Samsung
-
రూ. కోటి జాబ్ కాదని..తొలి ప్రయత్నంలోనే సివిల్స్ : తండ్రి భావోద్వేగ క్షణాల్లో
ప్రతిష్టాత్మక యుపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ( UPSC ) పరీక్షలో విజయం సాధించడం అంటే సాధారణ విషయంకాదు. దానికి కఠోర సాధన పట్టుదల ఉండాలి. ఈవిషయంలో రాజస్థాన్లోని జైపూర్కు చెందిన ఐఏఎస్ అధికారి కనిషక్ కటారియా కథ చాలా స్ఫూర్తివంతంగా నిలుస్తుంది.కోటి రూపాయల జీతం ఇచ్చే ఉద్యోగ ఆఫర్ను కాదని తన తొలి ప్రయత్నంలోనే 2018 UPSC పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) 1ని సాధించాడు. ఈ ప్రయాణంలో మరో విశేషం కూడా ఉంది అదేంటో తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. (పాలక్ పనీర్, పనీర్ బటర్ మసాలా : రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ అదుర్స్!)ప్రతి ఏటా లక్షలాది మంది అభ్యర్థులు సివిల్స్కోసం ప్రిపేర్ అవుతారు. అందులో కొద్ది మంది మాత్రమే విజయం సాధిస్తారు. అలాంటి వారిలో ఒకరు రాజస్థాన్లోని జైపూర్కు చెందిన ఐఏఎస్ అధికారి కనిషక్ కటారియా. ఐఐటీ బొంబాయి పూర్వ విద్యార్థి అయిన ఆయన కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ సంపాదించి తన రంగంలో అత్యుత్తమ ప్రతిభావంతుడిగా ఎదిగాడు. ఆ తరువాత దక్షిణ కొరియాలోని శామ్సంగ్ కంపెనీలో సంవత్సరానికి కోటి రూపాయల జీతంతో ఉద్యోగ ఆఫర్ కూడా వచ్చింది. అయితే, వ్యక్తిగత లాభాల కంటే దేశానికి సేవ చేయాలనే కోరిక అతనిలో బాగా నాటుకుపోయింది. అందుకే ఆ ఆఫర్ను మరీ తన కలలసాకారంకోసం పరీక్షకు సిద్ధం అయ్యాడు.ఇదీ చదవండి: అందం, ఆరోగ్యమే కాదు, బరువు తగ్గడంలో కూడా ‘గేమ్ ఛేంజర్’ ఇది!దృఢ సంకల్పం, క్రమశిక్షణతో కూడిన అతని ప్రయత్నం వృధాకాలేదు. 2018లో సివిల్ సర్వీసెస్ పరీక్షలో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ విజయంలో తన కృషి, పట్టుదలతోపాటు, కుటుంబ మద్దతు సహకారం చాలా ఉందని చెబుతాడు ఆనందంగా కనిషక్. స్పష్టమైన లక్ష్యం, సానుకూల మనస్తత్వంతో ఎలాంటి సవాళ్లనైనా అధిగమించివచ్చని నిరూపించాడు. తనలాంటి ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు.మరోవిశేషం.. కుటుంబానికి గర్వకారణమైన క్షణాలు కనిషక్ విజయగాథలో మరో ఆసక్తికర విషయం గురించి కచ్చితంగా చెప్పుకోవాలి. 2024 సెప్టెంబర్ 30ప రాజస్థాన్లోని భరత్పూర్లో డివిజనల్ కమిషనర్గా పదవీ విరమణ చేశాడు కనిషక్ తండ్రి సన్వర్ మల్ వర్మ. తండ్రి రాజీనామా ఉత్తర్వులపై సంతకం చేసింది మాత్రం కనిషక్. ఈ ప్రత్యేకమైన క్షణాలు ఆ కుటుంబానికి గర్వించ దగ్గ క్షణాలుగామారాయి. అంతేకాదు. కుటుంబం అందించిన సేవ ,అంకితభాం మరింత ప్రత్యేకంగా నిలిచింది.వ్యక్తిగత శ్రేయస్సు, సంపద కంటే సేవకు ప్రాధాన్యత ఇవ్వాలనే అతని నిర్ణయం కనిషక్ను ప్రత్యేకంగా నిలిపింది. శామ్సంగ్లో డేటా సైన్స్లో అధిక జీతం వచ్చే ఉద్యోగాన్ని తిరస్కరించి, సమాజంలో అర్థవంతమైన మార్పును సృష్టించాలనే కోరికతో నడిచే సివిల్ సర్వీసెస్లో కెరీర్ను ఎంచుకోవడం విశేషం. దేశంకోసం దేశసేవకోసం ఆర్థికంగా గొప్ప అవకాశాన్నిఉద్యోగాన్ని వదులుకొని, అతను భవిష్యత్ తరాలకు ఒక ఉదాహరణగా నిలిచాడు. కృషి, అంకితభావం, స్పష్టమైన దృక్పథం ఉంటే ఏ కల కూడా సాధించలేనిది లేదని మరోసారి నిరూపించాడు. -
ఏఐలో దూసుకెళ్తున్న చైనా కంపెనీలు
సాన్హొసే (యూఎస్): మొబైల్స్ తయారీలో ఉన్న చైనా కంపెనీలు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వేగంగా అందిపుచ్చుకుంటున్నాయని సామ్సంగ్ సౌత్వెస్ట్ ఏషియా ప్రెసిడెంట్, సీఈవో జె.బి.పార్క్ తెలిపారు. ఏఐ అవసరాల కోసం వ్యక్తిగత డేటాను పంచుకుంటే చైనీస్ హ్యాండ్సెట్ తయారీ సంస్థలతో ముప్పు తలెత్తే అవకాశం ఉందని అన్నారు. భారత్లో ప్రత్యర్థి సంస్థలతో పోటీ ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. ‘బలమైన ప్రత్యర్థి లేదా పోటీ లేకపోతే జీవితం చాలా బోరింగ్గా ఉంటుంది. సవాళ్లను మేము ఆస్వాదిస్తాం. మొబైల్, ఏఐ సాంకేతికతపై దృష్టి పెట్టడమేగాక మొత్తం వ్యవస్థకు సేవలు అందించే సంస్థగా మారడానికి ప్రయతి్నస్తున్నాం. భారత స్మార్ట్ఫోన్ పరిశ్రమకు 2025 పెద్ద సంవత్సరంగా నిలుస్తుందని ఆశిస్తున్నాం. ఇందుకు సామ్సంగ్ సిద్ధంగా ఉంది’ అని వివరించారు. ప్రస్తుతం 800 డాలర్ల కంటే ఎక్కువ ధర కలిగిన సూపర్–ప్రీమియం స్మార్ట్ఫోన్ సెగ్మెంట్లో ఆపిల్ నుండి, అలాగే 400–600 డాలర్ల విభాగంలో చైనీస్ హ్యాండ్సెట్ తయారీదారుల నుండి సామ్సంగ్ పోటీ ఎదుర్కొంటోంది. భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో తీవ్ర పోటీ ఉంటుందని పార్క్ అన్నారు. చిన్న పట్టణాల్లోనూ కంపెనీ తయారీ ప్రీమియం ఫోన్ల వాడకం పెరిగిందని వివరించారు. -
ఏఐకి కీలక మార్కెట్ భారత్
కాలిఫోర్నియా: కృత్రిమ మేథ (AI development) విషయంలో భారత్ తమకు కీలక మార్కెట్గా ఉందని దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ ప్రెసిడెంట్(Samsung President) టీఎం రోహ్ తెలిపారు. తమ లేటెస్ట్ స్మార్ట్ఫోన్ గెలాక్సీ ఎస్25లో ఏఐ ఫీచర్లను పొందుపర్చడంలో బెంగళూరు, నోయిడాలోని పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) కేంద్రాలు ముఖ్యపాత్ర పోషించినట్లు చెప్పారు. ఎస్25లోని గూగుల్ వాయిస్ అసిస్టెంట్ జెమినీ లైవ్ ఫీచర్లో కొరియన్, ఇంగ్లీష్ భాషలతో పాటు హిందీని కూడా చేర్చినట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: మౌలిక వసతులకు భారీ నిధులుత్వరలో మరిన్ని భాషలను కూడా చేర్చనున్నామని, ఈ ప్రక్రియలోను భారత ఆర్అండ్డీ కేంద్రాలు కీలకంగా వ్యవహరించనున్నాయని చెప్పారు. ఇవి ఇతర గెలాక్సీ ఉత్పత్తులను అభివృద్ధి చేయడంపై కూడా పని చేస్తున్నట్లు రోహ్ వివరించారు. ఈ నేపథ్యంలో పరిశోధన కేంద్రాలపై మరింతగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఆయన వివరించారు. దక్షిణ కొరియా వెలుపల తమకు అతి పెద్ద ఆర్అండ్డీ కేంద్రాలు భారత్లోనే ఉన్నట్లు రోహ్ చెప్పారు. పరిశ్రమ ప్రస్తుతం స్మార్ట్ఫోన్ల నుంచి ఏఐ ఫోన్ల వైపు మళ్లుతోందన్నారు. ఎస్25 మోడల్స్కి శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ను జోడించేందుకు కొన్ని దేశాల్లోని టెలికం సంస్థలతో కలిసి పని చేస్తున్నట్లు వివరించారు. -
రూ.15,000 లోపు ప్రీమియం ఫీచర్లున్న స్మార్ట్ఫోన్లు
-
శాంసంగ్ కొత్త ఎత్తు! వెనక్కితగ్గని ఉద్యోగులు
చెన్నైలోని శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్లో కార్మికులు సమ్మె చేస్తున్నారు. మెరుగైన వేతనాలు, తమ యూనియన్కు గుర్తింపు కోసం దాదాపు నెల రోజులుగా నిరసనలు చేస్తున్నారు. సమ్మె ఆపాలని యాజమాన్యం ఎంత హెచ్చరించినా వెనక్కితగ్గడం లేదు. దీంతో కంపెనీ కొత్త ఎత్తు వేసింది.శాంసంగ్ ఇండియా వర్కర్స్ యూనియన్-సీఐటీయూ నేతృత్వంలో ఉద్యోగులు చేస్తున్న సమ్మెతో గృహోపకరణాల విక్రయానికి కీలకమైన పండుగ సీజన్కు ముందు ఉత్పత్తి 80 శాతం తగ్గిపోయింది. సమ్మె ఇప్పుడు నాల్గవ వారానికి చేరుకోవడంతో ఉద్యోగుల కుటుంబాలను మచ్చిక చేసుకుని సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు వారి ఇళ్లకు ‘స్నాక్ కిట్’లను పంపుతోందని ఫ్రంట్లైన్ నివేదించింది.తమిళనాడులోని శాంసంగ్ ప్లాంట్లో దాదాపు 1,800 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో 1,000 మందికి పైగా కార్మికులు సెప్టెంబర్ 9 నుండి సమ్మెలో ఉన్నారు. తమ యూనియన్ను గుర్తించాలని, మూడేళ్ల జీతం రూ.36,000 పెంచాలని, షిఫ్ట్ అలవెన్స్ను రూ.150 నుండి రూ.250కి పెంచాలని, పితృ సెలవులను మూడు నుండి ఏడు రోజులకు పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే సమానమైన అర్హతలు, విధులు ఉన్న కార్మికులకు సమాన వేతనం అమలుచేయాలని కోరుతున్నారు.2007లో ఇక్కడ ఏర్పాటైన శాంసంగ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ కంపెనీ గత 16 సంవత్సరాలుగా యూనియన్ లేకుండా పని చేస్తోంది.శాంసంగ్ ఇండియా వర్కర్స్ యూనియన్, సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ మద్దతుతో గత సంవత్సరం ఏర్పడింది. అయితే దీనికి కంపెనీ నుండి అధికారిక గుర్తింపు లేదు.కార్మికుల సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి యాజమాన్యం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. నిరసనను కొనసాగిస్తే వేతనాలు ఆపేస్తామని, విధుల నుంచి తొలగిస్తామని గత నెలలో కంపెనీ హెచ్చరించినట్లు రాయిటర్స్ నివేదించింది. ఇప్పుడు ఉద్యోగుల కుటుంబాలను మచ్చిక చేసుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా వారికి పండ్లు, చాక్లెట్లతో కూడిన స్నాక్ కిట్లను పంపుతోంది. అంతేకాకుండా కంపెనీ ప్రతినిధులు నేరుగా కార్మికుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నట్లుగా ఫ్రంట్లైన్ పేర్కొంది. అయితే ఈ వార్తలను శాంసంగ్ యాజమాన్యం ఖండించింది. -
ఉద్యోగం పోతుందని హెచ్చరిక!
చెన్నైలోని సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ ఇండియా పరిధిలో నిరసనకు దిగిన ఉద్యోగులకు కంపెనీ హెచ్చరికలు జారీ చేసింది. సమ్మె కొనసాగిస్తున్న ఉద్యోగులకు వేతనాలు అందజేయమని, ఉద్యోగంలో నుంచి కూడా తొలగించే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. చెన్నై ప్లాంట్లోని సామ్సంగ్ ఉద్యోగులు తమ వేతనాలు పెంచాలని, తమ యూనియన్కు గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 9 నుంచి నిరసన చేస్తున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో తాజాగా కంపెనీ స్పందించింది.‘నో వర్క్..నోపే ప్రాతిపదికనను కంపెనీ పాటిస్తుంది. సమ్మె ప్రారంభమైన సెప్టెంబర్ 9 నుంచి నిరసనలో పాల్గొన్న ఉద్యోగులకు వేతనాలు ఉండవు. వెంటనే సమ్మెను విరమించి విధుల్లో చేరాలి. నిరసన కొనసాగిస్తే ఉద్యోగాల నుంచి కూడా తొలగించే ప్రమాదం ఉంది. నాలుగు రోజుల్లోగా ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరకపోతే, వారిని సర్వీస్ నుంచి ఎందుకు తొలగించకూడదో వివరణ ఇవ్వాలి’ అని కంపెనీ హెచ్ఆర్ విభాగం అధికారులు ఈమెయిల్ పంపించారు.ఇదీ చదవండి: రెండేళ్లలో 9000 మంది నియామకంభారత్లో కార్యకలాపాలకు తమిళనాడులోని కాంచీపురం సామ్సంగ్ ప్లాంట్ కీలకం. ఈ ప్లాంట్ కాంచీపురం జిల్లాలోని శ్రీపెరంబుదూర్లో ఉంది. ఇందులో 16 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండిషనర్లతో సహా వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువులను ఇందులో తయారు చేస్తున్నారు. దాదాపు 1,700 మంది కార్మికులు ఇందులో పనిచేస్తున్నారు. వారిలో 60 మందే మహిళలు ఉండడం గమనార్హం. భారతదేశంలో కంపెనీ వార్షిక ఆదాయంలో 20-30% వరకు ఈ ప్లాంట్ నుంచే సమకూరుతోంది. ఇటీవల ఈ ప్లాంట్లో కొత్త కంప్రెషర్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి సంస్థ రూ.1,588 కోట్ల పెట్టుబడి పెట్టింది. 22 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కొత్త ఫ్యాక్టరీ ఏటా 80 లక్షల కంప్రెషర్ యూనిట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఉద్యోగులు వేతనాలు పెంచాలని, తమ యూనియన్ను కంపెనీ గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. ఫ్యాక్టరీ కార్మికులను సమీకరించడంలో సహాయపడిన సీఐటీయూ వివరాల ప్రకారం సామ్సంగ్ ఉద్యోగులు నెలకు సగటున రూ.25,000 వేతనం అందుకుంటున్నారు. మూడేళ్లలో రూ.36,000కు పెంచాలని డిమాండ్ ఉంది. -
150 మంది సామ్సంగ్ ఉద్యోగులు అరెస్టు
వేతనాలు పెంచాలని నిరసనకు దిగిన 150 మంది సామ్సంగ్ ఉద్యోగులను సోమవారం అరెస్టు చేశారు. తమిళనాడులోని కాంచీపురంలో కార్మికులు ర్యాలీ నిర్వహించాలని ముందుగా నిర్ణయించుకున్నారు. ఆదివారం రాత్రి మంజూరైన అనుమతులు చివరి నిమిషంలో రద్దు చేశారు. దాంతో కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేసేందుకు దాదాపు 400కుపైగా కార్మికులు సోమవారం కాంచీపురం కలెక్టరేట్కు బయలుదేరారు. కలెక్టరేట్లోకి దూసుకెళ్లిన 150 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. కార్మికులకు మద్దతుగా నిలిచిన ఇండియా వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు, సీఐటీయూ నాయకుడు ముత్తు కుమార్ను సైతం అదుపులోకి తీసుకున్నట్లు కార్మికులు తెలిపారు.సామ్సంగ్ ఇండియా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు వేతన సవరణ కోరుతూ సమ్మెకు దిగారు. ఇప్పటికే సమ్మె ప్రారంభించి ఎనిమిది రోజులు అయింది. అయినా సంస్థ యాజమాన్యం స్పందించకపోవడంతో ర్యాలీ నిర్వహించాలని భావించి కలెక్టర్ అనుమతి కోరారు. చివరి నిమిషంలో అనుమతులు రద్దు చేశారు. సమ్మెలో పాల్గొన్న కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం..‘కాంచీపురంలోని సామ్సంగ్ ప్లాంట్ ప్రారంభమైనప్పటి నుంచి ఇదే తొలి సమ్మె. స్థానికంగా ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్ల ఉత్పత్తి జరుగుతోంది. ఈ ప్లాంట్లో దాదాపు 1,700 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారి వేతనాలు ఇతర సంస్థల్లోని అదే స్థాయి ఉద్యోగుల కంటే చాలా తక్కువగా ఉన్నాయి. 16 సంవత్సరాలుగా ఈ కార్మికులకు ఎలాంటి రిజిస్టర్డ్ యూనియన్ లేదు. వేతనాలు సవరించాలని సంస్థకు ఎన్నిసార్లు లేఖలు రాసినా లాభం లేకుండాపోయింది. సంస్థ వేతనాలపై స్పందించకపోగా కార్మికులపై పనిభారం మోపుతోంది. సామసంగ్ ఇండియా వర్కర్స్ యూనియన్ పేరుతో సమ్మెకు దిగాం. సంస్థలో 25 శాతం మంది అప్రెంటిస్ కార్మికులున్నారు’ అని తెలిపారు.ఇదీ చదవండి: భారత్లో సర్వీసులు పెంచనున్న ఎయిర్లైన్స్భారత్లో కార్యకలాపాలకు తమిళనాడులోని కాంచీపురం సామ్సంగ్ ప్లాంట్ కీలకం. ఈ ప్లాంట్ కాంచీపురం జిల్లాలోని శ్రీపెరంబుదూర్లో ఉంది. ఇందులో 16 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండిషనర్లతో సహా వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువులను ఇందులో తయారు చేస్తున్నారు. దాదాపు 1,700 మంది కార్మికులు ఇందులో పనిచేస్తున్నారు. వారిలో 60 మందే మహిళలు ఉండడం గమనార్హం. భారతదేశంలో కంపెనీ వార్షిక ఆదాయంలో 20-30% వరకు ఈ ప్లాంట్ నుంచే సమకూరుతోంది. ఇటీవల ఈ ప్లాంట్లో కొత్త కంప్రెషర్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి సంస్థ రూ.1,588 కోట్ల పెట్టుబడి పెట్టింది. 22 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కొత్త ఫ్యాక్టరీ ఏటా 80 లక్షల కంప్రెషర్ యూనిట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. -
9 నిమిషాల ఛార్జ్.. 965 కిమీ రేంజ్: ఇది కదా కావాల్సింది
ఫ్యూయెల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా.. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉపయోగించాలని చాలామంది చెబుతూనే ఉన్నారు. అయితే ఇప్పటికి కూడా ఈవీలను ఉపయోగించడానికి కొందరు వెనుకడుగు వేస్తున్నారు. దీనికి కారణం రేంజ్ విషయం సమస్య, కావలసినన్ని ఛార్జింగ్ స్టేషన్స్ అందుబాటులో లేకపోవడమే. ఛార్జింగ్ సమస్యలకు చెక్ పెట్టడానికి & ఎక్కువ రేంజ్ అందించడానికి శాంసంగ్ ఓ బ్యాటరీ రూపొందించింది.కొరియన్ బ్రాండ్ శాంసంగ్ రూపొందించిన బ్యాటరీ కేవలం 9 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోగలదు. అంతే కాకుండా ఇది సింగిల్ ఛార్జ్తో ఏకంగా 965 కిమీ రేంజ్ అందిస్తుంది. వీటి జీవిత కాలం 20 ఏళ్ళు కావడం గమనార్హం. అంటే ఒక వాహనంలో శాంసంగ్ బ్యాటరీ ఫిక్స్ చేసుకుంటే అది 20 సంవత్సరాలు మనగలుగుతోంది. ఇది చాలా గొప్ప విషయం.శాంసంగ్ బ్యాటరీ వివిధ పరిమాణాలలో లభిస్తుంది. కాబట్టి దీనిని కారు, బస్సు ఇలా వివిధ వాహనాల్లో నిక్షిప్తం చేసుకోవచ్చు. ఇవి సాధారణ బ్యాటరీల కంటే కూడా రెట్టింపు సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అందులోనూ ఈ బ్యాటరీ కేవలం 9 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది. కాబట్టి వాహన వినియోగదారుల సమయాన్ని చాలా ఆదా చేస్తుంది.దక్షిణ కొరియాలోని సియోల్లో జరిగిన SNE బ్యాటరీ డే 2024 ఎక్స్పోలో, కంపెనీ తన పైలట్ సాలిడ్ స్టేట్ బ్యాటరీ గురించి వెల్లడించింది. అయితే ప్రస్తుతం దీనిని పలు వాహనాల్లో పరీక్షిస్తోంది. 2027 నాటికి అధిక సంఖ్యలో ఈ బ్యాటరీల ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపింది. -
ఉచితంగా రూ.1.09 లక్షల విలువైన ఫోన్!
ఒలింపిక్స్లో పాల్గొంటున్నారా.. అయితే మీకు రూ.1.09 లక్షల విలువైన ఫోన్ ఉచితంగా లభిస్తుంది. ఎలాగంటారా.. పారిస్ ఒలింపిక్ 2024లో పాల్గొనే క్రీడాకారులకు కార్పొరేట్ కంపెనీలు ఆకర్షణీయ బహుమతులు అందిస్తున్నాయి. ఇందులో మొబైల్ఫోన్లు వంటి విలువైన వస్తువులు కూడా ఉన్నాయి. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ శామ్సంగ్ క్రీడాకారులకు ప్రత్యేకంగా కిట్ను అందిస్తోంది. అందులో రూ.1.09 లక్షల విలువైన గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6 ఒలింపిక్ ఎడిషన్ను ఉచితంగా ఇస్తున్నారు.ఈ కిట్ను అందుకోవాలంటే నేషనల్ ఒలింపిక్ కమిటీలో నమోదవ్వాలి. అందులో చేరిన వారికి పారిస్లోని ‘ఒలింపిక్ విలేజ్ చెఫ్ డి మిషన్’కు చేరిన వెంటనే కిట్ అందిస్తారు. వీటిని ఆగస్టు 11 వరకు ఎప్పుడైనా ‘ఒలింపిక్ విలేజ్ ప్లాజా’లో తీసుకోవచ్చని కంపెనీ తెలిపింది. View this post on Instagram A post shared by Frame Thanakhan Ch. (@frame_thnk)ఇదీ చదవండి: భారత్లో ఐప్యాడ్ తయారీ..?కిట్లో ఉండే వస్తువులు..1. శామ్సంగ్ ఒలింపిక్ ఫ్లిప్సూట్ ఎడిషన్(మార్కెట్ ధర సుమారు రూ.1,09,999)ఇందులో 100జీబీ డేటాలో అపరిమిత కాల్స్ మాట్లాడేలా ఈ-సిమ్ ఉంటుంది. శామ్సంగ్ ప్రత్యేకంగా అందించే అథ్లెట్ 365 యాప్ కూడా ఇన్స్టాల్ చేసి ఇస్తున్నారు. దాంతో వ్యక్తిగత ఒలింపిక్ అప్డేట్లు తెలుసుకోవచ్చు.2. ఐఓసీ వెల్కమ్ గైడ్3. కోకా-కోలా సిగ్గ్ బాటిల్, పారిస్ 2024 పవర్ఏడ్ స్క్వీజ్ బాటిల్4. ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ కంపెనీకు చెందిన టాయిలెట్ బ్యాగ్, ఎయిర్ ఫ్రెషనర్, షాంపూ, హ్యాండ్ సోప్, టూత్ బ్రష్, టూత్పేస్ట్. -
సరికొత్త మడత ఫోన్లు.. అదిరిపోయే ఫీచర్లు!
శాంసంగ్ తన సరికొత్త ఫోల్డబుల్ ఫోన్లను ప్రకటించింది. గెలాక్సి జెడ్ ఫోల్డ్6 (Galaxy Z Fold6), గెలాక్సి జెడ్ ఫ్లిప్6 (Galaxy Z Flip6)లను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసింది. భారత్లో వీటి ధరలను ప్రకటించిన కంపెనీ ముందస్తు ఆర్డర్లను ప్రారంభించింది.గెలాక్సి జెడ్ ఫ్లిప్6 (12GB+256GB) ధర రూ. 1,09,999 కాగా 12GB+512GB వెర్షన్ ధర రూ. 1,21,999. ఇక 12GB+256GB వేరియంట్లోని గెలాక్సి జెడ్ ఫోల్డ్6 ధర రూ.1,64,999 కాగా, 12GB+512GB వెర్షన్ రూ.1,76,999కి వస్తుంది. 12GB+1TB (సిల్వర్ షాడో కలర్) ధర రూ. 2,00,999 అని కంపెనీ తెలిపింది."డివైస్లను ప్రీ-ఆర్డర్ చేసే వారు రూ. 14,999 విలువ చేసే 'గెలాక్సీ జెడ్ అస్యూరెన్స్'లో భాగంగా రెండు స్క్రీన్లు, విడిభాగాలను కేవలం రూ. 999కి పొందుతారు" అని కంపెనీ తెలిపింది, ప్రస్తుత శాంసంగ్ ఫ్లాగ్షిప్ కస్టమర్లు రూ. 15,000 అప్గ్రేడ్ బోనస్ను పొందవచ్చని కంపెనీ పేర్కొంది.గెలాక్సి జెడ్ ఫోల్డ్6, గెలాక్సి జెడ్ ఫ్లిప్6 ఫోల్డబుల్ ఫోన్లతో పాటు గెలాక్సి బడ్స్3 (Galaxy Buds3), గెలాక్సి బడ్స్3 ప్రో (Galaxy Buds3 Pro)లను కూడా శాంసంగ్ లాంచ్ చేసింది. వీటిలో బడ్స్3 ధర రూ. 14,999 కాగా బడ్స్3 ప్రో ధర రూ. 19,999. శాంసంగ్ గెలాక్సి ఫోల్డబుల్ ఫోన్లు, బడ్స్ అమ్మకాలు జూలై 24 నుంచి ప్రారంభం కానున్నాయి.గెలాక్సి జెడ్ ఫోల్డ్6 స్పెసిఫికేషన్లు» 7.60-అంగుళాల ప్రైమరీ డిస్ప్లే» స్నాప్డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్» 10-మెగాపిక్సెల్ + 4-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా» 50-మెగాపిక్సెల్ + 12-మెగాపిక్సెల్ + 10-మెగాపిక్సెల్ రియర్ కెమెరా» 12GB ర్యామ్, 256GB, 512GB, 1TB స్టోరేజ్» 4400mAh బ్యాటరీ కెపాసిటీ» ఆండ్రాయిడ్ 14 ఓఎస్గెలాక్సి జెడ్ ఫ్లిప్6 స్పెసిఫికేషన్లు» 6.70-అంగుళాల ప్రైమరీ డిస్ప్లే» స్నాప్డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్» 10-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా» 50-మెగాపిక్సెల్ + 12-మెగాపిక్సెల్ రియర్ కెమెరా» 12GB ర్యామ్, 256GB, 512GB స్టోరేజ్» 4000mAh బ్యాటరీ కెపాసిటీ» ఆండ్రాయిడ్ 14 ఓఎస్ -
శాంసంగ్ చరిత్రలో భారీ సమ్మె!!
శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం చరిత్రలో ఇది అతిపెద్ద వ్యవస్థీకృత కార్మిక చర్య. వేతన పెంపు, సెలవుల విషయంలో గత నెలలో చర్చలు విఫలం కావడంతో కంపెనీలోని అతిపెద్ద యూనియన్ గత కొన్ని వారాలుగా మూడు రోజుల వాకౌట్ కు సిద్ధమవుతోంది.శాంసంగ్ 55 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా గత జూన్ ఆరంభంలో ఒక్క రోజు సమ్మె జరిగింది. తాజాగా జూలై 8న భారీ సమ్మెను కార్మికులు చేపట్టారు. కంపెనీకి చెందిన అత్యాధునిక చిప్ ప్లాంట్లలో ఉత్పత్తికి అంతరాయం కలిగించడం ద్వారా యాజమాన్యానికి సందేశాన్ని పంపడానికి దీన్ని ఉద్దేశించినట్లుగా యూనియన్ నాయకులు చెబుతున్నారు.సియోల్ కు 38 కిలోమీటర్ల దూరంలోని హ్వాసియోంగ్ లోని శాంసంగ్ సెమీకండక్టర్ ప్లాంట్ల వెలుపల సోమవారం ఉదయం 11 గంటలకు ర్యాలీలకు 5,000 మందిని సమీకరించాలని కార్మిక సంఘం లక్ష్యంగా పెట్టుకుందని యూనియన్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ లీ హ్యూన్ కుక్ బ్లూమ్ బర్గ్ న్యూస్ కు తెలిపారు. వాస్తవానికి ఎంత మంది కార్మికులు విధులను పక్కన పెడతారో స్పష్టంగా తెలియదు. ఉత్పత్తికి అంతరాయం కలిగించడమే ఈ వాకౌట్ లక్ష్యమని యూనియన్ నేత సన్ వూ మోక్ తెలిపారు.3% వార్షిక మూలవేతనం పెంపునకు అంగీకరించని సుమారు 855 మంది సిబ్బందికి పెద్ద వేతన పెంపును కోరుతున్నట్లు మొదట చెప్పిన యూనియన్ నాయకులు తమ డిమాండ్లను మార్చారు. ఇప్పడు మొత్తం 28,000 మందికి పైగా యూనియన్ సభ్యులకు అధిక వేతనాలు, అదనపు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.సెమీకండక్టర్ సిబ్బందికి ప్రథమార్ధం పనితీరు సంబంధిత బోనస్ లను ప్రకటించడం ద్వారా కార్మికుల సమ్మె ప్రయత్నాన్ని భగ్నం చేయడానికి శాంసంగ్ ప్రయత్నించింది. కాని వారు వాగ్దానం చేసిన నెలవారీ జీతాలలో గరిష్టంగా 75% గతంలో సాధారణమైన పూర్తి నెల చెల్లింపు కంటే తక్కువగా ఉంది.కొరియాలోని అనేక ప్రముఖ కంపెనీలను పీడిస్తున్న గ్రౌండ్ అప్ కల్లోలాన్ని శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఎప్పుడో నివారించింది. శాంసంగ్ దివంగత చైర్మన్, ప్రస్తుత అధినేత జే వై లీ తండ్రి లీ కున్ హీ యూనియన్లు ఏర్పడకుండా నిరోధించడానికి ఎంతగానో ప్రయత్నించారు. ఇప్పుడు నేషనల్ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ యూనియన్ అనేది సుమారు 28,000 మందికి పైగా కార్మికులతో కంపెనీ యూనియన్లలో కెల్లా అతి పెద్దది. -
గోడలకు వేలాడే సంగీతం ఇది.. ఎప్పుడైనా విన్నారా!
సాక్షి, సిటీబ్యూరో: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అలనాటి సామెతల్ని కొత్తగా నిర్వచిస్తోంది. గోడలకూ చెవులుంటాయని పెద్దలు చెబితే.. గోడల నుంచి సుస్వరాలు వినిపిస్తాయని సరికొత్త మ్యూజిక్ ఫ్రేమ్స్ నిరూపిస్తున్నాయి. గోడకు ఫొటో ఫ్రేమ్స్లానే తమ మ్యూజిక్ ఫ్రేమ్ను కూడా వేలాడదీస్తే ఇష్టమైన సంగీతాన్ని ఆస్వాదించవచ్చని అంటోంది ప్రసిద్ధ గృహోపకరణాల బ్రాండ్ శామ్సంగ్..తాజాగా ఈ బ్రాండ్ రూపొందించి సిటీ మార్కెట్లోకి విడుదల చేసిన ఈ వైర్లెస్ మ్యూజిక్ ఫ్రేమ్ ద్వారా వీనులవిందైన సంగీతాన్ని వినడం మాత్రమే కాదు వ్యక్తిగత ఫొటోలు, కళాత్మక చిత్రాలు సైతం పొందుపర్చుకోవచ్చు. డాల్బీ అట్మోస్ వంటి ఫీచర్లతో అందుబాటులోకి వచి్చన ఈ ఫ్రేమ్.. అందాన్ని పెంచే ఇంటీరియర్లా అమరిపోతుందంటున్నారు.ఇవి చదవండి: ఆన్లైన్ గేమర్స్ను వరించనున్న.. రూ. 2 కోట్ల ప్రైజ్ మనీ.. -
ప్రముఖ కంపెనీలో మొదటిసారి కార్మికుల సమ్మె
ప్రముఖ దిగ్గజ ఎలక్ట్రానిక్ కంపెనీ, దక్షిణ కొరియా ప్రధాన కేంద్రంగా ఉన్న శామ్సంగ్లో ఉద్యోగులు మునుపెన్నడూ లేనివిధంగా నిరసనకు దిగారు. కార్మికులు మొదటిసారి శుక్రవారం సమ్మె ప్రారంభించారు. సౌత్కొరియాలోని సియోల్లో ఉన్న శామ్సంగ్ ప్రధాన కార్యాలయం ముందు కంపెనీ చిప్ డివిజన్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు లౌడ్ స్పీకర్లలో నిరసన పాటలు ప్లే చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు.శామ్సంగ్ కంపెనీలో గతంలో ఎప్పుడూ ఇలాంటి సమ్మెలు సాగలేదు. ఇదే మొదటిసారి. వేతనాల పెంపు, బోనస్లపై పలుసార్లు కంపెనీ యాజమాన్యంతో చర్చించామని సమ్మె నిర్వాహకులు చెప్పారు. కార్మికుల డిమాండ్లపై కంపెనీ స్పందించకపోవడంతో ఆందోళన ప్రారంభించినట్లు యూనియన్ ప్రతినిధులు తెలిపారు.ఈ సందర్భంగా సౌత్కొరియా నేషన్వైడ్ శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ లీ హ్యూన్ కుక్ మాట్లాడుతూ..‘కార్మికులు, కంపెనీకి మధ్య సంధానకర్తగా ఉన్న యూనియన్కు యాజమాన్యం విలువ ఇవ్వట్లేదు. కంపెనీలో ఉన్న ఐదు లేబర్ గ్రూపుల్లో యూనియన్ అతిపెద్దది. ఇందులో 28,000 మంది సభ్యులున్నారు. శామ్సంగ్ గ్లోబల్ వర్క్ఫోర్స్లో ఐదో వంతుకు యూనియన్ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇందులోని దాదాపు 75 శాతం మంది ఏప్రిల్లో సమ్మెకు అనుకూలంగా ఓటు వేశారు. వేతనాల పెంపు, బోనస్లపై కంపెనీ యాజమాన్యంతో పలుమార్లు చర్చించాం. కానీ ఆ చర్చలు విఫలమయ్యాయి. యూనియన్ డిమాండ్లను అధికారులు వెంటనే పరిష్కరించాలి’ అన్నారు.ఇదీ చదవండి: డబ్ల్యూఈఎఫ్ జాబితాలో భారత కంపెనీలకు చోటుయూనియన్తో ఒప్పందం కుదుర్చుకోవడానికి కంపెనీ ప్రయత్నిస్తోందని శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రతినిధి ఒకరు న్యూయార్క్ టైమ్స్తో తెలిపారు. చిప్ తయారీ మార్కెట్లో కంపెనీ ఏటా తన లక్ష్యాలను చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. నిత్యం పెట్టుబడిదారులకు భరోసా ఇచ్చే కంపెనీలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం ఆందోళన కలిగించే విషయమంటున్నారు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో చిప్ విభాగం నుంచి కంపెనీకి సుమారు 1.4 బిలియన్ డాలర్ల(రూ.11వేలకోట్లు) లాభం చేకూరినట్లు నివేదికల ద్వారా తెలిసింది. -
Samsung : రూ.10,000 కోట్ల వ్యాపార లక్ష్యం
న్యూఢిల్లీ: ఎల్రక్టానిక్స్ తయారీ దిగ్గజం శామ్సంగ్ టీవీల అమ్మకాల ద్వారా 2024లో భారత మార్కెట్లో రూ.10,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా చేసుకుంది. రూ.10 వేల కోట్ల మైలురాయిని చేరుకోవడం ఇప్పటి వరకు ఏ కంపెనీ సాధించలేదని కంపెనీ వెల్లడించింది. మధ్య స్థాయి, ప్రీమియం టీవీల విభాగంలో పరిమాణం పరంగా వృద్ధిలో ఉన్నట్టు శామ్సంగ్ ఇండియా విజువల్ డిస్ప్లే బిజినెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మోహన్దీప్ సింగ్ తెలిపారు. ‘ప్రీమియం టీవీలపై పెద్ద ఎత్తున ఫోకస్ చేశాం. కంపెనీ విక్రయాల్లో ఈ విభాగం వాటా 40%. యూహెచ్డీ, పెద్ద స్క్రీన్ టీవీల విక్రయాలతో ఈ ఏడాది వృద్ధి ఉంటుంది. ప్రీమియం ఉత్పత్తులకు మెట్రోలు, చిన్న పట్టణాల నుంచీ డిమాండ్ ఉంది’ అని వివరించారు. సంస్థకు 21 శాతం వాటా.. శామ్సంగ్ భారత్లో 2022–23లో రూ.98,924 కోట్ల టర్నోవర్ అందుకుంది. ఇందులో 70 శాతం మొబైల్స్ అమ్మకాల ద్వారా కాగా మిగిలినది టీవీలు, ఇతర ఉపకరణాల ద్వారా సమకూరింది. దేశీయ టీవీల విపణిలో పరిమాణం పరంగా సంస్థకు 21 శాతం వాటా ఉంది. శామ్సంగ్ తాజాగా ఆరి్టఫీíÙయల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అల్ట్రా ప్రీమియం నియో క్యూఎల్ఈడీ టీవీలను భారత్లో ప్రవేశపెట్టింది. పిక్చర్ స్పష్టంగా, సహజత్వం ఉట్టిపడేలా ఉంటుందని కంపెనీ తెలిపింది. వీటి ప్రారంభ ధర రూ.1.39 లక్షలు. ఓఎల్ఈడీ టీవీల ప్రారంభ ధర రూ.1.64 లక్షలు. కాగా, శామ్సంగ్ దేశీ విక్రయ టీవీల్లో 90% భారత్లో తయారైనవే. దేశంలో ఏటా అన్ని బ్రాండ్లలో కలిపి 1.2 కోట్ల యూనిట్ల టీవీలు అమ్ముడవుతున్నాయని అంచనా. -
మొబైల్ రంగాన్ని శాసించనున్న ఏఐ..
ఫీచర్ పోన్ నుంచి స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన తర్వాత క్రమంగా కెమెరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లపై వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపారు. వారి ఊహలకు తగ్గట్టుగానే కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ను ప్రవేశపెట్టాయి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. అవసరమైతేనే కొత్త ఫోన్ కొందామనే ధోరణికి వినియోగదారులు వచ్చేశారు. మడత పెట్టేందుకు వీలున్న స్మార్ట్ఫోన్లు కొంత ఆకర్షించినా.. ధర బాగా ఎక్కువ కావడంతో, కొనుగోళ్లు పరిమితంగానే ఉంటున్నాయి. ఈ క్రమంలోనే దిగ్గజ కంపెనీలు విడుదల చేస్తున్న జనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత గల స్మార్ట్ఫోన్లు.. మళ్లీ ఈ రంగంలో భారీ మార్పులకు కారణం అవుతాయని, అమ్మకాలు పెంచేందుకు దోహద పడతాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏఐ టూల్కు కొద్దిగా సమాచారం అందిస్తే, మనకు ఆకర్షణీయంగా అనిపించే కంటెంట్ను అందించే సామర్థ్యం ఉంటుంది. గూగుల్ విడుదల చేసిన పిక్సెల్ 8 స్మార్ట్ఫోన్లోని అల్గారిథమ్ వల్ల బృందంలోని సభ్యుల ముఖ కవళికల్లో ఆకర్షణీయంగా ఉన్న వాటిని కెమెరా ఒడిసి పట్టుకుని ప్రత్యేక చిత్రంగా మనకు అందిస్తుంది. వాయిస్ డిక్టేషన్, వేరే భాషల్లోకి ట్రాన్స్లేట్ చేయడం వంటివి రియల్టైమ్లోనే జరుగుతాయి. మన వినియోగానికి అనువుగా బ్యాటరీ ఛార్జింగ్ వేగాన్ని మారుస్తాయి. బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కువ సమయం ఉండేలా, అంతర్గత వ్యవస్థలో మార్పులు చేస్తాయి. వేగవంతమైన ప్రాసెసర్ తాజాగా అందుబాటులోకి వచ్చిన శామ్సంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా ఫోన్లో ఏఐ ఆధ్వర్యంలో పనిచేసే స్నాప్డ్రాగన్ జెన్ 3 ప్రాసెసర్, ప్రస్తుతం ప్రపంచంలో అందుబాటులో ఉన్న వాటిల్లో వేగవంతమైనదని కంపెనీ పేర్కొంది. మనం ఒక వ్యక్తి ఫోటో తీసినప్పుడు, అతడు ధరించిన దుస్తులు, కళ్లజోడు, చేతి వాచీ, హ్యాండ్ బ్యాగుల వంటివి నచ్చాయనుకోండి. నచ్చిన వస్తువుపై సర్కిల్ డ్రా చేసి సెర్చ్ చేస్తే ఆ వస్తువు తయారు చేసిన కంపెనీ పేరు, వాటి ధర, అవి సమీపంలో ఎక్కడ లభిస్తున్నాయి వంటి వివరాలు సెకన్లలో డిస్ప్లే అవుతాయి. మనం ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడుతుంటాం. అవతలి వ్యక్తి ఇంగ్లీషులో మాట్లాడినా, మనం తెలుగులో వినాలనుకుంటే.. ఏఐ ఆ మాటలను మనకు తెలుగులోనే వినిపిస్తుంది. జవాబుగా మనం తెలుగులోనే మాట్లాడినా, ఆ పదాలను ఇంగ్లీషులోకి మార్చి.. వెనువెంటనే వారికి అందిస్తుంది. సర్వీసులు ఉచితమేనా అధిక క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీలే ప్రస్తుతానికి ఈ ఏఐ రంగంలో ఉత్పత్తులు తీసుకొస్తున్నాయి. ఏఐలో ప్రాసెసర్లు, చిప్ల వాడకం అధికంగా ఉంటుంది. వాటికి పెద్దమొత్తంలో పెట్టుబడుతులు అవసరమవుతాయి. చిన్న కంపెనీలు ఆ ఖర్చును భరించలేవు. అదే పెద్ద కంపెనీల వద్ద అధికంగా పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లు ఉంటారు. కాబట్టి వారికి సాధ్యం అవుతుంది. ఇదీ చదవండి: సంబంధంలేని ఫొటోలు.. విమర్శలు ఎదుర్కొంటున్న గూగుల్ జెమిని అయితే కంపెనీలు వీటిని ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాయి. వీటిల్లో అందిస్తున్న ఫీచర్లకు నిర్వహణ వ్యయాలు కూడా ఉంటాయి కాబట్టి, భవిష్యత్తులో ఛార్జీలను వసూలు చేసే పరిస్థితులు కూడా రావొచ్చొని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
ఈ స్మార్ట్ వాచ్ స్పెషాలిటీ ఇదే.. ధర ఎంతంటే?
డయాబెటిస్ బాధితులు ప్రతినిత్యం చక్కెర స్థాయి తెలుసుకుంటూ ఉండాలి. చక్కెర స్థాయి తెలుసుకోవాల్సి వచ్చినప్పుడల్లా వేలిని సూదితో గుచ్చి నెత్తుటిచుక్కలు బయటకు తీయాల్సి ఉంటుంది. ఈ నెత్తుటిచుక్కల ద్వారానే ఇప్పుడు అందుబాటులో ఉన్న గ్లూకోమీటర్లు చక్కెర స్థాయిని నిర్ధారించగలుగుతున్నాయి. ఇప్పటి వరకు డయాబెటిస్ బాధితులకు ప్రతిరోజూ ఈ నొప్పి తప్పడంలేదు. ఎలాంటి నొప్పి లేకుండానే, నెత్తుటి చుక్క చిందించకుండానే చక్కెర స్థాయిని కచ్చితంగా చెప్పగలిగే స్మార్ట్వాచీని కొరియన్ కంపెనీ ‘శామ్సంగ్’ అందుబాటులోకి తెచ్చింది. ఈ స్మార్ట్వాచీ మీటల మీద చేతి మధ్యవేలు, ఉంగరంవేలు కొద్ది క్షణాలు అదిమిపెట్టి ఉంచితే చాలు, శరీరంలో చక్కెర స్థాయి ఎంత ఉందో స్క్రీన్ మీద చూపిస్తుంది. ‘శామ్సంగ్’ రూపొందించిన ఈ గెలాక్సీ స్మార్ట్వాచ్ చక్కెర స్థాయితో పాటు శరీరంలో కొవ్వు పరిమాణం, కండరాల పరిమాణం వంటి వివరాలను కూడా చెబుతుంది. దీని ధర 81.26 డాలర్లు (సుమారు రూ.6750) మాత్రమే! -
భారత్లో స్మార్ట్ఫోన్ కింగ్ ఇదే..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత స్మార్ట్ఫోన్స్ విపణిలో శామ్సంగ్ హవా కొనసాగుతోంది. 2023లో 18 శాతం వాటాతో శామ్సంగ్ అగ్రస్థానంలో నిలిచినట్టు పరిశోధన కంపెనీ సైబర్మీడియా రిసెర్చ్ నివేదిక వెల్లడించింది. నివేదిక ప్రకారం.. గతేడాది 16 శాతం వాటాతో వివో రెండవ స్థానంలో, 13 శాతం వాటాతో వన్ప్లస్ మూడవ స్థానంలో నిలిచింది. 2022తో పోలిస్తే గతేడాది భారత స్మార్ట్ఫోన్స్ మార్కెట్ 19 శాతం వృద్ధి చెందింది. 5జీ మోడళ్ల వాటా ఏకంగా 65 శాతానికి ఎగబాకింది. 5జీ స్మార్ట్ఫోన్స్ విక్రయాలు అంత క్రితం ఏడాదితో పోలిస్తే 2023లో 122% వృద్ధి సాధించడం విశేషం. ఫీచర్ ఫోన్లకూ గిరాకీ.. రూ.7–25 వేల ధర శ్రేణిలో 5జీ మోడళ్ల వాటా 58 శాతంగా ఉంది. 2022 డిసెంబర్ త్రైమాసికంలో ఇది 47 శాతం నమోదైంది. రూ.25,000లకుపైగా ఖరీదు చేసే స్మార్ట్ఫోన్స్ విభాగం గతేడాది 71 శాతం ఎగబాకింది. రూ.50,000పైగా విలువైన సూపర్ ప్రీమియం మోడళ్ల విక్రయాలు 65 శాతం పెరిగాయి. 2022తో పోలిస్తే ఫీచర్ ఫోన్ల విభాగంలో అమ్మకాలు గతేడాది 52 శాతం అధికం అయ్యాయి. 4జీ ఫీచర్ ఫోన్లు ఈ దూకుడుకు కారణం అయ్యాయి. 2జీ ఫీచర్ ఫోన్స్ 12 శాతం క్షీణించాయి. రిలయన్స్ జియో 38 శాతం వాటాతో ఫీచర్ ఫోన్స్ విభాగంలో ముందు వరుసలో ఉంది. ఐటెల్ 23 శాతం, లావా 15 శాతం వాటాతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. నాల్గవ త్రైమాసికంలో.. డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో స్మార్ట్ఫోన్ పరిశ్రమ 29 శాతం దూసుకెళ్లింది. 19 శాతం వాటాతో షావొమీ తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. శామ్సంగ్ 18.9 శాతం, వివో 16, రియల్మీ 12, ఒప్పో 8, యాపిల్ 6 శాతం వాటా దక్కించుకున్నాయి. 2023 యాపిల్ అమ్మకాల్లో ఐఫోన్–15 సిరీస్ 50 శాతంపైగా వాటా చేజిక్కించుకుంది. ఇక 2024లో స్మార్ట్ఫోన్ల విపణి దేశవ్యాప్తంగా 7–8 శాతం వృద్ధి నమోదు చేయవచ్చు. 5జీ మోడళ్ల అమ్మకాలు 40 శాతం పెరిగే ఆస్కారం ఉంది. 4జీ ఫీచర్ ఫోన్స్ 10 శాతం దూసుకెళ్లవచ్చు. -
మొన్న శాంసంగ్.. తాజాగా యాపిల్ ప్రొడక్ట్లపై కేంద్రం హైరిస్క్ అలర్ట్..
కేంద్రప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సెర్ట్-ఇన్) ఇటీవల శాంసంగ్ కంపెనీ ఉత్పత్తుల్లో అనేక లోపాలు ఉన్నాయని గుర్తించిన సంగతి తెలిసిందే. ఫలితంగా సైబర్ నేరస్థులు శాంసంగ్ ఫోన్లు వాడుతున్న లక్షల మంది వినియోగదారుల నుంచి తమ వ్యక్తిగత డేటాను దొంగలించే ప్రమాదం ఉందని సెర్ట్ పేర్కొంది. తాజాగా యాపిల్ ఉత్పత్తులకు కూడా ఇదే తరహాలో ప్రమాదం ఉందని కేంద్రం తెలిపింది. ఈ కంపెనీకి చెందిన పలు ఉత్పత్తుల్లో సెక్యూరిటీ లోపం ఉన్నట్లు గుర్తించామని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా (సెర్ట్-ఇన్) వెల్లడించింది. దీని వల్ల యూజర్ల వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగలించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. యూజర్లు వెంటనే తమ ఉత్పత్తులను లేటెస్ట్ సెక్యూరిటీ అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఐఫోన్, యాపిల్ వాచ్, మ్యాక్ బుక్, ఐపాడ్, యాపిల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్లతో పాటు సఫారీ బ్రౌజర్లో ఈ భద్రతా పరమైన లోపాలను గుర్తించినట్లు సెర్ట్-ఇన్ తన అడ్వైజరీలో వివరించింది. ‘యాపిల్ ఉత్పత్తుల్లో పలు సెక్యూరిటీ లోపాలు బయటపడ్డాయి. దీని వల్ల హ్యాకర్లు యాపిల్ ఉత్పత్తుల్లోని భద్రతా పరిమితులను అధిగమించి యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించే ప్రమాదం ఉంది’ అని సెర్ట్ తెలిపింది. ఈ లోపాలను హ్యాకర్లు గుర్తిస్తే సెక్యూరిటీ పరిమితులను అధిగమించగలరని, ఏకపక్షంగా కోడ్ను ఎగ్జిక్యూట్ చేసి కీలక సమాచారాన్ని పొందే ప్రమాదం ఉందని తెలిపింది. ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్ 17.2 కంటే ముందు వెర్షన్లు, ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్ 16.7.3 కంటే ముందు వెర్షన్లు, మ్యాక్ ఓఎస్ సొనోమా 14.2, వెంట్యురా 13.6.3, మానిటరీ 12.7.2, యాపిల్ టీవీ ఓఎస్ 17.2, యాపిల్ వాచ్ ఓఎస్ 10.2, సఫారీ 17.2 కంటే ముందు వెర్షన్లలో ఈ లోపాలను గుర్తించినట్లు సెర్ట్-ఇన్ వెల్లడించింది. కాగా.. యాపిల్ ఉత్పత్తులకు కేంద్రం గతంలోనూ పలుమార్లు ఇలాంటి అలర్ట్లు జారీ చేసింది. ఇదీ సంగతి: స్మార్ట్ఫోన్ వినియోగదారులకు కేంద్రం హై అలర్ట్! ఇటీవలే శాంసంగ్ స్మార్ట్ఫోన్ యూజర్లకు కూడా కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఆండ్రాయిడ్ 11, 12, 13, 14 ఓఎస్తో పనిచేసే శాంసంగ్ ఫోన్లలో భద్రతాపరమైన లోపం ఉందని, దీనివల్ల వినియోగదారులకు తెలియకుండానే వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగిలించే ప్రమాదం ఉందని పేర్కొంది. కాబట్టి యూజర్లు లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలని సెర్ట్-ఇన్ వివరించింది. -
స్మార్ట్ఫోన్ వినియోగదారులకు కేంద్రం హై అలర్ట్!
స్మార్ట్ఫోన్ వినియోగదారుల్ని కేంద్రం హై- అలర్ట్ జారీ చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఫోన్లలో సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని, వెంటనే తమ ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) శాంసంగ్ గెలాక్సీ ఫోన్లతో పాటు పాత ఫోన్లలో అనేక లోపాలు ఉన్నాయని గుర్తించింది. ఫలితంగా సైబర్ నేరస్తులు లక్షల మంది శాంసంగ్ ఫోన్లలోని వ్యక్తిగత డేటాను తస్కరించే ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది. శాంసంగ్ ఫోన్ యూజర్లు ఏం చేయాలంటే శాంసంగ్ ఫోన్లలో లోపాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో సైబర్ నేరస్తులు యూజర్ల వ్యక్తిగత డేటాను దొంగిలించి ప్రమాదం ఎక్కువగా ఉంది. కాబట్టి యూజర్లు శాంసంగ్ సంగ్ ఆండ్రాయిడ్ వెర్షన్ 11,12,13,14లోని ఆపరేటింగ్ సిస్టంను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. శాంసంగ్ ఫోన్లపై దాడి.. ఆపై ఏం చేస్తారంటే? ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్లో విడులైన ఆ కంపెనీకి చెందిన ఫ్లాగ్ షిప్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సైతం హ్యాకర్లు డేటాను తస్కరించే ఫోన్ల జాబితాలో ఉంది. ఫోన్ వినియోగదారులు ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్న సైబర్ నేరస్తులు ఫోన్లలోని డివైజ్ పిన్ను, ఎమోజీ సాండ్బాక్స్ డేటాను అటాకర్లు చదవగలరు. సిస్టమ్ టైమ్ను మార్చి నాక్స్ గార్డ్ లాక్ను బైపాస్ చేయగలరు. అర్బిట్రరీ ఫైల్స్, సున్నితమైన సమాచారాన్ని తస్కరించే ప్రమాదం ఉందని సెర్ట్ ఇన్ పేర్కొంది. మిగిలిన ఫోన్ యూజర్లు సైతం అదే సమయంలో మిగిలిన స్మార్ట్ఫోన్ వినియోగదారులు శాంసంగ్ ఫోన్ల నుంచి డేటా ట్రాన్స్ఫర్ చేసుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. అనుమానాస్పద లింకుల జోలికి పోవద్దని హెచ్చరించింది. -
కేంద్రం కొత్త పాలసీ? స్మార్ట్ఫోన్లలో లైవ్ టీవీ.. వ్యతిరేకిస్తున్న కంపెనీలు
స్మార్ట్ఫోన్లలో టెలివిజన్ ఛానళ్ల ప్రత్యక్ష ప్రసారాలు జరిగేలా భారత ప్రభుత్వం ప్రత్యేక పాలసీని రూపొందించనున్నట్లు తెలుస్తోంది. అయితే కేంద్రం నిర్ణయాన్ని శాంసంగ్, క్వాల్కమ్, ఎరిక్సన్,నోకియాతో పాటు ఇతర టెక్నాలజీ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లలో లైవ్టీవీ బ్రాడ్ కాస్ట్ సర్వీసుల్ని అందించాలంటే ఫోన్లలోని హార్డ్వేర్లని మార్చాలని, అలా మార్చడం వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఫలితంగా స్మార్ట్ ఫోన్ల ధరలు మరో 30 డాలర్లు పెరిగే అవకాశం ఉందని కంపెనీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయంటూ రాయిటర్స్ ఓ నివేదికను విడుదల చేసింది. అయితే, కేంద్రం టీవీ ప్రత్యక్ష ప్రసారాల కోసం సెల్యూలర్ నెట్వర్క్తో పనిలేకుండా డైరెక్ట్గా స్మార్ట్ ఫోన్లలో లైవ్ సిగ్నల్స్ ఉంటే ఎలా ఉంటుందన్న అంశంపై చర్చలు సంబంధిత నిపుణలతో చర్చలు జరుపుతుంది. ఈ తరహా సేవలు ఉత్తర అమెరికా యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. ఏటీఎస్సీ 3.0 టెక్నాలజీ సాయంతో నేరుగా ప్రతీ స్మార్ట్ఫోన్లో టెలికం కంపెనీల అవసరం లేకుండానే టెలివిజన్ ఛానళ్ల ప్రత్యక్ష ప్రసారాలకు వీలుంది. ఇప్పుడు ఇదే పద్దతిని భారత్లో ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్నది. ఏటీఎస్సీ 3.0కు అనుగుణంగా ప్రస్తుత దేశీయ మార్కెట్లోని ఏ స్మార్ట్ ఫోన్లు అందుబాటులో లేవు. ఒకవేళ కేంద్రం లైవ్ టీవీ పాలసీని అమలు చేస్తే తయారీ వ్యవస్థలో భారీ మార్పులు చేయాల్సి వస్తుందని సంస్థలు భావిస్తున్నాయి. ఇది తమకు చాలా నష్టమని మొబైల్ ఫోన్ తయారీ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరి కంపెనీల ఆందోళనపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. -
త్వరలో విడుదల కానున్న శాంసంగ్ గెలాక్సీ ఎస్24.. ధర ఎంతంటే?
ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ త్వరలో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ను విడుదల చేయనుంది. గెలాక్సీ ఎస్ 23 ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా, శాంసంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్ను ఇప్పటికే మార్కెట్కి పరిచయం చేసిన ఫోన్లను విడుదల చేసిన తర్వాతనే ఈ లేటెస్ట్ సిరీస్ ఫోన్లను విడుదల చేయాలని శాంసంగ్ భావిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. నివేదికల ప్రకారం.. ఈ కొత్త సిరీస్లో బేస్ గెలాక్సీ ఎస్24,గెలాక్సీ ఎస్ 234 ప్లస్, గెలాక్సీ ఎస్ 24 ఆల్ట్రాలు ఉండనున్నాయి. గెలాక్సీ ఎస్ 24 సిరీస్ను కొత్త ఏడాది జనవరి 17న అమెరికా శాన్ఫ్రాన్సిస్కోలో జరిగే కార్యక్రమంలో విడుదల చేసే అవకాశం ఉందని ఎస్బీఎస్ బిజ్ రిపోర్ట్ తెలిపింది. శాంసంగ్ కంపెనీ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ మోడల్ను సౌత్ కొరియాలో సుమారు రూ.70 వేల లోపు ధరతో విక్రయించనుంది. ఇంచు మించు శాంగ్ గెలాక్సీ ఎస్ 24 సిరీస్ ఫోన్ ధరలు సైతం అదే స్థాయిలో ఉండనున్నాయి. వీటి ఖచ్చిత ధర ఎంతనేది తెలియాలంటే ఈ ఫోన్ సీరీస్ విడుదలయ్యే వరకు ఎదురు చూడాల్సి ఉంది. యాపిల్ ఐఫోన్లకు గట్టి పోటీ ఇస్తూ ఆర్థిక మాంద్యం కారణంగా గెలాక్సీ ఎస్ 23 సిరీస్, ఎస్ 24 సిరీస్ ఫోన్ల అమ్మకాల తగ్గకుండా ఉండేలా వ్యూహాత్మకంగా మార్కెటింగ్ స్ట్రాటజీని అమలు చేయనుంది శాంసంగ్ . తద్వారా వాటి సేల్స్ పెంచుకోవాలని భావిస్తుంది. -
ఈ వాచ్ పెట్టుకుంటే నిద్ర సమస్యలు పరార్!
ఇప్పటికే రకరకాల స్మార్ట్వాచీలు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో చాలా వాచీలు నడక, వ్యాయామం ద్వారా శరీరంలో ఖర్చయ్యే కేలరీలు, రక్తపోటు వంటి సమాచారాన్ని యాప్ ద్వారా ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటాయి. దక్షిణ కొరియాకు చెందిన సామ్సంగ్ కంపెనీ నిద్రా సమస్యలను గుర్తించే స్మార్ట్ వాచీని ఇటీవల రూపొందించింది. దీనికి దక్షిణ కొరియా ఆహార, ఔషధ మంత్రిత్వశాఖ ఆమోదం కూడా లభించింది. ‘సామ్సంగ్ గెలాక్సీ వాచ్5’ పేరుతో వచ్చే ఏడాది నుంచి ఇది మార్కెట్లో అందుబాటులోకి రానుంది. ఇది నిద్ర తీరుతెన్నులను నిరంతరం గమనిస్తూ ఉంటుంది. నిద్రలో ఎదురయ్యే గురక, నిద్ర మధ్యలో శ్వాస ఆగిపోవడం వంటి సమస్యలను గుర్తించి, యాప్ ద్వారా తెలియజేస్తుంది. సమస్యలను ముందుగానే గుర్తించడం ద్వారా వెంటనే తగిన చికిత్స పొందడానికి వెసులుబాటు కల్పిస్తుంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు. (చదవండి: 120 మీటర్ల ఎత్తులో ఉన్న కొండను ఆనుకొని ఓ కొట్టు..ఎక్కడంటే..) -
యూజర్ల నిద్ర సమస్యల్ని గుర్తించే స్మార్ట్ వాచ్!
ఇప్పటికే రకరకాల స్మార్ట్వాచీలు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో చాలా వాచీలు నడక, వ్యాయామం ద్వారా శరీరంలో ఖర్చయ్యే కేలరీలు, రక్తపోటు వంటి సమాచారాన్ని యాప్ ద్వారా ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటాయి. దక్షిణ కొరియాకు చెందిన శామ్సంగ్ కంపెనీ నిద్రా సమస్యలను గుర్తించే స్మార్ట్ వాచీని ఇటీవల రూపొందించింది. దీనికి దక్షిణ కొరియా ఆహార, ఔషధ మంత్రిత్వశాఖ ఆమోదం కూడా లభించింది. ‘శామ్సంగ్ గెలాక్సీ వాచ్5’ పేరుతో వచ్చే ఏడాది నుంచి ఇది మార్కెట్లో అందుబాటులోకి రానుంది. ఇది నిద్ర తీరుతెన్నులను నిరంతరం గమనిస్తూ ఉంటుంది. నిద్రలో ఎదురయ్యే గురక, నిద్ర మధ్యలో శ్వాస ఆగిపోవడం వంటి సమస్యలను గుర్తించి, యాప్ ద్వారా తెలియజేస్తుంది. సమస్యలను ముందుగానే గుర్తించడం ద్వారా వెంటనే తగిన చికిత్స పొందడానికి వెసులుబాటు కల్పిస్తుంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు. -
వన్ప్లస్ నుంచి మడత ఫోన్ వచ్చేస్తోంది.. భారత్లో దీని ధర ఎంతంటే?
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ప్లస్.. ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లలో ఆధిపత్య చెలాయిస్తున్న శాంసంగ్కు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా వన్ ప్లస్ తన తొలి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ‘వన్ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్’ ఫోన్ను పరిచయం చేయనుంది. ఈ నెల 19న వన్ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్ ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. వన్ ప్లస్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫోల్డ్ 5 ఫోన్కు వన్ ప్లస్ గట్టి పోటీదారుగా నిలుస్తుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్లో ‘వన్ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్’ ధర ఎంతంటే భారత మార్కెట్ లో విడుదల కానున్న వన్ప్లస్ ఫోల్డబుల్ ఫోన్ ధర రూ.1,41,490 (1699 డాలర్లు) ఉంటుందని తెలుస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే వన్ ప్లస్ ఓపెన్ 7.8 అంగుళాల ఓపెన్ స్క్రీన్ విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, కవర్ డిస్ ప్లే 6.3 అంగుళాలు, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ సెట్, 8 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ సౌకర్యం ఉండనుంది. -
యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ : ప్రత్యర్థుల దారుణమైన ట్రోలింగ్
దక్షిణ కొరియా స్మార్ట్ఫోన్ దిగ్గజం శాంసంగ్, అమెరికా టెక్దిగ్గజం యాపిల్పై మరోసారి ట్రోలింగ్కు దిగింది. అమెరికాలోని యాపిల్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈవెంట్లో ఐఫోన్ 15 సిరీస్ను తాజాగా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగానే యూఎస్బీ-సీ పోర్ట్తో లాంచ్ తాజా ఐఫోన్లను ఎద్దేవా చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది శాంసంగ్. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో యుఎస్బి-సి పోర్ట్లపై దారుణంగా ట్రోల్ చేస్తోంది శాంసంగ్. దీనికి మరో స్మార్ట్ఫోన్దిగ్గజం వన్ప్లస్ కూడా తోడైంది. అలాగే మరికొన్ని డిజిటల్ ప్లాట్ఫాంలు కూడా యాపిల్పై విమర్శలకు దిగాయి. ఎట్టకేలకు మనం ఒక మాజికల్ చేంజ్ను (సీ) చూస్తున్నా అంటూ పోరక్షంగా ట్వీట్ చేసింది. అయితే ఇక్కడ కొంతమంది యూజర్లు యాపిల్కు మద్దతుగా నిలవడం విశేషం. ఆండ్రాయిడ్ ఫోన్లు చాలా కాలంగా USB-Cని ఉపయోగి స్తున్నాయి. నిజానికి, యాపిల్ఇపుడు యూఎస్బీ-సీ స్విచ్ చేయడానికి ఏకైక కారణం, 2024 నుంచి యూరోపియన్ యూనియన్ ఇప్పుడు అన్ని స్మార్ట్ఫోన్లు USB-C ని మాండేటరీ చేసింది. కాగా USB-Cతో Apple Watch Series 9, Airpods Proతో పాటు iPhone 15 సిరీస్ను విడుదల చేసింది. ఐఫోన్ 15 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 79,900 నుండి ప్రారంభం. అలాగే ఐఫోన్ 15 ప్లస్ ప్రారంభ ధర రూ. 89,900, iPhone 15 Pro 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 1,34,900 గాను నిర్ణయించింది. ఇక iPhone 15 Pro Max 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 1,59,900 నుండి ప్రారంభం.స్మార్ట్ఫోన్ సెక్టార్లో శాంసంగ్, యాపిల్ మధ్య పోటీ గత దశాబ్ద కాలంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఫోల్డబుల్ ఫోన్ లేదంటూ గత ఏడాది కూడా శాంసంగ్ యాపిల్పై విమర్శలు గుప్పించింది. Apple announcing USB-C… pic.twitter.com/KIzXQFIzMx — OnePlus_USA (@OnePlus_USA) September 12, 2023 -
యాపిల్, శాంసంగ్ కీలక నిర్ణయం! ఇక్కడ తయారీ లేనట్లే..
ప్రపంచంలో అతిపెద్ద టెక్ కంపెనీలైన యాపిల్ (Apple), శాంసంగ్ (Samsung) భారత్లో తమ ఉత్పత్తుల తయారీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నాయి. భారత్లో ఐటీ హార్డ్వేర్ ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం అందిస్తున్న ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) స్కీమ్కు ఈ రెండు టెక్ దిగ్గజాలు దరఖాస్తు చేయలేదు. ఐటీ హార్డ్వేర్ పీఎల్ఐ స్కీమ్లో పాల్గొనేందుకు డెల్, లెనోవో, హెచ్పీతో సహా దాదాపు 40 ఎలక్ట్రానిక్స్ కంపెనీలు అంగీకరించాయి. అయితే యాపిల్, శాంసంగ్ కంపెనీలు మాత్రం వద్దనుకున్నాయి. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం.. ఆ రెండు కంపెనీలు పీఎల్ఐ స్కీమ్ను వద్దనుకోవడానికి ప్రాథమిక కారణం స్మార్ట్ఫోన్లతో పోలిస్తే భారతదేశంలో ల్యాప్టాప్లు, పర్సనల్ కంప్యూటర్లకు మార్కెట్ చాలా తక్కువగా ఉండటమే. ల్యాప్టాప్లు, పర్సనల్ కంప్యూటర్లకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్లో భారత్లో ఉన్నది కేవలం 2.4 శాతం మాత్రమే. కానీ స్మార్ట్ఫోన్లకు మాత్రం భారత్లో అత్యధిక మార్కెట్ ఉంది. పైగా యాపిల్, శాంసంగ్ కంపెనీ ప్రధాన ఉత్పత్తులు ల్యాప్టాప్లు, పర్సనల్ కంప్యూటర్లు కావు. కాబట్టి చైనా, వియత్నాం వంటి దేశాల నుంచి తయారీ కేంద్రాలను భారత్కు తరలించడం ఆర్థికంగా అంత లాభదాయకం కాదు. ఎక్కువ ఆదాయం వాటి నుంచే.. యాపిల్ కంపెనీకి ఆదాయం ప్రధానంగా ఐఫోన్ ఉత్పత్తుల నుంచే వస్తోంది. మాక్లు, ఐపాడ్ల నుంచి వచ్చే ఆదాయం గణనీయంగా చాలా తక్కువ. అందువల్లే ఈ సంస్థ భారత్లో మాక్లు, ఐపాడ్ల తయారీకి మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది. మరోవైపు శాంసంగ్ ప్రభుత్వ ఇన్వాయిస్లలోని వ్యత్యాసాలకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటుంది. ఇది ఆ కంపెనీ పీఎల్ఐ స్కీమ్లో పాల్గొనకపోవడానికి కారణం కావచ్చు. ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) PLI 2.0 స్కీమ్ భారత్లో తయారు చేసే ల్యాప్టాప్లు, టాబ్లెట్లు, ఆల్ ఇన్ వన్ పర్సనల్ కంప్యూటర్లు, సర్వర్, అల్ట్రా-స్మాల్ ఫామ్ ఫ్యాక్టర్ పరికరాలతో సహా వివిధ సాంకేతిక ఉత్పత్తులను కవర్ చేస్తుంది. చాలా కంపెనీలు దీని కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ప్రభుత్వం బడ్జెట్కు మించి దరఖాస్తులు వచ్చాయి. -
హైదరాబాద్ : శామ్సంగ్ కొత్త మొబైల్ లాంచ్ చేసిన నటి అషురెడ్డి (ఫొటోలు)
-
ఆకస్మిక ఆంక్షలు: షాక్లో దిగ్గజ కంపెనీలు, దిగుమతులకు బ్రేక్!
ల్యాప్టాప్లు,కంప్యూటర్ల దిగుమతులపై కేంద్రం నిర్ణయం చైనా కంపెనీలతో సహా ,ఆపిల్, శాంసంగ్,హెచ్పీ లాంటి దిగ్గజ కంపెనీలకు షాకిచ్చింది. ముఖ్యంగా ఫెస్టివల్ సీజన్ సమీపిస్తున్న తరుణంలో చైనా లైసెన్సు లేకుండానే చిన్న టాబ్లెట్ల నుంచి ఆల్ ఇన్ వన్ పీసీల దిగుమతులపై ఆంక్షలు ఆయా కంపెనీల ఆదాయంపై భారీగా ప్రభావం చూపనుంది. ల్యాప్టాప్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, మేకిన్ఇండియా, స్థానిక ఉత్పత్తిని పెంచడం లక్ష్యంగా ప్రభుత్వ ఈ చర్య తీసుకుంది. (పల్సర్ బైకా? మజాకా..రూ.35 వేల కోట్ల ఆస్తి..ఎవరా హీరో?) లైసెన్స్లను తప్పనిసరి చేయడంతో ప్రపంచంలోని అతిపెద్ద పీసీ మేకర్స్, ఇతర కంపెనీలు ఇబ్బందుల్లో పడ్డాయి. భారతదేశానికి ల్యాప్టాప్లు టాబ్లెట్ల కొత్త దిగుమతులను నిలిపివేశాయి. అయితే ఆకస్మిక లైసెన్సింగ్ ప్రకటించడం పరిశ్రమను అతలాకుతలం చేసిందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. విదేశీ సంస్థల బహుళ-బిలియన్ డాలర్ల వాణిజ్యానికి ఇది భారీ గండి కొడుతుందని అంచనా. రానున్న దీపావళి షాపింగ్ సీజన్,బ్యాక్-టు-స్కూల్ కాలం సమీపిస్తున్నందున డిమాండ్ పుంజుకోనున్న టైంలో లైసెన్సులను ఎలా త్వరగా పొందాలనే దానిపై సంస్థలు మల్లగుల్లాలు పడుతున్నాయి. (తండ్రికే షాకిస్తున్న ఇషా: మురిసిపోతున్న అంబానీ) గ్లోబల్ ఇన్వెంటరీ, అమ్మకాల వృద్ధిని పునఃప్రారంభించడానికి కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్న తయారీదారులకు ఈ అవసరం అదనపు తలనొప్పిని సృష్టిస్తుందనీ, ఫలితంగా దేశీయ లాంచ్లు ఆలస్యం కావడానికి లేదా విదేశీ సరుకులపై ఇప్పటికీ ఎక్కువగా ఆధారపడే కంపెనీల్లో ఉత్పత్తి కొరతకు దారితీయవచ్చనేది ప్రధాన ఆందోళన. కాగా దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు, భద్రతాపరమైన కారణాల రీత్యా ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్లు అలాగే కొన్ని రకాల కంప్యూటర్ల దిగుమతులపై ముఖ్యంగా చైనా, కొరియా వంటి దేశాల నుంచి దిగుమతులను కట్టడి చేసే ఉద్దేశంతో తీసుకున్న ఈ నియంత్రణలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు.2022–23లో భారత్ 5.33 బిలియన్ డాలర్ల విలువ చేసే పర్సనల్ కంప్యూటర్లు .. ల్యాప్టాప్లను, 553 మిలియన్ డాలర్ల విలువ చేసే ప్రత్యేక డేటా ప్రాసెసింగ్ మెషీన్లను దిగుమతి చేసుకుంది. భారత్లో ఎక్కువగా హెచ్సీఎల్, డెల్, ఎల్జీ ఎల్రక్టానిక్స్, లెనొవొ, యాపిల్, హెచ్పీ, శాంసంగ్ తదితర ఎల్రక్టానిక్ దిగ్గజాల ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి. మరోవైపు దేశీయంగా ఎల్రక్టానిక్స్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. ల్యాప్టాప్లు, టాబ్లెట్లు ఇతర హార్డ్వేర్ తయారీదారులను ఆకర్షించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రస్తుతం 170 బిలియన్ రూపాయల ($2.1 బిలియన్) ఆర్థిక ప్రోత్సాహక ప్రణాళిక కోసం దరఖాస్తులను కోరుతున్న సంగతి తెలిసిందే. -
వామ్మో రూ. 1.15 కోట్లు.. ఇది టీవీ ధర!
Samsung Micro LED TV: కోటి రూపాయల కంటే ఖరీదైన టీవీ గురించి ఎప్పుడైనా విన్నారా? రూ.1 కోటి కంటే ఎక్కువ ఖరీదు చేసే టీవీని ప్రముఖ టెలివిజన్ కంపెనీ భారతదేశంలో విడుదల చేసింది. 110-అంగుళాల భారీ మైక్రో ఎల్ఈడీ టీవీని రూ. 1,14,99,000 ధరకు శాంసంగ్ తాజాగా లాంచ్ చేసింది. అల్ట్రా-ప్రీమియం వీక్షణ అనుభవాన్ని ఇష్టపడే వినియోగదారుల కోసం మైక్రో ఎల్ఈడీ టీవీని రూపొందించనట్లు శాంసంగ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ శామ్సంగ్ మైక్రో ఎల్ఈడీ టీవీ భూమిపై రెండో అత్యంత కఠినమైన పదార్థం నీలమణితో తయారు చేశారు. శాంసంగ్ మైక్రో ఎల్ఈడీ టీవీ ఆగస్ట్ 2 నుంచి దేశంలోని ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో, శాంసంగ్ అధీకృత వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. టీవీ ప్రత్యేకతలివే.. 24.8 మిలియన్ మైక్రోమీటర్-సైజ్ అల్ట్రా-స్మాల్ ఎల్ఈడీ అంటే పెద్ద సైజు ఎల్ఈడీలలో 1/10వ వంతు. ఆకట్టుకునే డెప్త్, వైబ్రెంట్ కలర్స్, అధిక స్థాయి స్పష్టత, కాంట్రాస్ట్ ద్వారా ఈ మైక్రో ఎల్ఈడీలన్నీ ఒక్కొక్కటిగా కాంతి రంగును ఉత్పత్తి చేస్తాయి. మైక్రో ఎల్ఈడీ టెక్నాలజీలో మైక్రో ఎల్ఈడీతోపాటు మైక్రో కాంట్రాస్ట్, మైక్రో కలర్, మైక్రో హెచ్డీఆర్, మైక్రో ఏఐ ప్రాసెసర్ ఉన్నాయి. ఓటీఎస్ ప్రో, డాల్బీ అట్మాస్, క్యూ-సింఫనీలతో కూడిన అరేనా సౌండ్ సిస్టమ్ ఇందులో ఉంటుంది. అద్భుతమైన త్రీడీ సౌండ్, సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తుంది. మైక్రో ఏఐ ప్రాసెసర్ మల్టీ-ఇంటెలిజెన్స్ ఏఐ అప్స్కేలింగ్, సీన్ అడాప్టివ్ కాంట్రాస్ట్, డైనమిక్ రేంజ్ ఎక్స్పాన్షన్+ పాత వీడియోలను కూడా మెరుగ్గా ప్రదర్శిస్తుంది. -
శాంసంగ్ కొత్త మడత ఫోన్లు వచ్చేశాయ్..అదిరిపోయే ఆఫర్తో...
Samsung Galaxy Z Fold 5 and Z Flip 5: స్మార్ట్ఫోన్ దిగ్గజం శాంసంగ్ బుధవారం సియోల్లో జరిగిన గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో రెండు కొత్త ఫోల్డింగ్ ఫోన్లను విడుదల చేసింది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్5 , గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 పేరుతో రెండు ఫోల్డబుల్ స్మార్ట్పోన్లను తీసుకొచ్చింది. అలాగే గెలాక్సీ వాచ్ 6 సిరీస్, గెలాక్సీ ట్యాబ్ ఎస్9 సిరీస్ను కూడా ఆవిష్కరించింది.గత సంవత్సరం మాదిరిగానే, కొత్తగెలాక్సీ S9 సిరీస్లో మూడు మోడల్స్తీసుకొచ్చింది. గెలాక్సీ ట్యాబ్ ఎస్9, గెలాక్సీ ఎస్9 ప్లస్, గెలాక్సీ ఎస్ 9 అల్ట్రా మోడల్స్ను లాంచ్ చేసింది. ('ట్యాప్ & పే' ఫీచర్తో శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6..యాపిల్కు షాకే!) ప్రీమియం సెగ్మెంట్లో ఆండ్రాయిడ్ ప్రత్యర్థులైన షావోమి, ఒప్పో లాంటి కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వనుంది. కొత్తగా లాంచ్ అన్ని డివైస్లు ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంటాయి. Snapdragon 8 Gen 2 SoC కొత్త కీలు డిజైన్తోపాటు Z Flip 5 డిస్ప్లేకి కొన్ని అప్గ్రేడ్లను కూడా చేసింది. (మారుతి జిమ్నీని సింగిల్ బెడ్తో అలా మార్చేసిన జంట; వైరల్ వీడియో) కొత్త ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లు, ధరలు గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 (8 జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్): రూ 99,999 గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 (8జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్): రూ 1,09,999 గెలాక్సీ జెడ్ ఫోల్డ్5 (12 జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ): రూ 1,54,999 గెలాక్సీ జెడ్ ఫోల్డ్5 (12జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్): రూ 1,64,999 గెలాక్సీ జెడ్ ఫోల్డ్5 (12జీబీ ర్యామ్ + 1టీబీ స్టోరేజ్): రూ 1,84,999 ప్రీ-బుకింగ్ కస్టమర్లు రూ. 23,000 (జెడ్ ఫ్లిప్ 5 కోసం రూ. 20,000) వరకు విలువైన ప్రయోజనాలను పొందుతారని శాంసంగ్ వెల్లడించింది. ఇందులో క్యాష్బ్యాక్ అప్గ్రేడ్ బోనస్లు ఉంటాయని పేర్కొంది. ప్రీ-బుకింగ్ విండో జూలై 27 నుంచి మొదలు. ఆగస్టు 17 లైవ్ సేల్, ఆ తర్వాత విక్రయాలు ఉంటాయి. -
'ట్యాప్ & పే' ఫీచర్తో శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6..యాపిల్కు షాకే!
స్మార్ట్ఫోన్ దిగ్గజం శాంసంగ్ కొత్త గెలాక్సీ స్మార్ట్వాచ్లను లాంచ్ చేసింది. బుధవారం సియోల్లో జరిగిన గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో గెలాక్సీ వాచ్ 6, గెలాక్సీ వాచ్ 6, క్లాసిక్ పేరుతో రెండు వేరియంట్లను బుధవారం తీసుకొచ్చింది. ముఖ్యంగా అభిమానులకు ఇష్టమైన ఫీచర్, ఫిజికల్ రొటేటింగ్ బెజెల్ను తీరిగి పరిచయం చేసింది. ఈ సిరీస్లో AFib లేదా క్రమరహిత హృదయ స్పందన రేటు ట్రాకింగ్, ఎమర్జెన్సీ ఎస్వోఎస్, ఫాల్డిటెక్షన్, గూగుల్ వాయిస్ అసిస్టెంట్, స్లీప్ ట్రాకింగ్, పీరియడ్ ట్రాకింగ్ లాంటివి కీలక ఫీచర్లుగా ఉన్నాయి. (శాంసంగ్ కొత్త మడత ఫోన్లు వచ్చేశాయ్..అదిరిపోయే ఆఫర్తో...) అలాగే దేశంలో తొలిసారిగా గెలాక్సీ వాచ్ 6 సిరీస్ 'ట్యాప్ & పే' ఫీచర్తో వీటిని లాంచ్ చేసింది. అంటే యూజర్లు, చేతికి వాచ్ ఉండగానే ప్రయాణంలో చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుందని కంపెనీ లాంచింగ్ సందర్భంగా ప్రకటించింది. (యాపిల్ ఐఫోన్ 14 పై భారీ డిస్కౌంట్) వీటి కోసం ప్రీ-బుకింగ్ను ప్రారంభించింది. శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 44ఎంఎ గ్రాఫైట్ , సిల్వర్లో , 40ఎంఎం గ్రాఫైట్,గోల్డ్ కలర్స్లో లభ్యం.300mAh , 400mAh బ్యాటరీలను ఇందులో అందించింది. ప్రీమియం, టైమ్లెస్ టైమ్పీస్ గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్ బ్లాక్ అండ్ సిల్వర్ , 43ఎంఎ, 47ఎంఎం మోడల్స్లో అందుబాటులో ఉంటుంది. AOD ఫీచర్ ఆన్తో 30 గంటల బ్యాటరీ లైఫ్ని, AOD ఫీచర్ ఆఫ్తో 40 గంటల వరకు అందించబడతాయని కంపెనీ పేర్కొంది. శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 ధర రూ. 29,999 నుండి ప్రారంభం. 44ఎంఎ డయల్, LTE సపోర్ట్ఉన్న టాప్-ఎండ్ మోడల్ ధర రూ. 36,999. శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్ 43 ఎంఎం మోడల్ ధర రూ.36,999. LTT, 47 ఎంఎం మోడల్ ధర రూ.43,999గా నిర్ణయించింది. వినియోగదారులు శాంసంగ్ ఆన్లైన్ స్టోర్ నుండి జూలై 27 నుండి ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. ఆగస్టు 11న సేల్స్ మొదలవుతాయి. ప్రీ-బుక్ చేసుకున్న వారు రూ.19,999తో ప్రారంభమయ్యే సరికొత్త గెలాక్సీ వాచ్ 6 సిరీస్ని సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫోల్డ్ 5, గెలాక్సీ జడ్ ఫ్లిప్ 5 స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించింది. -
శాంసంగ్ లాంచ్ ఈవెంట్: అంచనాలు మామూలుగా లేవుగా!
Galaxy Unpacked 2023: దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్తో సహా కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించనుంది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, గెలాక్సీ ఫ్లిప్ 5లను భారత మార్కెట్లో తీసుకొచ్చేందుకు సిద్దమవుతోంది. దక్షిణ కొరియాలోని సియోల్లో డిజిటల్ ఇన్ పర్సన్ ఈవెంట్గా జరుగుతుంది. మెరుగైన కెమెరాలు, బిగ్ డిస్ప్లే లాంటివి ఫీచర్లతో ముఖ్యంగా క్వాల్కాం స్నాప్డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్తో తీసుకురానుందని అంచనా. దీనికి తోడు ప్రముఖ టిప్స్టర్ అభిషేక్ యాదవ్ వీటి ధర, ముందస్తు ఆఫర్ గురించి లీక్ చేయడంతో మరింత ఉత్కంఠ పెరిగింది. ఈ లీక్ ప్రకారం శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 ధర రూ. 1,49,999గా ఉంటుందని, ప్రారంభ ఆఫర్ కింద మీరు దీన్ని రూ. 1,43,999కే కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది. అదేవిధంగా శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 ధర రూ.99,999గఘుంది. అయితే ప్రారంభ ఆఫర్ కింద మీరు దీన్ని రూ. 94,999కి కొనుగోలు చేయవచ్చని తెలిపారు. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ : 5, 7.6 అంగుళాల ఇన్నర్ డిస్ప్లే, 6.2 అంగుళాల కవర్ డిస్ప్లే, 50+12+10 ఎంపీ ట్రిపుల్ కెమెరా, 12 ఎంపీ సెల్పీ కెమెరా లాంటివి ప్రధాన ఫీచర్లుగా ఉండనున్నాయి. అలాగే 6.7 అంగుళాల మెయిన్ డిస్ప్లే, 3.4 అంగుళాల కవర్ డిస్ప్లేతో గెలాక్సీ ఫ్లిప్ ఫోన్ తీసుకొస్తోంది. అయితే అధికారిక లాంచింగ్ తరువాత దీనిపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గెలాక్సీ వాచెస్, గెలాక్సీ ట్యాబ్స్ శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 , వాచ్ 6 క్లాసిక్లను కూడా లాంచ్ చేయనుంది. బిగ్ స్క్రీన్లు సన్నని బెజెల్లను కలిగి ఉంటాయని అంచనా. దీంతోపాటు అప్గ్రేడ్ చేసిన డిస్ప్లేలు , ప్రాసెసర్లతో Tab S9, S9 ప్లస్ , S9 అల్ట్రాలను కలిగి ఉండే Galaxy Tab S9 సిరీస్ని కూడా లాంచ్ చేయనుంది. తొలి స్మార్ట్ రింగ్ అంతేకాదు శాంసంగ్ తన తొలి స్మార్ట్ రింగ్, గెలాక్సీ రింగ్, కొత్త వైర్లెస్ ఇయర్బడ్లు, బడ్స్ 3తో కూడా ఫ్యాన్స్ను ఆశ్చర్యపరచవచ్చని భావిస్తున్నారు. -
హాట్ డీల్: రూ.12 వేలకే లేటెస్ట్ శాంసంగ్ స్మార్ట్ఫోన్!
తక్కువ ధరకు కొత్త బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా.. అయితే మీ కోసం ఓ అద్భుతమైన డీల్ ఉంది. ప్రముఖ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 (Samsung Galaxy F13) స్మార్ట్ ఫోన్ అత్యధిక డిస్కౌంట్ లభిస్తోంది. ఆఫర్లు ఇవీ... ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్కార్ట్ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 స్మార్ట్ ఫోన్పై 29 శాతం భారీ తగ్గింపు అందిస్తోంది. ఏడాది క్రితం లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ వాస్తవ ధర రూ.16,999 కాగా ఫ్లిప్కార్ట్లో రూ.11,999కే సొంతం చేసుకోవచ్చు. ఇక ఎక్స్ఛేంజ్ ఆఫర్, బ్యాంకు డిస్కౌంట్లను ఉపయోగించుకుంటే మరింపు తగ్గింపు లభిస్తుంది. పాత ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా ఏకంగా రూ.11,450 వరకు డిస్కౌంట్ ఉంటుందని ఫ్లిప్కార్ట్ పేర్కొంది. యాక్సిస్ బ్యాంక్ కార్డును ఉపయోగించి కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్ బ్యాక్, అదే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డును వినియోగిస్తే 5 శాతం తగ్గింపు అదనంగా లభిస్తాయి. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 ఫీచర్స్ 6.6 అంగులాల డిస్ప్లే. ఆక్టాకోర్ శాంసంగ్ ఎక్సినోస్ 850 ప్రాసెసర్ 4 జీబీ ర్యామ్ ట్రిపుల్ రియర్ కెమెరా, 50 ఎంపీ మెయిన్ సెన్సర్, 5 ఎంపీ అల్ట్రావైడ్ సెన్సర్, 2 ఎంపీ డెప్త్ సెన్సర్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇదీ చదవండి: కొత్త కొత్తగా.. మోటో జీ32 స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్లు -
శాంసంగ్ టీవీల్లో కొత్త మోడ్.. ఆ రంగులు చూడలేని వారి కోసం..
దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ దిగ్గజం శాంసంగ్ (Samsung).. తన 2023 టీవీ, మానిటర్ లైనప్లో సీ కలర్స్ (SeeColors) అనే కొత్త మోడ్ను జోడించినట్లు ప్రకటించింది. ఈ ఫీచర్ వర్ణ అంధత్వం ఉన్నవారికి వివిధ సెట్టింగుల ద్వారా మెరుగైన వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది. సీ కలర్స్ మోడ్ తొమ్మిది పిక్చర్ ప్రీసెట్లను అందిస్తుంది. వీటిలో వినియోగదారులు తమకు అనువైనదాన్ని ఎంచుకోవచ్చు. వీక్షకులు తమ వర్ణ దృష్టి లోపానికి అనుగుణంగా స్క్రీన్పై అన్ని రంగులను సులభంగా గుర్తించగలిగేలా ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగుల స్థాయిలను ఈ ఫీచర్ సర్దుబాటు చేస్తుంది. అందుబాటులో సాఫ్ట్వేర్ అప్డేట్ వాస్తవానికి 2017లోనే ఈ ఫీచర్ ఒక అప్లికేషన్గా విడుదలైంది. సీ కలర్స్ మోడ్ వర్ణాంధత్వ బాధితులు తాము చూడలేని రంగులను సైతం స్క్రీన్పై ఆస్వాదించేలా దీన్ని రూపొందించారు. రానున్న టీవీ, మానిటర్ యాక్సెసిబిలిటీ మెనూలలో ఈ మోడ్ను ఏకీకృతం చేస్తోంది శాంసంగ్ కంపెనీ. ఇప్పటికే 2023 మోడల్ శాంసంగ్ టీవీలు, మానిటర్లు కొనుగోలు చేసిన వారు తమ ఉత్పత్తుల యాక్సెసిబిలిటీ మెనూకి సీ కలర్స్ ఫీచర్ను జోడించడానికి సాఫ్ట్వేర్ అప్డేట్ అందుబాటులో ఉంటుంది. సీ కలర్స్ మోడ్కు సంబంధించి 'కలర్ విజన్ యాక్సెసిబిలిటీ' సర్టిఫికేషన్ను కూడా శాంసంగ్ పొందింది. ఇదీ చదవండి: Smallest Smartphone: ప్రపంచంలోనే అతి చిన్న స్మార్ట్ఫోన్.. ఫీచర్లు మాత్రం అదుర్స్! -
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్54 5జీ: లాంచింగ్ ఆఫర్ ముగుస్తోంది!
శాంసంగ్కు చెందిన టాప్ ప్రీమియం స్మార్ట్ఫోన్ గెలాక్సీ ఎఫ్54 5 జీపై భారీ తగ్గింపు లభిస్తోంది. గెలాక్సీ ఎఫ్ సిరీస్లోఇటీవల లాంచ్ అయిన ఈ స్మార్ట్ఫోన్ ఇపుడు ఫ్లిప్కార్ట్లో ప్రత్యేక తగ్గింపుతో అందుబాటులోకి వచ్చింది. మెటోర్ బ్లూ ,స్టార్డస్ట్ సిల్వర్ రెండు రంగులలో లభిస్తుంది. ఐదు సంవత్సరాల వరకు భద్రతా అప్డేట్స్, అలాగే తాజా ఫీచర్లు, మెరుగైన భద్రత ఉంటుందని కంపెనీ భరోసా ఇస్తోంది. గెలాక్సీ ఎఫ్54 5జీ స్పెసిఫికేషన్స్ 6.7అంగుళాల sAMOLED+ డిస్ప్లే Android 13 ఆపరేటింగ్ సిస్టమ్ 8జీబీర్యామ్ , 256 జీబీ స్టోరేజ్ ఐకానిక్ గెలాక్సీ సిగ్నేచర్ డిజైన్ 108 ఎంపీ నో షేక్ కెమెరా, 8+2 ఎంపీ లెన్స్ 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 6000mAh బ్యాటరీ, 25W సూపర్-ఫాస్ట్ ఛార్జింగ్ ఆఫర్ ఫ్లిప్కార్ట్, శాంసంగ్ ఆన్లైన్ స్టోర్,ఇతర ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో ఆన్లైన్లో కొనుగోలు చేయడానికి స్మార్ట్ఫోన్ అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్లపై రూ. 3,000 వరకు తక్షణ తగ్గింపును పొందవచ్చు. అన్ని ఆఫర్లతో సహా, గెలాక్సీ ఎఫ్54 5జీ ధర రూ. 27,999లకే కొనుగోలు చేయవచ్చు. జూన్ 20వరకే ఈ ఆఫర్అందుబాటులో ఉంటుంది. -
ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరు.. తాజాగా హైదరాబాద్లో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్ఫోన్స్ బ్రాండ్ శామ్సంగ్ ప్రీమియం ఎక్స్పీరియెన్స్ స్టోర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేసింది. ఇనార్బిట్ మాల్లో 3,500 చదరపు అడుగులకుపైగా విస్తీర్ణంలో ఇది నెలకొంది. ఇప్పటికే కంపెనీకి ఢిల్లీ, బెంగళూరులో ఇటువంటివి ఒక్కో కేంద్రం ఉంది. దేశవ్యాప్తంగా 2023 డిసెంబర్కల్లా మొత్తం 15 ప్రీమియం ఎక్స్పీరియెన్స్ స్టోర్లను నెలకొల్పాలన్నది కంపెనీ లక్ష్యం. ఈ ఔట్లెట్లలో స్మార్ట్థింగ్స్, స్మార్ట్ఫోన్స్, ల్యాప్టాప్స్, ఆడియో, గేమింగ్, లైఫ్స్టైల్ టెలివిజన్స్ ప్రదర్శిస్తారు. -
అదిరిపోయే రంగులో శాంసంగ్ గెలాక్సీ ఎస్23.. ధర ఎంతంటే..
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 (Samsung Galaxy S23) కొత్త రంగులో వస్తోంది. లైమ్ కలర్ వేరియంట్ మే 16 నుంచి భారత్లో అమ్మకానికి వస్తోంది. గెలాక్సీ ప్రస్తుతం ఫాంటమ్ బ్లాక్, క్రీమ్, గ్రీన్, లావెండర్ రంగులలో అందుబాటులో ఉంది. ఇదీ చదవండి: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ భారీ కానుక.. రూ.64 కోట్లు! ధర, ఆఫర్లు శాంసంగ్ గెలాక్సీ ఎస్23 కొత్త లైమ్ కలర్ వేరియంట్ రెండు స్టోరేజ్ ఆప్షన్లలో వస్తుంది. 8/128 జీబీ ధర రూ. 74,999 కాగా 8/256 జీబీ వేరియంట్ ధర రూ. 79,999. ఈ కొత్త కలర్ వేరియంట్ ఆన్లైన్, ఆఫ్లైన్లో ప్రధాన రిటైల్ స్టోర్లలో లభిస్తుంది. గెలాక్సీ ఎస్23 కొనేవారికి పలు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ సీడీ లేదా బజాజ్ ఫిన్సర్వ్ ద్వారా 24 నెలల నో-కాస్ట్ ఈఎంఐని ఎంచుకునే వారు నెలకు కేవలం రూ. 3,125 ఈఎంఐతో గెలాక్సీ ఎస్23 ఫోన్ను సొంతం చేసుకోవచ్చు. అదనంగా ప్రస్తుత ఫ్లాగ్షిప్ ఫోన్ యజమానులు రూ.8,000 అప్గ్రేడ్ బోనస్ ప్రయోజనాన్ని పొందవచ్చు . దీన్న 24 నెలల బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ లేదా హెచ్డీఎఫ్సీ సీడీ పేపర్ ఫైనాన్స్తో కలపవచ్చు. అప్గ్రేడ్ బోనస్ను రూ.5 వేల బ్యాంక్ క్యాష్బ్యాక్తో కలపడం మరో ఆప్షన్. దీని వల్ల 8/128 జీబీ వేరియంట్ రూ. 61,999లకు, 8/256 జీబీ మోడల్ ధర రూ.66,999లకు తగ్గుతుంది. ఈ ఆఫర్లో భాగంగా హెచ్డీఎఫ్సీతో 9 నెలల నో కాస్ట్ ఈఎంఐని కూడా ఎంచుకోవచ్చు. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు గేమ్ మోడ్లో సూపర్ స్మూత్ 6.1 అంగుళాల FHD+ డైనమిక్ AMOLED 2X డిస్ప్లే స్నాప్డ్రాగన్ 8 Gen 2 చిప్సెట్ రియర్ ట్రిపుల్ కెమెరా సెటప్, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా, 50 MP వైడ్ కెమెరా, 10MP టెలిఫోటో కెమెరా సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్ కెమెరా 3,900mAh బ్యాటరీ, ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ 2.0 సపోర్ట్ 8జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఇదీ చదవండి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వర్చువల్ గర్ల్ఫ్రెండ్.. నెలకు రూ. 41 కోట్ల సంపాదన! -
త్వరలో వన్ ప్లస్3 5జీ ఫోన్ విడుదల, ధర ఎంతంటే?
5జీ స్మార్ట్ ఫోన్ ప్రియులకు శుభవార్త. భారత్లో భారత్ మార్కెట్లోకి వన్ ప్లస్ నార్డ్3 5జీ ఫోన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. 2021 జూలైలో మార్కెట్లో ఆవిష్కరించిన వన్ ప్లస్ నార్డ్ 2 ఫోన్ కొనసాగింపుగా ఈ ఫోన్ వస్తుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇదే నెలలో వన్ ప్లస్ నార్డ్3 5జీతో పాటు వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 2ఆర్ రిలీజ్ కానుంది. ఇక ఈ ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. 6.7 అంగుళాల 1.5 కే అమోలెడ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, ఆక్టాకోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 9000 5జీ ఎస్వోసీ చిప్ సెట్, 16 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్తో విడుదల కానుంది. వన్ ప్లస్ నార్డ్3 5జీ ఫోన్.. 64-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 8-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఆల్ట్రా వైడ్ లెన్స్, 2-మెగా పిక్సెల్ సెన్సర్ తోపాటు సెల్ఫీల కోసం 16-మెగా పిక్సెల్ సెన్సర్ ఉంటుందని భావిస్తున్నది. దీని ధర రూ.30,000-40,000 మధ్య పలుకుతుందని అంచనా. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు. -
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్-3 5జీ పై ఊహించని డిస్కౌంట్
సాక్షి, ముంబై: శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ఇపుడు ఐఫోన్ 13 కంటే తక్కువ ధరకే లభిస్తోంది. ఫ్లిప్కార్ట్లో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఇపుడు రూ.44,999కి అందుబాటులో ఉంది. ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డే సేల్లో భాగంగా గెలాక్సీ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్పై ఈ తగ్గింపు లభిస్తుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 1,250 వరకు తక్షణ తగ్గింపు అదనం. రూ. 95,999 ధరతో ఈ స్మార్ట్ఫోన్ను దాదాపు రెండు సంవత్సరాల క్రితం ఇండియాలో లాంచ్ చేసింది. ఇప్పటికే Android 13 OS అప్డేట్ను పొందిన దీనికి రానున్న Android 14 OSకి అప్డేట్ పొందొచ్చు. గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4, ఒప్పో ఎన్ 2 ఫ్లిప్ ధరలు రూ. 89,999కిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 తక్కువ ధరకు లభిస్తున్నట్టే. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ఫీచర్లు 1.9-అంగుళాల కవర్ డిస్ప్లే 6.7-అంగుళాల డిస్ప్లే స్నాప్డ్రాగన్ 888 చిప్సెట్ డ్యుయల్ 12-మెగాపిక్సెల్ కెమెరాలు రెండో డిస్ప్లే ప్యానెల్లో 10మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 3300mAh బ్యాటరీ -
శాంసంగ్ 32 అంగుళాల స్మార్ట్టీవీ: కేవలం రూ. 5వేలకే
సాక్షి, ముంబై: బడ్జెట్ ధరలో స్మార్ట్ టీవీ కావాలనుకుంటున్నారా? అయితే ఈ మండు వేసవిలో మీకో తీపి కబురు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ శాంసంగ్ 32-అంగుళాల టైజెన్ టీవీ భారీ ఆఫర్ అందిస్తోంది. 38 శాతం తగ్గింపుతో రూ. 13,999 తగ్గింపు ధరకే లిస్ట్ చేసింది. దీంతోపటు పలు డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ ద్వారా 23వేల రూపాయల టీవీని కేవలం రూ. 5,000లోపు సొంతం చేసుకోవచ్చు. (Fact Check: కన్యా సుమంగళ యోజన, అమ్మాయిలకు నెలకు రూ.4500?) 32 అంగుళాల శాంసంగ్ HD రెడీ LED స్మార్ట్ టైజెన్ టీవీ అసలు ధర దాదాపు రూ. 23,000. అయితే ఫ్లిప్కార్ట్లో ప్రస్తుతం రూ. 14వేలకే కొనుగోలు చేయవచ్చు. ఇది 2020లో లాంచ్ అయింది. బ్యాంక్ ఆఫర్లు ఎస్బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా 10 శాతం వరకు తగ్గింపు. దీనికి అదనంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ లావాదేవీల నుండి 500 రూపాయల తగ్గింపును పొందవచ్చు. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. (లగ్జరీ డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్ కొనుగోలు చేసిన సమంత! ధర ఎంతంటే?) ఎక్స్చేంజ్ ఆఫర్ ఈ శాంసంగ్ స్మార్ట్ టీవీని రూ. 5,000లోపు కొనుగోలు చేయాలనుకుంటే, బ్యాంక్ ఆఫర్తో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్ను ఎంచుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో రూ.11వేల ఎక్స్చేంజ్ తగ్గింపు అందుబాటులో ఉంది . శాంసంగ్ HD రెడీ LED స్మార్ట్ టైజెన్ టీవీ ఫీచర్లు 366 x 768 పిక్సెల్లతో 80 cm (32-అంగుళాల) LED HD రెడీ స్క్రీన్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ 60 Hz డాల్బీ డిజిటల్ ప్లస్ సపోర్ట్ ఇంకా నెట్ఫ్లిక్స్, డిస్నీ+హాట్స్టార్, సోనీ లివ్, ఏరోస్ నౌ, జియో సినిమా, గానా, బిగ్ ఫిక్స్, స్పాటిఫై, సన్ నెక్ట్స్ సహా ఇతర యాప్లను సపోర్ట్ చేస్తుంది.ఇన్బిల్ట్ Wi-Fi , 2 Dolby Digital Plus స్పీకర్లు లాంటి ఇందులో ఉన్నాయి. -
భారీ షాక్.. చాట్జీపీటీని బ్యాన్ చేసిన శాంసంగ్!
గత ఏడాది నవంబర్లో విడుదలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాఫ్ట్వేర్ చాట్జీపీటీ. ప్రపంచ దేశాల్ని వణుకు పుట్టిస్తున్న ఈ చాట్జీపీటీని బ్యాన్ చేసే దేశాల సంఖ్యతో పాటు పలు విద్యా సంస్థలు, టెక్ కంపెనీలు చేరిపోయాయి. తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ చాట్జీపీటీని బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అత్యాధునిక సాంకేతికతను వినియోగంలోకి రాకుండా అడ్డుకున్న జాబితాలో శాంసంగ్ చేరింది. చాట్జీపీటీని బ్యాన్ చేస్తూనే.. ఏఐ ఆధారిత టూల్ను బ్యాన్ చేసినట్లు శాంసంగ్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఉద్యోగులకు ఓ మెమోను జారీ చేసింది. చాట్జీపీటీ వంటి ఏఐ టూల్స్ ఇంట్రర్నల్గా, ఎక్స్ట్రర్నల్గా వృద్ది చెందుతున్నాయి. వినియోగం, సమర్థత విషయంలో తిరుగు లేదు. కానీ అదే సమయంలో ఏఐ’ వల్ల ప్రమాదాలు అదే స్థాయిలో ఉన్నాయని అందులో పేర్కొంది. అయితే చాట్జీపీటీ వినియోగాన్ని నిలిపివేస్తూ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఉద్యోగుల ఉత్పాదకత, సామర్థ్యాన్ని పెంచుతూ ఏఐని సురక్షితంగా వినియోగించేలా..అందుకు కావాల్సిన భద్రతా చర్యలపై సమీక్ష నిర్వహిస్తున్నాం. ఈ చర్యలు సిద్ధమయ్యే వరకు ఏఐ వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. డేటా లీక్ చేసిన ఇంజినీర్లు శాంసంగ్ తమ సెమీ కండక్టర్ విభాగంలో ప్రోగ్రామింగ్ సాయంతో ఏదైనా సమస్యను పరిష్కరించేలా చాట్జీపీటీని వినియోగించేలా అనుమతిచ్చింది. సెమీ కండక్టర్ ప్రాజెక్ట్పై పనిచేస్తున్న ఇంజినీర్లు ప్రోగ్రాం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలంటే.. ఆ సమస్య ఏంటో చాట్ జీపీటికి వివరించి.. ఆ గండం నుంచి గట్టెక్కేందుకు ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలో ఆ విభాగంలో పనిచేసే ఓ ఉద్యోగి కొత్త ప్రోగ్రామ్ గురించి సోర్స్కోడ్ కావాలని చాట్బాట్ను కోరాడు. అందుకు శాంసంగ్ సెమీకండక్టర్కు సంబంధించిన అత్యంత సున్నితమైన డేటాను చాట్జీపీటీకి షేర్ చేశాడు. అంతేకాదు సంస్థ అంతర్గతంగా హార్డ్వేర్ విభాగంపై తయారు చేసిన నోట్స్ను సైతం చాట్జీపీటీకి అందించాడు. ఇలాంటి పొరపాట్లు నెల రోజుల్లో మూడు సార్లు జరగడంతో శాంసంగ్ దిద్దు బాటు చర్యలకు ఉపక్రమించింది. చాట్జీపీటీ తరహాలాంటి టూల్స్ వినియోగించబోమని స్పష్టం చేసింది. ఏఐ చాలా ప్రమాదం తాజాగా, ఏఐ ప్రభావంపై ఏఐ గాడ్ ఫాదర్గా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన జెఫ్రీ హింటన్ వార్నింగ్ ఇచ్చారు. గూగుల్లో పని చేసే సమయంలో ఏఐపై మాట్లాడడం సరికాదని, వయసు రిత్యా సంస్థలో పనిచేయడం సమంజసం కాదన్నారు. కాబట్టే గూగుల్ను బయటకు వచ్చేశారు. అనంతరం ఓ మీడియా ఇంటర్వ్యూలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్స్ (ఏఐ) టెక్నాలజీ భవిష్యత్లో మరింత ప్రమాద కరంగా మారనుందన్నారు. తాను చేసిన వ్యాఖ్యలు గూగుల్ని ఎలా ప్రభావితం చేస్తుందో అనే అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఏఐ గురించి ప్రస్తావిస్తున్నట్లు ట్వీట్లో తెలిపారు. చదవండి👉 శాంసంగ్ కొంపముంచిన చాట్జీపీటీ.. లీకైన రహస్య సమాచారం -
భారీ నష్టాల్లో శ్యాంసంగ్..రికార్డు స్థాయిలో పడిపోయిన సేల్స్
-
రూ. 32,999 ఫోన్ కేవలం రూ. 2,999కే సొంతం చేసుకోండిలా..!
ఆధునిక కాలంలో స్మార్ట్ఫోన్లను వినియోగించేవారి సంఖ్య భారీగా పెరిగిపోతోంది. అయితే ధరలు ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని ఖరీదైన మొబైల్ ఉపయోగించడానికి కొంత మంది వెనుకడుగు వేస్తున్నారు. అయితే ఇప్పుడు మార్కెట్లో శాంసంగ్ రూ. 32,999 ధర వున్నా మొబైల్ ఫోన్ కేవలం రూ. 2,999కే లభిస్తుంది. అయితే దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయి. శాంసంగ్ గెలాక్సీ ఎం53 మొబైల్ మార్కెట్లో రూ. 32,999. కానీ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 2,999కి కొనుగోలు చేయవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉండటం వల్ల మీకు రూ. 25,000 వరకు ఆదా చేయవచ్చు. అది కూడా మీరు ఎక్స్ఛేంజ్ చేయాలనుకునే మొబైల్ ఫోన్ మంచి కండిషన్లో ఉండాలి. అంతే కాకుండా మీ మొబైల్ బ్రాండ్ మీద కూడా ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఆధార పడి ఉంటుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కాకుండా కొనుగోలు చేయాలనుకుంటే అసలు ధరలో 20 శాతం తగ్గింపు లభిస్తుంది. కావున మీరు రూ. 32,000 ఫోన్ రూ. 27,999కి లభిస్తుంది. HDFC క్రెడిట్ కార్డు ద్వారా కొనాలకునేవారు రూ. 1,500 డిస్కౌంట్ పొందవచ్చు. మొత్తం మీద మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా కొనుగోలు చేస్తే మీకు రూ. 2999కే లభిస్తుంది. కొనుగోలుదారుడు తప్పకుండా ఈ షరతులను గుర్తుంచుకోవాలి. (ఇదీ చదవండి: డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని కొత్త ఎలక్ట్రిక్ బైక్ - ధర రూ. 55,555 మాత్రమే!) శాంసంగ్ గెలాక్సీ ఎం53 మొబైల్ మంచి డిజైన్ కలిగి అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. ఈ మొబైల్ 120 Hz రిఫ్రెష్ రేట్ 6.7 ఇంచెస్ సూపర్ అమోటెడ్ డిస్ప్లే కలిగి, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ పొందుతుంది. ఇందులోని 500 mAh బ్యాటరీ 25 వాట్ ఫాస్ట్ ఛార్జర్కి సపోర్ట్ చేస్తుంది. గెలాక్సీ ఎం53 మొబైల్ అన్ని విధాలుగా వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. -
ఆధునిక ఫీచర్లతో విడుదలకానున్న కొత్త స్మార్ట్ఫోన్ - వివరాలు
భారతదేశంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త మొబైల్ ఫోన్స్ లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే శాంసంగ్ కంపెనీ త్వరలో 'గెలాక్సీ ఎం14 5జీ' అనే మొబైల్ విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఈ లేటెస్ట్ స్మార్ట్ఫోన్ డిజైన్, ఫీచర్స్ వంటి ఇతర వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ ఆధునిక ఫీచర్స్ కలిగి ఉన్న అద్భుతమైన మొబైల్ ఫోన్. ఇది 6000 mAh బ్యాటరీ, 5nm ప్రాసెసర్తో 50MP ట్రిపుల్ కెమెరా కలిగి ఉంది. కంపెనీ ఈ స్మార్ట్ఫోన్ను 'మూమెంట్స్ మాన్స్టర్' అని పేర్కొంది. ఇది తక్కువ వెలుతురులో కూడా బ్లర్-ఫ్రీ, ఆకర్షణీయమైన ఫోటోలను క్యాప్చర్ చేసే సామర్థ్యం కలిగి ఉంది. కొత్త శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ మెరుగైన పనితీరుని అందిస్తుంది. అదే సమయంలో గేమర్లు, మల్టీ టాస్కర్లు వంటి వాటికోసం ఇది చాలా ఖచ్చితమైన, వేగవంతంగా పనిచేస్తుంది. యాప్ల ద్వారా వేగంగా రన్ చేయడమే కాకుండా క్షణాల్లో కంటెంట్ను డౌన్లోడ్ చేయడానికి కూడా ఇది ఎంతగానో సహకరిస్తుంది. (ఇదీ చదవండి: ఈ ఆఫర్తో మహీంద్రా థార్ ఇంటికి తీసుకెళ్లండి.. ఇదే మంచి తరుణం!) గేమ్ ఆడటానికి ప్రయత్నిస్తున్నప్పుడు, అదే సమయంలో ముఖ్యమైన సందేశానికి రిప్లే ఇచ్చినప్పుడు, ఈ అద్భుతమైన స్మార్ట్ఫోన్ సామర్థ్యాలు తప్పకుండా మిమ్మల్ని ముగ్దుల్ని చేస్తాయి. కంపెనీ ఈ స్మార్ట్ఫోన్ ధరలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఈ ధరలు లాంచ్ సమయంలో అధికారికంగా వెల్లడవుతాయి. -
మేడిన్ ఇండియా ఐఫోన్ల ఎగుమతులు రూ.45,000 కోట్లు
న్యూఢిల్లీ: దేశం నుంచి మొబైల్ ఫోన్ల ఎగుమతులు 2022–23లో రూ.90,000 కోట్లు నమోదయ్యాయి. ఇందులో ఐఫోన్లను తయారు చేస్తున్న యాపిల్ వాటా ఏకంగా 50 శాతం ఉందని ఇండియా సెల్యులార్, ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) తెలిపింది. శామ్సంగ్ రూ.36,000 కోట్ల ఎగుమతులతో 40 శాతం వాటా కైవసం చేసుకుంది. 2021–22తో పోలిస్తే మొబైల్స్ ఎక్స్పోర్ట్స్ రెండింతలయ్యాయి. భారత్ నుంచి విదేశాలకు చేరిన ఎలక్ట్రానిక్స్ 58 శాతం అధికమై గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,85,000 కోట్లకు చేరుకున్నాయి. మొబైల్స్ ఎగుమతుల విషయంలో గత ఆర్థిక సంవత్సరానికి లక్ష్యంగా చేసుకున్న రూ.75,000 కోట్లను అధిగమించడం ఆనందంగా ఉందని ఐసీఈఏ చైర్మన్ పంకజ్ మొహింద్రూ తెలిపారు. భారత్ నుంచి విదేశాలకు చేరుతున్న మొత్తం ఎలక్ట్రానిక్స్లో మొబైల్స్ వాటా 46 శాతంగా ఉంది. -
Tecno Phantom V Fold వచ్చేసింది: అతి తక్కువ ధరలో, అదిరిపోయే పరిచయ ఆఫర్
సాక్షి, ముంబై: భారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లో, టెక్నో ఫాంటమ్ వీ ఫోల్డ్ లాంచ్ అయింది. స్మార్ట్ఫోన్ దిగ్గజం టెక్నో ఫాంటమ్ నుంచి భారత మార్కెట్లో ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ను దేశంలోనే అతి చవకైనదిగా కంపెనీ ప్రకటించింది ఆకట్టుకునే ప్రీమియం డిజైన్, వర్చువల్లీ క్రీజ్ ఫ్రీ ఫోల్డబుల్ మెయిన్ డిస్ప్లేతో కస్టమర్లను ఆకట్టుకుంటుందని కంపెనీ తెలిపింది. టెక్నో ఫాంటమ్ వీ ఫోల్డ్ భారత మార్కెట్లో రూ.88,888 ప్రారంభ ధరతో విడుదలంది. సింగిల్ వేరియంట్లో మాత్రమే అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ఫోన్పై పరిచయ ఆఫర్ కూడా ఉంది. స్పెషల్ డిస్కౌంట్తో ధర రూ.77,777 వద్ద ఏప్రిల్ 12న అందుబాటుల ఉంది. దీంతో పాటు హెచ్డీబీ బ్యాంక్ కార్డ్లపై రూ. 5వేల డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే రెండు సంవత్సరాల వారంటీతో పాటు, ఫాంటమ్ వీ ఫోల్డ్ రూ. 5,000 విలువైన ఉచిత ట్రాలీ బ్యాగ్, కొనుగోలు చేసిన ఆరు నెలల్లోపు వన్-టైమ్ ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్, స్టాండ్తో కూడిన ఉచిత ఫైబర్ ప్రొటెక్టివ్ కేస్ లభించనుంది. ఫాంటమ్ వీఫోల్డ్కి గట్టి పోటీగా భావిస్తున్న శాంసంగ్ గెలాక్సీ Z Fold 4 ధర రూ. 1,54,998గాఉంది. ఫాంటమ్ వీఫోల్డ్స్పెసిఫికేషన్స్: 6.42-అంగుళాల LTPO, ఔటర్ AMOLED డిస్ప్లేను. ప్రాథమిక లోపలి స్క్రీన్ 2296 X 2000 పిక్సెల్ల రిజల్యూషన్తో 7.65-అంగుళాల 2K LTPO AMOLED ఫోల్డబుల్ డిస్ప్లే. ఫోన్ కంటెంట్ ఆధారంగా 120Hz రిఫ్రెష్ రేట్ వరకు వేరియబుల్తో వస్తుంది.ఏరోస్పేస్-గ్రేడ్ ఇన్నోవేటివ్ డ్రాప్-షేప్ కీ ఫీచర్లు ఉన్నాయని పేర్కొంది. స్టేబుల్-రేషియో రొటేట్, స్లైడ్ టెక్, రివర్స్ స్నాప్ స్ట్రక్చర్ను కలిగి ఉంది. ఫోల్డ్, క్రీజ్-ఫ్రీ ఎక్స్పీరియన్స్ అందిస్తుందని టెక్నో కంపెనీ చెప్పింది. హుడ్ కింద MediaTek ఫ్లాగ్షిప్ డైమెన్సిటీ 9000+ చిప్సెట్ ఉంది. ఈ చిప్సెట్ గరిష్టంగా 12GB LPDDR5 RAM, 512GB UFS 3.1 స్టోరేజీతో లభ్యం. ట్రిపుల్ రియర్ కెమెరా 50 ఎంపీ ప్రైమరీ కెమెరా , 13ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్, 50ఎంపీ 2x పోర్ట్రెయిట్ కెమెరాతో వచ్చింది. అలాగే ఔటర్ డిస్ప్లేలో 32ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఇన్నర్ ఫోల్డబుల్ డిస్ప్లేలో 16ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ కెమెరాలున్నాయి. ఇన్-డిస్ప్లే ఫింగర్ప్రింట్ సెన్సార్ సెక్యూరిటీ , చక్కటి ఆడియో అనుభవం కోసం స్టీరియో స్పీకర్లను పొందుపరిచింది. (బైక్ కొనాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్: కీవే బైక్స్పై భారీ ఆఫర్) కాగా టెక్నో ఇటీవల MWC 2023లో తన తొలి ఫోల్డింగ్ స్మార్ట్ఫోన్ ఫాంటమ్వ వీ ఫోల్డ్ను ప్రదర్శించిన సంగతి తెలిసిందే. తాజగా కంపెనీ ఎట్టకేలకు దీనిని భారతదేశంలో లాంచ్ చేసింది. ప్రస్తుతం ఫాంటమ్ వీ ఫోల్డ్ దేశంలో అత్యంత సరసమైన ఫుల్-స్క్రీన్ ఫోల్డింగ్ స్మార్ట్ఫోన్లలో ఒకటిగా నిలిచింది. ( ఇదీ చదవండి: మహీంద్రా అండ్ మహీంద్రా మాజీ చైర్మన్ కేషుబ్ మహీంద్రా కన్నుమూత) -
శాంసంగ్ కొంపముంచిన చాట్జీపీటీ!
ప్రముఖ సౌత్ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్కు చెందిన రహస్య సమాచారం చాట్జీపీటీ చేతికి చిక్కింది. కంపెనీకి చెందిన రహస్య సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుగా శాంసంగ్ ఉద్యోగులు చాట్జీపీటీకి అనుమతి ఇచ్చారు. ఇలా 20 రోజుల్లో మూడు సార్లు కాన్ఫిడెన్షియల్ డేటా చాట్జీపీటీకి యాక్సిస్ ఇవ్వడంతో తప్పిదానికి కారణమైన ఉద్యోగుల్ని సంస్థ తొలగించినట్లు తెలుస్తోంది. కానీ ఉద్యోగుల తొలగింపుపై శాంసంగ్ స్పందించలేదు. సెమీ కండక్టర్ విభాగానికి చెందిన ఉద్యోగులకు ఆఫీస్ వర్క్ విషయంలో ఏదైనా సమస్యలు తలెత్తి వాటిని పరిష్కరించేందుకు వీలుగా చాట్జీపీటీని వినియోగించేందుకు శాంసంగ్ అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో ఆ విభాగంలో పనిచేసే ఓ ఉద్యోగి కొత్త ప్రోగ్రామ్ గురించి సోర్స్కోడ్ కావాలని చాట్బాట్ను కోరాడు. అందుకు శాంసంగ్ సెమీకండక్టర్కు సంబంధించిన అత్యంత సున్నితమైన డేటాను చాట్జీపీటీకి షేర్ చేశాడు. ఈ అంశంపై శాంసంగ్ సీఈవో హాన్ జోంగ్-హీ ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారని ‘మై ద రిజిస్టిర్’ నివేదిక తెలిపింది. చాట్జీపీటీ వినియోగం విషయంలో సిబ్బంది అలసత్వం వహించరాదని వార్నింగ్ ఇచ్చినట్లు పేర్కొంది. అంతేకాదు చాట్జీపీటీ లాంటి థర్డ్ పార్టీ చాట్బాట్ల అవసరం లేకుండా సొంత చాట్బాట్లను తయారు చేసే పనిలో శాంసంగ్ నిమగ్నమైందని రిపోర్ట్ హైలెట్ చేసింది. -
5జీ ఫోన్ల విక్రయాలపై శాంసంగ్ మరింత దృష్టి.. గెలాక్సీ ఎ54, ఎ34 విడుదల
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్ఫోన్ అమ్మకాల్లో 5జీ ఫోన్ల వాటాను మరింతగా పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నట్లు శాంసంగ్ ఇండియా జీఎం అక్షయ్ రావు తెలిపారు. ప్రస్తుతం విలువపరంగా వీటి వాటా 61 శాతంగా ఉందని 2023లో దీన్ని 75 శాతానికి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు గెలాక్సీ ఎ సిరీస్లో రెండు కొత్త 5జీ స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించిన సందర్భంగా వివరించారు. వీటిలో ఎ54, ఎ34 మోడల్స్ ఉన్నాయి. (రియల్మీ సి–55.. ఎంట్రీ లెవెల్ విభాగంలో సంచలనం!) ఎ34 ధర రూ. 30, 999–రూ. 32,999గా ఉండగా, ఎ54 రేటు రూ. 38,999–40,999గా ఉంటుందని అక్షయ్ రావు చెప్పారు. ఆఫర్ కింద రూ. 3,000 క్యాష్బ్యాక్ పొందవచ్చు. 8జీబీ+128 జీబీ లేదా 256 వేరియంట్లలో లభించే ఈ ఫోన్లకు 4 వరకు ఆండ్రాయిడ్ అప్డేట్లు, 5 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్లు పొందవచ్చు. తమ పోర్ట్ఫోలియోలో ప్రస్తుతం 25 స్మార్ట్ఫోన్లు ఉండగా .. వీటిలో 5జీ మోడల్స్ 16 ఉన్నాయని అక్షయ్ రావు పేర్కొన్నారు. వీటి ధర రూ. 14,000 నుంచి ప్రారంభమై రూ. 1.60 లక్షల వరకూ ఉందని చెప్పారు. (మోటరోలా జీ13 వచ్చేసింది.. ధర తక్కువే!) -
ట్రై-ఫోల్డ్ స్మార్ట్ఫోన్: శాంసంగ్ మరో వినూత్న ఆవిష్కారం!
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ మరో కీలక ఆవిష్కారానికి సిద్ధమవుతోంది. మూడు ఫోల్డింగ్స్తో ఒక స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసేందుకు సన్నద్ధమవుతోందిట. టిప్స్టర్ యోగేష్ బ్రార్ షేర్ చేసిన వివరాల ప్రకారం, శాంసంగ్ ట్రై-ఫోల్డ్ డిస్ప్లేతో ఒక స్మార్ట్ఫోన్ను లాంచ్ చేయనుంది. మరోవైపు ఈ ఏడాది చివర్లో లాంచ్ చేయనుందని భావిస్తున్న ఫ్లాగ్షిప్ గెలాక్సీ S23 సిరీస్ స్మార్ట్ఫోన్ 'ఫ్యాన్ ఎడిషన్’ శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ సంస్థ డెవలప్ మెంట్లో లేదని టిప్స్టర్ తెలిపింది. మూడు మడతలతో కాన్సెప్ట్ డిస్ప్లే పిక్స్ను షేర్ చేసింది. గతంలో CES 2022లో ట్రై-ఫోల్డ్ డిస్ప్లేలతో కాన్సెప్ట్ పరికరాలను ప్రదర్శించింది. జెడ్ సిరీస్ ఫోల్డబుల్ ఫోన్ల మెరుగైన వెర్షన్పై పని చేస్తోందనీ, ముఖ్యంగా జెడ్ ఫోల్డ్ 5 గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5గా తోపాటు మూడు మడతల ఫోన్ తీసుకు రానుందని తెలిపింది. ఫ్లెక్స్ ఎస్, ఫ్లెక్స్ జీ పేరుతో ఇవి రానున్నాయని అంచనా. కాగా జనవరిలో Samsung CES 2023లో 360-డిగ్రీల రొటేటింగ్ స్క్రీన్తో “ఫ్లెక్స్ ఇన్ అండ్ అవుట్” డిస్ప్లే కోసం ప్రోటోటైప్ను ప్రదర్శించింది. డిస్ప్లే లోపలికి బుక్ కవర్లా, లేదా వార్తాపత్రికలా బయటకి మడవగలదు. సాఫ్ట్వేర్ ఇంటర్ఫేస్తో ఫంక్షనల్ “ఫ్లెక్స్ ఇన్ అండ్ అవుట్” డిస్ప్లే జోడిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. There is no Galaxy S23 FE in the development chain unlike what the recent rumours have been pointing.. Samsung is instead working on the improved Z Fold 5 & Flip 5 along with a Tri-Fold that might finally ship this year FE fans should look elsewhere... — Yogesh Brar (@heyitsyogesh) March 24, 2023 -
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ , అదిరిపోయే లాంచింగ్ ఆఫర్ కూడా!
సాక్షి,ముంబై: శాంసంగ్ కొత్త 5జీ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. 5nm ప్రాసెసర్ , 6000 mAh బ్యాటరీ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ స్మార్ట్ఫోన్ను ఈరోజు (మార్చి 24) భారత మార్కెట్లో విడుదల చేసింది. 5జీ సెగ్మెంట్లో మాత్రమే వస్తోంది. ఈ కనెక్టివిటీ కోసం 13 బ్యాండ్లను సపోర్ట్ చేస్తుందీ మొబైల్. అలాగే Exynos 1330 చిప్సెట్తో వస్తుందని, ఇందులోన బిగ్ బ్యాటరీ 2 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. పరిచయ ఆఫర్గా శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీను ఎంపిక చేయబడిన బ్యాంక్ కార్డ్ల కొనుగోళ్లపై 4 జీబీ ర్యామ్ +128 జీబీ స్టోరేజ్ కోసం రూ. 12,990, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 14,490కే అందిస్తోంది. మార్చి 30 మధ్యాహ్నం 12 గంటలనుంచి సేల్ మొదలవుతుంది. ఫ్లిప్కార్ట్, శాంసంగ్ తోపాటు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో త్రి కలర్స్లో అందుబాటులో ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ స్పెసిఫికేషన్స్ 6.6-అంగుళాల పూర్తి HD+ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్, Android 13 ఆధారంగా One UI 5 50ఎంపీ ప్రధాన కెమెరా 2MP మాక్రో కెమెరా 13 ఎంపీ సెల్ఫీ కెమెరా . 6000 mAh బ్యాటరీ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అతేకాదు గరిష్టంగా 2 తరాల OS అప్గ్రేడ్లను 4 సంవత్సరాల వరకు భద్రతా అప్డేట్లను అందిస్తుంది. ఫైనాన్షియల్ అప్లికేషన్లు, వ్యక్తిగత ఐడీలు, ఇతర రహస్య పత్రాలను స్టోర్ చేసుకునేందుకు ఆల్-ఇన్-వన్ అప్లికేషన్ వాయిస్ ఫోకస్ ఫీచర్ , Samsung Walletకి మద్దతు కూడా ఉంది. -
శాంసంగ్ గెలాక్సీ 5జి మొబైల్స్పై మైండ్ బ్లోయింగ్ ఆఫర్స్: ఈ రోజే లాస్ట్
భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త శాంసంగ్ గెలాక్సీ ఏ54 5జీ, ఏ34 5జీ మొబైల్స్ ఎట్టకేలకు సేల్కు వచ్చాయి. కంపెనీ ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్స్ మీద ప్రత్యేకమైన ఆఫర్స్ కూడా తీసుకువచ్చింది. ఈ 5జి మొబైల్స్ మునుపటి మోడల్స్ కంటే కూడా ఆధునిక ఫీచర్స్ పొందుతాయి. కొత్త శాంసంగ్ గెలాక్సీ ఏ54 5జీ & ఏ43 5జీ రెండూ కూడా ఈ రోజు (మార్చి 23) నుంచి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఏ54 5జీ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ కలిగిన బేస్ వేరియంట్ ధర రూ. 38,999, కాగా 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ కలిగిన టాప్ వేరియంట్ ధర రూ. 40,999. శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ ధరల విషయానికి వస్తే, ఇందులో 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ కలిగిన బేస్ మోడల్ ధర రూ. 30,999 కాగా, టాప్ వేరియంట్ (8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్) ధర రూ.32,999. వీటిని ఇప్పుడు కంపెనీ అధికారిక వెబ్సైట్లో కొనుగోలు చేయవచ్చు. లేదా ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్లలో కూడా తీసుకోవచ్చు. (ఇదీ చదవండి: భయం గుప్పెట్లో ఉద్యోగులు.. నీటి బుడగలా ఉద్యోగాలు: భారత్లోనూ..) శాంసంగ్ గెలాక్సీ ఏ54 5జీ 6.4 ఇంచెస్ డిస్ప్లే కలిగి వెనుక 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 5 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరాలు పొందుతుంది. అదే సమయంలో ఏ34 5జీ మోడల్ 6.6 ఇంచెస్ డిస్ప్లే కలిగి, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు పొందుతుంది. (ఇదీ చదవండి: ఇది కదా సక్సెస్ అంటే: ఒకప్పుడు ట్యూషన్ టీచర్.. ఇప్పుడు వంద కోట్లకు అధిపతి!) కంపెనీ ఈ లేటెస్ట్ మొబైల్స్ కొనుగోలు మీద ఆఫర్స్ కూడా అందిస్తోంది, ఇందులో భాగంగానే శాంసంగ్ వెబ్సైట్లో కొనుగోలు చేస్తే రూ.1000 వోచర్, ICICI క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా రూ. 3,000 డిస్కౌంట్ పొందవచ్చు. అంతే కాకుండా సుమారు రూ. 5,999 విలువైన గెలాక్సీ బడ్స్ లైవ్ టీడబ్ల్యూఎస్ను కేవలం రూ. 999కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్స్ అన్నీ కూడా కేవలం ఈ రోజు అర్ధరాత్రి (మార్చి 24) వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. -
భారీగా మొబైల్ ఫోన్ల ఎగుమతులు
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ ఎగుమతులు భారీ వృద్ధిని చూస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి నాటికి 9.5 బిలియన్ డాలర్లకు ఎగుమతులు పెరిగాయి. ఇందులో యాపిల్ ఫోన్ల ఎగుమతులే సగం విలువను ఆక్రమించగా, 40 శాతం శామ్సంగ్ ఉత్పత్తులు ఉన్నాయి. ఈ వివరాలను మొబైల్ తయారీ పరిశ్రమ సంఘం ఐసీఈఏ తెలిపింది. జనవరి నాటికి మొబైల్ ఫోన్ల ఎగుమతులు 8.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని, ఫిబ్రవరి చివరికి 9.5 బిలియన్ డాలర్లకు చేరినట్టు అంచనా వేస్తున్నామని ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రా నిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి 10 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం (2021–22)లో దేశం నుంచి 5.5 బిలియన్ డాలర్ల విలువైన మొబైల్ ఫోన్ల ఎగుమతులు నమోదయ్యాయి. -
Samsung Galaxy Z Fold 5: మడత అంటే ఇదీ.. పర్ఫెక్షన్ అంటే ఇదీ!
రకరకాల మోడళ్లతో స్మార్ట్ ఫోన్ బిజినెస్లో దూసుకుపోతున్న శాంసంగ్.. త్వరలో విడుదల చేయనున్న గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 మడత ఫోన్కు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ స్మార్ట్ఫోన్ మడత కీలు(హింజ్) ఇది 2 లక్షల మడతలను తట్టుకోగలదని తెలిసింది. ప్రస్తుతం ఈ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 వాటర్డ్రాప్ హింజ్ డిజైన్ ఆఖరి పరీక్ష జరుపుకోబోతోందని 9టు5గూగుల్ అనే సంస్థ పేర్కొంది. ఈ ఫోన్ కొత్త ఫీచర్ ప్రత్యేకత ఏంటంటే ఎంత మడిచినా స్క్రీన్పై ఎటువంటి తేడా ఉండదు. అలాగే మడతపెట్టినప్పుడు కూడా గ్యాప్ కనిపించదు. ఇక ఫోన్ కొత్త డిజైన్ మునుపటి గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4తో పోలిస్తే సన్నగా ఉంటుంది.మ ఇదీ చదవండి: ఓయో ఫౌండర్ రితేష్ అగర్వాల్ పెళ్లి.. ఆహ్వానితుల్లో అత్యంత ప్రముఖులు! ఎవరెవరు వస్తున్నారో తెలుసా? త్వరలో లాంచ్ కానున్న ఈ ఫోన్కు సంబంధించిన మడత కీలు(హింజ్), డిస్ప్లే ప్యానెల్ 2 లక్షల నుంచి 3 మడతల వరకు తట్టకునేలా శాంసంగ్ విశ్వసనీయత పరీక్ష నిర్వహిస్తున్నట్లు 9టు5గూగుల్ నివేదిక పేర్కొంది. శాంసంగ్ జెడ్ ఫోల్డ్ 5 డ్రాప్లెట్ స్టైల్ హింజ్ను కలిగి ఉంటుందని టిప్స్టర్ ఐస్ యూనివర్స్ గత జనవరిలో తెలిపింది. అది ఫోన్ డిస్ప్లే క్రీజ్ను తగ్గిస్తుందని వివరించింది. దీనికి 108 ఎంపీ ప్రైమరీ రియర్ కెమెరా, అంతర్నిర్మిత స్టైలస్ పెన్ (ఎస్ పెన్) స్లాట్ను కలిగి ఉంటుందని గతంలో పుకారు వచ్చింది. -
Samsung Galaxy S22 5G: భారీ ఆఫర్, ఇక హోలీనే!
సాక్షి,ముంబై: సౌత్కొరియా దిగ్గజం శాంసంగ్ గెలాక్సీఎస్22 5జీ స్మార్ట్ఫోన్పై భారీఆఫర్ అందిస్తోంది. 33 శాతం తగ్గింపుతో పాటు, నోకాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను అందిస్తోంది. గెలాక్సీ ఎస్22 5జీ అసలు ధర రూ.85,999గ ఉండగా, తాజా ఆఫర్లో అమెజాన్లో కేవలం రూ.57,998 కి కొనుగోలు చేయవచ్చు. రూ.28వేల తగ్గింపుతోపాటు, ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. గత ఏడాది లాంచ్ చేసిన ఎస్ 22 సిరీస్లో ఇదే ఎఫర్డ్బుల్ ప్రైస్ డివైస్గా పేరొందింది. గెలాక్సీ ఎస్ 22 5జీ ఫీచర్లు 6.1 అంగుళాల డైనమిక్ AMOLED డిస్ప్లే 1080×2340 పిక్సెల్స్ రిజల్యూషన్ 120 Hz రిఫ్రెష్ రేట్ Qualcomm Snapdragon 8 Gen 1 octa-core ప్రాసెసర్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ 50+12+10 ఎంపీ ట్రిపుల్ రియల్ కెమెరా 10 ఎంపీ ఫ్రంట్ కెమెరా 3700 mAh బ్యాటరీ -
సామ్సంగ్ గెలాక్సీ ఎస్23 ఆల్ట్రా
సైజ్: 6.8 అంగుళాలు బరువు: 234 గ్రా. రిజల్యూషన్: 1440x3088 పిక్సెల్స్ వోఎస్: ఆండ్రాయిడ్ 13, వన్ యూఐ 5.1 మెమోరీ: 256జీబి 8జీబి ర్యామ్ 256జీబి 12జీబి ర్యామ్ 512 జీబి 12జీబి ర్యామ్ కలర్స్: ఫాంటమ్ బ్లాక్, గ్రీన్, క్రీమ్, స్కైబ్లూ, రెడ్, బీఎండబ్ల్యూ ఎం ఎడిషన్ వాట్సాప్ ‘ఫొటో క్వాలిటీ’ ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లు ఒరిజినల్ క్వాలిటీతో, కంప్రెస్డ్ ఫార్మట్లో ఫొటోలను పంపి డాటా సేవ్ చేసుకోవచ్చు. యూజర్లు తమ వాట్సాప్ సెట్టింగ్స్ మార్చుకోవడం ద్వారా ఈ ఫీచర్ను ఉపయోగించుకోవచ్చు. వాట్సాప్లో (ఐఫోన్) ఒరిజినల్ క్వాలిటీ ఫొటోలు సెండ్ చేయడానికి... ► వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ ఐకాన్ ట్యాప్ చేయాలి. ► స్టోరేజ్ అండ్ డాటా–ట్యాప్ ► మీడియా అప్లోడ్ క్వాలిటీ–ట్యాప్ ► ఆటో–సెలెక్ట్ -
శాంసంగ్ బీఎండబ్ల్యూ స్పెషల్ ఎడిషన్.. 1000 ఫోన్లే..
శాంసంగ్ ఇటీవలే తమ ప్రతిష్టాత్మక గెలాక్సీ ఎస్23 అల్ట్రా మోడల్ స్మార్ట్ ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. తాజాగా ఇందులో మరో స్పెషల్ ఎడిషన్ను తీసుకొచ్చింది. దక్షిణ కొరియాకు చెందిన ఈ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ తమ ఖరీదైన గెలాక్సీ ఎస్23 అల్ట్రా సిరీస్లో బీఎండబ్ల్యూ ఎడిషన్ను ఆవిష్కరించింది. ఈ స్పెషల్ ఎడిషన్కు బీఎండబ్ల్యూ ఎం ఈ30 కారుకు గుర్తుగా శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా బీఎండబ్ల్యూ ఎం పేరు పెట్టారు. 1986లో ఈ కారు లాంచ్ అయింది. ఇది లిమిటెడ్ ఎడిషన్ అని, కేవలం 1000 ఫోన్లు మాత్రమే విక్రయిస్తామని కంపెనీ పేర్కొంది. అది కూడా దక్షిణ కొరియాలో మాత్రమే ఎస్కే టెలికాం సంస్థ ద్వారా ఈ స్పెషల్ ఎడిషన్ ఫోన్లు లభిస్తాయి. కొత్తగా విడుదల చేసిన శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా బీఎండబ్ల్యూ ఎం ఫోన్కు వర్టికల్ కిడ్నీ గ్రిల్, బీఎండబ్ల్యూ ఎం కారు బోనెట్ వంటి దృఢమైన కేస్ ఉంటుంది. ఆకర్షణీయమైన బీఎండబ్ల్యూ ఎం కారు రంగులతో ఇందులో యానిమేషన్ ఫీచర్ ఇచ్చారు. రిమూవబుల్ కీరింగ్, ఇంటర్చేంజబుల్ బీఎండబ్ల్యూ లోగోలు అదనపు ఆకర్షణ. దీంతో పాటు చిన్నపాటి ఎయిర్ కంప్రెషర్, మెటల్ లోగో ఇచ్చారు. ఈ ఫోన్ ధర 17.27 లక్షల సౌత్ కొరియన్ వాన్లు అంటే ఇండియన్ కరెన్సీలో రూ.1,12,790. (ఇదీ చదవండి: రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఫోన్లు) -
రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఫోన్లు
హైదరాబాద్: దక్షిణ కొరియా శాంసంగ్ ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన గెలాక్సీ ఎస్23 ఫోన్లు రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో లభిస్తాయని కంపెనీ వెల్లడించింది. ‘‘శాంసంగ్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నందుకు సంతోషిస్తున్నాము. ఈ ఒప్పందం ద్వారా కస్టమర్లకు గెలాక్సీ ఎస్23 సిరీస్ వంటి అత్యాధునిక సాంకేతికత అందించడం గర్వంగా ఉంది’’ అని కంపెనీ చీప్ ఎగ్జిక్యూటివ్ బ్రియాన్ బడే అన్నారు. గెలాక్సీ ఎస్23 కొనుగోలుపై గెలాక్సీ వాచ్4 బ్లూటూత్ను రూ.2,999 పొందవచ్చు. గెలాక్సీ ఎస్23 అల్ట్రా కొనుగోలుపై గెలాక్సీ వాచ్4 క్లాసిక్ ఎల్టీఈ–గెలాక్సీ బడ్స్ రూ.4999కే లభిస్తుంది. -
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 వస్తోంది.. ఆ స్మార్ట్ఫోన్ ధర భారీగా తగ్గింది!
కొత్త మొబైల్ కొనుగోలు చేయాలనుకునే వారికి శుభావార్త. ఎప్పటికప్పుడు లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తున్న శాంసంగ్ కంపెనీ తాజాగా గెలాక్సీ ఎస్23 వేరియంట్లను గ్రాండ్గా లాంచ్ చేసింది. గెలాక్సీ ఎస్23, గెలాక్సీ ఎస్23 ప్లస్, గెలాక్సీ ఎస్23 అల్ట్రా మోడళ్లను ఆవిష్కరించింది. అయితే శాంసంగ్ గెలాక్సీ ఎస్23 రాకతో గెలాక్సీ ఎస్22 ధర భారీగా తగ్గింది. ఒక ఫోన్ లాంచ్.. మరొక ఫోన్ భారీగా తగ్గింపు ఈ స్మార్ట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్లో స్టాండర్డ్ మోడల్. గతేడాది గెలాక్సీ ఎస్22 ప్లస్, గెలాక్సీ ఎస్22 అల్ట్రా మోడళ్లతోపాటు ఇది లాంచ్ అయింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్22 లాంచ్ చేసినప్పుడు దీని ధర రూ.72,999. ఇప్పుడు 'గెలాక్సీ ఎస్23 సిరీస్ను విడుదల చేసిన నేపథ్యంలో గెలాక్సీ ఎస్22 స్టాండర్డ్ మోడల్ ఫోన్ ధరను కంపెనీ భారీగా తగ్గించింది. ఈ ఫోన్ ధర ఇప్పుడు రూ.57,999. అలాగే ఇందులో 256జీబీ వేరియంట్ ధర రూ.61,999. శాంసంగ్ ఎస్22 ఫోన్ స్క్రీన్ సైజ్ 6.1 ఇంచులు. 120హెడ్జ్ వరకు రిఫ్రెష్ రేటుతో ఎఫ్హెచ్డీ ప్లస్ డిస్ల్పేని కలిగి ఉంది. క్వాల్కాం స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 1 చిప్సెట్ను కలిగిన ఈ ఫోన్లో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపీ మెయిన్ సెన్సర్, 12ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 10ఎంపీ టెలీఫోటో లెన్స్ ఉంటాయి. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 10ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 3,700 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ దీని సొంతం. కొత్తగా లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఎస్23 కూడా దాదాపు ఇవే ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. అయితే గెలాక్సీ ఎస్23లో కొత్త కలర్ ఆప్షన్లు, అధిక బ్యాటరీ సామర్థ్యం, క్వాల్కాం స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 2 చిప్సెట్ ఉన్నాయి. చదవండి: Union Budget 2023-24 బీమా కంపెనీలకు షాక్, రూ. 5 లక్షలు దాటితే! -
ఆర్ధిక మాంద్యం ఎఫెక్ట్.. స్మార్ట్ఫోన్ సేల్స్ డౌన్
ప్రపంచ దేశాల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఆర్ధిక మాంద్యం భయాలు ఇప్పుడు స్మార్ట్ ఫోన్ మార్కెట్పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం..ప్రపంచంలోనే రెండు అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్లైన భారత్, చైనాలలో స్మార్ట్ ఫోన్ అమ్మకాలు పూర్తిగా తగ్గినట్లు తెలిపింది. అయితే చైనా కంటే భారత్లో ఈ పరిణామం ఎక్కువగా ఉండటం స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థల్ని కలవరానికి గురి చేస్తున్నాయి. ఎంట్రీ లెవెల్, బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్ల సేల్స్ తగ్గినట్లు తెలిపింది కౌంటర్ పాయింట్ రీసెర్చ్. 2021తో పోలిస్తే 2022లో భారత్లో స్మార్ట్ ఫోన్ సేల్స్ 9 శాతం తగ్గి గతేడాది కేవలం 152 మిలియన్ల స్మార్ట్ ఫోన్లు మాత్రమే అమ్ముడయ్యాయి. విచిత్రం ఏంటంటే ఓవరాల్గా స్మార్ట్ ఫోన్ల విక్రయాలు తగ్గినా.. రూ.30 వేల కంటే పై చిలుకు స్మార్ట్ ఫోన్ల సేల్స్ మాత్రం రికార్డ్ స్థాయిలో 35 శాతం పెరగడం గమనార్హం. లేటెస్ట్ 5జీ టెక్నాలజీ ఫోన్ల అమ్మకాల్లో దూసుకెళ్తున్నాయి. 2021లో స్మార్ట్ ఫోన్ల విక్రయం 19 శాతం పెరిగితే, 2022లో అది 32 శాతం వృద్దిరేటును నమోదు చేసింది. 5జీ స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో శామ్ సంగ్ 21 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉండగా.. సేల్స్ ఆదాయంలోనూ 22 శాతంతో ముందంజలో ఉంది. -
శాంసంగ్ నుంచి కొత్త 5జీ ఫోన్లు.. ఫీచర్లు అదిరిపోయాయ్, లాంచ్ డేట్ అప్పుడే!
ప్రముఖ స్మార్ట్ఫోన్ మేకర్ శాంసంగ్ నూతన సంవత్సరంలో కొత్త మొబైల్ని లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే భారతీయ మార్కెట్లో ఓ బడ్జెట్ ఫోన్ను లాంచ్ చేసిన ఈ కంపెనీ.. తాజాగా శాంసంగ్ ఏ సిరీస్ 5జీ (Samsung Galaxy A Series) ఫోన్లను జనవరి 18న లాంచ్ చేయనున్నట్టు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అయితే ఏ మోడల్ అన్నదానిపై ఇంకా స్పష్టం చేయలేదు. అయితే ఇటీవల యూఎస్, యూరప్లో శాంసంగ్ గెలాక్సీ ఏ14 5జీ (Samsung Galaxy A14), విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో ఈ మోడల్ స్మార్ట్ఫోన్ లాంచ్ అవుతుందనే తెలుస్తోంది. శాంసంగ్ మాత్రం దీనిపై పూర్తి సమాచారం తెలపకుండానే ఏ సిరీస్లో 5జీ ఫోన్లను విడుదల చేస్తామని, ఆ ఫోన్కు సంబంధించిన ప్రత్యేకతలను టీజ్ చేసింది. ప్రత్యేకతలు ఈ స్మార్ట్ఫోన్.. 120Hz రిఫ్రెష్ రేట్తో 6.6-అంగుళాల పూర్తి-HD డిస్ప్లేను కలిగి ఉంటుంది. ముఖ్యంగా, ముందు భాగంలో వాటర్డ్రాప్-స్టైల్ నాచ్తో వస్తోంది. బ్యాటరీ 2 రోజుల వరకు బ్యాకప్ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. వీటిని చూస్తే ఇటీవల ప్రారంభించిన Galaxy A14 5G రూపకల్పనను పోలి ఉంటుంది. మీడియాటెక్ డైమన్సిటీ 700 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వస్తోంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత వన్యూఐ 5.0 అందుబాటులోకి వచ్చింది. ఈనెల 18న సామ్సంగ్ ఇండియాలో శాంసంగ్ గెలాక్సీ ఏ14 5జీతో పాటు గెలాక్సీ ఏ23 5జీ మొబైళ్లను లాంచ్ చేస్తుందని తెలుస్తోంది. వీటితో పాటు గెలాక్సీ ఏ34 5జీ, గెలాక్సీ ఏ54 5జీ మోడళ్లకు కూడా విడుదలై అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: మంచు కొండల్లో మహీంద్రా కారు రచ్చ.. రోడ్లపైకి రాకముందే అరుదైన రికార్డ్! -
న్యూ ఇయర్ ధమాకా: జనవరిలో లాంచ్ కానున్న 5జీ స్మార్ట్ఫోన్లు ఇవే!
భారత్లో స్మార్ట్ఫోన్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. అంతేకాకుండా 2022లో 5జీ సేవలు దేశంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీంతో 5జీ టెక్నాలజీకి అనుగుణంగా వివిధ కంపెనీలు తన స్మార్ట్ఫోన్లను లేటెస్ట్ ఫీచర్లుతో తయారు చేయడం మొదలుపెట్టాయి. ఇక ప్రస్తుతం కొత్త సంవత్సరం కావడంతో పలు బ్రాండెడ్ కంపెనీలు తమ ఫోన్లను గ్రాండ్గా లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి. వివిధ సెగ్మెంట్లలో అద్భుతమైన ఫీచర్స్తో స్మార్ట్ఫోన్లను తీసుకురానున్నాయి. ఈ జనవరిలో లాంచ్ కానున్న బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లు వాటి ప్రత్యేకతలని తెలుసుకుందాం! Tecno Phantom X2 ►టెక్నో ఫాంటమ్ ఎక్స్2 (Tecno phantom X2) జనవరి 2న భారత్లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఇటీవలే ఫాంటమ్ X2 ప్రోతో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ► ఫాంటమ్ X2 6.8 ఇంచెస్ FHD+ AMOLED డిస్ప్లే ►ఇది 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ► ఇందులో 64MP ప్రధాన కెమెరా, 13MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ ► 5,160mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ Poco C50 ►పోకో సీ 50 (Poco C50) ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్లో నడుస్తుంది కాబట్టి Poco ఇండియా ఇంటి నుండి సరసమైన స్మార్ట్ఫోన్గా కనిపిస్తోంది. ►ఈ స్మార్ట్ఫోన్ 6.52-అంగుళాల HD+ డిస్ప్లే ► 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ► వెనుకవైపు 8MP డ్యూయల్ కెమెరాలు, 5MP సెల్ఫీ కెమెరా ► ఇది ఫింగర్ప్రింట్ రీడర్, 5,000mAh బ్యాటరీ సపోర్ట్ కూడా ఉంది. Samsung Galaxy F04 ►సాంసంగ్ నుంచి మరో సరసమైన ఫోన్, గెలాక్సీ ఎఫ్ 04 (Galaxy F04 )జనవరి 4న భారత మార్కెట్లో లాంచ్ అవుతుంది. ► 6.5-అంగుళాల HD+ రిజల్యూషన్ డిస్ప్లే ► 8GB RAM వరకు MediaTek Helio P35 చిప్సెట్ ద్వారా ఎనర్జీని పొందుతుంది. ► 5,000mAh బ్యాటరీ సపోర్ట్ Redmi Note 12 series ►రెడ్మీ నోట్ 12 (Redmi Note 12) సిరీస్ భారతదేశంలో జనవరి 5 న మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ సిరీస్లో రెడ్మీ నోట్ 12 5జీ (Redmi Note 12 5G), రెడ్మీ నోట్ 12 ప్రో (Redmi Note 12 Pro), రెడ్మీ నోట్ 12 ప్రో+ ( Redmi Note 12 Pro+) ఫోన్లు ఉన్నాయి. ►రెడ్మీ నోట్ 12 ఈ సంవత్సరం బేస్ Redmi నోట్ ఫోన్కు 5G కనెక్టివిటీని తీసుకువస్తుంది. అయితే రెడ్మీ నోట్ 12 ప్రో + అత్యధికంగా 200MP ప్రధాన కెమెరా సిస్టమ్, 120W ఫాస్ట్ ఛార్జింగ్తో రానుంది. iQOO 11 ►ఐక్యూ 11 సిరీస్లో రెండు ప్రీమియం మోడల్స్ జనవరి 10న భారత్లో గ్రాండ్గా లాంచ్ కానున్నాయి. ఇందులో ఒకటి ఐక్యూ 11 కాగా , మరొకటి ఐక్యూ 11 ప్రో. ►144 Hz రిఫ్రెష్ రిఫ్రెష్ రేట్, ►2K రెజల్యూషన్తో 6.78 ఇంచెస్ E6 అమోలెడ్ డిస్ప్లే ►పవర్ఫుల్ స్నాప్డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ► ట్రిపుల్ కెమెరా సెటప్తో రానుంది. ► 5,000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్తో వస్తోంది. -
ఐఫోన్ లవర్స్కు శుభవార్త ..‘ఫోల్డ్’పై యాపిల్ కన్ను, శాంసంగ్కు ధీటుగా
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్లో వినియోగదారుల్ని ఆకట్టుకుంటున్న శాంసంగ్కు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా యాపిల్ సంస్థ ఫోల్డబుల్ ఐఫోన్ను మార్కెట్కి పరిచయం చేయాలని భావిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. శాంసంగ్..! ఫోల్టబుల్ సెగ్మెంట్లో గెలాక్సీ జెడ్ ఫోల్డ్, జెడ్ ఫ్లిప్ సిరీస్తో మార్కెట్ను శాసిస్తుంది. దీంతో శాంసంగ్ బాటలో ఇతర స్మార్ట్ ఫోన్ కంపెనీలు సైతం ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్లో అడుగు పెట్టాయి. మంచి మంచి ఫీచర్లు, డిజైన్లతో కొనుగోలు దారుల్ని గణనీయంగా ఆకట్టుకుంటున్నాయి. విక్రయాలు జోరుగా సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యాపిల్ సైతం ఫోల్డబుల్ మార్కెట్లోకి అడుగు పెట్టబోతుందంటూ వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. అందుకు ఊతం ఇచ్చేలా అల్ట్రా థిన్ కవర్ గ్లాస్ను తయారు చేసేందుకు.. ఎల్జీతో యాపిల్ కలిసి పనిచేయనుంది. ఇప్పటికే 20 ఇంచ్ ఫోల్డబుల్ డిస్ప్లే సప్లై చేసే తయారీ సంస్థలతో యాపిల్ మంతనాలు జరుపుతుంది. చర్చలు సఫలమైతే మరో రెండేళ్లలో ఐఫోన్ ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్లో విడుదల కానుంది. -
మైండ్బ్లోయింగ్ ఆఫర్.. రూ.27వేల స్మార్ట్వాచ్..కేవలం రూ. 3 వేలకే
క్రిస్మస్, న్యూయర్కు వెల్ కమ్ చెబుతూ పలు దిగ్గజ ఈకామర్స్ సంస్థలు ప్రత్యేక సేల్ నిర్వహిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. ఈ తరుణంలో సౌత్ కొరియా దిగ్గజం శాంసంగ్ ఆయా ఫోన్లను భారీ డిస్కౌంట్లకే కొనుగోలు దారులు దక్కించుకోవచ్చని తెలిపింది. ముఖ్యంగా ఫోల్డబుల్ ఫ్లాగ్ షిప్ డివైజ్లపై శాంసంగ్ ఆఫర్లు పెట్టింది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 ఫోన్ ధర రూ.1,54,999 ఉండగా రూ.8,000 బ్యాంక్ క్యాష్బ్యాక్, రూ. 8,000 అప్గ్రేడ్ బోనస్తో రూ.1,46,999కే కొనుగోలు చేయొచ్చు. అదనంగా, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4ని కొనుగోలు చేసే కస్టమర్లు రూ. 34,999 విలువైన గెలాక్సీ వాచ్ 4 క్లాసిక్ బీటీ 46ఎంఎంపై రూ. 2,999 క్యాష్ బ్యాక్ పొందవచ్చు. శాంసంగ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ని ఉపయోగించి అన్ని ఉత్పత్తులపై అదనంగా 10 శాతం క్యాష్ బ్యాక్ను సొంతం చేసుకోవచ్చు. అదేవిధంగా, రూ. 89,999 గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4పై రూ. 7వేల బ్యాంక్ క్యాష్బ్యాక్ లేదా రూ. 7వేల అప్గ్రేడ్ బోనస్తో సహా రూ. 82,999 కే కొనుగోలు చేయొచ్చు. ఈ ఆఫర్లు ప్రముఖ ఈ కామర్స్ సైట్లతో పాటు అన్నీ రిటైల్ స్టోర్లలో లభిస్తాయని శాంసంగ్ ప్రతినిధులు వెల్లడించారు. వీటితో పాటు రూ.1,09,999 ఖరీదైన గెలాక్సీ ఎస్ 22 ఆల్ట్రా పై రూ. 5వేల బ్యాంక్ క్యాష్బ్యాక్ లేదా రూ. 7వేల అప్గ్రేడ్ బోనస్తో రూ. 1,02,999కి కొనుగోలు చేయొచ్చు. శాంసంగ్ ఎస్ 22 ఆల్ట్రాని కొనుగోలు చేసే కస్టమర్లు రూ.26,999 విలువైన స్మార్ట్ వాచ్ గెలాక్సీ వాచ్ 4 బీటీ 44ఎంఎంను కేవలం రూ.2,999కే పొందవచ్చు. రూ. 72,999 ధర కలిగిన గెలాక్సీ ఎస్22ని రూ. 54,999 తగ్గింపు ధరతో కొనుగోలు చేయొచ్చు. గెలాక్సీ బడ్స్2ని కేవలం రూ. 2,999కే పొందవచ్చు. రూ.84,999 ధర కలిగిన గెలాక్సీ ఎస్ 22 ప్లస్ రూ. 59,999కే అందుబాటులో ఉంటుంది. ఇందులో రూ. 15,000 బ్యాంక్ క్యాష్బ్యాక్ లేదా రూ. 13,000 అప్గ్రేడ్ బోనస్, అలాగే రూ. 10,000 ఇన్స్టంట్ క్యాష్బ్యాక్లు ఉన్నాయి. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 ని కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు రూ. 20,000 బ్యాంక్ క్యాష్బ్యాక్ని పొందవచ్చు. రూ.26,999 విలువైన గెలాక్సీ వాచ్4 బీటీ 44 ఎంఎం స్మార్ట్ వాచ్ను రూ. 2,999కే పొందవచ్చు. ఇక, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ధర రూ . 84,999 ఉండగా.. ప్రత్యేక సేల్లో రూ. 59,999కి అందుబాటులో ఉంటుంది. ఇందులో రూ. 15వేలు ఇన్స్టంట్ క్యాష్బ్యాక్, రూ. 10,000 అప్గ్రేడ్ బోనస్ ఉన్నాయి.గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈని రూ . 39,999 నుండి కొనుగోలు చేయొచ్చు. ఇందులో రూ. 3,000 బ్యాంక్ క్యాష్బ్యాక్, రూ. 7,000 ఇన్స్టంట్ క్యాష్బ్యాక్, రూ. 10,000 అప్గ్రేడ్ బోనస్ ఉన్నాయి. గెలాక్సీ ఎస్ 20 ఎఫ్ఈ రూ. 5,000 క్యాష్బ్యాక్, రూ. 3,000 అప్గ్రేడ్ బోనస్తో సహా రూ. 32,999 నుండి అందుబాటులో ఉంటుంది. -
బడ్జెట్ ధరలో శాంసంగ్ గెలాక్సీ ఎం04: ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
సాక్షి, ముంబై: స్మార్ట్ఫోన్ దిగ్గజం శాంసంగ్ మరో స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. గెలాక్సీ ఎం04 పేరుతో 'M' సిరీస్లో బడ్జెట్ ధరలో దీన్ని తీసుకొచ్చింది. ఎంట్రీ లెవల్ మొబైల్గా 10 వేల రూపాయల లోపు ధరలో అందిస్తోంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్తోపాటు, 64జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్(1 టీబీవరకువిస్తరించుకునే అవకాశం) కూడా శాంసంగ్ ప్రకటించింది. (లగ్జరీ ఎస్యూవీ బీఎండబ్ల్యూ ఎక్స్ఎం వచ్చేసింది..ధర తెలిస్తే!) శాంసంగ్ గెలాక్సీ ఎం04 ఫీచర్లు 6.5ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే మీడియాటెక్ హీలియో పీ35 సాక్,ఆండ్రాయిడ్ 12 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ డ్యుయల్ రియర్ కెమెరా: 13 ఎంపీ ప్రైమరీ, 2 ఎంపీ సెన్సార్స్ 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ధర, లభ్యత మింట్ గ్రీన్, గోల్డ్, వైట్, బ్లూ కలర్స్లో లభ్యంకానున్న శాంసంగ్ గెలాక్సీ ఎం04 ధర రూ. 8,499గా ఉంది. సేల్ ఈ నెల 16 మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్, శాంసంగ్ ఇండియా ద్వారా ప్రారంభమవుతుంది. (రాత్రికి రాత్రే కోటీశ్వరులు..ఏకంగా 165 మందికి జాక్పాట్!ఎలా?) -
స్టార్టప్స్కు శామ్సంగ్ అదిరిపోయే ఆఫర్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ డిజిటల్ భారత ప్రయాణంలో పాలుపంచుకుంటున్న స్టార్టప్స్తో భాగస్వామ్యం కుదుర్చుకోనున్నట్టు కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ శామ్సంగ్ తెలిపింది. యూపీఐ, డిజిలాకర్, ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్, ఓపెన్ క్రెడిట్ ఎనేబుల్మెంట్ నెట్వర్క్, యూనిఫైడ్ హెల్త్ ఇంటర్ఫేస్ వంటి సాంకేతికతలపై కలిసి పనిచేసేందుకు స్టార్టప్స్ను ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా వాలెట్, హెల్త్, ఫిట్నెస్ వంటి డొమైన్లలో భారత్లోని శామ్సంగ్ పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు, వ్యాపార విభాగాలతో స్టార్టప్లు భాగస్వాములవుతాయి. ఉత్పత్తులు, సేవలు శామ్సంగ్ వ్యవస్థతో అనుసంధానిస్తారు. అవసరమైతే నిధులను సైతం సమకూరుస్తారు. -
శాంసంగ్ మరో గెలాక్సీ 5జీ స్మార్ట్ఫోన్ వచ్చేస్తోంది: ఫీచర్లు, ధర
సాక్షి, ముంబై: దక్షిణ కొరియా స్మార్ట్ఫోన్ దిగ్గజం శాంసంగ్కు చెందిన మరో స్మార్ట్ఫోన్ భారత మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది. గెలాక్సీ ఎం 54 5 జీ వచ్చే ఏడాది తొలి అర్ధ భాగంలో భారతదేశంలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. అయితే లాంచ్కు దీనికి సంబంధించిన ఫీచర్లు, ధరల తదితర వివరాలు ఫోన్ గీక్బెంచ్లో లీక్ అయ్యాయి. మల్టీ-కోర్ టెస్ట్లో 750 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్లో 2,696 పాయింట్లు సాధించిందని గీక్ బెంచ్ తెలిపింది. Exynos 1380 చిప్సెట్ స్మార్ట్ఫోన్ స్నాప్డ్రాగన్ 888 చిప్సెట్ ఇందులో జోడించింది. స్టోరేజ్ విషయానికొస్తే, గరిష్టంగా 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తుందని భావిస్తున్నారు. గెలాక్సీ ఎం54 5 జీ ఫీచర్లు అంచనా 6.67-అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే ఆండ్రాయిడ్ 13,1080 x 2412 రిజల్యూషన్ 90Hz రిఫ్రెష్ రేట్ హోల్-పంచ్ డిస్ప్లే 64+8+5ట్రిపుల్ రియర్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 6000mAh బ్యాటరీ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ధర గెలాక్సీ ఎం53 5జీ ప్రస్తుతం 8జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.24,999 6 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.21,999 ఈ నేపథ్యంలో రానున్న ఎం54 5జీ ధర రూ.30వేలుఉంటుందని అంచనా. -
శాంసంగ్ గుడ్ న్యూస్: భారీ ఉద్యోగాలు
సాక్షి,ముంబై: దక్షిణకొరియా దిగ్గజం శాంసంగ్ ఇండియా శుభవార్త అందించింది.టాప్ కంపెనీల్లో లక్షల కొద్దీ ఉద్యోగాలు కోల్పోతున్న సమయంలో శాంసంగ్ ఇండియా ఉద్యోగ నియామకాలను ప్రకటించి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు భారీ ఊరట నిచ్చింది. దాదాపు వెయ్యి మంది ఇంజనీర్లను నియమించుకోనుంది. (ఎన్డీటీవీ: ప్రణయ్ రాయ్, రాధిక గుడ్బై, కేటీఆర్ ఏం చేశారంటే?) కంప్యూటర్ సైన్స్, అనుబంధ శాఖలు (AI/ML/కంప్యూటర్ విజన్/VLSI), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎంబెడెడ్ సిస్టమ్స్ కమ్యూనికేషన్ నెట్వర్క్లలో ఇంజనీర్లను రిక్రూట్ చేయనున్నట్లు శాంసంగ్ వెల్లడించింది. భారతదేశ కేంద్రీకృత ఆవిష్కరణలతో సహా, ప్రజల జీవితాలను సుసంపన్నం చేసే ఆవిష్కరణలు, సాంకేతికతలు, ఉత్పత్తుల, డిజైన్లపై వీరు పనిచేస్తారని, డిజిటల్ ఇండియాను శక్తివంతం చేయాలనే తమ విజన్ను మరింత మెరుగుపరుస్తుందని శాంసంగ్ ఇండియా హ్యూమన్ రిసోర్సెస్ హెడ్ సమీర్ వాధావన్ అన్నారు. బెంగళూరు, నోయిడా, ఢిల్లీ, బెంగళూరులోని రీసెర్చ్, అండ్ డెవలప్మెంట్ కేంద్రాల కోసం సుమారు 1000 మందిని నియమించుకోనుంది. దీనికి అదనంగా మేథ్స్, కంప్యూటింగ్ లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్లను నియమించుకుంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఇమేజ్ ప్రాసెసింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), కనెక్టివిటీ, క్లౌడ్, బిగ్ డేటా, బిజినెస్ ఇంటెలిజెన్స్, ప్రిడిక్టివ్ అనాలిసిస్, కమ్యూనికేషన్ నెట్వర్క్లు, సిస్టమ్ ఆన్లో పనిచేసేలా ఈ ఇంజనీర్లను 2023లో కంపెనీలో చేర్చుకుంటామని శాంసంగ్ తెలిపింది. పరిశోధనా కేంద్రాలు మల్టీ-కెమెరా సొల్యూషన్లు, టెలివిజన్లు, డిజిటల్ అప్లికేషన్లు, 5G, 6G అల్ట్రా-వైడ్బ్యాండ్ వైర్లెస్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ లాంటి రంగాలలో 7,500కి పైగా పేటెంట్లను దాఖలు చేశాయి. ఈ పేటెంట్లలో చాలా వరకు శాంసంగ్ ఫ్లాగ్షిప్ గెలాక్సీ స్మార్ట్ఫోన్లు, స్మార్ట్వాచ్లు,డిజిటల్ అప్లికేషన్లున్నాయి. అలాగే ఇండియాలో తయారైన ఆవిష్కరణలతో నంబర్ పేటెంట్ ఫైలర్గా నిలిచిందినీ, నేషనల్ IP అవార్డు 2021, 2022ని కూడా గెలుచుకుందని కంపెనీ తెలిపింది. -
దేశంలో 5జీ జోరు, వందల కోట్ల పెట్టుబడి పెట్టనున్న శాంసంగ్
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ భారత్లో రూ.400 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఆ ఇన్వెస్ట్మెంట్తో తమిళనాడు కేంద్రంగా 4జీ, 5జీ రేడియో ఎక్విప్మెంట్ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ను నెలకొల్పనుంది. ఇందుకోసం జియో, ఎయిర్టెల్తో చేతులు కలపనున్నట్లు తెలుస్తోంది. దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్తో పాటు మిగిలిన అంతర్జాతీయ సంస్థలు ప్రొడక్ట్లను తయారు చేసేలా కేంద్ర ప్రభుత్వ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకంలో చేరారు. ఈ ఏడాది అక్టోబర్లో పీఎల్ఐ స్కీమ్లో భాగంగా తయారీ సంస్థలు నెలకొల్పేలా నోకియా, శామ్సంగ్, ఎరిక్సన్ భాగస్వామి జబిల్ దేశీయంగా 5జీ పరికరాల్ని తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. దేశంలో 5జీ జోరు రిలయన్స్ జియో, ఎయిర్టెల్ దేశవ్యాప్తంగా 5జీ నెట్వర్క్ను విడుదల చేయడంతో 5జీ పరికరాలకు డిమాండ్ పెరగనుంది. అయితే గతేడాది పరికరాలు సరఫరా చేసే అవకాశాలు లేకపోవడంతో పీఎల్ఐ స్కీమ్లో చేరేందుకు శాంసంగ్ ఇష్టపడేలేదు. కేవలం జియోకు 4జీ పరికరాల్ని అందించే సంస్థగా కొనసాగింది. కానీ తాజాగా భారత్లో 5జీ రాకతో లేటెస్ట్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ అవసరం పెరిగింది. దీంతో శాంసంగ్ పీఎల్ఐ స్కీంలో చేరి భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. -
శాంసంగ్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు శుభవార్త!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ఎయిర్టెల్ 5జీ సపోర్ట్ చేసేలా ఓవర్ ది ఎయిర్ (ఓటీఏ)ను అప్డేట్ చేసినట్లు తెలిపింది. దీంతో శాంసంగ్ 5జీ ఫోన్లలో ఎయిర్టెల్ నెట్వర్క్ను వినియోగించేవారికి ఈ లేటెస్ట్ టెక్నాలజీ నెట్ వర్క్ అందుబాటులోకి రానుంది. ఎయిర్టెల్ సంస్థ దేశంలో 5జీ నెట్వర్క్ సేవల్ని అందుబాటులోకి తెస్తోంది. అయితే ఈ సేవల్ని వాడుకోవాలంటే ఫోన్లలో ఓటీఏ సదుపాయం తప్పని సరిగా ఉండాలి. అందుకే ఆయా స్మార్ట్ ఫోన్ సంస్థలు ఫోన్లలో ఓటీఏను అప్డేట్ చేస్తున్నాయి. తాజాగా శాంసంగ్ సంస్థకు చెందిన అన్ని ఫోన్లలో ఓఎస్ను అప్డేట్ చేసినట్లు తెలిపింది. కాగా, ఇటీవల ట్రాయ్ యూజర్ల డేటాను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం..టెలికం కనెక్షన్లలో జియో ఆధిపత్యం కొనసాగుతోంది. సెప్టెంబర్లో కంపెనీ కొత్త యూజర్ల సంఖ్య 7.2 లక్షలు పెరిగింది. 4.12 లక్షల కొత్త యూజర్లతో భారతీ ఎయిర్టెల్ రెండో స్థానంలో నిల్చింది. సంక్షోభంలో ఉన్న వొడాఫోన్ ఐడియా కనెక్షన్లు మాత్రం తగ్గుతూనే ఉన్నాయి. వొడాఫోన్ ఐడియా సెప్టెంబర్లో ఏకంగా 40 లక్షల యూజర్లను కోల్పోయింది. 21.75 శాతం మార్కెట్ వాటాతో మూడవ స్థానంలో నిలిచింది. -
ట్యాబ్లెట్ పీసీ మార్కెట్ జోరు: అదరగొట్టిన శాంసంగ్
న్యూఢిల్లీ: దేశంలో ట్యాబ్లెట్ పీసీ మార్కెట్ అంత క్రితం త్రైమాసికంతో పోలిస్తే జూలై-సెప్టెంబర్లో 22 శాతం వృద్ధి చెందింది. 5జీ ఆధారిత డివైజ్లకు డిమాండ్ నేపథ్యంలో ఈ స్థాయి వృద్ధి నమోదైందని సైబర్మీడియా రిసర్చ్ తెలిపింది.(Vu GloLED TV: క్రికెట్, సినిమా మోడ్తో అదిరిపోయే వీయూ టీవీ, ధర రూ. 30 వేలే!) ‘సెప్టెంబర్ త్రైమాసికంలో శాంసంగ్ 28 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. లెనోవో 26, యాపిల్ 19 శాతం వాటాతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మొత్తం విక్రయాల్లో 8 అంగుళాల శ్రేణి మోడళ్ల వాటా ఏకంగా 43 శాతముంది. శామ్సంగ్ అమ్మకాలు 83 శాతం, యాపిల్ ఐప్యాడ్ 26 శాతం దూసుకెళ్లాయి. ట్యాబ్లెట్ పీసీ విపణి 2022లో 10-15 శాతం వృద్ధి సాధిస్తుంది’ అని సీఎంఆర్ వివరించింది. (భారత్ ఆర్థిక స్థిరత్వానికి ఢోకా లేదు, రూపాయిపై ఆందోళన అక్కర్లేదు) -
మెటా పాలసీ హెడ్ రాజీవ్ అగర్వాల్ రిజైన్..శాంసంగ్లో చేరిక!
మాజీ మెటా ఇండియా పాలసీ హెడ్ రాజీవ్ అగర్వాల్ సౌత్ కొరియన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్లో చేరినట్లు బ్లూమ్ బర్గ్ తెలిపింది. వారం రోజుల క్రితం ఖర్చు తగ్గించుకునేందుకు మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ 11,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగుల్ని తొలగించారు. ఆ తొలగింపుల తర్వాత మెటా సంస్థలో పలు కీలక పరిణామాలు చేటు చేసుకుంటున్నాయి. వివిధ దేశాలకు చెందిన మెటా కంట్రీ హెడ్లు పదవులకు రాజీనామా చేస్తున్నట్లు సమాచారం. రాజీనామా చేసిన వారిలో భారత్కు చెందిన పాలసీ హెడ్ రాజీవ్ అగర్వాల్ ఒకరు. మంగళవారం మెటా ఇండియా పాలసీ హెడ్ రాజీవ్ అగర్వాల్, వాట్సాప్ ఇండియా హెడ్ అభిజిత్ బోస్లు తమ పదవులకు రాజీనామా చేసినట్లు ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ మెటా అధికారికంగా ప్రకటించింది. ఆ మరుసటి రోజు అంటే ఇవాళ శాంసంగ్లో చేరినట్లు తెలుస్తోంది. డిసెంబర్ నుంచి ఆయన బాధ్యతలు చేపట్టనుండగా..రాజీవ్ అగర్వాల్ శాంసంగ్లో సైతం పాలసీ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించనున్నారు. కాగా, రాజీవ్ అగర్వాల్ గతంలో ఉబెర్ టెక్నాలజీస్లో దక్షిణాసియా పాలసీ హెడ్గా పనిచేశారు. ఉబెర్కు రాజీనామా చేసి మెటాలో చేరారు. మరో సంస్థలో అవకాశం కోసమే రాజీవ్ అగర్వాల్, అజిత్ మోహన్ ఇద్దరు తమ పదవులకు ఎందుకు రాజీనామా చేశారో మెటా తెలిపింది. మెటా ఇండియా హెడ్ అజిత్ మోహన్ తమ కాంపిటీటర్లో చేరేందుకు తన పదవికి రిజైన్ చేశారని మెటా పేర్కొంది. ఇక అజిత్ మోహన్ మరో సంస్థ అవకాశం కోసమే అజిత్ మెటా నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారంటూ’ మెటా గ్లోబల్ బిజినెస్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ నికోలా మెండెల్సన్ ఒక ప్రకటనలో తెలిపారు. చదవండి👉 : మెటా ఉద్యోగులకు ఊహించని షాక్, మార్క్ జూకర్ బర్గ్ సంచలన ప్రకటన! -
దుమ్ము లేపుతుంది, భారత్లో ఎక్కువగా అమ్ముడవుతున్న 5జీ స్మార్ట్ఫోన్లు ఇవే
ఫెస్టివల్ సీజన్లో తమ సంస్థకు చెందిన ఫోన్లు భారత్లో భారీగా అమ్ముడు పోయినట్లు ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ తెలిపింది. సెప్టెంబర్- అక్టోబర్ మధ్య కాలంలో రూ.14,400 కోట్ల విలువైన ఫోన్లను అమ్మినట్లు వెల్లడించింది. 2022 మొదటి మూడు త్రైమాసికాలలో ప్రీమియం కేటగిరీ స్మార్ట్ఫోన్లలో 99 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు కంపెనీ సీనియర్ అధికారి ప్రకటించారు. ఈ సందర్భంగా శాంసంగ్ ఇండియా సీనియర్ డైరెక్టర్, ప్రొడక్ట్ మార్కెటింగ్ హెడ్ ఆదిత్య బబ్బర్ మాట్లాడుతూ..ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుండి కేవలం 60 రోజుల వ్యవధిలో రూ.14,400 కోట్లను ఆర్జించినట్లు చెప్పారు. జనవరి - సెప్టెంబర్ మధ్య కాలంలో 5జీ స్మార్ట్ఫోన్ విలువ పరంగా సంవత్సరానికి ప్రాతిపదికన కంపెనీ 178 శాతం అమ్మకాలు జరిపిందని అన్నారు. గతేడాది పండుగ సమయంలో జరిగిన అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది సంస్థ వృద్ధి రెండంకెల స్థాయికి చేరుకుందన్నారు. సంస్థ వృద్ధికి దోహదపడిన వాటిలో ‘శాంసంగ్ (ఫోన్లపై ఫైనాన్స్) ఫైనాన్స్ ప్లస్’ ఒకటని చెప్పారు. పండుగ సీజన్లో ఈ ప్లాట్ఫారమ్లో లావాదేవీలు 3 రెట్లు వృద్ధితో 10 లక్షలకు పైగా ట్రాన్సాక్షన్లు జరిగాయని పునరుద్ఘాటించారు. చదవండి👉 ఆకాష్ అంబానీ మాస్టర్ ప్లాన్ అదిరింది, జియో యూజర్లకు బంపరాఫర్ ఎక్కువగా అమ్ముడవుతున్న 5జీ స్మార్ట్ఫోన్లు ఇవే వినియోగదారులు ఎక్కువ 5జీ, ప్రీమియం ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. రూ.10,900 నుంచి 5జీ ప్రారంభ ధర ఫోన్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. సంస్థ సుమారు 20 రకాల మోడళ్లలో 5జీ నెట్వర్క్ను వినియోగించుకునే సౌకర్యాన్ని కల్పించింది. నవంబర్ 15 నాటికి కంపెనీ అన్ని 5జీ ఫోన్లలో సాఫ్ట్వేర్ అప్డేట్లను విడుదల చేస్తుందని, చాలా స్మార్ట్ఫోన్లు ఇప్పటికే 5జీ సేవల్ని వినియోగించేకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు బబ్బర్ తెలిపారు. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం..జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో వాల్యూమ్ పరంగా 18 శాతం మార్కెట్ వాటాతో భారతదేశంలో రెండవ అతిపెద్ద స్మార్ట్ఫోన్ విక్రయదారుగా నిలిచింది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్ఫోన్గా స్థానాన్ని దక్కించుకుంది. చదవండి👉 ఫోన్ల జాబితా వచ్చేసింది, ఎయిర్టెల్ 5జీ నెట్ వర్క్ పనిచేసే స్మార్ట్ ఫోన్లు ఇవే! -
శాంసంగ్కు వారసుడొచ్చాడు...కొత్త సవాళ్లు
సియోల్: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్లో మూడో తరం వారసుడు లీ జే–యాంగ్ (54) చైర్మన్ పగ్గాలు చేపట్టారు. ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఆయన అధికారికంగా నియమితులైనట్లు కంపెనీ వెల్లడించింది. (Elon Musk ట్విటర్ డీల్ డన్: మస్క్ తొలి రియాక్షన్) శాంసంగ్ వ్యవస్థాపకుడైన లీబియుంగ్-చుల్ మనవడైన జే-యాంగ్ దక్షిణ కొరియా మాజీ అధ్యక్షురాలు పార్క్ గెన్–హైకి లంచాలు ఇచ్చారన్న ఆరోపణలపై 2017లో అరెస్టయ్యారు. గతేడాది ఆయన పెరోల్పై విడుదలయ్యారు. రెండు నెలల క్రితమే ఆయనకు అధ్యక్షుడు క్షమాభిక్ష పెట్టడంతో శిక్ష నుంచి విముక్తి లభించినట్లయింది. 2014లో ఆయన వైస్ చైర్మన్గా నియమితులయ్యారు. (Hero MotoCorp ఫిలిప్పైన్స్లో హీరో మోటోకార్ప్ ఎంట్రీ, కీలక డీల్ ) 2020లో ఆయన తండ్రి లీ కున్-హీ మరణించినప్పటికీ కేసుల కారణంగా జే-యాంగ్ను చైర్మన్గా నియామకం సాధ్యపడలేదు. తాజాగా ఆయనకు క్షమాభిక్ష లభించడంతో చైర్మన్గా నియమించేందుకు మార్గం సుగమమైంది. అంతర్జాతీయంగా అనిశ్చితితో టెక్నాలజీ డివైజ్ల కొనుగోళ్లు మందగిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీని సమర్ధంగా ముందుకు నడిపించడం జే-యాంగ్ ముందున్న ప్రధాన సవాలు అని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. -
శాంసంగ్ బంపరాఫర్, 5జీ స్మార్ట్ఫోన్పై భారీ డిస్కౌంట్
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ కొనుగోలు దారులకు బంపరాఫర్ ప్రకటించింది. శాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీ స్మార్ట్ఫోన్ను భారీ తగ్గింపుతో అందిస్తున్నట్లు వెల్లడించింది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ వేరియంట్పై రూ.11వేల డిస్కౌంట్ ఇస్తుంది. ఆ ఫోన్ ధర రూ. 34,999 ఉండగా.. ఇప్పుడు మీరు అదే ఫోన్ను రూ. 23,999 కొనుగోలు చేయోచ్చు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు కొనుగోలు చేస్తే రూ. 2 వేల వరకు క్యాష్బ్యాక్ వస్తుంది. శాంసంగ్ 5జీ ఫోన్పై ఏకంగా రూ. 13 వేల డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో పాటు ఎక్ఛేంజ్ ఆఫర్ను సొంతం చేసుకోవచ్చు. ఇక, నో కాస్ట్ ఈఎంఐ నెలకు రూ. 4 వేల నుంచి ప్రారంభం అవుతుంది. 18 నెలల ఈఎంఐకు నెలకు రూ. 1375 చెల్లించాలి. ఫోన్లో ఫీచర్లు శాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. 6.7 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 హెర్ట్జ్ డిస్ప్లే, గొరిల్లా గ్లాస్, మీడియాటెక్ డిమెన్సిటీ 900 ప్రాసెసర్, 108 ఎంపీ రియర్ కెమెరా, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సదుపాయం ఉంది. -
ఎఫర్డబుల్ ప్రైస్లో శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ఫోన్ కమింగ్ సూన్
సాక్షి, ముంబై: దక్షిణ కొరియా సంస్థ శాంసంగ్ గెలాక్సీ ఏ సిరీస్లో మరో సరికొత్త స్మార్ట్ఫోన్ను రిలీజ్ చేయనుంది. కంపెనీ తన అధికారిక వెబ్సైట్లో కీలక స్పెసిఫికేషన్లు , ఫీచర్లతో గెలాక్సీ ఏ04ఈ (Galaxy A04e) లిస్ట్ చేసింది. బ్లాక్, బ్లూ, కాపర్ ఇలా మూడు కలర్ ఆప్షన్లలో రానున్న ఈ ఫోన్ ధర, లభ్యతను ఇంకా వెల్లడించలేదు. అయితే వచ్చే నెలలో ఈ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేయవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే 13,499 రూపాయలువద్ద Galaxy A04s ప్రారంభించిన కొన్ని రోజుల తర్వాత వస్తున్న ఈ ఫోన్ ధరను వినియోగదారులకు అందుబాటు ధరలో సుమారు పదివేలలోపే నిర్ణయించవచ్చని అంచనా. శాంసంగ్ గెలాక్సీ ఏ04ఈ ఫీచర్ల అంచనాలు 6.5 అంగుళాల HD+ ఇన్-సెల్ టచ్ LCD స్క్రీన్ 60Hz రిఫ్రెష్ రేట్, ఆక్టా-కోర్ చిప్సెట్ 720 x 1600 pixels, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ 4 జీబీ ర్యామ్ 126 జీబీ స్టోరేజ్ ( 1టీబీ వరకు విస్తరించుకునే అవకాశం) 13 ఎంపీ+2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమరా 5 000mAh బ్యాటరీ -
‘ఎలాన్ మస్క్ స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది’..విడుదల ఎప్పుడు, ధర ఎంత!
స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సరికొత్త సంచలనాలకు శ్రీకారం చుట్టారు. యాపిల్, శాంసంగ్ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలకు ధీటుగా టెస్లా ‘పై’ పేరుతో స్మార్ట్ ఫోన్ను తర్వలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మస్క్ ఇప్పటికే స్పేస్ ఎక్స్, స్టార్ లింక్, ది బోరింగ్ కంపెనీ, న్యూరాలింక్ కార్పొరేషన్, జిప్2, ఓపెన్ ఏఐ, టెస్లా, సోలార్ సిటీ, పేపాల్ కంపెనీలను స్థాపించి తన మార్క్ బిజినెస్ స్ట్రాటజీస్తో ముందుకు దూసుకెళ్తున్నారు. మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసే ప్రయత్నాలు ముమ్మరం చేస్తూనే బార్ట్న్ హెయిల్ పేరుతో పెర్ఫ్యూమ్ అమ్మకాలు ప్రారంభించాడు. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. టెస్లా స్మార్ట్ఫోన్ను మార్కెట్లో విడుదల చేయనున్నారు. ఆ ఫోన్ ఫీచర్లు, ధరలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ‘పై’ ఫోన్ ఫీచర్లు తొలిసారి స్మార్ట్ ఫోన్ తయారీ మార్కెట్లోకి అడుగు పెట్టిన మస్క్..పై పేరుతో ఫోన్ను డిసెంబర్ నెలలో మార్కెట్కు పరిచయం చేయనున్నారు. ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 6.7 అంగుళాల ఫోన్కు ఓల్ఈడీ ప్యానెల్, 1284*2778 పిక్సెల్ స్క్రీన్ రెజెల్యూషన్, 458 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 120హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్, ఒలియోఫోబిక్ కోటింగ్తో స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. ఈ ఫోన్ వెనుక భాగంలో మూడు కెమెరాలు ఉండగా.. ఒక్కో కెమెరా రెజెల్యూషన్ 50ఎంపీ(మెగా పిక్సెల్) గా ఉంది. ఫేస్ డిటెక్షన్ ఆటోఫోకస్, డ్యూయల్ ఎల్ఈడీ టోన్ ఫ్లాష్, హెచ్డీఆర్, హైక్వాలిటీ, వీడియో కంప్రెషన్ కోసం ప్రోరెస్ ఫార్మాట్, సినిమాటిక్ మోడ్, స్టెరో సౌండ్ రికార్డింగ్ ఫీచర్లు ఉన్నాయి. ధర ఎంతంటే? ఫోన్ ముందు భాగంలో 40 మెగా పిక్సెల్ సింగిల్ పంచ్ హోల్ కెమెరా, కదులుతున్న మనుషుల్ని, జంతువుల్ని స్టిల్ ఫోటోలుగా క్యాప్చర్ చేసేందుకు గైరో స్కోప్ ఎలక్ట్రానిక్స్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ( Gyro-EIS) వంటి ఫీచర్లు ఉన్నాయి. టెస్లా సొంతంగా గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ను తయారు చేయగా.. ఈ ఫోన్ ధర రూ.70వేల నుంచి రూ.80వేల మధ్యలో ఉండనున్నట్లు సమాచారం. చదవండి👉 ‘అదానీ సంపద హాంఫట్’ ఒక్కరోజే వేలకోట్ల నష్టం..కారణం ఏంటో తెలుసా -
అమెజాన్ దివాలీ సేల్: శాంసంగ్ 5జీ ఫోన్పై 40 వేల తగ్గింపు
సాక్షి, ముంబై: అన్లైన్ దిగ్గజం అమెజాన్ దీపావళి సేల్ ఈవెంట్లో స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపును అందిస్తోంది. ముఖ్యంగా దక్షిణ కొరియా స్మార్ట్ఫోన్ మేకర్ శాంసంగ్కు చెందిన గెలాక్సీ సిరీస్లోని గెలాక్సీ ఎస్22 అల్ట్రా 5జీ స్మార్ట్ఫోన్ కొనుగోలుపై అమెజాన్ భారీ డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో పాటు ఇతర శాంసంగ్ గెలాక్సీ ఇతరఫోన్లపై ఆఫర్లను అందిస్తోంది. గెలాక్సీ ఎస్22 5జీ 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ వేరియంట్ను అమెజాన్ సేల్లో రూ. 32 వేల తగ్గింపుతో రూ.99,999కే అందిస్తోంది. దీని ఎంఆర్పీ ధర రూ. 1,31,999. దీనికి తోడు రూ. 13300 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. అంతేకాదు అమెజాన్ అన్ని బ్యాంక్ కార్డ్ల కొనుగోళ్లపై రూ. 50వేల కంటే ఎక్కువ కొనుగోలు చేసిన వినియోగదారులకు రూ. 8,000 ఫ్లాట్ ఇన్స్టంట్ డిస్కౌంట్ను కూడా అందిస్తోంది. ఈ రెండు ఆఫర్లతో 40 వేల రూపాయల తగ్గింపుతో ఈ ఫోన్ను సొంతం చేసుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా ఫీచర్లు 6.8 అంగుళాల AMOLED స్క్రీన్ క్వాల్కం స్నాప్డ్రాగన్ 8 జెన్1 ప్రాసెసర్ 40 ఎంపీ సెల్ఫీ కెమెరా 108+12+12 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 5000 mAh బ్యాటరీ -
‘మాకు 5జీ ఫోన్లు కావాలి’, స్మార్ట్ఫోన్ తయారీ సంస్థలకు కేంద్రం ఆదేశాలు
దేశంలో 5జీ స్మార్ట్ ఫోన్ల తయారీని పెంచాలని, ప్రస్తుతం ఉన్న ఫోన్లను 5జీకి అప్ గ్రేడ్ అయ్యేలా సాఫ్ట్వేర్లను డిజైన్ చేయాలని స్మార్ట్ ఫోన్ సంస్థలైన యాపిల్, శాంసంగ్తో పాటు ఇతర కంపెనీలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 1న జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్-2022 కార్యక్రమంలో ప్రధాని మోదీ 5జీ సేవలను ప్రారంభించారు. ఈ ఫాస్టెస్ట్ నెట్వర్క్ సేవలు తొలుత ఎంపిక చేసిన 13 నగరాల్లో ప్రారంభం అవ్వగా.. వచ్చే రెండేళ్లలో దేశ వ్యాప్తంగా ఈ సేవల్ని వినియోగించుకునే సౌలభ్యం కలగనుందని టెలికం సంస్థలు తెలిపాయి. చదవండి👉 5జీ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే 5జీ సేవలు ప్రారంభమైనా..వాటి వినియోగం కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన వినియోగదారుల ఆశలు ఆవిరయ్యాయి. ఎందుకంటే? 4జీ స్మార్ట్ ఫోన్లలో 5జీని ఉపయోగించుకునే వెసలుబాటు లేదు కాబట్టి. ఈ తరుణంలో కేంద్రం స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలతో సమావేశం నిర్వహించింది. 5జీ ఫోన్లు కావాలి ఈనేపథ్యంలో మంగళవారం.. కేంద్ర టెలికమ్యూనికేషన్లు, కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారుల అధ్యతన స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీలు యాపిల్,శాంసంగ్,వివో,షావోమీలతో పాటు దేశీయం టెలికం సంస్థలు రిలయన్స్, ఎయిర్టెల్, వొడాఫోఫోన్ ఐడియాలతో సమావేశం జరిగింది. ఇందులో ఉన్నతాధికారులు.. ఫోన్ తయారీ కంపెనీలకు.. దేశంలో వీలైనంత త్వరగా 5జీ ఫోన్లను తయారు చేయడం, లేదంటే ప్రస్తుతం ఉన్న ఫోన్లనే 5జీని వాడుకునేలా అప్గ్రేడ్ చేయాలని కోరినట్లు రాయిటర్స్ పేర్కొంది. నో 5జీ ఎయిర్టెల్ తన అఫీషియల్ వెబ్సైట్లో యాపిల్ ఐఫోన్ సిరీస్ 12 నుండి 14 ఫోన్ల వరకు 5జీని వాడుకునేలా అప్గ్రేడ్ చేయలేదని స్పష్టం చేసింది. శాంసంగ్కు చెందిన ఎక్కువ శాతం ఫోన్లలో ఈ లేటెస్ట్ జనరేషన్ నెట్వర్క్ సదుపాయం లేదని పేర్కొంది. షావోమీ, వివోకు చెందిన మూడు డజన్లకు పైగా మోడల్లో ఎయిర్టెల్ 5జీ సేవల్ని ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నట్లు హైలెట్ చేసింది. చివరిగా, టెలికాం కంపెనీలు, స్మార్ట్ఫోన్ సంస్థల మధ్య పరస్పరం చర్చలు జరుపుతున్నప్పటికీ, భారతదేశంలోని టెలికాం కంపెనీల నిర్దిష్ట 5జీ సాంకేతికత,ఫోన్లలో సాఫ్ట్వేర్ సపోర్ట్ చేసేలా అప్గ్రేడ్ చేసేందుకు మరింత సమయం పడుతున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. చదవండి👉 ఫోన్ల జాబితా వచ్చేసింది, ఎయిర్టెల్ 5జీ నెట్ వర్క్ పనిచేసే స్మార్ట్ ఫోన్లు ఇవే! -
యాక్సిస్ బ్యాంక్తో జతకట్టిన శామ్సంగ్.. అదిరిపోయే క్యాష్బ్యాక్ ఆఫర్, ఏడాది మొత్తం!
కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ సంస్థ శాంసంగ్ ఇండియా తాజాగా ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్తో జత కట్టింది. కో–బ్రాండెడ్ క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టింది. దీనితో శాంసంగ్ ఉత్పత్తులు, సర్వీసుల కొనుగోళ్లపై ఏడాది పొడవునా 10 శాతం క్యాష్బ్యాక్ పొందవచ్చు. వీసా సిగ్నేచర్, వీసా ఇన్ఫినిట్ అని ఇందులో రెండు వేరియంట్స్ ఉంటాయి. సిగ్నేచర్ వేరియంట్ కార్డుతో ఏటా రూ. 10,000 వరకు (నెలవారీ పరిమితి రూ. 2,500), ఇన్ఫినిటీ వేరియంట్ కార్డుతో రూ. 20,000 వరకు (నెలవారీ పరిమితి రూ. 5,000) క్యాష్బ్యాక్ పొందవచ్చు. కనీస లావాదేవీ విలువ అంటూ ఏమీ ఉండదు. సిగ్నేచర్ కార్డు వార్షిక ఫీజు రూ. 500, ఇన్ఫినిటీ కార్డు ఫీజు రూ. 5000గా (పన్నులు అదనం) ఉంటుంది. వినియోగదారులకు మరింత మెరుగైన డీల్స్ అందించేందుకు బిగ్బాస్కెట్, మింత్రా, టాటా 1ఎంజీ, అర్బన్ కంపెనీ, జొమాటో మొదలైన సంస్థలతో చేతులు శాంసంగ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్ చేతులు కలిపాయి. చదవండి: Ration Card New Rules: కేంద్రం కొత్త నిబంధనలు.. ఇకపై వాళ్ల రేషన్ కార్డు కట్! -
శాంసంగ్ యూజర్లకు షాకింగ్ న్యూస్, భారీగా డేటా లీక్
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తన యూజర్లకు భారీ షాకిచ్చింది. శాంసంగ్ ఫోన్లనుంచి భారీఎత్తున డేటా లీక్ అయిందని తాజాగా తెలిపింది. ఇందులో ప్రధానంగా యూజర్ల పుట్టినరోజులు, కాంటాక్ట్ డేటా లాంటి వ్యక్తిగత డేటా ఉల్లంఘన జరిగినట్టు తెలిపింది. ఈ మేరకు కొంతమంది యూజర్లను ఈమెయిల్ ద్వారా అలర్ట్ చేస్తోంది. ఈ ఏడాది జులైలో జరిగిన డేటా ఉల్లంఘనలో అమెరికాలోని శాంసంగ్ యూజర్ల డేటా బహిర్గతమైంది. దీనికి సంబంధించి శాంసంగ్ కంపెనీ ఒక బ్లాగ్పోస్ట్ సమాచారంలో తెలిపింది. అనధికారిక థర్డ్ పార్టీ ద్వారా అమెరికా సిస్టమ్ల నుంచి వినియోగదారుల ఇంటి చిరునామా, ఫోన్ నంబర్, ఇమెయిల్ లాంటి డేటాను లీక్ చేసినట్టు సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ పేర్కొంది. జులై 2022 చివరలో ఇది చోటు చేసుకుంది. ఆగస్ట్ 4, 2022న నిర్దిష్ట కస్టమర్ల వ్యక్తిగత డేటా ప్రభావితమైందని తేలింది. దీనిపై విచారణ చేయగా భారీ డేటా బహిర్గతమైందని గుర్తించినట్టు 30 రోజుల తర్వాత ఈ పరిమిత సమాచారాన్ని పూర్తిగా విడుదల చేసింది. వెల్లడించింది. అయితే ఇది ఇతర సోషల్ సెక్యూరిటీ నంబర్లు క్రెడిట్, డెబిట్ కార్డ్ నంబర్లను ప్రభావితం చేయ లేదని శాంసంగ్ నిర్ధారించింది. డేటా లీకైన సిస్టమ్లను సేఫ్గా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. సైబర్ సెక్యూరిటీ నిపుణులు భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారని బ్లాగ్లో పేర్కొంది. అలాగే ఈ విషయం గురించి కస్టమర్లను అప్రమత్తం చేస్తున్నామని తెలిపింది. అయినా వ్యక్తిగత సమాచారం కోసం అడిగే లేదా వ్యక్తిగత సమాచారం కోసం అడిగే వెబ్ పేజీలకు డైవర్ట్ చేసే లింక్ల పట్ల జాగ్రత్తగా ఉండమని వినియోగ దారులను కోరింది. అనుమానాస్పద లింక్లు లేదా అనుమానాస్పద ఇమెయిల్ల నుండి అటాచ్మెంట్లపై క్లిక్ చేయడం మానుకోవాలని వినియోగదారులను కోరింది.