గింపు రూ. 10,000 లేదా షావోమీ యూజర్లకు రూ. 12,000 అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. -
లగ్జరీ బీఎండబ్ల్యూ.. తాళంచెవి లేకున్నా స్టార్ట్ చేయొచ్చు.. షావోమీ కీలక ప్రకటన
స్మార్ట్ఫోన్ కంపెనీలు లగ్జరీ కార్లకు డిజిటల్ కీలు రూపొందించే పనిలో పడ్డాయి. యాపిల్ సంస్థ ఇలాంటి కార్ కీ ఫీచర్ను 2020లోనే ప్రకటించింది. ఆ తర్వాత ఒప్పో, వన్ప్లస్, వివోలు కూడా కొన్ని రోజుల క్రితం డిజిటల్ కీలను విడుదల చేశాయి. తాజాగా షావోమీ ప్రీమియం లగ్జరీ బీఎండబ్ల్యూ కార్లకు డిజిటల్ కీ రూపొందిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్లో షావోమీ 13 సిరీస్ ప్రకటన సందర్భంగా ఆ కంపెనీ అధికార ప్రతినిధి ఈ మేరకు ప్రకటించారు. ఎంపిక చేసిన బీఎండబ్ల్యూ మోడళ్లకు డిజిటల్ కీలను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. (ఇదీ చదవండి: వన్ ప్లస్ 11 కాన్సెప్ట్ ఫోన్ ఫస్ట్ లుక్.. లిక్విడ్ కూలింగ్ ఫీచర్ అదుర్స్!) ఈ డిజిటల్ కీలను కార్లను లాక్, అన్లాక్తో పాటు స్టార్ట్ కూడా చేయొచ్చు. ముఖ్యంగా కారును వేరొకరికి ఇచ్చినప్పుడు ఈ డిజిటల్ కీ బాగా ఉపయోగపడుతుంది. వారికి అసలైన కీ ఇవ్వాల్సిన పని లేకుండా కేవలం డిజిటల్ కీని మొబైల్ ద్వారా షేర్ చేయొచ్చు. ఈ డిజిటల్ కీని గూగుల్ వాలెట్ వంటి వాటితో అనుసంధానించనున్నారు. (ఇదీ చదవండి: సీఈవో జీతం తెలిసి యూజర్లు షాక్! దీంతో ఎలా బతుకుతున్నారు సార్?) -
Xiaomi 13 Pro: దేశీయ మార్కెట్లో విడుదలైంది, కానీ..
దేశీయ మార్కెట్లో ఎట్టకేలకు 'షావోమీ' (Xiaomi) 13 ప్రో 5జీ మొబైల్ ప్రీమియమ్ స్పెసిఫికేషన్లతో విడుదలైంది. ఇప్పటికే చైనా మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ మొబైల్ ఇప్పుడు భారతీయ విఫణిలో అడుగుపెట్టింది. ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఎక్కువ ఫీచర్స్తో మరింత ఆకర్షణీయంగా ఉంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 జెన్ 2 శక్తివంతమైన ప్రాసెసర్తో లభించే ఈ మొబైల్ ఫ్లాగ్షిప్ కెమెరాలతో కూడా లభిస్తుంది. షావోమీ కొత్త మొబైల్ వైర్లెస్ చార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో 4,820mAh బ్యాటరీ ఉంటుంది. 120 వాట్స్ వైర్డ్ హైపర్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్కు, 50 వాట్స్ వైర్లెస్ టర్బో ఫాస్ట్ చార్జింగ్, 10 వాట్ల వైర్లెస్ రివర్స్ చార్జింగ్ వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. షావోమీ 13 ప్రో మొబైల్లో డ్యుయల్ సిమ్, 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సీ పోర్టు కనెక్టివిటీ వంటి ఫీచర్స్ ఉంటాయి. అంతే కాకుండా ఇది డస్ట్, వాటర్ రెసిస్టెంట్స్ కోసం ఐపీ68 రేటింగ్ కూడా పొందింది. కెమెరాలు కూడా ఇందులో చాలా అద్భుతంగా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఉపయోగించవచ్చు. (ఇదీ చదవండి: తగ్గని డిమాండ్, పెరుగుతున్న బుకింగ్స్.. అట్లుంటది 'గ్రాండ్ విటారా' అంటే!) షావోమీ 13 ప్రో మొబైల్ లో పవర్ఫుల్ స్నాప్డ్రాగన్ 8 జెన్ 2 5జీ ప్రాసెసర్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్, LPDDR5X ర్యామ్, ఆండ్రాయిడ్ 13 బేస్డ్ MIUI 14 ఆపరేటింగ్ సిస్టమ్, డాల్బీ ఆడియో, హైరెస్ ఆడియో సపోర్ట్ ఉండే డ్యుయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అంతే కాకుండా ఇందులో 6.73 ఇంచెస్ 2K+ రెజల్యూషన్ LTPO 3.0 అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. ఇది ఏకంగా 1,900 నిట్స్ పీక్ బ్రైట్నెస్ పొందుతుంది. డిస్ప్లేకు గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉంటుంది. షావోమీ తన కొత్త 13 ప్రో మొబైల్ విడుదల చేసింది. అయితే ధరలను అధికారికంగా వెల్లడించలేదు. కంపెనీ ఈ మొబైల్ ధరలను ఫిబ్రవరి 28న వెల్లడించనుంది. ఇది మొబైల్ సెరామిక్ బ్లాక్, సెరామిక్ వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. చైనా మార్కెట్లో ఈ మొబైల్ ధర 4,999 యువాన్లు, అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 61,000. -
Massive discount షావోమీ12ప్రొ 5జీ స్మార్ట్ఫోన్పై భారీ తగ్గింపు: డోంట్మిస్!
సాక్షి, ముంబై: చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ షావోమీ తన పాపులర్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ 12ప్రో 5జీ పై భారీ తగ్గింపును అందిస్తోంది.ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ ద్వారా సర్ప్రైజ్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. దాదాపుగా 30 శాతం తగ్గింపును అందిస్తోంది. అమెజాన్ అద్భుతమైన ఆఫర్లో షావోమీ 12 ప్రో 12 జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీ వేరియంట్ను రూ. 55,999 సొంతం చేసుకోవచ్చు దీని అసలు ధర రూ. 79,999. ఇంకా బ్యాంక్ ఎక్స్ఛేంజీ ఆఫర్ కూడా ఉంది. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా మరో 26వేల రూపాయల తగ్గింపు. అంటే జస్ట్ 3,949 రూపాయలకే ఈ స్మార్ట్ఫోన్ను సొంతం చేసుకోవచ్చు. షావోమి 12ప్రో 5జీ ఫీచర్లు 6.73-అంగుళాల WQHD+ AMOLED డిస్ప్లే Qualcomm Snapdragon 8 Gen 1 120Hz రిఫ్రెష్ రేట్, 1440 x 3200 పిక్సెల్ రిజల్యూషన్ 50+5+50ఎంపీ ట్రిపుల్ రియల్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 4,600mAh బ్యాటరీ -
అదిరిపోయే ఫీచర్లతో షావోమీ 13 ప్రో, ధర ఎంతంటే?
చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ ఫిబ్రవరిలో మరో ఫోన్ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 26 న షావోమీ 13 ప్రో’ను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే ప్రత్యర్ధి సంస్థలైన ఐక్యూ 11 5జీ, వన్ ప్లస్ 11 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 సిరీస్ ఫోన్లను స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 2 ఎస్ఓఎస్తో విడుదల చేయగా.. వాటికి పోటీగా షావోమీ స్నాప్ డ్రాగన్ 2 చిప్సెట్తో 4 ఫ్లాగ్ షిప్ ఫోన్లను చైనాలో విడుదల చేసింది. తాజాగా అదే చిప్సెట్తో షోవోమీ 13ను విడుదల చేసి ఇతర స్మార్ట్ ఫోన్ కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వనుంది. భారత్లో షావోమీ 13 ప్రో షావోమీ అధికారిక ప్రకటన ప్రకారం.. చైనా తర్వాత భారత్లో షావోమీ 13 ప్రో ఫిబ్రవరి 26 స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9.30 గంటలకు విడుదల చేయనుంది. ఇక ఇదే ఫోన్ గత ఏడాది చైనాలో విడుదల చేయగా.. ఆ ఫోన్ ధర రూ.61,000గా ఉంది. షోవోమీ 13 ప్రో స్పెసిఫికేషన్ షోవోమీ 13 ప్రో స్పెసిఫికేషన్ గురించి షావోమీ అధికారిక ప్రకటన చేయలేదు. కానీ పలు నివేదికలు మాత్రం ఫోన్ గురించి పూర్తి వివరాల్ని విడుదల చేశాయి. వాటి ప్రకారం.. ఆండ్రాయిల్ 13 వెర్షన్ అప్డేట్తో వచ్చిన షావోమీ ఇంటర్ ఫేస్ ఫీచర్ ఎంఐయూఐ 14, 120 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేటుతో 6.73 అంగుళాల 2కే ఒఎల్ఈడీ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 2 ఎస్ఓసీ, 12జీబీ ఎల్పీడీడీఆర్ 5ఎక్స్ ర్యామ్ ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు లైకా బ్రాండెడ్ 50 మెగా పిక్సెల్ రేర్ కెమరా సెటప్, ఫ్రంట్ సైడ్ 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, వైఫై 6, బ్లూటూత్ 5.3 అండ్ ఎన్ఎఫ్సీ(Near-field communication), ఎక్స్ - యాక్సిస్ లైనియర్ మోటార్, లేజర్ ఫోకస్ సెన్సార్, ఐఆర్ కంట్రోల్ సెన్సార్లు ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న ఫోన్లో 4,820 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 డ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 50 డబ్ల్యూ వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్, 8.38 ఎంం, బరువు 210 గ్రాములుగా ఉండొచ్చనే అంచనాలున్నాయి. -
షావోమి ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ ఫోటోలు లీక్, లుక్ మాములుగా లేవుగా!
సాక్షి,ముంబై: చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమి ఎలక్ట్రిక్ కార్ల తయారీలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షావోమీ తొలి ఎలక్ట్రిక్ కారుపై అంచనాలు భారీగానే ఉన్నాయి. గ్లోబల్గా అరంగేంట్రం చేయనున్న ఈ ఈవీకి సంబంధించిన ఫొటోలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. చైనాలో ఈవీ మార్కెట్ చాలా పోటీ ఉంది. దీంతో షావోమీ కారుకు మరింత ప్రాధాన్యతను సంతరించు కుంది. షావోమీ ఎంఎస్11 సెడాన్ పేరుతో తీసుకొస్తున్న సెడాన్ డిజైన్, లుక్ ఆకర్షణీయంగా మారింది. ఇది పోర్షే టైకాన్తో పోలి ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే ప్రముఖ చైనీస్ ఆటో మొబైల్ సంస్థ బీవైడీకి చెందిన సియెల్ ఎలక్ట్రిక్ సెడాన్ తరహాలో షావోమి ఈవీ డిజైన్ ఉండనుందని అంచనా. అంతేకాదు కారు ముందు భాగంలో LiDAR సెన్సార్ ఆధారంగా ఇది అటానమస్ సెల్ఫ్ డ్రైవింగ్ సామర్థ్యాలతో వస్తోందని కూడా భావిస్తున్నారు. షావోమీ 4 డోర్ ఎంఎస్11 చాలా ఆకర్షణీయమైన సెడాన్ అని సోషల్ మీడియా ప్రశంసిస్తోంది. స్పోర్టీగా కనిపించే 4-డోర్ల ఎలక్ట్రిక్ వాహనంలో విండ్షీల్డ్ పెద్దగా ఉండి, పైకప్పు మొత్తం ఒక సింగిల్ పేన్ గ్లాస్తో టెస్లా మోడల్లలో కని పిస్తుందని అంచనా వేస్తున్నారు. అల్లాయ్ వీల్స్ అమర్చింది. ఈ వీల్స్ మధ్యలో "షావోమీ’’ బ్రాండ్ లోగో కనిపిస్తోంది. తుదిమెరుగులు దిద్దుకున్న షావోమీ ఈవీ టెస్టింగ్ను కూడా చైనా రోడ్లపై ఇప్పటికే నిర్వహించిందట. రూ. 1.2కోట్ల ఫైన్..! అయితే తొలి ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన ఫోటోలు ఆన్లైన్ లీక్ కావడంపై షావోమీ సీరియస్గా స్పందించింది. బీజింగ్కు చెందిన మోల్డింగ్ టెక్నాలజీ కంపెనీ లిమిటెడ్ అనే వెండర్ ద్వారా ఈ ఫొటోలు లీక్ అయినట్టు గుర్తించారు. ఈ లీక్ను ఎట్టి పరిస్థితిలోనూ సహించేది లేదని సీఈఓ లీ జున్ మండిపడ్డారు. అలాగే సెక్యూరిటీ బ్రీచ్కు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ఆదేశించారు. సంస్థపై 1 మిలియన్ యువాన్ల ( దాదాపు. రూ.1.22కోట్లు) జరిమానా విధించనుందట షావోమీ. -
షావొమీకి మను జైన్ గుడ్బై
న్యూఢిల్లీ: స్మార్ట్ ఉపకరణాల తయారీలో ఉన్న చైనా కంపెనీ షావొమీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్, భారత విభాగం మాజీ అధిపతి మను కుమార్ జైన్ రాజీనామా చేశారు. తొమ్మిదేళ్లపాటు ఆయన భారత వ్యవహారాలను నిర్వహించారు. ఫెమా నిబంధనలను షావొమీ ఉల్ల -
షావోమి 12 ప్రొపై భారీ తగ్గింపు, ఎక్కడంటే!
సాక్షి, ముంబై: షావోమి రిపబ్లిక్ డే సేల్ భాగంగా స్మార్ట్టీవీలు, స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్స్ సహా ఇతర ఉత్పత్తులను భారీ తగ్గింపును అందిస్తోంది. ముఖ్యంగా షావోమి 12 ప్రొ 5జీ ధరపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో పాటు ICICI బ్యాంక్ ,ఇండస్ఇండ్ బ్యాంక్ వినియోగదారులు వరుసగా రూ. 3,000 , రూ. 2,000 వరకు క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఐదు రోజుల ఈ సేల్లో రోజువారీ 12 గంటల పరేడ్లో నిర్దిష్ట గాడ్జెట్లపై కస్టమర్లు ఈ ఆఫర్ల ప్రయోజనాన్ని పొందగలరు. డీల్లో భాగంగా, వినియోగదారులు షావోమి 12 ప్రొ రూ. 10,000 తగ్గింపు తరువాత రూ. 44,999కి సొంతం చేసుకోవచ్చు. మార్కెట్లో దీని అసలు ధర రూ. 54,999 (8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్). అలాగే 12 జీబీ ర్యామ్, 254 జీబీ స్టోరేజ్ టాప్-ఎండ్ వేరియంట్ను భారీ తగ్గింపుతో రూ.58,999కి కొనుగోలు చేయవచ్చు. షావోమి అధికారిక భారతదేశ వెబ్సైట్లో ఈసేల్ అందుబాటులో ఉంది. 50 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరాలతో వస్తున్న భారతదేశంలోని ఏకైక ఫోన్ ఇదే. ఇంకా 6.7-అంగుళాల డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 8 Gen 1 చిప్సెట్ షావోమి 12 ప్రొ లోని ప్రధాన స్పెసిఫికేషన్స్. అలాగే 10వేల ధర ఉన్న రెడ్ మీ 10ను 8వేలకే లభ్యం. రూ. 4 వేల తగ్గింపుతో షావోమి నోట్బుక్ను ఈ సేల్ 72999లకే కొనుగోలు చేయవచ్చు. -
10వేలకే స్మార్ట్టీవీ, రెడ్మీ స్మార్ట్టీవీ 32 ఉచితంగా పొందే లక్ మీదే!
సాక్షి,ముంబై: చైనాకు చెందిన ప్రముఖ కంపెనీ షావోమీ రిపబ్లిక్ డే సేల్ ప్రకటించింది. 74వ గణతంత్ర సంవత్సరం సందర్భంగా, అధికారిక వెబ్సైట్ ప్రత్యేకమైన డీల్స్, ప్రమోషన్లను అందిస్తోంది. రోజువారీ 12 గంటలకు పరేడ్, 3 గంటలకు ఫ్లాష్ సేల్, ఎక్స్చేంజ్ అవర్ లాంటివి ప్రకటించింది. అంతేకాకుండా, వినియోగదారులు ప్లే అండ్ విన్ ఆఫర్ ద్వారా రెడ్మీ స్మార్ట్ టీవీ 32, రెడ్మి నోట్ ప్రోలాంటి అద్భుతమైన ఉచిత ఉత్పత్తులను గెలుచుకునే అవకాశాన్ని పొందుతారు. జనవరి 20 వరకు, 23న ఈ సేల్ అందబాటులో ఉంటుంది.ఈ సేల్లో షావోమీ స్మార్ట్ఫోన్లు స్మార్ట్ టీవీలు, ల్యాప్టాప్స్, ఇతర ప్రొడక్టులు డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇండస్ఇండ్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో పాటు యూపీఐ పేమెంట్లపై కూడా అదనపు డిస్కౌంట్ అందిస్తోంది. ముఖ్యంగా ఈ సేల్లో కొన్ని షావోమీ, రెడ్మీ, ఎంఐ టీవీలు మంచి తగ్గింపుతో స్మార్ట్టీవీలనుకొనుగోలు చేయవచ్చు. రెడ్మీ స్మార్ట్ టీవీ 32 హెచ్డీ రెడీ రెడ్మీ 32 ఇంచుల ఈ స్మార్ట్ టీవీ రూ.10,999గా ఉంది. ఇండస్ఇండ్ బ్యాంకు క్రెడిట్ కార్డుతో ఈఎంఐ పద్ధతిలో ఈ టీవీని కొనుగోలు చేస్తే రూ.2,000 అదనపు తగ్గింపు. అంటే రూ.9,999కే ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని సొంతం చేసుకోవచ్చు. ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో సింగిల్ పేమెంట్లో కొంటే రూ.1,500 తగ్గింపు ఉంటుంది. పేటీఎం వ్యాలెట్, ఏదైనా యూపీఐ ద్వారా పేమెంట్లపై రూ.1,000 డిస్కౌంట్ లభ్యం. షావోమీ స్మార్ట్ టీవీ 5ఏ షావోమీ స్మార్ట్ టీవీ 5ఏ రూ.12,499 ధరతో సొంతం చేసుకోవచ్చు. ప్రీపెయిడ్ పేమెంట్లపై రూ.1,000, పేటీఎం వ్యాలెట్తో చెల్లింపులు చేస్తే మరో రూ.1,000, ఇండస్ఇండ్ క్రెడిట్ కార్డు ఆఫర్లు వినియోగించుకుంటే ఈ 32 ఇంచుల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని రూ.10,499కే కొనుగోలు చేయవచ్చు. -
బీ న్యూలో రెడ్మీ నోట్ 12 5జీ సిరీస్ ఆవిష్కరణ
హైదరాబాద్: మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్ బీ న్యూ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్టోర్లలో రెడ్మీ నోట్ 12 5జీ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు ఇక్కడ బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో ప్రముఖ నటి ఈషా రెబ్బ ఈ ఫోన్ను ఆవిష్కరించారు. సంస్థ సీఎండీ వైడీ బాలాజీ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి నితేష్, రెడ్మీ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొబైల్ కొనుగోళ్లకు సంబంధించి ఈఎంఐ, జీరో ఫైనాన్స్ సౌలభ్యం అందుబాటులో ఉన్నట్లు సంస్థ విడుదల చేసిన ప్రకటన తెలిపింది. చదవండి: World Richest Pet: దీని పనే బాగుంది, రూ.800 కోట్లు సంపాదించిన పిల్లి! -
జియో..షావోమీ స్మార్ట్ ఫోన్ యూజర్లకు అదిరిపోయే శుభవార్త!
న్యూఢిల్లీ: రిలయన్స్ జియోతో 5జీ ఫోన్లకు సంబంధించి షావోమీ ఇండియా ఓ భాగస్వామ్యం కుదుర్చుకుంది. జియో కస్టమర్లకు అచ్చమైన 5జీ సేవల అనుభవాన్ని అందించనున్నట్టు షావోమీ తెలిపింది. రిలయన్స్ జియో నెట్వర్క్ పరిధిలో షావోమీ ఫోన్లకు మెరుగైన కవరేజీ అందేలా సాఫ్ట్వేర్ అప్డేట్ ఇవ్వనుంది. అన్ని షావోమీ 5జీ ఫోన్లు రిలయన్స్ జియో ట్రూ 5జీ నెట్వర్క్కు సపోర్ట్ చేస్తాయని షావోమీ ఇండియా ప్రకటించింది. యూజర్లు తమ ఫోన్ నెట్వర్క్ సెట్టింగ్స్లో ప్రిఫర్డ్ నెట్వర్క్ టైప్ను 5జీకి మార్చుకోవాలని సూచించింది. -
న్యూ ఇయర్ క్రేజీ ఆఫర్.. అదిరే ఫీచర్లున్న ఈ రెడ్మీ 5జీ స్మార్ట్ఫోన్ ధర తగ్గింపు!
ప్రముఖ స్మార్ట్ఫోన్ మేకర్ షావోమీ ఇండియా ఇటీవలే రెడ్మీ 11 ప్రైమ్ 5జీ (Redmi 11 Prime 5G) స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి విడుదల సంగతి తెలిసిందే. తాజాగా తన కస్టమర్లకు న్యూ ఇయర్ ఆఫర్గా ఈ స్మార్ట్ఫోన్ ధరను తగ్గించింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రెండు వేరియంట్లపై రూ.1,000 చొప్పున తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం Mi.com, అమెజాన్ (Amazon)లో వెయ్యి రుపాయలు తగ్గింపు ధరతో... 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.12,999 ధరకు, 6జీబీ+128జీబీ వేరియంట్ రూ.14,999 ధరగా ఉంది. అంతకుముందు ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999. Redmi Prime 5Gలో 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇది డిస్ప్లేలో వాటర్డ్రాప్-స్టైల్ డిస్ప్లే నాచ్ను కలిగి ఉంది. ఇందులో 5,000mAh బ్యాటరీ ఉండగా 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 22.5వాట్ ఛార్జర్ బాక్సులోనే లభిస్తుంది. పవర్ఫుల్ నైట్ విజన్, పోర్ట్రైట్ మోడ్, మూవీ ఫ్రేమ్, షార్ట్ వీడియో, టైమ్ ల్యాప్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. మెడో గ్రీన్, థండర్ బ్లాక్, క్రోమ్ సిల్వర్ కలర్స్లో లభిస్తుంది. అదనంగా, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్లు ద్వారా ఈఎంఐ లావాదేవీలను ఉపయోగించి ఈ హ్యాండ్సెట్ను కొనుగోలు చేసే కస్టమర్లకు రూ. 1,000 తగ్గింపు ఇస్తుండగా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్ల ద్వారా చేసిన కొనుగోళ్లకు 750 తక్షణ తగ్గింపు అందిస్తోంది. అమెజాన్ నుంచి ఈఎంఐ ద్వారా కొనాలనుకునేవారికి నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ రూ.2,000 నుంచి ప్రారంభం అవుతుంది. -
ఏ క్షణాన ఏం జరుగుతుందో.. వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపిన మరో ప్రముఖ కంపెనీ!
ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, ఆర్థిక మాంద్యం భాయాలతో ఇప్పటికే పలు ప్రముఖ కంపెనీలు తమ సిబ్బందని తగ్గించే పనిలో బిజీగా ఉన్నాయి. తాజాగా చైనా కంపెనీ షావోమి అదే జాబితాలోకి చేరింది. తన స్మార్ట్ఫోన్, ఇంటర్నెట్ సేవలకు సంబంధించిన అనేక యూనిట్లలోని ఉద్యోగుల తీసివేతకు పూనుకుంది. ఈ ప్రక్రియలో దాదాపు సంస్థలోని 15 శాతం శ్రామిక శక్తిని తగ్గించింది. ఈ విషయాన్ని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది. కొందరు బాధిత ఉద్యోగులు తమ అవేదనను సోషల్ మీడియా పోస్ట్ ద్వారా షేర్ చేయడంతో స్థానికంగా ఈ పోస్ట్లు వైరల్గా మారింది. చైనాలోని సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు వీబో, జియాహోంగ్షు, మైమైలు ఈ ఉద్యోగాల కోత పోస్ట్లతో నిండిపోయాయని హాంగ్కాంగ వార్తా సంస్థ పేర్కొంది. షావోమి సంస్థలో సెప్టెంబరు 30 నాటికి 35,314 మంది సిబ్బంది ఉండగా, ఇటీవల చైనాలోని మెయిన్ల్యాండ్లోనే 32,000 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. తాజాగా కంపెనీ తీసుకున్న నిర్ణయాల వల్ల వేలాది మంది సిబ్బంది పరిస్థితి దయనీయంగా మారనుంది. వీరిలో చాలా మంది గత ఏడాది డిసెంబర్లో ప్రారంభమైన నియామక ప్రక్రియలో కంపెనీలో చేరారు. నవంబర్ మూడవ త్రైమాసిక ఆదాయంలో 9.7% తగ్గుదల ఉన్నట్లు కంపెనీ ఇటీవల పేర్కొంది. చైనాలో కోవిడ్ నిబంధనలు కారణంగా వ్యాపార పరిస్థితులు కూడా అంతగా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టడం లేదని కంపెనీ వెల్లడించింది. స్మార్ట్ఫోన్ల నుంచే వచ్చే ఆదాయం, దాని మొత్తం అమ్మకాలలో దాదాపు 60% వాటాను కలిగి ఉంది,అయితే అది ఈ సంవత్సరానికి 11% పడిపోయింది, షావోమి తెలిపింది. -
అద్భుత ఫీచర్లు, ఐఫోన్ లాంటి డిజైన్: షావోమీ స్మార్ట్ఫ్లోన్లు వచ్చేశాయ్!
సాక్షి ముంబై: చైనా స్మార్ట్ఫోన దిగ్గజం షావోమి కొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. షావోమి 12 సిరీస్కు కొనసాగింపుగా 13 సిరీస్ మొబైల్స్ను చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. షావోమి 13, 13 ప్రో రెండు వేరియంట్లను తీసుకొచ్చింది. ఐఫోన్ మాదిరి డిజైన్లో ఆండ్రాయిడ్ 13 MIUI 14తో వీటిని తీసుకొచ్చింది. అలాగేవీటిల్లో లైకా బ్రాండెడ్ ట్రిపుల్ రియర్ కెమెరాలను అమర్చింది. ఇండియా సహా ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో ఎపుడు లాంచ్ అవుతుందనేది స్పష్టత లేదు. (ఎలక్ట్రిక్ స్కూటర్ లవర్స్కు అదిరే ఆఫర్: పది ఎస్1 ప్రో స్కూటర్లు ఫ్రీ) షావోమీ 13 ప్రో స్పెసిఫికేషన్స్ 6.73అంగుళాల AMOLED డిస్ప్లే 3200x1440 రిజల్యూషన్ 120Hz రిఫ్రెష్ రేట్ 50 ఎంపీ(వైడ్, అల్ట్రా, వైడ్ టెలిఫోటో)) ట్రిపుల్ రియర్ కెమెరా 16 ఎంపీ ఫ్రెంట్ కెమెరా 4820ఎంఏహెచ్ బ్యాటరీ (ఐటీ సర్క్యులర్ వచ్చిందోచ్.. ఈ విషయాలపై క్లారిటీ ఉందా మీకు?) షావోమీ 13 ప్రో ధర: ఈ ప్రీమియం స్మార్ట్ఫోన్లు రెండూ వైట్, బ్లాక్, గ్రీన్, లైట్ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంటాయి. బేస్ వెర్షన్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ రూ. 60 వేల నుండి ప్రారంభం. 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ సుమారు రూ. 74,500 షావోమి 13 ఫీచర్లు 6.36 అంగుళాల OLED డిస్ప్లే 1080 x 2400పిక్సెల్స్ రిజల్యూషన్ 4500ఎంఏహెచ్ షావోమి13 ధరలు 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 574 డాలర్లు ( సుమారు రూ. 47,344) 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 617 డాలర్లు ( సుమారు రూ. 50891) 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 660 డాలర్లు (రూ. 54438) 12జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ 718 డాలర్లు (రూ. 59222) -
మీ యాపిల్ ఐఫోన్ 14 కంటే..మా చైనా ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎక్కువ
ఒక్కసారి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటే ఎన్ని ఎక్కువ గంటలు వినియోగించుకునే అంశంలో స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజ సంస్థలు బహిరంగంగా సవాళ్లు విసురుకుంటున్నాయి. తాజాగా చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ డిసెంబర్ 1న ‘షోవోమీ 13’ను లాంచ్ చేయనుంది. అంతకంటే ముందే ఫోన్ గురించి వివరించేందుకు ఆ సంస్థ ఓ ఈవెంట్ను నిర్వహించింది. ఈ సందర్భంగా షావోమీ సీఈవో, ఫౌండర్ లీ జూన్..మరో స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ యాపిల్కు బహిరంగంగా సవాల్ చేశారు. యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ కంటే తాము విడుదల చేయనున్న షోవోమీ 13 ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎక్కువగా ఉంటుందని చెప్పారు. మా ఫోనే గొప్ప చైనాకు చెందిన సోషల్ మీడియా నెట్ వర్క్ సంస్థ వీబో (ట్విటర్ తరహా) ఓ పోస్ట్ను షేర్ చేసింది. అందులో షోవోమీ ఫౌండర్ లీ జూన్ యాపిల్ ఐఫోన్ 14 మ్యాక్స్ ఫోన్ కంటే షావోమీ 13 బ్యాటరీ లైఫ్ ఎక్కువగా ఉందని తెలిపారు. అంతేకాదు అందుకు సంబంధించి షోవోమీ సీనియర్ ఎగ్జిక్యూటీవ్ స్క్రీన్ షాట్ను షేర్ చేశారు. ఆ పోస్ట్లో షోవోమీ13ను మిగిలిన ఫోన్లతో పోల్చారు. ఆ ఫోన్ల కంటే ఈ ఫోన్ పనితీరు బాగుంటుందని ధీమాగా చెబుతున్నారు. ముఖ్యంగా ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 14, గతంలో విడుదలైన షోవీమీ 12ఎస్, షోవోమీ 12ఎస్ ఆల్ట్రా, షావోమీ 12ఎస్ ప్రో, హువావే పీ 50 ప్రో, శాంసంగ్ ఎస్ 22 ఆల్ట్రా కంటే షావోమీ 13 ఫోన్ను సింగిల్ ఛార్జ్తో బ్యాటరీని ఎక్కువ గంటలు వినియోగించుకోవచ్చని షావోమీ వివరించింది. డీఓయూ టెస్ట్లో తేలింది డీఓయూ టెస్ట్ అనే ప్రతి రోజు మనం వినియోగించే స్మార్ట్ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంత సేపు ఉంటుందో సూచిస్తుంది. స్కోర్ సైతం అందిస్తుంది. లాంచ్ కానున్న షావోమీ -13 ఫ్లాగ్షిప్ బ్యాటరీ లైఫ్ టెస్ట్లో 1.37 స్కోర్ చేయగా ఐఫోన్ 14, 14 ప్రో మ్యాక్స్లు 1.28 స్కోర్ నమోదు చేశాయి. ఇక షోవీమీ ఫోన్ 4,500ఎంఏహెచ్ బ్యాటరీ యూనిట్ను అందిస్తుండగా.. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ 4 మాత్రం 4,323ఎంఏహెచ్ బ్యాటరీ బ్యాకప్తో షిప్పింగ్ చేస్తోంది. షావోమీతో పాటు షావోమీ డిసెంబర్ 1న లాంచ్ ఈవెంట్ను నిర్వహించనుంది. ఈవెంట్లో ఫ్లాగ్షిప్ షావోమీ13 సిరీస్తో పాటు షోవోమీ వాచ్ ఎస్2, షావోమీ బడ్స్ 4, ఎంఐయూ 14 లను లాంచ్ చేయాలని భావిస్తోంది. అయితే, షోవీమీ మాత్రం భారత్, ఇతర దేశాల్లో ఎప్పుడు విడుదల చేస్తుందో స్పష్టం చేయలేదు. చదవండి👉 ‘ఎలాన్ మస్క్ స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది’..విడుదల ఎప్పుడు, ధర ఎంత! -
షావోమి నుంచి వస్తున్న స్టైలిష్ స్మార్ట్ఫోన్.. లాంచ్ డేట్ ఎప్పుడో తెలుసా!
ఆధునిక కాలంలో యువకుల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ప్రాడెక్ట్ వాడకంపై ఆసక్తి చూపుతుంటారు. అయితే మిగిలిన వాటితో పోలిస్తే ఈ కొత్తదనం 'మొబైల్స్' లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. అందుకే కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు మార్కెట్లో కొత్త టెక్నాలజీ, ఫీచర్లతో మొబైల్స్ విడుదల చేస్తుంటాయి. ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ 'షియోమీ' (Xiaomi) మార్కెట్లో కొత్త మొబైల్ '13 సిరీస్' లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే లాంచ్ డేట్ కూడా ప్రకటించింది. ఈ ఫోన్ని 2022 డిసెంబర్ 01 న చైనాలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ సిరీస్లో కంపెనీ 'షియోమీ 13' 'షియోమీ 13 ప్రో' అనే రెండు మోడల్స్ ఉన్నాయి. త్వరలో విడుదలకానున్న కొత్త 'షియోమీ 13 సిరీస్' అవుట్ ఆఫ్ ది బాక్స్తో వస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. మొత్తానికి ఈ సంవత్సరం చివరిలో మరో కొత్త ఫోన్ మార్కెట్లోకి వచ్చేస్తుంది. కంపెనీ తెలిపిన సమాచారం ప్రకారం.. స్మార్ట్ఫోన్ సిరీస్లో లైకా బ్రాండెడ్ సెన్సార్లు ఉండనున్నాయి. ఈ స్మార్ట్ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్లో ఇది రన్ అవుతుంది. షావోమి 13 Pro 12GB ర్యామ్తో రానున్నట్లు తెలుస్తుంది. అంతే కాకుండా హ్యాండ్సెట్ 2k రిజల్యూషన్తో 6.7 ఇంచెస్ సామ్సంగ్ ఈ6 అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. ఫోన్ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ను అందిస్తుంది. షావోమీ కొత్త సిరీస్ రెండు రకాల ర్యామ్ లతో రావచ్చని రూమర్ల ద్వారా తెలిసింది. అవి 8 GB, 12GB,అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ 128GB, 256GB, 512GB వరకు జత చేసుకోవచ్చు. ఇక కెమెరా విషయానికొస్తే.. కెమెరా సిస్టమ్ 50MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్తో జత చేయబడిన 50MP సోనీ IMX989 ప్రైమరీ సెన్సార్, రెండవ 50MP టెలిఫోటో లెన్స్ను పొందుతుంది. ఇక సెల్ఫీల కోసం ముందు భాగంలో 32MP కెమెరా అందుబాటులో ఉంటుంది. చివరగా బ్యాటరీ విషయానికి వస్తే, Xiaomi 13 సిరీస్ 4,800mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. కాగా Xiaomi 13 Pro 120watt ఫాస్ట్ ఛార్జింగ్ పొందవచ్చు. చదవండి: రైల్వే శాఖ ఆదాయానికి గండి.. ఆ ప్యాసింజర్ల సంఖ్య తగ్గుతోంది, కారణం అదేనా! -
షావోమి యూజర్లకు షాకింగ్ న్యూస్: ఆ సేవలిక బంద్!
న్యూఢిల్లీ: చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీదారు షావోమి సంచలన నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో యాప్ ద్వారా నిర్వహిస్తున్న ఆన్లైన ఆర్థిక సేవల వ్యాపారాన్ని మూసివేసినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. దేశీయంగా షావోమి Mi Pay, Mi క్రెడిట్ యాప్లను స్థానిక ప్లే స్టోర్, అలాగే తన సొంత యాప్ స్టోర్ నుండి తీసివేసిందని టెక్ క్రంచ్ శుక్రవారం నివేదించింది. (Maruti Suzuki ఫలితాల్లో అదుర్స్: ఏకంగా నాలుగు రెట్ల లాభం) ప్రారంభించిన మూడు సంవత్సరాల తర్వాత, వినియోగదారులను బిల్లు చెల్లింపులు, నగదు బదిలీల సేవలకు సంబంధించి యాప్, రెగ్యులేటరీ సంస్థ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన Mi Pay ఇకపై అందుబాటులో ఉండదని టెక్ క్రంచ్ తెలిపింది. అయితే దీనిపై షావోమి కానీ, ఎన్పీసీఐ కానీ అధికారింగా ఇంకా స్పందించ లేదు. కాగా భారతదేశంలో భారీ పన్ను ఎగవేత ఆరోపణలను ఎదుర్కొంటోంది షావోమి. దీనికి సంబంధించి ఈడీ దాడుల్లో 676 మిలియన్ డాలర్ల విలువైన ఆస్తుల స్వాధీం చేసుకుంది. దీన్ని ఎత్తివేయడానికి భారతీయ కోర్టు ఇటీవల నిరాకరించిన సంగతి తెలిసిందే. -
చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ షావోమీకి కేంద్రం భారీ షాక్!
చైనా స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ షావోమీకి భారీ షాక్ తగిలింది. షావోమీ సంస్థకు చెందిర రూ.5,551కోట్ల నగదును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సీజ్ చేశారు. ఈడీ చరిత్రలో తొలిసారి అత్యధిక మొత్తం నగదు సీజ్ చేసిటన్లు తెలుస్తోంది. అయితే ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) నిబంధనలను ఉల్లంఘించి షావోమీ విదేశాలకు డబ్బు మళ్లించిట్లు తేలింది. రాయల్టీ కింద ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బును ఎగ్గొట్టి ఈ ఘనకార్యానికి పాల్పడడంతో ఈడీ ఈ చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం. The Competent Authority appointed under FEMA has confirmed the seizure order of Rs 5551.27 Crore passed today by the ED against Xiaomi Technology India Private Limited under the provisions of FEMA: Enforcement Directorate pic.twitter.com/bXdVaF6v9n — ANI (@ANI) September 30, 2022 -
‘భారత్కు గుడ్ బై’, దేశం నుంచి తరలి వెళ్లిపోతున్న చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలు!
భారత్లో కార్యకలాపాల నుంచి వైదొలగుతున్న విదేశీ సంస్థల జాబితా పెరిగిపోతుంది. మార్కెట్లో దేశీయ కంపెనీలతో పోటీ పడలేక, ఇక్కడి చట్టాల్ని యేథేచ్ఛగా ఉల్లంఘించినా ఏం కాదులే అనే ధీమా తగ్గడంతో దేశీయ మార్కెట్కు గుడ్ బై చెబుతున్నాయి. తమ వ్యాపార నిర్వహణకు అనువైన దేశాల వైపు మొగ్గు చూపుతున్నాయి. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు భారత్లో తన కార్యకలాపాల్ని నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది. భారత్కు గుడ్బై చెప్పి ఇండోనేషియా, బంగ్లాదేశ్, నైజీరియాలలో తయారీ యూనిట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ కథనాల్ని ప్రచురించింది. మేడిన్ ఇండియా ‘భారత్ దేశీయ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థల్ని ప్రోత్సహించేందుకు మా పట్ల (చైనా కంపెనీలు) కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఈ తరహా ధోరణి స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలపై ఎక్కువగా ఉంది’ అంటూ భారత్లో చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలకు చెందిన ప్రతినిధులు చెప్పారంటూ గ్లోబల్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది.అందుకే ఆ ఒత్తిడి తట్టుకోలేక ఒప్పో ఈజిప్ట్లో మ్యానిప్యాక్చరింగ్ యూనిట్ను ప్రారంభించనుంది. ఈజిప్ట్లో ఒప్పో చైనా సంస్థ ఒప్పో ఈజిప్ట్లో మ్యానిప్యాక్చరింగ్ యూనిట్ను ప్రారంభించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఫోన్ల తయారీ ప్లాంటు కోసం సుమారు 20 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. తద్వారా రానున్న సంవత్సరాల్లో సుమారు 900 ఉద్యోగాల రూప కల్పన జరనున్నట్లు ఈజిప్ట్ ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు. చదవండి👉 బంపరాఫర్ ..ఏకంగా 80 శాతం డిస్కౌంట్! పన్ను ఎగొట్టి 2021 డిసెంబర్ నెలలో ఆదాయపు పన్ను ఎగవేతకు పాల్పడి చైనాలో తన పేరెంట్ కంపెనీలకు అక్రమంగా నిధుల్ని మళ్లించిందనే ఆరోపణలతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు చైనా స్మార్ట్ఫోన్ సంస్థ షావోమీతో పాటు ఇతర చైనా సంస్థల్ని విచారించారు. ఆ విచారణ కొనసాగుతుండగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈడీ అధికారులు షావోమీ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ మనుకుమార్ జైన్పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆ తర్వాత ఒప్పో, వివో, షావోమీతో పాటు ఇతర కంపెనీలు మనీ ల్యాండరింగ్ (Prevention of Money Laundering Act (PMLA) యాక్ట్ను ఉల్లంఘిస్తున్నాయనే ఆరోపణలతో 2022 జులైలో ఈడీ అధికారులు చైనా సంస్థ వివో తో పాటు ఇతర సంస్థలకు చెందిన ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, మేఘాలయా, మహరాష్ట్ర, మధ్యప్రదేశ్.. ఇలా మొత్తం 44 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. వేల కోట్లు ఆ సమయంలో వివో మోసాలను ఈడీ బయటపెట్టింది. వివో కంపెనీ భారత్లో పన్నులు ఎగొట్టి టర్నోవర్లో దాదాపు 50శాతం నిధులను చైనాకు తరలించిందని, ఆ మొత్తం 2017 నుంచి 2021 మధ్య కాలంలో మొత్తం రూ.62,476కోట్లు ఉందని వెల్లడించింది.వివో పన్నుల ఎగవేత ప్రకంపనలు కొనసాగుతుండగానే.. ఒప్పో కూడా పన్నులు ఎగ్గొట్టినట్లు బయటపడింది. ఒప్పో సంస్థ రూ. 4389 కోట్ల వరకు కస్టమ్ డ్యూటీ ఎగవేసింది. వస్తువుల విలువను తక్కవ చేసి చూపించడం ద్వారా పన్ను ఎగవేతకు పాల్పడింది. మరో కంపెనీ షావోమి కూడా రూ. 653 కోట్లు ఎగవేతకు పాల్పడింది. ఈ మూడు సంస్థలకు ఈడీ ఇప్పటికే నోటీసులు జారీ చేయగా.. ఈ తరుణంలో భారత్కు చైనా కంపెనీలు గుడ్ బై చెప్పడం ఆసక్తికరంగా మారింది. చదవండి👉 మీ స్మార్ట్ ఫోన్ 5జీ నెట్ వర్క్కు సపోర్ట్ చేస్తుందా? లేదో? ఇలా చెక్ చేసుకోండి! -
5G Phones: బడ్జెట్ 5జీ ఫోన్లకు డిమాండ్..
న్యూఢిల్లీ: 5జీ టెక్నాలజీతో కూడిన బడ్జెట్ ఫోన్ల (రూ.10,000–15,000) విభాగంలో కంపెనీల మధ్య పోరు మొదలైంది. మరో ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా 5జీ సేవలు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో వినియోగదారులు తమ ఫోన్లను కొత్త టెక్నాలజీకి అనుగుణంగా మార్చుకునేందుకు ఆసక్తి చూపించనున్నారు. దీంతో ఈ విభాగం కంపెనీలకు ఆకర్షణీయంగా మారనుంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 5జీ స్మార్ట్ ఫోన్ల ఆవిష్కరణలు ఇప్పటికే రెట్టింపు స్థాయిలో ఉన్నాయి. అంటే పోటీ ఇప్పటికే మొదలైనట్టు కనిపిస్తోంది. రానున్న పండుగల నేపథ్యంలో మరిన్ని 5జీ ఫోన్ల ఆవిష్కరణలు చోటు చేసుకుంటాయని.. కంపెనీల మధ్య పోటీ మరింత వేడెక్కుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తయారీ వ్యయాలు (ముడి పదార్థాల వల్ల) పెరిగిపోవడం, బలహీన రూపాయి రూపంలో కంపెనీలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ అంశాల వల్ల కంపెనీలు బ్యాటరీ, డిస్ప్లే, మెమొరీ విషయంలో రాజీపడి, రూ.15,000లోపు ధరకే 5జీ ఫోన్లను విక్రయించే ప్రయత్నం చేస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. బడ్జెట్ విభాగమే టార్గెట్.. రూ.10,000–15,000 విభాగాన్ని 5జీ ఫోన్లు శాసిస్తాయని అంచనా వేస్తున్నట్టు రియల్మీ ఇండియా సీఈవో మాధవ్ సేత్ పేర్కొనడం గమనార్హం. ఈ ఏడాది చివరికి ఈ విభాగంలో 5జీ ఫోన్లదే హవా ఉంటుందన్నారు. దీపావళికి చాలా బ్రాండ్లు ఈ విభాగాన్నే లక్ష్యం చేసుకుని ఉత్పత్తులు తీసుకురానున్నట్టు అంచనా వేశారు. ఇదే ధరల శ్రేణిలో ఏకంగా ఆరు 5జీ ఫోన్లు ఒక్క ఆగస్ట్ నెలలోనే విడుదలయ్యాయి. కానీ, క్రితం ఏడాది ఇదే సమయానికి ఈ ధరల శ్రేణిలో ఉన్న 5జీ ఫోన్లు కేవలం మూడే. ‘‘2022 మొదటి ఆరు నెలల్లో రూ.10,000–15,000 ధరల్లోని 5జీ స్మార్ట్ఫోన్ల డిమాండ్, క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చిచూస్తే నాలుగు రెట్లు అధికంగా ఉంది’’అని ఫ్లిప్కార్ట్ తెలిపింది. అయితే ఈ ధరల శ్రేణికి సంబంధించి 5జీ ఫోన్ల మార్కెట్ వాటా మొత్తం స్మార్ట్ఫోన్లలో చాలా తక్కువే ఉందని చెప్పుకోవాలి. 2022 ద్వితీయ మూడు నెలల్లో 6 శాతంగా ఉంది. 2021 చివరి నుంచి చూస్తే మార్కెట్ వాటా రెట్టింపైందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తెలిపింది. ఈ ఏడాది చివరికి 5జీ స్మార్ట్ఫోన్ల మార్కెట్ వాటా 10 శాతానికి చేరుకోవచ్చని అంచనాలున్నాయి. తక్కువ ధరల్లో అందించేందుకు కంపెనీలు డిస్ప్లే, ఫాస్ట్ చార్జింగ్లో రాజీపడటం ఒక్కటే ఆందోళన కలిగిస్తోంది. మార్కెట్ వాటా.. కౌంటర్పాయింట్ రీసెర్చ్ డేటా ప్రకారం.. 5జీ ఫోన్లలో షావోమీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. పోకో బ్రాండ్తో కలిపి ఈ విభాగంలో 70 శాతం మార్కెట్ వాటా షావోమీ చేతుల్లోనే ఉంది. రియల్మీ మార్కెట్ వాటా 25 శాతంగా ఉంది. ఇక మోటరోలా 5 శాతం వాటా కలిగి ఉంది. -
ఫెస్టివ్ సీజన్: రూ. 29వేలకే 4కే షావోమీ స్మార్ట్ టీవీ
సాక్షి, ముంబై: చైనా స్మార్ట్ఫోన్ కంపెనీ షావోమి ఇండియా తాజాగా కొత్త సిరీస్ స్మార్ట్టీవీలను లాంచ్ చేసింది. ఎక్స్ సిరీస్లో 43, 50, 55 అంగుళాల సైజుల్లో ఈ ప్రీమియం స్మార్ట్టీవీలు లభ్యం. డాల్బీ విజన్, డాల్బీ ఆడియోతో కూడిన ప్రీమియం బెజెల్-లెస్ డిజైన్తో 4కే రిజల్యూషన్ లాంటివి స్పెషల్ ఫీచర్లుగా షావోమీ ఎక్స్ స్మార్ట్టీవీలను తీసుకొచ్చింది. 43 అంగుళాల స్మార్ట్టీవీ ధర రూ. 28,999, 50 అంగుళాల టీవీ ధర రూ. 34,999, 55 అంగుళాల వేరియంట్ ధర రూ. 39,999 నుండి ప్రారంభం. ఎంఐ హోమ్ స్టోర్లు, ఫ్లిప్కార్ట్, రిటైల్ స్టోర్ల ద్వారా అందుబాటులో ఉంటాయి. సెప్టెంబర్ 14 నుంచి ఫ్లిప్కార్ట్ అండ్ ఎంఐ స్టోర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది ప్యాచ్వాల్ తాజా వెర్షన్తో రూపొందించిన కొత్త సిరీస్ టీవీల ద్వారానేరుగా యూట్యూబ్ మ్యూజిక్ను నిరంతరాయంగా ఎంజాయ్ చేయవచ్చని కంపెనీ తెలిపింది. అధిక రిజల్యూషన్కు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు, 4 కే విప్లవంలో తామే టాప్లో ఉన్నామనీ షావోమి ఇండియా సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్ సుదీప్ సాహు తెలిపారు. వినియోగదారుల కోసం సరైన అప్గ్రేడ్గా ఉండే సిరీస్ని తీసుకు రావాలని భావిస్తున్నామన్నారు. భారతీయ వినియోగదారులకోసం హోమ్ స్క్రీన్పై IMDb ఇంటిగ్రేషన్, 300+ లైవ్ ఛానెల్లు, యూనివర్సల్ సెర్చ్ , కిడ్స్ మోడ్తో సహా ప్యాచ్వాల్లో అనేక ఫీచర్లు ఉన్నాయి. ఇంటరాక్టివ్ ప్యాచ్వాల్, Android TV 10 ప్లాట్ఫారమ్, 2 జీబీ ర్యామ్చ, 8 జీబీ స్టోరేజీ, ప్రముఖ 64-బిట్ క్వాడ్ కోర్ A55 చిప్తో ఆధారితంగా పనిచేస్తాయి. డ్యూయల్-బ్యాండ్ వైఫై,,బ్లూటూత్ 5.0 కనెక్టివిటీకి మద్దతు ఇస్తుంది. 3 HDMI పోర్ట్ (eARC x 1) తో పాటు, ఇది 2 యూఎస్బీ పోర్ట్లు రాజీపడని కనెక్టివిటీ, సంపూర్ణ వీక్షణ అనుభవం కోసం ఏవీ యర్ఫోన్ పోర్ట్తో కూడా ఈ టీవీలను తీసుకొచ్చింది. -
ఐఫోన్ ఇన్స్పిరేషన్తో..బోలెడన్ని ఫీచర్లతో బడ్జెట్ ఫోన్! ధర ఎంతంటే!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ సబ్ బ్రాండ్ రెడ్మీ బడ్జెట్ ధరలో స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. ఐఫోన్ ఎస్ఈ మోడల్ ఇన్స్పిరేషన్తో 'రెడ్మీ నోట్ 11ఎస్ఈ' ఫోన్ను డిజైన్ చేసింది. అంతేకాదు ఐఫోన్లో ఉన్న ఫీచర్లు ఈ కొత్త చైనా ఫోన్లో ఉన్నాయి. ధర విషయంలో ఐఫోన్ అంత కాస్ట్లీ కాకుండా బడ్జెట్ ధరనే నిర్ణయించింది. మైక్రో ఎస్డీ స్లాట్ వరకు అప్గ్రేడ్ చేసుకునేలా 64జీబీ స్టోరేజ్,మీడియా టెక్ హీలియా జీ95 చిప్ సెట్తో వస్తుంది. రెడ్మీ నోట్ 11ఎస్ఈ స్పెసిఫికేషన్లు 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 6.43అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, హోల్ పంచ్ కటౌట్తో 13మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2400*1080పిక్సెల్ రెజెల్యూషన్తో డిస్ప్లే,ఎంఐయూఐ తరహాలో కంటిపై ఒత్తిడి తగ్గించేందుకు రీడింగ్ మోడ్ 3.0, సన్లైట్ మోడ్ 2.0, 6జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ర్యామ్ అండ్ 64జీబీ యూఎఫ్ఎస్2.2 స్టోరేజ్తో మీడియాటెక్ హీలియా చిప్సెట్, 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది దీంతో పాటు ఈ ఫోన్లో 64 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 8మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో కెమెరా, కెమెరా యాప్లో నైట్ మోడ్,ఏఐ బ్యూటీఫై, ఏఐ పోట్రేట్ వంటి మోడ్లు ఉన్నాయి. ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్,ఏఐ ఫేస్ అన్లాక్, డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్, డ్యూయల్ బ్యాండ్ వైఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రెడ్మీ నోట్ 11ఎస్ఈ ధర 64జీబీ ర్యామ్ అండ్ 64జీబీ స్టోరేజ్ వేరియంట్ రెడ్మీ నోట్ 11ఎస్ ఫోన్ ధర రూ.13,499గా ఉంది. బ్లాక్,వైట్,బ్లూ కలర్స్లో ఈ ఫోన్ లభ్యమవుతుంది. ఇక ఈ ఫోన్ ఆగస్ట్ 31 నుంచి షావోమీ వెబ్సైట్, ఫ్లిప్ కార్ట్లో లభ్యం అవుతుంది. ఈ ఫోన్తో పాటు రెడ్ మీ నోట్ 11 రెగ్యూలర్ (రూ.13,499),రెడ్మీ నోట్ 11 టీ 5జీ (రూ.15,999),రెడ్మీ నోట్ 11 ప్రో (18,999)ఫోన్లు సైతం అందుబాటులో ఉంటాయని రెడ్ మీ ప్రతినిధులు తెలిపారు. -
షావోమీ భారీ షాక్, లాభాలు రాలేదని వందల మంది ఉద్యోగులపై వేటు!
ఆర్ధిక మాంద్యం భయాలు ప్రపంచ దేశాల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. దిగ్గజ కంపెనీలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. అందుకే ఖర్చులు తగ్గిస్తూ.. ఆదాయం పెంచుకునే మార్గాల్ని అన్వేషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం షావోమీ వందల మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపింది. ఇటీవల షావోమీ క్యూ2 ఫలితాల్ని విడుదల చేసింది. ఆ ఫలితాల్లో షావోమీ సేల్స్ 20శాతం పడిపోయాయి. మునుపటి త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది క్యూ2లో ఆశించిన ఫలితాలు రాలేదని షావోమీ యాజమాన్యం తెలిపింది. నిరాశజనకమైన ఫలితాలతో దాదాపూ 3శాతం తన వర్క్ ఫోర్స్ను తగ్గిస్తున్నట్లు చైనా మీడియా సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది. ఉద్యోగుల తొలగింపుపై కారణాలు తెలియాల్సి ఉండగా.. షావోమీ త్రైమాసిక లక్ష్యాన్ని సాధించలేకపోయింది. జూన్ త్రైమాసికంలో ఆ సంస్థ లాభాలు 20 శాతం పడిపోయిందని, మొత్తం ఉన్న ఉద్యోగుల్లో 900మందిని విధుల నుంచి తొలగించినట్లు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. 900మంది ఉద్యోగుల తొలగింపు జూన్ 30 నాటికి షావోమీలో 32,869 మంది ఫుల్ టైమ్ ఉద్యోగులు ఉన్నారు. వారిలో 30,110మంది చైనాలో మిగిలిన ఉద్యోగులు, భారత్, ఇండోనేషియా కేంద్రంగా పనిచేస్తున్నారు. అయితే తాజాగా క్యూ2 ఫలితాలపై అసంతృప్తితో ఉన్న షావోమీ ఉద్యోగుల్ని పక్కన పెట్టింది. ఈ సందర్భంగా షావోమీ అధ్యక్షుడు వాంగ్ జియాంగ్ మాట్లాడుతూ, "ఈ త్రైమాసికంలో, పెరుగుతున్న ప్రపంచ ద్రవ్యోల్బణం, విదేశీ మారక ద్రవ్య హెచ్చుతగ్గులు సంక్లిష్ట రాజకీయ వాతావరణంతో సహా అనేక సవాళ్లను ఎదుర్కొంది. ఈ సవాళ్లు మొత్తం మార్కెట్ డిమాండ్ తో పాటు మా ఆర్థిక ఫలితాలపై ప్రభావం చూపించాయని అన్నారు. -
షియోమి.. కుంగ్ ఫూ రోబో!
ఓ కార్యక్రమం జరుగుతోంది.. స్టేజీ మీద ఉన్న వ్యాఖ్యాత ఓ ప్రత్యేక వ్యక్తిని పిలిచారు.. అతను మెల్లమెల్లగా అడుగులో అడుగేసుకుంటూ వచ్చాడు. అందరికీ పరిచయం చేసుకున్నాడు.. సెల్ఫీ దిగుదామంటే కుంగ్ ఫూ పోజిచ్చాడు. కుంగ్ ఫూ ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుందంటూ వెళ్లిపోయాడు.. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో తెలుసా..? చైనాకు చెందిన ప్రఖ్యాత స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమి తాజాగా విడుదల చేసిన హ్యూమనాయిడ్ (మనిషిని పోలిన) రోబో. దాని పేరు ‘సైబర్వన్’. ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నా టెస్లా ‘ఆప్టిమస్’ రోబో విడుదలకు కొన్నిరోజుల ముందు షియోమి సంస్థ ఇలా ‘సైబర్వన్’ను ప్రదర్శించడం ఆసక్తి రేపుతోంది. మడత పెట్టగల ఫోన్ రిలీజ్ చేస్తూ.. సోమవారం షియోమీ సంస్థ తాము రూపొందించిన ఫోల్డబుల్ ఫోన్ను విడుదల చేస్తూ.. ఈ సరికొత్త రోబోను ప్రదర్శించింది. షియోమి సీఈవో లీ జున్ ‘సైబర్వన్’ రోబోను స్టేజీపైకి పిలిచారు. సైబర్ వన్ చేతిలో పువ్వు పట్టుకుని మెల్లగా నడిచి వచ్చింది. పువ్వును లీ జున్కు ఇచ్చింది. పురుష గొంతుతో మాట్లాడుతూ అందరికీ హాయ్ చెప్పింది. సెల్ఫీ దిగుదామని అడిగితే.. కుంగ్ ఫూ ఫోజు ఇచ్చింది. సెల్ఫీ దిగాక కుంగ్ ఫూ ప్రాక్టీసు చేసుకోవాలంటూ వెళ్లిపోయింది. ఈ వీడియోను షియోమి సంస్థ తమ యూట్యూబ్ చానల్లో పెట్టింది. బుడి బుడి అడుగులతో.. తమ రోబోకు సంబంధించి మరో వీడియోనూ షియోమీ సంస్థ విడుదల చేసింది. ‘సైబర్వన్’ రోబో బుడి బుడి అడుగులు వేస్తున్న చిన్నారిలా పడుతూ లేస్తూ నడక నేర్చుకుని.. రేయింబవళ్లూ నడుస్తూ గమ్యాన్ని చేసుకున్నట్టుగా చిత్రించింది. చివరిగా ‘ఏదైనా అద్భుతం జరుగబోతోందని ఎల్లప్పటికీ నమ్ముతాం..’ అంటూ క్యాప్షన్తో ముగించింది. ఏమిటీ రోబో ప్రత్యేకతలు ►షియోమి సంస్థ వెల్లడించిన వివరాల మేరకు.. ‘సైబర్వన్’ రోబో ఎత్తు ఐదు అడుగుల 9.7 అంగుళాలు (177 సెంటీమీటర్లు). బరువు 52 కిలోలు ►మనుషులకు సంబంధించి సంతోషం, విషాదం వంటి 45 రకాల భావోద్వేగాలను ఈ రోబో గుర్తించగలదు. ►మన చుట్టూ ఉండే వాతావరణానికి సంబంధించి 85 రకాల ధ్వనులను అవి దేనికి సంబంధించినవో గుర్తించగలదు. ►షియోమీ సంస్థకు చెందిన రోబోటిక్స్ ల్యాబ్ అభివృద్ధి చేసిన కృత్రిమ మేధ (ఏఐ) ప్రోగ్రామ్ ఆధారంగారోబో పనిచేస్తుంది. ►తన చుట్టూ ఉన్న పరిసరాలను త్రీడీ వర్చువల్ దృశ్యాలుగా మార్చుకుని చూడగలదు. ►అత్యంత శక్తివంతంగా పనిచేసే సరికొత్త మోటార్లను ఇందులో ఉపయోగించారు. ►ఈ రోబో ధర రూ.82.7 లక్షలు అని సంస్థ పేర్కొంది. ►భవిష్యత్తులో ప్రజల జీవితాల్లో భాగస్వామ్యం అయ్యే అద్భుత టెక్నాలజీలతో రోబోలను రూపొందిస్తామని షియోమీ సీఈవో లీ జున్ ప్రకటించారు. – సాక్షి సెంట్రల్డెస్క్ -
భారత్లో చైనా స్మార్ట్ ఫోన్లు ‘బ్యాన్’, స్పందించిన కేంద్రం!
వారం రోజుల క్రితం భారత ప్రభుత్వం రూ.12వేల లోపు చైనా ఫోన్లపై నిషేధం విధించబోతోంది అంటూ బ్లూమ్ బర్గ్ నివేదిక వెలుగులోకి వచ్చింది. అయితే తాజాగా ఆ కథనంపై కేంద్రం స్పందించినట్లు తెలుస్తోంది. బ్లూమ్ బర్గ్ రిపోర్ట్పై కేంద్రం స్పందించినట్లు సమాచారం. చైనా సంస్థలైన షావోమీ, ఒప్పో, వివో ఫోన్లను భారత్లో అమ్మకుండా నిషేధం విధించే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖకు ఉన్నతాధికారులు చెప్పినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. వాస్తవానికి కేంద్రం రూ.12వేల లోపు ఫోన్లపై బ్యాన్ చేయాలని చర్చలు జరిపిన మాట నిజమేనని పేర్కొన్నాయి. కాకపోతే అవి చైనా ఫోన్లు కాదని, దేశీయ ఉత్పత్తి సంస్థలైన లావా, మైక్రోమ్యాక్స్ తో పాటు ఇతర కంపెనీలని హైలెట్ చేశాయి. గత కొంత కాలంలో భారత్..చైనా సంస్థలపై ఓ కన్నేసింది. ఆ దేశానికి షావోమీ,వివో,ఒప్పోలు దేశ చట్టాల్ని ఉల్లంఘించి మనీ ల్యాండరింగ్కు పాల్పడినట్లు తేలింది. దీంతో సదరు సంస్థలపై ఈడీ అధికారులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే చైనా బ్రాండ్స్ అంటే మండిపడే కేంద్రం.. డ్రాగన్ కు చెందిన టిక్ టాక్, పబ్జీతో పాటు వందల సంఖ్యలో యాప్స్ను బ్యాన్ చేసింది. తాజాగా పబ్జీకి ప్రత్యామ్నాయంగా వచ్చిన బీజీఎంఐని సైతం గూగుల్,యాపిల్ స్టోర్ల నుంచి తొలగించాయి. చదవండి👉 మళ్లీ భారత్లోకి రీ ఎంట్రీ కోసం ఆరాటం, టిక్టాక్ సరికొత్త వ్యూహం! -
షావోమీ నుంచి అదిరిపోయే మడత ఫోన్, శాంసంగ్కు దెబ్బే!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ ఆగస్ట్ 11న (గురువారం) సెకండ్ జనరేషన్ ఫోల్డబుల్ (మడత ఫోన్) ఫోన్ను మార్కెట్లో విడుదల చేయనుంది. 'షావోమీ మిక్స్ ఫోల్డ్2' పేరుతో గతంలోనే విడుదల కావాల్సి ఉండుగా..కోవిడ్ నేపథ్యంలో వాయిదా పడుతూ వస్తుంది. ఈ తరుణంలో గురవారం ఫోల్డబుల్ ఫోన్ను యూజర్లకు పరిచయం చేస్తున్నట్లు షావోమీ ప్రతినిధులు తెలిపారు. గత కొన్నేళ్లుగా శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్లో సత్తా చాటుతుంది. కానీ మిక్స్ ఫోల్డ్ 2తో ఈక్వేషన్ త్వరగా మారే అవకాశం ఉన్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రత్యేకించి శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ కంటే షావోమీ ఫోన్ ధర తక్కువ ఉంటే ►షావోమీ సైతం శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ తరహాలో ఈ మిక్స్ ఫోన్2 ఫోన్లో ఆల్ట్రా థిన్ స్క్రీన్తో వస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. హై రిఫ్రెష్ రేట్తో ఈ ఫోన్ స్క్రీన్లు యూజర్లను అట్రాక్ట్ చేయనున్నాయి. ►ఫ్లాగ్ షిప్ వెర్షన్ కాపోయినప్పటికీ పవర్ ఫుల్ హార్డవేర్ యూనిట్గా పేరొందిన స్నాప్ డ్రాగన్ 8జనరేషన్ 1 చిప్ సెట్తో రానుంది. ►షావోమీ ఫోల్డబుల్ ఫోన్ స్లీక్ డైమన్షన్ (పాలిష్డ్ స్మూత్ గ్లాస్)తో హైక్వాలిటీ డిస్ప్లే ఉందని షావోమీ విడుదల చేసిన ఫోన్ టీజర్ను చూస్తే అర్ధం అవుతుంది. ►ఆగస్టు 10న (నేడు) శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4, గెలాక్సీ జెడ్ ఫ్లిప్4ని ఆవిష్కరించనుంది. రేపు షావోమీ మిక్స్ ఫోల్డ్ 2ని విడుదల చేస్తుండడం ఈ ఫోన్ మరి ఆసక్తిని రేకెత్తిస్తుంది. ►దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ 4జనరేషన్ ఫోల్డబుల్ ఫోన్లను మార్కెట్లో విడుదల చేస్తుంది. ఇప్పటికే ఫోల్డబుల్ ఫోన్ విభాగంలో మార్కెట్ను శాసిస్తున్న శాంసంగ్కు పోటీగా ఒప్పో, షావోమీలు ఫోల్డబుల్ ఫోన్లను విడుదల చేస్తున్నాయి. చదవండి👉 వన్ఫ్లస్ నుంచి మడత ఫోన్.. త్రీ ఫోల్డ్స్, ఇక గెలాక్సీకి గట్టి పోటీనే! -
తక్కువ ధర చైనా ఫోన్లపై భారత్లో నిషేధం!
చిన్నకర్రనైనా పెద్ద పాముతో కొట్టాలంటారు పెద్దలు. చైనా ఫోన్ల విషయంలో భారత్ ఇప్పుడు ఇదే స్ట్రాటజీని ఫాలో కాబోతోంది. చైనా ఫోన్లపై నిషేధం విధించాలని భారత్ కోరుతోంది. అదీ రూ. 12,000 కంటే తక్కువ ధర కలిగిన చైనీస్ ఫోన్ల అమ్మకాలను నిషేధించాలనుకుంటోంది. తద్వారా తడబడుతున్న దేశీయ పరిశ్రమకు బలం ఇవ్వాలని భావిస్తోంది. తక్కువ రేటు చైనా ఫోన్ల అమ్మకాలను భారత్లో నిషేధించాలన్న భారత ప్రభుత్వ తాజా నిర్ణయం ద్వారా షావోమీలాంటి చైనీస్ బ్రాండ్లతో సహా చాలావాటికి దెబ్బ పడనుంది. ముఖ్యంగా ప్రపంచంలోని రెండవ అతిపెద్ద మొబైల్ మార్కెట్ అయిన భారత్.. తద్వారా దిగువ విభాగం నుండి చైనీస్ కంపెనీలను బయటకు గెంటేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశ ప్రవేశ-స్థాయి(ఎంట్రీ లెవల్) మార్కెట్ నుంచి తప్పించడం ద్వారా షావోమీ, మరికొన్ని సహచర కంపెనీలను నిలువరించడమే భారత వ్యూహమని నిపుణులు చెప్తున్నారు. చైనాలో కరోనా, లాక్డౌన్ ప్రభావంతో అక్కడి మార్కెట్ ఘోరంగా దెబ్బతింటోంది. దీంతో ఎక్కువగా భారతదేశంపైనే ఆధారపడుతోంది ఆ మార్కెట్. మార్కెట్ ట్రాకర్ కౌంటర్పాయింట్ ప్రకారం, జూన్ 2022 వరకు త్రైమాసికంలో $150(12వేలరూపాయల) లోపు స్మార్ట్ఫోన్లు.. భారతదేశ విక్రయాలకుగానూ మూడింట ఒక వంతుకు దోహదపడ్డాయి. చైనా కంపెనీలు ఆ షిప్మెంట్లలో 80% వరకు ఉండడం గమనార్హం. ఇప్పటికే షావోమీ, ఒప్పో , వివో వంటి చైనీస్ సంస్థలు భారత్లో ఆర్థిక సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ట్యాక్సుల ఎగవేతతో పాటు ఏకంగా మనీల్యాండరింగ్ ఆరోపణలు చుట్టుముట్టాయి కూడా. అయితే చైనీస్ ఫోన్లు, ఉత్పత్తులను నేరుగా నిషేధించేందుకు ఇబ్బందులు ఎదురయ్యే చాన్స్ ఉన్నందున.. గతంలో హువాయ్, జెడ్టీఈ లాంటి దిగ్గజాల టెలికాం పరికరాలను నిషేధించడానికి అనధికారిక మార్గాలను ఉపయోగించింది. చైనా ఫోన్ల విషయంలో అలాంటి స్ట్రాటజీనే పాటించాలని భావిస్తోంది. మరోవైపు.. భారత్లో యూనిట్ల ఏర్పాటుకు కూడా కేంద్ర ప్రభుత్వం చైనా కంపెనీలపై ఒత్తిడి చేస్తోంది. స్థానికంగా సప్లయ్ చెయిన్లు ఏర్పాటు చేయాలని, భారీగా ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలని, భారత్ నుంచే ఎగుమతి చేయాలని కోరుతూ వస్తోంది. తద్వారా చైనా ఫోన్లకు మేడ్ ఇన్ ఇండియా మార్క్తో పాటు స్థానికంగా ఉపాధి కల్పన కూడా ఏర్పడే అవకాశం ఏర్పడుతుంది. ఇదీ చదవండి: 5జీ నెట్ వర్క్కు సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్లు ఇవే! -
షావోమీపై 'ఈడీ', చైనా స్మార్ట్ఫోన్ కంపెనీకి భారీ షాక్!
చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ కారణంగా షావోమీ 23 శాతం షిప్మెంట్ తగ్గినట్లు (ఇయర్ టూ ఇయర్) ఇండియా మొబైల్ హ్యాండ్సెట్ మార్కెట్ రిపోర్ట్ అందించే సైబర్ మీడియా రీసెర్చ్ వెల్లడించింది. షావోమీకి సబ్ బ్రాండ్గా ఉన్న పోకో సైతం షిప్మెంట్ 14శాతం తగ్గినట్లు సైబర్ మీడియా రీసెర్చ్ నివేదించింది. కానీ షావోమీ భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో 20 శాతంతో ప్రథమ స్థానంలో ఉండగా శాంసంగ్ 18శాతం, రియల్ మీ 16శాతంతో తొలి 3 స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాత వివో 15శాతం, ఒప్పో 10శాతం మార్కెట్తో కొనసాగుతున్నాయి. రిపోర్ట్ ప్రకారం.. 5జీ స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్లో శాంసంగ్ ఫోన్లు వృద్ధి సాధిస్తున్నట్లు పేర్కొంది. రూ.7వేల నుంచి రూ.24వేల మధ్య ఫోన్లు అమ్ముడవుతున్నట్లు తెలుస్తోంది. వాటితో పాటు ఇన్నోవేటీవ్తో త్వరలో విడుదల కానున్న శాంసంగ్ ఫోర్త్ జనరేషన్ ఫోల్డబుల్ ఫోన్లు కొనుగోలు దారుల్ని ఆకట్టుకుంటాయనే అభిప్రాయం వ్యక్తం చేసింది. కొనుగోలు దారుల్ని ఆకట్టుకునే సూపర్ ప్రీమియం సెగ్మెంట్ ఫోన్లలో యాపిల్ ఐఫోన్లు చోటు దక్కించుకున్నాయి. 80శాతం మార్కెట్ షేర్తో రూ.50వేల నుంచి రూ.లక్ష రేంజ్ ఫోన్లు ఉన్నాయి. షిప్మెంట్లో ఐఫోన్12, ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లు అగ్రస్థానంలో నిలిచాయి. దీంతో భారత్లో యాపిల్ సంస్థ భారీ లాభాల్ని గడించినట్లు క్యూ2 ఫలితాల సందర్భంగా యాపిల్ సీఈవో టిమ్ కుక్ సంతోషం వ్యక్తం చేశారు. క్యూ2లో స్మార్ట్ ఫోన్లు షిప్మెంట్ అవ్వగా ప్రతి మూడు ఫోన్లలో ఒక 5జీ ఫోన్ ఉన్నట్లు నివేదిక హైలెట్ చేసింది. గతేడాది క్యూ2 నుంచి ఈ ఏడాది క్యూ2 వరకు 5జీ స్మార్ట్ ఫోన్ల షిప్మెంట్ 163 శాతం పెరిగాయి ద్రవ్యోల్బణం ఎఫెక్ట్ పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం కారణంగా వరుసగా క్యూ2లో సైతం ఫీచర్ ఫోన్ల డిమాండ్ తగ్గించింది. 2జీ ఫీచర్ ఫోన్ 4 శాతం పెరిగింది. కానీ 4జీ ఫీచర్ ఫోన్ సెగ్మెంట్ 45 శాతం క్షీణించింది. మార్కెట్పై పట్టుకోల్పోతుందా? దేశీయ మార్కెట్లో చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ యూజర్లను కోల్పోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది షావోమీ విదేశీ మారక చట్టం(ఎఫ్ఈఎంఏ) నిబంధనల్ని ఉల్లంఘించడంతో ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఈ దర్యాప్తులో షావోమీ 2014 నుంచి ఎంఐ బ్రాండ్ పేరుతో స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు జరపడం ప్రారంభించింది. ఆ తరువాతి ఏడాది అంటే 2015లో షావోమీ ఇండియా రూ.5,551.27కోట్ల నిధుల్ని విదేశీ కంపెనీలకు బదిలీ చేసినట్లు తేలింది. అంతేకాదు తనకు ఏమాత్రం సంబంధం లేని షావోమీ ఇండియా.. అమెరికా కంపెనీల అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ చేసినట్లు ఏడీ తేల్చింది. ఆ విచారణతో దేశీయ కొనుగోలు దారులు షావోమీని దూరం పెట్టినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. చదవండి: సేల్స్ బీభత్సం..! 5 నిమిషాల్లో వేలకోట్ల విలువైన ఫోన్లు అమ్ముడయ్యాయి! -
100 గ్రాముల కళ్ల జోడు..100 నిమిషాల వీడియోల్ని రికార్డ్ చేస్తుంది!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ టెక్నాలజీ విభాగంలో మరో అడుగు ముందుకు వేసింది. అగ్మెంటెడ్ రియాలిటీతో 'మిజియా ఏఆర్ గ్లాసెస్ కెమెరా ' స్మార్ట్ గ్లాస్ను విడుదల చేసింది. షావీమీ 'మిజియా ఏఆర్ స్మార్ట్ గ్లాస్ను చైనాలో విడుదల చేయగా.. గ్లోబల్ మార్కెట్లో ఎప్పుడు విడుదల చేస్తున్నారనే అంశంపై షావోమీ స్పందించింది. తాము విడుదల చేసిన ఈ ఏఆర్ స్మార్ట్ గ్లాస్ను భారత్ మార్కెట్లో త్వరలోనే అందుబాటులోకి తెస్తామని తెలిపింది. ఆ తర్వాత డిమాండ్ను బట్టి ఇతర దేశాల మార్కెట్లకు పరిచయం చేస్తామని పేర్కొంది. మిజియా ఏఆర్ గ్లాసెస్ ఫీచర్లు రూ.29,030 విలువైన మిజియా ఏఆర్ గ్లాసెస్లో డ్యుయల్ కెమెరా సెటప్, 50 మెగా పిక్సెల్ క్వాడ్ బేయర్ సెన్సార్లు, 8మెగా పిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో కెమెరా, ఐఓఎస్ ఆప్టికల్ స్టెబిలైజేన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 5ఎక్స్ ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తుండగా 15ఎక్స్ హైబ్రిడ్ వరకు జూమ్ చేసుకోవచ్చని షావోమీ ప్రతినిధులు వెల్లడించారు. పనితనం అంటే ఇదే మరి కేవలం 100గ్రాముల బరువు ఉండే ఈ స్మార్ట్ గ్లాస్ పనితీరులో అమోఘమని షావోమీ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ గ్లాస్లో ఉన్న కెమెరాలు ఫోటోల్ని తీయడం, షేర్ చేయడం సెకన్లలో జరిగిపోతాయని స్పష్టం చేసింది. ఈ గ్లాస్లో మరో ప్రత్యేకత ఏంటంటే 100 నిమిషాల వీడియో పుటేజీని నాన్ స్టాప్గా రికార్డ్ చేస్తుందని షావోమీ సీఈవో లీ జూన్ చెప్పారు. స్టోరేజీ ఎంతంటే స్నాప్ డ్రాగన్ 8చిప్ సెట్తో వస్తున్న ఈ స్మార్ట్ గ్లాస్లో 3జీబీ ర్యామ్ 32జీబీ స్టోరేజ్ సౌకర్యం ఉంది. 1,020 ఎంఏహెచ్ బ్యాటరీ, 10డబ్ల్యూ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్, 30నిమిషాల్లో 80శాతం బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కే సామర్ధ్యం ఉంది. 3,000 నిట్స్ పీక్స్ బ్రైట్నెస్తో ఓఎల్ఈడీ స్క్రీన్తో వస్తుండగా.. ఈ స్మార్ట్ గ్లాసెస్ డిజిటల్ అసిస్టెంట్గా పనిచేస్తాయని విడుదల సందర్భంగా షావోమీ వెల్లడించింది. -
ఎన్నాళ్ళీ.. నిరీక్షణ..! ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీలో షావోమీకి భంగపాటు!
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ ఆటోమొబైల్ రంగంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. 2024కల్లా మార్కెట్లో తన తొలి ఎలక్ట్రిక్ కారును విడుదల చేయాలని ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. కానీ ఈ ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి. కార్ల తయారీ కోసం డ్రాగన్ కంట్రీ పర్మీషన్లు ఇవ్వడంలో జాప్యం చేస్తుందని సమాచారం. బిజింగ్ కేంద్రంగా షావోమీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ఏర్పాటు కోసం స్థలం చూసుకుంది. కానీ ఆ సంస్థ ఏర్పాటు కోసం కావాల్సిన అనుమతుల్ని నేషనల్ డెవలప్మెంట్ అండ్ రిప్మార్ కమిషన్ అధికారులు ఇచ్చేందుకు సుముఖంగా లేరని, నెలల తరబడి సంబంధిత శాఖ అధికారుల్ని సంప్రదించినా పట్టించుకోవడం లేదని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. షావోమీకి కష్టమే వెలుగులోకి వచ్చిన నివేదికల ప్రకారం.. షావోమీ తన ప్రత్యర్ధులతో పోటీ పడుతూ ఈవీ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఆటోమొబైల్ మార్కెట్లో వినియోగదారులకు కావాల్సిన ఈవీ వెహికల్స్ను అదించాలని, అతిపెద్ద ఈవీ మార్కెట్గా అవతరిస్తుందని ఆశించాం. కానీ లైసెన్స్ పొందడంలో ఆలస్యం అవుతుందని.. ఇలాగే కొనసాగితే షావోమీ ప్రత్యర్ధులు మార్కెట్లో రాణిస్తారని ఆ సంస్థ సీఈవో లీ జున్ అభిప్రాయం వ్యక్తం చేశారు. -
షావోమి 200 ఎంపీ కెమెరా స్మార్ట్ఫోన్ త్వరలోనే
సాక్షి, ముంబై: చైనా స్మార్ట్ఫోన్ మేకర్ షావోమి త్వరలోనే 200 ఎంపీ కెమెరా ఉన్న స్మార్ట్ఫోన్ లాంచ్ చేయనుంది. డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం, 200MP సెన్సార్, స్నాప్డ్రాగన్ 8+ Gen 1 చిప్సెట్, 120Hz డిస్ప్లే , 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఫోన్ అందుబాటులో రానుంది. ఇప్పటికే మోటరోలా తన తదుపరి ప్రీమియం స్మార్ట్ఫోన్ను 200 ఎంపీ కెమెరాతో లాంచ్ చేస్తున్నట్లు అధికారికంగా ధృవీకరించింది. అలాగే శాంసంగ్ కూడా 50 మెగాపిక్సెల్ ISOCELL జీఎన్ఎస్ సెన్సార్, 200-మెగాపిక్సెల్ సెన్సార్తో స్మార్ట్ఫోన్లను తీసుకొస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇపుడు ఈ రేసులో షావోమి కూడా చేరింది. కాగా ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో విక్రేతలు దేశంలో 38 మిలియన్ స్మార్ట్ఫోన్లను రవాణా చేయడంతో 2022 క్యూ1లో భారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్ సంవత్సరానికి కేవలం 2 శాతం మాత్రమే పెరిగింది. ఈ సమయంలో 8 మిలియన్ యూనిట్లన విక్రయాలతో షావోమి ఇండియాలో టాప్ బ్రాండ్గా నిలిచింది. శాంసంగ్ 6.9 మిలియన్ యూనిట్లను షిప్పింగ్ చేసింది. -
రెడ్మీ, షావోమీ స్మార్ట్ ఫోన్ యూజర్లకు అదిరిపోయే ఆఫర్!
మీరు రెడ్మీ, షావీమీ బ్రాండ్ స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్నారా? కానీ, ఆ ఫోన్ బ్యాటరీలు డెడ్ అయ్యాయ్యా? ఛార్జింగ్ సరిగ్గా ఎక్కడం లేదా? లేదంటే ఛార్జింగ్ ఎక్కినా నిలవడం లేదా? అయితే మీకో శుభవార్త. షావోమీ స్మార్ట్ ఫోన్ యూజర్లకు శుభవార్త. యూజర్లు వినియోగిస్తున్న స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సమస్యల్ని పరిష్కరించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. పనితీరు మందగించిన ఫోన్ల బ్యాటరీను మార్చి వాటి స్థానంలో కొత్త బ్యాటరీలను అమర్చుతున్నట్లు ప్రకటించింది. షావోమీ తన యూజర్లకు రూ.499కే పాత ఫోన్ల బ్యాటరీల స్థానంలో కొత్త బ్యాటరీలను అందిస్తున్నట్లు ట్విట్ చేసింది. మీ షావోమీ, రెడ్ మీ ఫోన్ బ్యాటరీ డెడ్ అయినట్లు అనిపించినా, లేదంటే ఛార్జింగ్ ఎక్కకపోయినా మీ సర్వీస్ సెంటర్ని ఆశ్రయిస్తే తక్కువ ధరకే కంపెనీ బ్యాటరీలను అందిస్తామని ట్వీట్లో పేర్కొంది. బ్యాటరీ ఎప్పుడు రిప్లెస్ చేయాలి షావోమీ, రెడ్మీ స్మార్ట్ ఫోన్ల బ్యాటరీ ఛార్జింగ్ లైఫ్ టైమ్ ఉదాహరణకు 10 గంటల ఉంటుంది. కానీ ప్రతిరోజు పలు మార్లు ఛార్జింగ్ తగ్గిపోతుంటే బ్యాటరీ మార్చుకోవాలి. లేదంటే ఫోన్ ఛార్జింగ్ 100శాతం ఉండి నిమిషాల వ్యవధిలో 80-90కి పడిపోతే అప్పుడు మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. చదవండి👉 జూన్లో విడుదల కానున్న 9 స్మార్ట్ ఫోన్లు ఇవే! -
ఈ ఫోన్లు కొంటే..షావోమీ బంపర్ ఆఫర్
సాక్షి, ముంబై: ప్రముఖ స్మార్ట్ఫోన్ మేకర్ షావోమీ ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్ యూట్యూబ్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశీయంగా మూడు నెలల యూట్యూబ్ ప్రీమియం సభ్యత్వాన్ని ఉచితంగా అందిస్తోంది. అయితే ఇందులో ఒక కండిషన్ ఉంది. అదేమిటంటే.. ఎంపిక చేసిన షావోమీ, రెడ్మి స్మార్ట్ఫోన్ల కొనుగోలుపై మొదటి మూడు నెలలు ఈ అవకాశం అందుబాటులో ఉంది. ఈ మేరకు షావోమి ఇండియా ఒక ప్రకటన జారీ చేసింది. షావోమి ఇలాంటి ఆఫర్ ప్రకటించడం ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందు తన సబ్-బ్రాండ్లలో ఒకటైన పోకో కూడా ఇదే ఆఫర్ను వినియోగదారులకు అందిస్తోంది. సో..యూట్యూబ్ ప్రీమియం ఉచిత ఆఫర్ను ఇప్పటికే పొందినట్లయితే, షావోమీ ఫోన్ కొనుగోలుపై ఫ్రీ ఆఫర్ను పొందేందుకు అర్హుల కారు అనేది గమనించాలి. షావోమి 11, షావోమీ 12 ప్రో, షావోమీ 11టి,11 ఐ కొనుగోలుపై మూడు నెలలు, అలాగే రెడ్మి నోట్ 11, నోట్ 11 ఎస్ లాంటి కొన్ని స్మార్ట్ఫోన్లపై రెండు నెలల యూట్యూబ్ ప్రీమియం సబ్స్ర్రిప్షన్ ఉచితం. ఈ ప్రమోషనల్ ఆఫర్ జనవరి 31, 2023 వరకు అందుబాటులో ఉంటుంది. కాగా యూట్యూబ్ ప్రీమియం నెలకు రూ.129. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో ఉన్న ఇతర ఓటీటీ ప్లాట్ఫారమ్ల కంటే ఇదే చౌకగా లభిస్తోంది. -
జూన్లో స్మార్ట్ ఫోన్ల పండుగ, అదిరిపోయే ఫీచర్లతో 9 ఫోన్లు రిలీజ్!
దేశ వ్యాప్తంగా పెళ్లిళ్లు భారీ ఎత్తున జరుగుతున్నాయి. రెండేళ్ల నుంచి నామ మాత్రంగా జరిగినా ఈ ఏడాది వైరస్ ఉపశమనంతో పెళ్లికి అనుబంధంగా ఉన్న అన్నీ వ్యాపారాలు జోరుగా కొనసాగుతున్నాయి.పెళ్లి సీజన్లో బట్టలు, బంగారంతో పాటు కొనుగోలు దారులు ఎక్కువగా కొనే స్మార్ట్ ఫోన్ సేల్స్ సైతం విపరీతంగా జరుగుతుంటాయి. అందుకే జూన్లో దిగ్గజ స్మార్ట్ ఫోన్ సంస్థలైన ఒప్పో, వన్ ప్లస్, పోకో, రియల్ మీ, షావోమీ'లు ఫోన్లను విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఇప్పుడు మనం ఏప్రిల్ నెలలో విడుదలయ్యే స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసుకుందాం. 1.రియల్మీ చైనా స్మార్మ్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ జూన్ 7న స్నాప్ డ్రాగన్ 870 చిప్ సెట్తో రియల్ మీ జీటీ నియో 3టీ స్మార్ట్ ఫోన్ను విడుదల చేయనుంది. 2.పోకో షావోమీ సబ్సిడరీ పోకో సంస్థ స్నాప్ డ్రాగన్ 8జనరేషన్ 1చిప్సెట్తో పోకో ఎఫ్4 జీటీ స్మార్ట్ ఫోన్ను జూన్ 15 తర్వాత విడుదల చేయనుంది 3.వన్ ప్లస్ మరో చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్ ప్లస్ 90హెచ్ జెడ్ ఆమోలెడ్ డిస్ప్లే, 80 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వన్ ప్లస్ నార్డ్ 2టీని జూన్ నెలలో విడుదల చేయనుంది. 4.ఒప్పో ఒప్పో రెనో 8 సిరీస్ ఫోన్లు సైతం ఇదే నెలలో విడుదల కానున్నాయి. 5.షావోమీ స్నాప్ డ్రాగన్ 870 చిప్ సెట్తో షావోమీ 12ఎక్స్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ సైతం జూన్ 15 తేదీ లోపు విడుదల చేయనుంది 6.మోటో జూన్ 2న అమెరికాకు చెందిన మరో స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మోటరోలా మోటో ఈ32ఎస్ పేరుతో బడ్జెట్ ఫోన్ను మార్కెట్కు పరిచయం చేయనుంది. 7.శాంసంగ్ సౌత్ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ బడ్జెట్ ధరలో 5జీ స్మార్ట్ ఫోన్ను విడుదల చేయనుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ13 పేరుతో జూన్ 15 తర్వాత విడుదల చేయనుంది. 8.వివో స్నాప్ డ్రాగన్ 870 చిప్ సెట్తో వివో టీ2 పేరుతో విడుదల కానున్న ఈ స్మార్ట్ ఫోన్ జూన్లో స్మార్ట్ ఫోన్ లవర్స్ను అలరించేందుకు సిద్ధమైంది. 9.మోటరోలా మోటరోలా సంస్థ మోటో జీ52జే పేరుతో స్మార్ట్ ఫోన్ను జూన్ నెలలో విడుదల కానుంది. చదవండి👉ఐఫోన్ లవర్స్కు బంఫరాఫర్! -
యాపిల్కు శాంసంగ్ భారీ షాక్!
ప్రముఖ సౌత్ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ గ్లోబల్ మార్కెట్పై ఆదిపత్యం చెలాయిస్తుంది. బడ్జెట్ ధర, ఆకట్టుకునే ఫీచర్లతో సరికొత్త మోడళ్లతో స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. దీంతో యూజర్లు ఆ బ్రాండ్ ఫోన్లను ఎక్కువగా కొనుగోలు చేయడంతో వరల్డ్ వైడ్గా శాంసంగ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ షేర్ ఎక్కువగా ఉందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తెలిపింది. ఈ ఏడాది క్యూ1 ఫలితాల్లో (క్యూ1) 24 శాతంతో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్గా శాంసంగ్ నిలిచినట్లు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తన నివేదికలో పేర్కొంది. 2017 తరువాత ఈ స్థాయిలో స్మార్ట్ ఫోన్ కొనుగోలు దారుల్ని ఆకట్టుకునేందుకు శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22 సిరీస్లాంటి మిడ్ రేంజ్ ఫోన్లే కారణమని వెల్లడించింది. క్యూ1 ఫలితాల్లో 2017లో గ్లోబల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో శాంసంగ్ షేర్ 25శాతంగా ఉంది. మళ్లీ 5ఏళ్ల తర్వాత అంటే ఈ ఏడాది క్యూ1లో 24శాతం షేర్తో ప్రథమ స్థానంలో నిలిచింది. శాంసంగ్ తర్వాత ఆండ్రాయిండ్ బ్రాండ్లలో షావోమీ 12శాతం, ఐఫోన్ మార్కెట్లో యాపిల్ 15శాతంతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ప్రొడక్షన్ తగ్గించేసింది క్యూ1 ఫలితాల అనంతరం ప్రపంచ దేశాల్లో తలెత్తిన ఆర్ధిక మాంధ్యం, కరోనా లాక్ డౌన్, రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, చిప్ షార్టేజ్తో పాటు వివిధ కారణాల వల్ల స్మార్ట్ ఫోన్లను తయారీ శాంసంగ్ స్మార్ట్ ఫోన్ల తయారీని తగ్గించినట్లు తేలింది. ప్రపంచంలో అత్యధికంగా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థగా కొనసాగుతున్న శాంసంగ్ ఈ ఏడాది 30 మిలియన్ల స్మార్ట్ ఫోన్ ప్రొడక్షన్ను తగ్గిస్తుందని సౌత్ కొరియా బిజినెస్ మీడియా సంస్థ 'మెయిల్' తన కథనంలో పేర్కొంది. కాగా, ఇప్పటికే యాపిల్ సైతం 20 మిలియన్ ప్లస్ ఫోన్ల ప్రొడక్షన్ను తగ్గిస్తున్నట్లు తెలిపిందని బ్లూం బర్గ్ రిపోర్ట్ హైలెట్ చేసింది. ఫీచర్ ఫోన్లకు గుడ్బై! శాంసంగ్కు చెందిన ఖరీదైన స్మార్ట్ ఫోన్ భారత్లో ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. అందుకే హై బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సేల్స్ పెంచేందుకు భారత్లో ఫీచర్ ఫోన్ల అమ్మకాలను నిలిపిస్తూ ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి👉 భారత్కు శాంసంగ్ భారీ షాక్! ఇకపై ఆ ప్రొడక్ట్లు ఉండవట! -
చైనా కంపెనీ షావోమీకి బిగ్ షాక్
న్యూఢిల్లీ: చైనా మొబైల్ దిగ్గజం షావోమీ ఇండియాకు ఈడీ షాకిచ్చింది. విదేశీ మారకద్రవ్య చట్టాల ఉల్లంఘన ఆరోపణలపై రూ.5,551.27 కోట్ల విలువైన కంపెనీ నిధులను శనివారం జప్తు చేసింది. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) కింద ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘గత ఫిబ్రవరిలో రూ.5,551.27 కోట్ల విలువైన నిధులను సొంత గ్రూప్ కంపెనీతో పాటు మొత్తం మూడు విదేశీ కంపెనీలకు రాయల్టీ ముసుగులో పంపించింది. చైనాకు చెందిన తన మాతృసంస్థ షావోమీ ఆదేశాల మేరకే ఈ పని చేసింది. అంతిమంగా షివోమీ గ్రూప్ సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకే రెండు యూఎస్ కంపెనీలకు కూడా నిధులు బదిలీ చేసింది’’ అని ఈడీ వివరించింది. ఇది కూడా చదవండి: అది కాళరాత్రి: జెలెన్స్కీ.. ఆయనపై ‘టైమ్’ కవర్ స్టోరీ -
సూపర్ ఫీచర్స్తో షావోమీ నుంచి మరో బడ్జెట్ ఫోన్..! లాంచ్ ఎప్పుడంటే..?
భారత మార్కెట్లలోకి మరో బడ్జెట్ స్మార్ట్ఫోన్ను రిలీజ్ చేసేందుకు ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ సిద్దమైంది. రెడ్మీ 10 సిరీస్లో భాగంగా రెడ్మీ 10 ఏ స్మార్ట్ఫోన్ను షావోమీ లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్ఫోన్ భారత్లో ఏప్రిల్ 20న లాంచ్ కానుంది. రెడ్మీ10ఏ స్మార్ట్ఫోన్కు సంబంధించిన పలు వివరాలను ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా తన వెబ్సైట్లో టీజ్ చేసింది. Redmi 10A స్మార్ట్ఫోన్ను ఇప్పటికే చైనాలో అందుబాటులో ఉండగా..ఇదే మోడల్ భారత్లో కూడా లాంచ్ కానుంది. ఇది Redmi 10 స్మార్ట్ఫోన్ స్ట్రిప్డ్ వెర్షన్ మాత్రమేనని తెలుస్తోంది. రాబోయే Redmi 10A స్మార్ట్ఫోన్ Redmi 10 కంటే చౌకగా ఉండే అవకాశం ఉంది. Redmi 10 ప్రస్తుతం రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 4GB RAM + 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన బేస్ మోడల్ ధర రూ.10,999. 6GB RAM + 128GB స్టోరేజ్ టాప్-ఎండ్ మోడల్ ధర రూ.12,999 గా ఉన్నాయి. అయితే భారత మార్కెట్లలో Redmi 10A ధరను ఇంకా వెల్లడి చేయనప్పటికీ, ఈ స్మార్ట్ఫోన్ ధర రూ. 10,000 లోపు ఉండవచ్చునని తెలుస్తోంది. Redmi 10A 4GB RAM + 64GB స్టోరేజ్ టాప్-ఎండ్ మోడల్ ధర రూ.9,999 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇక 3GB RAM + 32GB స్టోరేజ్ Redmi 10A బేస్ మోడల్ ధర సుమారు రూ. 8,999గా అంచనా వేయబడింది. Redmi 10A స్పెసిఫికేషన్లు(అంచనా) 6.53-అంగుళాల HD+ LCD డిస్ప్లే విత్ 720×1600 పిక్సెల్స్ రిజల్యూషన్ వాటర్డ్రాప్ నాచ్ ఆండ్రాయిడ్ 11 సపోర్ట్ మీడియాటెక్ హెలియో జీ25 ప్రాసెసర్ పవర్వీ8320 జీపీయూ గ్రాఫిక్స్ 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 13 ఎంపీ రియర్ కెమెరా 4GB ర్యామ్+ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ 10W ఛార్జింగ్ సపోర్ట్ 5,000mAh బ్యాటరీ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ చదవండి: మోటోరోలా నుంచి మరో అద్భుతమైన స్మార్ట్ఫోన్..! -
అదిరిపోయే ఫీచర్లతో..షావోమీ నుంచి మరో 5జీ స్మార్ట్ ఫోన్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమి 5జీ షావోమీ12 ప్రో'ని అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసింది. ఏప్రిల్12న భారత్లో విడుదల చేసేందుకు షావోమీ సిద్ధమైంది. అయితే ఇటీవల విడుదలైన గెలాక్సీ ఎస్22, మోటరోలా ఎడ్జ్ 30 ప్రో, ఐక్యూ 9ప్రో,వన్ ప్లస్ 10ప్రో' స్మార్ట్ఫోన్లకు పోటీగా షావోమీ 12ప్రో ఫోన్ నిలుస్తుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 5జీ షావోమీ12 ప్రో' స్పెసిఫికేషన్లు.. షావోమి షావోమీ12 ప్రో స్మార్ట్ఫోన్ ఎల్టీపీఓ టెక్నాలజీతో 6.73 అంగుళాల 2కే అమోలెడ్ డిస్ప్లే రెజెల్యూషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాసెస్, 120హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్ 10ప్లస్ సర్టిఫికేషన్తో అందుబాటులోకి వచ్చింది. 4,600ఎంఏహెచ్ బ్యాటరీ 120డబ్ల్యూ షావోమి హైపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 1500నిట్ పీక్ బ్రైట్నెస్ సదుపాయం ఉంది. ఇక స్మార్ట్ఫోన్ వెనుకవైపు మూడు 50 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ స్నాపర్, 50డబ్ల్యూ వైర్లెస్ ఛార్జింగ్, 10డబ్ల్యూ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. షావోమీ12 ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 1 ప్రాసెసర్, చిప్లోని సిస్టమ్ దానితో పాటు ఇంటిగ్రేటెడ్ Adreno 730 జీపీయూ, 12జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీని అందిస్తుంది. ఆప్టిక్స్ పరంగా ఐఎంఎక్స్ 707ప్రైమరీ సెన్సార్తో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 115° ఫీల్డ్ వ్యూతో 50ఎంపీ శాంసంగ్ జేఎన్1 అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లు ఉన్నాయి. 2ఎక్స్ ఆప్టికల్ జూమ్తో 50ఎంపీ పోర్ట్రెయిట్ లెన్స్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్ కోసం 32ఎంపీ ఫ్రంట్ కెమెరా అందిస్తుంది. చదవండి: స్మార్ట్ ఫోన్లను ఎగబడి కొంటున్న జనం, ఎగుమతుల్లో భారత్ సరికొత్త రికార్డ్లు! -
అలర్ట్..మార్చి 31 డెడ్లైన్...! ఈ స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు..!
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్. 2 బిలియన్లకు పైగా యూజర్లు వాట్సాప్ సొంతం. యూజర్లకు అద్బుతమైన ఫీచర్స్ను అందుబాటలోకి తెచ్చేందుకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ను వాట్సాప్ ఇస్తుంది. ఈ అప్డేట్స్ కేవలం సదరు ఆండ్రాయిడ్, ఐవోఎస్ అపరేటింగ్ సిస్టమ్స్కు మాత్రమే మద్దతు ఇస్తాయి. పాత ఆపరేటింగ్ సిస్టం కల్గిన స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ సేవలు పనిచేయవు. తాజాగా మార్చి 31 (గురువారం) నుంచి పలు స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ పనిచేయదని సమాచారం. పాత Android, iOS, KaiOS వంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ను కల్గిన వాటిలో వాట్సాప్ సేవలు నిలిపివేయబడతాయి. వాట్సాప్ పనిచేయని స్మార్ట్ఫోన్ల జాబితాలో షావోమీ, శాంసంగ్, ఎల్జీ, మోటరోలా కంపెనీ స్మార్ట్ఫోన్స్ ఉన్నాయి. మార్చి 31 నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు ఆండ్రాయిడ్ ఫోన్లు : మీ ఫోన్లో ఆండ్రాయిడ్ 4.1 వెర్షన్ లేదా అంతకంటే కొత్త వెర్షన్ లేకపోతే, వాట్సాప్ పని చేయడం ఆగిపోతుంది. iOS ఫోన్లు : iOS 10 లేదా ఆ తర్వాత వెర్షన్లో ఉన్న iPhone వినియోగదారులు మాత్రమే తమ పరికరంలో వాట్సాప్ను ఉపయోగించగలరు. అంతకంటే తక్కువ వెర్షన్ ఉన్న యాపిల్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. KaiOS : మీ స్మార్ట్ఫోన్ KaiOS ప్లాట్ఫాంతో పనిచేస్తే... KaiOS వెర్షన్ 2.5 లేదా అంతకంటే కొత్త వెర్షన్ ఉంటేనే వాట్సాప్ పనిచేస్తోంది. వాట్సాప్ సపోర్ట్ చేయని స్మార్ట్ఫోన్ల జాబితా ఇదే..! ఎల్జీ LG Optimus F7, Optimus L3 II Dual, Optimus F5, Optimus L5 II, Optimus L5 II Dual, Optimus L3 II, Optimus L7 II Dual, Optimus L7 II, Optimus F6, LG Enact, Optimus L4 II Dual, Optimus F3, Optimus L4 II , Optimus L2 II, Optimus F3Q మోటరోలా Motorola Droid Razr షావోమీ Xiaomi HongMi, Mi2a, Mi2s, Redmi Note 4G , HongMi 1s హువావే Huawei Ascend D, Quad XL, Ascend D1, Quad XL , Ascend P1 S శాంసంగ్ Samsung Galaxy Trend Lite, Galaxy S3 mini, Galaxy Xcover 2, Galaxy Core చదవండి: భయపెట్టిన 3 అంకెలు..! ఎట్టకేలకు సెంచరీ కొట్టిన గూగుల్ క్రోమ్..! -
వచ్చేశాయి..షావోమీ నయా ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్స్...ఐఫోన్లలో వాడే టెక్నాలజీతో
ప్రపంచవ్యాప్తంగా షావోమీ 12 సిరీస్ స్మార్ట్ఫోన్లను ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ లాంచ్ చేసింది. షావోమీ 12, షావోమీ 12 ప్రో, షావోమీ 12ఎక్స్ మూడు స్మార్ట్ఫోన్స్ మొబైల్ లవర్స్కు అందుబాటులో ఉండనున్నాయి. గత ఏడాది డిసెంబర్లో షావోమీ 12 సిరీస్ స్మార్ట్ఫోన్స్ చైనాలో లాంచ్ అయ్యాయి. షావోమీ 12, షావోమీ 12 ప్రో స్నాప్డ్రాగన్ 8 జెన్ 1 ఎస్వోసీ ప్రాసెసర్తో రానున్నాయి, ఇక షావోమీ 12 ఎక్స్ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో వస్తుంది. ఈ స్మార్ట్ఫోన్స్ అన్నింటిలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్తో రానున్నాయి. ధర ఎంతంటే..? Xiaomi 12 (8జీబీ ర్యామ్ + 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్) వేరియంట్ కోసం ధర సుమారు 749 డాలర్లు (సుమారు రూ. 57,200) నుంచి ప్రారంభమవుతుంది. Xiaomi 12 Pro (8జీబీ ర్యామ్ + 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్) వేరియంట్ ధర 999 డాలర్ల (సుమారు రూ.76,300) నుంచి ప్రారంభమవుతుంది. దీనిలో యాపిల్ తన ప్రీమియం ఐఫోన్ మోడల్స్లో ఉపయోగించే తక్కువ-ఉష్ణోగ్రత పాలీక్రిస్టలైన్ ఆక్సైడ్ (LTPO) బ్యాక్ప్లేన్ టెక్నాలజీని కూడా కలిగి ఉంది. Xiaomi 12X (8జీబీ ర్యామ్ + 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్) వేరియంట్ ధర 649 డాలర్ల (సుమారు రూ. 49,600) నుంచి ప్రారంభమవుతుంది. మూడు స్మార్ట్ఫోన్లు బ్లూ, గ్రే, పర్పుల్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ఫోన్ ఇంచుమించు షావోమీ 12 ఫీచర్స్ను కల్గి ఉంది. షావోమీ 12 ఫీచర్స్ 6.28-అంగుళాల పూర్తి-HD+ (1,080x2,400 పిక్సెల్లు) AMOLED డిస్ప్లే క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 8 జనరల్ 1 ప్రాసెసర్ 50 ఎంపీ+13ఎంపీ+5ఎంపీ ప్రైమరీ సెన్సార్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా డాల్బీ విజన్ సపోర్ట్ డ్యూయల్ సిమ్ సపోర్ట్ 5జీ ఆధారిత స్మార్ట్ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ 4,500 ఎమ్ఎహెచ్ బ్యాటరీ USB టైప్-C పోర్ట్ షావోమీ 12 ప్రో ఫీచర్స్ 6.73-అంగుళాల WQHD+ (1,440x3,200 పిక్సెల్లు) AMOLED డిస్ప్లే క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 8 జనరల్ 1 ప్రాసెసర్ 50 ఎంపీ+50ఎంపీ+5ఎంపీ ప్రైమరీ సెన్సార్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా డాల్బీ విజన్ సపోర్ట్ డ్యూయల్ సిమ్ సపోర్ట్ 5జీ ఆధారిత స్మార్ట్ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ 10W రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ 4,600 ఎమ్ఎహెచ్ బ్యాటరీ USB టైప్-C పోర్ట్ చదవండి: ఐఫోన్కు పోటీగా సోనీ నుంచి అదిరిపోయే స్మార్ట్ఫోన్..! అది కూడా బడ్జెట్ రేంజ్లో -
అదిరిపోయే ఫీచర్లతో,రెడ్మీ నోట్ 11 ప్రో సిరీస్ స్మార్ట్ ఫోన్లు..ధర ఎంతంటే?
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ రెడ్ మీ సిరీస్లో రెండు స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. భారత్ వేదికగా జరిగిన లాంచ్ ఈవెంట్లో టెక్ ప్రియుల్ని అట్రాక్ట్ చేస్తూ రెడ్మీ నోట్ 11 ప్రో సిరీస్లో 5జీ రెడ్మీ నోట్ 11 ప్రో+, 4జీ రెడ్ మీ నోట్ ప్రో స్మార్ట్ ఫోన్లను మార్కెట్కు పరిచయం చేసింది. 4జీ రెడ్ మీ నోట్ 11 ప్రో , 5జీ నోట్ 11 ప్రో ప్లస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు రెడ్ మీ నోట్ 11 ప్రో 4జీ, నోటీ 11 ప్రో ప్లస్ 5జీ ఈ రెండు స్మార్ట్ ఫోన్లలో 6.67 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లే,120 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్, 16ఎంపీ సెల్ఫీ కెమెరాకు పంచ్ హోల్ కటౌవుట్, 180 ఎంపీ మెయిన్ కెమెరా, 8ఎంపీ అల్ట్రా వైడ్ స్నాపర్స్, 2ఎంపీ మైక్రో హెల్పర్, 2ఎంపీ డెప్త్ మాడ్యుల్స్ ఉన్నాయి. 5జీ షావోమీ రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ 5జీ రెడ్మీ నోట్ 11 ప్రో+ 5జీ స్మార్ట్ఫోన్ లేటెస్ట్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్తో రిలీజైతే.. 4జీ రెడ్మీ నోట్ 11 ప్రో మాత్రం ఇటీవల పాపులర్ అయిన మీడియాటెక్ హీలియో జీ96 గేమింగ్ ప్రాసెసర్తో రిలీజైంది. 5జీ షావోమీ రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ స్టీల్త్ బ్లాక్, ఫాంటమ్ వైట్, మిరాజ్ బ్లూ కలర్ వేరియంట్లలో లభ్యమవుతుంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,999 నుండి ప్రారంభమవుతుంది. అయితే టాప్ ఎండ్ 8జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ మోడల్ ధర రూ.24,999 వరకు ఉంటుంది. ఇక ఈ ఫోన్ షావోమీ ఆన్లైన్, ఆఫ్లైన్ ప్లాట్ఫారమ్లతో పాటు అమెజాన్ ఇండియా ద్వారా మార్చి 15నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. 4జీ రెడ్ మీ నోట్ 11 4జీ రెడ్ మీ నోట్ 11 ప్రో స్టీల్త్ బ్లాక్, ఫాంటమ్ వైట్, స్టార్ బ్లూ కలర్ వేరియంట్లలో లభ్యమవుతుంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ ధర రూ. 17,999 నుంచి ప్రారంభం కానుండగా.. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ మోడల్ ధర రూ.19,999గా ఉంది. ఈ ఫోన్ అమ్మకాలు మార్చి 23 నుంచి ప్రారంభం కానున్నాయి. చదవండి: ఫ్లిప్ కార్ట్లో దిమ్మతిరిగే ఆఫర్లు, వాటిపై ఏకంగా 80శాతం డిస్కౌంట్లు!! -
వచ్చేశాయి..రెడ్మీ నోట్ 11 స్మార్ట్ఫోన్స్..! బడ్జెట్ ధరలో అద్బుతమైన ఫీచర్స్తో
ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ భారత మార్కెట్లలోకి కొత్త రెడ్మీ నోట్ సిరీస్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. గతేడాది రెడ్మీ నోట్ 10 ప్రో, రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ మోడల్స్కు భారీ ఆదరణ వచ్చింది. రెడ్మీ నోట్ 11 సిరీస్లో ఇప్పటికే రెడ్మీ నోట్ 11టీ 5జీ స్మార్ట్ఫోన్ రిలీజ్ కాగా, రెడ్మీ నోట్ 11, రెడ్మీ నోట్ 11ఎస్ మోడల్స్ను లాంచ్ చేసింది. ఈ రెండ స్మార్ట్ఫోన్స్ బడ్జెట్ ధరలో ఉండేలా రెడ్మీ రూపొందించింది. ఈ స్మార్ట్ఫోన్స్ రెడ్మీ నోట్ 11 మోటో జీ51, రియల్మీ 8 లాంటి మోడల్స్కు గట్టిపోటీ ఇవ్వనుంది. ధర ఎంతంటే..! రెడ్మీ నోట్ 11 సిరీస్ స్మార్ట్ఫోన్స్ మూడు స్టోరేజ్ వేరియంట్లలో రానున్నాయి. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,499 ఉండగా, 6జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499. ఇక హైఎండ్ వేరియంట్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.15,999గా ఉంది. హొరైజన్ బ్లూ, స్పేస్ బ్లాక్, స్టార్బర్స్ట్ వైట్ కలర్స్లో కొనొచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1,000 తక్షణ డిస్కౌంట్ లభించనుంది. ఈ స్మార్ట్ఫోన్స్ సేల్ ఫిబ్రవరి 11న సేల్ ప్రారంభం కానుంది. అమెజాన్తో పాటు ఎంఐ ఆన్లైన్ స్టోర్, ఎంఐ హోమ్ స్టోర్, ఎంఐ స్టూడియో, రీటైల్ ఔట్లెట్స్లో కొనుగోలు చేయవచ్చును. రెడ్మీ నోట్ 11 స్పెసిఫికేషన్స్ 6.43 అంగుళాల పుల్ హెచ్డీ+ అమొలెడ్ డిస్ప్లే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టమ్ 50 ఎంపీ+ 8 ఎంపీ+ 2 ఎంపీ+ 2 ఎంపీ రియర్ క్వాడ్ కెమెరా(రెడ్ మీ 11 ఎస్ స్మార్ట్ఫోన్లో 108 ఎంపీ రియర్ కెమెరా) 13 ఎంపీ ఫ్రంట్ కెమెరా 5,000ఎంఏహెచ్ బ్యాటరీ 33వాట్ ప్రో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 4జీ ఎల్టీఈ సపోర్ట్ బ్లూటూత్ 5.0 యూఎస్బీ టైప్ సీ సపోర్ట్ చదవండి: గూగుల్ క్రోమ్ యూజర్లకు పెను ప్రమాదం..! హెచ్చరికలను జారీ చేసిన కేంద్రం..! -
వచ్చింది మూడేళ్లే..! 84 ఏళ్ల కంపెనీకి గట్టిషాకిచ్చిన రియల్మీ..!
భారత మార్కెట్లోకి అడుగుపెట్టి జస్ట్ మూడేళ్లయ్యింది. బడ్జెట్ ఫ్రెండ్లీ, ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్స్ తక్కువ ధరకే అందిస్తూ రియల్మీ భారత్లో మరోసారి సత్తా చాటింది. క్యూ4లో నంబర్ 2 భారత్లో మొబైల్ సేల్స్కి సంబంధించి మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ 2021గాను క్యూ4 ఫలితాలను విడుదల చేసింది. ఇందులో 17 శాతం మార్కెట్ వాటాతో రియల్మీ శాంసంగ్ని వెనక్కి నెట్టి ఇండియాలో అత్యధిక మార్కెట్ రెండో కంపెనీగా రికార్డు సృష్టించింది. శాంసంగ్ నుంచి కొత్త మోడళ్ల రాక తగ్గిపోవడంతో కేవలం 16 శాతం మార్కెట్కే పరిమితమై మూడో స్థానంలో నిలిచింది. షావోమి నెంబర్ వన్..! ఇక భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లలో షావోమీ మరోసారి నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. గత కొన్నేళ్లుగా ఇండియా స్మార్ట్ఫోన్ మార్కెట్లో షావోమి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తోంది. భారత మార్కెట్లో ఒక వెలుగు వెలిగినా శాంసంగ్కు షావోమి భారీగానే గండి కొట్టింది. 2021 క్యూ4లో షావోమీ ఏకంగా 24 శాతం మార్కెట్ వాటాతో నంబర్ వన్గా నిలిచింది. 2021లో టాప్ షావోమీ..! 2021గాను ఒవరాల్ చూసుకుంటే షావోమీ నంబర్ వన్ స్థానంలో నిలిచింది. షావోమీ 24 శాతం వాటాను ఆక్రమించింది. Mi 11 సిరీస్ అమ్మకాలతో కంపెనీ ఆదాయంలో 258 శాతం పెరుగుదల కన్పించింది. ఇక రెండో స్థానంలో శాంసంగ్ నిలిచింది. శాంసంగ్ 2021లో 8 శాతం క్షీణతను నమోదుచేసింది. రియల్మీ మూడో స్థానంలో నిలవగా, భారత్లో అత్యంత చురుకైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్ రియల్మీ అవతరించింది. Vivo, Oppo నాలుగు, ఐదవ స్థానాలను కార్నర్ చేయగలిగాయి. చదవండి: గంటకు 19 వేలకుపైగా స్మార్ట్ఫోన్స్ అమ్మకాలు..! ఇండియన్స్ ఫేవరెట్ బ్రాండ్ అదే..! -
గంటకు 19 వేలకుపైగా స్మార్ట్ఫోన్స్ అమ్మకాలు..! ఇండియన్స్ ఫేవరెట్ బ్రాండ్ అదే..!
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 అన్ని రంగాలపై భారీ ప్రభావాన్ని చూపింది. ఆటోమొబైల్, సర్వీస్ సెక్టార్స్ భారీ నష్టాలను చవిచూశాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రేరిత బాధల నుంచి స్మార్ట్ఫోన్ ఇండస్ట్రీ సురక్షితంగా తప్పించుకుంది. 2021లో భారత్ స్మార్ట్ఫోన్ మార్కెట్ సుమారు రెండు లక్షల కోట్ల విలువైన స్మార్ట్ఫోన్ అమ్మకాలను ఆయా స్మార్ట్ఫోన్ కంపెనీలు జరిపినట్లు తెలుస్తోంది. చిప్స్ కొరత ఉన్నప్పటీకి..! ప్రపంచవ్యాప్తంగా పలు దిగ్గజ స్మార్ట్ఫోన్ కంపెనీలకు చిప్స్ కొరత తీవ్రంగా వేధించింది. చిప్స్ కొరత ఉన్పప్పటీకి భారత స్మార్ట్ఫోన్ మార్కెట్ ఆదాయం 38 బిలియన్ డాలర్లను అధిగమించింది. 2021లో దాదాపు రూ. 2,83,666 కోట్లకు చేరుకుంది. 2020తో పోలిస్తే 27 శాతం అధికంగా స్మార్ట్ఫోన్ అమ్మకాలు జరిగాయి. 2021లో భారతీయులు ప్రతి గంటకు 19,406 స్మార్ట్ఫోన్స్ను కొనుగోలు చేశారు. మొత్తంగా 16 కోట్లకు పైగా స్మార్ట్ఫోన్ అమ్మకాలు జరిగాయని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది. ఇది భారత స్మార్ట్ఫోన్ మార్కెట్ ఇప్పటివరకు చూసిన అత్యధిక షిప్మెంట్. ఇదిలా ఉండగా కాంపోనెంట్ కొరత కారణంగా డిసెంబర్ త్రైమాసికంలో ఎగుమతులు మందగించడం విశేషం. టాప్ బ్రాండ్ అదే..! భారత స్మార్ట్ఫోన్ ఇండస్ట్రీలో 2021గాను షావోమీ బ్రాండ్ టాప్ ప్లేస్లో నిలిచింది. షావోమీ 24 శాతం వాటాను ఆక్రమించింది. Mi 11 సిరీస్ అమ్మకాలతో కంపెనీ ఆదాయంలో 258 శాతం పెరుగుదల కన్పించింది. అయినప్పటికీ, కాంపోనెంట్స్ సరఫరాలో పరిమితుల కారణంగా కంపెనీ నాల్గవ త్రైమాసికంలో ఎగుమతులలో మందగమనాన్ని ఎదుర్కొంది. ఇక రెండో స్థానంలో శాంసంగ్ నిలిచింది. శాంసంగ్ 2021లో 8 శాతం క్షీణతను నమోదుచేసింది. రూ. 20,000 నుంచి రూ. 45,000 సెగ్మెంట్లోని 5G స్మార్ట్ఫోన్ల ద్వారా మార్కెట్లో 18 శాతం వాటాను పొందింది. శామ్సంగ్కు ఇది శుభవార్త అయినప్పటికీ, ఇది కూడా సరఫరా గొలుసు అంతరాయాలను ఎదుర్కోవలసి వచ్చింది. శాంసంగ్ ఫోల్డబుల్ విభాగంలో అగ్రగామిగా నిలిచింది. ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్లలో 2021గాను 388 శాతం వృద్ధిని శాంసంగ్ సాధించింది. రియల్మీ మూడో స్థానంలో నిలవగా, భారత్లో అత్యంత చురుకైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్ రియల్మీ అవతరించింది. Vivo, Oppo నాలుగు, ఐదవ స్థానాలను కార్నర్ చేయగలిగాయి. వివో 2021లో 19 శాతం వాటాతో టాప్ 5G స్మార్ట్ఫోన్ బ్రాండ్గా అవతరించిగా...ఒప్పో 6 శాతం వృద్ధిని కనబరిచింది. ఇక యాపిల్ 2021గాను 108 శాతం వృద్దిని నమోదుచేసింది. చదవండి: చిప్ షార్టేజ్ సంక్షోభం.. అయినా 583.5 బిలియన్ డాలర్ల షాకింగ్ బిజినెస్తో హిస్టరీ! -
అదిరిపోయే కెమెరా, బ్యాటరీ ఫీచర్లు.. షావోమి నుంచి కొత్త ఫోన్
Xiaomi Note 11 Series Specifications: ఇండియాలో నంబర్ వన్ బ్రాండ్గా చెలరేగిపోతున్న షావోమి నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి రాబోతుంది. షావోమిలో సక్సెస్ఫుల్ మోడల్గా పేరున్న నోట్ నుంచి ఈ ఫోన్ రానుంది. షావోమిలో రెడ్మీ సిరీస్ తర్వాత ఎక్కువగా సక్సెస్ అయిన మోడల్ నోట్. వివిధ రకాల మోడళ్లను షావోమి తీసుకువచ్చినా నోట్ సిరీస్ మార్కెట్లో చెదరని ముద్ర వేసింది. అందుకే గత ఐదున్నరేళ్లుగా నోట్ సిరీస్ని క్రమం తప్పకుండా షావోమి కొనసాగిస్తోంది. ఈ పరంపరలో తాజాగా నోట్ 11 సిరీస్ని ఇండియాలోకి తేబోతున్నట్టు షావోమి ప్రకటించింది. ఫ్రిబవరిలో ఈ కామర్స్ సైట్స్లో ఈ ఫోన్ అమ్మకానికి రానుంది. వివిధ వేరియంట్లు, ఫీచర్లను బట్టి ఈ ఫోన్ ప్రైస్ రేంజ్ రూ.13,400ల నుంచి రూ.22,400 వరకు ఉంది. షావోమి నోట్ 11 సిరీస్ ఫీచర్లు - కెమెరా 50/104 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా (రియర్) - 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33/67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ - స్ల్పాష్ ప్రూఫ్ 53 సర్టిఫికేట్, - 90/120 హెర్జ్, అమోల్డ్ డిస్ప్లే - మీడియాటెక్ హెలియో జీ 96 చిప్ (5జీ ఫోన్కి స్నాప్డ్రాగన్ 695 చిప్) - నోట్ 11 సిరీస్లో నోట్ 11 ఎస్, నోట్ 11 ప్రో, నోట్11 ప్రో5జీ వేరియంట్లు ఉన్నాయి - ప్రో, ఎస్ వేరియంట్లలో హైఎండ్ ఫీచర్లు లభిస్తాయి. - 5జీ నెట్వర్క్ సపోర్ట్ చేస్తుంది - డ్యూయల్ స్పీకర్స్, 3.5 ఎంఎం ఆడియో జాక్ - 1 టీబీ వరకు మెమెరీ పెంచుకునే అవకాశం చదవండి: చైనా మొబైల్ కంపెనీలకు యాపిల్ షాక్! -
వచ్చేసింది..! ఇండియన్ ఫాస్టెస్ట్ ఛార్జింగ్ స్మార్ట్ఫోన్..! కొనుగోలుపై భారీ తగ్గింపు..!
ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ భారత్లో ఫాస్టెస్ట్ హైపర్ ఛార్జింగ్ సిరీస్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లలో షావోమీ 11ఐ హైపర్ ఛార్జ్, షావోమీ 11ఐ స్మార్ట్ఫోన్లను గురువారం రోజున ప్రారంభించింది. ఈ ఏడాది ప్రారంభంలో చైనాలో లాంచ్ఐనా రెడ్మీ నోట్ 11 ప్రో+ స్మార్ట్ఫోన్కు రీబ్రాండెడ్గా Xiaomi 11i హైపర్ఛార్జ్ స్మార్ట్ఫోన్గా వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో Xiaomi 11i హైపర్ఛార్జ్ స్మార్ట్ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయనుంది. Xiaomi 11i 5జీ స్మార్ట్ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రానుంది. 15 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్..! Xiaomi 11i హైపర్ఛార్జ్ స్మార్ట్ఫోన్ బ్యాటరీ కేవలం 15 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ అవుతోందని కంపెనీ వెల్లడించింది. Xiaomi 11i హైపర్ఛార్జ్, 6GB RAM + 128GB, 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. మరో స్మార్ట్ఫోన్ Xiaomi 11i 5జీ కూడా 6GB RAM + 128GB, 8GB RAM + 128GB వేరియంట్లలో రానుంది. కామో గ్రీన్, స్టెల్త్ బ్లాక్ కలర్స్ వేరియంట్స్తో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. ధర ఎంతంటే..! చైనా మార్కెట్లో Redmi 11 ప్రో + స్మార్ట్ఫోన్ భారత్లో రీబ్రాండెడ్ స్మార్ట్ఫోన్గా రానుంది. Xiaomi 11i హైపర్ఛార్జ్ స్మార్ట్ఫోన్ 6GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర 26,999కాగా, 8GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 28,999 గా ఉంది. ఇక 67W సపోర్ట్ Xiaomi 11i 5జీ స్మార్ట్ఫోన్ 8GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 26, 999గా, 6GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24, 999 గా ఉంది. కాగా న్యూ ఇయర్ ఆఫర్ కింద ఎస్బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 1500 తగ్గింపు, రూ. 2, 500 క్యాష్ బ్యాక్ను షావోమీ అందిస్తోంది. ఈ రెండు స్మార్ట్ఫోన్స్ జనవరి 12 నుంచి ఫ్లిప్కార్ట్, ఎంఐ.కామ్, ఎంఐ హోమ్ స్టోర్స్, ఆఫ్లైన్ రిటైల్ స్టోర్స్లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. Xiaomi 11i హైపర్ఛార్జ్ 5జీ ఫీచర్స్ 6.67-అంగుళాల AMOLED డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్ 8GB ర్యామ్+ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 920 SoC 108-ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 16-ఎంపీ సెల్ఫీ కెమెరా డ్యూయల్ జేబీఎల్-ట్యూన్డ్ స్టీరియో స్పీకర్స్, 4,500mAh బ్యాటరీ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 5G కనెక్టివిటీ యూఎస్బీ టైప్ సీ సపోర్ట్ చదవండి: ఇండియన్ ఫస్ట్ ఆటోఫోకస్డ్ ఫ్రంట్ కెమెరా..ఏరోస్పేస్ గ్రేడ్తో స్మార్ట్ఫోన్...! -
పెద్ద చిక్కుల్లో పడిన షావోమి ఇండియా..!
ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ షావోమి టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పెద్ద చిక్కుల్లో పడింది. షావోమి ఇండియా కస్టమ్స్ సుంకాన్ని ఎగవేస్తోందని వచ్చిన సమాచారం ఆధారంగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) షావోమి, దాని కాంట్రాక్టు ఉత్పత్తిదారులపై దర్యాప్తును ప్రారంభించింది. ఈ దర్యాప్తు సందర్భంగా డీఆర్ఐ దేశవ్యాప్తంగా ఉన్న షావోమి ఇండియా కార్యాలయాల్లో సోదాలను నిర్వహించింది. ఈ సోదాల్లో భాగంగా ఒప్పంద నిబంధన ప్రకారం క్వాల్కామ్ యూఎస్ఏ, బీజింగ్ షావోమి మొబైల్స్ సాఫ్ట్వేర్ కంపెనీ లిమిటెడ్కు షావోమి ఇండియా రాయల్టీ, లైసెన్స్ ఫీజుల రూపంలో డబ్బులు చెల్లిస్తున్నట్టు గుర్తించింది. భారత్లో ఎంఐ బ్రాండ్తో షావోమి ఇండియా మొబైల్స్ను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఫోన్లలో కొన్నింటిని విదేశాల నుంచి షావోమి ఇండియా దిగుమతి చేసుకుంటుంది. లేదంటే విడి పరికాలను ఒప్పంద తయారీదారుల నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడే అసెంబుల్డ్ చేస్తుంది. దేశంలోని స్మార్ట్ఫోన్ విపణిలో షావోమికి గణనీయమైన వాటానే ఉంది. విలువను తగ్గించి షావోమి ఇండియా కస్టమ్స్ సుంకం ఎగవేతకు పాల్పడినట్టు గుర్తించామని డీఆర్ఐ తెలిపింది. సంబంధిత కంపెనీ, ఒప్పంద తయారీ సంస్థల్లో పరిశోధన చేపట్టామని పేర్కొంది. 'షావోమి ఇండియా, సంబంధిత తయారీ కంపెనీల్లోని కీలక ఉద్యోగుల స్టేట్మెంట్లను రికార్డు చేశాం. షావోమి కంపెనీ డైరెక్టర్ ఒకరు రాయల్టీ చెల్లించినట్టు ధ్రువీకరించారు' అని డీఆర్ఐ ప్రకటించింది. రాయల్టీ, లైసెన్స్ ఫీజు చెల్లించడమే కాకుండా ఒప్పంద తయారీదారుల నుంచి దిగుమతి చేసుకున్న ఉత్పత్తి లావాదేవీల విలువను జోడించలేదని వెల్లడించింది. దీంతో షావోమి ఇండియా కస్టమ్స్ సుంకం ఎగవేసినట్టు గుర్తించామని పేర్కొంది. ఇలా చేయడం కస్టమ్స్ చట్టం-1962 కస్టమ్స్ వాల్యుయేషన్ నిబంధనలను, 2007లోని సెక్షన్ 14ను ఉల్లంఘించడమే అని తెలిపింది. 'డీఆర్ఐ దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత 1962, కస్టమ్స్ చట్టం ప్రకారం.. షావోమి టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 01-4-2017 నుంచి 30-06-2020 కాలానికి రూ.653 కోట్లు రికవరీకి డిమాండ్ చేస్తూ 3 షోకాజ్ నోటీసులు జారీ చేశాం' అని డీఆర్ఐ తెలిపింది. (చదవండి: ఆకర్షణీయమైన లుక్స్తో సరికొత్తగా రానున్న మారుతి సుజుకీ బాలెనో..!) -
సేల్స్ బీభత్సం..! 5 నిమిషాల్లో వేలకోట్ల విలువైన ఫోన్లు అమ్ముడయ్యాయి!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ గత వారం విడుదల చేసిన ఓ స్మార్ట్ ఫోన్ దెబ్బకు 5 నిమిషాల్లో వేలకోట్ల విలువైన స్మార్ట్ ఫోన్ అమ్మకాలు జరిగినట్లు టెక్ బ్లాగ్లు పలు రిపోర్ట్లను వెలుగులోకి తెచ్చాయి. టెక్ బ్లాగ్ గిజ్మో చైనా కథనం ప్రకారం.. న్యు ఇయర్ సెంటిమెంట్ను క్యాష్ చేసుకునేందుకు చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ కంపెనీ షావోమీ డిసెంబర్ 28న షావోమీ12 సిరీస్ స్మార్ట్ ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది.ఆఫ్లైన్, ఆన్లైన్ వేదికగా విడుదల చేసిన 5 నిమిషాల్లోనే సుమారు 1.8 బిలియన్ యువాన్. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం.. రూ.2108 కోట్ల విలువైన స్మార్ట్ ఫోన్లను అమ్మినట్లు గిజ్మో చైనా తన కథనంలో పేర్కొంది. స్ట్రాటజీ వర్కౌట్ అయ్యింది న్యు ఇయర్ సందర్భంగా షావోమీ సంస్థ చైనాలో తొలిసారి కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ షావోమీ 12 సిరీస్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. షావోమీ 12 సిరీస్లోని బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లు షావోమీ 12, షావోమీ 12ప్రో ఫోన్లను విడుదల చేసింది. బడ్జెట్ తక్కువగా ఉండడం, అడ్వాన్స్ ఫీచర్లు ఉండడంతో పాటు న్యుఇయర్ సెంటిమెంట్ షావోమీకి కలిసొచ్చింది. దీంతో నిమిషాల వ్యవధిలో భారీ సేల్స్ జరిగినట్లు టెక్ బ్లాగ్ గిజ్మో చైనా తన కథనంలో హైలెట్ చేసింది. షావోమీ 12 స్పెసిఫికేషన్లు షావోమీ 12 స్మార్ట్ ఫోన్ 6.28 అంగుళాలు, 2కే అమోలెడ్ డిస్ప్లే, 4,500ఏఎంహెచ్ బ్యాటరీ,120హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 1 సీపీయూతో 12జీబీ ర్యామ్ 256 ఇంటర్నల్ స్టోరేజ్ సౌకర్యం ఉంది. ఇక ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రేర్ కెమెరా, 50 ఎంపీ సోనీ ఐఎక్స్ 766 సెన్సార్లు, 13ఎంపీ ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5ఎంపీ టెలిఫోటో లెన్స్, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. 67వాల్ట్ల ఫాస్ట్ ఛార్జింగ్, 50వాల్ట్ల వైర్లెస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. షావోమీ 12 ప్రో స్పెసిఫికేషన్లు షావోమీ 12 ప్రో 6.73 అంగుళాల 2కే అమోలెడ్ డిస్ప్లే, 120హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్, ఫంచ్ హోల్ కట్ అవుట్, ఆండ్రాయిడ్ 12ఓఎస్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120వాల్ట్ల ఛార్జింగ్ సపోర్ట్, ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రేర్ కెమెరా, 50ఎంపీ మెయిన్ కెమెరా, 50ఎంపీ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50ఎంపీ టెలిఫోటో లెన్స్, 32ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమరాలు ఉన్నాయి. చదవండి: షావోమీ 'నెక్ట్స్ జనరేషన్ రేసర్' మామూలుగా ఉండదు, ఫీచర్లు అదిరిపోతాయ్..! -
షావోమీ, ఒప్పో కంపెనీలకు ఐటీ శాఖ భారీ జరిమానా..?
న్యూఢిల్లీ: ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీదారులకు షావోమీ, ఒప్పో కంపెనీలకు ఐటీ శాఖ భారీ షాక్ ఇచ్చింది. ఐటీ చట్టాలను ఉల్లంఘించినందుకు గాను షావోమీ, ఒప్పో కంపెనీలపై ₹1,000 కోట్లకు పైగా జరిమానాను విధించవచ్చని ఆదాయపు పన్ను శాఖ నేడు తెలిపింది. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక, తమిళనాడు, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, బీహార్, రాజస్థాన్, ఢిల్లీలోని షావోమీ, ఒప్పో, వన్ ప్లస్ కార్యాలయాలలో ఆదాయపు పన్ను(IT) శాఖ డిసెంబర్ 21న తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సంస్థల కార్యాలయాల్లో తనిఖీల చేసే సమయంలో ఆ కంపెనీ అధికారులను ఐటీ అధికారులు ప్రశ్నించారు. ఆ కంపెనీ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. షావోమీ, ఒప్పో కంపెనీలు రాయల్టీ రూపంలో విదేశాలలో ఉన్న వాటి గ్రూపు కంపెనీలకు ₹5,500 కోట్లకు పైగా ఎక్కువ మొత్తంలో చెల్లింపులు చేసినట్లు పన్ను శాఖ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపింది. "తమ అనుబంధ సంస్థలతో లావాదేవీలు చేసేటప్పుడు ఆదాయపు పన్ను చట్టం, 1961 సూచించిన ఆదేశాలను ఈ కంపెనీలు పాటించలేదు. అందుకే, ఈ కంపెనీల మీద ₹1,000 కోట్లకు పైగా జరిమానాను విధించవచ్చని" ఐటీ శాఖ ప్రకటనలో తెలిపింది. (చదవండి: పెన్షన్ తీసుకునే వారికి కేంద్రం శుభవార్త..!) -
హల్చల్ చేస్తోన్న షావోమీ నయా స్మార్ట్ఫోన్..! ధర ఎంతంటే..?
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ నుంచి సరికొత్త ఫ్లాగ్షిప్ సిరీస్ స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి లాంచ్ కానుంది. రిలీజ్ కాకముందే షావోమీ 12 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ స్పెషిఫికేషన్లు, ధర నెటింట్లో హల్చల్ చేస్తున్నాయి. షావోమీ 12, షావోమీ 12ఎక్స్, షావోమీ 12 ప్రొ, షావోమీ 12 అల్ట్రా ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లు డిసెంబర్ 28ను చైనాలో కన్పించాయి. నేడు షావోమీ 12 సిరీస్ స్మార్ట్ఫోన్స్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. స్మార్ట్ఫోన్స్తో పాటుగా షావోమీ ట్రూ వైరెలెస్ ఇయర్ఫోన్స్(టీడబ్ల్యూఎస్)3 కూడా లాంచ్ అవకాశం ఉంది. టిప్స్టర్ ఇషాన్ అగర్వాల్ రాబోయే షావోమీ 12 సిరీస్ స్మార్ట్ఫోన్స్ ధరలను ట్విటర్లో పంచుకున్నారు . ఏది ఏమైనప్పటికీ, రాబోయే షావోమీ ఫ్లాగ్షిప్ సిరీస్ 11 కంటే కొంచెం ఖరీదైనదిగా ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. షావోమీ 12, షావోమీ 12ఎక్స్, షావోమీ 12 ప్రో ధర 8జీబీ + 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ షావోమీ 12 సుమారు చైనాలో 4,299 యువాన్లు (దాదాపు రూ. 50,500)గా ఉంటుందని అగర్వాల్ పేర్కొన్నారు. 8జీబీ + 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర 4,599 యువాన్లు (దాదాపు రూ. 54,000)గా, అయితే 12జీబీ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,999 (దాదాపు రూ. 58,800)గా ఉన్నట్లు వెల్లడించారు షావోమీ 12ఎక్స్ 8జీబీ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,499 యువాన్లు (దాదాపు రూ. 41,100)గా, 8జీబీ + 256ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర 3,799 యువాన్లు (దాదాపు రూ. 44,700)గా ఉంది. అగర్వాల్ ట్వీట్ ప్రకారం, షావోమీ 12 ప్రో ధరలు 8జీబీ + 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ 4,999 యువాన్లుగా (సుమారు రూ. 58,800)గా ఉంది. మరోవైపు, 8జీబీ + 256 ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర 5,299 యువాన్లు (దాదాపు రూ. 62,300)గా, 12జీబీ + 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ 5,699 యువాన్లు (దాదాపు రూ. 67,000)గా ఉంది. షావోమీ టీడబ్ల్యూఎస్ ఇయర్ఫోన్స్ 3 ధర షావోమీ 12 సిరీస్ స్మార్ట్ఫోన్స్తో పాటుగా, షావోమీ ట్రూ వైర్లెస్ ఇయర్ఫోన్స్ 3 ధర 499 యువాన్లుగా (సుమారు రూ. 5,900)గా ఉంటుందని అగర్వాల్ పేర్కొన్నారు. Exclusive: #Xiaomi12 Series China Prices [Unconfirmed] Xiaomi 12X 8+128: ¥3499 ($550/₹41K) 8+256: ¥3799 12+256: ¥3999 Xiaomi 12 8+128: ¥4299 ($675/₹50.5K) 8+256: ¥4599 12+256: ¥4999 Xiaomi 12 Pro 8+128: ¥4999 ($785/₹58.8K) 8+256: ¥5299 12+256: ¥5699 Very interesting. 🤔 pic.twitter.com/XCGcj0DqEH — Ishan Agarwal (@ishanagarwal24) December 27, 2021 షావోమీ 12 ఫీచర్స్ ఫుల్-హెచ్ డి+(1,920ఎక్స్1,080 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్ ప్లే క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 8 జనరల్ 1 ప్రాసెసర్ డ్యూయల్-ఎల్ఈడి ఫ్లాష్ లైట్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా సెంట్రల్ అలైన్డ్ హోల్ పంచ్ సెల్ఫీ కెమెరా స్క్రీన్ ఇన్ బిల్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ డ్యూయల్ సిమ్ సపోర్ట్ 5జీ ఆధారిత స్మార్ట్ఫోన్ 67డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ చదవండి: పిచ్చెక్కిస్తున్న షావోమీ 12 స్మార్ట్ఫోన్ డిజైన్, ఫీచర్స్..! -
అమెజాన్ ఇయర్ ఎండ్ సేల్: స్మార్ట్ఫోన్లపై అమెజాన్ అందిస్తోన్న టాప్ డీల్స్ ఇవే..!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇయర్ ఎండ్ సేల్ను ప్రారంభించింది. స్మార్ట్ఫోన్స్, స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపును అమెజాన్ అందిస్తోంది. ఈ సేల్ డిసెంబర్ 31 వరకు కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. రెడ్మీ 9ఏ, రెడ్మీ నోట్ 10ఎస్, షావోమీ 11 లైట్ ఎన్ఈ 5G, శాంసంగ్ గెలాక్సీ ఎమ్ సిరీస్ స్మార్ట్ఫోన్స్, శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీ, రియల్మీ నార్జో 50ఏ, వన్ప్లస్ నార్డ్ సీఈ వంటి స్మార్ట్ఫోన్స్తో పాటుగా ప్రముఖ స్మార్ట్ఫోన్లపై కొనుగోలుదారులు 40 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. ఆయా స్మార్ట్ఫోన్ల కొనుగోలుపై బ్యాంకు ఆఫర్లను కూడా అమెజాన్ అందిస్తోంది. అమెజాన్ పే, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులపై అదనంగా రూ. 1,500 వరకు తగ్గింపు రానుంది. అంతేకాకుండా నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. ప్రైమ్ మెంబర్స్కు 6-నెలల ఉచిత స్క్రీన్ రీప్లేస్మెంట్, అదనంగా 3 నెలల నో కాస్ట్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. స్మార్ట్ఫోన్లపై అమెజాన్ అందిస్తోన్న టాప్ డీల్స్ ఇవే..! ► వన్ప్లస్ నార్డ్ 2 5G 8జీబీ ర్యామ్ వేరియంట్ రూ. 29,999కు రానుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లపై కొనుగోలుదారులు రూ. 2000 వరకు ఫ్లాట్ తగ్గింపును పొందవచ్చు. ఈ స్మార్ట్ఫోన్పై పాత స్మార్ట్ఫోన్ ఎక్స్ఛేంజ్ ద్వారా బోనస్గా రూ. 16,950 వరకు అమెజాన్ అందిస్తోంది. ► వన్ప్లస్ నార్డ్ సీఈ 5జీ రూ. 24,999కు రానుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లపై కొనుగోలుదారులు రూ.1500 వరకు ఫ్లాట్ తగ్గింపును పొందవచ్చు. ఈ స్మార్ట్ఫోన్పై రూ. 16,950 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ అమెజాన్ అందిస్తోంది. ► రెడ్మీ నోట్ 10ఎస్ రూ. 14,999కు రానుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లపై కస్టమర్లు రూ. 1000 వరకు ఫ్లాట్ తగ్గింపును పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ. 13,950 వరకు తగ్గింపు కూడా రానుంది. ► షావోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ స్మార్ట్ఫోన్ను ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్లతో కొనుగోలు చేస్తే రూ. 2,500 తక్షణ తగ్గింపు రానుంది. దీంతో రూ. 24,500కు ఈ స్మార్ట్ఫోన్ను పొందవచ్చును. స్మార్ట్ఫోన్ ఎక్స్ఛేంజ్పై రూ. 19,950 కూడా రానుంది. చదవండి: ఐఫోన్ కొనేవారికి శుభవార్త.. రూ.18 వేలు డిస్కౌంట్..! -
షిప్మెంట్లో దుమ్ము లేపుతుంది, షావోమీకి షాకిచ్చిన 5జీ స్మార్ట్ ఫోన్ ఇదే!
ఈ ఏడాది క్యూ3 ఫలితాల్లో 5జీ స్మార్ట్ ఫోన్ అమ్మకాలు దుమ్మురేపుతున్నాయి. తాజాగా 5జీ స్మార్ట్ ఫోన్ షిప్మెంట్పై 'స్ట్రాటజీ అనలిటిక్స్' సంస్థ రిపోర్ట్ను విడుదల చేసింది. యాపిల్ సంస్థ ప్రపంచంలోనే షిప్మెంట్ విభాగంలో అగ్రస్థానంలో నిలవగా షియోమీ రెండో స్థానంలో, శాంసంగ్ మూడో స్థానంలో నిలిచినట్లు తెలిపింది. ప్రస్తుతం 5జీ మార్కెట్ వరల్డ్ వైడ్గా 25శాతం వాటాను కలిగి ఉన్నాయని నివేదికలో పేర్కొంది. ఐఫోన్ 12 ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ గతేడాది 5జీ టెక్నాలజీని సపోర్ట్ చేస్తూ ఐఫోన్ 12 సిరీస్ను విడుదల చేసింది. ఈ ఫోన్ను మార్కెట్లో విడుదల చేసిన రెండు వారాల్లోనే సేల్స్ జరిగి...ఐఫోన్ 12 ,ఐఫోన్ 12 ప్రో'లు ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన 5జీ ఫోన్లుగా నిలిచాయి. తాజాగా స్ట్రాటజీ అనలిటిక్స్ నివేదిక సైతం 5జీ మార్కెట్లో యాపిల్ తొలిస్థానంలో కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ ఏడాది 3వ త్రైమాసికంలో 5జీ స్మార్ట్ఫోన్ సెగ్మెంట్లో యాపిల్ షావోమీని వెనక్కి నెట్టిందని స్ట్రాటజీ అనలిటిక్స్ డైరెక్టర్ కెన్ హైర్స్ తెలిపారు. ఐరోపాలో శాంసంగ్, చైనాలో ఒప్పో స్మార్ట్ఫోన్ సేల్స్ కారణంగా షావోమీ అమ్మకాలు తగ్గాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. షావోమీ హెడ్ క్వార్టర్స్ చైనాలో మాత్రం 5జీ స్మార్ట్ఫోన్ లపై ఆఫర్లు ప్రకటించడంతో డిమాండ్ పెరిగినట్లు వెల్లడించారు. శాంసంగ్ సైతం 3వ త్రైమాసికంలో గ్లోబల్ 5జీ ఫోన్ షిప్మెంట్లలో మూడవ స్థానాన్ని కైవసం చేసుకోవడం ద్వారా ఒప్పోను వెనక్కి నెట్టింది. శాంసంగ్ 5జీ స్మార్ట్ ఫోన్ సౌలభ్యంతో పాటు ఫోల్డబుల్ ఫోన్ కారణంగా శాంసంగ్కు డిమాండ్ పెరిగినట్లు తెలుస్తోంది. 4వ స్థానంలో ఒప్పో తర్వాత వివో ఐదో స్థానాన్ని సంపాదించుకోగా...హానర్ తన మాతృ సంస్థ హువావే నుంచి విడిపోవడంతో ద్వారా హానర్ ఈ త్రైమాసికంలో 194శాతం వృద్ధిని సాధించినట్లైందని స్ట్రాటజీ అనలిటిక్స్ విడుదల చేసిన రిపోర్ట్లో పేర్కొంది. చదవండి: వెరైటీ టీవీ.. చూడడమే కాదు ఏకంగా నాకేయొచ్చు -
చైనా మొబైల్ కంపెనీలకు షాక్! సోదాలు చేస్తోన్న ఐటీ శాఖ
న్యూఢిల్లీ: భారత మొబైల్ ఫోన్స్ పరిశ్రమలో దూకుడుగా ఉన్న చైనా కంపెనీలకు షాక్ తగిలింది. చైనాకు చెందిన ఒప్పో, షావొమీ, వన్ప్లస్ మొబైల్ కంపెనీల కార్యాలయాలు, ఉన్నతాధికారుల ఇళ్లపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తోంది. భారీ ఎత్తున పన్ను ఎగవేతకు పాల్పడ్డట్టు నిఘా విభాగం ఇచ్చిన సమాచారం ఆధారంగా తనిఖీలు జరుగుతున్నాయి. ఈ కంపెనీలపై చాలా కాలంగా ఐటీ నిఘా ఉన్నట్టు తెలుస్తోంది. కచ్చితమైన సమాచారంతోనే కంపెనీల సీఈవోలు, ఇతర ప్రతినిధులను ఐటీ అధికారులు విచారిస్తున్నారు. మంగళవారం నుంచి ఈ తనిఖీలు జరుగుతున్నాయి. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, గ్రేటర్ నోయిడా, కోల్కత, గువాహటి, ఇందోర్తోపాటు పలు ప్రాంతాల్లో 24కుపైగా కార్యాలయాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఉత్పత్తుల సరఫరా, విక్రయం, ఆర్థిక సేవల్లో ఉన్న కొన్ని కంపెనీలూ ఈ జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. పన్ను ఎగవేసినట్టు నిరూపించే డిజిటల్ సమాచారాన్ని గుర్తించి, సీజ్ చేసినట్టు సమాచారం. ఐటీ అధికారులకు సహకరిస్తున్నట్టు ఒప్పో వెల్లడించింది. భారతీయ చట్టాలకు అనుగుణంగా ఇక్కడ వ్యాపారం చేస్తున్నట్టు షావొమీ తెలిపింది. ఈ ఏడాది ఆగస్ట్లో టెలికం పరికరాల విక్రయంలో ఉన్న చైనాకు చెందిన జడ్టీఈపైనా ఐటీ తనిఖీలు జరిగాయి. -
షావోమీ, ఒప్పో కంపెనీలకు ఐటీ శాఖ భారీ షాక్..!
ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీదారులకు షావోమీ, ఒప్పో కంపెనీలకు ఐటీ శాఖ భారీ షాక్ను ఇచ్చింది. ఆయా కంపెనీలపై ఆదాయ పన్ను శాఖ దాడులను నిర్వహిస్తోనట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా షావోమీ, ఒప్పో మొబైల్ కంపెనీలకు సంబంధించిన పలు ప్రాంగణాల్లో ఆదాయపు పన్ను (IT) శాఖ దాడులు నిర్వహిస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఐటీ అధికారులు ఆయా కంపెనీలు అనేక ఉల్లంఘనలకు పాల్పడాయని ఆరోపణలు రావడంతో దాడులు చేసినట్లు తెలుస్తోంది. షావోమీ, ఒప్పో కంపెనీల తయారీ యూనిట్లు, గోడౌన్లు , కార్పొరేట్ కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయని సమాచారం. తమిళనాడు పెరుంగుడిలోని ఒప్పో కార్యాలయంపై, కాంచీపురంలోని సెల్ఫోన్ విడిభాగాల తయారీ యూనిట్పై దాడులు నిర్వహించారు. గతంలో కూడా..! ఆయా చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీలపై ఐటీ దాడులు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఈ సంస్థలపై ఐటీ దాడుల జరిగాయి. అంతకుముందు ఆగస్టులో, గురుగ్రామ్లోని చైనీస్ టెలికాం పరికరాల తయారీ సంస్థ జెడ్టీఈ కార్యాలయంపై కూడా దాడి జరిగింది. ఈ దాడిలో పలు ఉల్లంఘనలను ఐటీ అధికారులు గుర్తించారు. చదవండి: "మెర్రీ క్రిస్మస్" మెసేజ్ ఖరీదు ఇన్ని లక్షలా.. స్పెషల్ ఏంటి? -
ఇండియన్ ఫాస్టెస్ట్ ఛార్జింగ్ స్మార్ట్ఫోన్...! షావోమీ నుంచి..ధర ఏంతంటే..?
Xiaomi 11i Hypercharge Launch Date In India: ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ భారత్లో ఫాస్టెస్ట్ హైపర్ చార్జింగ్ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లలో షావోమీ 11ఐ హైపర్ ఛార్జ్ స్మార్ట్ఫోన్ను వచ్చే ఏడాది జనవరి 6 లాంచ్ చేయనుంది. ఈ ఏడాది ప్రారంభంలో చైనాలో లాంచ్ఐనా రెడ్మీ నోట్ 11 ప్రో+ స్మార్ట్ఫోన్కు రీబ్రాండెడ్గా Xiaomi 11i హైపర్ఛార్జ్ స్మార్ట్ఫోన్గా రానున్నుట్లు తెలుస్తోంది. ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తోందని కంపెనీ ప్రకటించింది. అంతేకాకండా భారత ఫాస్టెస్ట్ ఛార్జింగ్ స్మార్ట్ఫోన్గా నిలుస్తోందని కంపెనీ వెల్లడించింది. Xiaomi 11i హైపర్ఛార్జ్ 5G కనెక్టివిటీతో రానుంది. 15 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్..! Xiaomi 11i హైపర్ఛార్జ్ స్మార్ట్ఫోన్ బ్యాటరీ కేవలం 15 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ అవుతోందని కంపెనీ వెల్లడించింది. Xiaomi 11i హైపర్ఛార్జ్ ఒకే 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్లో వస్తుందని తెలుస్తోంది . కామో గ్రీన్, స్టెల్త్ బ్లాక్ కలర్స్ వేరియంట్స్లో రానుంది. ధర ఎంతంటే..! చైనా మార్కెట్లో Redmi 11 ప్రో + స్మార్ట్ఫోన్ భారత్లో రీబ్రాండెడ్ స్మార్ట్ఫోన్గా రానుంది. అయితే చైనాలో 6GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో అందుబాటులో ఉంది. దీని ధర సుమారు సుమారు రూ. 22,500 గా ఉంది. 8GB + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర భారత్లో దాదాపు రూ. 24,900 గా ఉండనున్నట్లు తెలుస్తోంది. Xiaomi 11i హైపర్ఛార్జ్ స్పెసిఫికేషన్లు (అంచనా) 6.67-అంగుళాల AMOLED డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్ 8GB ర్యామ్+ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 920 SoC 108-ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా డ్యూయల్ జేబీఎల్-ట్యూన్డ్ స్టీరియో స్పీకర్స్, 4,500mAh బ్యాటరీ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 5G కనెక్టివిటీ చదవండి: 2022లో భారత మార్కెట్లపై స్మార్ట్ఫోన్ కంపెనీల దండయాత్ర..! వచ్చే ఏడాదిలో రానున్న పవర్ఫుల్ స్మార్ట్ఫోన్స్ ఇవే.. -
2022లో లాంచ్ కానున్న పవర్ఫుల్ స్మార్ట్ఫోన్స్ ఇవే..!
Top Upcoming Smartphones Of 2022: కొత్త ఏడాది రాబోతుంది. 2022 సంవత్సరానికి గాను ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం కంపెనీలు భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లపై తమ కొత్త ఫోన్లతో దండయాత్ర చేయనున్నాయి. 2021లో చిప్స్ సమస్య, సప్లై చైయిన్లో ఆటంకాలు కల్గించినప్పటికీ భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లలో దిగ్గజ కంపెనీలు కొంతమేర లాభాలను దక్కించుకున్నాయి. 2022గాను భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లను శాసించేందుకు ఆయా కంపెనీలు సిద్దమైనాయి. శాంసంగ్, యాపిల్, వన్ప్లస్, షావోమీ, గూగుల్, ఒప్పో కంపెనీలు 2022లో కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్స్ లాంచే చేసేందుకు రెడీ అయ్యాయి. భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లలో తమ స్థానాలను పదిలంగా ఉంచేందుకు ఆయా కంపెనీలు ఊవిళ్లురుతున్నాయి. 2022లో రానున్న పవర్ఫుల్ స్మార్ట్ఫోన్స్ ఇవే..! 1. శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా శాంసంగ్ గెలాక్సీ ఎస్21 స్మార్ట్ఫోన్ భారత మార్కెట్లలో భారీ ఆదరణ లభించింది. పవర్ఫుల్ కెమెరా సపోర్ట్తో శాంసంగ్ గెలాక్సీ ఎస్21 నిలిచింది. దీనిని కంటిన్యూ చేస్తూ శాంసంగ్ మరిన్ని అద్బుతమైన ఫీచర్స్తో శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రాను శాంసంగ్ లాంచ్ చేయనుంది. Galaxy S22, Galaxy S22 Plus మరియు Galaxy S22 అల్ట్రాకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. 2. శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ గెలాక్సీ సిరీస్లో భాగంగా శాంసంగ్ తక్కువ ధరకే శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ స్మార్ట్ఫోన్ను కంపెనీ లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్ఫోన్ ధర రూ. 38,990గా ఉండనుంది. IP68 రేటింగ్ వంటి లక్షణాలను శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ పొందనుంది. 5జీ మోడల్, క్వాలకం స్నాప్డ్రాగన్ 865 సపోర్ట్తో రానుంది. 3. ఐఫోన్ 14 మ్యాక్స్ కరోనా రాకతో ఐఫోన్13 స్మార్ట్ ఫోన్ల లాంచ్కు కాస్త బ్రేకులు పడింది. లేట్గా వచ్చిన లేటెస్ట్గా ఐఫోన్ 13 భారత మార్కెట్లలో భారీ ఆదరణను పొందింది. కాగా వచ్చే ఏడాది అనుకున్న సమయానికే ఐఫోన్ 14 స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసేందుకు యాపిల్ సన్నాహాలను చేస్తోంది. ఐఫోన్ 14 మ్యాక్స్కు అనుకూలంగా ఐఫోన్ 14 మినీని తొలగించవచ్చని తెలుస్తోంది. అంటే మినీ సిరీస్ స్మార్ట్ఫోన్స్ ఇకపై ఉండకపోవచ్చును. 4. వన్ప్లస్ 10 ప్రొ శాంసంగ్, యాపిల్ లాంటి దిగ్గజ స్మార్ట్ఫోన్ కంపెనీలకు వన్ప్లస్ దీటైన సమాధానం ఇచ్చింది. వచ్చే ఏడాది వన్ప్లస్ 10 స్మార్ట్ఫోన్లను కంపెనీ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. వన్ప్లస్ 9 కంటే అదిరిపోయే ఫీచర్స్తో వన్ప్లస్ 10 స్మార్ట్ ఫోన్స్ రానున్నాయి. Qualcomm స్నాప్డ్రాగెన్ 8 Gen 1 ప్రాసెసర్ దీనిలో రానుంది. 5. షావోమీ 12 ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ భారత్లో పాతుకుపోయింది. షావోమీ స్మార్ట్ఫోన్స్కు భారీ ఆదరణ లభించడంతో వివిధ రకాల మోడల్ స్మార్ట్ఫోన్లను షావోమీ లాంచ్ చేస్తోంది. షావోమీ 12 స్మార్ట్ఫోన్ను వచ్చే ఏడాదిలో తొలినాళ్లలో లేదా ఈ ఏడాది చివరన లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐతే స్మార్ట్ఫోన్ కొనుగోలుదారులకు 2022లోనే అందుబాటులో ఉండనుంది. 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో షావోమీ 12 రానుంది. 6. గూగుల్ పిక్సెల్ 6ఏ యాపిల్ స్మార్ట్ఫోన్స్ తరువాత గూగుల్ పిక్సెల్ స్మార్ట్ఫోన్స్కు ఉండే క్రేజ్ వేరు. పవర్ఫుల్ సెక్యూరిటీతో, కెమెరా ఆప్షన్లతో గూగుల్ పిక్సెల్ స్మార్ట్ఫోన్స్ భారత్లో తనదైన స్థానాన్ని కైవసం చేసుకుంది. గూగుల్ పిక్సెల్ 6, 6 ప్రొ ఇప్పటికే లాంచ్ ఐనప్పటికీ వచ్చే ఏడాది బడ్జెట్ ప్రెండ్లీ స్మార్ట్ఫోన్స్లో భాగంగా గూగుల్ పిక్సెల్ 6ఏ ఫోన్ను గూగుల్ లాంచ్ చేయనుంది. 7. ఒప్పో ఫైండ్ ఎన్ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్స్ మార్కెట్లలోకి ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం ఒప్పో కూడా ప్రవేశించింది. ‘ఒప్పో ఫైండ్ ఎన్’ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ను డిసెంబర్ 15న కంపెనీ లాంచ్ చేసింది. కాగా తొలుత చైనా మార్కెట్లలోనే ఈ ఫోన్ అందబాటులో ఉండనుంది. ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లలో ప్రఖ్యాతిగాంచిన శాంసంగ్ కంపెనీ స్మార్ట్ఫోన్లకు తక్కువ ధరలోనే ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ను ఒప్పో తీసుకువచ్చింది. కాగా ఈ స్మార్ట్ఫోన్ ధర రూ. 92,000 నుంచి ప్రారంభమవుతుంది. ఒప్పో ఫైండ్ ఎన్ స్మార్ట్ఫోన్ 33 వాట్ సూపర్ఫ్లాష్ టెక్నాలజీతో పనిచేయనుంది. అయితే 33W SUPERVOOC ఫ్లాష్ ఛార్జ్ 30 నిమిషాల్లో 55 శాతానికి , 70 నిమిషాల్లో 100 శాతానికి బ్యాటరీ ఛార్జ్ అవ్వనుంది. చదవండి: వరల్డ్ ఫస్ట్ ఇన్నోవేటివ్ ఫీచర్స్ కేవలం ఈ స్మార్ట్ఫోన్లో...! -
పిచ్చెక్కిస్తున్న షావోమీ 12 స్మార్ట్ఫోన్ డిజైన్, ఫీచర్స్..!
ప్రముఖ చైనా మొబైల్ తయారీ దిగ్గజం షావోమీ నుంచి త్వరలో ఫ్లాగ్ షిప్ స్మార్ట్ఫోన్ షావోమీ 12 రానున్నట్లు సమాచారం. ఈ సిరీస్లో షావోమీ 12, షావోమీ 12ఎక్స్, షావోమీ 12ప్రో, షావోమీ 12 అల్ట్రా రానున్నాయి. షావోమీ12 సిరీస్ స్మార్ట్ఫోన్ల గురుంచి చైనా టెక్ దిగ్గజం నుంచి ఎటువంటి అధికారిక సమాచారం లేదు. అయితే, ఇటీవల షావోమీ12 స్మార్ట్ఫోన్ కీలక స్పెసిఫికేషన్లు ఇంటర్నెట్ లో లీక్ అయ్యాయి. అలాగే, రాబోయే స్మార్ట్ఫోన్కి సంబంధించిన కొన్ని డిజైన్ కూడా బయటకు వచ్చాయి. షావోమీ 12 స్టాండర్డ్ ఎడిషన్ ఫీచర్స్(అంచనా) తాజాగా లీక్ అయిన షావోమీ 12 స్పెసిఫికేషన్స్ ప్రకారం.. ఈ స్మార్ట్ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఈ మొబైల్ డ్యూయల్-ఎల్ఈడి ఫ్లాష్ లైట్ తో పాటు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరాతో రానున్నట్లు తెలుస్తుంది. ఈ స్మార్ట్ఫోన్లో సెంట్రల్ అలైన్డ్ హోల్ పంచ్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. షావోమీ 12 ఫుల్-హెచ్ డి+(1,920ఎక్స్1,080 పిక్సెల్స్) రిజల్యూషన్ గల డిస్ ప్లేను కలిగి ఉండనుంది. అదనంగా, ఇందులో స్క్రీన్ ఇన్ బిల్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా రానున్నట్లు సమాచారం. షావోమీ 12 స్టాండర్డ్ ఎడిషన్ గతంలో చైనా కంపల్సరీ సర్టిఫికేషన్(3సీ) వెబ్సైట్లో కనిపించింది. ఈ లిస్టింగ్ ప్రకారం.. ఇది 67డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉన్నట్లు భావిస్తున్నారు. బేస్ షావోమీ 12 స్టాండర్డ్ ఎడిషన్ 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీతో రానుంది. ఈ స్మార్ట్ఫోన్ యుఎస్బి టైప్-సి ఫాస్ట్ ఛార్జింగ్, వైర్ లెస్ ఛార్జింగ్ కి కూడా సపోర్ట్ చేయనుంది. షావోమీ 12 8జీబీ ర్యామ్ గల క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 8 జనరల్ 1 ప్రాసెసర్ సహాయంతో పనిచేయనున్నట్లు సమాచారం. ఈ 5జీ ఆధారిత స్మార్ట్ఫోన్లో డ్యూయల్ సిమ్ సపోర్ట్ తో పాటు బ్లూటూత్ వి5.2 కనెక్టివిటీ ఉంటుందని పేర్కొన్నారు. దీని ధర సుమారు రూ.69,990గా ఉండే అవకాశం ఉంది. (చదవండి: అమెరికాకు వచ్చినప్పుడు నా చేతిలో చిల్లి గవ్వ లేదు: ఎలోన్ మస్క్!) -
2021లో వచ్చిన బెస్ట్ సూపర్ స్మార్ట్ఫోన్స్ ఇవే..!
2021 పలు దిగ్గజ స్మార్ట్ఫోన్ కంపెనీలకు బిజినెస్ ‘కొంచెం ఇష్టం..కొంచెం కష్టం’గా గడిచింది. మరికొన్ని కంపెనీలకేమో మూడు పువ్వులు ఆరుకాయలుగా గణనీయమైన వృద్ధిని సాధించాయి. దిగ్గజ స్మార్ట్ఫోన్ కంపెనీలను చిప్స్ కొరత, సప్లై చైన్ వంటి సమస్యలు వెంటడాయి. అయినప్పటికీ స్మార్ట్ఫోన్ కంపెనీలకు భారత్ కాసుల వర్షాలను కురిపించాయి. 2021 స్మార్ట్ఫోన్ కంపెనీలకు గొప్ప సంవత్సరంగా నిలిచింది. 2021లో వచ్చిన సూపర్ స్మార్ట్ఫోన్స్ జాబితాను ప్రముఖ టెక్ వెబ్సైట్ గాడ్జెట్స్ 360 ఎంపిక చేసింది. ఆయా స్మార్ట్ఫోన్ల పర్ఫార్మెన్స్, బ్యాటరీ, ధరలు ఇలా అన్నింటినీ బేరీజు వేసుకుని గాడ్జెట్స్ 360 ఈ ఏడాది వచ్చిన సూపర్ స్మార్ట్ఫోన్స్ లిస్ట్ను రిలీజ్ చేసింది. కాగా గాడ్జెట్స్ 360 ఎంచుకున్న స్మార్ట్ఫోన్లలో ఏ మోడల్స్ కూడా 10/10 స్కోర్ను సాధించలేకపోయాయి. గాడ్జెట్స్ 360 ఎంపిక స్మార్ట్ ఫోన్లలో యాపిల్, వివో, రియల్ మీ, ఎంఐ, శాంసంగ్, వన్ప్లస్ స్మార్ట్ఫోన్స్ నిలిచాయి ఈ ఏడాది వచ్చిన బెస్ట్ స్మార్ట్ఫోన్స్ ఇవే..! ►యాపిల్కు చెందిన ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐపోన్ 13 ప్రో మ్యాక్స్ స్మార్ట్ఫోన్స్ తొలి నాలుగుస్థానాల్లో నిలిచాయి. పర్ఫారెమెన్స్, డిజైన్, డిస్ప్లే పరంగా మిగతా స్మార్ట్ఫోన్ల కంటే ముందు స్థానంలో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్ఫోన్ ధరలు అధికంగా ఉండడంతో కొంతమంది వ్యక్తులకే మాత్రమే పరిమితమయ్యాయి. ఈ స్మార్ట్ఫోన్స్ ధరలు అధికంగా ఉండడంతో 10/10 స్కోర్ను సాధించలేకపోయింది. ►రియల్మీ స్మార్ట్ఫోన్ రియల్ మీ జీటీ నిలిచింది. పర్ఫారెమెన్స్, డిజైన్, డిస్ప్లే, కెమెరా, విషయంలో అద్భుతమైన స్మార్ట్ఫోన్గా ఉంది. యాపిల్ స్మార్ట్ఫోన్లతో పోల్చితే ఈ స్మార్ట్ఫోన్ ధర తక్కువగా ఉండడంతో రియల్మీ జీటీ అమ్మకాలు భారీగానే జరిగినట్లు తెలుస్తోంది. ►ప్రముఖ చైనీస్ దిగ్గజం షావోమీ ఈ ఏడాది రిలీజ్ చేసిన స్మార్ట్ఫోన్లలో Mi 11 అల్ట్రా అత్యంత శక్తివంతమైన ఫోన్గా నిలిచింది. శామ్సంగ్ గెలాక్సీ S21 కు గట్టిపోటీనే ఇచ్చింది. ►భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లలో ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో ఉత్తమమైన స్మార్ట్ఫోన్గా Samsung S21 అల్ట్రా ఉంది. ఈ స్మార్ట్ఫోన్లో కెమెరా ఫీచర్స్ అదరగొట్టాయి. ►కెమెరాస్ విత్ గింబల్ తో వచ్చిన స్మార్ట్ఫోన్లలో Vivo X70 Pro+ అద్బుతంగా ఉంది. సొగసైన డిజైన్, IP68 రేటింగ్, పదునైన 120Hz డిస్ప్లే, అద్భుతమైన వీడియో స్థిరీకరణ ఈ స్మార్ట్ఫోన్ సొంతం. ►వన్ప్లస్ స్మార్ట్ఫోన్స్లో OnePlus 9 ప్రో అద్బుతమైన పనితీరును కనబర్చింది.50W వైర్లెస్ ఛార్జింగ్ , క్లాస్-లీడింగ్ అల్ట్రా-వైడ్ కెమెరా వంటి కొన్ని కొత్త గుర్తించదగిన ఫీచర్లు వన్ప్లస్ 9 ప్రొలో ఉన్నాయి. చదవండి: గూగుల్ ఇయర్ ఇన్ సెర్చ్ లిస్ట్లో ఒకేఒక్కడు! అంతలా ఎందుకు వెతికారంటే.. -
పవర్ఫుల్ ర్యామ్తో రెడ్మీ నుంచి సరికొత్త స్మార్ట్ఫోన్..! ధర ఎంతంటే..!
ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ భారత మార్కెట్లలోకి రెడ్మీ నోట్ 10 సిరీస్లో భాగంగా మరింత పవర్ఫుల్ స్టోరేజ్ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. రెడ్మీ నోట్ 10ఎస్ స్మార్ట్ఫోన్లో పవర్ఫుల్ ర్యామ్ను అమర్చారు. 8జీబీ ర్యామ్+128జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో రానుంది. రెడ్మీ నోట్ 10ఎస్ 6జీబీ ర్యామ్+64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ను ఎప్పుడో లాంచ్ చేసింది. 8జీబీ ర్యామ్ రెడ్మీ నోట్ 10ఎస్ వేరియంట్ కొనుగోలుదారులకు డిసెంబర్ 3 నుంచి అందుబాటులో ఉండనుంది. దీని ధర రూ. 17,499గా ఉండనుంది. ఈ స్మార్ట్ఫోన్ను కంపెనీ అధికారిక వెబ్సైట్ ఎంఐ. కామ్, అమెజాన్, ఎంఐ హోమ్స్ స్టోర్స్ కొనుగోలు చేయవచ్చును. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు లేదా ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 1000 వరకు తక్షణ డిస్కౌంట్ లాంచింగ్ ఆఫర్ను అందిస్తోంది. చదవండి: శాంసంగ్ నుంచి చౌవకైన 5జీ స్మార్ట్ఫోన్..! రెడ్మీ నోట్10ఎస్ ఫీచర్స్ 6.43-అంగుళాల పూర్తి-హెచ్డీప్లస్ అమ్లోడ్ డిస్ప్లే మీడియాటెక్ హెలియో జీ95 ప్రాసెసర్స్ 8జీబీ ర్యామ్+128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ 64 ఎంపీ+8ఎంపీ+2ఎంపీ+2ఎంపీ క్వాడ్ రియర్ కెమెరా 13ఎంపీ ఫ్రంట్ కెమెరా 5,000mAh బ్యాటరీ 33W ఫాస్ట్ ఛార్జింగ్ చదవండి: ఇది స్మార్ట్ఫోనా..ల్యాప్ట్యాపా...! వివో నుంచి కళ్లుచెదిరే గాడ్జెట్..! -
షావోమీ స్మార్ట్ఫోన్ యూజర్లకు గుడ్న్యూస్..!
ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ పలు స్మార్ట్ఫోన్ యూజర్లకు త్వరలోనే గుడ్న్యూస్ను అందించనుంది. షావోమీ త్వరలోనే షావోమీ, రెడ్మీ స్మార్ట్ఫోన్లకు సాఫ్ట్వేర్ అప్డేట్ను తీసుకురానుంది. త్వరలోనే కొత్త MIUI 13 అప్డేట్ను షావోమీ విడుదలచేయనుంది. ఒక నివేదిక ప్రకారం..MIUI 13 అప్డేట్ పలు స్మార్ట్ఫోన్లతో సహా వచ్చే నెలలో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా...ఈ నెలలోనే (డిసెంబర్ 13) న లాంచ్ ఈవెంట్ను షావోమీ హోస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు పుకార్లు వస్తున్నాయి. లాంచ్ ఈవెంట్లో షావోమీ 12, షావోమీ 12ఎక్స్ మోడళ్లతో సహా నెక్ట్స్ జనరేషన్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లను కంపెనీ ఆవిష్కరించే అవకాశం ఉన్నట్లు నిపుణుల భావిస్తున్నారు. ఈ స్మార్ట్ఫోన్స్ ఆండ్రాయిడ్ 12 కి బదులుగా ఆండ్రాయిడ్ 11తో రన్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కానీ వీటిలో MIUI 13తో రన్ అవుతాయని సమాచారం. కొద్దిరోజల తరువాత షావోమీ 12 స్మార్ట్ఫోన్లకు ఆండ్రాయిడ్ 12 వచ్చే అవకాశం ఉంది. MIUI 13తో రన్ అయ్యే స్మార్ట్ఫోన్స్ ఏవంటే..! ఎంఐ మిక్స్4 ఎంఐ 11 అల్ట్రా ఎంఐ 11 రెడ్మీ కే40 ప్రో రెడ్మీ కే40 ఎంఐ 10ఎస్ ఎంఐ 11లైట్ 5జీ వీటిలో అప్డేట్ అయ్యే అవకాశం.! ఎంఐ 10 సిరీస్ స్మార్ట్ఫోన్స్ షావోమీ 11టీ రేంజ్ స్మార్ట్ఫోన్స్ షావోమీ సివీ షావోమీ మిక్స్4 షావోమీ మిక్స్ ఫోల్డ్ షావోమీ పాడ్5 ఎంఐ నోట్10 రెడ్మీ 9టీ, రెడ్మీ 9 పవర్ రెడ్మీ 10ఎక్స్ 5జీ, రెడ్మీ 10ఎక్స్ ప్రో,రెడ్మీ 10, రెడ్మీ 10 ప్రో భారత్లో ఇప్పటికే చాలా షావోమీ, రెడ్మీ స్మార్ట్ఫోన్లలో MIUI 12.5 అప్డేట్ను ప్రారంభించింది. దీంతో MIUI 13 అప్డేట్ రావాలంటే కొత్త సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ ఓఎస్కు, MIUI తేడా ఇదే..! సాధారణంగా అన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో గూగుల్ రూపొందించిన ఆండ్రాయిడ్ ఓఎస్ ఉంటుంది. షావోమీ లాంటి కంపెనీలు MIUI పేరుతో కస్టమైజ్డ్ వ్యూ, ఫ్రేమ్వర్స్క్, సెట్టింగ్స్ ఉంటాయి. MIUI అనేది యూఐ ఆధారిత ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్. చదవండి: కళ్లుచెదిరే లాభం.. లక్షకు ఏకంగా రూ.80 లక్షలు! -
అదిరిపోయే ఫీచర్లతో షావోమీ నుంచి 5జీ స్మార్ట్ఫోన్..!
ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ భారత మార్కెట్లలోకి సరికొత్త రెడ్మీ నోట్ 11టీ5జీ లాంచ్ చేసింది. గత నెలలో ఈ స్మార్ట్ఫోన్ చైనాలో విడుదలైంది. స్టార్డస్ట్ వైట్, అక్వామెరైన్ బ్లూ, మాటే బ్లాక్ కలర్ వేరియంట్స్తో రానుంది. 6జీబీ ర్యామ్+128జీబీ ఇంటర్నల్స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 16,999 కాగా, 8జీబీ ర్యామ్+128 జీబీ ఇంటర్నల్స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 17,999గా ఉండనుంది. డిసెంబర్ 7 నుంచి కొనుగోలుదారులకు షావోమీ అధికారక వెబ్సైట్తో పాటుగా అమెజాన్లో కూడా అందుబాటులో ఉండనుంది. రెడ్మీ నోట్ 11టీ 5జీ ఫీచర్స్ 6.6 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే విత్ 90 గిగాహెట్జ్ రిఫ్రెష్ రేట్ మీడియాటెక్ డైమెంసిటీ 810 ఎస్ఓసీ ప్రాసెసర్ 8జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఆండ్రాయిడ్ 11 ఆధారిత 12 ఎంఐయూఐ 5000ఎంఏహెచ్ బ్యాటరీ 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ చదవండి: ఓలాకు గట్టిపోటీ..! భారీ ప్రణాళికతో ఏథర్..! -
200 ఎంపీ కెమెరాతో సూపర్ స్మార్ట్ఫోన్..!.. వచ్చేది ఎప్పుడంటే?
గత కొంత కాలంగా స్మార్ట్ ఫోన్ ఫీచర్స్లలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొంత కాలం క్రితం వరకు బ్యాటరీ మీద జరిగిన పరిశోదనలు ఇప్పుడు, స్మార్ట్ ఫోన్ కెమెరా అభివృద్ది మీద జరుగుతున్నాయి. తాజాగా వచ్చిన సమాచార ప్రకారం ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మోటోరోలా 200 మెగా పిక్సల్ కెమెరాతో మొబైల్ ఫోన్ తీసుకుని రాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే శాంసంగ్, రియల్ మీ, షియోమీ, మోటోరోలా 108 ఎంపీ సామర్ధ్యం గల మొబైల్ ఫోన్స్ మార్కెట్లోకి విడుదల చేశాయి. ఇప్పుడు,మోటరోలాతో పాటు శాంసంగ్, షియోమీ కూడా 200 మెగా పిక్సల్ రియర్ కెమెరాతో స్మార్ట్ ఫోన్ లాంఛ్ చేయాలని యోచిస్తున్నాయి. అయితే, చైనా షియోమీ కంపెనీ దీనిని 2022 ద్వితీయార్ధంలో ఆవిష్కరించనున్నట్లు ఒక టిప్స్టర్ పేర్కొన్నారు. శాంసంగ్ కంపెనీకి మాత్రం కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. 2023లో శామ్ సంగ్ తన 200 మెగా పిక్సల్ కెమెరా ఫోన్ ను తీసుకువస్తుందని పేర్కొంది. మోటోరోలా ఈ కెమెరాలో ఐఎస్ఓఎల్ఈఎల్ఎల్ హెచ్పీ1 అనే శాంసంగ్ లెన్స్ను ఉపయోగించింది. ఇది కొత్త పిక్సెల్-బిన్నింగ్ టెక్నాలజీ సహాయంతో పనిచేస్తుంది. ఈ లెన్స్తో 30ఎఫ్పిఎస్ రేట్తో 8కే వీడియోలను, 12ఎఫ్పిఎస్ రేట్తో 4కే వీడియోలను రికార్డ్ చేయొచ్చు. (చదవండి: జియో యూజర్లకు భారీ షాక్..!) వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ ఫోన్ను విడుదలచేయాలని మోటోరోలా కంపెనీ భావిస్తోంది. మోటోరోలా ఇప్పటికే 108 ఎంపీ కెమెరా సామర్ధ్యంతో మోటో జీ60, మోటో ఎడ్జ్ 20, మోటో ఎడ్జ్ 20 ప్యూజన్, మోటో ఎడ్జ్ 20ప్రో మోడల్ ఫోన్లను విడుదల చేసింది. మోటోరోలా తన తాజా మోటో జి31 స్మార్ట్ ఫోన్ ను నవంబర్ 29న భారతదేశంలో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ డివైస్ 50 మెగా పిక్సల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 6.4 అంగుళాల అమోల్డ్ డిస్ ప్లే, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానుంది. ఈ ఫోన్ మీడియా టెక్ హెలీయో జీ85 ప్రాసెసర్ సహాయం చేత పనిచేస్తుంది. -
బ్లాక్ ఫ్రైడే సేల్: షావోమీ ఉత్పత్తులపై భారీ తగ్గింపు..!
Xiaomi Black Friday Sale Starts Goes On Till November 30: అమెరికాలో థ్యాంక్స్గీవింగ్తో సాగే భారీ డిస్కౌంట్ల బ్లాక్ ఫ్రైడ్ సేల్ ఇప్పుడు భారత్లోని పలు కంపెనీలు మొదలుపెట్టాయి. అందులో ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ కూడా చేరింది. షావోమీ బ్లాక్ ఫ్రైడ్సేల్ను ప్రకటించగా, ఈ సేల్ నవంబర్ 23 నుంచి ప్రారంభమవ్వగా నవంబర్ 30తో ముగియనుంది. బ్లాక్ ఫ్రైడే సేల్లో భాగంగా టీవీలు, ల్యాప్టాప్స్, ఆడియో, లైఫ్స్టైల్ ఉత్పత్తులపై భారీ తగ్గింపును షావోమీ ప్రకటించింది. చదవండి: ఇండియా కుబేరుడు.. 2 సార్లు మృత్యుముఖం నుంచి బయటపడ్డాడు కొనుగోలుదారులకు షావోమీ అధికారిక వెబ్సైట్తో పాటుగా..పలు ఈ కామర్స్ వెబ్సైట్స్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్లో కూడా అందుబాటులో ఉండనున్నాయి. ఈ సేల్లో భాగంగా ఐసీఐసీఐ క్రెడిట్, డెబిట్ కార్డులపై అదనంగా 10 శాతం తగ్గింపు రానుంది. అంతేకాకండా పలు షావోమీ ఉత్పత్తుల కొనుగోలుపై 5 వేల వరకు క్యాష్బ్యాక్ను కూడా షావోమీ అందించనుంది. బ్లాక్ ఫ్రైడే సేల్లో భాగంగా పలు ఉత్పతులపై షోవోమీ అందిస్తోన్న ఆఫర్లు ►ఎమ్ఐ 11ఎక్స్ స్మార్ట్ఫోన్పై సుమారు రూ. 4 వేల తగ్గింపు. ►రెడ్మీ బుక్ 15 ల్యాప్టాప్ కొనుగోలుదారులకు రూ. 35,499కే లభించనుంది. ►ఎమ్ఐ టీవీ 4సీ 43ఇంచ్, ఎమ్ఐ టీవీ 4ఏ 43ఇంచ్ హరిజోన్ ఎడిషన్, రెడ్మీ స్మార్ట్టీవీ 43 ఇంచ్ స్మార్ట్టీవీల కొనుగోలుపై రూ. 2000 వరకు డిస్కౌంట్. ►ఎమ్ఐ స్మార్ట్బ్యాండ్ 5 కొనుగోలుదారులకు రూ. 2270కు లభించనుంది. ►ఎమ్ఐ వాచ్ రివాల్వ్ క్రోమ్, ఎయిర్ పూరిఫైయర్ 3 ఉత్పత్తులపై 2 వేల తగ్గింపు.మరిన్ని ఆఫర్లను షావోమీ అధికారిక వెబ్సైట్లో చూడవచ్చును. చదవండి: స్మార్ట్ఫోన్లకు ఎండ్కార్డ్...! వాటి స్థానంలో పవర్ఫుల్..! -
మార్కెట్లోకి షియోమీ ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చేది అప్పుడే..?
ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ షియోమీ తన మొదటి ఎలక్ట్రిక్ వాహనాన్ని 2024 మొదటి అర్ధభాగంలో లాంఛ్ చేయనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ స్మార్ట్ఫోన్ కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో ఈవీ రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని వివరాలను షేర్ చేసింది. షియోమీ ఎలక్ట్రిక్ వాహనల పరిశోధన & అభివృద్ది కోసం మొత్తం 13,919 మంది సభ్యులు విభాగంలో పనిచేస్తున్నారని, వీరిలో 500 మంది కంపెనీ ఎలక్ట్రిక్ కారు ప్రాజెక్టులో పనిచేస్తున్నారని కంపెనీ వెల్లడించింది. ఆర్ అండ్ డి విభాగంలో దాదాపు 14000 మంది సభ్యులు ఉన్నారని, కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో వీరి శాతం 44 అని ఒక ఆర్థిక నివేదికలో పేర్కొంది. ఆగస్టు 2021లో డీప్ మోషన్ అనే ఒక స్టార్టప్ కొనుగోలు చేసింది. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ లీ జున్ మాట్లాడుతూ.. 2024లో భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్ కార్లను షియోమీ ఉత్పత్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహన రంగంలో వచ్చే పదేళ్లలో సుమారు 10 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనుందని తెలిపారు. షియోమీ మొదటి ఎలక్ట్రిక్ కారు 2023 మొదటి అర్ధభాగంలో తయారు చేయడం ప్రారంభించి, 2024 మొదటి అర్ధభాగంలో మార్కెట్లోకి తీసుకొని రావచ్చు అని ప్రకటించారు. అయితే ఇది ప్రస్తుత ప్రణాళిక అని ఆయన పేర్కొన్నారు. షియోమీ ఇప్పటికే తన ఈవీ కంపెనీ షియోమీ ఈవీని 10 బిలియన్ యువాన్ల(రూ.11,000 కోట్ల) మూలధనంతో ప్రారంభించింది. షియోమీ మొదటి ఈవీ మార్కెట్లోకి ప్రవేశించినప్పుడు ఇతర కంపెనీలైన యాపిల్, ఒప్పో, వివో, వన్ ప్లస్ ఎలక్ట్రిక్ కార్లతో పోటీ పడనుంది. (చదవండి: పాత కార్లను ఎలక్ట్రిక్ కార్లుగా మారిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా?) -
షావోమీ కొంపముంచిన చిప్స్..! ఆ పొజిషన్ యాపిల్ కైవసం..!
ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీకి మరో గట్టి దెబ్బ తగిలింది. క్యూ3 ఆదాయ విషయంలో సమీప ప్రత్యర్థి కంపెనీల నుంచి గట్టి పోటీతో పాటుగా చిప్స్ కొరత షావోమీ కొంపముంచింది. చిప్స్ కొరతతో షావోమీకి గట్టి దెబ్బ..! ప్రపంచవ్యాప్తంగా పలు స్మార్ట్ఫోన్ కంపెనీలకు, ఆటోమొబైల్ కంపెనీలను సెమికండక్టర్స్ (చిప్స్) కొరత తీవ్రంగా వేధిస్తోంది. చిప్స్ కొరతతో సతమతమవుతున్న కంపెనీల జాబితాలో షావోమీ కూడా నిలిచింది. చిప్స్ కొరత కారణంగా క్యూ3లో కంపెనీ వృద్ధి రేటు నెమ్మదించింది. చిప్ కొరత ఉన్నప్పటికీ, షావోమీ 2021లో దాదాపు 190 మిలియన్ స్మార్ట్ఫోన్లను విక్రయించింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 29 శాతం పెరిగిన కూడా యాపిల్ లాంటి కంపెనీలు షావోమీకు భారీ దెబ్బను వేశాయి. క్యూ3లో దాదాపు రూ. 90,910 కోట్ల విక్రయాలను జరిపిన షావోమీ అంచనాలను చేరుకోలేకపోయింది. రెండో స్థానం నుంచి ..! ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న చిప్స్ కొరత, చైనాలో స్మార్ట్ఫోన్ అమ్మకాల తగ్గుదల కారణంగా...ప్రపంచంలోని టాప్ స్మార్ట్ఫోన్స్ జాబితాలో షావోమీ రెండోస్ధానం నుంచి మూడో స్ధానానికి పడిపోయింది. తాజాగా యాపిల్ రెండోస్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ ఐఫోన్-13 రాకతో షావోమీ అమ్మకాలు ఒక్కింతా పడిపోయాయి. ఐఫోన్-13ను రిలీజ్ కావడంతో ఇతర ఐఫోన్ సిరీస్ స్మార్ట్ఫోన్స్ రేట్లు అమాంతం తగ్గాయి. దీంతో షావోమీ అంచనాలు తారుమారు అయ్యాయి. చదవండి: ఈవీ ఛార్జింగ్ సదుపాయాల కల్పన కోసం మెజెంటా భారీ పెట్టుబడులు -
స్మార్ట్ఫోన్ కొనుగోళ్లపై అమెజాన్ బంపర్ ఆఫర్..! ఏకంగా 40 శాతం...!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో సేల్ను ప్రకటించింది. ‘ఫాబ్ ఫోన్స్ ఫెస్ట్ ’పేరుతో పలు స్మార్ట్ఫోన్లపై బంపర్ ఆఫర్లను లాంచ్ చేసింది. ఈ సేల్లో భాగంగా షావోమీ, శాంసంగ్, వన్ప్లస్తో పాటు ఇతర స్మార్ట్ఫోన్లపై, మొబైల్ ఉపకరణాలపై సుమారు 40 శాతం వరకు తగ్గింపును ప్రకటించింది. అంతేకాకుండా ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం తగ్గింపును కొనుగోలుదారులు పొందవచ్చును. ఈ సేల్ నవంబర్ 24 నుంచి ప్రారంభమై నవంబర్ 28తో ముగియనుంది. చదవండి: షావోమీకి దిమ్మతిరిగే షాకిచ్చిన ఒప్పో, వివో..! ‘ఫ్యాబ్ ఫోన్ ఫెస్ట్’లో పలు స్మార్ట్ఫోన్లపై అమెజాన్ అందిస్తోన్న ఆఫర్స్లో కొన్ని...! ►షావోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ: 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ. 26,999 ఉండగా ఈ సేల్లో భాగంగా రూ. 19999కే కొనుగోలుదారులకు లభించనుంది. ►శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ: 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ. 39,990 ఉండగా ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్లో భాగంగా రూ. 38, 740కు రానుంది. ►వన్ప్లస్ 9ప్రో: ఈ స్మార్ట్ఫోన్ కొనుగోలుదారులకు రూ. 54,999 లభించనుంది. అంతేకాకుండా అమెజాన్ కూపన్ను కూడా పొందవచ్చును. ►ఐక్యూ జెడ్5 5జీ: 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ. 20,615కే కొనుగోలుదారులకు లభించనుంది. ►ఐక్యూ జెడ్3 5జీ: ఈ స్మార్ట్ఫోన్ కొనుగోలుదారులకు రూ. 17,865 కే లభించనుంది. ►షావోమీ ఎమ్ఐ 11ఎక్స్ 5జీ: ఎక్స్చేంజ్ ఆఫర్, ఎస్బీఐ కార్డుతో ఈ స్మార్ట్ఫోన్ రూ. 21,749 కే రానుంది. ►శాంసంగ్ గెలాక్సీ ఎమ్12: బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ఫోన్ లిస్ట్లో ఈ స్మార్ట్ఫోన్ రూ. 10,349కు కొనుగోలుదారులకు లభించనుంది. చదవండి: ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలపై నిషేధం! త్వరలో ప్రభుత్వ రంగంలో? -
షావోమీకి దిమ్మతిరిగే షాకిచ్చిన ఒప్పో,వివో..!
Xiaomi Revenue Fails To Meet Expectations As Competition From Oppo Vivo Intensifies: ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమికి సమీప ప్రత్యర్థి స్మార్ట్ఫోన్ కంపెనీలైన ఒప్పో, వివో భారీ షాక్ను ఇచ్చాయి. స్మార్ట్ఫోన్ మార్కెట్లలో ఒప్పో, వివో కంపెనీల నుంచి తీవ్రమైన పోటీ రావడంతో కంపెనీ ఆదాయ అంచనాలను చేరుకోవడంలో షావోమీ విఫలమైంది. కంపెనీ క్యూ3 రెవెన్యూలో కేవలం 0.4 శాతం వృద్దిని మాత్రమే నమోదు చేసింది. క్యూ3 రెవెన్యూలో షావోమీ 8.2 శాతం పెరుగుదలను సాధించింది. రిఫీనిటివ్ డేటా ప్రకారం...మూడు నెలల్లో (జూలై -సెప్టెంబర్) దాదాపు రూ. 90,910 కోట్ల విక్రయాలను షావోమీ జరిపింది. ఈ క్యూ3లో సుమారు రూ. 92,300 కోట్లను షావోమీ అంచనా వేసినట్లు తెలుస్తోంది. వన్-టైమ్ లాభాలు, నష్టాలను మినహాయించి, షావోమీ సుమారు రూ. 6,040 కోట్ల లాభాన్ని ఆర్జించింది. షావోమీ ఆదాయం కేవలం 0.4 శాతం పెరిగి రూ. 55,655 కోట్లకు చేరుకుంది. రీసెర్చ్ సంస్థ కెనాలిస్ ప్రకారం... చైనాలో స్మార్ట్ఫోన్ అమ్మకాలు జూలై-సెప్టెంబర్ కాలంలో దాదాపు 5 శాతం మేర పడిపోయాయి. హువావేపై అమెరికా ఆంక్షలను విధించడంతో షావోమీ ఈ మేర లాభాలను పొందినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సమీప ప్రత్యర్థులు ఒప్పో, వివో కంపెనీలు క్యూ3లో గడించిన వృద్ధిని షావోమీ పొందలేకపోయింది. చైనాలో షావోమీ షిప్మెంట్లు మూడో త్రైమాసికంలో కేవలం 4 శాతం మేర పెరిగాయని కెనాలిస్ తెలిపింది. చదవండి: ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే! -
ఎలక్ట్రిక్ వాహన మార్కెట్పై స్మార్ట్ఫోన్ కంపెనీల దండయాత్ర!
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ఒప్పో ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్లు సమాచారం. 91మొబైల్స్ నివేదిక ప్రకారం.. 2023 చివరి నాటికి లేదా 2024 ప్రారంభంలో భారతదేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రారంభించాలని ఒప్పో కంపెనీ యోచిస్తోంది. ఒప్పో ఎలక్ట్రిక్ వేహికల్ గురించి వార్తలు ఇదే మొదటిసారి కాదు, గతంలో కూడా వార్తలు వినిపించాయి. ఈ నెల ప్రారంభంలో ఒప్పో తన సహ బ్రాండ్లు అయిన రియల్ మీ, వివోతో కలిసి భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ట్రేడ్ మార్క్ కోసం దరఖాస్తులను దాఖలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఒప్పో నిజంగా భారతదేశంలో ఈవీలను లాంఛ్ చేస్తుందా అనే విషయం గురుంచి కంపెనీ ఇంకా ధృవీకరించలేదు. అయితే స్మార్ట్ఫోన్లతో పాటు దేశంలో ఎలక్ట్రిక్ వాహనలను తీసుకొనిరావలనే కంపెనీ విస్తరణ ప్రణాళికలను ఇది తెలియజేస్తుంది. తాజా నివేదిక ప్రకారం.. ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఒప్పో ప్రణాళిక పనుల్లో ఇప్పటికే బిజీగా ఉంది. 2023 చివరి నాటికి లేదా 2024 ప్రారంభంలో దేశంలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఒప్పో ఇప్పటికే తన ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై పని ప్రారంభించిందని, టెస్లాకు బ్యాటరీ అందజేసే తయారీదారులు, విడిభాగాల సరఫరాదారులతో ఒప్పో కంపెనీ సీఈఓ టోనీ చాన్ సమావేశాలు నిర్వహించారని ఈ ఏడాది మేలో వార్తలు వచ్చాయి. (చదవండి: కస్టమర్లకు గుడ్న్యూస్ చెప్పిన స్విగ్గీ..! ఇక అన్లిమిటెడ్..!) ఇక తన ప్రధాన ప్రత్యర్థి కంపెనీ షియోమీ కూడా 2024 మొదటి అర్ధభాగంలో తన ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి తీసుకొని రావాలని యోచించడంతో ఒప్పో కూడా ఆ మార్కెట్లోకి రావాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది మార్చిలో ఈవీ మార్కెట్లోకి ప్రవేశించి, రాబోయే 10 ఏళ్లలో ఈ వ్యాపారంలో 10 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని షియోమీ తన ప్రణాళికల గురుంచి ప్రకటించింది. ఇది గత నెలలో తన ఎలక్ట్రిక్ వాహన వ్యాపారం కోసం షియోమీ ఈవీ ఇంక్ పేరునును కూడా నమోదు చేసింది. ఇప్పటికే భారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లో బలమైన ఉనికి కలిగి ఉన్న ఒప్పో, రియల్ మీ, షియోమీ వంటి కంపెనీలు ఈవి మార్కెట్లోకి అడుగుపెట్టాలని చూస్తున్నాయి. (చదవండి: ఆధార్ కార్డుదారులకు తీపికబురు.. కొత్తగా మరో 166 కేంద్రాలు!) -
అదిరే ఫీచర్లతో 5జీ ఫోన్, చేతులు కలిపిన జియో - షావోమీ
Xiaomi partnership with Jio for 5G phone: ఇండియన్ మార్కెట్లో సత్తా చాటుతున్న చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ షావోమీ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో విడుదల చేయబోయే స్మార్ట్ ఫోన్ కోసం రిలయన్స్ జియోతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఇటీవల విడుదలైన క్యూ3 స్మార్ట్ ఫోన్ ఫలితాల్లో షావోమీ సంస్థ 22 శాతం షిప్మెంట్తో స్మార్ట్ ఫోన్ మార్కెట్లో అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఆ స్థానాన్ని పదిలం చేసుకుంటూ.. మార్కెట్ షేర్ను పెంచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా వరుసగా 5జీ స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తుంది. నవంబర్ 30న షావోమీ రెడ్ మీ నోట్ 11 సిరీస్ను రీబ్రాండ్ చేస్తూ..భారత్లో రెడ్ మీ నోట్ 11 టీ 5జీ ఫోన్ను విడుదల చేయనుంది. ఫోన్ విడుదల నేపథ్యంలో..ఆ ఫోన్ పనితీరును గుర్తించేందుకు షావోమీ..,జియోతో చేతులు కలిపింది. రెడ్ మీ నోట్ 11టీ 5తో పాటు భవిష్యత్లో విడుదల కానున్న రెడ్ మీ 5జీ స్మార్ట్ ఫోన్ల పనితీరు, యూజర్ ఫ్రెండ్లీగా ఉందా' అనే విషయాల్ని గుర్తించేందుకు రిలయన్స్ జియో ఆధ్వర్యంలో 5జీ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది. వివిధ సెన్సార్ల ద్వారా ట్రయల్స్ నిర్వహించి 5జీ యూజర్ల ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనే అంశాన్ని గుర్తిస్తారు. రెడ్మీ నోట్ 11టీ ఫీచర్లు రెడ్ మీ నోట్ 11తరహాలో రెడ్ మీ నోట్ 11టీ మీడియా టెక్ డైమెన్సిటీ 810తో అందుబాటులో ఉంది. రియల్ మీ 8ఎస్ కాన్ఫిగరేషన్ల లాగే 6జీబీ ర్యామ్ 128జీబీ, 8జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ సౌకర్యం ఉంది. ఎంట్రీ లెవల్ కాన్ఫిగరేషన్ లలో వస్తున్న ఫోన్ ధర రూ. 17,999 ఉండగా టాప్ ఎండ్ మోడల్ ధర రూ.19,999కే సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ ఫోన్ ఫీచర్లపై షావోమీ సంస్థ స్పందిస్తూ.. రెడ్మీ నోట్ 11 రీ బాండ్రే ఈ రెడ్మీ నోట్ 11టీ స్మార్ట్ ఫోన్ అని తెలిపింది. కానీ ఇది స్విఫ్ట్డిస్ప్లే, స్పీడ్ ఛార్జింగ్, ర్యామ్ బూస్టర్ వంటి ఫీచర్లు ఉన్న నెక్ట్స్ జెనరేషన్ రేసర్ ఫోన్ అని తెలిపింది. చదవండి: షావోమీ మరో సంచలనం, మాట్లాడేందుకు కళ్ల జోడు తెస్తోంది -
షావోమీ 'నెక్ట్స్ జనరేషన్ రేసర్' మామూలుగా ఉండదు, ఫీచర్లు అదిరిపోతాయ్..!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ మరి కొద్ది రోజుల్లో 5జీ రెడ్మీ నోట్ 11టీ' ను విడుదల చేయనుంది. ఈ సందర్భంగా రెడ్ మీ 11టీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'నెక్ట్స్ జనరేషన్ రేసర్' అంటూ అభివర్ణించింది. దీంతో రెడ్ మీ నోట్ 11టీ ధర, ఫీచర్లు, స్పెసికేషన్లు గురించి తెలుసుకునేందుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. రెడ్ మీ నోట్ 11టీ ఫీచర్లు, ధరలు రెడ్ మీ నోట్ 11తరహాలో రెడ్ మీ నోట్ 11టీ మీడియా టెక్ డైమెన్సిటీ 810తో అందుబాటులో ఉంది. రియల్ మీ 8ఎస్ కాన్ఫిగరేషన్ల లాగే 6జీబీ ర్యామ్ 128జీబీ, 8జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ సౌకర్యం ఉంది. ఎంట్రీ లెవల్ కాన్ఫిగరేషన్ లలో వస్తున్న ఫోన్ ధర రూ. 17,999 ఉండగా టాప్ ఎండ్ మోడల్ ధర రూ.19,999కే సొంతం చేసుకోవచ్చు. రెడ్ మీ నోట్ 11టీ అంత స్పెషల్ ఎందుకో? నవంబర్ 30న విడుదల కానున్న5జీ రెడ్మీ నోట్ 11టీ' పై నెట్టింట్లో వినియోగదారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో షావోమీ సంస్థ స్పందిస్తూ.. రెడ్మీ నోట్ 11 రీ బాండ్రే ఈ రెడ్మీ నోట్ 11టీ స్మార్ట్ ఫోన్ అని తెలిపింది. కానీ ఇది స్విఫ్ట్డిస్ప్లే, స్పీడ్ ఛార్జింగ్, ర్యామ్ బూస్టర్ వంటి ఫీచర్లు ఉన్న 'నెక్ట్స్ జెనరేషన్ రేసర్' ఫోన్ అని తెలిపింది. రెడ్ మీ 11 ప్రో సిరీస్తో పాటే విడుదల షావోమీ సంస్థ నవంబర్ 30న రెడ్ మీ నోట్ 11 సిరీస్ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. రెడ్ మీ నోట్ 11ప్రో, రెడ్ మీ నోట్ 11 ప్రో ప్లస్ తో పాటే రెడ్ మీ నోట్ 11టీ'ని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. రెడ్ మీ నోట్ 11ధరలు చైనాలో రెడ్ మీ నోట్ 11టీ 4జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ.14,000 ఉండగా... 6జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ ఫోన్ రూ.15,200, 8జీబీ ర్యామ్ స్టోరేజ్ ఫోన్ ధర 17,500, 8జీబీ ర్యామ్ 256స్టోరేజ్ ఫోన్ ధర రూ.19,900గా ఉంది. -
Xiaomi Bumper Offer: రూ.15,999 స్మార్వాచ్.. రూ.7,999లకే.. ఇంకా మారెన్నో..
Mi Accessories Bonanza : ఇండియాలో నంబర్ వన్ స్మార్ట్ఫోన్ సెల్లర్ కంపెనీగా రికార్డ్ సృష్టించిన షావోమీ ఎంఐ సంస్థ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. యాక్ససరీస్ బొనాంజా పేరుతో తగ్గింపు ధరలకే స్మార్ట్వాచ్, ఇయర్ఫోన్స్, స్మార్ట్బ్యాండ్స్ తదితర యాక్సెసరీస్ని అందిస్తోంది. యాక్సెసరీస్ బొనాంజా స్మార్ట్ఫోన్లతో ఇండియా మార్కెట్లోకి ఎంటరైన షావోమి సంస్థ ఇక్కడ బలంగా పాతుకుపోయింది. స్మార్ట్ఫోన్లతో పాటు ల్యాప్ట్యాప్స్, బ్యాగ్స్, స్మార్ట్వాచెస్, ఇయర్ఫోన్స్, పాకెట్ స్పీకర్స్ తదితర యాక్సెసరీస్ని ఇక్కడి ప్రజలకు పరిచయం చేసింది. తక్కువ ధరకే నాణ్యమైన ప్రొడక్టులు అందిస్తుండంతో ఎంఐకి ఇండియాలో భారీ కస్టమర్ బేస్ ఏర్పడింది. ఈ కస్టమర్ల కోసం యాభై శాతం డిస్కౌంట్తో యాక్సెసరీస్ అందిస్తోంది. ఈ మేరకు నవంబరు 13, 14 తేదీల్లో ప్రత్యేకంగా యాక్సెసరీస్ బొనాంజా సేల్స్ ప్రకటించింది. ఎంఐ వాచ్ రివాల్వ్ యాక్సెసరీస్ బొనాంజా సేల్స్లో స్మార్ట్వాచ్ రివాల్వ్పై అత్యధికంగా రూ. 8000ల వరకు తగ్గింపు ఎంఐ అందిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ ఎంఆర్పీ ధర రూ.15,999లు ఉండగా ఈ ఆఫర్లో కేవలం రూ.7,999లకే సొంతం చేసుకోవచ్చు. ఈ వాచ్ ఫీచర్లు ఇలా ఉన్నాయి. - 3.53 అమోల్డ్ డిస్ప్లే, సింగిల్ ఛార్జ్తో 14 రోజలు బ్యాటరీ బ్యాకప్ - పీపీజీ బయో సెన్సార్స్తో 24 గంటల రియల్టైమ్ మానిటరింగ్, - లైఫ్క్యూ సాయంతో స్లీప్ట్రాకింగ్, వైటల్ సైన్, స్ట్రెస్, బ్రీత్, హార్ట్రేట్ మానిటరింగ్ ఫీచర్లు - 10 ప్రొఫెషనల్ స్పోర్ట్స్ , 117 స్పోర్ట్స్ మోడ్స్ సపోర్ట్ - ఆటోమేటిక వర్క్అవుట్ డిటెక్షన్ - జీపీఎస్, గ్లోనాస్, గాలిలియో, బీడీఎస్ సపోర్ట్ - అమెజాన్ అలెక్సా సపోర్ట్, వాటర్ రెసిస్టెంట్ - ఈ రివాల్వ్ స్మార్ట్వాచ్లో మరో వేరియంట్ అమెజాన్లో రూ.6,999లకే లభిస్తోంది. ఇతర ఆఫర్లు - ఎంఐ ఇయర్ఫోన్ ఎంఆర్పీ ధర రూ.999 ఉండగా ప్రత్యేక తగ్గింపుగా రూ.199కే వస్తోంది - ఎంఐ స్పోర్ట్స్ బ్లూటూత్ ఇయర్ఫోన్స్ బేసిక్ ధర రూ.1799 ఉండగా ఈ ఆఫర్లో రూ.499కే వస్తోంది - ఎంఐ స్మార్ట్బ్యాండ్ 4 ధర రూ.2499 ఉండగా యాక్సెసరీస్ బొనాంజా సేల్స్లో రూ.1,599కి అందిస్తోంది - రెడ్మీ స్మార్ట్బ్యాండ్ ధర రూ.2099లు కాగా ఈ ఆఫర్లో రూ.1299కే వస్తోంది - ఎంఐ పాకెట్ స్పీకర్ ధర రూ.1499 ఉండగా ఇప్పుడు రూ.799కే లభిస్తోంది. - ఎంఐ ప్రొటెక్టివ్ గ్లాస్ ధర రూ.599 కాగా ఈ ఆఫర్లో రూ.49కే అందుబాటులో ఉంది. చదవండి:షావోమీదే పైచేయి.. శాంసంగ్ వెనుకంజ -
షావోమీ మరో స్మార్ట్ ఫోన్ సిరీస్, ఫీచర్లు లీక్.. అదిరిపోయేలా
చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం 'షావోమీ' మరో సిరీస్ 'షావోమీ 12' స్మార్ట్ ఫోన్ లను విడుదల చేయనుంది. త్వరలోనే విడుదల కానున్న ఈఫోన్ ఫీచర్లు ప్రస్తుతం చైనాలో లీకయ్యాయి. లీకైన వివరాల ఆధారంగా ఈ ఫోన్లు స్నాప్ డ్రాగన్ 870 ఫ్లాట్ ఫాం ఆధారంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ ఫోన్ సిరీస్లు ఏమై ఉంటాయనే విషయంపై షావోమీ అధికారికంగా ప్రకటించకపోయినా.. మార్కెట్ పండితులు అభిప్రాయం ప్రకారం..లీకైన స్నాప్ డ్రాగన్ 870 ప్లాట్ఫారమ్ ఆధారంగా రెండు ఫోన్లలో ఒకటి రెడ్ మీ, మరొకటి షావోమీ అని తెలుస్తోంది. షావోమీ, రెడ్మీ ఫీచర్లు షావోమీ విడుదల చేసే కొన్ని వెర్షన్ లు హై ఎండ్ ఫీచర్లను కలిగి ఉంటున్నాయి. దీన్ని బట్టి లీకైన ఫోన్లలో స్నాప్డ్రాగన్ 870, 120హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్, 6.7 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లే, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, ఛార్జింగ్ టెక్నిక్లలో 67డబ్ల్యూ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 33డబ్ల్యూ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేయనున్నాయి. కెమెరాల విషయానికొస్తే 108 మెగాపిక్సెల్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఫ్రంట్ కెమెరా 20 మెగాపిక్సెల్ సెన్సార్, హార్మోన్ కార్డాన్ స్పీకర్లు, ఎక్స్ -యాక్సిస్ వైబ్రేషన్ మోటార్ ఉంటుందని భావిస్తున్నారు.మరోవైపు, రెడ్మి వెర్షన్లో స్నాప్డ్రాగన్ 870 చిప్, 6.6 అంగుళాల ఫ్లాట్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యాన్ని కలిగి ఉంది. -
మారుపేర్లతో అదరగొడుతున్న స్మార్ట్ ఫోన్, మరి ఇండియాలో..
చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ షావోమీ భారత్లో తన దూకుడును కొనసాగిస్తుంది. ఇప్పటికే స్మార్ట్ఫోన్ మార్కెట్లో అగ్రస్థానంలో ఉన్న షావోమీ.. తాజాగా రెడ్మీ నోట్11 5జీ ఫోన్ను 'రెడ్మీ నోట్ 11టీ' పేరుతో ఇండియాలో విడుదల చేయనుంది. షావోమీ సంస్థ గతవారం చైనాలో రెడ్మీ నోట్ 11 సిరీస్ను లాంఛ్ చేసింది. వరల్డ్ వైడ్గా స్మార్ట్ ఫోన్ యూజర్లను ఆకట్టుకుంటున్న ఈ రెడ్మీ నోట్ 11ను ఆయా దేశాల్లో మారు పేర్లతో విడుదల చేస్తోంది. చైనాలో రెడ్ మీ నోట్11గా విడుదల చేయగా..యురేపియన్ మార్కెట్లో పోకో ఎం4 ప్రో5జీగా విడుదల చేసేందుకు స్ధిమైంది. 'రెడ్మీ నోట్ 11టీ' ఫీచర్లు రెడ్మీ నోట్ 11 సిరీస్లో రెడ్మీ నోట్ 11 5జీ,రెడ్మీ నోట్11 ప్రో, రెడ్మీ నోట్11 ప్రో ప్లస్ మూడు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. స్పెసిఫికేషన్ల పరంగా రెడ్మీ నోట్ 11 ప్రో, ప్రో ప్లస్లలో ఫాస్ట్ ఛార్జింగ్ తప్ప మిగిలిన అన్నీ ఫీచర్లు ఒకేలా ఉన్నాయి. రెడ్మీ నోట్ 11 ప్రోలో 67వాల్ట్ల ఫాస్ట్ ఛార్జింగ్, 5,160ఎంఏహెచ్ తో వస్తుంది. రెడ్మీ నోట్ 11ప్రో ప్లస్లో 4,500ఎంఏహెచ్ బ్యాటరీ, 120వాల్ట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. మూడు స్మార్ట్ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ చిప్సెట్, పంచ్ హోల్ డిజైన్తో విడుదల కానుంది. చైనాలో రెడ్మీ నోట్ 11 సిరీస్ రూ.14,000 ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఎక్కువగా అమ్ముడైన ఫోన్ రెడ్మీ నోట్11 పేరుతో షావోమీ చైనాలో నిన్నటి నుంచి సేల్స్ ప్రారంభించింది.ఈ సేల్స్ ప్రారంభమైన గంటలోపు 500,000లక్షల ఫోన్లు అమ్ముడైన విషయం తెలిసిందే. భారత్లో సైతం షావోమీ విడుదల చేసిన రెడ్మీ సిరీస్ ఫోన్లు సేల్స్ భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఇటీవల భారత్లో విడుదలైన క్యూ3 (త్రైమాసిక) ఫలితాల్లో షావోమీ 22శాతం మార్కెట్ వాటాను కలిగి ఉండగా..షావోమీ నుండి విడుదలైన నాలుగు స్మార్ట్ఫోన్లు రెడ్మీ9, రెడ్మీ9 పవర్, రెడ్మీ నోట్ 10, రెడ్మీ 9 అత్యధికంగా అమ్ముడైన జాబితాలో మొదటి నాలుగు స్థానాల్ని దక్కించుకున్నాయి. ఈ నాలుగు ఫోన్లు మూడవ త్రైమాసికంలో మిలియన్ కంటే ఎక్కువగా అమ్ముడైన ఫోన్ల జాబితాలో చోటు సంపాదించాయి. ఈ ఏడాదిలో రెడ్మీ 9 ఇప్పటి వరకు అత్యధికంగా అమ్ముడైన మోడల్గా అగ్రస్థానంలో ఉందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తెలిపింది. చదవండి: మరికొన్ని గంటలే: షావోమి అదిరిపోయే ఆఫర్..సగానికి సగం ధరకే ఫోన్లు -
సేల్స్ బీభత్సం..! గంటలో 5లక్షల ఫోన్లు అమ్ముడయ్యాయి..!
జాతీయ,అంతర్జాతీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో చైనా ఫోన్లు సత్తా చాటుతున్నాయి. మనదేశంలో స్మార్ట్ఫోన్ 3వ త్రైమాసిక(జులై,ఆగస్ట్,సెప్టెంబర్) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో షావోమీ సంస్థకు చెందిన రెడ్మీ 9 సిరీస్ ఫోన్లు ఈ ఏదాది అత్యదికంగా అమ్ముడైన ఫోన్లుగా సరికొత్త రికార్డ్లను క్రియేట్ చేశాయి. తాజాగా అదే సంస్థకు చెందిన మరో ఫోన్ సేల్స్ రాకెట్లా దూసుకెళ్తున్నాయి. సేల్ ప్రారంభమైన గంటలోపు 500,000 కంటే ఎక్కువ యూనిట్ల అమ్మకాలు జరిగినట్లు షావోమీ తెలిపింది. గంటలో 5లక్షల ఫోన్ సేల్స్ షావోమీ గత వారం రెడ్మీ నోట్ సిరీస్లో రెడ్మీ నోట్ 11, రెడ్మీ నోట్11 ప్రో, రెడ్మీ నోట్ప్రో ప్లస్లను లాంఛ్ చేసింది. ఆఫోన్ సేల్స్ నేటి నుంచి చైనాలో ప్రారంభమయ్యాయి. అయితే సేల్స్ ప్రారంభమైన గంటలోపు 500,000లక్షల ఫోన్లు అమ్ముడైనట్లు షావోమీ తెలిపింది. ఫోన్ల అమ్మకాలు ప్రారంభమైన మొదటి 52 నిమిషాల 11 సెకన్లలో సుమారు 4 బిలియన్ యువాన్ల బిజినెస్ జరిగిందని, వీటిలో 1 నిమిషం 45 సెకన్లలో 2 బిలియన్ యువాన్లు బిజినెస్ జరిగినట్లు వెల్లడించింది. భారత్లో 20లక్షల ఫోన్ సేల్స్ ఇగ 'గిజ్మోచైనా' నివేదిక ప్రకారం..భారత్లో సైతం షావోమీ ఫోన్లు సేల్స్ భారీగా జరుగుతున్నాయి. ఈఏడాదిలో షావోమీకి చెందిన రెడ్ మీ నోట్ 10 విడుదలైన 3నెలల్లో ఒక్క భారత్లోనే 20లక్షల ఫోన్లు అమ్ముడైనట్లు గిజ్మోచైనా తన నివేదికలో పేర్కొంది. ఫోన్ ధరలు చైనాలో అమ్మకాలు జరుపుతున్న 4జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ రెడ్ మీ నోట్ 11 ధర రూ.14,000 ఉండగా.. 6జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ ఉన్న రెడ్ మీ నోట్ 11 ప్రో సుమారు రూ.18,700 గా ఉంది. రెడ్ మీ నోట్ 11ప్రో ప్లస్ ఫోన్ ధర రూ.22,200గా ఉంది. 8జీబీ ర్యామ్ 256జీబీ స్టోరేజ్ ఉన్న రెడ్ మీ నోట్ 11 వైపో ఎడిషన్ ఫోన్ ధర రూ.31,500గా నిర్ణయించింది. చదవండి: దుమ్ము లేపుతుంది, భారత్లో ఎక్కువగా అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్ ఇదే..! -
దుమ్ము లేపుతుంది, భారత్లో ఎక్కువగా అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్ ఇదే..!
మనదేశంలో స్మార్ట్ ఫోన్ మూడో త్రైమాసిక (జులై,ఆగస్ట్, సెప్టెంబర్) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ప్రముఖ ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ ఫలితాలు కేక పెట్టించాయి.యాపిల్ సంస్థ ఐఫోన్ 13 సిరీస్ను మార్కెట్లో విడుదల చేసినా షావోమీని అధిగమించలేకపోయింది. కానీ ఈ త్రైమాసికంలో యాపిల్ వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్గా పేరు సంపాదించుకుంది. కౌంటర్ పాయింట్ రిపోర్ట్ ఏమంటోంది.. కౌంటర్ పాయింట్ రిపోర్ట్ ప్రకారం.. మూడవ త్రైమాసికంలో మొత్తం భారతీయ స్మార్ట్ఫోన్ షిప్మెంట్లు 52 మిలియన్ యూనిట్లను దాటాయి. అయితే ఈ ఫలితాల్లో రెడ్మీ 9, రెడ్మీ 10 సిరీస్ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలతో 22 శాతం వాటాతో షావోమీ ఇండియన్ స్మార్ట్ఫోన్ మార్కెట్ షిప్మెంట్లో అగ్రస్థానంలో నిలిచింది. 19శాతం షిప్మెంట్తో శాంసంగ్ భారత్లో రెండవ అతిపెద్ద స్మార్ట్ఫోన్ బ్రాండ్గా నిలిచింది. ఇక ఈ నివేదిక ప్రకారం నార్డ్ సిరీస్ 3 మిలియన్ యూనిట్లు భారత్లో డెలివరీ అయినట్లు తేలింది. ఈ ఏడాది ఎక్కువగా అమ్ముడైన ఫోన్ క్యూ3 భారతీయ స్మార్ట్ఫోన్ షిప్మెంట్లపై కౌంటర్పాయింట్ నివేదికలో షావోమీ, శాంసంగ్, వివో, రియల్మీ, ఒప్పో ఫోన్ల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. షావోమీ 22శాతం మార్కెట్ వాటాను కలిగి ఉండగా..షావోమీ నుండి విడుదలైన నాలుగు స్మార్ట్ఫోన్లు రెడ్మీ9, రెడ్మీ9 పవర్, రెడ్మీ నోట్ 10, రెడ్మీ 9 అత్యధికంగా అమ్ముడైన జాబితాలో మొదటి నాలుగు స్థానాల్ని దక్కించుకున్నాయి. ఈ నాలుగు ఫోన్లు మూడవ త్రైమాసికంలో మిలియన్ కంటే ఎక్కువగా అమ్ముడైన ఫోన్ల జాబితాలో చోటు సంపాదించాయి. ఈ ఏడాదిలో రెడ్మీ 9 ఇప్పటి వరకు అత్యధికంగా అమ్ముడైన మోడల్గా అగ్రస్థానంలో ఉంది. కొత్తగా విడుదలై.. ఆకట్టుకుంటున్న ఫోన్లు ఇవే భారతదేశంలో 19 శాతం స్మార్ట్ఫోన్ మార్కెట్ వాటాతో శాంసంగ్ రెండవ స్థానంలో ఉంది. రూ.10,000 నుంచి రూ.30,000 మధ్యలో ఉన్న ఫోన్ అమ్మకాల మార్కెట్ వాటా 25 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. శాంసంగ్ గెలాక్సీ ఎం42, శాంసంగ్ గెలాక్సీ ఎం 52, శాంసంగ్ గెలాక్సీ ఏ 22, శాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ మోడళ్లు 5జీ స్మార్ట్ఫోన్ సెగ్మెంట్ బ్రాండ్లు రెండో స్థానాన్ని ఆక్రమించాయి. కొత్తగా విడుదలైన శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్3, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ఫోన్లో భారత స్మార్ట్ ఫోన్ యూజర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నట్లు తేలింది. క్యూ3లో వివో షేర్ ఎంతంటే క్యూ3 2021లో 15 శాతం మార్కెట్ షేర్తో వివో 3వ స్థానంలో నిలిచింది. రియల్మీ 14 శాతం మార్కెట్ వాటా, ఒప్పో10 శాతం మార్కెట్ వాటాతో ఐదవ స్థానంలో నిలిచాయి. ఆపిల్ మూడవ త్రైమాసికంలో సంవత్సరానికి 212 శాతం వృద్ధితో వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్ అని కౌంటర్ పాయింట్ పేర్కొంది. క్యూ3 55 శాతం వృద్ధిని నమోదు చేయడంతో వన్ ప్లస్ నార్డ్ సిరీస్కు భారతదేశంలో మంచి ఆదరణ లభించిందని కౌంటర్ పాయింట్ పేర్కొంది. కొత్తగా ప్రారంభించిన వన్ ప్లస్ నార్డ్2, నార్డ్ సీఈ 5జీలు వన్ ప్లస్ మార్కెట్లో రాణించడానికి కారణమైనట్లు వెల్లడించింది. క్యూ3 లో మొదటిసారిగా 5G స్మార్ట్ఫోన్ షిప్మెంట్లు 10 మిలియన్ల మార్కును అధిగమించాయని నివేదికలో చెప్పింది. వివో 5జీలో టాప్ స్మార్ట్ఫోన్ బ్రాండ్గా చెప్పబడింది. శామ్సంగ్, వన్ప్లస్, రియల్మీ 5జీ ఫోన్లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. చదవండి: మరికొన్ని గంటలే: షావోమి అదిరిపోయే ఆఫర్..సగానికి సగం ధరకే ఫోన్లు -
మరికొన్ని గంటలే: షావోమి అదిరిపోయే ఆఫర్..సగానికి సగం ధరకే ఫోన్లు
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ బంపర్ ఆఫర్లు ప్రకటించింది. పలు బ్రాండెడ్ ఫోన్లను ఎక్ఛేంజ్ ఆఫర్తో సగానికి పైగా తక్కువ ధరకే లభించేలా ఆఫర్లు అమలు చేస్తోంది. సుమారు రూ.40వేల ఖరీదైన ఎంఐ 11ఎక్స్ ప్రో 5జీ స్మార్ట్ఫోన్ 8జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్పై అన్ని రకాల రాయితీలు వర్తిస్తే కేవలం రూ. 12, 849కే సొంతం చేసుకోవచ్చు. ఎంఐ 11ఎక్స్ ప్రో 5జీ స్మార్ట్ఫోన్ ఫీచర్లు 6.67 అంగుళాల ఫుల్ హెచ్ హెచ్డీ అమోలెడ్ డిస్ప్లే 4,520ఎంఏహెచ్ బ్యాటరీ,క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంకి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్లో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 108 మెగాపిక్సెల్ శాంసంగ్ హెచ్ఎం2 సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్లు ఉండగా ..కెమెరా వెనుక భాగంలో ఉన్న 3కెమెరాలకు 5 మెగాపిక్సెల్ మ్యాక్రో షూటర్లు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఎంఐ 11ఎక్స్ ప్రో స్మార్ట్ఫోన్ను సెలెస్టియల్ సిల్వర్, కాస్మిక్ బ్లాక్, లూనార్ వైట్ కలర్స్తో అమెజాన్లో అందుబాటులో ఉన్న ఫోన్పై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఆఫర్లు ఇలా ఉన్నాయి దేశంలో ఫెస్టివల్ సీజన్లో ఈకామర్స్ కంపెనీ అమెజాన్ 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్' పేరుతో భారీ ఆఫర్లను అందిస్తుంది. ఇందులో భాగంగా షావోమీ ఇండియా 8జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్, 8 జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్లపై డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ ఫోన్ ధరల విషయానికొస్తే 8జీబీ ర్యామ్ ప్లస్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999 ఉంది, ఈ మోడల్పై ఎక్సేంజీ ఆఫర్లో గరిష్టంగా రూ.25,250లను షావోమీ ఆఫర్ చేస్తోంది. మీ పాత మొబైల్ ఫోన్కి ఎక్సేంజీలో మ్యాగ్జిమమ్ అమౌంట్ వస్తే ఫోన్ ధర రూ.14,249కి వస్తుంది. అయితే ఇక్కడో మరో ఆఫర్ని కూడా పొందే వీలుంది. ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్/డెబిట్ కార్డు చెల్లింపుల ద్వారా గరిష్టంగా మరోసారి రూ. 1,400ల వరకు డిస్కౌంట్ని పొందవచ్చు. దీంతో మొబైల్ చివరకు రూ.12,849లకే సొంతం చేసుకోవచ్చు. ఇదే మోడల్లో మరో వేరియంట్ 8జీబీ ర్యామ్ ప్లస్ 256జీబీ స్టోరేజ్తో రూ.41,999గా ధరతో ఉంది. ఈ మొబైల్ ఫోన్పై గరిష్ట ఎక్సేంజీ రూ.16,250గా ఉంది. దీంతో పాటు ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్/డెబిట్ కార్డు చెల్లింపుల ద్వారా గరిష్టంగా మరోసారి రూ.1,400ల వరకు డిస్కౌంట్ని పొందవచ్చు. అయితే 256 జీబీ వేరియంట్తో పోల్చితే 128 వేరియంట్ని ఎంపిక చేసుకోవడం ద్వారా తక్కువ మొత్తానికే ఫోన్ను కొనుగోలు చేయవచ్చు. చదవండి: Xiaomi Smart Glasses: మాట్లాడేందుకు కళ్ల జోళ్లొస్తున్నాయ్ -
షావోమీ దీవాళి విత్ ఎమ్ఐ సేల్..! 5 లక్షల నగదు గెల్చుకునే అవకాశం..!
ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ ‘దీవాళీ విత్ ఎమ్ఐ సేల్’ ను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆఫ్లైన్ ఎక్స్కూజివ్ సేల్ను కూడా షావోమీ ప్రకటించింది. దీవాళీ విత్ ఎమ్ఐ సేల్ భాగంగా షావోమి స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ఇతర గ్యాడ్జెట్స్పై డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ ఆఫర్స్ నవంబరు 6 వరకు అందుబాటులో ఉండనున్నాయి. సేల్లో భాగంగా ప్రతి రోజు 64 మంది లక్కీ విన్నర్లకు రూ. 1000 నుంచి 5 లక్షల వరకు క్యాష్ప్రైజ్ను అందిస్తోంది. లక్కీ విన్నర్లకు లక్కీ డ్రా ద్వారా ఓ సెడాన్ కారు, సూపర్ బైక్స్ ను కూడా షావోమీ అందించనుంది. చదవండి: సౌండ్కోర్ నుంచి సరికొత్త వాటర్ప్రూఫ్ స్పీకర్.! ధర ఎంతంటే..! స్మార్ట్ఫోన్లపై ఆఫర్స్..! దీవాళి విత్ ఎమ్ఐ సేల్లో భాగంగా ఎంఐ 11ఎక్స్ సిరీస్ స్మార్ట్ఫోన్స్పై గరిష్టంగా రూ.3 వేల వరకు డిస్కౌంట్ను కొనుగోలుదారులు పొందవచ్చును. షావోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ స్మార్ట్ఫోన్ కొనుగోలుపై రూ. 2000 వరకు క్యాష్బ్యాక్ను అందిస్తోంది. దీవాళి విత్ ఎమ్ఐ సేల్లో భాగంగా రెడ్ మీ నోట్ 10 సిరీస్, రెడ్ మీ 9 సిరీస్ లాంటి మోడళ్లపై రూ.1000ల వరకు డిస్కౌంట్ను షావోమీ అందిస్తోంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ఈఎంఐ ఆప్షన్ కొనుగోలుపై 3 వేల వరకు క్యాష్ బ్యాక్ను షావోమీ అందిస్తోంది. స్మార్ట్టీవీలపై షావోమీ అందిస్తోన్న ఆఫర్స్..! పలు స్మార్ట్టీవీ మోడళ్లపై షావోమీ భారీ తగ్గింపును ప్రకటించింది. ఈ సేల్లో రెడ్ మీ స్మార్ట్ టీవీ ఎక్స్ మోడల్ పై రూ.3000 నుంచి రూ.5000 వరకు డిస్కౌంట్ను అందిస్తోంది. 32 అంగుళాల,55 అంగుళాల సైజ్లో గల ఎంఐ టీవీలపై రూ.1000నుంచి రూ.3000వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుపై రూ.3500 ఈఎమ్ఐ ఆపర్లను అందిస్తోంది. చదవండి: టైటాన్ డబుల్ ధమాకా..! -
షావోమి దూకుడు, ఫాస్ట్ డేటా షేరింగ్ కోసం..
చైనాకు చెందిన షావోమి కంపెనీ దూకుడు మీదుంది. ఇప్పటికే స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ బ్రాండ్స్, మరికొద్ది రోజుల్లో కార్లను విడుదల చేయనున్న షావోమి తాజాగా సోనిక్ ఛార్జ్ 2.0 పేరుతో కేబుల్ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. Here's a true ally to our fast-paced lives. This one will support your pursuit to great speed, and how! #XiaomiFans, meet our newest game-changer: Xiaomi SonicCharge Cable 2.0 Stay tuned for the first sale:https://t.co/BqrE5wISBx pic.twitter.com/4mVrHxjaLi — Xiaomi India - #DiwaliWithMi (@XiaomiIndia) October 20, 2021 షోవోమి సోనిక్ ఛార్జ్ 2.0 కేబుల్ ఫీచర్లు రోజురోజుకి మార్కెట్లో స్మార్ట్ ప్రొడక్ట్ల డిమాండ్ పెరిగిపోతుంది. వినియోగదారుల డిమాండ్లో దృష్టిలో పెట్టుకొని ఆయా టెక్ కంపెనీలు స్మార్ట్ ఉత్పత్తుల్ని మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. తాజాగా షోవోమి సోనిక్ ఛార్జ్ 2.0 కేబుల్ను విడుదల చేసింది. భారత మార్కెట్లో విడుదలైన షావోమి కేబుల్ 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్, 480 ఎంబీపీఎస్ వరకు ఫాస్ట్ డేటా ట్రాన్స్ఫర్, 1మీటర్ లెంగ్త్, ఒకవైపు యూఎస్బీ టైప్- ఏ కనెక్టర్ ..మరోవైపు టైప్ సీ-కనెక్టర్, ప్రొటెక్షన్ కోసం మల్టీ లేయర్ ప్రొటెక్షన్ ఫీచర్లు ఉన్నాయి. షోవోమి సోనిక్ ఛార్జ్ 2.0 కేబుల్ ధర దీపావళి సందర్భంగా విడుదల చేసిన ఈ షావోమీ సోనిక్ ఛార్జ్ 2.0 కేబుల్ ధర రూ.249 ఉంది. సింగిల్ వైట్ కలర్ వేరియంట్లో ఉన్న ఈ ఛార్జర్పై షావోమి 6 నెలల వారంటీ ప్రకటించింది. మి 67డబ్ల్యూ సోనిక్ ఛార్జ్ 3.0 ఛార్జర్ ఫీచర్లు, ధర ఇక ఈఏడాది జులై షావోమి లాంచ్ చేసిన మి 67డబ్ల్యూ సోనిక్ ఛార్జ్ 3.0 ఛార్జర్, ఫాస్ట్ ఛార్జింగ్ కోసం క్వాల్క్మ్ 3.0 సపోర్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఇక దీని ధర 1999 ఉండగా సోలె వైట్ కలర్స్తో అందుబాటులో ఉంది. ఇక ఈ ఛార్జర్ 67డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ తోపాటు యూఎస్బీ టైప్-ఏ మరోవైపు యూఎస్బీ టైప్ సీ సపోర్ట్ ఉంది. చదవండి: ఏఐ టెక్నాలజీతో వైర్లెస్ ఇయర్ బడ్స్, సూపర్ ఫీచర్లతో -
యాపిల్కు భారీ షాక్, ఒక్క సెకన్లో ఐఫోన్13 హ్యాక్
గ్లోబల్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ షావోమిని వెనక్కి నెట్టిన యాపిల్ సంస్థకు భారీ షాక్ తగిలింది. ఇటీవల యాపిల్ విడుదల చేసిన 'ఐఫోన్ -13 ప్రో'ను సెకన్ల వ్యవధిలో 'వైట్ హ్యాట్' హ్యాకర్స్ హ్యాక్ చేశారని చైనాకు చెందిన టెక్ అనాలసిస్ సంస్థ ఐథోమ్ తన రిపోర్ట్లో పేర్కొంది. షావోమిని వెనక్కి నెట్టింది.. కానీ గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ సంస్థ కెనాలిస్ ప్రకారం..ఈ ఏడాది క్యూ3 (జులై నుంచి సెప్టెంబర్) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో టెక్ దిగ్గజం యాపిల్ 15 శాతం వాటాతో.. చైనాకు చెందిన షావోమిని అధిగమించింది. తిరిగి రెండో స్థానాన్ని తిరిగి దక్కించుకుంది. అందుకు కారణం ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్ఫోన్కు విపరీతమైన డిమాండ్ పెరగడమేనని టెక్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. యాపిల్ సంస్థ ప్రతి ఏడాది నిర్వహించే 'యాపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫిరెన్స్'ను ఈ ఏడాది నిర్వహించింది. ‘కాలిఫోర్నియా స్ట్రీమింగ్’ ద్వారా సెప్టెంబర్ 14న నిర్వహించిన ఈవెంట్లో యాపిల్ సంస్థ ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లను విడుదల చేసింది. సెక్యూరిటీ విషయంలో తిరుగు లేదు ఈ సందర్భంగా యాపిల్ ప్రతినిధులు మాట్లాడుతూ తాము విడుదల చేసే, లేదంటే విడుదల కానున్న ఐఫోన్లలో ప్రైవసీ,సెక్యూరిటీ విషయంలో రాజీపడబోమని తెలిపారు. కానీ చైనా 'వైట్ హ్యాట్' హ్యాకర్స్ మాత్రం ఇతర ఆండ్రాయిడ్ ఫోన్లను ఎలా హ్యాక్ చేయొచ్చో..తాజాగా యాపిల్ విడుదల చేసిన ఐఫోన్ 13సిరీస్ ఫోన్లను సెకన్లలో హ్యాక్ చేయొచ్చని తెలిపారు. ఒక్క సెకన్లో హ్యాక్ చేశారు ఇటీవల చైనాలో 4వ 'టియాన్ఫు కప్' ఇంటర్నేషనల్ సైబర్ సెక్యూరిటీ కాంటెస్ట్ జరిగింది. ఈ కాంటెస్ట్లో వైట్ హ్యాట్ హ్యాకర్ ఐఫోన్ 13 ప్రోని సెకన్లలో హ్యాక్ చేశాడు. హ్యాక్ చేసిన హ్యాకర్ ఐఫోన్లో ఉన్న ఫోటో ఆల్బమ్, యాప్లకు యాక్సెస్ చేశాడు. అంతేకాదు అందులో ఉన్న డేటాను ఈజీగా డిలీట్ చేయడం సాధ్యమైందని ఐథోమ్ తన రిపోర్ట్లో పేర్కొంది. మరి ఈ ఐఫోన్13 ప్రో హ్యాకింగ్ పై ఐఫోన్ ప్రతినిధులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. వైట్ హ్యాట్ హ్యాకర్లు అంటే ఎవరు వైట్ హ్యాట్ హ్యాకర్లు లేదా ఎథికల్ హ్యాకర్స్. ఈ హ్యాకర్స్ను ఆయా సంస్థల్లో లేదంటే, టెక్నాలజీలోని లోపాల్ని గుర్తిస్తారు. నిబంధనలకు అనుగుణంగా లోపాల్ని గుర్తించేలా పనిచేసే వీళ్లని ఆయా టెక్ సంస్థలు, లేదంటే ప్రభుత్వాలు సైతం నియమించుకుంటాయి. చదవండి : ఐఫోన్ 13 వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లుతో.. -
Xiaomi: షావోమీ నుంచి ఎలక్ట్రిక్ వాహనాలు ..! ఎప్పుడు వస్తాయంటే..?
స్మార్ట్ఫోన్ రంగంలో షావోమీ పెను సంచలనాన్నే సృష్టించింది. సూపర్ ఫీచర్స్తో అత్యంత చౌక స్మార్ట్ఫోన్లను షావోమీ ప్రపంచానికి పరిచయం చేసింది. కేవలం స్మార్ట్ఫోన్ ఉత్పత్తులపైనే ఫోకస్ పెట్టకుండా ఇతర ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై కూడా షావోమీ దృష్టి సారించింది.ఇప్పటికే షావోమీ ల్యాప్ట్యాప్స్, గృహోపకరణ ఉత్పత్తులను కూడా లాంచ్ చేసింది. చదవండి: ఎలక్ట్రిక్ వాహన రంగంలో సంచలనం..! ఇది వస్తే ఆ సమస్యకు చెక్..! ఇప్పుడు వీటిపై దృష్టి...! ప్రపంచవ్యాప్తంగా పలు ఆటోమొబైల్ కంపెనీలు సంప్రాదాయ శిలాజ ఇంధన వాహనాలకు స్వస్తి పలుకుతూ..ఎలక్ట్రిక్ వాహానాల తయారీపై దృష్టిసారించాయి. ఆటోమొబైల్ కంపెనీలకు పోటీగా ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ ఆపిల్ కూడా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం ఇప్పటికే పావులు కదుపుతోంది. అతి త్వరలోనే ఆపిల్ తన ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేసేందుకు ప్రయత్నాలను చేస్తోంది. ఆపిల్ లాంటి దిగ్గజ స్మార్ట్ఫోన్ కంపెనీలే కాకుండా ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ కూడా ఎలక్ట్రిక్ వాహానాల తయారీపై దృష్టిసారించింది. ఎలక్ట్రిక్ కార్లను 2024 ప్రథమార్థంలో లాంచ్ చేయనున్నట్లు షావోమీ ఒక ప్రకటనలో పేర్కొంది. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ లీ జున్ మాట్లాడుతూ...2024లో భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్ కార్లను షావోమీ ఉత్పత్తి చేయనుందని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహన రంగంలో వచ్చే పదేళ్లలో సుమారు 10 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనుందని తెలిపారు. అత్యంత చౌక ధరలకే స్మార్ట్ఫోన్లను పరిచయం చేసిన షావోమీ ఎలక్ట్రిక్ వాహనాల్లో భాగంగా మిగతా ఆటోమొబైల్ కంపెనీల ఈవీల కంటే తక్కువ ధరలకే షావోమీ అందించే అవకాశం లేకపోలేదని నిపుణుల భావిస్తున్నారు. చదవండి: ఆహా ఏమి అదృష్టం! ఏడాదిలో వారి దశ తిరిగింది -
చైనాకు భారత్ భారీ షాక్!
Indian Government Regulation To Prevent Handset Snooping: పొరుగు దేశం చైనాకు భారత్ భారీ షాక్ ఇచ్చింది. భారత మార్కెట్ను శాసిస్తున్న.. చైనా బ్రాండ్ ఫోన్ల విషయంలో ఉక్కుపాదం మోపాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు వివో, ఒప్పో, షావోమీ, వన్ఫ్లస్ కంపెనీలను పరిశీలన విభాగం కిందకు తీసుకొచ్చి మరీ నోటీసులు పంపించింది. ఇప్పటి నుంచి చైనా నుంచి దిగుమతి అయ్యే స్మార్ట్ఫోన్లకు సంబంధించి పూర్తి వివరాలను భారత్కు సమర్పించాల్సి ఉంటుంది. అంటే.. సదరు బ్రాండ్ ఫోన్లలో ఎలాంటి కంపోనెంట్లు ఉపయోగిస్తున్నారో లాంటి పూర్తి వివరాల్ని సైతం వెల్లడించాల్సిందేనని(చైనా ఇంతవరకు చేయని పనే ఇది!.. ఈ విషయంలో పలు దేశాలకూ అనుమానాలున్నాయి) నోటీసుల్లో భారత్ పేర్కొంది. అంతేకాదు సెక్యూరిటీ కారణాల వల్ల ప్రీ ఇన్స్టాల్ యాప్స్ తదితర వివరాల్ని వెల్లడించాల్సి ఉంటుంది. ఇదంతా నిఘా కోణంలో భాగంగానే తీసుకున్నట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది. భారత్లోని కన్జూమర్లకు ఆ ప్రొడక్టులు సురక్షితమైనవేనా? కాదా? అనేది తేల్చుకోవాల్సిన అవసరం తమకు ఉందని ఈ సందర్భంగా భారత ప్రభుత్వం నోటీసుల్లో పేర్కొన్నట్లు ది మార్నింగ్ కంటెక్స్ట్ ఓ కథనం ప్రచురించింది. కౌంటర్పాయింట్ రీసెర్చ్ డాటా ప్రకారం.. మన దేశపు స్మార్ట్ఫోన్ మార్కెట్లో పైన పేర్కొన్న ఫోన్ల కంపెనీల ఆధిపత్యమే 50 శాతం దాకా కొనసాగుతోంది. భారత్-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్ని తరుణంలో.. కిందటి ఏడాది ఒక్కసారిగా 220 చైనా యాప్ల్ని నిషేధించి పెద్ద దెబ్బ కొట్టింది కేంద్ర ప్రభుత్వం. యాప్ల ద్వారా రహస్యాలను, వ్యక్తిగత డాటాను సేకరిస్తుందనే ఆరోపణల మీద ఆ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అప్పటి నుంచి ‘లోకల్నెస్’ ప్రదర్శించుకోవడం కోసం స్థానిక ఉత్పత్తి దిశగా అడుగులు ప్రారంభించాయి కొన్ని కంపెనీలు. కానీ, కేంద్రం మాత్రం ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా.. ఇప్పుడు ఫోన్ల ద్వారా రహస్యాల సేకరణకు ఆస్కారం ఉన్నందున స్మార్ట్ఫోన్ల మార్కెట్ నియంత్రణకు సిద్ధపడడం విశేషం. చదవండి: చైనాతో కచ్చి.. బిజినెస్ మాత్రం బిలియన్లలో! -
ఐఫోన్13 ఎంట్రీతో షావోమీకు భారీ షాక్...!
ఎట్టకేలకు గ్లోబల్ స్మార్ట్ఫోన్ మార్కెట్లలో ఆపిల్ ప్రముఖ చైనీస్ కంపెనీ షావోమీని అధిగమించింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో (క్యూ 3) ఆపిల్ 15 శాతం వాటాతో గ్లోబల్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో రెండవ స్థానాన్ని తిరిగి దక్కించుకుంది. ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్ఫోన్కు వీపరితమైన డిమాండ్ రావడంతో షావోమిను వెనక్కి నెట్టేసింది. ఎప్పటిలాగానే శాంసంగ్ మొదటి స్థానంలో నిలిచింది. గ్లోబల్ స్మార్ట్ఫోన్ మార్కెట్లలో శాంసంగ్ 23 శాతం వాటాను దక్కించుకుంది. చదవండి: నోకియా నుంచి టఫెస్ట్ స్మార్ట్ఫోన్...! లాంచ్ ఎప్పుడంటే.. గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ సంస్థ కెనాలిస్ అందించిన ప్రాథమిక డేటా ప్రకారం.. స్మార్ట్ఫోన్ మార్కెట్లలో షావోమీ 14 శాతం వాటాను దక్కించుకోగా వివో, ఒప్పో స్మార్ట్ఫోన్స్ 10 శాతం వాటాతో తరువాతి స్థానాల్లో నిలిచాయి. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో గ్లోబల్ స్మార్ట్ఫోన్ షిప్మెంట్లు 6 శాతం మేర తగ్గినట్లు పేర్కొంది. చిప్స్ కొరత.. అంతర్జాతీయంగా సెమికండక్టర్స్ కొరతతో పలు దిగ్గజ స్మార్ట్ఫోన్ కంపెనీలు తీవ్రంగా సతమతమయ్యాయి. చిప్స్ కొరత ఉన్నప్పటికీ పలు స్మార్ట్ఫోన్ కంపెనీలు ఉత్పత్తి విషయంలో రాజీ పడలేదు. చిప్స్ కొరత పలు స్మార్ట్ఫోన్ కంపెనీలు ఫోన్ ధరలను కూడా పెంచాయని కానలిస్ ప్రిన్సిపల్ ఆనలిస్ట్ బెన్ స్టాన్టాన్ వెల్లడించారు. స్మార్ట్ఫోన్ కంపెనీలకు చిప్స్ కొరత 2022 వరకు వేధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్' మరో రికార్డు -
5 రోజుల్లో షావోమీ స్మార్ట్ఫోన్ అమ్మకాలు తెలిస్తే షాకే..!
దసరా, దీపావళి పండుగ సీజన్లు రావడంతో పలు ఈ-కామర్స్ సంస్థలు, ఇతర ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, ఉత్పత్తుల సంస్థలు ఫెస్టివల్ సీజన్లను ప్రకటించాయి. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్సేల్ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ-కామర్స్ సంస్థల బాటలోనే ప్రముఖ చైనీస్ దిగ్గజం షావోమీ కూడా నడుస్తోంది. షావోమీ కొనుగోలు దారులకు ‘దీపావళి సేల్ విత్ ఎమ్ఐ’ సేల్ ను ప్రకటించింది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్తో పాటుగా షావోమీ సేల్పై భారతీయులు ఎగబడి స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేశారు. 5 రోజుల్లో అక్షరాల 20 లక్షల స్మార్ట్ఫోన్లను విక్రయించామని షావోమీ బుధవారం రోజున ఒక ప్రకటనలో వెల్లడించింది. చదవండి: అమ్మేది మాంసం..! సుమారు ఒక బిలియన్ డాలర్లు వారి సొంతం..! ప్రీమియం సెగ్మెంట్లో భాగంగా షావోమీ 11 లైట్ ఎన్ఈ5జీ, మిడియమ్ సెగ్మెంట్లో ఎమ్ 11ఎక్స్, రెడ్మీ నోట్ 10ఎస్, రెడ్మీ నోట్ 10 ప్రో, రెడ్మీ 9 సిరీస్ స్మార్ట్ఫోన్స్ భారతీయులు భారీగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. గత ఏడాది కంటే రికార్డు స్థాయిలో 10 శాతం మేర అమ్మకాలు జరిగాయని షావోమీ పేర్కొంది. ఇక స్మార్ట్టీవీ అమ్మకాల్లో కూడా షావోమీ రికార్డు నమోదు చేసింది. మూడురోజల్లో సుమారు లక్షకు పైగా స్మార్ట్టీవీలను షావోమీ విక్రయించింది. చదవండి: ఎలన్ మస్క్ కంపెనీ బలుపు చేష్టలు..టెస్లాకు భారీ షాక్! -
షావోమీ నుంచి నయా 5జీ స్మార్ట్ఫోన్..! ధర ఏంతంటే...!
ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ తాజాగా భారత మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. షావోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ను బుధవారం లాంచ్ చేసింది. షావోమీ ఈ స్మార్ట్ఫోన్తో పాటు షావోమీ బియర్డ్ ట్రిమర్ 2ను కూడా రిలీజ్ చేసింది. ధర విషయానికొస్తే ఈ ఫోన్ 6జీబీ+128 స్టోరేజ్ జీబీ స్టోరేజ్ ఫోన్ రూ. 26,999, 8జీబీ+128జీబీ స్టోరేజ్ ఫోన్ రూ. 28,999కి అందుబాటులో ఉంది. షావోమి ప్రారంభ ధరలో భాగంగా రూ. 2000తో పాటు దీపావళి డిస్కౌంట్లో భాగంగా రూ. 1500 అందించనున్నారు. షావోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ ఫీచర్స్ 6.55 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778జీ 5జీ ప్రాసెసర్ 8 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ 64 మెగా పిక్సెల్ రియర్ కెమెరా 20 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ 4,250ఎమ్ ఏహెచ్ బ్యాటరీ యూఎస్బీ టైప్సీ సపోర్ట్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింటర్ చదవండి: ఈ స్మార్ట్ఫోన్ కొనుగోలుపై ఐదు సంవత్సరాల వారంటీ...! -
భారీ డిస్కౌంట్లతో పండుగకు వస్తున్న షావోమీ..! రూ.75 వేల వరకు తగ్గింపు..!
ప్రముఖ చైనీస్ దిగ్గజం షావోమీ దీపావళి సందర్భంగా ‘సెలబ్రెట్ దీపావళి విత్ ఎమ్ఐ’ సేల్ను త్వరలోనే ప్రారంభించనుంది. ఈ సేల్కు సంబంధించిన డిస్కౌంట్లను, ఆఫర్లను షావోమీ తన వెబ్సైట్లో టీజ్ చేసింది. ఈ సేల్ భాగంగా స్మార్ట్ఫోన్స్, స్మార్ట్టీవీలను, ఇతర ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లను అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ సేల్లో పాల్గొనే కస్టమర్లకు ముందుగానే సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 1 వరకు ప్రీబుకింగ్స్ చేసుకోనే సౌకర్యాన్ని షావోమీ కల్పిస్తోంది. చదవండి: జియో ఫోన్ లాంచ్కు ముందు..మరో కంపెనీపై ముఖేశ్ అంబానీ కన్ను..! పలు షావోమీ ఉత్పత్తులపై సుమారు రూ. 5,000 నుంచి రూ. 75,000 వరకు డిస్కౌంట్లను షావోమీ అందించనుంది. దీపావళి విత్ మి సేల్ రివార్డ్ మి ఇన్స్టంట్ కూపన్ల ద్వారా రూ. 5,000 వరకు తగ్గింపును షావోమీ ప్రకటించింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు కొనుగోలు చేసే సమయంలో 10 శాతం తక్షణ డిస్కౌంట్ను కూడా పొందవచ్చును. షావోమి అందిస్తోన్న ఆఫర్ల విషయానికొస్తే, దీపావళి విత్ ఎమ్ఐ సేల్లో షావోమీ స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ఎమ్ఐ బాక్స్ 4కే అలాగే దాని ఐవోటీ పరికరాలపై ధర తగ్గింపు ఉంటుంది. షావోమి అందిస్తోన్న పలు ఆఫర్లు...! రెడ్మీ 9ఏ 2జీబీ ర్యామ్+32ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ. 6,799 అందిస్తోంది. దీని అసలు ధర రూ .8,499. షావోమి ఎమ్ఐ 11 ఎక్స్ స్మార్ట్ఫోన్ను భారీ డిస్కౌంట్లను అందిస్తున్నట్లు షావోమీ తన వెబ్సైట్లో టీజ్ చేసింది. 75-అంగుళాల ఎమ్ఐ క్యూఎల్ఈడీ టీవీపై సుమారు రూ .75,000 తగ్గింపు న అందించనుంది. దీని అసలు ధర రూ. 1,99,999. 50-అంగుళాల ఎమ్ఐ టీవీ 5ఎక్స్ మోడల్పై రూ. 20,000 తగ్గింపును సేల్ సమయంలో పొందవచ్చు. 40-అంగుళాల ఎమ్ఐటీవీ 4ఏ రూ. 8,000 తగ్గింపును ప్రకటించనుంది. చదవండి: వన్ప్లస్ 9, వన్ప్లస్ 9 ప్రో స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపు...! -
బెల్ట్తో పేమెంట్స్...! టెక్నాలజీలో సరికొత్త ఆవిష్కరణ..!
శాస్త్ర సాంకేతికత రోజూరోజూ సరికొత్త పుంతలను తొక్కుతుంది. సరికొత్త ఆవిష్కరణలను రూపొందించడంలో ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ ఎప్పుడూ ముందు ఉంటుంది. సౌండ్నుపయోగించి స్మార్ట్ఫోన్లను ఛార్జ్ చేసే సాంకేతికతను, స్మార్ట్ఫోన్స్తో భూకంపాలను గుర్తించే టెక్నాలజీలను షావోమీ అభివృద్ధి చేస్తోన్న విషయం తెలిసిందే. కాంటాక్ట్ లేస్ పేమెంట్స్లో భాగంగా సరికొత్త ఒరవడిని తెచ్చేందుకు షావోమీ ప్రయత్నాలను చేస్తోన్నట్లు తెలుస్తోంది. చదవండి: Xiaomi : మరో అద్బుతమైన టెక్నాలజీ ఆవిష్కరించనున్న షావోమీ..! స్మార్ట్వాచ్ బెల్ట్(స్ట్రాప్)నుపయోగించి లావాదేవీలను చేసే టెక్నాలజీని షావోమీ త్వరలోనే ఆవిష్కరించనుంది. షావోమీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రఘురెడ్డి స్మార్ట్వాచ్ స్ట్రాప్తో కాంటాక్ట్లెస్ పేమెంట్స్ సాంకేతికతను గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్టివల్లో నమోదు చేసినట్లు ట్విటర్లో పేర్కొన్నారు.స్మార్ట్వాచ్స్కు అమర్చే ఈ కొత్త స్ట్రాప్లు నీయర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్సీ)తో పనిచేయనున్నాయి. ఎన్ఎఫ్సీ లావాదేవీల్లో భాగంగా షావోమీ తన భాగస్వాములుగా రూపే, ఆర్బీఎల్, జెటాతో పనిచేస్తుందని వెల్లడించారు. ఈ స్ట్రాప్ను త్వరలోనే టీజ్ చేస్తున్నట్లు రఘు ట్విటర్ పేర్కొన్నారు. Today we announced our entry into the FUTURE OF CONTACTLESS PAYMENTS at the Global Fintech Festival. Thrilled to announce that we will be launching the Xiaomi NFC Mi Pay straps soon. Working with @RuPay_npci, RBL & Zeta to make this happen. Stay tuned. pic.twitter.com/5yD2eywhPO — Raghu Reddy (@RaghuReddy505) September 28, 2021 చదవండి: జియో ఫోన్ లాంచ్కు ముందు..మరో కంపెనీపై ముఖేశ్ అంబానీ కన్ను..! -
ఔరా.. అద్దాలలో ఈ స్మార్ట్ అద్దాలు వేరయా!
అద్దాలలో స్మార్ట్ అద్దాలు వేరయా.. అని పద్యం పాడుకోవాల్సిన టైమ్ వచ్చేసింది. మాస్ మార్కెట్ ప్రాడక్ట్గా గుర్తించి ఇస్మార్ట్ గ్లాసెస్పై టెక్ దిగ్గజాలు కన్నేశాయి. సర్వేంద్రియానం స్మార్ట్ గ్లాస్ ప్రధానం.. అనేలా చేస్తున్నాయి! కంటిసమస్యలు, వాతావరణ ప్రతికూలతలను అధిగమించడానికి, ఫ్యాషన్ కోసం కంటి అద్దాలు (సులోచనాలు) ధరిస్తుంటాం. అయితే ఫ్యాషన్, టెక్నాలజీని మిళితం చేసిన స్మార్ట్గ్లాస్లపై యువత ఆసక్తి చూపుతుంది. ప్రసిద్ధ చైనీస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ షావోమి వారి స్మార్ట్గ్లాస్ కేవలం 51 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. ఇక డిస్ప్లే చిప్ అయితే బియ్యం గింజ సైజ్లో ఉంటుంది. (చదవండి: ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాటా మోటార్స్ రికార్డు) మరి ఈ స్మార్ట్గ్లాస్ ధరించడం వల్ల ఏంజరుగుతుంది? ఈ అద్దాలపై నొటిఫికేషన్లు కనిపిస్తాయి. అలా అని ఏవి పడితే అవి కనిపించి చిరాకు తెప్పించవు. షావోమి ఏఐ అసిస్టెంట్ ‘ప్రైమరీ ఇంటరాక్షన్ మెథడ్’తో హోమ్ అలారమ్స్, ఆఫీస్ యాప్కు సంబంధించిన అర్జెంట్ సమాచారం.. ఇలా ముఖ్యమైనవి మాత్రమే మనం కోరినట్లు కనిపిస్తాయి. ఫ్రేమ్లో ఇన్బిల్ట్గా ఉండే 5ఎంపీ కెమెరాతో వీడియోలు, ఫొటోలు తీసుకోవచ్చు. ఇన్బిల్ట్ స్పీకర్లతో కాల్స్ స్వీకరించవచ్చు. ఆడియోకు టెక్ట్స్ రూపం ఇచ్చే ఫీచర్ కూడా ఉంది. ఫేస్బుక్,రేబాన్ వారి స్మార్ట్గ్లాసెస్ రేబాన్ స్టోరీస్. ‘మా ఫస్ట్ జెనరేషన్ స్మార్ట్గ్లాస్ ధరిస్తే....ప్రపంచం మీ కళ్ల ముందు ఉంటుంది. కాప్చర్...షేర్...లిజన్’ అంటుంది రేబాన్ స్టోరీస్. దీనిలో కూడా ఇన్బిల్ట్ ఫీచర్లకు కొదవేమీ లేదు. 2-ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో వీడియోలు, ఫొటోలు తీసుకోవచ్చు. కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చు. కాఫీకి ఆర్డర్ ఇవ్వవచ్చు. యూజర్ ప్రైవసీని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని ఈ స్మార్ట్గ్లాస్లను డిజైన్ చేశారు. క్లాసిక్, రౌండ్, లార్జ్...ఇలా రేబాన్ స్టోరీస్లో 20 వేరియంట్స్ ఉన్నాయి. స్మార్ట్గ్లాస్ కదా అని ఇవేమి అసాధారణంగా ఉండవు.. చూడడానికి మామూలు అద్దాలుగానే కనిపిస్తాయి. అయితే, రైట్ బిఫోర్ యువర్ ఐస్...ప్రపంచం ప్రత్యక్షమవుతుంది!. కాస్త వెనక్కి వెళితే.. టెక్ దిగ్గజం గూగుల్ ఎన్నో అంచనాల మధ్య ‘స్మార్ట్గ్లాస్’ తీసుకువచ్చింది. అయితే దీనికి అనుకున్నంత స్పందన రాలేదు. ‘యూజర్ మార్కెట్’కు చేరువకాలేకపోయింది. 2016లో ‘స్నాప్’ కంపెనీ ‘స్పెక్టికల్స్’ పేరుతో స్మార్ట్గ్లాస్లను తీసుకొచ్చిందిగానీ.. ఇది కూడా అంత పెద్ద సక్సెస్ కాలేదు. అయిననూ...ఇస్మార్ట్ గ్లాసెస్పై క్రేజ్ను దృష్టిలో పెట్టుకొని షావోమి, ఫేస్బుక్–రేయాన్ స్టోరీస్ స్మార్ట్గ్లాసెస్ లాంటివి వస్తాయి. వస్తూనే ఉంటాయి!. -
మరో అద్బుతమైన టెక్నాలజీ ఆవిష్కరించనున్న షావోమీ..!
ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ త్వరలోనే మరో అద్భుతమైన టెక్నాలజీని ఆవిష్కరించనుంది. స్మార్ట్ఫోన్లనుపయోగించి ముందుగానే భూకంపాలను గుర్తించగల టెక్నాలజీని షావోమీ అభివృద్ధి చేస్తోంది. అందుకు సంబంధించిన పేటెంట్ హక్కులను షావోమీ రిజిస్టర్ చేసింది. ‘ మెథడ్ అండ్ ఎక్విప్మెంట్ ఫర్ రియలైజింగ్ సెసిమిక్ మానిటరింగ్ ఆఫ్ మొబైల్ డివైజెస్’ పేరిట ఒక రిపోర్ట్ను షావోమీ ప్రచురించింది. భూకంపాలను గుర్తించడంలో ఈ టెక్నాలజీ ఉపయోగించబడుతుందని గిజ్మోచైనా నివేదించింది. చదవండి: SpaceX: చీకటి పడటాన్ని ఆకాశం నుంచి చూశారా? ఈ టెక్నాలజీలో భాగంగా స్మార్ట్ఫోన్స్ గుర్తించిన డేటాను భూకంప ప్రాసెసింగ్ యూనిట్కు బదిలీచేస్తోంది. అంతేకాకుండా స్మార్ట్ఫోన్లలో ఏర్పాటుచేసిన టెక్నాలజీతో ముందుగానే భూకంపాలను గుర్తించడంతో పాటు, హెచ్చరికలను కూడా జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ టెక్నాలజీతో భూకంప తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. గతంలో షావోమీ సౌండ్నుపయోగించి స్మార్ట్ఫోన్లను ఛార్జ్ చేసే పేటెంట్ను కూడా తీసుకున్న విషయం తెలిసిందే. చదవండి: క్రిప్టోకరెన్సీ నుంచి పొంచి ఉన్న పెనుముప్పు...! -
ఎంఐ ప్రియులకి షియోమీ షాకింగ్ న్యూస్
ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ షియోమీ మార్కెట్లో ఎంఐ, రెడ్ మీ పేరుతో మొబైల్స్ తీసుకొస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. బడ్జెట్ ప్రియుల కోసం రెడ్ మీ పేరుతో మొబైల్స్ తీసుకొస్తుంది. ఇక ప్రీమియం యూజర్ల కోసం ఎంఐ పేరుతో మొబైల్స్ టీవీలు, ల్యాప్టాప్లు, ఫిట్నెస్ బ్యాండ్లు మార్కెట్లోకి వస్తాయి. అయితే, ఇక నుంచి ఎంఐ పేరుతో కాకుండా ‘షియోమీ’ పేరుతోనే వినియోగదారుల చేరువ కావడం కోసం సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. (చదవండి: పోస్ట్ ఆఫీస్ టాప్ - 5 డిపాజిట్ స్కీమ్స్) ఇక నుంచి ‘ఎంఐ’ లోగో స్థానంలో కొత్త బ్రాండ్ ‘షియోమీ’పేరుతో డివైజస్ మార్కెట్లోకి వస్తాయని వెల్లడించింది. ఇప్పటికే వచ్చిన ఎంఐ బ్రాండ్ మొబైల్స్ ఇక నుంచి ‘షియోమీ' లోగోతో వస్తాయని పేర్కొంది. షియోమీ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా పేరుపొందిన నేపథ్యంలో ఆ పేరుతోనే యూజర్లకు దగ్గరికి కావడం కోసం కొత్త బ్రాండింగ్ తో ముందుకు వస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఎంఐ బ్రాండింగ్ గల ప్రొడక్ట్ స్థానంలో 'షియోమీ' పేరుతో కొత్త లోగో వస్తుంది. రెడ్ మీ కింద తయారు చేసిన ఉత్పత్తులు అదే లోగోతో కొనసాగుతాయని చైనీస్ టెక్ కంపెనీ పేర్కొంది. ఎంఐ బ్రాండింగ్కు బదులు ‘'షియోమీ’ లోగోను తీసుకురావాలని గత సంవత్సరం నుంచి ప్రయత్నిస్తున్నట్లు ఇండియా మార్కెటింగ్ హెడ్ జస్కరన్ సింగ్ కపానీ పేర్కొన్నారు. చివరగా, భారతదేశంలో విడుదలైన దాని ల్యాప్ టాప్, ఎంఐ నోట్ బుక్ అల్ట్రా ఎంఐ లోగోకు బదులుగా షియోమీ లోగోతో వచ్చింది. -
షావోమీ మరో సంచలనం, మాట్లాడేందుకు కళ్ల జోడు తెస్తోంది
టెక్ యుగంలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. మానవుడి జీవన విధాన్ని మరింత స్మార్ట్గా మార్చేస్తూ అనేక రకాల గాడ్జెట్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఎంతలా అంటే ఫోన్తో చేసే పనులు కళ్ల జోళ్ల(స్మార్ట్ గ్లాసెస్)తో చేయడం అన్నమాట. ఇప్పటికే ఆ దిశగా ఫేస్బుక్ ‘రే బాన్ స్టోరీస్’ పేరుతో స్మార్ట్ గ్లాసెస్ అమ్మకాలు ప్రారంభించింది. ఇప్పుడు ఫేస్బుక్కు పోటీగా ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ తొలిసారి 'వేరబుల్ డివైజ్ కాన్సెప్ట్' పేరుతో స్మార్ట్ గ్లాసెస్ను విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేసింది. షావోమీ స్మార్ట్ గ్లాసెస్ ఫీచర్స్ 'స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రం హోం' సినిమాలో స్పైడర్ మ్యాన్ పాత్రదారి పీటర్ పార్కర్ ధరించిన స్మార్ట్ గ్లాస్లా ఉండే ఈ కళ్ల జోడులో రకరకాల ఫీచర్స్ ఉన్నాయి.ఈ ఫీచర్లతో నోటిఫికేషన్లు సెండ్ చేయడం, ఫోన్ కాల్స్ మాట్లాడడం, నావిగేషన్, ఇమేజ్లను క్యాప్చర్ చేయడం, టెక్ట్స్ను ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. వీటితో పాటు బ్యాక్ లైటింగ్ కోసం 2.4ఎంఎంx2.02 ఎంఎం పరిమాణంలో మైక్రో ఎల్ఈడీ డిస్ప్లే, మల్టీపుల్ కలర్స్ డిస్ట్రబ్ చేయకుండా ఒక్క కలర్ మాత్రమే కనపించేలా మోనోక్రోమ్ ప్యానెల్ ను డిజైన్ చేసింది. అందం కనువిందుగా 180 డిగ్రీల ట్రాన్స్ మిట్ లైట్(కాంతి)వల్ల కళ్లకు ఎలాంటి సమస్య లేకుండా అందం కనువిందుగా కనిపించేందుకు మైక్రోలెడ్ డిస్ప్లే,ఫేస్బుక్ స్మార్ట్ గ్లాసెస్లాగే.. షావోమీ వాయిస్ అసిస్టెంట్ షావోఏఐ ని వినియోగించుకోవచ్చు. ఫోటోలు తీసేందుకు 5 మెగాపిక్సెల్ కెమెరా, డ్యూయల్ మైక్స్, స్పీకర్లు, బ్లూటూత్, వైఫై, టచ్ప్యాడ్, ఆండ్రాయిడ్ వెర్షన్ కోసం క్వాడ్ కోర్ అడ్వాన్స్డ్ రిస్క్ మెషిన్(ఏఆర్ఎం) ప్రాసెసర్ను అందిస్తున్నట్లు షావోమీ తెలిపింది. కాగా,వేరబుల్ డివైజ్ కాన్సెప్ట్ వస్తున్న ఈ స్మార్ట్ గ్లాసెస్ను షావోమీ ఎప్పుడు విడుదల చేస్తుంది. ఇంకా ఎలాంటి టెక్నాలజీని జోడించనుందనే విషయాల గురించి షావోమీ ' స్పష్టత ఇవ్వాల్సి ఉంది. చదవండి: ఫేస్బుక్ కళ్లద్దాలు.. ఇక ఫొటో, వీడియోలు తీయొచ్చు -
షావోమి నుంచి మరో లైట్ స్మార్ట్ఫోన్
ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమి ఎమ్ఐ 11 లైట్ను ఈ ఏడాది జూన్ 22న లాంచ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా షావోమీ 11 లైట్ సిరీస్లో భాగంగా మరో స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లోకి రిలీజ్ చేయనుంది. న్యూ షావోమీ 11 లైట్ 5జీ ఎన్ఈ స్మార్ట్ఫోన్ను ఈ నెల 15న లాంచ్ చేస్తున్నట్లు షావోమీ తన అధికారిక ట్విటర్ ఖాతాలో వెల్లడించింది. ఈ స్మార్ట్ఫోన్ ఎమ్ఐ లైట్ 11తో సమానమైన స్పెసిఫికేషన్స్తో పనిచేస్తోందనే ఊహగానాలు వస్తున్నాయి. చదవండి: భూమ్మీద అత్యంత సురక్షితమైన ఫోన్ ఇదే..! షావోమీ తన అధికారిక వెబ్సైట్లో షావోమీ 11 లైట్ 5జీ ఎన్ఈ స్మార్ట్ఫోన్తో పాటుగా షావోమీ 11టీ, షావోమీ 11 టీ ప్రో స్మార్ట్ఫోన్లను టీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులో షావోమీ 11 లైట్ 5జీఎన్ఈ కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. షావోమీ 11 లైట్ 5జీ ఎన్ఈ ధర సుమారు రూ. 28,600గా ఉండనున్నట్లు తెలుస్తోంది. షావోమీ 11 లైట్ 5జీఎన్ఈ స్పెసిఫికేషన్లు అంచనా.. 6.55 అంగుళాల హెచ్డీ+అమోల్డ్ హోల్పంచ్ డిస్ప్లే ట్రిపుల్ రియర్ కెమెరా 20 మెగాపిక్సెల్ ప్రంట్ కెమెరా క్వాల్కాం స్నాప్డ్రాగన్ 778జీ ప్రాసెసర్ 33వాట్ రాపిడ్ ఛార్జింగ్ 4,250 ఎమ్ఎహెచ్ బ్యాటరీ Something new is right around the corner. ❄️ Get ready for the special date! 2021.9.15|20:00 GMT+8 #XiaomiProductLaunch #Xiaomi11LiteSeries pic.twitter.com/ekjLXo4RJL — Xiaomi (@Xiaomi) September 11, 2021 చదవండి: Xiaomi: ఆయా దేశాల్లో స్మార్ట్ఫోన్లను బ్లాక్ చేసిన షావోమీ..! -
ఆయా దేశాల్లో స్మార్ట్ఫోన్లను బ్లాక్ చేసిన షావోమీ..!
ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ కీలక నిర్ణయం తీసుకుంది. షావోమీ స్మార్ట్ఫోన్లు విక్రయించబడని దేశాల్లో షావోమీ స్మార్ట్ఫోన్లను బ్లాక్ చేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. కంపెనీ నిబంధనలకు అనుగుణంగా నడుచుకొని పలు దేశాల్లో షావోమీ స్మార్ట్ఫోన్లను వాడుతున్న కస్టమర్లకు బ్లాక్ చేస్తున్నట్లు మెసేజ్ను చూపిస్తుంది. యూఎస్తో సహా అనేక దేశాల్లో షావోమీ అధికారికంగా ఉనికి లేదు. చదవండి: భూమ్మీద అత్యంత సురక్షితమైన ఫోన్ ఇదే..! క్యూబా, ఇరాన్, సిరియా, ఉత్తర కొరియా, సూడాన్ లేదా క్రిమియా దేశాల్లో షావోమీ స్మార్ట్ఫోన్లను వాడుతున్న యూజర్లకు షావోమీ షాక్ నిచ్చింది. గతవారం నుంచి ఈ స్మార్ట్ఫోన్లను షావోమీ బ్లాక్ చేసిందని యూజర్లు సోషల్మీడియాలో హైలైట్ చేస్తున్నారు. షావోమీ బ్లాక్ చేస్తూ సందేశాలను కూడా పంపినట్లు యూజర్లు సోషల్మీడియాలో షేర్ చేస్తున్నారు. ఎగుమతి నిబంధనలను ఉల్లంఘించిన దేశాల్లో స్మార్ట్ఫోన్ సేవలను బ్లాక్ చేస్తుందని కంపెనీ పాలసీలో ఎక్కడలేదు. For the past few weeks, Xiaomi has been proactively blocking users from provisioning their phones if they live in Cuba, Iran, Syria, North Korea, Sudan, or Crimea, in order to comply with export regulations and stop resellers. https://t.co/51AdXIMgnW — Mishaal Rahman (@MishaalRahman) September 9, 2021 చదవండి: Apple : సెప్టెంబర్ 14నే ఐఫోన్-13 రిలీజ్..! కారణం అదేనా..! -
టెక్ దిగ్గజం ఆపిల్ను దాటేసిన షియోమీ
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ వేరబుల్ స్మార్ట్ బ్రాండ్ అమ్మకాల విషయంలో టెక్ దిగ్గజం ఆపిల్ను దాటేసింది. 2021 రెండవ త్రైమాసికంలో గ్లోబల్ స్మార్ట్ వాచ్ షిప్ మెంట్ల పరంగా ప్రపంచంలో టాప్ వేరబుల్ సంస్థగా షియోమీ నిలిచింది. దీనికి సంబంధించిన నివేదికను కానాలిస్ సంస్థ విడుదల చేసింది. ఎంఐ తన స్మార్ట్ బ్యాండ్ 6 లాంచ్ చేసిన తర్వాత రెండవ త్రైమాసికంలో షియోమీ అమ్మకాలు ఊపందుకున్నాయి. చైనాలో విక్రయాల విషయానికి వస్తే క్యూ2లో 8.0 మిలియన్ యూనిట్లను రవాణా చేసి 2.6 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది.(చదవండి: గూగుల్ డ్రైవ్ వాడుతున్నారా? ఇది మీకోసమే..) చైనాలో షియోమీ మార్కెట్ వాటా 19.6 శాతం ఆపిల్ వాటా 19.3 శాతం కంటే స్వల్పంగా ఎక్కువగా ఉంది. ఆపిల్ సంస్థ 7.9 మిలియన్ యూనిట్లను రవాణా చేసింది. చైనాలో అమ్మకాల పరంగా హువావే మూడవ స్థానంలో ఉంది. ఇది మార్కెట్లో 9.2 శాతం వాటాతో 3.7 మిలియన్ యూనిట్లను విక్రయించింది. ఆ తర్వాత రెండు స్థానాలలో ఫిట్ బీట్ 7.3 శాతం వాటాతో 3.0 మిలియన్, శామ్ సంగ్ 6.1 శాతం మార్కెట్ వాటాతో 2.5 మిలియన్ యూనిట్లను సరఫరా చేసింది. కానాలిస్ రీసెర్చ్ ఎనలిస్ట్ సింథియా చెన్ మాట్లాడుతూ ఇలా అన్నారు. "షియోమీ తన ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 6ను త్వరగా విడుదల చేయడం ఒక తెలివైన చర్య. ఇది దాని మునుపటి కంటే పరికరం కంటే ఉత్తమమైనది" అని అన్నారు. -
Apple: పడిపోయిన యాపిల్ మార్కెట్! భారమంతా ఐఫోన్ 13 పైనే?
Apple iPhone 13: టెక్ దిగ్గజం యాపిల్కి షాక్ తగిలింది. నూతన ఆవిష్కరణలు, సరికొత్త ఫీచర్లకు కేరాఫ్ అడ్రస్గా చెప్పుకునే ఐఫోన్ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ట్రెండ్ ఫోర్స్ తాజా లెక్కలు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి. తగ్గిన అమ్మకాలు ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి సంబంధించి గ్లోబల్ స్మార్ట్ఫోన్ మార్కెట్కు సంబంధించి ట్రెండ్ ఫోర్స్ సంస్థ తాజా గణంకాలు విడుదల చేసింది. ఇందులో రెండో క్వార్టర్కి సంబంధించి గ్లోబల్ మార్కెట్లో ఐఫోన్ అమ్మకాలు 13.7 శాతానికే పరిమితమైనట్టుగా తెలిపింది. గతేడాది ఫోన్ అమ్మకాలతో పోల్చితే 22 శాతం మేరకు ఐఫోన్ అమ్మకాలు తగ్గినట్టు ట్రెండ్సెట్ పేర్కొంది. నాలుగో స్థానానికి ఒక్కసారిగా ఫోన్ల అమ్మకాలు పడిపోవడంతో గ్లోబల్ మార్కెట్లో యాపిల్ సంస్థ నాలుగో స్థానానికి పరిమితమైంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసినికి సంబంధించిన అమ్మకాల్లో 19 శాతం మార్కెట్ వాటాతో శామ్సంగ్ మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత 16.1 శాతం అమ్మకాలతో షావోమీ, ఒప్పోలో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. వాటి తర్వాత 13.7 శాతం మార్కెట్తో యాపిల్ నాలుగో స్థానానికి పరిమితమైంది. 11.1 శాతం వాటాతో వివో ఐదో స్థానంలో ఉంది. వివో సంస్థ అమ్మకాల్లో సైతం 18 శాతం తగ్గుదల నమోదైంది. ఐఫోన్ 13పైనే భారం యాపిల్ సంస్థ ఈ నెలాఖరు కల్లా సరికొత్త మోడల్ ఐఫోన్ 13ను రిలీజ్ చేయబోంది. ఇప్పటికే ఐఫోన్ 13 ఫీచర్లకు సంబంధించి మార్కెట్లో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సిమ్తో పని లేకుండా లో ఎర్త్ ఆర్బిట్ టెక్నాలజీపై ఐఫోన 13 పని చేస్తుందంటూ ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు ఐఫోన్ 13కి మరింత క్రేజ్ తెచ్చేందుకు యాపిల్ వాచ్ 7 సిరీస్ను సైతం రిలీజ్ వచ్చంటూ కథనాలు వస్తున్నాయి. మొత్తంగా పడిపోయిన మార్కెట్ షేర్ను దక్కించుకునేందుకు ఐఫోన్ 13పైనే ఆ సంస్థ భారం వేసింది. చదవండి: గూగుల్ సెర్చ్లో తొలి పదం.. ఆసక్తికరమైన విషయం -
Digital Loan: రంగంలోకి టెక్ కంపెనీలు
India Digital Loan Market: కరోనా టైం నుంచి దేశంలో ఆన్లైన్ ట్రాన్జాక్షన్స్ విపరీతంగా పెరిగాయి. ఈ క్రమంలో ఇండియా డిజిటల్ పేమెంట్స్ మార్కెట్పై టెక్ కంపెనీలు ఫోకస్ చేస్తున్నాయి. సుమారు ఒక ట్రిలియన్ డాలర్లతో డిజిటల్ లోన్ మార్కెట్ను విస్తరించాలని ప్రణాళిక వేసుకుంటున్నాయి. ఫేస్బుక్, షావోమీ, అమెజాన్, గూగుల్.. టెక దిగ్గజాలు ఇప్పుడు భారత దేశంలోని డిజిటల్ లోన్ మార్కెట్ మీద కన్నేశాయి. ఇప్పటికే ఇందుకు సంబంధించిన సంకేతాలు స్పష్టంగా అందుతున్నాయి. షావోమి ఇండియా హెడ్ మనూ జైన్ ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన కూడా చేశారు. లోన్లు, క్రెడిట్ కార్డులు, ఇన్సూరెన్స్ ప్రొడక్టులు ఇందుకోసం దేశంలోని రుణదాతల భాగస్వామ్యంతో ముందుకు వెళ్లనున్నట్లు ప్రకటించారాయన. ఇది వరకే చిరు వ్యాపారులు, స్టార్టప్లకు అండగా నిలిచేందుకు ఫేస్బుక్ ముందుకు వచ్చింది. స్టార్టప్లు చిరు వ్యాపారులకు అండగా నిలిచేందుకు స్మాల్ బిజినెస్ లోన్ పేరుతో గతేడాది 100 మిలియన్ డాలర్లతో ప్రత్యేక నిధిని ఫేస్బుక్ ఏర్పాటు చేసింది. వీటితో 30 దేశాల్లోని మైక్రో, మీడియం బిజినెస్లో ఉన్న సంస్థలకు సాయం చేయాలని నిర్ణయించింది. తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చే ప్రక్రియలో తలమునకలైంది. గూగుల్ కూడా చిన్నస్థాయి రుణదాతలతో ఒప్పందాలు ఇదివరకే చేసుకుంది. గూగుల్ పే ద్వారా డిజిటల్ గోల్డ్, మ్యూచువల్ ఫండ్స్ నిర్వాహణను ప్రారంభించింది. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ కూడా ఆన్లైన్ రుణదాతల్ని రెగ్యులేట్ చేయాలనే ఆలోచనలో ఉంది. చదవండి: డిపాజిటర్లకు మరింత రక్షణ -
Mi బ్రాండ్ పేరు మారుతోంది ? కొత్తగా నేమ్ ఇదే ?
ఇండియాలో హయ్యస్ట్ అమ్మకాలు సాధించిన ఎంఐ బ్రాడ్ పేరు మారబోతుంది. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లు నాణ్యతతో అందిస్తూ ఇండియా మార్కె్ట్లో చెరగని ముద్ర వేసింది ఎంఐ బ్రాండ్. స్మార్ట్ఫోన్లతో మొదలు పెట్టి టీవీలు, వాచీలు, ఇయర్ ఫోన్స్, ల్యాప్టాప్స్ ఇలా అనేక విభాగాలకు విస్తరించిన ఎంఐ బ్రాండ్, దాని లోగో ప్రస్తుతం ఉన్న రూపంలో భవిష్యత్తులో కనిపించదు. Mi ఎలా వచ్చింది. ఎంఐ బ్రాండ్తో మనకు లభించే ఫోన్లు, ల్యాప్ల్యాప్లను తయారు చేసే కంపెనీ పేరు షావోమి. ఇంగ్లిష్లో Xiaomiగా రాస్తారు. ఇందులో చివరి రెండు అక్షరాలైన Mi అక్షరాలనే లోగోగా మార్చి షావోమి చైనా, ఇండియాతో పాటు ఏషియా మార్కెట్లో తిరుగులేని బ్రాండ్గా మారింది. ఎంఐ బ్రాండ్ ఎప్పటి నుంచి షావోమి నుంచి తొలి స్మార్ట్ఫోన్ 2011 ఆగస్టులో వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్న మోడల్స్ వచ్చాయి. ఇందులో ఎంఐ నోట్ సిరీస్కి ఇండియాలో మంచి ఆధరణ లభించింది. తాజాగా షావోమి సంస్త చైనాలో మిక్స్ 4 పేరుతో కొత్త ఫోన్ను లాంఛ్ చేసింది. ఈ సందర్భంగా ఫోన్పై ఎంఐకి బదులు షావోమి అని ముద్రించింది. అంతేకాదు ఫోన్ ఆన్ చేసినప్పుడు వచ్చే ఎంఐ లోగో బదులు షావోమి లోగోను పొందు పరిచింది. మిగిలిన చోట ఎప్పుడు ప్రస్తుతం చైనాలో ఎంఐ బ్రాండ్ స్థానంలో షావోమి బ్రాండ్ నేమ్, లోగోను ఉపయోగిస్తున్నామని, త్వరలోనే ఇతర మార్కెట్ రీజియన్లలో కూడా ఎంఐ బదులు షావోమి లోగో, బ్రాండ్ నేమ్ను ప్రవేశపెడతామని ఆ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్తులో రిలీజ్ అయ్యే ప్రొడక్టులపై ఎంఐ బదులుగా షావోమి అని ఉంటుందని వెల్లడించారు. అమ్ముడైన ఫోన్లు ఎన్ని 2011లో షావోమి సంస్థ నుంచి తొలి ఫోన్ ఎంఐ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 80 కోట్ల ఫోన్ల అమ్మకాలు జరిగాయి. టెక్ దిగ్గజ కంపెనీలైన శామ్సంగ్, ఆపిల్లను సైతం ఎంఐ వెనక్కి నెట్టింది.తాజాగా ఈ కంపెనీ బ్రాండ్ నేమ్ని ఎంఐ నుంచి షావోమికి మారుతోంది. చదవండి: Work From Home: ఐటీ కంపెనీలకు కర్నాటక సర్కార్ రిక్వెస్ట్ -
'మాధవ్ సార్ ఇంకా ఎన్నిరోజులు మమ్మల్ని కాపీ కొడతారు'
ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో చైనా కంపెనీలు రియల్మీ, షియోమీ కొత్త యుద్ధానికి తెరలేపాయి. ఇన్నిరోజులు ఆదిపత్యం కోసం సైలెంట్ వార్ను కొనసాగిస్తుండగా.. ఇప్పుడు ఆ వార్ను బహిరంగంగా డిక్లేర్ చేశాయి. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద స్మార్ట్ఫోన్ మార్కెట్గా ఉన్న ఇండియాలో స్మార్ట్ ఫోన్ సంస్థలు పోటీ పడుతుంటాయి. మార్కెట్లో తమ హవాను కొనసాగించాలనే ఉద్దేశంతో కొత్త కొత్త ఆఫర్లను ప్రకటిస్తూ వినియోగదారుల్ని ఊరిస్తుంటాయి. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం..ఇటీవల ప్రకటించిన క్యూ1 ఫలితాల్లో షియోమీ 28 శాతం మార్కెట్ తో ప్రధమ స్థానాన్ని దక్కించుకుంది. 15 శాతంతో నాలుగో స్థానంలో రియల్మీ..షియోమీని వెనక్కి నెట్టేందుకు ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో రియల్ మీ ఇండియాలో తొలి ల్యాప్ట్యాప్ తో పాటు జీటీ సిరీస్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. Our #LeapTo100Million calls for a celebration! Presenting the #realmeFanFestival, till 28th August where you can get offers like never before! Stay tuned for some real-ly amazing activities! #DareToLeap Know more: https://t.co/8FCGXjd6fd pic.twitter.com/boLohEshLI — realme (@realmeIndia) August 18, 2021 తాజాగా రియల్మీ ఇండియా 100 మిలియన్ ఫ్యాన్స్ను సొంతం చేసుకుందని..ఇందులో భాగంగా ఆగస్ట్ 18 నుంచి ఆగస్ట్ 28 వరకు #realmefanfestival2021 ను నిర్వహిస్తున్నట్లు అనౌన్స్ చేసింది. అంతే ఆ ప్రకటనపై షియోమీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము నిర్వహించే ప్రతి ఈవెంట్ను రియల్ మీ కాపీకొడుతుందని..ఆ సంస్థ ఇండియా బిజినెస్ డైరెక్టర్ స్నేహ తైన్వాలా ట్వీట్ చేశారు.'#copycatfanfestival' హ్యాష్ ట్యాగ్ తో మాధవ్ సార్ ఇంకా ఎన్నిరోజులు మమ్మల్ని కాపీ కొడతారు' అంటూ రియల్ మీ ఇండియా సీఈఓ మాధవ్ సేథ్ను ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఈ స్మార్ట్ దిగ్గజాల వార్ సోషల్ మీడియాలో హాట్ టాపిగ్గా మారింది. "Mi Fan Festival" >> "#CopyCat Fan Festival" It has now stopped being funny. Kitna copy karoge @MadhavSheth1 sir? Waise event page mock up bhijwaon - will save your team some time🤣 https://t.co/CtGfsOhDvI — Sneha Tainwala (@SnehaTainwala) August 18, 2021 -
రివర్స్ బ్యాటరీ ఛార్జింగ్ను సపోర్ట్ చేయనున్న రెడ్మీ కొత్త ఫోన్..!
ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ రెడ్మీ సిరీస్లో భాగంగా మరో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. రెడ్మీ 9 కు తదనంతర ఫోన్గా రెడ్మీ 10 ను షావోమీ రిలీజ్ చేయనుందని తెలుస్తోంది. కాగా విడుదలకు ముందే రెడ్మీ 10 సిరీస్ స్మార్ట్ఫోన్ స్పెసిఫీకేషన్లు ఎమ్ఐ వెబ్సైట్లో ప్రత్యక్షమయ్యాయి. కాగా ఈఫోన్ రివర్స్ బ్యాటరీ ఛార్జింగ్ను సపోర్ట్ చేయనుంది. ఈ నెల చివర్లో షావోమీ రెడ్మీ 10 భారత మార్కెట్లలోకి రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెడ్మీ 10 మూడు స్టోరేజ్ వేరియంట్లతో రానుంది. 4జీబీ + 64జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 4జీబీ + 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 6జీబీ + 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లతో రానుంది. రెడ్మీ 10 కార్బన్ గ్రే, పెబ్బల్ వైట్, సీ బ్లూ కలర్స్లో ఉండనుంది. రెడ్మీ 10 ఫోన్ ధరలను షావోమీ ప్రకటించలేదు. స్మార్ట్ఫోన్ నిపుణుల ప్రకారం..రెడ్మీ 10 ప్రారంభ ధర రూ.8,999 నుంచి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. రెడ్మీ 10 ఫీచర్లు డ్యూయల్ సిమ్ (నానో) సపోర్ట్ ఆండ్రాయిడ్ 11 MIUI 12.5 6.5-అంగుళాల ఫుల్-హెచ్డి+ (1,080x2,400 పిక్సెల్స్) డాట్ డిస్ప్లే ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో జీ88 ఎస్ఓసీ 50 ఎమ్పీ రియర్ కెమెరా 8 ఎమ్పీ ఫ్రంట్ కెమెరా 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ 18w ఫాస్ట్ ఛార్జింగ్ -
అదిరే ఫీచర్లతో షావోమి పాడ్ 5,షావోమి పాడ్ 5 ప్రో
చైనాకు చెందిన షావోమి కంపెనీ దూకుడు మీదుంది. స్మార్ట్ ఫోన్ల సేల్స్ పరంగా నెంబర్ వన్ స్థానంలో ఉన్న షావోమి మార్కెట్ను మరింత విస్తరించేందుకు వరుసగా గాడ్జెట్స్ను రిలీజ్ చేస్తోంది. తాజాగా షావోమికి చెందిన షావోమి పాడ్ 5, షావోమి పాడ్ 5 ప్రోలను విడుదల చేసింది. షావోమి పాడ్ 5,షావోమి పాడ్ 5 ప్రో స్పెసిఫికేషన్లు షావోమి పాడ్ 5,షావోమి పాడ్ 5 ప్రో ఫీచర్లు ఒకేలా ఉన్నాయి. షోవోమి పాడ్ 511అంగుళాల ఎల్ సీడీ, 2560*1600 స్క్రీన్ రెజెల్యూషన్ 120 హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్, ట్రూ టోన్,ట్రూ టోన్, డాల్బీ విజన్, హెచ్డీఆర్ 10, 500నైట్స్ బ్రైట్ నెస్తో వస్తుండగా.. డివైజ్లకు వెనక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్, పాడ్5 సిరీస్ (వైఫై)లో 13ఎంపీ ప్రైమరీ కెమోరా, 8 ఎంపీ సెకండరీ సెన్సార్లు ఉన్నాయి. షావోమి పాడ్ 5 ప్రో 5జీ మోడల్లో 50ఎంపీ ప్రైమరీ కెమెరా13ఎంపీ సెకండరీ సెన్సార్ లతో పాటు సెల్ఫీలు, వీడియో కాల్ కోసం ముందు భాగంలో 5ఎంపీ కెమోరా, క్వాడ్ స్పీకర్ 8 స్పీకర్ సిస్టమ్ ఉంది. షావోమి పాడ్ 5లో స్నాప్ డ్రాగన్ 860చిప్ సెట్, 8,720 ఏఎంహెచ్ బ్యాటరీతో వస్తుండగా ప్రో మోడల్లో స్నాప్డ్రాగన్ 870 చిప్సెట్ ఉంది. దీంతో పాటు 8,600 ఏఎంహెచ్ బ్యాటరీ సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ రెండు వేరియంట్లు 67డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 33డబ్ల్యూ వైర్లెస్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తాయి. ఇక ఆండ్రాయిడ్ 11 ఆధారంగా ఎంఐయూఐ 12.5 ని రన్ చేసుకోవచ్చు. వైఫై, బ్లూటూత్ 5.2, టైప్-సి యూఎస్బీ పోర్ట్తో వస్తాయి. షావోమి పాడ్ 5,షావోమి పాడ్ 5 ప్రో ధరలు షావోమి ప్యాడ్ 5 రెండు స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో వస్తుంది. 6జీబీ ర్యామ్128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ రూ. 22,900కే అందుబాటులో ఉంది. 6జీబీ + 256జీబీ ధర సుమారు రూ. 26,400 ఉండగా..వైట్,బ్లాక్, ఎల్లో కలర్స్ తో వస్తుంది. షావోమీ ప్యాడ్ 5 ప్రో ధర 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ. సుమారు రూ. 28,700గా ఉండగా 5G వేరియంట్ ధర సుమారు రూ. 40,200గా ఉండగా 8జీబీ ర్యామ్ 256జీబీ స్టోరేజ్ తో బ్లాక్ అండ్ వైట్ కలర్స్ తో అందుబాటులోకి వచ్చింది. -
మనదేశంలో ఏ బ్రాండ్ స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా కొంటున్నారో తెలుసా?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఏప్రిల్–జూన్ కాలంలో 3.4 కోట్ల స్మార్ట్ఫోన్స్ అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 86 శాతం వృద్ధి నమోదైంది. షావొమీ 29.2 శాతం మార్కెట్ వాటాతో తొలి స్థానంలో నిలిచింది. శామ్సంగ్, వివో, రియల్మీ, ఒప్పో వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. స్మార్ట్ఫోన్ సగటు విక్రయ ధర క్రితం ఏడాదితో పోలిస్తే 15 శాతం అధికమై రూ.13,700లకు చేరింది. ధరల పెరుగుదల, 5జీ మోడళ్ల రాకతో సగటు విక్రయ ధర రానున్న త్రైమాసికాల్లో దూసుకెళ్లనుంది. 2020తో పోలిస్తే ప్రస్తుత సంవత్సరంలో వృద్ధి 9 శాతంలోపే ఉంటుందని ఐడీసీ అంచనా వేస్తోంది. థర్డ్ వేవ్ ముప్పు, సరఫరా అడ్డంకులు, పెరుగుతున్న విడిభాగాల ధరలు, ద్రవ్యోల్బణం ఇందుకు కారణమని వెల్లడించింది. వినియోగదార్లు ఫీచర్ ఫోన్ నుంచి అప్గ్రేడ్ అవడం, తక్కువ, మధ్యస్థాయి ఫోన్లు వాడుతున్నవారు మెరుగైన స్మార్ట్ఫోన్స్ కొనుగోలు, 5జీ మోడళ్ల వెల్లువతో 2022లో మార్కెట్ తిరిగి పుంజుకుంటుందని వివరించింది. ఇక 5జీ మోడళ్ల అమ్మకం విషయంలో భారత్ నాల్గవ స్థానంలో ఉంది. చైనా, యూఎస్, జపాన్ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. జూన్తో ముగిసిన మూడు నెలల్లో 50 లక్షల 5జీ స్మార్ట్ఫోన్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. 5జీ మోడల్ సగటు విక్రయ ధర రూ.30,500 నమోదైంది. ఈ ఏడాది చివరినాటికి రూ.15,000లోపు ధర గల మోడళ్లు వెల్లువెత్తుతాయని ఐడీసీ అంచనా వేస్తోంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే, అమ్మకాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా. -
ఒలింపిక్స్ విజేతలకు షావోమీ బంపర్ ఆఫర్..!
టోక్యో ఒలింపిక్స్-2020లో భాగంగా భారత్ ఏడు పతకాలను సాధించిన విషయం తెలిసిందే. ఒలింపిక్స్లో మెడల్స్ సాధించిన వారికి పలు కంపెనీలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భారీ నజరానాను ప్రకటించాయి. తాజాగా టోక్యో ఒలింపిక్స్లో మెడల్స్ను సాధించిన భారత క్రీడాకారులకు షావోమీ కూడా బంపర్ ఆఫర్ను ప్రకటించింది. షావోమీ కంపెనీ నుంచి క్రీడాకారులకు ఎమ్ఐ 11 అల్ట్రా, ఎమ్ఐ 11ఎక్స్ స్మార్ట్ఫోన్లను బహుకరించనుందనీ షావోమీ ఇండియా మేనేజింగ్ డైరక్టర్ మను కూమార్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. టోక్యో ఒలింపిక్స్లో భారత్ వ్యక్తిగత విభాగంలో ఆరు పతకాలను సాధించిన వారికి ఎమ్ఐ 11 అల్ట్రా స్మార్ట్ఫోన్లను అందించనుంది. హాకీ జట్టు ఆటగాళ్లకు ఎమ్ఐ 11ఎక్స్ స్మార్ట్ఫోన్లను అందించనున్నట్లు షావోమీ ఎమ్డీ మను కుమార్ జైన్ ట్విటర్లో ప్రకటించారు. షావోమీ స్మార్ట్ఫోన్లలో ఎమ్ఐ 11 అల్ట్రా అత్యంత ఖరీదైన స్మార్ట్ఫోన్గా నిలిచింది. దీని ధర రూ. 69,999. -
ఇండిపెండెన్స్డే ఆఫర్లు... తగ్గిన రెడ్మీ ఫోన్ల ధరలు
స్వాతంత్ర దినోత్సవ కానుకగా షావోమీ తన మొబైల్ ఫోన్లపై ప్రత్యేక తగ్గింపు ధరలను ఆఫర్ చేస్తోంది. రీసెంట్గా మార్కెట్లో రిలీజైన మోడల్స్తో పాటు రన్నింగ్లో ఉన్న మొబైల్స్పై ఈ తగ్గింపును వర్తింప చేస్తోంది. ఈ మేరకు షావోమి తన ట్విట్టర్ పేజీ ద్వారా అధికారిక ప్రకటన జారీ చేసింది. ఎంఐ ఎక్స్ 11 5 జీ Xiaomi's Mi 11X 5G మొబైల్ ప్రస్తుతం మార్కెట్ ధర రూ.27,999లు ఉండగా ప్రత్యేక ఆఫర్ కింద రెండు వేలు తగ్గించారు. ఎంఐ 10టీ ప్రో 5జీ Xiaomi Mi 10T Pro ధర రూ. 39,999 ఉండగా ఇండిపెండెన్స్ డే ఆఫర్ కింద రూ. 36,999కి లభిస్తోంది. ఎంఐ 10ఐ Mi 10i మిడ్రేంజ్ సెగ్మెంట్లో ఎంఐ 10ఐ మొబైల్ని లాంచ్ చేసినప్పుడు ధర రూ.21,999 ఉండగా ఇప్పుడు రూ. 20,999కి తగ్గించింది. రెడ్మీ 9 Redmi 9 మొబైల్ ఫోన్ ధర రూ. 8,999 ఉండగా రూ. 1500 తగ్గింపు ప్రకటించింది. స్టార్ట్ టీవీపై కూడా స్వాతంత్ర దినోత్సవ తగ్గింపు ఆఫర్లను ఆగస్టు 5 నుంచి 9 వరకు షావోమీ అమలు చేస్తోంది. మొబైల్ ఫోన్లతో పాటు హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు ఉపయోగించి షావోమీ స్మార్ట్టీవీ కొనుగోలు చేస్తే గరిష్టంగా రూ. 7,500ల వరకు క్యాష్బ్యాక్ అమలు చేస్తోంది. దీంతో పాటు 20,000 ఎంఏహెచ్ పవర్బ్యాంక్పై రూ.500 తగ్గింపు అందిస్తోంది. Avail exciting offers on #MiSmartphones during the #BigSavingDays 📲 Up to ₹6,000 off on Exchange🤑 📲 Up to ₹2,500 Instant Discount and more Last day today! Shop now on @flipkart and save BIG! 😇 pic.twitter.com/ppREeLdcAD — Mi India (@XiaomiIndia) August 9, 2021 -
మరోసారి సంచలనం సృష్టించిన షావోమీ..!
ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ మరో సంచలనాన్ని సృష్టించింది. 2021 జూన్ నెలలో మొట్టమొదటి సారిగా ప్రపంచంలోనే నంబర్ వన్ స్మార్ట్ఫోన్ బ్రాండ్గా షావోమీ నిలిచింది. ఈ ఏడాది జూన్ మాసంలో షావోమీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్మార్ట్ఫోన్లను విక్రయించింది. డేటా పరిశోధన సంస్థ కౌంటర్పాయింట్ ప్రకారం ఆఫ్రికా, చైనా, యూరోప్, మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో షావోమీ స్మార్ట్ఫోన్లను విస్తరించడంతో అమ్మకాలు గణనీయంగా పెరిగాయని వెల్లడించింది. షావోమీ సంస్థను 2010లో స్థాపించగా కంపెనీ నుంచి తొలి స్మార్ట్ఫోన్ను 2011 సంవత్సరంలో విడుదల చేసింది. అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా షావోమీ స్మార్ట్ఫోన్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. షావోమీ అమ్మకాలు మే నెలతో పోలిస్తే జూన్ నెలలో గణనీయంగా 26 శాతం పెరిగాయి. ప్రపంచంలో స్మార్ట్ఫోన్ అమ్మకాల పరంగా షావోమీ బ్రాండ్ స్మార్ట్ఫోన్లు 17.1 శాతం మార్కెట్ వాటాను స్వాధీనం చేసుకుంది. షావోమీ బ్రాండ్ తరువాత ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ఫోన్ మార్కెట్లో శాంసంగ్ 15.7 శాతం, ఆపిల్ 14.3 శాతం వాటాలను సొంతం చేసుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది రెండో త్రైమాసికంలో అత్యధిక అమ్మకాలు జరిపిన రెండో బ్రాండ్గా షావోమీ నిలిచింది. షావోమీ ప్రపంచవ్యాప్తంగా 800 మిలియన్ స్మార్ట్ఫోన్లను విక్రయించింది. ఆఫ్రికా, చైనా, యూరప్, మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో హువావే స్మార్ట్ఫోన్ వెనక్కి తగ్గడంతో ఆ గ్యాప్ను షావోమీ భర్తీ చేసిందని కౌంటర్పాయింట్ రీసెర్చ్ డైరక్టర్ తరుణ పాఠఖ్ వెల్లడించారు. జూన్ నెలలో చైనా, యూరప్, మిడిల్ ఈస్ట్, భారత మార్కెట్లలో షావోమీ స్మార్ట్ఫోన్స్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. వియత్నాంలో కోవిడ్-19 వేవ్ రాకతో శాంసంగ్ స్మార్ట్ఫోన్స్ ఉత్పత్తి కూడా దెబ్బతింది. ఈ కారణంగానే శాంసంగ్ వెనుకబడి ఉండవచ్చునని కౌంటర్పాయింట్ సంస్థ తమ నివేదికలో పేర్కొంది. -
రెడ్ మీ నుండి ఫస్ట్ ల్యాపీ.. ఎలా ఉందో తెలుసా?
Xiaomi First Laptop: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ షియోమీ నేడు తొలిసారి రెడ్మీ ల్యాప్ట్యాప్ లను మార్కెట్లో విడుదల చేయనుంది. స్మార్ట్ఫోన్లు, ల్యాప్ ట్యాప్ల వినియోగం పెరిగి పోతుండడంతో ఆయా టెక్ సంస్థలు వినియోగదారులకు అనుగుణంగా గాడ్జెట్స్ను అందుబాటులోకి తెస్తున్నాయి. యూజర్లను అట్రాక్ట్ చేస్తున్నాయి. తాజాగా, షియోమీ సంస్థ 'రెడ్ మీ బుక్' పేరుతో రెండు మోడళ్లను ల్యాప్ ట్యాప్లను విడుదల చేస్తున్నట్లు అధికారంగా ప్రకటించింది. గతేడాది రెడ్ మీ బ్రాండ్ పేరుతో భారీ ఎత్తున పవర్ బ్యాంక్స్, ఇయర్ బడ్స్, స్మార్ట్ బ్రాండ్ను విడుదల చేసింది. ఈ ఏడాది స్మార్ట్ టీవీలను లాంఛ్ చేసింది. ఇప్పుడు అదే బ్రాండ్ పేరుతో ల్యాప్ ట్యాప్లను విడుదల చేయడం టెక్ మార్కెట్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. రెడ్ మీ బుక్ ల్యాప్ ట్యాప్ ఫీచర్స్ ప్రస్తుతం ఉన్న విండోస్ - 10 తో పాటు త్వరలో అప్ డేట్ కానున్న విండోస్ -11ను అప్ గ్రేడ్ చేసుకునే విధంగా రెడ్ మీ బుక్ ల్యాప్ట్యాప్ ను డిజైన్ చేశారు. దీంతో పాటు 15 అంగుళాల స్క్రీన్ సైజ్, 1920*1080 పిక్సెల్స్ రెజెల్యూషన్తో ఫుల్ హెచ్డీ డిస్ప్లే, వెబ్ క్యామ్ కోసం లైట్ బెజెల్స్ను ఏర్పాటు చేయడం మరింత ఆసక్తికరంగా మారింది. డ్యూయల్ బ్యాండ్ వైఫై, వీ 5.0 బ్లూటూత్, సీ టైప్ 3.1యూఎస్బీ, యూఎస్బీ టైప్ -ఏ,యూఎస్ బీ 2.0, ఆడియో జాక్, రెండు స్టెరో స్పీకర్స్ ఉన్నాయి. ఈ ల్యాప్ ట్యాప్లో మరో ఇంట్రస్టింగ్ ఫీచర్ ఏంటంటే ఇంటెల్ లెవెన్త్ జనరేషన్ లో ఐ3,ఐ5 ప్రాసెసర్ తో పనిచేయనుంది. 8జీబీ ర్యామ్, 512జీబీ సాలిడ్ స్టేట్ డ్రైవ్ (ఎస్ఎస్డీ), 65 వాట్ల ఛార్జర్, ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 10 గంటల పాటు వినియోగించుకోవచ్చేని రెడ్ మీ పేర్కొంది. కాస్ట్ ఎంత ఉండొచ్చు ప్రస్తుతం ల్యాప్ ట్యాప్ స్పెసిఫికేషన్లు అందుబాటులోకి వచ్చినా ధరపై షియోమీ సంస్థ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. టెక్ నిపుణులు మాత్రం రెడ్ మీ బుక్ ల్యాప్ ట్యాప్లు రూ.50వేల లోపు ఉంటాయని అంచనా వేస్తున్నారు. -
త్వరలోనే రెడ్మీబుక్-15 లాంచ్..! ధర ఎంతంటే...!
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 రాకతో పాఠశాలలు, ఆఫీసులు పూర్తిగా క్లోజ్ అవ్వడంతో పిల్లలకు ఆన్లైన్ క్లాస్లు, ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్కే పరిమితమయ్యారు. దీంతో స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్ కొనుగోళ్లలో భారీగా వృద్ధి చెందింది. ల్యాప్టాప్స్ కొనుగోలు గణనీయంగా పెరగడంతో పలు దిగ్గజ స్మార్ట్ఫోన్ కంపెనీలు ల్యాప్టాప్లపై దృష్టి సారించాయి. ప్రముఖ స్మార్ట్ఫోన్లల తయారీదారు షావోమీ కూడా ల్యాప్టాప్ ఉత్పత్తి రేసులో ముందు నిలుస్తోంది. తాజాగా షావోమీ రెడ్మీబుక్ 15 పేరిట మరో ల్యాప్టాప్ను త్వరలోనే లాంచ్ చేయనుంది. ఈ ల్యాప్టాప్ను ఆగస్టు 3 న భారత మార్కెట్లలోకి లాంచ్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. రెడ్మీబుక్ 11th జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రొసెసర్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉండనుంది. రెడ్మీబుక్ 15 ప్రముఖ ల్యాప్ట్యాప్లు ఏసర్ స్విఫ్ట్ 3, ఆసుస్ వివోబుక్ తో పోటీ పడనున్నట్లుగా తెలుస్తోంది. రెడ్మీబుక్ ధర రూ. 50 వేల దిగువ ఉండొచ్చునని టెక్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. రెడ్మీబుక్ 15 ఫీచర్లు 15.6 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే 11th జనరేషన్ ఇంటెల్ కోర్ i3 అండ్ i5 ప్రొసెసర్ 8జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నట్ స్టోరేజ్, 516 జీబీ ఎస్ఎస్డీ స్టోరేజ్ విత్ విండోస్ 10. డ్యూయల్ బ్యాడ్ వైఫై, బ్లూటూత్ వర్షన్ 5.0 యూఎస్బీ 3.1 టైప్ సీ, యూఎస్బీ టైప్-ఏ, యూఎస్బీ 2.0, హెచ్డీఏమ్ఐ, ఆడియోజాక్ పోర్ట్. 65w ఛార్జర్. -
శాంసంగ్ కు పోటీగా దూసుకెళ్తున్న షియోమీ
గ్లోబల్ స్మార్ట్ఫోన్ షిప్ మెంట్స్ పరంగా దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్, చైనా దిగ్గజం షియోమీ పోటీపడుతున్నాయి. ప్రముఖ రీసెర్చ్ సంస్థ అంతర్జాతీయ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) విడుదల చేసిన గ్లోబల్ స్మార్ట్ఫోన్ గ్రోత్ ఇన్ 2021 క్యూ2 నివేదిక ప్రకారం.. స్మార్ట్ఫోన్ షిప్ మెంట్స్ పరంగా శాంసంగ్ అగ్రభాగాన ఉంది. శాంసంగ్ తర్వాత రెండవ స్థానంలో చైనా దిగ్గజం షియోమీ ఉంది. షియోమీ మొదటిసారి రెండవ స్థానానికి చేరుకుంది. క్యూ2 2021లో యాపిల్ ను మూడవ స్థానానికి నెట్టింది. మొత్తం షిప్ మెంట్ వాల్యూమ్ పరంగా సంవత్సరానికి 13.2 శాతం పెరిగాయి. స్మార్ట్ఫోన్ విక్రేతలు త్రైమాసికంలో మొత్తంగా 313.2 మిలియన్ పరికరాలను రవాణా చేశారు. 2021 క్యూ2లో శామ్ సంగ్ 59 మిలియన్ యూనిట్లను రవాణా చేసినట్లు ఐడీసీ నివేదించింది. దీంతో మొత్తం మార్కెట్లో దీని వాటా 18.8 శాతం. దక్షిణ కొరియా దిగ్గజం గత ఏడాది ఇదే త్రైమాసికంలో 54 మిలియన్ యూనిట్లను రవాణా చేసింది. మరోవైపు, షియోమీ క్యూ2 2021లో 53.1 మిలియన్ యూనిట్లతో షిప్ మెంట్ లలో గణనీయమైన వృద్ధిని సాధించింది. ఇక మార్కెట్లో దీని వాటా 16.9 శాతం. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రవాణా చేసిన 28.5 మిలియన్ యూనిట్ల నుంచి ఇది భారీ పెరుగుదల. ఐడీసీ నివేదికల ప్రకారం.. 44.2 మిలియన్ షిప్ మెంట్లు, 14.1 శాతం మార్కెట్ వాటాతో యాపిల్ మూడవ స్థానానికి చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో యాపిల్ 37.6 మిలియన్ యూనిట్లను రవాణా చేసి 13.6 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఇక తర్వాత వరుసలో ఒప్పో(32.8 మిలియన్లు), వివో 31.6 మిలియన్ల షిప్ మెంట్లతో ఐడీసీ జాబితాలో మూడవ, నాల్గవ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. -
ల్యాప్ ట్యాప్ కొనాలనుకుంటున్నారా, అయితే ఈ బ్రాండ్ బాగుంటుందంట
వర్క్ఫ్రమ్ హోమ్, ఆన్లైన్లో మనీ ఎర్నింగ్ కోసం మంచి ల్యాప్ట్యాప్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా?! మనకి డెల్,హెచ్పీ,లెనెవో, ఆసుస్ ల్యాప్ ట్యాప్ల గురించి మాత్రమే తెలుసు. అయితే మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న ల్యాప్ట్యాప్..పై వాటికంటే బాగుంటుందని టెక్ నిపుణలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ రెడ్ మీ లేటెస్ట్ గా 5జీస్మార్ట్ ఫోన్లు రెడ్ మీ నోట్ 10 ఫ్యామిటీ, షియోమీ రెడ్ నోట్మీ 10టీ విడుదల చేసి వినియోగదారుల్ని అట్రాక్ట్ చేస్తుంది. అయితే త్వరలో షియోమీ సంస్థ రూ.13,999వేరియంట్ తో స్మార్ట్ ఫోన్లను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఆ స్మార్ట్ ఫోన్ తో పాటు పవర్ బ్యాంక్స్, రెడ్ మీ ఆడియో, స్మార్ట్ టీవీ, ఫిట్నెస్ బ్రాండ్ 'రెడ్మీబూ' పేరుతో ల్యాప్ట్యాప్ను విడుదల చేయనున్నట్లు షియోమీ రియల్ మీ ఇండియా సీఈఓ మురళికృష్ణన్ తెలిపారు. అయితే దీని స్పెసిఫికేషన్ ఎలా ఉన్నాయనే విషయంపై చర్చించలేదు. త్వరలోనే ఇండియాలో విడుదల చేస్తున్నట్లు చెప్పడం ఆసక్తికరంగా మారింది. షియోమి ల్యాప్ ట్యాప్లు షియోమి ల్యాప్ ట్యాప్లను విడుదల చేయడం ఇది తొలిసారేమీ కాదు. గతంలో రెడ్మి నోట్బుక్14 హారిజోన్,రెడ్మి నోట్బుక్14 (ఐసి), రెడ్మి నోట్బుక్14, రెడ్మి నోట్ బుక్ 14 ఇ-లెర్నింగ్ ల్యాప్ట్యాప్లను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు, రెడ్మీ నోట్బుక్ ప్రో14, రెడ్మి నోట్బుక్ అల్ట్రా15 అనే రెండు కొత్త ల్యాప్టాప్లను విడుదల చేయడం ద్వారా కంపెనీ తన ల్యాప్టాప్ల అమ్మకాలు మరింత విస్తృతంగా జరిపేందుకు యోచిస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి.రాబోయే ల్యాప్టాప్లు రెడ్మిబుక్ ప్రో 14 రీబ్రాండెడ్ వెర్షన్లుగా భావిస్తున్నారు. మరి త్వరలో విడుదల కానున్న రెడ్మీబూ ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సి ఉంది. చదవండి: ఇన్ స్టాగ్రామ్,ఈ సూపర్ ఫీచర్ గురించి మీకు తెలుసా?! -
ఆ ఫోన్ దూకుడు మామూలుగా లేదుగా.. 40కోట్లు దాటిన యూజర్లు
హైదరాబాద్: అంతర్జాతీయంగా స్మార్ట్ఫోన్ల షిప్మెంట్పై కేనలిస్ డేటా విడుదల చేసింది. ఆ డేటా ప్రకారం వరల్డ్ వైడ్ గా స్మార్ట్ఫోన్ల వినియోగం 12శాతం పెరిగాయి. వాటిలో శాంసంగ్ 19శాతం స్మార్ట్ ఫోన్ల వినియోగంతో తొలిస్థానాన్ని దక్కించుకుంది. షియోమి17శాతంతో రెండో స్థానంలో ఉండగా.. 14శాతంతో యాపిల్ సైతం మూడో స్థానంలో నిలిచింది. వివో,ఒప్పో స్మార్ట్ఫోన్లు ఐదోస్థానంలో నిలిచింది. తొలి క్వార్టర్లో 10 శాతం మార్కెట్ వాటాతో ఐదో స్థానంలో ఉంది. గతేడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 27 శాతం అధికంగా స్మార్ట్ఫోన్లను షిప్మెంట్ చేసినట్టు కేనలిస్ డేటా తెలియజేస్తోంది. గతేడాది కూడా వివో ఐదో స్థానంలో నిలవడం గమనార్హం. 50కు పైగా దేశాల్లో వివోకు విక్రయ నెట్వర్క్ ఉండగా.. 40 కోట్ల మంది యూజర్లు ఉన్నారని కేనలిస్ డేటాలో పేర్కొంది. చదవండి: 'పెగసెస్' మీ స్మార్ట్ఫోన్ పై దాడి చేసిందో లేదో తెలుసుకోండిలా?! -
అతి తక్కువ ధరకే షావోమీ నుంచి 5జీ ఫోన్...!
ప్రముఖ స్మార్ట్ఫోన్ మొబైళ్ల తయారీ సంస్థ షావోమీ భారత మార్కెట్లోకి రెడ్మీ నోట్ 10టీ 5జీను మంగళవారం రోజున లాంచ్ చేసింది. షావోమి నుంచి రెడ్మీ బ్రాండ్తో భారత్లో రిలీజైన తొలి 5జీ స్మార్ట్ఫోన్. రెడ్మీ నోట్ 10 సిరీస్ నుంచి వచ్చిన ఐదో ఫోన్ రెడ్మీ నోట్ 10టీ 5జీ. రెండు రకాల స్టోరేజ్ వేరియంట్తో ఫోన్లను లాంచ్ చేశారు. క్రోమియం వైట్, గ్రాఫైట్ బ్లాక్, మెటాలిక్ బ్లూ, మింట్ గ్రీన్ కలర్ వేరియంట్లతో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. రెడ్మీ నోట్ 10టీ 5జీ (4 జీబీ + 64 జీబీ స్టోరేజ్) వేరియంట్ ధర రూ.13,999 ఉండగా, 6 జీబీ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 15,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ను జూలై 26 నుంచి అమెజాన్ , ఎమ్ఐ.కామ్, ఎమ్ఐ హోమ్ స్టోర్స్ నుంచి పొందవచ్చును. మొబైల్ను హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1,000 ఇన్స్టాంట్ డిస్కౌంట్ వర్తిస్తుంది. రెడ్ మీ 10టీ 5జీ ఫీచర్లు 6.5 అంగుళాల ఫుల్-హెచ్ డి ప్లస్ హోల్-పంచ్ డిస్ ప్లే ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయుఐ 12 మీడియాటెక్ డిమెన్సిటీ 700 ప్రాసెసర్ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ 48 ఎంపీ మెయిన్ కెమెరా + 2 ఎంపీ మాక్రో + 2 ఎంపీ డెప్త్ కెమెరా 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 18వాట్స్ ఫాస్ట్ చార్జర్ 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ -
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. మొబైల్స్పై భారీ డిస్కౌంట్లు
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్, బిగ్ సేవింగ్ డేస్ పేరుతో మరో సేల్ ను ముందుకు తీసుకొచ్చింది. ఈ సేల్ జూలై 25 నుంచి జూలై 29 వరకు నడుస్తుంది. ఈ సేల్ లో కొన్ని టాప్ బ్రాండ్ల స్మార్ట్ ఫోన్ లపై అద్భుతమైన డిస్కౌంట్లు, ఆఫర్లు అందిస్తుంది. ఫ్లిప్ కార్ట్ ప్లస్ సభ్యుల కొరకు ఈ సేల్ 1 రోజు ముందుగా ప్రారంభం అవుతుంది. ఫ్లిప్ కార్ట్ ప్లస్ అనేది అమెజాన్ ప్రైమ్ కు ఫ్లిప్ కార్ట్ కు సమానం. ఈ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభం కావడానికి కేవలం ఒక వారం మాత్రమే ఉంది. ఈ సేల్ లో ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులు అదనంగా 10 శాతం తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. ప్రస్తుతం రూ.23,999 ధర గల పోకో ఎక్స్3 ప్లస్ సేల్ సమయంలో రూ.17,249 (ఐసీఐసీఐ బ్యాంక్ ఆఫర్ తో సహా) లభ్యం అవుతుంది. పోకో ఎక్స్3 ప్లస్ 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది. ఇది 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డి+ డిస్ ప్లేతో వస్తుంది. ఇది 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో రియర్ క్వాడ్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ప్రస్తుతం రూ.23,999 ధరకు లభిస్తున్న షియోమీకి చెందిన ఎంఐ 11 లైట్ రూ.20,499 (బ్యాంక్ ఆఫర్ తో సహా) లభ్యం కానుంది. ఇది 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది. ఇది 64 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరాను కలిగి ఉంది. దీంతో పాటు శామ్ సంగ్, ఒప్పో, వివో, ఆపిల్ బ్రాండ్స్ కి చెందిన మొబైల్స్ పై కూడా భారీ డిస్కౌంట్స్ అందిస్తున్నట్లు ఫ్లిప్కార్ట్ తెలిపింది. -
ప్రపంచంలో రెండో అతిపెద్ద ఫోన్ మేకర్గా రెడ్మీ
-
సంచలనం:యాపిల్ను వెనక్కి నెట్టిన షియోమీ
స్మార్ట్ఫోన్ మార్కెట్లో షియోమీ సంచలనం సృష్టించిది. యాపిల్ కంపెనీని వెనక్కి నెట్టేసి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఫోన్ మేకర్గా నిలిచింది. ఇక ఈ చైనీస్ మొబైల్ కంపెనీ ఇప్పుడు శాంసంగ్ టాప్ పొజిషన్కు ఎర్త్ పెట్టేందుకు సిద్ధమైంది. టెక్నాలజీ మార్కెట్ అనలిస్ట్ canalys నివేదిక ప్రకారం.. 2021 రెండో క్వార్టర్లో ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ఫోన్ అమ్మకాల ద్వారా షియోమీ రెండో స్థానానికి చేరుకుంది. ఇక మొత్తం స్మార్ట్ఫోన్ మార్కెట్లో 19 శాతం షేర్లతో దక్షిణ కొరియా దిగ్గజ కంపెనీ శాంసంగ్ టాప్ పొజిషన్లో ఉండగా, షియోమీ 17 శాతం షేర్ల వద్ద ముగిసింది. సాధారణంగా ఇప్పటిదాకా శాంసంగ్, యాపిల్ల్లో మాత్రమే ఏదో ఒకటి నెంబర్ వన్ పొజిషన్లో ఉంటూ వచ్చేవి. ఫస్ట్ టైం షియోమీ రెండో ప్లేస్కు చేరి ఆ సంప్రదాయానికి పుల్స్టాప్ పెట్టింది. హువాయ్ పతనం తర్వాత మిగతా ఫోన్ కంపెనీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. అయితే ఈ గ్యాప్ను పూరించే పోటీలో షియోమీ పైచేయి సాధించింది. లాటిన్ దేశాలకు 300 శాతం కంటే ఎక్కువ, ఆఫ్రికా దేశాలకు 150 శాతం, పశ్చిమ యూరప్ దేశాలకు 50 శాతం షియోమీ ఫోన్ ఎగుమతులు వెళ్లాయి. ఎంఐ11 అల్ట్రా లాంటి ఫోన్ల వల్లే షియోమీ క్రేజ్ పెరిగిందని.. అదే టైంలో ఒప్పో, వివో నుంచి గట్టి పోటీ ఎదురైందని కనాలిస్ నివేదిక వెల్లడించింది. అయినప్పటికీ షియోమీ రెండో స్థానానికి చేరుకోవడం విశేషం. ఇక ఈ ఊపు ఇలాగే కొనసాగితే షియోమీ నెంబర్ వన్ బ్రాండ్గా అవతరించేందుకు అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడింది. ప్రస్తుతం యాపిల్కు 14 శాతం షేర్ ఉండగా, ఒప్పో.. వివోలు చెరో పదిశాతం మార్కెట్ను కలిగి ఉన్నాయి. -
ఈ ఒక్క ఛార్జర్తో అన్నింటికీ చెక్..! ధర ఎంతంటే..
స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, హెడ్ఫోన్స్ మన నిత్యజీవితంలో ఒక భాగమయ్యాయి. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్, హెడ్ ఫోన్స్కు వేరవేరుగా బ్యాటరీ ఛార్జర్లను మనతో పాటు క్యారీ చేయాల్సి ఉంటుంది. ఏదైనా కొత్త ప్రదేశాలకు వెళ్లి మనం క్యారీ చేసే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కు ఛార్జర్లు మర్చిపోయామంటే అంతే సంగతులు.. తిరిగి దగ్గరలో ఉన్న ఎలక్ట్రానిక్ షాప్కు వెళ్లి కొత్తది కొనుకోవాల్సిందే. మనలో చాలామంది ఈ సమస్యను ఎదుర్కొన్నవాళ్లమే.. తాజాగా షావోమి రిలీజ్ చేసిన ఛార్జర్తో వీటన్నింటికీ చెక్ పెట్టవచ్చును. షావోమి మార్కెట్లోకి 67W సోనిక్ఛార్జ్ 3.0 ను సోమవారం రోజున మార్కెట్లోకి రిలీజ్ చేసింది. షావోమి రిలీజ్ చేసిన కొత్త ఛార్జర్ యుఎస్బీ టైప్-ఎ నుంచి యుఎస్బీ టైప్-సి సపోర్ట్ చేయనుంది. కాగా ఛార్జర్లో ఒకే యుఎస్బి టైప్-ఎ పోర్ట్ ఉండడం గమనార్హం, కానీ షావోమి ఈ ఛార్జర్తో స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, హెడ్ఫోన్లు , మరెన్నో పలు పరికరాలను ఛార్జ్ చేయగలదని షావోమి పేర్కొంది. ఛార్జర్ అనేక పరికరాలను వేగంగా ఛార్జ్ చేయడానికి 67W అవుట్పుట్ను అందిస్తుంది.షావోమి ఈ ఏడాది ప్రారంభంలో 67W ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తూ ఎంఐ 11 అల్ట్రాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎంఐ 11 అల్ట్రా స్మార్ట్ ఫోన్కు 55W ఫాస్ట్ ఛార్జర్ను కొనుగోలుదారులకు షావోమీ అందిస్తోంది. షావోమి సోనిక్ఛార్జ్ 3.0 క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 3.0తో వస్తోంది. భారత్లో ఎంఐ 67W సోనిక్ ఛార్జ్ 3.0 ఛార్జర్ ధర రూ .1,999 గా నిర్ణయించారు. ఈ ఛార్జర్ను షావోమి అధికారిక వెబ్సైట్ నుంచి, ఎంఐ హోమ్ స్టోర్స్లో అందుబాటులో ఉండనుంది. ఛార్జర్కు 100 సెం.మీ 6A టైప్-సీ కేబుల్తో రానుంది. Mi 67W SonicCharge 3.0 Charger Combo#Mi67WCharger #SonicCharge3 Sale Starts Today at 12PM - https://t.co/Sb9Dw2mkHN Available on https://t.co/D3b3QtmvaT, Mi Home and Offline Stores. pic.twitter.com/N9WO1HsuVn — Mi India (@XiaomiIndia) July 12, 2021 -
ఎంఐ 12 స్మార్ట్ఫోన్లో రాబోయే ఫీచర్లు చూస్తే ఆశ్చర్యపోతారు
ప్రముఖ మొబైల్ తయారీ దిగ్గజాలలో ఒకటైన షియోమీకి చెందిన ఎంఐ 11 మొబైల్ ఇంకా అన్నీ దేశాలలో విడుదల అయ్యిందో కాలేదో గాని అప్పుడే తదుపరి తరం మొబైల్ ఎంఐ 12పై అనేక పుకార్లు బయటకి వస్తున్నాయి. ఈ పుకార్ల ప్రకారం.. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 895 ప్రాసెసర్, 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో రానున్నట్లు తెలుస్తుంది. మన మానవుడి కంటి సామర్థ్యమే 576 మెగాపిక్సల్ అలాంటిది ఎంఐ 12 మొబైల్ లో 200 మెగాపిక్సల్ అంటే కొంచెం అతిశయోక్తిగా ఉంది. పుకార్ల ప్రకారం అయితే ఈ ఫీచర్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్ నెలలో చైనాలో తీసుకొచ్చిన ఎంఐ 11లో ఫ్లాగ్ షిప్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ తీసుకొచ్చింది. ప్రపంచంలో మొదటిసారి స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ తో వచ్చిన మొబైల్ కూడా షియోమీ(ఎంఐ 11) కంపెనీకి చెందినదే. తర్వాత రాబోయే ఎంఐ 12 స్మార్ట్ఫోన్లో తదుపరి క్వాల్ కామ్ నుంచి రాబోయే ప్రాసెసర్ తీసుకొచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు. చైనీస్ టిప్ స్టార్ షేర్ చేసిన వివరాల ప్రకారం.. షియోమీ కొత్తగా తీసుకొని రాబోయే ఫోన్లో క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ ఎస్ఎమ్8450 అనే పేరుతో పిలిచే ప్రాసెసర్ తీసుకొస్తునట్లు తెలుస్తుంది. ఆ ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 895 లేక కొత్తగా ప్రకటించిన స్నాప్ డ్రాగన్ 888 ప్లస్ అని విషయం పూర్తిగా తెలియదు. 16-ఇన్-1 పిక్సెల్ బిన్నింగ్ టెక్నిక్ స్నాప్ డ్రాగన్ 888 ప్లస్ అనే ప్రాసెసర్, 888 ప్రాసెసర్ కంటే చాలా శక్తివంతమైనది. ఎంఐ 12లో శామ్ సంగ్, ఒలంపస్ నుంచి రాబోయే 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుందని సమాచారం. ఈ పుకార్ల ప్రకారం 16-ఇన్-1 పిక్సెల్ బిన్నింగ్ అనే టెక్నిక్ ద్వారా 200-మెగాపిక్సెల్ కెమెరా అవుట్ పుట రానుంది. అంటే 12 మెగాపిక్సల్ సామర్ధ్యమే(12*16 =192 మెగాపిక్సల్). ఈ ఫోన్ కెమెరా మాడ్యూల్ లో ఒలంపస్ లోగో కూడా ఉండవచ్చు. ఇది అడ్రినో 730 జీపీయు, క్వాడ్-ఛానల్ ఎల్ పీడీడీఆర్5 ర్యామ్ సపోర్ట్ రానున్నట్లు తెలుస్తుంది. చదవండి: State Bank Day: పీఎం కేర్స్ ఫండ్కు భారీ విరాళం -
Xiaomi: షాకిచ్చిందిగా! భారీగా ధరల పెంపు
సాక్షి,న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం కంపెనీ షావొమీ తన వినియోగదారులకు భారీ షాకిచ్చింది. సరసమైన ధరలు, అద్భుత ఫీచర్ల స్మార్ట్ఫోన్స్, స్మార్ట్ టీవీలతో వినియోగదారులకు విపరీతంగా ఆకట్టుకుని, భారత మార్కెట్లో టాప్ పొజిషన్లోకి దూసుకొచ్చిన షావోమి తన ఉత్పత్తులపై ధరలను 3-6 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. విడిభాగాల కొరత, దిగుమతి వ్యయాల కారణంగా జూలై 1 నుంచి కొత్త ధరలను సవరిస్తున్నట్టు వెల్లడించింది. డిమాండ్-సరఫరా మధ్య అంతరాయం పెరగడంతో విడిభాగాల ధరలు పెరుగుతూ వస్తున్నాయని కంపెనీ పేర్కొంది. భారతదేశంలో జూలై 1 నుంచి తమ స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీల ధరలను 3-6 శాతం పెంచిన ధరలు అమల్లో ఉంటాయని షావోమి ప్రకటించింది. షిప్పింగ్ చార్జీల భారం, కాంపోనేట్స్ కొరత కారణంగా ధరల పెంపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఇండియా ప్రతినిధి తెలిపారు. గత సంవత్సరం నుండి భారీ డిమాండ్-సరఫరా అసమతుల్యత నెలకొంది. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్లలో (చిప్సెట్లు, డిస్ప్లే ప్యానెల్లు, డిస్ప్లే డ్రైవర్, బ్యాక్ ప్యానెల్లు, బ్యాటరీ మొదలైనవి) ఉపయోగించే భాగాల ధరలు బాగా పెరిగాయని తెలిపారు. కాగా గ్లోబల్ మార్కెట్లో ప్యానెళ్ల ధరలు, లాజిస్టిక్స్ ఖర్చులు పెరిగాయి. సముద్ర సరుకు రవాణా ఛార్జీలూ కూడా పెరిగాయి. ఈ నిర్వహణ వ్యయం పెరగడం వల్ల దేశీయంగా రవాణా ఖర్చులు ఏప్రిల్లో బాగా పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్ఈడీ టీవల విభాగంలో ఇతర సంస్థలు కూడా ఈ నెలలో ధరలను 3-4 శాతం పెంచనున్నాయని అంచనా. చదవండి: Covid Second wave: దేశీయ బ్యాంకుల కష్టాలు Online shopping boost: డిజిటల్ ఎకానమీ జూమ్! -
48 ఎంపీ కెమెరాతో కొత్త టీవీ లాంచ్ చేసిన ఎంఐ
షియోమీ చైనాలో ఎంఐ టీవీ 6 ఎక్స్ ట్రీమ్ ఎడిషన్, ఎంఐ టీవీ ఈఎస్ 2022 స్మార్ట్ టీవీలను లాంఛ్ చేసింది. రెండు టీవీలు విభిన్న ఫీచర్లతో వచ్చాయి. ఎంఐ టీవీ 6 ఎక్స్ ట్రీమ్ ఎడిషన్ మీడియాటెక్ MT9950 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది 3డీ ఎల్ యుటీ ఫిల్మ్ ఇండస్ట్రియల్ గ్రేడ్ కలర్ కరెక్షన్ టెక్నాలజీని కలిగి ఉంది. దీని ముందు భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇది 48 మెగాపీక్సెల్ మెయిన్ కెమెరాను కలిగి ఉంది. మరోవైపు, ఎంఐ టీవీ ఈఎస్ 2022 మీడియాటెక్ ఎమ్ టి9638 ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. రెండు టీవీలు బెటర్ కాంట్రాస్ట్, పిక్చర్ క్వాలిటీ కొరకు మల్టీ జోన్ బ్యాక్ లైట్ సిస్టమ్ ని కలిగి ఉన్నాయి. ఈ కొత్త ఎంఐ టీవీ 6 ఎక్స్ ట్రీమ్ ఎడిషన్ 55 అంగుళాల మోడల్ ధర సీఎన్ వై 5,999(సుమారు రూ.68,900), 65 అంగుళాల మోడల్ ధర సీఎన్ వై 7,999(సుమారు రూ.91,900), ఇక 75 అంగుళాల మోడల్ ధర సీఎన్ వై 9,999 (సుమారు రూ.1,14,800)గా ఉంది. మరోవైపు, ఎంఐ టీవీ ఈఎస్ 2022 55 అంగుళాల మోడల్ ధర సీఎన్ వై 3,399(సుమారు రూ.39,000), 65 అంగుళాల మోడల్ ధర సీఎన్ వై 4,399(సుమారు రూ.50,500), 75 అంగుళాల మోడల్ ధర సీఎన్ వై 5,999 (సుమారు రూ.68,900)గా ఉంది. ఈ రెండు స్మార్ట్ టీవీలు అధికారికంగా జూలై 9న మార్కెట్లోకి రానున్నాయి. ఎంఐ.కామ్ లో ఇప్పటికే ప్రీ ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. చదవండి: Gravton Quanta EV: రూ.80కే.. 800 కిలోమీటర్లు ప్రయాణం -
సరికొత్త టెక్నాలజీ.. సౌండ్ ద్వారానే ఫోన్లు ఛార్జింగ్
ప్రస్తుతం స్మార్ట్ యుగంలో ప్రతి రోజు ఎక్కడో ఒక చోట కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. రెండు రోజులో క్రితమే చైనాలో కేవలం ఒకే రోజులో 10 అంతస్తుల భవనాన్ని నిర్మించారు. దీంతో ప్రపంచం ఒక్కసారిగా ఆశ్చర్య పోయింది. ఇప్పుడు మరోసారి సరికొత్త ఆవిష్కరణకు షియోమీ శ్రీకారం చుట్టింది. గత దశాబ్దం కాలంలో స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ స్క్రీన్ టెక్నాలజీ, ప్రాసెసింగ్ పవర్, వైర్ లెస్ కనెక్టివిటీ విషయాలలో సాంకేతిక పరిజ్ఞానం చాలా వేగంగా అభివృద్ది చెందింది. అయితే, బ్యాటరీ టెక్నాలజీ మాత్రం టెక్నాలజీ మాత్రం అనుకున్నంత వేగంగా అభివృద్ది చెందలేదు. గత ఏడాది నుంచి ఈ టెక్నాలజీలో పురోగతి కనిపిస్తుంది. మొబైల్ తయారీ కంపెనీలు ఛార్జింగ్ వేగంగా అయ్యేందుకు ఛార్జింగ్ శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. చైనా మొబైల్ తయారీ దిగ్గజం షియోమీ ఈ మద్యనే 200వాట్ చార్జర్ ని అభివృద్ది చేసింది. అయితే ఈ కంపెనీ ఇప్పుడు 'సౌండ్ ఛార్జింగ్' టెక్నాలజీకి సంబంధించి పేటెంట్ కోసం దాఖలు చేసినట్లు సమాచారం. గిజ్ చైనా నివేదిక ప్రకారం, షియోమీ రాష్ట్ర సంస్థ చైనా నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అడ్మినిస్ట్రేషన్ కు పేటెంట్ కోసం దరఖాస్తు చేసింది. ఈ పేటెంట్ టెక్నాలజీ ఒక పరికరాన్ని ధ్వని ద్వారా ఛార్జ్ చేయడానికి కంపెనీ కృషి చేస్తున్నట్లు తెలుస్తుంది. 'సౌండ్ ఛార్జింగ్' టెక్నాలజీలో రెండు ముఖ్యమైన భాగాలు ఉన్నట్లు పేటెంట్ ద్వారా తెలుస్తుంది. షియోమీ అభివృద్ది చేస్తున్న కాంటాక్ట్ లెస్ వైర్ లెస్ ఛార్జింగ్ మొదటి రూపం ఇది కాదు. జనవరిలో కంపెనీ తన 'ఎయిర్ ఛార్జ్' టెక్నాలజీని ఆవిష్కరించింది. ఈ టెక్నాలజీ ద్వారా గదిలో మనం ఎక్కడ స్మార్ట్ ఫోన్ ఉంచిన ఫోన్ చార్జ్ కానుంది. దీని ఛార్జ్ చేయడానికి బీమ్ ఫార్మింగ్ అనే ఫోకస్టింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. అయితే, ఈ కొత్త 'సౌండ్ ఛార్జింగ్' టెక్నాలజీని కొట్టి పారేస్తున్నారు. చదవండి: బడ్జెట్లో రియల్ మీ 5జీ స్మార్ట్ ఫోన్ -
వచ్చేసింది..ఎంఐ 11లైట్.. ప్రీ ఆర్డర్పై భారీ తగ్గింపు..!
ముంబై: ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమి ఎంఐ 11 లైట్ను జూన్ 22న లాంచ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎంఐ 11 లైట్ మార్చిలోనే విడుదల కాగా భారత్లో జూన్ 28 నుంచి ఫ్లిప్కార్ట్లో అందుబాటులోకి రానుంది. భారత్లో ఎంఐ 11 లైట్ 6జీబీ, 8 జీబీ వేరియంట్లలో రానుంది. కాగా ఎంఐ 11లైట్ (6జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజీ) రూ. 21, 999 లభించనుంది. (8జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజీ) వేరియంట్ రూ. 23, 999 కు లభిస్తోంది. ఎంఐ 11 లైట్ జాజ్ బ్లూ, ట్యూస్కానీ కోరల్, వినైల్ బ్లాక్ కలర్ వేరియంట్లతో రానుంది. ప్రపంచంలోనే అత్యంత సన్నని స్మార్ట్ఫోన్గా షావోమీ చెబుతుంది. ఎంఐ 11 లైట్ బరువు కేవలం 157 గ్రాములు మాత్రమే. కాగా ఈ ఫోన్ 6.8 ఎమ్ఎమ్ థిక్నెస్ను కల్గి ఉంది. తాజాగా ఎంఐ 11లైట్ను ప్రీ ఆర్డర్ చేస్తే రూ. 1,500 ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్ను ఉపయోగించే వారికి రూ.1,500 డిస్కౌంట్ అదనంగా లభిస్తోంది. ఎంఐ లైట్ 6జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ. 18, 999 ధరకు, 8జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజీ వేరియంట్ను రూ. 20,999 ధరకు అందించనుంది. ఎంఐ 11 లైట్ ఫోన్ను ఫ్లిప్ కార్డులో, ఎంఐ స్టోర్లో జూన్ 25న ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చును. ఎంఐ 11 లైట్ తొలి సేల్ జూన్ 28 నుంచి ప్రారంభంకానుంది. ఎంఐ 11 లైట్ ఫీచర్స్: 6.55 అంగుళాల ఎఫ్ హెచ్ డీ+ అమోల్డ్ డిస్ ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 732జీ ప్రాసెసర్ 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్ లెన్స్, 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా , 33వాట్ రాపిడ్ ఛార్జింగ్ టెక్నాలజీ, 4,250 ఎమ్ఎహెచ్ బ్యాటరీ *Drumrolls* It's THAT time now. Own the 6GB + 128GB for just 18,999/-* 8GB + 128GB for just 20,999/-* (incl. offers) So, save the date to pre-book the slimmest and the lightest smartphone of 2021 starting from 25th June, 12 noon ⏰#LiteAndLoaded #Mi11Lite pic.twitter.com/oud9MsVPiJ — Mi India (@XiaomiIndia) June 22, 2021 చదవండి: Xiaomi : స్మార్ట్వాచ్పై భారీ తగ్గింపు..! -
Xiaomi : స్మార్ట్వాచ్పై భారీ తగ్గింపు..!
ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమి కీలక ప్రకటన చేసింది. తాజాగా షావోమి జూన్ 22న, ఎంఐ 11లైట్ స్మార్ట్ఫోన్తోపాటుగా ఎంఐ రివాల్వ్ యాక్టివ్ స్మార్ట్ వాచ్ను భారత్లో లాంచ్ చేయనుంది. అంతకుముందు గత ఏడాది సెప్టెంబర్లో ప్రారంభించిన ఎంఐ రివాల్వ్కు తదనంతర వాచ్గా ఎంఐ రివాల్వ్ యాక్టివ్ ఉండనుంది. దీంతో ప్రస్తుతం ఉన్న ఎంఐ రివాల్వ్ స్మార్ట్వాచ్పై భారీ తగ్గింపును ప్రకటించింది. షావోమి ఎంఐ రివాల్వ్ స్మార్ట్వాచ్పై సుమారు రూ.2,000 వరకు స్మార్వాచ్ ధరను తగ్గించింది. తొలుత ఎంఐ రివాల్వ్ స్మార్ట్వాచ్ ధర రూ. 10, 999 ప్రకటించగా, కొన్ని రోజుల్లోనే రూ. 1000 తగ్గించి చివరగా రూ. 9,999 ధరగా ఫిక్స్ చేసింది. కాగా ప్రస్తుతం షావోమి ప్రకటనతో ఎంఐ రివాల్వ్ స్మార్ట్వాచ్ రూ. 7,999 కు లభించనుంది. ఎంఐ రివాల్వ్ స్మార్ట్ వాచ్ను షావోమి వెబ్సైట్, అమెజాన్ ఇండియా నుంచి పొందవచ్చును. ఈ వాచ్ మిడ్నైట్ బ్లాక్, క్రోమ్ సిల్వర్ వేరియంట్లలో లభిస్తోంది. చదవండి: షియోమీ నుంచి మరో సరికొత్త ఒఎల్ఈడీ టీవి -
ఆన్లైన్లో ఎంఐ 11 లైట్ ఫీచర్స్ వైరల్
షియోమీ జూన్ 22న భారతదేశంలో తీసుకొని వస్తున్న ఎంఐ 11 లైట్ ఫీచర్స్ ఆన్లైన్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఫ్లిప్ కార్ట్ లో ఇది కొనుగోలుకు రానుంది. ఎంఐ 11 లైట్ మూడు రంగుల్లో అందించనున్నట్లు షియోమీ ఇటీవల ప్రకటించింది. ఎంఐ 11 లైట్ ఇప్పటికే 2021 స్లిమ్మింగ్, తేలికైన స్మార్ట్ ఫోన్ గా దృవీకరించారు. షియోమీ ఎంఐ 11 లైట్ ధర రూ.25,000 కంటే తక్కువగా తీసుకొస్తారని సమాచారం. ఫోన్ బేస్ వేరియెంట్ ధర రూ.20,000 ఉండవచ్చు. ఎంఐ 11 లైట్ వన్ ప్లస్ నార్డ్ సీఈ 5జీ, ఐక్యూఓయూ జెడ్3, ఇతర ఫోన్ లతో పోటీ పడనుంది. ఆన్లైన్లో వైరల్ అవుతున్న ఎంఐ 11 లైట్ ఫీచర్స్ ఈ క్రింది విదంగా ఉన్నాయి. ఎంఐ 11 లైట్ ఫీచర్స్: 6.5 అంగుళాల ఎఫ్ హెచ్ డీ+ అమోల్డ్ డిస్ ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 732జీ ప్రాసెసర్ 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్ లెన్స్, 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా , 33వాట్ రాపిడ్ ఛార్జింగ్ టెక్నాలజీ, 4,250 ఎమ్ఎహెచ్ బ్యాటరీ చదవండి: Revolt RV400: రెండు గంటల్లో బుకింగ్స్ క్లోజ్.. స్పెషల్ ఏంటి? -
ఫోన్ల విక్రయంలో.. హైదరాబాదీలు నిజాలే చెప్తారు
సెకండ్ హ్యాండ్లో స్మార్ట్ఫోన్ అన్ లైన్లో కొనాలంటే మనకొచ్చే మెయిన్ డౌట్ కొన్నాక ఫోన్ సరిగా పనిచేస్తుందో లేదోనని? అయితే ప్రీఓన్ట్ మొబైల్స్ విక్రయం విషయంలో మాత్రం హైదరాబాదీలు అన్ని వివరాలు పక్కాగా, నిజాలే చెబుతారంట. యూజ్జ్ స్మార్ట్ఫోన్స్ విక్రయాలలో న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల వినియోగదారులు 'టాప్ సెల్లింగ్ జాబితాలో నిలిస్తే.. హైదరాబాద్ చెన్నైవాసులు మాత్రం 'ట్రూత్ ఇండెక్స్లో అగ్రస్థానంలో నిలిచారు. స్మార్ట్ఫోన్ల అమ్మకంలో వాస్తవ పరిస్థితిని అత్యంత నిజాయితీగా వివరిస్తున్నారని అన్ లైన్లో యూజ్జ్ ఫోన్లను విక్రయించే కంపెనీ క్యాషిఫై పేర్కొంది. ఘజియాబాద్, ఫరీదాబాద్ అహ్మదాబాద్ లక్నో వంటి శాటిలైట్ టౌన్స్లలోను సెకండ్స్ మొబైల్స్ మార్కెటక డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుంది. 2020లో ప్రీఓన్ట్ ఫోన్లు అత్యధిక రిపేర్లు కలిగిన నగరంలో ఢిల్లీ నిలిచిందని క్యాషిఫై 'యూజర్ బిహేవియర్ వైట్పేపర్ ఐదవ వార్షిక నివేదిక వెల్లడించింది. టాప్ బ్రాండ్ షావోమీ, యాపిల్ ప్రపంచ ప్రీఓన్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో ఇండియా రెండో అతిపెద్ద దేశం. దేశంలో సగటు భారతీయుడు స్మార్ట్ఫోన్ కొనుగోలు చేసిన 14-18 నెల ఒకసారి అప్గ్రేడ్ కోసం చూస్తున్నారని క్యాషిఫై కో-ఫొండర్ అండ్ సీఓఓ నకుల్ కుమార్ తెలిపారు. హైస్పీడ్ నెట్వర్క్ కనెక్టివిటీ(3జీ నుంచి 4జీ), ఆన్లైన్ తరగతుల కోసం ఎక్కవగా ప్రీఓన్డ్ స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. 2020లో సెకండ్హ్యాండ్ ఫోన్లు ఎక్కువ విక్రయమైన బ్రాండ్లలో 26 శాతం వాటాతో షావోమీ అగ్రస్థాసంలో నిలవగా... 20 శాతంతో యాపిల్, 16 శాతంతో శామ్సంగ్, వివో, మోటరోలా (ఒక్కోటి 6 శాతం) వరుసగా తర్వాతి స్థానాలలో నిలిచాయి. రూ.10 వేల లోపు ధర ఉన్న స్మార్ట్ఫోన్లనే వినియోగదారులు ఎక్కవగా విక్రయించారు. ఐఫోన్-7, రెడ్మీ నోట్ 4, వన్ప్లస్ 6 హాటెస్ట్ స్మార్ట్ఫోన్లలో జాబితాలో నిలిచాయి. కనీసం మూడేళ్ల వయసున్న ఫోన్లు, సగటున రూ.4,217లకు ప్రీఓన్డ్ ఫోన్లను విక్రయించారు. చదవండి: స్మార్ట్ టీవీ కొనుగోలుదారులకు చేదువార్త! -
Xiaomi: మరో ఫోల్డబుల్ ఫోన్..త్వరలోనే
ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమి అతి త్వరలోనే మరో ఫోల్డబుల్ మొబైల్ను లాంచ్ చేయనుంది. హై ఎండ్ ఫీచర్స్తో ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులో తీసుకురానుంది. తన కంపెనీ నుంచి ఎంఐ మిక్స్ ఫోల్డ్ సిరీస్లో భాగంగా ఏంఐ మిక్స్ ఫోల్డ్ 2ను కొనసాగింపుగా మార్కెట్లోకి రిలీజ్ చేయనుంది. కాగా ఈ ఫోల్డబుల్ ఫోన్లో ఆప్గ్రేడేడ్ హింజ్ మెకానిజం రానున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా ఏంఐ మిక్స్ ఫోల్డ్ 2 శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2 కు పోటీగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఎంఐ మిక్స్ ఫోల్డ్ 2 స్పాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో, 5000ఎంఏహెచ్ బ్యాటరీతో కంపెనీ రిలీజ్ చేయనుంది. వీటితో పాటుగా 108 ఎంపీ రియర్ కెమరాను అమర్చనుంది. అత్యధికంగా 120హెర్జ్ రిఫ్రెష్ రేటుతో ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ మొబైల్ను 2021 క్యూ4లో లాంచ్ చేయాలని కంపెనీ భావిస్తోంది. చదవండి: ఐటెల్ నుంచి అతి తక్కువ ధరకే 4జీ ఫోన్ -
షియోమీ నుంచి మరో సరికొత్త ఒఎల్ఈడీ టీవి
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ మొబైల్స్ తో పాటు, స్మార్ట్ టీవిల మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితమే రెండు టీవిలను విడుదల చేసిన సంస్థ వచ్చే నెలలో మరో కొత్త ఒఎల్ఈడీ డిస్ప్లేతో టీవిని మార్కెట్లోకి తీసుకొనిరావాలని యోచిస్తుంది. చైనాకు చెందిన మైక్రో బ్లాగింగ్ సైట్ వీబోలో మి టీవీ లాంచ్ను టీజ్ చేయడం ప్రారంభించింది. కొత్తగా తీసుకొనిరాబోయే ఈ మోడల్ టీవి గురించి ఎటువంటి ఖచ్చితమైన సమాచారం లేదు. కానీ ఒక టిప్స్టర్ అందించిన వివరాల ప్రకారం.. సంస్థ తర్వాత తరం ఒఎల్ఈడీ టీవి కావచ్చునని తెలుస్తుంది. షియోమీ గత ఏడాది జూలైలో ఎంఐ టివి లక్స్ సిరీస్ను ఒఎల్ఈడీ డిస్ప్లేతో పరిచయం చేసింది. సాదారణంగా షియోమీ దాని ఎంఐ టీవి శ్రేణిలో ఎల్ఇడి ప్యానెల్స్ను ఉపయోగిస్తుంది. వీబోలోని ఎంఐ టీవీ జనరల్ మేనేజర్ రెండు వేర్వేరు టీవీ సెట్ల చిత్రాలను పంచుకున్నారు. గత ఏడాది సంస్థ తెచ్చిన ఎంఐ టివి లక్స్ 65 అంగుళాల 4కె ఒఎల్ఈడీ టీవి ధర సిఎన్ వై 12.999 (సుమారు రూ.1,48,800)గా ఉంది. కంపెనీ తన కొత్త ఒఎల్ఈడీ ఎంఐ టీవిని గత ఏడాది ఆఫర్ చేసిన దానికంటే తక్కువ ధరకు తీసుకొస్తుందా అనేది ప్రస్తుతం అస్పష్టంగా ఉంది. దీని ఎప్పుడు విడుదల చేయనున్నారు అనే దాని గురించి కంపెనీ ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. చదవండి: ఎయిర్టెల్ 5జీ ఇంటర్నెట్ స్పీడ్ ఎంతో తెలుసా? -
రూ.25,000 వేలలో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్
మిడ్-రేంజ్ విభాగంలో రూ.25 వేలలోపు స్మార్ట్ ఫోన్లు సరైన ప్రత్యేకతతో రావడమే కాకుండా ఈ విభాగంలో స్మార్ట్ ఫోన్స్ మంచి పనితీరుతో పాటుగా కెమెరా, సాఫ్ట్వేర్, డిజైన్ తో పాటు మొత్తం నిర్మాణంలో కూడా హై-ఎండ్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్లకు పోటీగా ఉండేలా కనిపిస్తాయి. రూ.25,000లోపు ఉన్న ఉత్తమ స్మార్ట్ ఫోన్ ఆకర్షణీయమైన డిజైన్ తో పాటు గేమింగ్, మల్టీ టాస్కింగ్, యాడ్-ఫ్రీ సాఫ్ట్వేర్, మల్టీ-కెమెరా సేటప్ విషయంలో మంచిగా పని చేయడానికి ఫాస్ట్ మిడ్-రేంజ్ ప్రాసెసర్ తీసుకొస్తాయి. ఇవి పనితీరు విషయంలో ఏ మత్రం ఫ్లాగ్ షిప్ లకు తీసిపోవు అందుకే మార్కెట్లో రూ.25000లోపు అందుబాటులో ఉన్న ఫోన్స్ గురుంచి తెలుసుకుందాం. శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 62 మంచి పనితీరుతో పాటు ఎక్కువ కాలం బ్యాటరీ కావాలనుకునే వారి కోసం ఈ మొబైల్ మంచి ఎంపిక అవుతుంది. దీనిలో గెలాక్సీ నోట్ 10+లో ఉపయోగించిన ఎక్సినోస్ 9825 ప్రాసెసర్ తీసుకొచ్చారు. అలాగే, ఇందులో 7,000 ఎమ్ఏహెచ్ భారీ బ్యాటరీ కూడా ఉంది. ఈ ధర వద్ద మంచి సూపర్ అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉండటంతో పాటు అద్భుతమైన కెమెరా, గేమింగ్ పనితీరును కనబరుస్తుంది. 25వాట్ ఫాస్ట్ ఛార్జర్తో దీనిని చార్జ్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇందులో స్టాక్ యాప్స్ లో యాడ్స్ కూడా వస్తాయి. దేశ మొత్తంగా సర్విస్ కేంద్రాలు అందుబాటులో ఉండటం వల్ల అది ఒక అదనపు బలంగా దీనికి ఉపయోగపడుతుంది. దీని ధర రూ.23,999గా ఉంది. రియల్ మీ ఎక్స్ 7 5జీ రియల్ మీ ఎక్స్ 7 5జీ గురుంచి ప్రధానంగా చెప్పుకోవాలంటే మంచి వాల్యూ ఫర్ మనీ అవుతుంది అని చెప్పుకోవాలి. దీని 8జీబీ వేరియంట్ ధర రూ.21,999గా ఉంది. ఈ ధర వద్ద క్వాల్కామ్ ప్రాసెసర్ కు సమానంగా మీడియాటెక్ డైమెన్సిటీ 800యు ప్రాసెసర్ పనిచేస్తుంది. గేమింగ్ విషయంలో మంచి పనితీరు కనబరుస్తుంది. దీని బ్యాటరీ జీవితం కూడా ఎక్కువ వస్తుంది. ఇందులో 50 వాట్ ఫాస్ట్ చార్జర్ పొందుతారు. దీని బరువు కూడా చాలా తక్కువగా ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే అనుకున్నంత రీతిలో పని చేయట్లేదు. ఫోన్లో ఆండ్రాయిడ్ 11 లేదు బ్లోట్వేర్ ఎక్కువగా ఉంటుంది. మొత్తం మీద చిన్న చిన్న సమస్యలు తప్ప అంత పెద్దగా ఇబ్బందులు లేవు. ఎంఐ 10ఐ షియోమీ 2021 లో మొదటగా తీసుకొచ్చిన మొబైల్ ఇదే. ఎంఐ 10ఐ ధర రూ.21,999. ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 750జీ 5జీ సపోర్ట్ ప్రాసెసర్ ఉంది. ఇది 120 హెర్ట్జ్ డిస్ప్లే, 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఇంత తక్కువ ధరకు ఇవి తీసుకొని రావడం ఒక మంచి విషయం. 108 మెగాపిక్సెల్ కెమెరాలలో చిన్న చిన్న సమస్యలు ఉండటం మనం గమనించవచ్చు. భవిష్యత్తులో సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా మెరుపరుస్తారో లేదో చూడాలి. మీరు ఫోటో విషయంలో పెద్దగా పట్టించుకోకపోతే రూ.25,000 ఒక మంచి ఫోన్ అవుతుంది. వివో వి20 వివో కూడా ఈ సారి మంచి ఫోన్ మార్కెట్లోకి తీసుకువచ్చింది అని చెప్పుకోవాలి. ఇది 6.44-అంగుళాల ఆమో ఎల్ఈడీ డిస్ప్లే, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ను కలిగి ఉంది. ఇది చూడటానికి మంచి ప్రీమియం లుక్ ఇస్తుంది. వివో వి 20 క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 720జీ ప్రాసెసర్ సహాయంతో పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్టచ్ ఓఎస్ తాజా వెర్షన్ మీద పనిచేస్తుంది. కెమెరా పరంగా మంచి ఫోన్ కోసం ఎదురు చూస్తుంటే ఇది ఒక మంచి ఆప్షన్. దీని ధర రూ.22,990. చదవండి: వాట్సప్ సమస్యలపై గ్రీవెన్స్ ఆఫీసర్కి కంప్లైంట్ చేయడం ఎలా? -
Mi 11 Ultra: ఎంఐ 11 అల్ట్రా సేల్ మరింత ఆలస్యం
షియోమీ ఎంఐ 11 అల్ట్రా స్మార్ట్ఫోన్ ఏప్రిల్ 23న విడుదల అయిన సంగతి తెలిసిందే. అదే రోజున ఎంఐ 11 సిరీస్లో ఎంఐ 11ఎక్స్, ఎంఐ 11ఎక్స్ ప్రో మోడల్స్ని కూడా పరిచయం చేసింది షియోమీ. ఎంఐ 11ఎక్స్, ఎంఐ 11ఎక్స్ ప్రో స్మార్ట్ఫోన్స్ సేల్ మొదలైన ఎంఐ 11 అల్ట్రా సేల్ ఇంకా మొదలుకాలేదు. ఎంఐ 11 అల్ట్రా స్మార్ట్ఫోన్ విడుదల అయ్యి చాలా రోజులు గడిచిపోయిన సేల్ జరగకపోవడం టెక్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. షియోమీ ఇండియాలో ఎంఐ 11 అల్ట్రా స్మార్ట్ఫోన్లను ఎందుకు సేల్ కు తీసుకురావట్లేదనే చర్చ జరుగుతుంది. షియోమీ అభిమానులు కూడా ఎంఐ 11 అల్ట్రా సేల్ ఎప్పుడు ఉంటుందంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఈ అయోమయానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు సంస్థ క్లారిటీ ఇచ్చింది. తమ కంట్రోల్లో లేని అనివార్య పరిస్థితుల కారణంగా ఎంఐ 11 అల్ట్రా షిప్మెంట్ ఆలస్యం జరుగుతుందని, వీలైనంత త్వరగా సేల్ తేదీలను ప్రకటిస్తామని ట్విట్టర్లో ప్రకటించింది. దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ల కారణంగా షియోమీ సరఫరా, ఉత్పత్తి ఇబ్బందులను ఎదుర్కొంటుంది అని తెలుస్తుంది. ఎంఐ 11 అల్ట్రా ఫీచర్స్: 6.81 అంగుళాల డబ్ల్యూక్యూహెచ్డీ+ ఈ4 అమొలెడ్ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా 48 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా 48 మెగాపిక్సెల్ టెలీఫోటో సెన్సార్ రియర్ కెమెరా 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 5,000ఎంఏహెచ్ బ్యాటరీ 67వాట్ ఫాస్ట్ వైర్లెస్, వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ 10వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.69,990. చదవండి: కేవలం వారంలో భారీగా పెరిగిన ముకేశ్ అంబానీ సంపద -
షియోమీ సూపర్.. 8 నిమిషాల్లోనే ఫుల్ చార్జింగ్
చైనాకు చెందిన మొబైల్ దిగ్గజం షియోమీ మరో సంచలనానికి సిద్దం అయ్యింది. ఇప్పటికే సరికొత్త టెక్నాలజీని మార్కెట్లోకి తీసుకోస్తూ షియోమీ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. షియోమీ మరో రెండు కొత్త చార్జింగ్ టెక్నాలజీలను విడుదల చేసింది. వీటిలో 200వాట్ హైపర్చార్జ్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ కాగా, మరొకటి 120వాట్ వైర్లెస్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ. కంపెనీ పేర్కొన్న వివరాల ప్రకారం.. 200వాట్ హైపర్చార్జ్ ఫాస్ట్ చార్జింగ్ సహయంతో 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ గల ఫోన్ ని కేవలం 8 నిమిషాల్లోనే ఫుల్ చార్జ్ చేయనున్నట్లు పేర్కొంది. అలాగే, 120వాట్ వైర్లెస్ ఫాస్ట్ చార్జింగ్తో అదే సామర్ధ్యం గల బ్యాటరీని కేవలం 15 నిమిషాల్లో ఫుల్ చార్జ్ చేయవచ్చు. దీనికి సంబంధించిన ఒక వీడియోను కూడా షియోమీ షేర్ చేసింది. ఈ చార్జింగ్ సామర్థ్యానికి తగట్లు మార్పులు చేసిన ఎంఐ 10 ప్రోను 10 శాతం చార్జింగ్ కావడానికి సమయం పడితే, 50 శాతం చార్జింగ్ కావడానికి 8 నిమిషాలు, 100 శాతం చార్జింగ్ కావడానికి 19 నిమిషాలు పట్టింది. అయితే ఈ టెక్నాలజీని స్మార్ట్ ఫోన్ల కోసం ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారో తెలియదు. షియోమీ గతంలో 120వాట్ వైర్డ్, 80వాట్ వైర్లెస్ చార్జింగ్ టెక్నాలజీలను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. చదవండి: ఈపీఎఫ్ఓ చందాదారులకు గుడ్ న్యూస్