ఒకసారి ఛార్జ్‌ చేస్తే హైదరాబాద్‌ టు శ్రీకాకుళం! | Xiaomi Announced On Tuesday Its SU7 EV Model | Sakshi
Sakshi News home page

ఒకసారి ఛార్జ్‌ చేస్తే హైదరాబాద్‌ టు శ్రీకాకుళం!

Published Wed, Mar 13 2024 9:46 AM | Last Updated on Wed, Mar 13 2024 11:08 AM

Xiaomi Announced On Tuesday Its SU7 EV Model - Sakshi

షావోమీ కొత్త ఎలక్ట్రిక్‌ కారు ఘనత!

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షావోమీ తాజాగా తమ తొలి విద్యుత్‌ కారును ఆవిష్కరించింది. బీజింగ్‌లో జరిగిన కార్యక్రమంలో కంపెనీ సీఈఓ ‘లీ జున్‌’ దీన్ని పరిచయం చేశారు. ఎస్‌యూ7గా వ్యవహరించే ఈ కారును మార్చి 28న చైనాలో విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఈ సెడాన్‌లో ఉన్న ఆపరేటింగ్‌ సిస్టమ్‌ కంపెనీ ప్రముఖ ఫోన్లతో అనుసంధానమయ్యేలా రూపొందించారు. చైనాలో దిగ్గజ కంపెనీలుగా పేరొందిన ‘కాన్‌టెంపరరీ యాంపరెక్స్‌ టెక్నాలజీ’, బీవైడీ నుంచి తీసుకున్న బ్యాటరీలను ఈ కార్లలో వాడుతున్నారు.

భవిష్యత్తులో ప్రపంచంలో తొలి ఐదు దిగ్గజ వాహన తయారీ సంస్థల్లో ఒకటిగా నిలుస్తామని లీ జున్‌ ధీమా వ్యక్తం చేశారు. ఈ కారుని ‘సెల్‌-టు-బాడీ’ టెక్నాలజీతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. దీంతో బ్యాటరీని నేరుగా వాహన నిర్మాణానికే అనుసంధానం చేసినట్లు వివరించారు. ఫలితంగా కారు దృఢత్వం పెరిగిందని పేర్కొన్నారు. ఇప్పటికే కంపెనీ రూపొందించిన అనేక యాప్‌లకు ఈ కారులో యాక్సెస్‌ ఉంటుందన్నారు. 

ఈ కారు ఎస్‌యూ7, ఎస్‌యూ7 మ్యాక్స్‌ పేరిట రెండు వేరియంట్లలో లభించనుంది. ఎస్‌యూ 7 విషయానికి వస్తే.. 0-100 kmph వేగాన్ని 5.28 సెకన్లలో అందుకుంటుందని కంపెనీ తెలిపింది. అలాగే ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 668 కిలోమీటర్లు వెళ్తుంది. గరిష్ఠ వేగం 210 కి.మీ/గం. అత్యధికంగా 400 ఎన్‌ఎం టార్క్‌ వద్ద 299 పీఎస్‌ శక్తిని విడుదల చేస్తుంది.

ఇదీ చదవండి: కంపెనీని బురిడీ కొట్టించి రూ.180 కోట్లు గ్యాంబ్లింగ్‌.. అసలేం జరిగిందంటే..

మరోవైపు ఎస్‌యూ7 మ్యాక్స్‌ 2.78 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకుంటుంది. ఒక్క ఛార్జింగ్‌తో 800 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. దీని గరిష్ఠ వేగం 265 కి.మీ/గం. 838 ఎన్‌ఎం టార్క్‌ వద్ద 673 పీఎస్‌ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కార్ల ధరలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement