LG
-
కొత్త బిజినెస్లోకి దిగిన ఎల్జీ.. విద్యార్థులే టార్గెట్!
టీవీలు, ఫ్రిజ్లు, వాషింగ్ మిషన్లు వంటి ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు తయారు చేసే ఎల్జీ కంపెనీ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. వివిధ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ తయారు చేసే ఈ దక్షిణ కొరియా కంపెనీ ఇప్పుడు సరికొత్త వ్యాపారంలోకి దిగింది. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ( LG Electronics India ) విద్యారంగాన్ని లక్ష్యంగా చేసుకుని దేశంలో స్వీయ-లాండ్రీ సేవా వ్యాపారంలోకి ప్రవేశించింది. ఇక్కడ వాణిజ్య వాషింగ్ మెషీన్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ ఏడాదికల్లా 200 సెల్ఫ్ లాండ్రీ సర్వీస్ సెంటర్లను ప్రారంభించే ప్రణాళికలతో కంపెనీ ఈ వ్యాపారంలో 4 మిలియన్ డాలర్లు ( సుమారు రూ.33 కోట్లు ) పెట్టుబడి పెడుతోంది. ఈ మేరకు గ్రేటర్ నోయిడాలోని గల్గోటియాస్ విశ్వవిద్యాలయంతో ఎల్జీ జత కట్టంది. అక్కడున్న 1500 మంది విద్యార్థులకు మొదటి సారిగా లాండ్రీ సేవలు ప్రారంభించింది. మెషిన్ రిజర్వేషన్, ఆపరేషన్, ఆటోమేటెడ్ చెల్లింపులను సులభతరం చేసేందుకు ఓ యాప్ను కూడా రూపొందించింది. ఈ యాప్ ద్వారా విద్యార్థులు ఎల్జీ కమర్షియల్ వాషింగ్ మెషీన్లను ఉపయోగించుకునే సౌలభ్యం ఉంటుంది. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ హాంగ్ జు జియోన్ మాట్లాడుతూ.. విద్యా సంస్థల్లో సెల్ఫ్ లాండ్రీ సర్వీస్తో విద్యార్థులకు సౌకర్యాన్ని కల్పించే లక్ష్యంతో కొత్త వ్యాపార రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు తెలిపారు. "ఈ వ్యాపారంలో 4 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతున్నాం. 2024 చివరి నాటికి 200 సెల్ఫ్-లాండ్రీ సర్వీస్ సెంటర్లను తెరవడానికి ప్లాన్ చేస్తున్నాం" అని జియోన్ పేర్కొన్నారు. -
నొప్పి తెలియకుండా .. ఏఐ సాయంతో టాటూ ప్రింటర్ లాంచ్ చేసిన ఎల్జీ
పచ్చబొట్లకు ఫ్యాషన్ ప్రపంచంలో విపరీతమైన గిరాకీ ఉంది. చిన్న చిన్న పట్టణాల్లో కూడా టాటూ స్టూడియోలు కళకళలాడుతుంటాయి. అయితే, టాటూ వేయించుకోవాలంటే ఖర్చును, నొప్పిని కూడా భరించాల్సి ఉంటుంది. కోరుకున్న డిజైన్లలో పచ్చబొట్టు వేయడానికి చాలా సమయం కూడా పడుతుంది. కోరుకున్న డిజైన్లలోని పచ్చబొట్లను చిటికెలో ముద్రించే ఈ టాటూ ప్రింటర్ను కొరియన్ బహుళజాతి సంస్థ ఎల్జీ ఇటీవల రూపొందించింది. చేతిలో ఇమిడిపోయే పరిమాణంలో ఉన్న ఈ టాటూ ప్రింటర్ శరీరంపైనే కాకుండా, దుస్తులపై కూడా కోరుకున్న డిజైన్లను క్షణాల్లోనే ముద్రిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే ఈ టాటూ ప్రింటర్ను మొబైల్ ఫోన్ యాప్ ద్వారా ఉపయోగించుకునే వెసులుబాటు కూడా ఉంది. యాప్ ద్వారా డిజైన్లను ఎంపిక చేసుకుని, టాటూను ముద్రించదలచుకున్న చోట దీన్ని ఉంచి, ఆన్ చేసుకోవడమే తరువాయిగా రకరకాల రంగుల్లో, రకరకాల డిజైన్లలో టాటూలను ముద్రించుకోవచ్చు. ‘ఎల్జీ హెచ్ అండ్ హెచ్ ఇంప్రింటు’ పేరుతో రూపొందించిన ఈ టాటూ ప్రింటర్ను ఎల్జీ కంపెనీ ఈ ఏడాది లాస్ వేగస్లో జరగనున్న సీఈఎస్–2024 షోలో ప్రదర్శించనుంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు. -
యాపిల్ ఐఫోన్ లవర్స్కు బ్యాడ్న్యూస్!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ లవర్స్కు బ్యాడ్ న్యూస్. ప్రతి ఏడాది సెప్టెంబర్ నెలలో యాపిల్ ఐఫోన్ సిరీస్లను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది ఐఫోన్ 15 సిరీస్ విడుదలలో జాప్యం ఏర్పడనుంది. ముందే అనుకున్న విడుదల షెడ్యూల్ కంటే మరికొన్ని వారాలు ఆలస్యంగా విడుదల చేసే అవకాశం ఉందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా బ్యాంక్ ఆఫ్ అమెరికా అనలిస్ట్ వంశీ మోహన్ మాట్లాడుతూ.. ఐఫోన్ 15 విడుదల ఆలస్యం ఎందుకు జరుగుతుందో స్పష్టమైన కారణాలు తెలియరాలేదు. అయితే ఫోన్ క్యూ4లో అంటే అక్టోబర్ - డిసెంబర్ మధ్య కాలంలో ఎప్పుడైనా యూజర్లకు పరిచయమయ్యే అవకాశం ఉందని అన్నారు. డిస్ప్లే సమస్యలే కారణమా? ది ఇన్ఫర్మేషన్ నివేదిక ప్రకారం.. యాపిల్ సంస్థ ఫోన్ల డిస్ప్లే సమస్య ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ లిమిటెడ్ ఫోన్లకే డిస్ప్లేలు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు ఐఫోన్ 15 ఫోన్ల డిస్ప్లే బెజెల్స్ పరిణామాన్ని తగ్గించడంతో పాటు, ఐఫోన్ల డిస్ప్లేలను ఎల్జీ తయారు చేస్తుంది. వీటి తయారీలోనూ ఆలస్యానికి కారణమని సమాచారం. యాపిల్ వాచ్ 7 డిస్ప్లే అంశంలోనూ ఇదే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. యాపిల్ వాచ్ 7ను మార్కెట్లో విడుదల చేసిన నెల రోజుల తర్వాత విక్రయాలు జరిగాయి. చదవండి👉 ప్రపంచ చరిత్రలో నష్ట జాతకుడు ఇతనే! -
కొత్త టెక్నాలజీతో ఎల్జీ ఫ్రిజ్.. ఎక్కడ నుంచైనా ఆపరేట్ చేయొచ్చు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జీ మేకిన్ ఇండియా నినాదంపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా పుణెలో సైడ్ బై సైడ్ (ఎస్ బీ ఎస్) ఫ్రిజ్ ల తయారీ కోసం కొత్త యూనిట్ ప్రారంభించింది. రూ. 200 కోట్లతో దీన్ని ఏర్పాటు చేసినట్లు సంస్థ భారత విభాగం ఎండీ హోంగ్ జు జియోన్ తెలిపారు. దీని వార్షిక తయారీ సామర్థ్యం 2 లక్షల యూనిట్లుగా ఉంటుందని వివరించారు. తాజాగా దేశీయంగానే వీటిని తయారు చేయడం వల్ల ధరలు కూడా కొంత తగ్గే అవకాశం ఉంది. గతేడాదే దేశీయంగా విండో ఏసీల తయారీని ప్రారంభించినట్లు జియోన్ చెప్పారు. భారత్ లో ఎస్ బీ ఎస్ ఫ్రిజ్ ల విభాగంలో తమకు 50 శాతం మార్కెట్ వాటా ఉన్నట్లు ఆయన చెప్పారు. దేశీయంగా ఫ్రిజ్ ల విభాగంలో తమకు 34 శాతం, వాషింగ్ మెషీన్ల విభాగంలో 37 శాతం వాటా ఉండగా అన్ని విభాగాల్లోనూ మార్కెట్ వాటాను మరింతగా పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నట్లు జియోన్ చెప్పారు. ఎల్జీకి దేశీయంగా పుణె, గ్రేటర్ నోయిడాల్లో ప్లాంట్లు ఉన్నాయి. పుణె ప్లాంటుపై 2004 నుంచి గతేడాది వరకూ రూ. 1,619 కోట్లు, నోయిడా ప్లాంటుపై 1997 నుంచి గతేడాది వరకు రూ. 1,778 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు తెలిపారు. కొత్త ఫ్రిజ్ల శ్రేణి.. 2023కి సంబంధించి ఎల్జీ కొత్త ఎస్ బీ ఎస్ ఫ్రిజ్ ల శ్రేణిని ఆవిష్కరించింది. ఎల్జీ థింక్యూ టెక్నాలజీతో వీటిలో టెంపరేచర్ సెట్టింగ్ వంటి ఫీచర్లను ఎక్కడ నుంచైనా ఆపరేట్ చేయొచ్చని సంస్థ తెలిపింది. ఎస్ బీ ఎస్ ఫ్రిజ్ లలో 15 మోడల్స్ ఉండగా ధరలు రూ. 1,20,699 నుంచి రూ. 2,29,099గా ఉంటాయని వివరించింది. చదవండి: గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేస్తే డబ్బులు ఇస్తున్నారా? కంపెనీ ఏం చెప్తోందంటే! -
బెస్ట్ గేమింగ్ టీవీ కోసం చూస్తున్నారా, ఇదిగో కళ్లు చెదిరే టీవీల లిస్ట్
సాక్షి, హైదరాబాద్: ఈ ఫెస్టివ్ సీజన్లో మంచి గేమింగ్ టెలివిజన్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా. ఇటీవలి కాలంలో మొబైల్స్, టీవీల్లో గేమింగ్ బాగా పాపులర్ అవుతోంది. తమ స్నేహితులతో కలిసి వర్చువల్గా మల్టీప్లేయర్ గేమ్స్తో కొత్త ప్రపంచాలని అన్వేషించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో అద్భుతమైన మానిటర్ లేదా టీవీ చాలా ముఖ్యం. గేమింగ్ టీవీలు అధిక రిఫ్రెష్ రేట్ 4K డిస్ప్లేలు గేమ్లలో అద్భుతమైన విజువల్స్ను ఫిక్స్డ్ ఫ్రేమ్ రేట్తో అందిస్తాయి. ఈ టీవీలు శక్తివంతమైన ప్రాసెసర్లతో పాటు, VRR, G-Sync, FreeSync కి సపోర్ట్తో కస్టమర్లకు మంచి గేమింగ్ అనుభవాన్నిస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్నదిగ్గజ కంపెనీలుఎల్జీ, సోనీ, శాంసంగ్ , టీసీఎల్ తదితర ది బెస్ట్ టీవీలను ఒకసారి చూద్దాం ఎల్జీ సీ 2 ఎల్జీ సీ 2 OLED 4K స్మార్ట్ టీవీ C1కి సక్సెసర్ ఇది. α9 Gen5 AI ప్రాసెసర్తో వస్తుంది, 42, 48, 55 ,65,77 , 83 అంగుళాల సైజుల్లో లభ్యం. ఇది పిక్సెల్ డిమ్మింగ్కు మద్దతు ఇస్తుంది . 100 శాతం కలర్ ఫిడెలిటీతో మంచి గేమింగ్ అనుభవాన్నిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో Nvidia G-Sync, AMD ఫ్రీసింక్ , VRRలకు సపోర్ట్ దీని స్పెషాలిటీ. ఇది పీసీగానూ కన్సోల్ గేమింగ్కు పనికొస్తుంది. ఇండియాలో ఈ టీవీ ధర రూ. 1,39,990 నుండి ప్రారంభం. LG అధికారిక వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. సోనీ X90J కంపెనీ ఫ్లాగ్షిప్ 4K LED స్మార్ట్ టీవీఇది. సోనీ X90J అనేది బ్యాక్లైటింగ్ లోకల్ డిమ్మింగ్తో గేమింగ్కోసం బెస్ట్ ఆప్షన్ ఇది. ఇమేజ్ క్వాలిటీని పెంపొందించే Bravia XR ప్రాసెసర్తో పనిచేస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ VRRకి సపోర్టు చేస్తుంది. ఇందులోని ఫార్-ఫీల్డ్ మైక్స్తో మీ వాయిస్ని ఉపయోగించి ఆపరేట్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు. 55, 65 అంగుళాల స్క్రీన్ సైజులలో లభిస్తుంది భారతదేశంలో రూ. 1,18,740 నుండి ప్రారంభం. ఈ టీవీని క్రోమా ద్వారా కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ Q90B QLED TV అద్భుతమైన 4K చిత్రాలను అందించడానికి నియో క్వాంటం ప్రాసెసర్ని కలిగి ఉంది. క్వాంటం మ్యాట్రిక్స్ టెక్నాలజీ లైట్ని ఎడ్జస్ట్ చేసుకుని, 4K గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే ఈ టీవీకి VRR మద్దతు లేదు. 50, 55, 65, 75, 85 అంగుళాలలో అందుబాటులో ఉంది. ధర రూ. 1,09,990 నుండి ప్రారంభం Samsung అధికారిక వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. TCL C835 4K TV క్వాడ్-కోర్ 4K ప్రాసెసర్, లోకల్ డిమ్మింగ్ , 144Hz వరకు రిఫ్రెష్ రేట్తో ఈ టీవీ వస్తుంది. మినీ LED ప్యానెల్ అద్భుతమైన కాంట్రాస్ట్, VRR మద్దతును దీని స్పెషల్. TCL C835 TV 55,65 ,75 అంగుళాలలో అందుబాటులో ఉంది. ధర భారతదేశంలో రూ. 1,19,990 నుండి ప్రారంభం. TCL స్టోర్, క్రోమా, అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ ది ఫ్రేమ్ 2022 శాంసంగ్ నుంచి మరో సూపర్ గేమింగ్ టీవీ శాంసంగ్ ది ఫ్రేమ్ 2022అద్భుతమైన డిజైన్తో అధునాతన ఫోటో ఫ్రేమ్గా కనిపిస్తుందీ టీవీ.120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్తో ఫ్రేమ్ 100 శాతం కలర్ వాల్యూమ్ను అందించే క్వాంటం డాట్ టెక్, క్వాంటం ప్రాసెసర్ కలిగి ఉంది. భారతదేశంలో రూ. 53,990 నుండి ప్రారంభం, దీన్ని Samsung స్టోర్, అమెజాన్ , ఫ్లిప్కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు -
ఎగబడి కొంటున్న జనం.. మూడు సార్లు ధరలు పెంచినా, రికార్డు స్థాయి అమ్మకాలు!
ఈ ప్రపంచంలో ప్రతీది ఇంటర్ లింక్, ఒకదాని ప్రభావం మరోకదానిపై చూపిస్తుంది. ఈ మాట ఓ సినిమాలోని డైలాగ్. సరిగ్గా అలాంటిదే ఏసీ విక్రయాల విషయంలో జరిగింది. ఈ ఏడాది పెరిగిన ఎండల తీవ్రత ఏసీల విక్రయాలపై ప్రభావం చూపింది. ఎంతలా అంటే గత ఆరు నెలల్లో మూడు సార్లు ధరలు పెంచినా.. అవేవి ప్రజలు పట్టించుకోకుండా ఏసీలను కొనుగోలు చేశారు. దీంతో ఈ ఏడాది ప్రథమార్థంలో సూమారు 60 లక్షలు ఏసీలు దేశవ్యాప్తంగా అమ్ముడయ్యాయి. చదవండి: Netflix Subscription: మైక్రోసాఫ్ట్తో చేతులు కలిపిన నెట్ఫ్లిక్స్.. తక్కువ ధరలకే కొత్త ప్లాన్! వోల్టాస్ కంపెనీ(Voltas) దాదాపు 1.2 మిలియన్ యూనిట్ల రెసిడెన్షియల్ ఏసీలను విక్రయించగా, ఎల్జీ(LG) ఎలక్ట్రానిక్ ఇండియా ఒక మిలియన్ యూనిట్లకు పైగా రెసిడెన్షియల్ ఇన్వర్టర్ ఎయిర్ కండీషనర్లను విక్రయించినట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. కాగా జనవరి-జూన్ కాలంలో ఎల్జీ సంస్థ ఏసీ విభాగం నుంచి ₹4,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. హిటాచీ, డైకిన్, పానాసోనిక్, హైయర్ వంటి ఇతర ఎయిర్ కండీషనర్ తయారీదారులు కూడా తమ యూనిట్ అమ్మకాలలో ఇదే జోరు కొనసాగినట్లు చెప్పారు. ద్వితీయార్ధంలో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని వారు భావిస్తున్నారు. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (CEAMA) ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా మాట్లాడుతూ.. ఈ ఏడాది అమ్మకాల పరంగా మొదటి భాగం అద్భుతంగా ఉందన్నారు. జనవరి నుంచి జూన్ వరకు ఏసీ(AC) మార్కెట్ (దేశీయ) 6 మిలియన్ యూనిట్లకు అమ్ముడయ్యాయని తెలిపారు. గతంలో ఈ స్థాయిలో అమ్మకాలు లేవని, రెండవ సగం దాదాపు 2.5 మిలియన్ యూనిట్ల విక్రయాలు జరుగుతాయని భావిస్తున్నట్లు చెప్పారు. చదవండి: Google Play Store: 8 యాప్లను డిలీట్ చేసిన గూగుల్.. మీరు చేయకపోతే డేంజరే! -
వరల్డ్లో తొలి, ఏకైక అద్భుత టీవీ: మరి ధర సంగతేంటి?
హైదరాబాద్: ఎల్రక్టానిక్స్ దిగ్గజం ఎల్జీ ప్రపంచంలోనే తొలి, ఏకైక రోలబుల్ టీవీని లాంచ్ చేసింది. ఎల్జీ సిగ్నేచర్ ఓలెడ్-ఆర్ టీవీతో హైదరాబాద్ మార్కెట్లో అడుగు పెట్టింది. భవిష్యత్తులో డిస్ప్లే టెక్నాలజీలో ఇదొక ముందడుగని లాంచింగ్ సందర్భంగా కంపెనీ వెల్లడించింది. అంతేకాదు హోమ్ ఎంటర్టైన్మెంట్ విభాగంలో విప్లవాత్మకమైన టీవీ ఇది అని ఎల్జీ ప్రకటించింది. కస్టమర్లకు ఇంట్లోనే థియేటర్ అనుభవాన్ని అందించే డాల్బీతో టెక్నాలజీతో, 42 అంగుళాల నుంచి 97 అంగుళాల స్క్రీన్ సైజ్లో లాంచ్ చేసింది. ఇది లగ్జరీ టీవీ. అవసరం లేనపుడు ఈ టీవీని బాక్స్లో మడిచి పెట్టేయొచ్చు అని ఎల్జి ఎలక్ట్రానిక్స్ ఇండియా బిజినెస్ హెడ్ గిరీశన్ గోపి చెప్పారు. భారతదేశం అంతటా కనీసం వెయ్యి టీవీలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. రోలబుల్ టీవీ ప్రత్యేకత అంతర్జాతీయంగా ముఖ్య ఆవిష్కరణల్లో ఇది ఒకటి. ఆన్ చేయగానే వెడల్పాటి సౌండ్ సిస్టమ్ నుంచి 65 అంగుళాల టీవీ వెలుపలికి వస్తుంది. ఆఫ్ చేయగానే దానంతట అదే చుట్టుకుంటూ పెట్టెలోకి వెళ్లిపోతుంది. సెల్ఫ్-లైట్ పిక్సెల్ టెక్నాలజీ కారణంగా ఇలా వీలవుతుందని కంపెనీ తెలిపింది. దీని ధర రూ.75 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. -
దేశీయ మార్కెట్లో టీవీ విడుదల, ధర రూ.75లక్షలా!
సౌత్ కొరియా కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ దిగ్గజం ఎల్జీ ఎలక్ట్రానిక్స్ అత్యంత ఖరీదైన టీవీని ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. త్వరలో దేశ వ్యాప్తంగా ఉన్న ఎల్జీ ఔట్లెట్లలో ఈ టీవీని అందుబాటులోకి ఉంచనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ముంబై క్రోమా స్టోర్లో ఎల్జీ సంస్థ ఎల్ఈడీ టీవీ పేరుతో టీవీని విడుదల చేసింది. ఈ టీవీ ధర ఎంతో తెలుసా అక్షరాల రూ.75లక్షలు. ఈ సందర్భంగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా డైరెక్టర్ హ్యాక్ హ్యయిన్ కిమ్ మాట్లాడుతూ.. వీక్షకులకు సరికొత్త యూజర్ ఎక్స్పీరియన్స్ను అందించేందుకు ఈ సరికొత్త టీవీని మార్కెట్లోకి విడుదల చేసినట్లు వెల్లడించారు. టీవీ స్పెసిఫికేషన్లు టీవీ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే 65అంగుళాల ఫ్లెక్సిబుల్ ఓఎల్ఈడీ డిస్ప్లే, సెల్ఫ్ లైట్నింగ్ ఫిక్సెల్ టెక్నాలజీ, ఎల్జీ ఏ9 జనరేషన్ ఏఐ ప్రాసెసర్, డొల్బే అట్మాస్ స్పాటల్ సౌండ్ తో పాటు ఆకట్టుకునేలా గేమింగ్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. -
మార్కెట్లోకి ఎల్జీ కొత్త ఉత్పత్తుల శ్రేణి
న్యూఢిల్లీ: కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జీ ఇండియా తాజాగా 2022కి సంబంధించి కొత్త ఉత్పత్తుల శ్రేణిని ఆవిష్కరించింది. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, మైక్రోవేవ్ ఒవెన్లు, ఏసీలు మొదలైన వాటికి సంబంధించి 270 పైగా మోడల్స్ను ప్రవేశపెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో రూపొందించిన స్మార్ట్ గృహోపకరణాలు వీటిలో ఉన్నాయి. ఏఐ డైరెక్ట్ డ్రైవ్ వాషింగ్ మెషీన్లు, ఇన్స్టావ్యూ ఫ్రిజ్లు, ప్యూరికేర్ వేరబుల్ ఎయిర్ ప్యూరిఫయర్, విరాట్ ఏసీలు మొదలైనవి వినియోగదారులకు మరింత సౌకర్యవంతంగా ఉంటాయని సంస్థ డైరెక్టర్ (హోమ్ అప్లయెన్స్, ఎయిర్ కండీషనర్స్) హ్యూంగ్ సుబ్జీ తెలిపారు. ఈ ఏడాది 2022లో 30 శాతం వృద్ధి సాధించగలమని అంచనా వేస్తున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. పటిష్ట డిమాండ్, కొత్త ప్రొడక్టుల విడుదల నేపథ్యంలో హోమ్ అప్లయెన్సెస్, ఏసీ బిజినెస్ వేగవంత పురోగతిని సాధించే వీలున్నట్లు పేర్కొంది. గతేడాది (2021) ఈ విభాగాలలో 20% వృద్ధిని సాధించినట్లు తెలియజేసింది. దేశీయంగా అమ్మకాలలో 70% వాటా ఈ విభాగానిదేనని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా వైస్ప్రెసిడెంట్ దీపక్ బన్సల్ పేర్కొన్నారు. 2021లో ఈ విభాగం అమ్మకాలు రూ. 15,000 కోట్లుగా నమోదైనట్లు వెల్లడించారు. -
కొత్త ఏడాదిలో ఏసీ, ఫ్రిజ్, టీవీ కొనేవారికి భారీ షాక్..!
కొత్త ఏడాదిలో మీరు కొత్తగా ఏసీ, ఫ్రిజ్, టీవీ వంటి గృహోపకరణ వస్తువులు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు షాకింగ్ న్యూస్. ఈ కొత్త ఏడాదిలో ఎయిర్ కండీషనర్స్, టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు వంటి గృహోపకరణాల ధరలు సుమారు 5 శాతం నుంచి 10 శాతం వరకు పెరగనున్నాయి. ముడిసరకుతో పాటు రవాణా ఛార్జీలు భారీగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు తెలిపాయి. పెంచిన ధరలు ఈ నెల చివర నాటికి లేదా మార్చి నాటికి అమలులోకి రానున్నాయి. పానాసోనిక్, ఎల్జీ, హయర్ లాంటి కంపెనీలు ఇప్పటికే ధరలు పెంచే ఆలోచనలో ఉండగా.. సోనీ, హిటాచీ, గోడ్రెజ్ అప్లయన్సెస్ వంటి సంస్థలు కూడా ఈ త్రైమాసికం చివరకు నిర్ణయం తీసుకోనున్నాయి. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్(సీఈఎఎమ్ఎ) ప్రకారం.. గృహోపకరణ తయారీ కంపెనీలు జనవరి లేదా మార్చి నెలలో 5-7 శాతం ధరలను పెంచే ఆలోచన చేస్తున్నాయి. "కమాడిటీలు, గ్లోబల్ ఫ్రైట్, ముడి పదార్థాల వ్యయం మునుపెన్నడూ లేని విధంగా పెరగడంతో రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్లు, ఎయిర్ కండిషనర్ కేటగిరీల్లో ఉత్పత్తుల ధరలను పెంచడానికి మేము చర్యలు తీసుకున్నామని" హయర్ అప్లయన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ సతీష్ ఎన్ఎస్ తెలిపారు. ఇప్పటికే ఎసీల ధరలను 8 శాతం వరకు పెంచిన పానాసోనిక్ మరోసారి పెంచాలని చూస్తుంది. మిగిలిన వాటి ధరలను మరింత పెంచాలని యోచిస్తున్నట్లు ఆ సంస్థ ఇండియా డివిజనల్ డైరెక్టర్ ఫుమియాసు ఫుజిమోరి అన్నారు. ముడిసరకుల, లాజిస్టిక్స్ ఖర్చులు ఎగబాకిన దృష్ట్యా గృహోపకరణాల ధరలను పెంచినట్లు దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు తయారీ సంస్థ ఎల్జీ తెలిపింది. (చదవండి: బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఇదే సువర్ణావకాశం..!) -
ఇక ఆ ఫోన్లలో వాట్సాప్ సేవలు బంద్
నవంబర్ 1 నుంచి కొన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లతో పాటు ఐఓఎస్ ఫోన్లలో ప్రముఖ మెసేజింగ్ ఫ్లాట్ ఫారం వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. వాట్సాప్ ఆండ్రాయిడ్ వెర్షన్ 4.0.3 వినియోగిస్తున్నట్లైతే యూజర్లు వెంటనే అప్డేట్ చేసుకోవాలని వాట్సాప్ తెలిపింది. అప్డేట్ చేయని స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదని స్పష్టం చేసింది. నవంబర్ 1,2021 నుంచి ఆండ్రాయిడ్ వెర్షన్ 4.0.3 ఉంటే వాట్సాప్ పనిచేయదని చెప్పింది. ఇక యాపిల్ విషయానికి వస్తే ఐఓఎస్ 9 కంటే తక్కువ ఆపరేటింగ్ సిస్టమ్ గల స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. వాట్సాప్ సేవలు నిలిచిపోనున్న జాబితా: ఆపిల్: iPhone 6, iPhone 6s plus, iPhone SE ఎల్ జి: Lucid 2, Optimus F7, Optimus F5, Optimus L3 II, Dual Optimus L5, Best L5 II, Optimus L5, Dual Best L3 II, Optimus L7, Optimus L7, Dual Best L7 II, Optimus F6, Enact Optimus F3, Best L4 II, Best L2 II, Optimus Nitro HD, Optimus 4X HD and Optimus F3Q. హువావే: Ascend G740, Ascend Mate, Ascend D Quad XL, Ascend D1 Quad XL, Ascend P1 S, and Ascend D2. శామ్ సంగ్: Galaxy Trend Lite, Galaxy Trend II, Galaxy SII, Galaxy S3 mini, Galaxy Xcover 2, Galaxy Core and Galaxy Ace 2. జడ్ టీఈ: Grand S Flex, ZTE V956, Grand X Quad V987 and Grand Memo. సోనీ: Xperia Miro, Xperia Neo L, and Xperia Arc S. Alcatel, Archos 53 Platinum, HTC Desire 500, Caterpillar Cat B15, Wiko Cink Five, and Wiko Darknight, Lenovo A820 UMi X2, Run F1, THL W8 వంటి బ్రాండ్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి -
శాంసంగ్కు చెక్పెట్టేందుకు పెద్దప్లానే వేసిన ఎల్జీ...!
ప్రపంచవ్యాప్తంగా పలు మొబైల్ కంపెనీల రాకతో మార్కెట్లలో ఎల్జీ తన స్థానాన్ని పదిలంగా కాపాడుకోలేకపోయింది. పలు మొబైల్ కంపెనీల దెబ్బకు ఎల్జీ స్మార్ట్ఫోన్ల బిజినెస్ను వీడింది. స్మార్ట్ఫోన్ ఉత్పత్తులను నిలిపివేసిన స్మార్ట్ఫోన్లకు ఉపయోగపడే టెక్నాలజీని మాత్రం ఎల్జీ వీడలేదు. తాజాగా శాంసంగ్ మొబైల్స్కు చెక్ పెట్టేందుకు ఎల్జీ సరికొత్త ప్లాన్తో ముందుకురానుంది. ఎల్జీ కంపెనీలలో ఒకటైన ఎల్జీ కెమ్ (LG Chem) భవిష్యత్తులో వాడే స్మార్ట్ఫోన్లకు కొత్త రకం ఫోల్డబుల్ స్క్రీన్తో ముందుకు వచ్చింది. ఈ కొత్త రకం ఫోల్డబుల్ స్క్రీన్ అధిక ధర గల శామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 3, గెలాక్సీ ఫోల్డ్ 2 ఫోన్లలో ఉపయోగించే టెక్నాలజీని ప్రభావితం చేసే అనేక సమస్యలను పరిష్కరిస్తోందని ఎల్జీ భావిస్తోంది. చదవండి: India’s First Electric Vehicle : భారత తొలి ఎలక్ట్రిక్ కారు ఇదేనండోయ్..! మన్నిక ఎక్కువ..! ప్లాస్టిక్ లాగా... ఎల్జీ కెమ్ తయారు చేసిన ఫోల్డబుల్ స్క్రీన్ అత్యంత శక్తివంతంగా, మన్నికగా, గాజు తరహాలో అనుభూతిని కలిగించే విధంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. స్క్రీన్ మెటిరియల్ ప్లాస్టిక్ గుణాన్ని పోలీ ఉండనుంది. ఈ స్క్రీన్ను రియల్ ఫోల్డింగ్ విండో స్క్రీన్గా ఎల్జీ పిలుస్తోంది. స్క్రీన్ మెటీరియల్ని టెంపర్డ్ గ్లాస్తో ఎల్జీ పోల్చింది. ఈ ఏడాది ప్రారంభంలో ఎల్జీ తన కంపెనీ నుంచి రోలబుల్ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేయాలనే ప్రణాళికలను నిలిపివేసింది.ఎల్జీ స్మార్ట్ఫోన్ల తయారీ నుంచి వైదొలిగినా.. గూగుల్, ఆపిల్, షావోమీ, వన్ప్లస్ వంటి దిగ్గజ స్మార్ట్ఫోన్ తయారీ దారులకు తన స్క్రీన్లను సరఫరా చేయాలనే లక్ష్యాన్ని ఎల్జీ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ధరలు తగ్గే అవకాశం..! శాంసంగ్ కొన్ని సంవత్సరాల క్రితం ఫోల్డబుల్ ఫోన్లను లాంచ్ చేయగా , ఆ స్మార్ట్ఫోన్ల ధర గణనీయంగా ఉన్నాయి. ఎల్జీ కెమ్ తయారుచేసిన స్క్రీన్తో ఫోల్డబుల్ ఫోన్ల ధరలు గణనీయంగా పడిపోయే అవకాశం ఉందనీ ఎల్జీ తెలిపింది. ఎల్జి కెమ్ స్క్రీన్ మెటీరియల్ తక్కువ మిల్లీమీటర్ల మందాన్ని మాత్రమే కలిగి ఉండనున్నట్లు తెలుస్తోంది. మన్నిక విషయానికి వస్తే ఈ స్క్రీన్ను సుమారు 2 లక్షల సార్లు మడత పెట్టవచ్చునని ఎల్జీ పేర్కొంది. ఎల్జీ కెమ్ వచ్చే ఏడాది నుంచి రియల్ ఫోల్డింగ్ విండో స్క్రీన్ను భారీ సంఖ్యలో ఉత్పత్తి ప్రారంభించాలని భావిస్తోంది. చదవండి: భారత్కు గుడ్బై చెప్పిన మరో దిగ్గజ కంపెనీ..! -
రియల్మీ నుంచి వాషింగ్ మెషిన్.. వచ్చేది ఎప్పుడంటే?
స్మార్ట్ఫోన్ తయారీలో ఇప్పటికే తనదైన ముద్ర వేసిని రియల్మీ మరింతగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలో ఉంది. గాడ్జెట్స్ నుంచి హోమ్ అప్లయెన్స్ రంగంలో కాలు మోపేందుకు రంగం సిద్ధం చేసింది. టెక్లైఫ్ బ్రాండ్ హోం అప్లయెన్స్ విభాగంలో ఎల్జీ, శామ్సంగ్ కంపెనీలదే హవా నడుస్తోంది. వీటికి పోటీ ఇచ్చేందుకు రియల్మీ సిద్ధమైంది. అందులో భాగంగా రియల్మీ టెక్లైఫ్ అనే బ్రాండ్తో వరుసగా ఉత్పత్తులు రిలీజ్ చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా మొదటగా రియల్ మీ నుంచి వాషింగ్ మెషిన్ మార్కెట్లోకి రానుంది. దీపావళి స్మార్ట్ఫోన్ రంగంలో నాణ్యత, ఎక్కువ ఫీచర్లు, తక్కువ ధర అనే మూడు సూత్రాలతో రియల్ మీ విజయ బావుటా ఎగురవేసింది. తక్కువ కాలంలోనే ఇండియాలో అత్యధికంగా స్మార్ట్ఫోన్లు అమ్మిన కంపెనీగా రికార్డు సృష్టించింది. మరోసారి సక్సెస్ టెక్నిక్ని హోం అప్లయెన్స్ విభాగంలో కూడా రియల్మీ అమలు చేస్తుందని, ధరల యుద్ధం తప్పదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టాప్లోడింగ్ వాషింగ్ మెషిన్ ధరకే ఫ్రంట్లోడ్ వాషింగ్ మెషిన్ రియల్ తెచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల మాటగా వినిపిస్తోంది. దీపావళి పండక్కి రియల్ మీ నుంచి వాషింగ్ మెషిన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. రియల్మీ విస్తరణ స్మార్ట్ఫోన్ మార్కెట్లో విజయం సాధించిన వెంటనే ల్యాప్ట్యాప్ల అమ్మకంలోకి రియల్మీ ప్రవేశించింది. తక్కువ ధరకే నోట్బుక్ పేరిట ల్యాప్ల్యాప్లను మార్కెట్లోకి తెచ్చింది. ఇప్పటికే రియల్మీ నుంచి ట్రిమ్మర్లు, షేవర్లు మార్కెట్లో ఉన్నాయి. చదవండి: భారత్లోకి రియల్మీ బుక్ -
జనాలు ఈ 'టీవీ' బ్రాండ్నే ఎక్కువ ఇష్టపడుతున్నారు
న్యూఢిల్లీ: దేశంలో అత్యంత ఇష్టపడే టీవీ బ్రాండ్గా 2021 సంవత్సరానికిగాను ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం ఎల్జీ నిలిచింది. ట్రస్ట్ రీసెర్చ్ అడ్వైజరీ ఈ మేరకు జాబితా విడుదల చేసింది. 2019తోపాటు 2020 సంవత్సరంలో అత్యంత నమ్మకమైన టీవీ బ్రాండ్గా కంపెనీ అవార్డు దక్కించుకుంది. వరుసగా మూడు సంవత్సరాలపాటు ఉన్నత గౌరవాన్ని పొందడం భారతీయ మార్కెట్ పట్ల సంస్థకు ఉన్న నిబద్ధతకు నిదర్శనమని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా హోం ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్ హక్ హ్యున్ కిమ్ తెలిపారు. -
అదిరిపోయే ఫీచర్లు, మాస్కులోనే మైక్, స్పీకర్లు ఇంకా
కరోనా కారణంగా ప్రతిఒక్కరూ మాస్క్లు ధరించాల్సి వస్తుంది. కొన్ని సార్లు మనం మాట్లాడే మాటల్ని ఎదుటి వారికి స్పష్టం చెప్పేందుకు మాస్క్లు తీస్తుంటాం. అదే సమయంలో నోట్లో నుంచి బయటకు వెళ్లే గాలి కళ్లద్దాల్లోకి వెళ్లి మసక ఏర్పడుతుంది. మాస్క్ ధరించి గాలి పీల్చడం సమస్యగా మారింది. అందుకే మాస్క్ ధరించినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు తగ్గట్లు ఎలక్ట్రానిక్ సంస్థలు గాడ్జెట్స్ను అందుబాటులోకి తెస్తున్నాయి. తాజాగా ఎల్జీ సంస్థ అందుబాటులోకి తెచ్చిన ఫేస్ మాస్క్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. మాట్లాడే సమయంలో మాస్క్ తీయాల్సి ఉంటుంది. కానీ, ఎల్జీ అందుబాటులోకి తెచ్చిన ఈ ఫేస్ మాస్క్ తీసే పనిలేకుండా ఇన్ బిల్ట్ మైక్, స్పీకర్లతో ఓ మాస్క్ను తయారు చేసింది. మన మాటలు ఎదుటి వారికి అర్ధమయ్యేలా చేస్తుంది. 1000 ఎంఏ బ్యాటరీ కెపాసిటీ, 94 గ్రాముల బరువు ఉండే ఈ మాస్క్ ధరిస్తే తీసే అవసరం ఉండదు. దీన్ని రెండు గంటల పాటు ఛార్జ్ చేస్తే 8గంటల పాటు పనిచేస్తుంది. పీల్చే గాలిని ఫ్యూరిఫైర్ చేయడమే కాదు,కళ్లదాల్లోకి గాలివెళ్లకుండా చూసుకుంటుంది. నోటితోపాటు చెంపల్ని కవర్ చేస్తోందని ఎల్జీ అధికారికంగా ప్రకటించింది. దీంతో పాటు కొన్ని గంటల పాటు ధరించిన అసౌకర్యం కలగకుండా చూసుకుంటుంది. ఇక, ఈ పరికరం ఆగస్ట్ నెలలో థాయ్లాండ్ మార్కెట్ లో విడుదల చేసేందుకు సిద్ధం కాగా.. ఇతర దేశాల్లో విడుదల చేసేందకు రెగ్యులేటర్ల ఆమోదం కోసం ఎదురు చూస్తుంది. ధర ఇంకా ప్రకటించలేదు. ఇండియా మార్ట్లో దీని ధర రూ.32.200గా ఉంది. -
ఫ్లిప్కార్ట్ ధమాకా సేల్: ఇన్వర్టర్ ఏసీలపై భారీ తగ్గింపు
సాక్షి, ముంబై: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ డిస్కౌంట్ల సేల్కు తెర తీసింది. ‘ మాన్సూన్ ధమకా సేల్’ పేరుతో 4 రోజుల అమ్మకాలను ప్రారంభించింది. జూన్ 30 వరకు జరగనున్న ఈ అమ్మకాల్లో స్పెషల్ డిస్కౌంట్లను అందిస్తుంది. అలాగే హెచ్డీఎఫ్సీ, ఎస్బిఐ క్రెడిట్ కార్డుల కొనుగోళ్లకు ప్రత్యేక క్యాష్ బ్యాక్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది. ముఖ్యంగా శాంసంగ్, ఎల్జీ, ప్యానసోనిక్, బ్లూస్టార్, వర్ల్పూల్, కేరియర్, వోల్టాస్, ఒనిడా కంపెనీల ఏసీలపై 41 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. శాంసంగ్: 1.5 టన్నుల 5 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ: రూ .34,990 (అసలు రూ. 56,990) 38 శాతం తగ్గింపు 5 స్టార్ బీఇ రేటింగ్, టర్బో కూలింగ్ ఫీచర్తో పాటు డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ దీని సొంతం. క్యారియర్ 4-ఇన్ -1 కన్వర్టిబుల్ కూలింగ్ 1.5 టన్నుల స్ప్లిట్ ఇన్వర్టర్ ఎసి: రూ .39,990 (అసలు రూ .61,990) 35శాతం తగ్గింపు వోల్టాస్ 2 ఇన్ 1 కన్వర్టిబుల్ కూలింగ్ 1.2 టన్ను 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఎసి: రూ .28,990 (అసలు రూ. 54,990) వద్ద లభిస్తుంది 47శాతం తగ్గింపు వర్ల్పూల్ 1.5 టన్ను 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ రూ .31,490 (అసలు ధర రూ .53,420) 41 శాతం తగ్గింపు బ్లూ స్టార్ 1.2 టన్ను 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ: రూ .30,490 (అసలు ధర రూ .50,000). 39 శాతం తగ్గింపు చదవండి : ఫ్రాంక్లిన్ టెంపుల్టన్కు ఊరట -
6జీ టెక్నాలజీ అభివృద్ధి దిశగా ఎల్జీ కంపెనీ
ప్రపంచవ్యాప్తంగా తన మొబైల్ ఫోన్ వ్యాపారాన్ని మూసివేస్తున్నట్లు ప్రముఖ ఎల్జీ కంపెనీ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా 6జీ టెక్నాలజీ అభివృద్ధిలో భాగంగా యుఎస్ ఆధారిత సంస్థ కీసైట్ టెక్నాలజీస్, కొరియా అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్&టెక్నాలజీలతో చేతులు కలిపినట్లు ప్రకటించింది. ఈ మూడు సంస్థలు కలిసి 6జీ టెక్నాలజీని వీలైనంత త్వరగా తీసుకొని రావడానికి పరిశోధనపై దృష్టి పెట్టాయి. ఒప్పందం ప్రకారం.. 6జీ కమ్యూనికేషన్లకు కీలకమైన ఫ్రీక్వెన్సీ బ్యాండ్ టెరాహెర్ట్జ్కు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో ఒకదానికొకటి సహకారం అందించుకోనున్నాయి. 2024 నాటికి 6జీ పరిశోధనలను పూర్తి చేయాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నట్లు యోన్హాప్ వార్తా సంస్థ నివేదించింది. 6జీ నెట్వర్క్ ను వాణిజ్య పరంగా 2029లో అందుబాటులోకి తీసుకోని రానున్నట్లు ఎల్జీ పేర్కొంది. 5జీ అన్ని దేశాలలో అందుబాటులో రాకముందే 6జీ టెక్నాలజీ అభివృద్ధిపై అనేక సంస్థలు దృష్ట్టి సారించాయి. 6జీ డేటా వేగం 5జీ పోలిస్తే అనేక రేట్లు అధికంగా ఉండనున్నట్లు కంపెనీ తెలిపింది. ఎల్జీ 2019లో కైస్ట్ తో కలిసి 6జీ పరిశోధనా కేంద్రాన్ని స్థాపించింది. 6జీ టెక్నాలజీలను అధ్యయనం చేయడానికి కొరియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ సైన్స్ తో గత సంవత్సరం ఒప్పందం కుదుర్చుకుంది. కీసైట్ టెక్నాలజీస్ 6జీ టెరాహెర్ట్జ్ పరీక్ష పరికరాలకు ప్రధాన సరఫరాదారుడు. ఇది ఎల్జీ, కైస్ట్ యొక్క 6జీ పరిశోధన కేంద్రానికి పరికరాలను అందిస్తోంది. ఈ కొత్త తరువాతి తరం 6జీ టెక్నాలజీ వల్ల డిజిటల్ హెల్త్కేర్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, స్మార్ట్ సిటీలు, స్మార్ట్ ఫ్యాక్టరీలు, పెనుమార్పులు చోటు చేసుకోనున్నాయి. -
వెల్లువెత్తనున్న ప్రకటనలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రకటనలు, మార్కెటింగ్ కార్యకలాపాలకు కంపెనీలు 2021-22లో పెద్ద ఎత్తున వ్యయం చేయనున్నాయి. కోవిడ్-19 కారణంగా 2020లో భారత ప్రకటనల పరిశ్రమ విలువ పరంగా 21.5 శాతం తగ్గింది. ప్రస్తుత సంవత్సరంలో 23.2 శాతం వృద్ధితో పరిశ్రమ రూ.80,123 కోట్లకు చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. మారుతి సుజుకి, అమూల్, ఎల్జీ, పార్లే, పెప్సికో, వివో, మారికో, ఇమామి, వోల్టాస్, బ్లూ స్టార్ వంటి ప్రముఖ కంపెనీలు ప్రకటనలు, మార్కెటింగ్కు భారీగా ఖర్చు చేయనున్నాయి. కొన్ని సంస్థలు గతం కంటే 50 శాతం వరకు అధికంగా వెచ్చించనున్నట్టు సమాచారం. ఆదాయంతోపాటు మార్కెట్ వాటాను పెంచుకునే వేటలో కంపెనీలు ఖర్చుకు వెనుకాడడం లేదు. డిమాండ్ నేపథ్యంలో.. కొన్ని నెలలుగా కస్టమర్లు వస్తువులు, ఉత్పత్తుల కోసం ఖర్చు చేస్తుండడం కంపెనీలను ఆకట్టుకుంటోంది. మహమ్మారి మూలంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నష్టపోయిన వ్యాపారం నుంచి రికవరీకి 2021-22లో చేసే వ్యయాలు దోహదం చేస్తాయని సంస్థలు భావిస్తున్నాయి. వేసవిలో ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, శీతల పానీయాలు, ఐసీ క్రీమ్స్ వంటి విభాగాలకు డిమాండ్ ఉంటుంది. ఈ విభాగాల్లో వ్యాపారం సాగిస్తున్న కంపెనీలు ఆ మేరకు ప్రకటనలు, మార్కెటింగ్పై వ్యయాలను పెంచనున్నాయి. గతేడాది డిజిటల్ ప్రకటనలకు పరిమితమైన ఈ సంస్థలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో అన్ని వేదికలనూ వినియోగించు కోనున్నాయి. ప్రధానంగా ప్రింట్ మీడియా కీలకం కానుందని కాంటినెంటల్ కాఫీ మార్కెటింగ్ హెడ్ ప్రీతమ్ పటా్నయక్ తెలిపారు. ఎఫ్ఎంసీజీ రంగం 15-20 శాతం అధికంగా వ్యయం చేయనుందని అన్నారు. ఖర్చుల్లోనూ పోటీయే.. ప్రకటనలు, మార్కెటింగ్ కోసం చేసే వ్యయాల్లోనూ కంపెనీలు పోటీపడుతున్నట్టు ఉంది. 2021-22లో ఎల్జీ ఏకంగా రూ.650 కోట్లు వ్యయం చేయనుంది. గతంతో పోలిస్తే ఇది ఏకంగా 50 శాతం అధికం. ఇప్పటి వరకు ఎల్జీ ఇండియా ఈ స్థాయిలో ఖర్చు చేయకపోవడం గమనార్హం. అంచనాలను మించి మార్కెట్ రికవరీ అయిందని, ప్రీమియం ఉత్పత్తుల పట్ల కస్టమర్లు ఆసక్తి చూపుతున్నారని ఎల్జీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ విజయ్ బాబు అన్నారు. బ్లూ స్టార్ రూ.35 కోట్ల నుంచి రూ.64 కోట్లకు బడ్జెట్ పెంచింది. గతేడాది లాక్డౌన్ సడలింపుల తర్వాత ఆగస్టు-సెప్టెంబర్ నుంచి కంపెనీలు ప్రకటనలు, మార్కెటింగ్ కోసం ఖర్చు చేయడం ప్రారంభించాయి. దాదాపు 2019-20 మాదిరిగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ వ్యయాలు చేశాయి. ముందు వరుసలో ఎఫ్ఎంసీజీ.. భారత్లో ఫాస్ట్ మూవింగ్ కంజ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) విభాగంలోని కంపెనీలు ప్రకటనలు, మార్కెటింగ్ విషయంలో ముందున్నాయి. ఆ తర్వాత ఈ-కామర్స్, ఆటోమొబైల్, టెలికం, రిటైల్, డ్యూరబుల్స్ కంపెనీలు పోటీపడుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనూ ఎఫ్ఎంసీజీ కంపెనీల ప్రకటనలు ప్రధానంగా వెలువడుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో రియల్టీ రంగం ప్రధాన ఆకర్షణ అని బ్రాండింగ్ సేవల్లో ఉన్న జాన్రైజ్ క్రియేటివ్ డైరెక్టర్ సుమన్ గద్దె తెలిపారు. గతంలో లేని విధంగా ఆరోగ్య బీమా, మ్యూచువల్ ఫండ్స్ ప్రకటనలూ వెల్లువెత్తుతున్నాయని చెప్పారు. ఇక్కడి మార్కెట్లో హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, వరంగల్, గుంటూరు వంటి పెద్ద నగరాలు, ఖర్చులకు వెనుకాడని కస్టమర్లు ఉండడమూ కంపెనీలకు కలిసి వస్తోందని వివరించారు. చదవండి: ఫేస్బుక్ మరో సంచలనం -
ఏప్రిల్ 1 విడుదల... ధర దడ
న్యూఢిల్లీ: ఎల్ఈడీ టీవీల ధరలు మరోసారి పెరగనున్నాయి. ఏప్రిల్ నుంచి ఈ వడ్డింపు ఉండనుంది. ఓపెన్–సెల్ ప్యానెళ్లు ఖరీదు కావడమే ఇందుకు కారణం. గత నెల రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ప్యానెళ్ల ధర 35 శాతం వరకు అధికమైందని కంపెనీలు అంటున్నాయి. వచ్చే నెల నుంచి టీవీల ధరలు పెంచాలని ప్యానాసోనిక్, హాయర్, థామ్సన్ భావిస్తున్నాయి. ఇప్పటికే ఎల్జీ ఈ ప్రక్రియను పూర్తి చేసింది. మొత్తంగా 5–7 శాతం ధర పెరిగే చాన్స్ ఉంది. టీవీ స్క్రీన్ తయారీలో ఓపెన్–సెల్ ప్యానెల్ అత్యంత కీలక విడిభాగం. మొత్తం ధరలో దీని వాటాయే అధికంగా 60% వరకు ఉంటుంది. కంపెనీలు టెలివిజన్ ప్యానెళ్లను ఓపెన్–సెల్ స్థితిలో దిగుమతి చేసుకుంటాయి. చైనా సంస్థలే ఓపెన్–సెల్ తయారీ రంగాన్ని శాసిస్తున్నాయి. ఇక అప్లయెన్సెస్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్లో టీవీలదే అగ్రస్థానం. దేశంలో ప్రస్తుతం ఏటా 1.7 కోట్ల టీవీలు అమ్ముడవుతున్నాయి. వీటి విలువ రూ.25,000 కోట్లు. 2024–25 నాటికి మార్కెట్ 2.84 కోట్ల యూనిట్లకు చేరుతుందని సియామా, ఫ్రాస్ట్ అండ్ సల్లివాన్ అంచనా. మరో మార్గం లేకనే..: ప్యానెళ్లు ప్రియం అవుతూనే ఉన్నందున టీవీల ధర కూడా అధికం అవుతుందని ప్యానాసోనిక్ ఇండియా, సౌత్ ఆసియా ప్రెసిడెంట్ మనీష్ శర్మ తెలిపారు. ప్రస్తుత పరిస్థితులనుబట్టి టీవీల ధర వచ్చే నెలకల్లా 5–7 శాతం అధికం కానుందని ఆయన వెల్లడించారు. ధరల సవరణ తప్ప తమకు మరో మార్గం లేదని హాయర్ అప్లయెన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా తెలిపారు. ఓపెన్–సెల్ ప్రైస్ గణనీయంగా పెరిగిందని, ట్రెండ్ ఇలాగే కొనసాగనుందని అన్నారు. ఓపెన్–సెల్కు అనుగుణంగా టీవీల ధరలను సవరించాల్సిందేనని స్పష్టం చేశా రు. తాము టీవీల ధరను పెంచడం లేదని ఎల్జీ వెల్లడించింది. జనవరి, ఫిబ్రవరిలో ధరలను సవరించామని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా హోం అప్లయెన్సెస్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ బాబు తెలిపారు. వాటికి కొరత ఉన్నందునే.. మార్కెట్లో ఓపెన్–సెల్ ప్యానెళ్లకు కొరత ఉందని సూపర్ ప్లాస్ట్రానిక్స్ తెలిపింది. గడిచిన ఎనిమిది నెలల్లో వీటి ధర మూడింతలైందని కంపెనీ సీఈవో అవనీత్ సింగ్ మార్వా తెలిపారు. అంతర్జాతీయంగా ప్యానెళ్ల మార్కెట్ మందగించిందని, అయినప్పటికీ నెల రోజుల్లో ధర 35% అధికమైందని చెప్పారు. ఏప్రిల్ నుంచి ఒక్కో టీవీ ధర కనీసం రూ.2–3 వేలు పెరగనుందన్నారు. ఫ్రాన్స్ కంపెనీ థామ్సన్, యూఎస్ సంస్థ కొడాక్ టీవీల లైసెన్స్ను భారత్లో సూపర్ ప్లాస్ట్రానిక్స్ కలిగి ఉంది. అత్యధికంగా అమ్ముడయ్యే 32 అంగుళాల టీవీల ధర రూ. 5–6 వేలు పెరగ వచ్చని వీడియోటెక్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ అర్జున్ బజాజ్ చెప్పారు. -
గేమింగ్ టీవీ లాంచ్ చేసిన ఎల్జీ
ఎల్జీ మనదేశంలో సరికొత్త టీవీని లాంచ్ చేసింది. దీన్ని ప్రత్యేకంగా గేమర్ల కోసం రూపొందించారు. గేమింగ్ కోసం ఆటో లో-లాటెన్సీ మోడ్తో తీసుకొచ్చిన ఎల్జీ ఓఎల్ఈడీ 48సీఎక్స్ టీవీ ధర రూ.1,99,990గా ఉంది. ఈ ఓఎల్ఈడీ టీవీలో వేగవంతమైన గేమ్ ప్లేతో పాటు అద్భుతమైన విజువల్స్ను అందిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. స్మార్ట్ టీవీలో ఏఎమ్ డీ ఫ్రీసింక్, ఎన్విడియా జి-సింక్ సపోర్ట్ ఉంది. ఈ 48 అంగుళాల టీవీ ఆల్ఫా 9 జెన్ 3 ప్రాసెసర్తో పనిచేస్తుంది. ఆడియో కోసం ఎఐ ఎకౌస్టిక్ ట్యూనింగ్తో పాటు 'హెచ్డిఆర్ 10 ప్రో' సపోర్ట్ను అందిస్తుంది. ఎల్జీ పేర్కొన్నట్లు 4కే రిజల్యూషన్ ప్యానల్ను కలిగి ఉంది. ఇందులో 48 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. ఇందులో ఎక్కువ ఫ్రేం రేట్, వీఆర్ఆర్ (వేరియబుల్ రిఫ్రెష్ రేట్), ఈఆర్క్, హెచ్డీఎంఐ 2.1 స్పెసిఫికేషన్లు ఉన్నాయి. పీఎస్5, ఎక్స్బాక్స్ సిరీస్ ఎక్స్/ఎస్ కన్సోల్స్ కూడా ఉన్నాయి. అలాగే వీఆర్ఆర్ ఫీచర్ ద్వారా మీరు కనెక్ట్ చేసిన గేమింగ్ కన్సోల్కు తగినట్లు స్క్రీన్ రిఫ్రెష్ రేట్ మారుతుంది. ఇందులో సెల్ప్ లిట్ పిక్సెల్స్ అనే ఫీచర్ కూడా ఉంది. దీని ద్వారా సినిమాలు చూసేటప్పుడు, గేమ్స్ ఆడేటప్పుడు మంచి కలర్ను టీవీ అందిస్తుంది. దీన్ని కొనుగోలు చేయాలనుకునే వారు ఎల్జీ ఇండియా వెబ్ సైట్లోకి వెళ్లి తమ ప్రాంతంలో ఇది అందుబాటులో ఉందో లేదో చూసుకోవచ్చు. చదవండి: గూగుల్లో ఇవి వెతికితే మీ పని అంతే! ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్ -
ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ లో బెస్ట్ బడ్జెట్ మొబైల్స్ ఇవే!
న్యూఢిల్లీ: మీరు బడ్జెట్ లో మంచి మొబైల్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు ఒక శుభవార్త. మొబైల్ లవర్స్ కోసం క్రిస్మస్ పండుగ సందర్బంగా అమెజాన్ సరికొత్త ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ ని తీసుకొచ్చింది. ఈ సేల్ డిసెంబర్ 22 నుండి డిసెంబర్ 25 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ లో భాగంగా శామ్సంగ్, ఒప్పో, నోకియా, ఎల్జీ, వివో వంటి బ్రాండ్ల మొబైల్స్ మీద ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తున్నారు. దీనికి తోడు మీరు ఐసీఐసీఐ, ఎస్బిఐ, హెచ్డీఎఫ్సి బ్యాంకు క్రెడిట్ కార్డుల ద్వారా నో కాస్ట్ ఇఎంఐని కూడా పొందగలరు. హెచ్డీఎఫ్సి క్రెడిట్ కార్డులను ఉపయోగించి మొబైల్స్ కొంటె 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ (రూ.1,500) పొందే అవకాశం ఉంది. ఈ సేల్ లో భాగంగా తీసుకొచ్చిన కొన్ని బెస్ట్ బడ్జెట్ మొబైల్స్ మేము మీకోసం అందిస్తున్నాం.(చదవండి: 5వందల కోసం 5వేలు పెట్టుబడి పెడుతున్నారా జాగ్రత్త!) ఒప్పో ఏ11కే ఒప్పో ఏ11కే ఈ ఆఫర్ లో భాగంగా మీకు రూ.8,490కి లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.10990. ఇది 6.2-అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది మీడియా టెక్ హీలియో పీ35 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇందులో 2జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్ధ్యం వచ్చేసి 4,230 ఎంఏహెచ్. ఒప్పో ఏ11కే మొబైల్ లో 13 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం 5 మెగాపిక్సల్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. నోకియా 5.3 నోకియా 5.3 ఈ ఆఫర్ లో భాగంగా మీకు రూ.11,999కి లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.16,599. ఇది 6.55-అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇందులో 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్ధ్యం వచ్చేసి 4,000 ఎంఏహెచ్. నోకియా 5.3 మొబైల్ లో 13 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ అంగిల్ కెమెరా, 2 మెగా పిక్సల్ డెప్త్, మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం 8 మెగాపిక్సల్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. శామ్సంగ్ గెలాక్సీ ఎమ్11 శామ్సంగ్ గెలాక్సీ ఎమ్11 ఈ ఆఫర్ లో భాగంగా మీకు రూ.10,000కి లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.12,999. ఇది 6.4-అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది SDM450-F01 ఆక్టో కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇందులో 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్ధ్యం వచ్చేసి 5,000 ఎంఏహెచ్. శామ్సంగ్ గెలాక్సీ ఎమ్11 మొబైల్ లో 13 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ అంగిల్ కెమెరా, 2 మెగా పిక్సల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం 8 మెగాపిక్సల్ కెమెరా కూడా అందుబాటులో ఉంది.(చదవండి: రూ.14వేలకే శామ్సంగ్ 5జీ మొబైల్) ఎల్జీ డబ్ల్యూ30 ప్రో ఎల్జీ డబ్ల్యూ30 ప్రో ఈ ఆఫర్ లో భాగంగా మీకు రూ.12,990కి లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.14,999. ఇది 6.21-అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 632 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇందులో 3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్ధ్యం వచ్చేసి 4,050 ఎంఏహెచ్. ఎల్జీ డబ్ల్యూ30 ప్రో మొబైల్ లో 13 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగాపిక్సల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం 16 మెగాపిక్సల్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. వివో వై91ఐ వివో వై91ఐ ఈ ఆఫర్ లో భాగంగా మీకు రూ.8,490కి లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.11,990. ఇది 6.22-అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది మీడియా టెక్ హీలియో పీ22 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇందులో 3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్ధ్యం వచ్చేసి 4,030 ఎంఏహెచ్. వివో వై91ఐ మొబైల్ లో 13 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా ఉంది. సెల్ఫీ కోసం 5 మెగాపిక్సల్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. రెడ్మీ 9 పవర్ రెడ్మీ 9 పవర్ మొబైల్ నేడే ఫస్ట్ సేల్ కి వచ్చింది. దీని ధర వచ్చేసి రూ.10,999. ఇది 6.53-అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 662 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇందులో 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. రెడ్మీ 9 పవర్ మొబైల్ లో 48 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సల్ సెకండరీ కెమెరా, 2 ఎంపీ మాక్రో, 2 ఎంపీ డెప్త్ కెమెరా సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీ కోసం ఇందులో 8ఎంపీ కెమెరా ఉంది. ఇది 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 6000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. -
షియోమీ మరో సంచలనం
గత కొన్ని నెలలుగా మొబైల్ పరిశ్రమలో పెద్ద పెద్ద కంపెనీలు రోలబుల్ ఫోన్ తీసుకోని రావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో షియోమీ కూడా చేరబోతోంది. త్వరలో షియోమీ రోలబుల్ స్మార్ట్ఫోన్ను మొబైల్ లవర్స్ కి పరిచయం చేయబోతోంది. ఇప్పటికే ఈ టెక్నాలజీ ఇంకా అభివృద్ధి దశలో ఉన్నపటికీ, దీనిని భారీ ఎత్తున తీసుకురావడానికి షియోమీ ప్రయత్నిస్తుంది. సాంసంగ్ నుంచి ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లు వస్తున్నాయి. గెలాక్సీ ఫోల్డ్ స్మార్ట్ఫోన్ను ప్రపంచానికి పరిచయం చేసింది సాంసంగ్. ఎల్జీ ఇదివరకే డ్యూయెల్ డిస్ప్లో స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసింది. త్వరలో మరో మోడల్ ని కూడా తీసుకురాబోతుంది. (చదవండి: డిస్నీప్లస్లో హాట్స్టార్.. హాట్హాట్) టిసిఎల్ మరియు ఒప్పో తీసుకొస్తున్ రోలబుల్ డిస్ప్లే ఫోన్ల మాదిరిగానే షియోమి ఫోన్ కూడా అలాంటి డిజైన్ను తీసుకొస్తున్నట్లు సమాచారం. షియోమీ యునైటెడ్ స్టేట్స్ పేటెంట్ మరియు ట్రేడ్మార్క్ కార్యాలయంలో రోలబుల్ ఫోన్ పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకుంది. పేటెంట్ లో చూపినట్లుగా దీనిని రోల్ చేస్తే స్మార్ట్ఫోన్ లాగా కనిపిస్తుంది. ట్యాబ్లెట్ లాగా కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు. అకా కాన్సెప్ట్ క్రియేటర్ షియోమీ రోలబుల్ పేటెంట్ల ఇమేజెస్ సహాయంతో షావోమీ రోలబుల్ స్మార్ట్ఫోన్ రెండర్ క్రియేట్ చేశాడు. ఇది చూడటానికి మి మిక్స్ ఆల్ఫా కాన్సెప్ట్ లాగా ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ డిజైన్ కేవలం స్కెచ్ మాత్రమే. డివైజ్ తయారైన తర్వాత దీనికి భిన్నంగా కూడా ఉండొచ్చు. ఈ మొబైల్ వచ్చే ఏడాది ప్రారంభంలో లేదా చివరలో రావచ్చు. -
సరికొత్త డిజైన్తో ఎల్జీ 'వెల్వెట్' లాంచ్
సాక్షి, ముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ, సౌత్కొరియా టెక్ దిగ్గజం ఎల్జీ కొత్త స్మార్ట్ ఫోను లాంచ్ చేసింది. సరికొత్త డిజైన్, డ్యూయల్ స్క్రీన్ యాక్సెసరీతో ఎల్జీ వెల్వెట్ స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్ లో విడుదల చేసింది. స్టీరియో స్పీకర్లు, అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 15వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ లాంటి ఇతర ఫీచర్లు ఈ స్మార్ట్ఫోన్లో ప్రధాన ఆకర్షణ. ధర లభ్యత ఎల్జీ వెల్వెట్ ప్రారంభం ధర 36,990 రూపాయలు. అయితే డ్యూయల్ స్క్రీన్ యాక్సెసరీ మోడల్ ధర 49,990 రూపాయలు. ఇది అక్టోబర్ 30 నుండి అన్ని ప్రముఖ ఆన్లైన్, ఆఫ్లైన్ రిటైలర్లలో అందుబాటులో ఉంటుంది. బ్లాక్ అరోరా సిల్వర్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఎల్జీ వెల్వెట్ ఫీచర్లు 6.8 అంగుళాల స్క్రీన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 10 విత్ ఎల్జీ యుఎక్స్ 9 2340 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ 6 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ 2 టీబీదాకా విస్తరించుకునే అవకాశం 48+8+5 ఎంపీ ట్రిపుల్ రియర్ 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 4300ఎంఏహెచ్ బ్యాటరీ -
ఎల్జీ బాలకృష్ణన్- ఇప్కా ల్యాబ్స్ జూమ్
ఆటుపోట్ల మధ్య ప్రారంభమైన దేశీ మార్కెట్లు జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 187 పాయింట్లు పెరిగి 40,332కు చేరగా.. నిఫ్టీ 63 పాయింట్లు బలపడి 11,831 వద్ద ట్రేడవుతోంది. కాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ఎల్జీ బాలకృష్ణన్ అండ్ బ్రదర్స్ అంచనాలకు అనుగుణమైన ఫలితాలు ప్రకటించింది. ఈ బాటలో క్యూ3పై అంచనాలు పెరగడంతో ఈ ఆటో విడిభాగాల కంపెనీ కౌంటర్కు డిమాండ్ పెరిగింది. మరోపక్క క్యూ2లో ఆకర్షణీయ పనితీరు చూపనున్న అంచనాలతో హెల్త్కేర్ రంగ కంపెనీ ఇప్కా ల్యాబొరేటరీస్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు షేర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఎల్జీ బాలకృష్ణన్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఎల్జీ బాలకృష్ణన్ నికర లాభం దాదాపు 24 శాతం క్షీణించి రూ. 28 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం మాత్రం నామమాత్ర వృద్ధితో రూ. 412 కోట్లను తాకింది. అయితే ఇటీవల ఆటో రంగం జోరందుకోవడంతో క్యూ3(అక్టోబర్- డిసెంబర్)లో మరింత మెరుగైన పనితీరును చూపవచ్చన్న అంచనాలు పెరిగినట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఎల్జీ బాలకృష్ణన్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 9 శాతం దూసుకెళ్లి రూ. 272 వద్ద ట్రేడవుతోంది. ఇప్కా ల్యాబొరేటరీస్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఇప్కా ల్యాబొరేటరీస్ ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించనున్న అంచనాలు పెరిగాయి. దీంతో ఎన్ఎస్ఈలో తొలుత ఇప్కా ల్యాబ్ షేరు 9 శాతం దూసుకెళ్లింది. రూ. 2,319 సమీపంలో సరికొత్త గరిష్టానికి చేరింది. ప్రస్తుతం కొంత వెనకడుగు వేసి 5.5 శాతం లాభంతో రూ. 2,240 వద్ద ట్రేడవుతోంది. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్- జూన్)లో కంపెనీ నికర లాభం మూడు రెట్లు జంప్చేసి రూ. 129 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 41 శాతం పెరిగి రూ. 1,546 కోట్లకు చేరింది. కాగా.. యాంటీమలేరియల్ బిజినెస్లో గ్లోబల్ ఫండ్ నుంచి మద్దతు లభించడం, యూఎస్ఎఫ్డీఏ నుంచి దిగుమతులపై అడ్డంకులు తొలగిపోవడం వంటి అంశాలు కంపెనీ పనితీరుకు దోహదపడగలవని ఆగస్ట్ నివేదికలో రేటింగ్ దిగ్గజం క్రిసిల్ పేర్కొంది. ఇది ఇన్వెస్టర్లకు హుషారునిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. -
ఎల్జీ అద్భుత ఆవిష్కారం: త్వరలో
సాక్షి, ముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ఎల్జీ తన దూకుడును పెంచింది. విలక్షణమైన ఇంకా ఎవరూ కనిపెట్టని కొత్త వినియోగ అనుభవాలతో కొత్త స్మార్ట్ఫోన్లను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నఎల్జీ తన ఎక్స్ప్లోరర్ ప్రాజెక్ట్ను ప్రారంభిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఇందులో భాగంగా తొలి మోడల్ సెప్టెంబర్ 14న లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు టీజర్ వీడియోను విడుదల చేసింది. ఎల్జీ తన గ్లోబల్ యూట్యూబ్ ఛానెల్లో విడుదల చేసిన వీడియో ప్రకారం రొటేటింగ్, డ్యుయల్ స్క్రీన్ హ్యాండ్సెట్ను టీ షేప్ డిజైనుతో ఆవిష్కరించనుంది. ఎల్జి మొబైల్ గ్లోబల్ ఫేస్బుక్ , యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా సెప్టెంబర్ 14 న వర్చువల్ గా ఈ డివైస్ ను లాంచ్ చేయనుంది. దీని ఫీచర్లు, స్పెసిఫికేషన్లపై ఎటువంటి నిర్దిష్ట వివరాలను కంపెనీ అందించలేదు. అయితే క్వాల్కమ్, రేవ్, ఫిక్టో, ట్యూబి, నావర్లతో సహా ఇతర భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నట్టు సమాచారం. ఎల్జీ వింగ్ గా భావిస్తున్న కొత్త స్మార్ట్ఫోన్ ఫీచర్లపై ఇలా ఉన్నాయి. ఎల్జీ వింగ్ స్మార్ట్ఫోన్ ఫీచర్లు 6.8 అంగుళాల డిస్ ప్లే 1:1 యాస్పెక్ట్ రేషియోతో 4 అంగుళాల మరో స్క్రీన్ స్నాప్డ్రాగన్ 765 జి సాక్ 8జీబీ ర్యామ్ ట్రిపుల్ రియర్ కెమెరాలు ధర సుమారు రూ. 73,000 -
ఎల్జీ ఎయిర్ ప్యూరిఫైర్ ఫేస్మాస్క్
న్యూఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో మాస్కులు ధరించడం తప్పనిసరి అయ్యింది. ముఖానికి మాస్కు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తే పోలీసులు జరిమానా కూడా విధిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఎల్జీ ప్రజలకు గుడ్ న్యూస్ అందించింది. ఎల్జీ పూర్యరీకేర్ వేరబుల్ ప్యూరిఫైర్ ఫేస్ మాస్కును తయారు చేసినట్లు శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇప్పుడున్న మాస్కుల కన్నా మరింత ఎక్కువగా వడపోత ప్రక్రియ చేపడుతుందని ఎల్జీ కంపెనీ పేర్కొంది. దీనిలో బ్యాటరీతో నడిచే రెండు ఫ్యాన్లుతోపాటు రెస్పిరేటరీ సెన్సార్ పరిశుభ్రమైన, తాజా గాలిని అందిస్తుంది. అలాగే వేర్వేరు స్థాయిల్లో వేగాన్ని సర్దుబాటు చేసుకునేలా, అందరికీ సరిపోయేలా రూపొందించారు. అయితే ముఖానికి ధరించే పోర్టబుల్ ఎయిర్ ప్యూరిఫైయర్ మాస్క్ ధర వంటి వివరాలను మాత్రం సెప్టెంబరులో జరగనున్న ఐఎఫ్ఏ 2020లో వెల్లడించనున్నారు. ఎల్జీ ప్యూరీకేర్ వేరబుల్ ఎయిర్ ప్యూరిఫైర్లో గాలిని శుద్ధి చేసేందుకు రెండు హెచ్13 హెచ్ఈపీఏ ఫిల్టర్లు ఉపయోగించారు. అవసరమైనప్పుడు వాటిని మార్చుకోవచ్చు. ఇందులో అంతర్గతంగా రెండు ప్యాన్లను ఉపయోగించారు. ఇవి మూడు స్పీడ్ లెవల్స్ కలిగి ఉంటాయి. గాలి పీల్చుకునేటప్పుడు ఇవి వాటంతట అవే వేగం పుంజుకుని, వదిలేటప్పుడు నెమ్మదిస్తాయి. ఈ మాస్క్లో ఉపయోగించిన రెస్పిరేటరీ సెన్సార్ మాస్క్ ధరించిన వారి శ్వాస చక్రం, పరిమాణాన్ని గుర్తించి అందుకు అనుగుణంగా ఫ్యాన్ల వేగాన్ని సర్దుబాటు చేస్తుంది. (మాస్క్ ధరించలేదని ఫోన్ లాక్కొని..) ఫేస్మాస్క్లో 820 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు. మోడ్లో 8 గంటలు, హై మోడ్లో రెండు గంటలు పనిచేస్తుంది. ఎలక్ట్రానిక్ పరికరం కావడం వల్ల, దీనిని ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మాస్కులో చిక్కుకున్న హానికరమైన సూక్ష్మక్రిములను చంపే సందర్భంలో అతినీలలోహిత కాంతి వస్తుంది. ఫిల్టర్లను మార్చాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా గుర్తించి ఎల్జీ థింక్యూ యాప్ ద్వారా మనకు సంకేతాలను ఇస్తుంది. ఫేస్ మాస్క్లతో ప్రజలు కలిగి ఉన్న ఆందోళనలలో ఒకటి సౌకర్యం, రెండోది గాలి బయటకు రాకుండా సరిపోయేలా పూరీకేర్ను రూపొందించినట్లు ఎల్జీ పేర్కొంది. చివరికి ఎక్కువ గంటలు ధరించేంత సౌకర్యంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. -
ఎల్జీ పాలిమర్స్ పుట్టుక గురించి..
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో గల ఎల్జీ పాలిమర్స్ ఘటన రాష్ట్రం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ కంపెనీ నుంచి వెలువడిన విషవాయువుల కారణంగా చుట్టుపక్కల 5 కిలో మీటర్ల పరిధిలోని గ్రామాల ప్రజలు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఫ్యాక్టరీ నుంచి లీకైన స్టెర్లిన్ గ్యాస్ బాగా ఘాటుగా ఉండటంతో.. కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో స్థానికులు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలామంది రోడ్లపైకి వచ్చి పడిపోవడంతో అక్కడి పరిస్థితి భయానకంగా మారిపోయింది. రాష్ట్రం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ ఘటనకు కారణమైన ఎల్జీ పాలిమర్స్ గురించి తెలుసుకుందాం. ఎల్జీ పాలిమర్స్ పుట్టుక ఇదే.. హిందుస్తాన్ పాలిమర్స్ పేరుతో 1961లో ఈ కంపెనీ ప్రారంభించారు. 1978లో దీనిని యూబీ గ్రూప్ తీసుకుంది. 1997 జులైలో దక్షిణకొరియాకు చెందిన ఎల్జీ గ్రూప్(ఎల్జీ కెమికల్స్) తీసుకుని ఎల్జీ పాలిమర్స్గా మార్చింది. థర్మాకోల్ లాంటివి ఇందులో తయారు చేస్తారు. లాక్డౌన్ మినహాయింపుల్లో పరిశ్రమలకు అనుమతి ఇవ్వడంతో దీనిని తిరిగి ప్రారంభించారు. ప్రారంభించిన ఒక్క రోజులోనే ఈ గ్యాస్ లీకేజీ ఘటన జరిగింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరుకుంది. చదవండి: విశాఖకు రానున్న సీఎం వైఎస్ జగన్ విశాఖ ఎల్జీ పాలిమర్స్లో భారీ ప్రమాదం -
అద్భుత కెమెరాలతో ఎల్జీ వెల్వెట్ స్మార్ట్ఫోన్లు
సాక్షి, న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ రంగంలో తన ప్రత్యేకతను చాటుకుంటున్న ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జీ సరికొత్త డిజైన్ , అద్బుతమైన కెమెరాలతో కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయనుంది. రెయిన్ డ్రాప్ కెమెరా డిజైన్ తో ఎల్జీ వెల్వెట్ అని పేరుతో వీటిని లాంచ్ చేయనుంది. ఫోన్ డిజైన్ కి సంబంధించిన కొన్ని లీక్ ఫొటోలు కూడా ఇప్పటికే బయటకు వచ్చాయి. అయితే ఎల్జీ వెల్వెట్ను మే 7 న లాంచ్ చేయనున్నట్లు కంపెనీ వీడియో టీజర్ ద్వారా ప్రకటించింది. తమ తాజా స్మార్ట్ఫోన్ డిజైన్ ప్రత్యర్థి స్మార్ట్ఫోన్లకు భిన్నంగా ఉంటుందని ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ తయారీదారు ఎల్జీ పేర్కొంది. ఈ ఫోన్లలో స్నాప్డ్రాగన్ 765 జి ప్రాసెసర్, 5జీ సపోర్ట్, ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్,ఎల్ఈడీ ఫ్లాష్ వెనుకవైపుమూడు కెమెరాలను అమర్చినట్టు తెలుస్తోంది. లాక్డౌన్ కొనసాగుతున్నందున ఇది ముగిసిన తరువాత ఎల్జి వెల్వెట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో లభ్యం కానుందని భావిస్తున్నారు. -
దిగ్గజ కంపెనీ మాజీ చైర్మన్ మృతి
దక్షిణ కోరియాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం ఎల్జీ గ్రూప్ మాజీ చైర్మన్ కూ చా క్యుంగ్ (94)మరణించారు. కూ చా క్యుంగ్ శనివారం ఉదయం 10గంటలకు మరణించారని ఎల్జీ ప్రకటించింది.1925లో కూ చా క్యుంగ్ జన్మించారు. ఎల్జీ వ్యవస్థాపకుడు, కూ చా క్యుంగ్ తండ్రి కూ ఇన్ హ్వోమ్ నుంచి వారసత్వంగా ఎల్జీ సంస్థ బాధ్యతలు తీసుకున్నారు. ఎల్జీ గ్రూప్కు 25సంవత్సరాలు కూ తన సేవలను అందించాడు. కూ రిటైర్మెంట్ తర్వాత పెద్ద కుమారుడు మిస్టర్ కూ బాన్ మూ సంస్థకు చైర్మన్గా వ్యవహరించారు. విశిష్ట సేవలను అందించిన కూ బాన్ మూ గత మే నెలలో మరణించారు. ప్రస్తుతం ఎల్జీ గ్రూప్ చైర్మన్గా మిస్టర్ కూ క్వాంగ్ మో వ్యవహరిస్తున్నారు. కూ చా క్యుంగ్ రిటైర్మెంట్ తర్వాత గ్రామీణ వాతావరణంలో గడిపారు. పుట్టగొడుగుల పై కూ పరిశోధన చేశారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో ఎల్జీ గ్రూప్ నూతన ఒరవడి సృషించిన విషయం తెలిసిందే. ఎల్జీ గ్రూప్ కేవలం ఎలక్ట్రానిక్స్లోనే కాక ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ లాంటి వినియాగదారులకు ఉపయోగపడే వస్తువులను అందిస్తోంది. పండగ వేళల్లో భారీ డిస్కౌంట్లతో వినియోగదారులకు చేరువయింది. క్వాలిటీ విషయంలో ఎల్జీ గ్రూప్ అగ్రస్థానంలో నిలిచిందని వ్యాపార నిపుణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కోరియా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ఎల్జీని ప్రపంచ స్థాయిలో అగ్రభాగాన కొనసాగడానికి కూ చా క్యుంగ్ ఎంతో శ్రమించారని ఫెడరేషన్ ఆఫ్ కొరియన్ ఇండస్ట్రీస్ గతంలో ఓ ప్రకటనలో తెలిపిన విషయం విదితమే. -
భారత్కు మళ్లీ వస్తాం..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో 135 కోట్లు దాటిన జనాభా. కోట్లాది మంది యువ కస్టమర్లు. ఉద్యోగులు, వ్యాపారులకు పెరుగుతున్న వ్యయం చేయదగ్గ ఆదాయం. ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకునే వినియోగదార్లు.. ఇంకేముంది ఈ అంశాలే తయారీ, రిటైల్ కంపెనీలకు భారత మార్కెట్ బంగారు బాతుగా నిలుస్తోంది. ముఖ్యంగా టెలివిజన్, స్మార్ట్ఫోన్స్ తయారీ సంస్థలకైతే ఇండియా ప్రధాన మార్కెట్ కూడా. దీంతో భారత్ నుంచి వెనుదిరిగిన ఈ రంగ కంపెనీలు మళ్లీ రీ–ఎంట్రీ ఇస్తున్నాయి. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్త ఫీచర్లతో రంగంలోకి దిగుతున్నాయి. కొన్ని బ్రాండ్లు అయితే ఏకంగా ప్రైస్ వార్కు తెరతీస్తున్నాయి కూడా. ఐవా: దేశీయ టెలివిజన్ మార్కెట్లో ఆగస్టు 1న రీ–ఎంట్రీ ఇచ్చిన ఈ సంస్థ ఏకంగా 75 అంగుళాల 4కే స్మార్ట్ టీవీతో దర్శనమిచ్చింది. వాయిస్ కమాండ్తో పనిచేసే ఆరు రకాల స్మార్ట్ టీవీలను ప్రవేశపెట్టింది. టీవీల ధరల శ్రేణి రూ.7,999తో మొదలుకుని రూ.1,99,000 వరకు ఉంది. వీటితోపాటు స్మార్ట్ హోం ఆడియో సిస్టమ్స్, వైర్లెస్ హెడ్ఫోన్స్, బ్లూటూత్ స్పీకర్స్, పర్సనల్ ఆడియో ఉత్పత్తులను సైతం అందుబాటులోకి తెచ్చింది. వినూత్న, ఆధునిక ఫీచర్లతో ప్రొడక్టులను అన్ని ధరల శ్రేణిలో తీసుకొస్తామని ఐవా ఇండియా ఎండీ మన్మిత్ చౌదరి తెలిపారు. రానున్న రోజుల్లో రూ.200 కోట్లకుపైగా ఖర్చు చేయనున్నట్టు వెల్లడించారు. నూబియా: టెక్నాలజీ కంపెనీ జెడ్టీఈ అనుబంధ బ్రాండ్ అయిన నూబియా తిరిగి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. రెండేళ్ల క్రితం భారత్ నుంచి నిష్క్రమించిన ఈ బ్రాండ్ రెడ్ మేజిక్–3 పేరుతో గేమింగ్ ఫోన్ ప్రవేశపెట్టింది. 8/12 జీబీ ర్యామ్, 128/256 జీబీ ఇంటర్నల్ మెమరీ, 6.65 అంగుళాల డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, సోనీ సెన్సార్తో 48 ఎంపీ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరాను జోడించింది. ప్రపంచంలో తొలిసారిగా ఈ స్మార్ట్ఫోన్లో లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీతో ఇంటర్నల్ టర్బో ఫ్యాన్ పొందుపరిచారు. ఇక ఆల్ఫా పేరుతో అద్దిరిపోయే స్మార్ట్వాచ్తో ఎంట్రీ అదరగొట్టింది. ఫోల్డబుల్ ఫ్లెక్సిబుల్ డిస్ప్లే ఈ స్మార్ట్వాచ్ ప్రత్యేకత. హెచ్టీసీ: తైవాన్కు చెందిన ఈ స్మార్ట్ఫోన్ బ్రాండ్ భారత్లో రెండవ ఇన్నింగ్స్కి సిద్ధమైంది. వైల్డ్ఫైర్ ఎక్స్ పేరుతో కొత్త మోడల్ను రెండు వేరియంట్లలో ఆవిష్కరించింది. వెనుకవైపు 12, 8, 5 ఎంపీ కెమెరాలు, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా పొందుపరిచింది. ధర 4 జీబీ ర్యామ్ రూ.12,999 కాగా, 3 జీబీ ర్యామ్ మోడల్ రూ.9,999 ఉంది. ఆగస్టు 22 నుంచి ఫ్లిప్కార్ట్లో లభిస్తుంది. రానున్న రోజుల్లో స్మార్ట్ఫోన్ మార్కెట్లో వినూత్నమైన ఫీచర్లను పరిచయం చేయనున్నట్టు కంపెనీ వర్గాల సమాచారం. 2018లో కంపెనీ భారత్లో తన కార్యకలాపాలను నిలిపివేసింది. ప్రీమియం లుక్, నాణ్యమైన మోడళ్లతో కస్టమర్ల మది దోచిన ఈ బ్రాండ్కు ఇప్పటికీ మంచి ఇమేజ్ ఉంది. ఎల్జీ: డబ్ల్యూ సిరీస్తో భారత్లో రీఎంట్రీ ఇచ్చిన ఎల్జీ మొబైల్స్ ఈ ఏడాది మరో అయిదు కొత్త స్మార్ట్ఫోన్లను ప్రవేశపెట్టనుంది. డబ్ల్యూ సిరీస్తోపాటు విదేశాల్లో విక్రయిస్తున్న ‘జీ’, ‘క్యూ’ సిరీస్ మోడళ్లను పరిచయం చేయనుంది. ప్రస్తుతం సంస్థ ఖాతాలో అయిదు మోడళ్లున్నాయి. 2020 ఏడాది ద్వితీయార్ధానికి దేశవ్యాప్తంగా విస్తరిస్తామని ఎల్జీ మొబైల్స్ బిజినెస్ హెడ్ అద్వైత్ వైద్య సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఏడాది తర్వాత 5జీ స్మార్ట్ఫోన్ ‘వి–50’ని భారత్లో ఆవిష్కరించనుంది. 5జీలో నాయకత్వ స్థానాన్ని దక్కించుకోవాలన్నదే కంపెనీ లక్ష్యం. దక్షిణ కొరియా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎల్జీ.. భారత్లో తొలిసారిగా డబ్ల్యూ సిరీస్ ద్వారా ఫోన్ల అభివృద్ధితో పాటు తయారీ కూడా చేపట్టింది. -
స్మార్ట్ సీలింగ్ ఫాన్స్.. స్పెషల్ ఏంటి?
సాక్షి, చెన్నై: దక్షిణ కొరియా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ మేజర్ ఎల్జీ సీలింగ్ ఫ్యాన్ సెగ్మెంట్లోకి ప్రవేశించింది. భారత్ మార్కెట్లో స్మార్ట్ఫీచర్లతో ప్రీమియం సీలింగ్ ఫ్యాన్లను లాంచ్ చేసింది. ప్రస్తుతానికి చెన్నైలో లాంచ్ చేసింది. వీటిని త్వరలోనే దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకు రానున్నామని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ సీలింగ్ ఫ్యాన్ ధరను రూ. 13,990గా నిర్ణయించింది. దేశంలో గృహోపకరణాలు, ఎయిర్ సొల్యూషన్స్ విభాగంలో తన ఉనికిని బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా భారత మార్కెట్లో సీలింగ్ ఫ్యాన్ విభాగంలోకి ఎంట్రీ ఎచ్చింది ఎల్జీ. అత్యాధునిక ఫీచర్లను జోడించి ప్రీమియం ధరల్లో 5 రకాల సీలింగ్ ఫ్యాన్లను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తోంది. వై-ఫై ఆధారితంగా, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలతో లాంచ్ చేశామని ఎల్జీ తెలిపింది. ముఖ్యంగా అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ టక్నాలజీకి అనుసంధించామనీ, ఐఓటి ప్లాట్ఫామ్ ద్వారా తీసుకొచ్చిన ఎల్జి స్మార్ట్థింక్యూ మొబైల్తో పాటు ఇతర మొబైల్ ఫోన్ల ద్వారా రిమోట్గా నియంత్రించుకోవచ్చని పేర్కొంది. ప్రత్యేకతలు వై ఫై ఆధారితం అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ అనుసంధానం వాతావరణానికి అనుకూలంగా స్పీడ్ కంట్రోల్ , తక్కువ శబ్దం, రిమూవబుల్ పార్ట్స్, రిమోట్ సులువుగా ఎక్కడికైనా తీసుకెళ్లే అవకాశం -
ఎల్జీ ‘డబ్ల్యూ’ సిరీస్ స్మార్ట్ఫోన్లు
న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం ఎల్జీ.. ‘డబ్ల్యూ’ సిరీస్ పేరుతో అధునాతన స్మార్ట్ఫోన్లను బుధవారం భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. డబ్ల్యూ10, డబ్ల్యూ30, డబ్ల్యూ30 ప్రో పేరిట మూడు వేరియంట్లను ఆవిష్కరించింది. జూలై 3న అమెజాన్ డాట్ ఇన్లో ఫ్లాష్ సేల్ ద్వారా వీటిని విక్రయించనున్నట్లు ప్రకటించింది. 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీ కలిగిన డబ్ల్యూ10 ధర రూ.8,999 కాగా.. 6.19 అంగుళాల హెచ్డీ డిస్ప్లే, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ (పీడీఏఎఫ్ లెన్స్), 5 మెగాపిక్సెల్ సెన్సార్ ఫిక్స్డ్ ఫోకస్ లెన్స్ కెమెరాలు ఉన్నాయి. ఇక 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీ కలిగిన ‘డబ్ల్యూ30’ ధర రూ.9,999 కాగా.. ఇందులో 6.26 అంగుళాల హెచ్డీ డిస్ప్లే, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 13 మెగాపిక్సెల్ ఆటోఫోకస్ వైడ్ యాంగిల్ లెన్స్, 12 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరాలు ఉన్నాయి. మరో ఫోన్ ‘డబ్ల్యూ30 ప్రో’ వేరియంట్లో 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ ఉండగా.. దీని పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనుంది. ఈ మూడు వేరియంట్లలోనూ 4,000 ఎంఏహెచ్ లి–పాలిమర్ బ్యాటరీ ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఆండ్రాయిడ్ 9 ఆధారంగా ఇవి పనిచేస్తాయి. 10 లక్షల యూనిట్ల అమ్మకాల లక్ష్యం.. డబ్ల్యూ సిరీస్లోని స్మార్ట్ఫోన్ల సంఖ్యను త్వరలోనే ఐదుకు చేర్చనున్నట్లు కంపెనీ తెలిపింది. డిసెంబర్ చివరినాటికి 10 లక్షల యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా బిజినెస్ హెడ్ (మొబైల్ కమ్యూనికేషన్) అద్వైత్ వైద్య అన్నారు. -
‘ఎల్జీ వీ40 థింక్యూ’పై భారీ ఆఫర్
ట్రిపుల్ రియర్ కెమెరాలతో ఎల్జీ వీ40 థింక్యూ స్మార్ట్ఫోన్ ఇపుడు మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. నేటి (జనవరి 19) నుంచి ఈ స్మార్ట్ఫోన్ విక్రయానికి లభ్యం కానుంది. ఎల్జీ వీ40 థింక్యూ రియర్వైపు మూడు, రెండు సెల్ఫీ కెమెరాలు ఉండటం విశేషం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే ఈ కెమెరాలు యూజర్లకు ఫోటోగ్రఫీలో కొత్త ఎక్స్పీరియన్స్ను అందించనున్నాయి. ఈ స్మార్ట్ఫోన్ గ్రే, బ్లూ కలర్స్లో లభ్యం కానుంది. భారత మార్కెట్లో ధర రూ. 60వేలు. అయితే అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్లో ప్రైమ్ సభ్యులకు మాత్రమే. రూ.49,900కే లభిస్తోంది. వీరికి జనవరి19వ తేదీ మధ్యాహ్నం నుంచి కొనుగోలు చేసే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. ఎల్జీ వీ40 థింక్యూ ఫీచర్లు 6.40 ఇంచెస్ డిస్ప్లే స్నాప్డ్రాగన్ 845 సాక్ 1440x3120 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 9 పై 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 8+5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 12+12+16 రియర్ కెమెరా 3300 ఎంఏహెచ్ బ్యాటరీ -
మడతపెట్టే టీవీ ఇదిగో...
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం ఎల్జీ చుట్టేసే టీవీని లాంచ్ చేసింది. మడతపెట్టగలిగే 65 అంగుళాల 4కే సిగ్నేచర్ ఓఎల్ఈడీ టీవీని లాంచ్ చేసింది. 2019, జనవరి 8నుంచి 11వరకు లాస్ వెగాస్లో జరుగుతున్న కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్)లో భాగంగా ఈ టీవీని ఎల్జీ పరిచయం చేసింది. ఈ ఏడాదిలోనే ఈటీవీ కొనుగోలుకు అందుబాటులోకి రానుంది. రోల్-అప్ మోడల్ కొత్త ఓఎల్ఈడీ 65 అంగుళాల (165 సెంటీమీటర్) టీవీ ఆర్ ని ఆవిష్కరించింది. ఈ టీవీని ఈజీగా ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లడంతోపాటు అవసరం లేనపుడు చుట్టుకునే విధంగా 65 అంగుళాల తెరను ఎల్జీ రూపొందించింది. గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా వర్చువల్ అసిస్టెంట్, యాపిల్ ఎయిర్ ప్లే సపోర్టు తోపాటు 100 వాల్ట్స్ డాల్బీ అట్మాస్ స్పీకర్ డా దీని ప్రత్యేకతగా ఉందని సీనియర్ డైరెక్టర్ డైరెక్టరి టిమ్ అలెస్సీ చెప్పారు. అలాగే తన మొట్టమొదటి సూపర్-హై-డెఫినేషన్ 88 అంగుళాల 8కె ఓఎల్ఈడీ టీవీని కూడా ఈ సందర్భంగా తీసుకురావడం విశేషం. దశాబ్దాల క్రితంనుంచి ఎదురుచూస్తున్న ఈ టెక్నాలజీ ఇప్పుడు వాస్తవ రూపం దాల్చిందని మార్కెటింగ్ ఎల్జీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ వండర్ వాల్ ఓఎల్ఈడీ ఆర్ టీవీ పరిచయం సందర్బంగా చెప్పారు. అయితే దీని ధరను ఇంకా రివీల్ చేయలేదు. -
16లెన్స్ల ఫోన్ను తయారుచేస్తోన్న ఎల్జీ
భారతీయ మార్కెట్లోకి తిరిగి అడుగు పెట్టిన నోకియా బడ్జట్ స్థాయి నుంచి హైఎండ్ వరకు మొబైల్ విడుదల చేసింది. నోకియా 9 ప్యూర్వ్యూను ఐదు రియర్ కెమెరాలతో త్వరలోనే రిలీజ్ చేయనుంది. కొద్ది రోజుల క్రితం శాంసంగ్ నాలుగు వెనుక కెమెరాలతో గెలక్సీ ఎ9 ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. స్మార్ట్ఫోన్ తయారీదారులు ఈ మధ్య కెమెరాలను శక్తివంతంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఎల్జీ 16 లెన్స్లతో ఫోల్డబుల్ ఫోన్ తయారు చేస్తున్నట్లు లెట్స్గో డిజిటల్ అనే డచ్ వెబ్సైట్ తెలిపింది. మాట్రిక్ ఫార్మాట్లో లెన్స్ను అమరుస్తున్న ఈ ఫీచర్పై ఎల్జీ పేటెంట్ రైట్స్ తీసుకుంది. ఈ ఫోన్లో ఏర్పాటు చేసిన అన్నీ లెన్స్ల నుంచి ఫోటో తీసి, అందులో నిర్ణీత లెన్స్ ద్వారా కాప్చర్ చేసిన పోటోలోని భాగాలను అవసరం లేదనుకుంటే తొలగించే ఆప్షన్ను ఇందులో ప్రవేశపెట్టనున్నారు. ఈ లెన్స్ల ద్వారా తీసే ఫోటోలోని భాగాన్ని మరో ఫోటొతో మెర్జ్ చేసే ఫీచర్ కూడా సాధ్యమవుతుందని ఆ వెబ్సైట్ వెల్లడించింది. మొబైల్ వెనుక వైపున టచ్పాడ్ ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఫోటోగ్రాఫర్లకు అవసరమయ్యే స్థాయి ఫీచర్లతో ఈ ఫోన్ను తీర్చిదిద్దుతున్నారు. ఇది మాత్రమేగాక ఫోన్ బ్యాక్పానెల్లో స్పీకర్ను ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. -
వాయిస్ ఆదేశాలతో టీవీ!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టీవీ పనిచేయాలంటే రిమోట్ వాడాలి. అసలు రిమోట్ను ఆపరేట్ చేసే అవసరం లేకుండా మాటలతోనే పనిచేస్తే..! ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం ఎల్జీ భారత్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ఆధారంగా వాయిస్ కమాండ్తో పనిచేసే థింక్యూ టీవీలను ప్రవేశపెట్టింది. చానెల్, పాటలు, వీడియోలు, గేమ్స్, ఫొటోలు.. ఇలా ఏది కావాలన్నా వాయిస్తో ఆదేశిస్తే చాలు. టీవీ పనిచేస్తుంది. ఇంట్లో ఇంటర్నెట్ ఉండాల్సిన అవసరం లేకపోవడం మరో విశేషం. 32–77 అంగుళాల సైజులో మొత్తం 25 మోడళ్లను మంగళవారమిక్కడ ప్రవేశపెట్టింది. వీటి ధరలు రూ.30 వేలతో ప్రారంభమై రూ.30 లక్షల వరకు ఉన్నాయి. యూహెచ్డీ 40 శాతం.. దేశవ్యాప్తంగా 2017లో ఒక కోటి ఫ్లాట్ ప్యానెల్ టీవీలు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది ఈ సంఖ్య 1.3 కోట్లకు చేరుకుంటుందని పరిశ్రమ అంచనా వేస్తోంది. పరిశ్రమలో తమ కంపెనీకి 25 శాతం వాటా ఉందని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా హోమ్ ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్ యూంచుల్ పార్క్ ఈ సందర్భంగా తెలిపారు. గతేడాది పండుగల సీజన్లో జరిగిన కంపెనీ అమ్మకాల్లో అల్ట్రా హెచ్డీ టీవీల వాటా 14 శాతం. ఈ సీజన్లో ఇది 40 శాతానికి చేరుకుంటుందని ధీమాగా చెప్పారు. కస్టమర్లు తమ చిన్న టీవీల స్థానంలో పెద్ద స్క్రీన్లతో రీప్లేస్ చేస్తుండడం అధికంగా జరుగుతోందని వెల్లడించారు. -
5 కెమెరాల ఎల్జీ స్మార్ట్ఫోన్ వచ్చేసింది
ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ఎల్జీ కొత్త స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. వి సిరీస్లో తరువాతి తరం ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ను ఎల్జీ వీ40 థిన్క్యూ పేరుతోవిడుదల చేసింది. వెనుక వైపు మూడు, ముందు వైపు రెండు మొత్తం ఐదు కెమెరా లెన్సస్తో లాంచ్ చేసింది. నాలుగు రంగుల ఆప్షన్స్లో ఇది అందుబాటులోకి వచ్చింది. శాంసంగ్ గెలాక్సీ నోట్ 9, ఐ ఫోన్ ఎక్స్ఎస్మాక్స్కి గట్టిపోటీ ఇవ్వనుందని మార్కెట్ వర్గాల అంచనా. 12 ఎంపీ స్టాండర్డ్ కెమెరా, 16 ఎంపీ సూపర్వైడ్ యాంగిల్ కెమెరా, 12ఎంపీ పోర్ట్రయిట్ కెమెరాను రియర్ సైడ్ అమర్చింది. అమెరికాలో అక్టోబర్ 19నుంచి విక్రయానికి లభ్యం. భారతదేశం లో విడుదల తేదీ ఇంకా బహిర్గతం కాలేదు. ఎల్జీ వీ40 థిన్క్యూ ఫీచర్లు 6.4 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లే ఆండ్రాయిడ్ ఓరియో 8.1 3120 x 1440 రిజల్యూషన్ స్నాప్ డ్రాగన్ 845ప్రాసెసర్ 6జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ ఎస్డీ కార్డ్ద్వారా2టీబీదాకా విస్తరించుకునే అవకాశం 12+16+12 ఎంపీ రియర్కెమెరా 5+8 ఎంపీ సెల్పీ కెమెరా 3,300 ఎంఏహెచ్ బ్యాటరీ ధర: సుమారు 67,980 రూపాయలు -
ఆ ఫోన్కు వెనుక 3, ముందు 2 కెమెరాలు
సియోల్ : స్మార్ట్ఫోన్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు దక్షిణ కొరియాకు చెందిన మల్టీనేషనల్ ఎలక్ట్రానిక్ దిగ్గజం ఎల్జీ సరికొత్త స్మార్ట్ఫోన్ను అక్టోబర్ 3న మార్కెట్లోకి విడుదల చేయబోతుంది. ఆ స్మార్ట్ఫోన్ లాంచింగ్కు సంబంధించిన ఈవెంట్ ఇన్విటేషన్లను మీడియాకు కూడా పంపిస్తోంది. ఎల్జీ వీ40 థిన్క్యూగా పేర్కొంది. ఈ డివైజ్కు చెందిన వీడియోను తన అధికారిక యూట్యూబ్ ఛానల్లో పొందుపరిచింది. 30 సెకన్లలో ఈ లాంచ్ వీడియో థీమ్, కెమెరా సెటప్. అంటే ఆ వీడియోలో ఎల్జీ వీ40 థిన్క్యూ కెమెరా సెటప్ను రివీల్ చేసింది. రూమర్లన్నంటిన్నీ ధృవీకరిస్తూ.. మొత్తం ఐదు కెమెరా లెన్సస్ను ఇది కలిగి ఉంది. వెనుక వైపు మూడు, ముందు వైపు రెండు కెమెరాలున్నాయి. ప్రైమరీ కెమెరా ఎల్జీ ట్రేడ్మార్క్ ఫీచర్ మెయిన్ లెన్స్తో వైడ్ యాంగిల్ లెన్స్ను కలిగి ఉంది. పోర్ట్రెయిట్ మోడ్కు ఇటీవల డిమాండ్ బాగా పెరుగుతుండటంతో, ఎల్జీ మూడో లెన్స్ను ఈ విధంగా రూపొందించింది. ఈ ఫోన్కు సంబంధించిన మిగతా వివరాలు అక్టోబర్ 3న రివీల్ కానున్నాయి. అమెరికాలోని న్యూయార్క్లో దీని లాంచింగ్ ఈవెంట్ జరగనుంది. వెంటనే అక్టోబర్ 4న రెండో లాంచ్ ఈవెంట్ను దక్షిణ కొరియా సియోల్లో నిర్వహించబోతుంది. వెంటవెంటనే ఎల్జీ రెండు లాంచింగ్ ఈవెంట్లతో మార్కెట్లను ధూంధాం పరచనుంది. -
ఎల్జీ వీ30 ప్లస్ స్మార్ట్ఫోన్ ధర తగ్గింది
న్యూఢిల్లీ : ఎల్జీ గతేడాది డిసెంబర్లో లాంచ్ చేసిన ఎల్జీ వీ30 ప్లస్ స్మార్ట్ఫోన్ ధరను తగ్గించింది. లాంచింగ్ సందర్భంగా ఈ స్మార్ట్ఫోన్ ధర రూ.44,990గా ఉంటే, ధర తగ్గింపు అనంతరం రూ.41,990కు వచ్చి చేరింది. అంటే 3000 రూపాయల మేర దీని ధర తగ్గింది. ఈ స్మార్ట్ఫోన్ ఎక్స్క్లూజివ్గా అమెజాన్లోనే అందుబాటులో ఉంది. కంపెనీ తగ్గించిన ధర మాత్రమే కాక, ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ కూడా ఈ ఫోన్ కొనుగోలుపై కస్టమర్లకు మరికొన్ని ఆఫర్లను ప్రకటించింది. రూ.8500 ఎక్స్చేంజ్ ఆఫర్ను, నెలకు రూ.1,996 ఈఎంఐను అమెజాన్ ఆఫర్ చేస్తోంది. వీటితో పాటు ఈఎంఐ లావాదేవీలపై అదనంగా 10 శాతం క్యాష్బ్యాక్ను కూడా అందిస్తోంది. ఎల్జీ వీ30 ప్లస్ ఫీచర్లు... 6 అంగుళాల క్వాడ్ హెచ్డీ ప్లస్ ఓలెడ్ డిస్ప్లే 1440x2880 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్ 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 2టీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ 16 మెగాపిక్సెల్, 13 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఫింగర్ప్రింట్ సెన్సార్ ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ 4జీ వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్ సి 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, వైర్లెస్ చార్జింగ్. -
ఐఫోన్ ఎక్స్ కంటే ఖరీదైన స్మార్ట్ఫోన్ ఇదే!
న్యూఢిల్లీ : ఇప్పటి వరకు స్మార్ట్ఫోన్ మార్కెట్లో అత్యంత ఖరీదైన ఫోన్ ఏదీ అంటే. ఠక్కున ఐఫోన్ ఎక్స్ అని చెప్పేస్తాం. లక్ష రూపాయలకు పైగా ధరతో భారత్లో అత్యంత ఖరీదైన స్మార్ట్ఫోన్గా వినియోగదారుల ముందుకు వచ్చింది. అయితే తాజాగా ఐఫోన్ ఎక్స్ ధరను మించి, దాని కంటే ఖరీదైన స్మార్ట్ఫోన్ వచ్చేసింది. దక్షిణ కొరియా టెక్ దిగ్గజం ఎల్జీ తన సిగ్నేచర్ సిరీస్లో లేటెస్ట్ ప్రీమియం స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. గతేడాది లాంచ్ చేసిన ఎల్జీ సిగ్నేచర్ ఎడిషన్కు సక్సెసర్గా, ఎల్జీ సిగ్నేచర్ ఎడిషన్(2018)ను ఎల్జీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. తెలుపు, నలుపు రంగుల్లో వచ్చిన ఈ స్మార్ట్ఫోన్ ధర 1,999,800 ఓన్లు అంటే దేశీయ కరెన్సీ ప్రకారం 1,22,820 రూపాయలు. ఐఫోన్ ఎక్స్ ధర రూ.1,02,425. ఐఫోన్ ఎక్స్ కంటే కూడా ఎల్జీ సిగ్నేచర్ ఎడిషన్(2018) స్మార్ట్ఫోనే ఖరీదైనది. ఈ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్లు నేటి నుంచే ప్రారంభమవుతున్నాయి. ఎల్జీ సిగ్నేచర్ ఎడిషన్ 2018, జిర్కోనియం పింగాణీ వంటి ప్రీమియం మెటిరీయల్తో రూపొందింది. ఇది వెనుకవైపు ఎలాంటి గీతలు పడకుండా కాపాడుతోంది. ఈ డివైజ్కు వెనుకాల కస్టమర్లు తమ పేర్లను కూడా చెక్కించుకోవచ్చు. ఎల్జీ సిగ్నేచర్ ఎడిషన్ 2018 ఫీచర్లు... 6 అంగుళాల క్యూహెచ్డీ ప్లస్ ఓలెడ్ డిస్ప్లే కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్తో ప్రొటెక్షన్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్ 6 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 2 టీబీ వరకు విస్తరణ మెమరీ వెనుకవైపు 16 మెగాపిక్సెల్ సెన్సార్లతో రెండు కెమెరాలు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 3,300 ఎంఏహెచ్ బ్యాటరీ క్వాల్కామ్ క్విక్ ఛార్జ్ 3.0 వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ -
ఎల్జీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఘాటు లేఖ
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రభుత్వ అధికారాలపై సుప్రీం కోర్టు విస్పష్ట ఉత్తర్వులు ఇచ్చినా సీఎం అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) అనిల్ బైజల్ల మధ్య వివాదానికి మాత్రం తెరపడలేదు. కోర్టు తీర్పును అంగీకరించడంలో ఎల్జీ తనకు నచ్చిన రీతిలో ఎలా వ్యవహరిస్తారని కేజ్రీవాల్ ప్రశ్నించారు. సర్వోన్నత న్యాయస్ధానం తీర్పును తమకు నచ్చిన మేరకే అన్వయించుకోవడంపై ఎల్జీ బైజల్కు సోమవారం రాసిన లేఖలో కేజ్రీవాల్ విస్మయం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు ప్రతిలోని ఈ పేరాను తాను అంగీకరిస్తానని, అదే ఉత్తర్వుల్లోని మరో పేరాను అంగీకరించనని మీరెలా చెబుతారంటూ నిలదీశారు. సుప్రీం ఉత్తర్వులను తూచా తప్పకుండా అమలు చేయాలని కోరారు. ఈ ఉత్తర్వుల్లో తలదూర్చే అధికారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు లేదని స్పష్టం చేశారు. సుప్రీం ఉత్తర్వుల్లో ఏమైనా సందేహాలుంటే తక్షణమే న్యాయస్ధానాన్ని వివరణ కోరాలని, సర్వోన్నత న్యాయస్ధాన ఉత్తర్వులను మాత్రం ఉల్లంఘించవద్దని ఎల్జీకి కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారాలు లేవని సుప్రీం కోర్టు గత వారం చారిత్రాత్మక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. మంత్రివర్గ నిర్ణయాలకు అనుగుణంగా ఎల్జీ పనిచేయాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీకి పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి లేనందున ఎల్జీ అవరోధాలు సృష్టించేలా వ్యవహరించరాదని సూచించింది. -
సుప్రీం ఆదేశాలనూ అమలుచేయరా..?
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలో పాలనాధికారాలపై సుప్రీం కోర్టు ఉత్తర్వులను బాహాటంగా ఉల్లంఘిస్తున్నారని కేంద్రం, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్లపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ధ్వజమెత్తారు. ఎల్జీ అనిల్ బైజల్తో భేటీ అనంతరం కేజ్రీవాల్ మాట్లాడుతూ సేవల విభాగాన్ని ఢిల్లీ ప్రభుత్వానికి అప్పగించేందుకు ఎల్జీ అంగీకరించడం లేదని చెప్పారు. సర్వోన్నత న్యాయస్ధానం ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం బాహాటంగా తిరస్కరించడం దేశ చరిత్రలో ఇదే ప్రధమమని అన్నారు. సేవల విభాగాన్ని ఢిల్లీ సర్కార్కు అప్పగించరాదని హోంమంత్రిత్వ శాఖ తనకు సూచించిందని బైజల్ తనతో చెప్పారని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. పోలీసులు, భూములు, పబ్లిక్ ఆర్డర్ మినహా అన్ని అంశాల్లో ఢిల్లీ ప్రభుత్వానికే అధికారాలు ఉంటాయని సుప్రీం కోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన కొద్ది గంటలకే ఢిల్లీ ప్రభుత్వం అధికారుల బదిలీలు, నియామకాల కోసం ముఖ్యమంత్రి నేతృత్వంలో నూతన వ్యవస్థను ప్రవేశపెట్టింది. -
టాప్–3లో తెలుగు రాష్ట్రాలు: ఎల్జీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల రంగంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 2018లో 30 శాతం వాటా లక్ష్యంగా చేసుకున్నట్టు ఎల్జీ వెల్లడించింది. ఏటా రూ.8,000 కోట్ల వ్యాపారం జరుగుతున్న ఈ మార్కెట్లలో గత ఏడాది కంపెనీ 27 శాతం పైగా వాటాను సాధించింది. 2017లో తెలుగు రాష్ట్రాల్లో రూ.2,300 కోట్లకుపైగా టర్నోవర్ నమోదు చేశామని ఎల్జీ ఇండియా రీజినల్ బిజినెస్ హెడ్ కె.శశికిరణ్ రావు తెలిపారు. భారత్లో కంపెనీ 21 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది టర్నోవర్ 15–20% అధికం గా ఆర్జిస్తామని చెప్పారు. ఆదాయం పరంగా సంస్థకు ఢిల్లీ, తమిళనాడు తర్వాతి స్థానాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లు సంయుక్తంగా కైవసం చేసుకున్నాయని వెల్లడించారు. ఎల్జీ ఇండియా ఆదాయంలో 14 శాతం ఇక్కడి నుంచి సమకూరుతోందని వివరించారు. రెండు రాష్ట్రాల్లో కొత్తగా 20 ఎక్స్క్లూజివ్ ఔట్లెట్లను ప్రారంభిస్తామన్నారు. కాగా, 21 ఏళ్ల వేడుకల్లో భాగంగా జూన్ 10 వరకు కొన్ని రకాల ఉపకరణాల కొనుగోళ్లపై పలు బహుమతులను అందిస్తోంది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై 7.5 శాతం వరకు క్యాష్బ్యాక్ ఉంది. -
దిగ్గజాలకు దీటుగా: ఎల్జీ జీ7 థిన్క్యూ
సాక్షి, ముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఎల్ జీ మరో కొత్త ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేసింది. జీ సిరీస్లో భాగంగా జీ7 థిన్క్యూ పేరుతో దీన్ని విడుదల చేసింది. ప్లాటినం గ్రే, అరోరా బ్లాక్, మొరాకన్ బ్లూ, రాస్ప్బెర్రీ రోజ్ రంగుల్లో వినియోగదారులకు లభ్యం కానుంది. ఎల్జీ జీ7 థిన్క్యూ స్మార్ట్ఫోన్లో ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్లతోపాటు గూగుల్ అసిస్టెంట్ కోసం ఈ ఫోన్పై ప్రత్యేకంగా బటన్ను పొందుపర్చింది. అయితే ఈ స్మార్ట్ఫోన్ ధర , లభ్యత గురించి ఇంకా కంపెనీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ముందుగా దక్షిణ కొరియాలో విడుదలైన ఈ ఫోన్ ఉత్తర అమెరికా, యూరోప్, లాటిన్ అమెరికా, ఆసియాలో మార్కెట్లు వస్తున్నట్లు సంస్థ నిర్ధారించింది. ఐ ఫోన్ ఎక్స్ను పోలి వున్న ఈ స్మార్ట్ఫోన్ గెలాక్సీ ఎస్ 9ప్లస్, పిక్సెల్ 2 ఎక్స్ఎల్, హువావే పీ 20లాంటి ఫోన్లను గట్టి పోటీ ఇవ్వనుందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. ఎల్జీ జీ7 థిన్క్యూ ఫీచర్లు 6.1 ఇంచ్ డిస్ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 3120 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.0 ఓరియో 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్ 2 టీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ 16 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరాలు 8ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, వైర్లెస్ చార్జింగ్ -
శాంసంగ్, ఎల్జీలకు షాకింగ్ న్యూస్
శాన్ఫ్రాన్సిస్కో: డిస్ ప్లే మార్కెట్ లీడర్లు శాంసంగ్, ఎల్జీలకు షాకింగ్ న్యూస్. మొబైల్ దిగ్గజం ఆపిల్ సొంతంగా తన సొంత స్క్రీన్లను తయారు చేసుకుంటోందట. కాలిఫోర్నియా లోని తన ప్రధాన కార్యాలయం సమీపంలో సొంత డివైస్ స్క్రీన్ల డిజైనింగ్, ఉత్పత్తిని రహస్యంగా చేపట్టిందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. అంతేకాదు చిన్నమొత్తంగా స్క్రీన్లను రూపొందించి టెస్టింగ్ కూడా నిర్వహిస్తోందట. ఇందుకు ఒక సీక్రెట్ ప్రాజెక్టును రూపొందించిందనీ, ఈ మేరకు ఆపిల్ గణనీయమైన పెట్టుబడులు పెట్టిందని సోమవారం బ్లూంబర్గ్ నివేదించింది. తన సొంత డిస్ప్లే ఉత్పత్తులపై దృష్టిపెట్టిన ఆపిల్ మైక్రోఎల్ఈడీ స్క్రీన్లను డెవలప్ చేస్తోందని నివేదించింది. కాలిఫోర్నియాలోని 62వేల చదరపు అడుగుల తయారీ కేంద్రాన్ని ఇందుకు కేటాయించిందట. ఈ రహస్య ప్రాజెక్ట్ కోడ్ పేరు టీ159 అని, ఐఫోన్,ఆపిల్ వాచ్ స్క్రీన్ టెక్నాలజీ బాధ్యుడు లిన్ యంగ్స్ ఈ ప్రాజెక్టను పర్యవేక్షిస్తున్నారని పేర్కొంది. మైక్రోఎల్ఈడీ స్క్రీన్స్.. ప్రస్తుత ఓఎల్ఈడీలతో పోలిస్తే వివిధ కాంతి-ఉద్గారసమ్మేళనాల మిళితంగా పనిచేస్తాయి. అందుకే తమ భవిష్యత్ గాడ్జెట్లు మరింత స్లిమ్గా, ప్రకాశవంతంగా, విద్యుత్ను తక్కువగా వినియోగించుకునేలా వీటిని రూపొందిస్తోందని చెప్పింది. 2019లో లాంచే చేసే అన్ని ఐఫోన్లకు ఈ డిస్ప్లేలను జోడించనుందని కూడా అంచనా వేసింది. కాగా ఐఫోన్ ఎక్స్ లాంటి కీలక డివైస్లకు ఎల్ఈడీ డిస్ప్లేలకు పెట్టింది పేరైన శాంసంగ్ డిస్ప్లే ప్యానెళ్లపైనే ఆధారపడింది. మరోవైపు ఇటీవీల ఓఎల్ఈడీ స్క్రీన్ల సరఫరాపై ఎల్జీతో చర్చలు జరుపుతోందని, త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోనుందని నివేదికలు వచ్చాయి. మరి తాజా అంచనాలపై ఆపిల్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. -
మార్కెట్లోకి ఎల్జీ బండ ఫోన్
మామూలు ఫోన్లు కింద పడితే పగిలిపోయే అవకాశం ఉంటుంది. అయితే కిందపడినా పగలకుండా ఉండేలా రూపొందించిన ఓ బండలాంటి ఫోన్ను ఎక్స్4+ పేరిట ఎల్జీ దక్షిణ కొరియాలో విడుదల చేసింది. మిలిటరీ గ్రేడ్ ఎమ్ఐఎల్- ఎస్టీడీ 810జీ పరీక్షల్లో ఎల్జీ ఎక్స్4+ నెగ్గిందని కంపెనీ ప్రకటించింది. ధృఢత్వంతో పాటూ మరిన్ని ఫీచర్లు కూడా ఈ ఫోన్లో ఉన్నాయని ఎల్జీ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. మిలటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతోపాటూ ఖరీదైన ఫోన్ల కంటే అద్భుతమైన ఫీచర్స్ ఇందులో ఉన్నాయని, చక్కటి ఆడియో కోసం హైఫై డాక్, ఎల్.జీ పే వంటి సౌకర్యాన్ని తక్కువ ధరతోనే ఈ ఫోన్లో అందుబాటులోకి తెస్తోందని కంపెనీ తెలిపింది. ఈ మొబైల్ ఫోన్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ తో సెల్ఫీలు, స్క్రీన్ శాట్స్ తీసుకునే సౌకర్యం ఉందని పేర్కొంది. మరిన్ని ఫీచర్స్: *5.3 అంగుళాల హెచ్డీ ఐపీఎస్ డిస్ ప్లే * 2 జీబీ ర్యామ్, * 32 జీబీ ఇంటర్నల్ మెమొరీ (2 టెరా బైట్ వరకూ అప్గ్రేడ్ చేసుకునే అవకాశం) * బ్యాక్ 13 ఎంపీ, ఫ్రంట్ 5 ఎంపీ కెమెరాలు * 3,000ఎంఏహెచ్ బ్యాటరీ * ప్రాసెసర్ : క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 425 దీని ధర దాదాపు రూ 18,000 -
చుట్టేయగల టెలివిజన్ వచ్చేసింది...
టెలివిజన్లు, కంప్యూటర్ తెరలు, మొబైల్ఫోన్లను కాగితం మాదిరిగ ఉండచుట్టేయవచ్చునని చాలాకాలంగా వింటున్నాంగానీ.. ఈ ఏడాది అది లాస్వెగాస్లో మొదలైన సీఈఎస్ – 2018లో ప్రత్యక్షమైంది. అంతేనా.. రిమోట్ కంట్రోల్ సాయంతోనే స్క్రీన్ను ఎలా కావాలంటే అలా వంపుకునే అవకాశం ఉండటం ఈ సరికొత్త ఎల్జీ ఓలెడ్ టీవీ ప్రత్యేకత. ఒక్కసారి ఫొటోలను చూస్తే ఈ టీవీ ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. ఎల్జీ అని రాసి ఉన్న డబ్బాలో ఉండ చుట్టుకుని ఉండే ఈ టెలివిజన్ అవసరమైనప్పుడు పైకి వచ్చేస్తుందన్నమాట. దాదాపు 65 అంగుళాల వెడల్పు ఉంటుంది ఇది. అవసరమనుకుంటే టీవీలోని కొంతభాగాన్ని మాత్రమే పనిచేయించగలడం దీనికున్న ఇంకో ప్రత్యేకత. భలేగుందే.. మనమూ ఒకటి కొనేద్దాం అనుకుంటూ ఉంటే కొంచెం ఆగాలి. ఎందుకంటే వీటిని వినియోగదారులకు అందించే ఆలోచన ప్రస్తుతానికి తాము చేయడం లేదని ఎల్జీ అంటోంది మరి! -
ఎల్జీ కొత్త ఫోన్ వచ్చేసింది
సాక్షి, న్యూఢిల్లీ: ఎల్జీ కొత్త మొబైల్ను లాంచ్ చేసింది. వి 30+ పేరుతో ఈ స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. రూ. 44,990 ధర నిర్ణయించింది. డిసెంబర్ 18నుంచి విక్రయాలు మొదలు కానున్నాయిని ఎల్జీ వెల్లడించింది. అలాగే ఫ్రీ వైర్లెస్ చార్జర్, స్ర్కీన్ రీప్లేస్ మెంట్గ్యారంటీ కూడా అందిస్తోంది. డ్యుయల్ రియర్ కెమరాలు, భారీ స్టోరేజ్, ఎఫ్ 1.6 భారీ ఎపర్చర్, క్లిస్టర్ క్లియర్ గ్లాస్, హై ఫై వీడియో రికార్డింగ్ తమ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ ప్రత్యేకతలుగా లాంచింగ్ సందర్భంగా ఎల్జీ పేర్కొంది. ఎల్జీ వీ 30 ప్లస్ స్పెసిఫికేషన్స్ 6 అంగుళాల డిస్ప్లే ఓలెడ్ ఫుల్విజన్ 1440x2880పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ నౌగట్ 7.1.2 క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 835 ఎస్ ఓసి 4జిబి ర్యామ్ 128 జీబీ స్టోరెజీ 2టీబీ దాకా విస్తరించుకునే సదుపాయం 16+13ఎంపీ ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్కెమెరా 3300 ఎంఏహెచ్ బ్యాటరీ -
ఎల్జీ సిగ్నేచర్ ఎడిషన్ ధర ఎంతో తెలిస్తే..
ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఎల్జీ సెరామిక్ ప్రీమియం స్మార్ట్ఫోన్ సెగ్మెంట్లో ఎంట్రీ ఇచ్చింది. 'సిగ్నేచర్ ఎడిషన్' పేరుతో నూతన స్మార్ట్ఫోన్ ను తీసుకొస్తోంది. అత్యంత ఖరీదైన ప్రీమియం మెటీరియల్స్తో తయారు చేసిన ఈ డివైస్ ధర కూడా అంతే ఖరీదైనదిగా ఉంది. సుమారు రూ.1,18,800గా ఉండనుంది. జిర్కోనియం సెరామిక్ బ్యాక్ కవర్ పై ఎలాంటి ఎలాంటి గీతలు పడవట. ఇది ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెంట్ కూడా. అంతేకాదు ఈ డివైస్ బ్యాక్ కవర్పై ఔత్సాహిక కస్టమర్లు తమ సిగ్నేచర్ను ఎన్గ్రేవ్ చేయించుకోవచ్చు. ఇక ఫీచర్ల విషయానికి వస్తే... వైర్లెస్ చార్జర్, రెండు పవర్ ఫుల్ రియర్ కెమెరాలతో ఇది లభ్యం కానుంది. ప్రారంభ కొనుగోలుదారులు ఆకర్షించడానికిఎల్జీ కేవలం 300 యూనిట్లను మాత్రమే అందుబాటులో ఉంచుతున్నట్టు ప్రకటించింది. అయితే షావోమి ఆల్ సెరామిక్ వెర్షన్లో ఎంఐ మిక్స్ 2 , వచ్చే వారం ఇండియాలోకి రానున్న వన్ ప్లస్ 5టి స్టార్ వార్స్ ఎడిషన్ కూడా సెరామిక్ బిల్డ్ ప్రీమియం స్మార్ట్ఫోన్ మోడలే. ఎల్జీ సిగ్నేచర్ ఎడిషన్ ఫీచర్లు 6 ఇంచ్ భారీ ఫుల్ విజన్ డిస్ప్లే 1440x2880 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 6 జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజ్ 2 టీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ 16, 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ -
దోమల్ని తరిమేసే స్మార్ట్ఫోన్.. ధర?
సాక్షి, న్యూఢిల్లీ: ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఎల్జీ కే7ఐ పేరుతో ఒక కొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. ఢిల్లీలో జరుగుతున్న ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ దక్షిణ కొరియా కంపెనీ కే సీరీస్లో ఈ స్పెషల్ మొబైల్ ను లాంచ్ చేసింది. దోమల్ని తరమేసే స్మార్ట్ఫోన్ (మస్కిటో అవే)ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ఎల్జీ ప్రటించింది. బడ్జెట్ ధరలో ఈ ఆండ్రాయిడ్ డివైస్ను లాంచ్ చేసింది. వెనక భాగంలో స్పీకర్కు కున్న ఒక ప్రత్యేకమైన కవర్ అల్ట్రాసోనిక్ ఫ్రీక్వెన్సీ ఉత్పత్తి చేస్తుంది. తద్వారా దోమలను దూరంగా తరిమేస్తుంది. 30కెహెచ్జెడ్ ధ్వనులను ఈ డివైస్ ఉత్పత్తి చేస్తుంది. ఇది దోమలకుమాత్రమే హానికరమని ఎల్జీ చెప్పింది. దీని వలన మనుషులకు ఎలాంటి ప్రమాదం ఉండదని హామీ ఇచ్చింది. యూనిక్ ఇన్నోవేషన్స్ ఆవిష్కరణలో ఎల్జీ ఎపుడూ ముందువరసలో ఉటుందని ఎల్జీ ప్రధాన మార్కెటింగ్ ఆఫీసర్ అమిత్ గుజ్రాల్ తెలిపారు. అలాగే ఎలాంటి హానికారక కెమికల్స్ను ఇదులో వాడలేదని భరోసా ఇచ్చారు. దీని రూ. 7,990 గా నిర్ణయించింది. ఈ ఎల్జీ కే7ఐ ఇతర ఫీచర్లు ఇలా ఉన్నాయి. ఎల్జీ కే7ఐ ఫీచర్లు 5 అంగుళాల డిస్ప్లే 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా విస్తరించుకునే సదుపాయం 8 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా ప్రస్తుతం బ్రౌన్ కలర్ ఆప్షన్ లో ఫ్లైన్ అవుట్లెట్ల ద్వారా లభిస్తుంది. -
ఎల్జీ క్యూ6 ప్లస్ లాంచ్..
సాక్షి, ముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఎల్ జీ మరో కొత్త స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. క్యూ 6 సిరీస్కు కొనసాగింపుగా క్యూ 6 ప్లస్ పేరుతో కొత్త మొబైల్ను విడుదల చేసింది. అన్ని రీటైల్ స్టోర్లలో దీని ధర రూ. 17,990గా ఉంది. 4జీబీర్యామ్, 64జీబీ స్టోరేజ్ ఆప్షన్తో ఆస్ట్రో బ్లాక్ , ఐస్ ప్లాటినం కలర్స్లో లభ్యం. క్యూ 6 ప్లస్ లాంచింగ్ తో ఎల్జీ కూడా రూ. 15వేలకు పైనధర పలికే స్మార్ట్ఫోన్ జాబితాలో చేరిపోయింది. ఎల్జీ క్యూ 6ప్లస్ ఫీచర్లు 5.5 అంగుళాల ఫుల్హెచ్డీ డిస్ప్లే ఆండ్రాయిడ్ నౌగట్ 7.1.1 ఆపరేటింగ్ సిస్టం క్వాల్కం స్నాప్ డ్రాగన్ 435 చిప్సెట్ 4జీబీర్యామ్ 64జీబీ స్టోరేజ్ 13 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ -
టీవీల ధరలు పెంచుతున్న కంపెనీలు
న్యూఢిల్లీ : ఇన్నిరోజులు డిస్కౌంట్ల వర్షం కురిపించిన డ్యూరబుల్స్ కంపెనీలు ఇక ధరల పెంపుకు రంగంలోకి దిగాయి. టెలివిజన్లు, అప్లియన్స్పై కన్జ్యూమర్ డ్యూరబుల్ కంపెనీలు ధరలను పెంచేస్తున్నాయి. జీఎస్టీ అమల్లోకి రావడంతో టెలివిజన్ రేట్లను పెంచుతున్నట్టు ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం ఎల్జీ ప్రకటించేసింది. ఈ ధరల పెంపును ప్రకటించిన తొలి కంపెనీ కూడా ఎల్జీనే. ఎల్జీ ఎల్ఈడీ టెలివిజిన్లు నుంచి ఎల్జీ స్మార్ట్ ఎల్ఈడీ సెట్లు, ఎల్జీ యూహెచ్డీ ఎల్ఈడీ సెట్ల వరకు ధరల పెంపును ఎల్జీ చేపడుతోంది. దీంతో పశ్చిమ ప్రాంతంలో డీలర్ ధరలు 1.3 శాతం నుంచి 7 శాతం శ్రేణిలో పెరిగాయి. ఇక ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో స్వల్పంగా 2 శాతం పెంపుదల కనిపిస్తోంది. ఎల్జీ అనుకున్న మాదిరిగానే ధరల పెంపును చేపట్టిందని విజయ్ సేల్స్ మేనేజింగ్ పార్టనర్ నైలేష్ గుప్తా ధృవీకరించారు. మరో ఎలక్ట్రానిక్ దిగ్గజం పానాసోనిక్ కూడా టీవీలు, రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్ వంటి వైట్ గూడ్స్ ధరలను త్వరలోనే పెంచనున్నట్టు తెలుస్తోంది. ఈ వారం చివరి కల్లా ఎంత పెంచాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని పానాసోనిక్ సేల్స్ అండ్ సర్వీసు డైరెక్టర్ అజయ్ సేథ్ తెలిపారు. అయితే ప్రస్తుతమున్న రిటైల్ ధరలపై 3-4 శాతం మధ్యలో ప్రభావం పడే అవకాశం కనిపిస్తోందని సంబంధితవర్గాలు చెప్పాయి. అయితే శాంసంగ్ ఇప్పుడే ధరల పెంపును చేపట్టదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. జీఎస్టి ప్రకటించడానికి ముందే వైట్ గూడ్స్పై 1-2 శాతం వరకు శాంసంగ్ ధరల పెంపు చేపట్టిందని ఇండస్ట్రి వర్గాలు చెప్పాయి. సోని సైతం తమ టీవీలపై రేట్లను పెంచే ప్లాన్స్ ఏమీ లేవని అధికారికంగా ప్రకటించింది. ఇప్పట్లో టీవీల ధరలు సమీక్షించే ఉద్దేశ్యమేమీ లేదని సోని ఇండియా సేల్స్ హెడ్ సతీష్ పద్మనాభన్ తెలిపారు. అయితే హెచ్పీ, మిగతా కంపెనీలు ధరల పెంపు దిశగా కదులుతున్నాయి. జీఎస్టీకి ముందు పాత స్టాక్ను విక్రయించడానికి ఈ కన్జ్యూమర్ డ్యూరబుల్ కంపెనీలు భారీగా డిస్కౌంట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ డిస్కౌంట్ల పర్వంతో విక్రయాలు కూడా జోరుగా కొనసాగించాయి. కొత్త పన్ను విధానం ఇక అమల్లోకి రావడంతో దానికి అనుగుణంగా కంపెనీలు రేట్ల పెంపును చేపడుతున్నాయి. ప్రస్తుతం కన్జ్యూమర్ డ్యూరబుల్స్పై జీఎస్టీ రేటు 28శాతంగా ఉంది. ఇది ముందస్తు పన్ను రేటు కంటే ఎక్కువ. -
అదిరే ఫీచర్లతో ‘ఎల్జీ జీ 6’ కమింగ్ సూన్
న్యూఢిల్లీ: సౌత్ కొరియా మొబైల్ మేకర్ ఎల్జీ మార్కెట్లోకి తన సరికొత్త స్మార్ట్ఫోన్ ను తీసుకురానుంది. ఎల్జీ జీ 6 పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ ను భారత్ లోవిడుదల చేయబోతుంది. గత ఫిబ్రవరిలో మొబైల్ వరల్ఢ్ కాంగ్రెస్ లో ప్రకటించిన ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ను ఏప్రిల్ 24న అందుబాటులోకి తీసుకురానుంది. డాల్బీ విజన్ ఫీచర్ తో వస్తున్న ప్రపంచంలో మొట్టమొదిటి ఫోన్గా భావిస్తున్నారు. ఇప్పటివరకు హై ఎండ్ టీవీలలో మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉండడం ఈ జీ6 ప్రత్యేకత. ఇప్పటికే ప్రి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించిన సంస్థ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి లాంచింగ్ లైవ్ అప్డేట్ను ప్రత్యేకంగా అందించనుంది. ఎల్జీ జీ 6 ఫీచర్లు 5.7 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే గొరిల్లా గ్లాస్3 ప్రొటెక్షన్, డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫింగర్ ప్రింట్ స్కానర్ 2880 x1400 పిక్సెల్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టమ్ క్వాల్కామ్ ఎంఎస్ఎం 8996 స్నాప్ డ్రాగన్821 ప్రోసెసర్ 4జీబీ ర్యామ్ 32జీబీ, 64 ఇంటర్నల్ స్టోరేజ్, ఎస్డీ కార్డు ద్వారా ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం 13 మెగాపిక్సెల్ వెనుక కెమెరా 5 మెగాపిక్సెల్ ముందు కెమెరా 3300 ఎంఏహెచ్ బ్యాటరీ కాగా జీ 5కి కొనసాగింపుగా వస్తున్న జీ6లో అసాధారణంగా ఫుల్ విజన్ డిస్ప్లేను అందిస్తున్న ట్టు ప్రకటించింది.మరోవైపు దీని ధర రూ.49,999 ఉండొచ్చని తెలుస్తోంది. మిస్టిక్ వూట్, అస్ట్రో బ్లాక్, ఐస్ ప్లాటినం మూడు రంగుల్లో ఇది లభ్యం కానుంది. -
పానిక్ బటన్తో ఎల్జీ స్మార్ట్ ఫోన్
ధర రూ.13,990 న్యూఢిల్లీ: ఎల్జీ కంపెనీ పానిక్ బటన్ ఫీచర్తో కొత్త స్మార్ట్ఫోన్ కే10 2017ను తో మార్కెట్లోకి తెచ్చింది. ధర రూ.13,990 ఎల్జీ ఇండియా కార్పొరేట్ మార్కెటింగ్ హెడ్ అమిత్ గుజ్రాల్ చెప్పారు. ఈ పానిక్ బటన్ను నొక్కితే ఎమర్జెన్సీ నంబర్ 112కు కాల్ వెళుతుందని వివరించారు. 5.3 అంగుళాల డిస్ప్లే, 1.5 గిగా హెట్జ్ ఆక్టా–కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, వెనక భాగంలో 13 మెగాపిక్సెల్ కెమెరా, ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ కెమెరా, 2,800 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. పానిక్ బటన్తో అందిస్తున్న ఈ స్మార్ట్ఫోన్కు వినియోగదారుల నుంచి ఆదరణ బాగా ఉండగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. మహిళల కోసమే ఈ స్మార్ట్ఫోన్ను అందించడం లేదని, విద్యార్ధులకు, ఇతరులను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ స్మార్ట్ఫోన్ను అందిస్తున్నామని వివరించారు. రిటైల్ అవుట్లెట్స్ విస్తరణపై దృష్టి పెట్టామని, ఈ ఏడాది చివరికల్లా తమ మొబైల్ ఫోన్లు 8,000–10,000 రిటైల్ పాయింట్లలో లభ్యమవుతాయని వివరించారు. కాగా ఈ ఫోన్ ఆవిష్కరణ సభలో ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా పాల్గొన్నారు. మొబైల్ పరిశ్రమలోనే మొదటగా ఎల్జీ కంపెనీ పానిక్ బటన్తో కూడిన స్మార్ట్ఫోన్ను అందుబాటులోకి తేవడం సంతోషంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు. పానిక్ బటన్ తప్పనిసరి... భారత్లో అమ్ముడయ్యే అన్ని మొబైల్ ఫోన్లకు పానిక్ బటన్ ఉండాల్సిందేనని భారత ప్రభుత్వం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. దీనికి గడువు తేదీని ఈ నెల 28న ప్రభుత్వం నిర్దేశించింది. నిర్భయపై అత్యాచారం నేపథ్యంలో మొబైల్ ఫోన్లలో పానిక్ బటన్ను జత చేయాలనే సూచన వ్యక్తమైంది. -
షాకింగ్: స్మార్ట్ టీవీకి వైరస్ సోకింది
కేవలం కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లకు మాత్రమే వైరస్ సోకుతుందని భావిస్తున్నారా?. అయితే మీరు తెలుసుకోవాల్సిన మరో విషయం కూడా ఉంది. స్మార్ట్ టీవీలకు కూడా వైరస్ సోకుతుంది. ఇంటర్నెట్ కనెక్షన్ తో టీవీలోనే అన్ని రకాల యాప్ లు తదితర సర్వీసులు వినియోగించే అవకాశం స్మార్ట్ టీవీల ద్వారా అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో స్మార్ట్ టీవీల వినియోగం రోజురోజుకూ పెరుగుతూ పోతోంది. ఈ నేపథ్యంలో స్మార్ట్ టీవీలకు వైరస్ సోకడం ఆందోళన కలిగిస్తోంది. యూరప్ లోని ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కుటుంబానికి చెందిన ఎల్ జీ స్మార్ట్ టీవీకి వైరస్ సోకింది. ఓ యాప్ ను డౌన్ లోడ్ చేసిన కుటుంబసభ్యులు సినిమా చూస్తుండగా మధ్యలో టీవీ ఆగిపోయింది. ఆ తర్వాత స్క్రీన్ పై వైరస్ సోకినట్లు చూపుతున్న ఓ ఫోటో తప్ప మరేమి రాలేదు. దీంతో సదరు ఇంజనీరు టీవీని రీసెట్ చేయడానికి యత్నించినా కుదరలేదు. దీంతో సంస్ధను సంప్రదించగా.. ఇంటికి వచ్చిన టెక్నీషియన్ రీసెట్ చేయడానికి రూ.23,170/-, సోకిన వైరస్ ను తొలగించడానికి రూ.11 వేలు ఖర్చవుతుందని చెప్పాడు. అయితే, టీవీ యజమాని సదరు యాప్ ని ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేశారా? లేదా వేరే సైట్ల నుంచి డౌన్ లోడ్ చేశారా? అన్న విషయం మాత్రం తెలియరాలేదు. -
ఎల్జీ పాంచ్ పటాకా: ఐదు స్మార్ట్ఫోన్లు లాంచ్
లాస్వేగాస్లో ప్రారంభంకాబోతున్న సీఈఎస్ 2017 ట్రేడ్ షోకు ముందుస్తుగా ఎల్జీ ఐదు కొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. వాటిలో నాలుగు కే-సిరీస్ స్మార్ట్ఫోన్లు కాగ, ఒకటి స్టైలస్ స్మార్ట్ఫోన్. 2017 తమ కొత్త వేరియంట్లు ఎల్జీ కే3, ఎల్జీ కే4, ఎల్జీ కే8, ఎల్జీ కే10, స్టైలస్ 3గా ఈ దక్షిణ కొరియా దిగ్గజం పేర్కొంది. స్టైలస్ 3 స్మార్ట్ఫోన్ తమ మిడ్-రేంజ్ సెగ్మెంట్ పోర్ట్ఫోలియోను మరింత పటిష్టపరుస్తుందని తెలిపింది. ఈ కొత్త ఎల్జీ స్మార్ట్ఫోన్లను సీఈఎస్ 2017 ఈవెంట్లో ప్రదర్శించబోతున్నట్టు కూడా వెల్లడించింది. ఎల్జీ కే3(2017) ఫీచర్లు... 4.50 అంగుళాల డిస్ప్లే 1.1 గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ 480x854 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఆండ్రాయిడ్ 6.0 ఓఎస్ 1జీబీ ర్యామ్ 8జీబీ స్టోరేజ్ 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 2100 ఎంఏహెచ్ బ్యాటరీ ఎల్జీ కే4(2017) ఫీచర్స్... 5.00 అంగుళాల డిస్ప్లే 1.1 గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ 480x854 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఆండ్రాయిడ్ 6.0 ఓఎస్ 1జీబీ ర్యామ్ 8జీబీ స్టోరేజ్ 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 5 ఎంపీ రియర్ కెమెరా 2500 ఎంఏహెచ్ బ్యాటరీ ఎల్జీ కే8(2017) ఫీచర్స్.. 5.00 అంగుళాల డిస్ప్లే 1.4 గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ 720x1280 పిక్సెల్స్ రెజుల్యూషన్ 1.5 జీబీ ర్యామ్ 16 జీబీ స్టోరేజ్ 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 13 ఎంపీ రియర్ కెమెరా ఆండ్రాయిడ్ 7.0 ఓఎస్ 2500 ఎంఏహెచ్ బ్యాటరీ ఎల్జీ కే10(2017) ఫీచర్స్.. 5.30 అంగుళాల డిస్ప్లే 1.5 గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ 720x1280 పిక్సెల్స్ రెజుల్యూషన్ 2జీబీ ర్యామ్ 16జీబీ స్టోరేజ్ 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 13 ఎంపీ రియర్ కెమెరా ఆండ్రాయిడ్ 7.0 ఓఎస్ 2800 ఎంఏహెచ్ బ్యాటరీ ఎల్జీ స్టైలస్ 3 ఫీచర్స్... 5.70 అంగుళాల డిస్ప్లే 1.5 గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ 720x1280 పిక్సెల్స్ రెజుల్యూషన్ 3 జీబీ ర్యామ్ 16 జీబీ స్టోరేజ్ 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా 13 ఎంపీ రియర్ కెమెరా ఆండ్రాయిడ్ 7.0 ఓఎస్ 3200 ఎంఏహెచ్ బ్యాటరీ -
టాటా బ్రాండ్.. ర్యాంక్ తగ్గింది
• దేశంలో టాప్ బ్రాండ్ ఎల్జీ; టాటాకు 7వ స్థానం • తొలి ఐదు స్థానాలూ విదేశీ కంపెనీలవే • ఎఫ్ఎంసీజీలో మాత్రం పతంజలి హవా న్యూఢిల్లీ: ఇటీవల వివాదంలో ఉక్కిరిబిక్కిరవుతున్న టాటా గ్రూప్నకు మరో షాక్ తగిలింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన టాటా ఉత్పత్తుల బ్రాండ్ స్థారుు తగ్గుతున్నట్లు ఒక సర్వే తేల్చింది. ట్రస్ట్ రీసెర్చ్ అడ్వైజరీ తాజాగా నిర్వహించిన భారత్లోని అత్యంత ఆకర్షణీయమైన బ్రాండ్ల సర్వేలో టాటా బ్రాండ్ ర్యాంక్ క్షీణించింది. ఎల్జీ టాప్లో నిలవగా... టాటా బ్రాండ్ ఏకంగా 7వ స్థానానికి పడిపోరుుంది. టాటా బ్రాండ్కు 2014లో 5వ ర్యాంక్ ఉండగా, 2015లో అది 4వ స్థానానికి చేరింది. ఇపుడు ఒకేసారి మూడు స్థానాలు వెనక్కి పడింది. దక్షిణ కొరియాకు చెందిన కన్సూమర్ ఎలకా్ర్టనిక్స్ సంస్థ ‘ఎల్జీ’ దేశంలో టాప్ స్థానాన్ని దక్కించుకోగా తర్వాతి స్థానాల్లో సోనీ, శాంసంగ్ మొబైల్స్, హోండా, శాంసంగ్ నిలిచారుు. కాగా టాప్-5లో విదేశీ కంపెనీల ఆధిపత్యమే కొనసాగుతుండటం గమనార్హం. దేశీ దిగ్గజాలైన బజాజ్, టాటా, మారుతీ బ్రాండ్లు వరుసగా ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో ఉన్నారుు. ఎరుుర్టెల్, నోకియాలు 9, 10 స్థానాల్లో నిలిచారుు. ఇక ఎఫ్ఎంసీజీ విభాగంలోని టాప్ బ్రాండ్లను చూస్తే.. పతజలి టాప్లో ఉంది. దీని తర్వాతి స్థానాల్లో హెచ్యూఎల్, నిర్మా, ఇమామి, ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ ఉన్నారుు. -
భారత్లో ఎల్జీ ఫోన్ ధర ఎంతంటే...
అంతర్జాతీయంగా విడుదలైన గూగుల్ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ నోగట్ తొలి స్మార్ట్ఫోన్ ఎల్జీ వీ20, భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. రూ.49,990 ధరతో భారత విపణిలోకి ఈ నెల ఆఖరున ప్రవేశపెట్టాలని కంపెనీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ వీ20 ఫోన్ను గ్లోబల్గా లాంచ్ చేసే సందర్భంలోనే, దీన్ని నెలలోపల భారత మార్కెట్లోకి తీసుకొస్తామని ఎల్జీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కిమ్ కి-వాన్ ప్రకటించారు. 5.7 అంగుళాల క్యూహెచ్డీ ఐపీఎస్ డిస్ప్లేతో ఎల్జీ వీ20ను కంపెనీ ఆవిష్కరించింది. హై-ఫై క్వాడ్ డీఏసీ, హెచ్డీ ఆడియో రికార్డర్, ఫ్రంట్, రియర్ వైడ్-యాంగిల్ లెన్స్ కెమెరా వంటి మల్టీమీడియా ఫీచర్లతో ఈ స్మార్ట్ఫోన్ కంపెనీ రూపొందించింది. 16 మెగాపిక్సెల్ స్టాండర్డ్, 8 మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ డ్యుయల్ వెనుక కెమెరాలు కలిగిన ఈ ఫోన్, ఫ్రంట్ వైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను కలిగిఉంది. డ్యూయల్ డిస్ప్లే సిస్టమ్తో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. రెండో డిస్ప్లే ఫోన్కి టాప్లో ఉంటుంది. మొదటి దానికంటే ఈ రెండో డిస్ప్లే ఎక్కువ ప్రకాశవంతంగా, పెద్ద ఫాంట్తో ఉండనుంది. దీని వల్ల నోటిఫికేషన్ బార్ నుంచే పెద్ద మెసేజ్లకు త్వరగా రిప్లై ఇవ్వొచ్చు. క్వాల్ కామ్ స్నాప్డ్రాగన్ 820 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 2 టీబీ వరకు విస్తరణ మెమెరీ వంటివి ఈ ఫోన్ ఇతర ఫీచర్లు. భారత మార్కెట్లో ఇటీవల లాంచ్ అయిన ఆపిల్ లేటెస్ట్ ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్, గూగుల్ పిక్సెల్, పిక్సెల్ ఎక్స్ఎల్ స్మార్ట్ఫోన్ల కంటే ఈ ఫోన్ రేటే తక్కువగా ఉండాలని కంపెనీ నిర్ణయించినట్టు రిపోర్టులు చెబుతున్నాయి. -
వివాదంలో టాప్ ఎలక్ట్రానిక్ దిగ్గజాలు
శాన్ ఫ్రాన్సిస్కో: ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజాలు శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ లిమిటెడ్ ,ఎల్ జీ ఎలక్ట్రానిక్స్ సంస్థలు చిక్కుల్లో పడ్డాయి. యాంటీట్రస్ట్ ఉల్లంఘనలకింద ఆరోపణలు చెలరేగాయి. అమెరికాలో ఉద్యోగుల నియమాక విధానాలపై ఇరు సంస్థల మధ్య ఒప్పందం జరిగిందని ఆరోపిస్తూ అమెరికా కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎల్జీ మాజీ సేల్స్ మేనేజర్ ఉత్తర కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో గెలాక్సీ నోట్ 7 పేలుడు ఘటనలు, నిషేధంతో ఇబ్బందుల్లో ఉన్న సంస్థను మరో వివాదం చుట్టుకున్నట్టయింది. సాంసంగ్, ఎల్జీ సంస్థల మధ్య ఒకరి ఉద్యోగులను ఒకరు తీసుకోకూడదనే ఒప్పందం ఉందని పిటిషనర్ ఫ్రాస్ట్ వాదిస్తున్నారు. ఇలా నిబంధనల ఉల్లంఘన ద్వారా ఉద్యోగుల జీతాలను కిందికి తెస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. 2013 లో లింక్డ్ఇన్ ద్వారా శాంసంగ్ లో ఉద్యోగం కోసం తనను సంప్రదించారని, వెంటనే తాను పొరపాటు చేశానని, శాంసంగ్, ఎల్జీ మధ్య ఒకరి ఉద్యోగాలను ఒకరు నియమించుకోకూడదనే ఒప్పందని ఉందని చెప్పారని దావాలో తెలిపారు. ఇది అక్రమమని..క్షమించమని రిక్రూటర్ తెలిపాడనేది ఫ్రాస్ట్ వాదన. అయితే ఈ ఆరోపణలను ఎల్జీ ప్రతినిధి ఖండించారు. అలాంటి ఒప్పందమేమీ తమ మధ్య లేదన్నారు. ఈ ఆరోపణల్లో బలం లేదని వాదించగా, శాంసంగ్ వ్యాఖ్యానించడానికి నిరాకరిచింది.మరోవైపు ఇలాంటి అంతర్గత ఒప్పందాలు పోటీ తత్వానికి విరుద్ధమని ఫ్రాస్ట్ లాయర్ జోసెఫ్ సవేరీ వ్యాఖ్యానించారు. ప్రతిభ, సామర్ధ్యం ఆధారంగా ఉద్యోగాలు పొందడం ఉద్యోగుల ప్రాథమి హక్కు అన్నారు. కాగా టెక్ దిగ్గజాలు ఆపిల్, గూగుల్ మధ్య నెలకొన్న ఇలాంటి వివాదాన్ని గత ఏడాది 415 మిలియన్ డాలర్లకు సెటిల్ చేసుకున్న సంగతి తెలిసిందే. -
ఎల్జీ నుంచి ‘వి20’ స్మార్ట్ఫోన్
గూగుల్ కొత్త ఓఎస్ ‘నుగట్’పై పనిచేయనున్న తొలి మొబైల్ ఇదే న్యూయార్క్: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజ కంపెనీ ఎల్జీ తాజాగా ‘వి20’ స్మార్ట్ఫోన్ను శాన్ఫ్రాన్సిస్కోలో ఆవిష్కరించింది. దీని ధర తెలియాల్సి ఉంది. ఈ స్మార్ట్ఫోన్లువచ్చే నెలలో కొరియా మార్కెట్లోకి అటుపై భారత్లోని వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. గూగుల్ కొత్త ఆండ్రాయిడ్ 7.0 ఆపరేటింగ్ సిస్టమ్ ‘నుగట్’తో మార్కెట్లోకి వస్తోన్న తొలి స్మార్ట్ఫోన్ ఇది. అలాగే ఇందులో తొలిసారిగా 32 బిట్ హై-ఫై క్వాడ్ డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్ని అమర్చారు. దీనిసాయంతో లైవ్ పెర్ఫార్మెన్స్లో సౌండ్ ఎలా వస్తుందో అలాంటి క్లారిటీ తో కూడిన సౌండ్ను హెడ్ఫోన్స్లో వినొచ్చు. ఇందులో 5.7 అంగుళాల స్క్రీన్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమరీ, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 820 ప్రాసెసర్ , 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 16 ఎంపీ/8 ఎంపీ రియర్ కెమెరాలు, 3,200 ఎంఏహెచ్ బ్యాటరీ, గూగుల్ ఇన్యాప్ సెర్చ్, సెకండరీ డిస్ప్లే వంటి ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. -
ఆండ్రాయిడ్ నోగట్తో ఎల్జీ ఫోన్ వచ్చేసింది!
గూగుల్ కొత్త ఆండ్రాయిడ్ వెర్షెన్ 7.0 నోగట్ సాప్ట్వేర్తో తొలి స్మార్ట్ఫోన్ వచ్చేసింది. ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం ఎల్జీ, వీ20 పేరుతో ఈ ఫోన్ను ఆవిష్కరించింది. శాన్ఫ్రాన్సిస్కో ఈవెంట్గా ఈ ఫోన్ను ఎల్జీ లాంచ్ చేసింది. నోగట్ ఇప్పటికే ఉచిత అప్గ్రేట్గా నెక్షస్ బ్రాండ్లోని కొన్ని గూగుల్ ఫోన్లలో అందుబాటులో ఉంది. అయితే నోగట్ మొదట ఇన్స్టాల్ చేసిన ఫోన్ వీ20నే కావడం విశేషం. గతేడాది ప్రవేశపెట్టిన వీ10 విజయవంతం కావడంతో, ఎల్జీ లేటెస్ట్ గూగుల్ ఆండ్రాయిడ్ సాప్ట్వేర్తో వీ20 ఫోన్ను కంపెనీ తీసుకొచ్చింది. డ్యూయల్ డిస్ప్లే సిస్టమ్తో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. రెండో డిస్ప్లే ఫోన్కి టాప్లో ఉంటుంది. రెండో డిస్ప్లే మొదటి దానికంటే ఎక్కువ ప్రకాశవంతంగా, పెద్ద ఫాంట్తో ఉండనుంది. కెమెరా సిస్టమ్ను ముందస్తు దానికంటే మరింత సామర్థ్యంతో ఈ మోడల్ను అప్గ్రేడ్ చేశారు. వినియోగదారులు ఎవరైతే ఫోటోలు, వీడియోలు తీసి షేర్ చేస్తుంటారో వారికి ఆకర్షణీయంగా ఉండనుందని కంపెనీ ఆశాభావం వ్యక్తంచేస్తోంది. అదేవిధంగా 32 బిట్ హై-ఫై క్వాడ్ డాక్ ఫీచర్తో తీసుకొచ్చిన ప్రపంచపు తొలి స్మార్ట్ఫోన్ కూడా తమదేనని ఎల్జీ ప్రకటించింది. మెరుగైన ఆడియో, నాయిస్ ఫిల్టరింగ్ను కలిగిఉంటుందని ఎల్జీ పేర్కొంది. స్పష్టమైన, సంక్షిప్తమైన శబ్దాలను ఎల్జీ వీ20 అందించగలదని తెలిపింది. ఫాస్ట్ ప్రాసెసర్లు, పెద్ద డిస్ప్లేలు మాత్రమే కాక, బెస్ట్ క్వాలిటీ ఆడియోను అందించేందుకు కృషిచేశామని కంపెనీ చెప్పింది. గ్లోబల్గా వీ20 ఫోన్ ఈ నెల నుంచి అందుబాటులోకి రానుంది. డార్క్ గ్రే, సిల్వర్, పింక్ రంగుల్లో ఈ ఫోన్ లభ్యంకానుంది. రెండు వారాల్లో కంపెనీ పూర్తి వివరాలను వెల్లడిచనుంది. ఎల్జీ వీ20 ఫీచర్లు... 5.7 అంగుళాల క్యూహెచ్డీ మెయిన్ డిస్ప్లేతో రెండో డిస్ప్లే క్వాల్ కామ్ స్నాప్డ్రాగన్ 820 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 2 టీబీ వరకు విస్తరణ మెమెరీ డ్యూయల్ కెమెరాస్(16 ఎంపీ స్టాండర్డ్, 8 ఎంపీ వైడ్-యాంగిల్) 3200 ఎంఏహెచ్ బ్యాటరీ -
‘వచ్చేవారంలో స్వాతిని అరెస్ట్ చేస్తారు’
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ మరోసారి విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్... ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ను అరెస్టు చేయించి, ఆమెను పదవి నుంచి తొలగించాలనుకుంటున్నారని ఆరోపించారు. స్వాతి మలివాల్ చక్కగా పని చేస్తున్నందువల్ల ఆమెను పదవి నుంచి తొలగించాలని ప్రధాని కార్యాలయం, ఎల్జీ కార్యాలయం యోచిస్తున్నట్లు తనకు అనధికారిక వర్గాల ద్వారా తెలిసిందని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. వచ్చే వారం ఆమెను అరెస్టు చేసి పదవి నుంచి తప్పిస్తారంటూ ఆయన పేర్కొన్నారు. కేజ్రీవాల్ మరో ట్వీట్లో ఎల్జీ, ఆయన కార్యాలయంపై ఆరోపణలు చేశారు. మొహల్లా క్లినిక్లు ఏర్పాటుచేసిన వారిని, ఫ్లై ఓవర్ల నిర్మాణంలో సొమ్ము ఆదా చేసినవారిని కూడా పదవుల నుంచి తొలగించాలని ఎల్జీ పట్టుదలతో ఉన్నారని వ్యాఖ్యలు చేశారు. ఆప్ సర్కారు చేసిన తప్పిదాలను తాను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తానని ఎల్జీ అన్నట్లుగా పత్రికలలో వచ్చి న వార్తలను కూడా ఆయన ట్విటర్పై ఉంచారు. LG & PMO hell bent on removing Swati Maliwal for doing good job. She will be arrested coming week & then removed.: Delhi CM Arvind Kejriwal — आशुतोष (@ashu3page) 27 August 2016 -
శాంసంగ్ గెలాక్సీకి పోటీగా ఎల్జీ ఫోన్
శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ గెలాక్సీ నోట్7 కు పోటీగా దక్షిణ కొరియా దిగ్గజం ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇంక్ సెప్టెంబర్ లో కొత్త ప్రీమియం స్మార్ట్ఫోన్ ను మార్కెట్లోకి తీసుకురాబోతుంది. గతేడాది అక్టోబర్లో మార్కెట్లోకి వచ్చిన వీ10 ఫోన్ల విజయంతో, వీ20 డివైజ్ను మార్కెట్లోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఎల్జీ వెల్లడించింది. ఈ కొత్త డివైజ్లు కంపెనీని నిరాశపరుస్తున్న అమ్మకాల నుంచి బయటపడేస్తాయని.. శాంసంగ్ గెలాక్సీ నోట్7కు పోటీగా నిలబడతాయని ఆశాభావం వ్యక్తంచేస్తోంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్లో గూగుల్ తాజా వెర్షన్ నోగట్తో రాబోతున్న మొదటి ప్రొడక్ట్ ఇదే కాబోతుందని తెలిపింది. అయితే ఈ వీ20 డివైజ్ ఎలా ఉండబోతుంది..ఏ రేంజ్ మార్కెట్లోకి ప్రవేశపెట్టబోతున్నారు.. ప్రత్యేకతలు ఏ విధంగా ఉండబోతున్నాయనే వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఎల్జీకి ప్రత్యర్థులుగా ఉన్న స్మార్ట్ఫోన్ రారాజులు శాంసంగ్, యాపిల్లు తమ కొత్త డివైజ్లను త్వరలోనే మార్కెట్లోకి ఆవిష్కరించబోతున్నారు. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ తన తర్వాతి గెలాక్సీ స్మార్ట్ఫోన్ను బుధవారం మార్కెట్లోకి తీసుకురాబోతుండగా.. యాపిల్ ఇంక్ తన కొత్త ఐఫోన్ను సెప్టెంబర్లో ప్రవేశపెట్టనుంది. ఎల్జీ కలిగిఉన్న రెండు ప్రీమియం ఫోన్ సిరీస్లు, మార్చిలో లాంచ్ చేసిన జీ5 ఫోన్, ఆశించిన దానికంటే తక్కువ స్థాయిలో అమ్మకాలు నమోదుచేసి కంపెనీని నిరాశపర్చాయి. దీంతో ఈ దక్షిణ కొరియా దిగ్గజం వరుసగా ఐదో త్రైమాసికం ఏప్రిల్-జూన్ కాలంలో కూడా నిర్వహణ నష్టాలనే నమోదుచేసింది. వీ10 డివైజ్ విజయంతో, కొత్త ప్రొడక్ట్ ను మార్కెట్లోకి ఆవిష్కరిస్తామని ఎల్జీ ప్రకటించింది. ఈ కొత్త ప్రొడక్ట్, మూడో త్రైమాసికంలో తమ ప్రదర్శనను మెరుగుపరుస్తుందని ఆశాభావం వ్యక్తంచేస్తోంది. -
స్టైలిస్ గా ఎల్ జీ స్టైలస్ 2 ప్లస్...
ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఎల్ జీ తన తాజా స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి గురువారం ఆవిష్కరించింది. ఎల్ జీ స్టైలస్ 2 ప్లస్ పేరుతో ప్రవేశపెట్టిన ఈ ఫోన్ ధర రూ.24,450గా కంపెనీ నిర్ణయించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను ప్రపంచవ్యాప్తంగా గత నెలలోనే అందుబాటులోకి తెచ్చామని, ప్రస్తుతం ఈ ఫోన్ ను భారత్ లో ఆవిష్కరించామని ఎల్ జీ ఇండియా మొబైల్స్ మార్కెటింగ్ హెడ్ అమిత్ గుజ్రాల్ తెలిపారు. ఈ ధరల పోటీ ప్రపంచంలో తాము స్మార్ట్ ఫోన్ ప్రపంచాన్ని నూతన స్థాయికి తీసుకెళ్లడానికి, స్టైలిస్ అనుభూతితో స్మార్ట్ ఫోన్లను తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. ఎల్ జీ అంతకు ముందు రబ్బర్ టిప్డ్ పెన్ సీన్ తో తీసుకొచ్చిన ఎల్ జీ జీ4 స్టైలస్ మాదిరిగా కాకుండా, మరింత కచ్చితత్వం కోసం నానో కోటెడ్ టిప్ తో ఈ హ్యాండ్ సెట్ ను తీసుకొచ్చింది. స్టైలస్ ను తొలగిస్తున్నప్పుడు పాప్ అప్ మెనూ కనిపించేలా పెన్ పాప్ నూ ఈ ఫోన్ కలిగి ఉంటుంది.. క్విక్ మెమో, ఆఫ్ మెమో, పాప్ స్కానర్ షార్ట్ కట్ లను కూడా ఈ ఫోన్ కలిగి ఉంటుంది. పెన్ కీపర్ కూడా ఈ ఫోన్ కు ప్రత్యేక ఫీచరే. స్టైలస్ 2 ప్లస్ ఫీచర్లు... 5.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ ఐపీఎస్ క్వాంటమ్ డిస్ ప్లే 1.4 గిగాహెడ్జ్ ఆక్టా కోర్ క్వాల్ కామ్ నాప్ డ్రాగన్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో 3 జీబీ ర్యామ్ 16జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ 200 జీబీ విస్తరణ మెమరీ 16 మెగాపిక్సెల్ వెనుక కెమెరా 8 మెగా పిక్సెల్ ముందుక కెమెరా 3000ఎంఏహెచ్ బ్యాటరీ 4జీ ఎల్ టీతోపాటు వాయిస్ ఓవర్ ఎల్ టీఈ 3జీ, 2జీ కనెక్టివిటీ ఆప్షన్లు 145 గ్రాములు -
అమెరికాలోకి ఎల్జీ ఎంట్రీ లెవల్ ఫోన్
దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ల తయారీదారి ఎల్జీ, కొత్త ఎంట్రీ లెవల్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ను అమెరికాలో ఆవిష్కరించింది. ఎల్ జీ కే3 పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ అమెరికా మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ధర 80 డాలర్లు(రూ.5,500). బూస్ట్ మొబైల్, వర్జిన్ మొబైల్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంచనున్నట్టు కంపెనీ పేర్కొంది. ఎల్జీ కే3 ఫీచర్లు... ఆండ్రాయిడ్ 6.0మార్ష్ మాలో 4.5 అంగుళాల ఎఫ్ డబ్ల్యూవీజీఏ ఐపీఎస్ డిస్ ప్లే స్నాప్ డ్రాగన్ 210 ఎస్ఓసీ 1 జీబీ ర్యామ్ 8 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ 32 జీబీ విస్తరణ మెమెరీ 5 మెగా పిక్సెల్ వెనుక కెమెరా 0.3 మెగా పిక్సెల్ ముందు కెమెరా 1940 ఎంఏహెచ్ బ్యాటరీ బ్లూటూత్, జీపీఎస్, వైఫై, 3జీ, 4జీ, మైక్రో యూఎస్ బీ ఇటీవలే ఎల్ జీ తన ఎక్స్ సిరీస్ స్మార్ట్ ఫోన్లు, ఎక్స్ పవర్, ఎక్స్ స్టైల్, ఎక్స్ మ్యాక్స్, ఎక్స్ మ్యాక్ లను ఆవిష్కరించింది. వచ్చే నెల నుంచి గ్లోబల్ మార్కెట్లో అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. అయితే వీటి ధరలను ఎల్జీ వెల్లడించలేదు. -
ఎల్జీ నుంచి దోమల్ని తరిమివేసే టీవీలు
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజ కంపెనీ ఎల్జీ తాజాగా ‘మస్కిటో అవే టీవీ’ (దోమల్ని తరిమివేసే టీవీ)ని మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర శ్రేణి రూ.26,900-రూ.47,500గా ఉంది. ఈ టీవీలో అల్ట్రా సోనిక్ పరికరాన్ని అమర్చామని, ఇది ధ్వని తరంగ సాంకేతికతపై ఆధారపడి పనిచేస్తుందని, ఈ టెక్నాలజీ దోమల్ని బయటకు పారదోలుతుందని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా పేర్కొంది. ఇందులో ఎలాంటి రసాయనాలను ఉపయోగించలేదని, ఈ టీ వీలు మనుషులకు హాని కలిగించే ప్రమాదకరమైన కిరణాలను విడుదల చేయదని తెలిపింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగానే టీవీల తయారీ జరిగిందని పేర్కొంది. ‘మస్కిటో అవే టీవీ’లు ఎంపిక చేసిన ఎల్జీ బ్రాండ్ స్టోర్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. -
శాంసంగ్, ఎల్జీలకు వియూ చెక్ పెడుతుందా?
న్యూఢిల్లీ: స్మార్ట్ టీవీల రంగంలో శాంసంగ్, ఎల్జీ కు పోటీగా వియూ శరవేగంగా ముందుకొస్తోంది. తాజాగా వియూ టెక్నాలజీస్ మూడు టీవీలను మార్కెట్ లో లాంచ్ చేసిన మిగిలిన పోటీ సంస్థలకు భారీ షాక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్మార్ట్ ఫీచర్స్ తో, తక్కువ ధరకే బడ్జెట్ స్మార్ట్ టీవీలతో వియూ వినియోగదారులను ఊరిస్తోంది. స్మార్ట్ ఫీచర్స్ ద్వారా అటు వినోదాన్ని, ఇటు సోషల్ మీడియాను టీవీ తెరపై వినియోగదారులకు అందుబాటులోకి తెస్తూ, టీవీ మార్కెట్ లో హల్ చల్ చేయడానికి సిద్ధమౌతోంది. 32 అంగుళం నుంచి 55 అంగుళాల పరిధిలో మూడు స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. వీటిధరలను రూ .20,000 నుంచి, రూ.52,000 గా నిర్ణయించింది. 32 అంగుళాల టీవీని అతి తక్కువ ధరలో రూ .20,000 లకే అందిస్తున్నట్టు వియు ప్రకటించింది. ప్రఖ్యాత వీడియో చానల్స్ యప్ టీవీ, రెడ్ బుల్ సహా, మిగిలిన అన్ని యాప్ లను ఈ టీవీలో అనుసంధానం చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. అలాగే ఫేస్ బుక్, ట్విట్టర్, లింక్డ్ ఇన్, లాంటి సోషల్ మీడియా లకు కనెక్ట్ అవడమే కాకుండా, స్ర్కీన్ షేరింగ్ అవకాశం కూడా ఉందని తెలిపింది. క్వాడ్-కోర్ ఇంటర్నెట్ వీడియో ప్రాసెసర్ తో పూర్తి హెచ్డిలో కంటెంట్ తో రెండు టీవీలను అందుబాటులోకి తెచ్చినట్టు స్పష్టం చేసింది. ఆన్ లైన్ లో ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ రోజు నుంచే ఈ టీవీలను బుక్ చేసుకోవచ్చు. -
ఇక చౌక 4జీ ప్రపంచంలోకి ఎల్జీ
భారత వినియోగదారులకు చౌకగా 4జీ స్మార్ట్ ఫోన్లను అందించేందుకు ఇక ఎల్ జీ కూడా రేసులో నిలబడింది. అది కూడా పూర్తిగా మేక్ ఇన్ ఇండియాలో భాగమై వాటికి రూపకల్పన చేసింది. ఎల్జీ కే7, కే10 సిరీస్ స్మార్ట్ ఫోన్లను రూ.9,500, రూ.13,500లకు భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దక్షిణ కొరియాకు చెందిన ఈ దిగ్గజం ఏడాదిలో ఒక మిలియన్ హ్యాండ్ సెట్ లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ ఫోన్లను సీఈఎస్ 2016 ట్రేడ్ షోలో కేంద్ర సమాచార, ఐటీ శాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ విడుదల చేశారు. భారత్ లో ఎలక్ట్రానిక్ బూమ్ కు చాలా అవకాశముందని..కొత్త పాలసీలను, కొత్త పథకాలను భారత్ ఎల్లప్పుడూ స్వాగతిస్తుందని మంత్రి తెలిపారు. నిగనిగలాడే గులకరాయి డిజైన్ తో ఈ ఫోన్లను ఎల్ జీ వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. ధర విషయంలో కూడా భారత వినియోగదారులకు చేరువలోనే ఉన్నట్టు కంపెనీ తెలిపింది. ఎల్ జీ కే10 ఫీచర్స్ 5.3 అంగుళాల హెచ్ డీ(720x1280 ఫిక్సల్స్) రిజుల్యూషన్ డిస్ ప్లే 2జీబీ ర్యామ్ 16జీబీ ఇంటర్ నల్ మెమెరీ 13ఎంపీ కెమెరా, 5ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 2,300 ఎమ్ హెచ్ బ్యాటరీ తెలుపు, ఇండిగో, గోల్డ్ రంగుల్లో ఈ ఫోన్ మార్కెట్లో లభ్యమవుతుంది. ఎల్ జీ కే7 ఫీచర్స్ 5 అంగుళా ఎఫ్ డబ్ల్యూవీజీఏ(854x480 ఫిక్సల్స్) రిజుల్యూషన్ డిస్ ప్లే 1.2 జీహెచ్ జడ్ క్వాడ్ -కోర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ ప్రాసెసర్ 5జీబీ ర్యామ్ 8జీబీ ఇంటర్ నల్ మెమెరీ 8ఎంపీ రేర్ కెమెరా, 5ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 2,125 ఎమ్ఏహెచ్ బ్యాటరీ టైటాన్ రంగులో లభ్యమవుతుంది. కానీ భారత మార్కెట్లో ఎల్ జీ చాలా పోటీని తట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా చైనీస్ కంపెనీ స్మార్ట్ ఫోన్లు ఇవే ఫీచర్స్ తో చాలా తక్కువ ధరలకు లభ్యమవుతున్నాయి. -
ఎల్జీ నుంచి రెండు కొత్త స్మార్ట్ఫోన్లు
న్యూఢిల్లీ: కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం ఎల్జీ తాజాగా రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను విపణిలోకి ప్రవేశపెట్టింది. కె సిరీస్లో భాగంగా కె7, కె10 శ్రేణి ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది ఎల్జీ. ఇండియాలో కె7 ధర రూ.9,500 కాగా.. కె10 ధర రూ.13,500లుగా కంపెనీ నిర్ణయించింది. కె7 ఆండ్రాయిడ్ వర్షన్లో 5.1 లాలీపాప్తో పనిచేసే ఈ మొబైల్లో స్టోరేజీ కోసం స్లాట్ ఉంది. ప్రకృతి రమణీయత కనిపించేలా ఉన్న డిజైన్ను ఈ ఫోన్ల కోసం వినియోగించారు. కె7 ప్రత్యేకతలు.. 5.0 అంగుళాల స్క్రీన్ ఎఫ్డబ్ల్యూవీజీఏ(854X480) 1.3 జీహెచ్జెడ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ 5 మెగా పిక్సళ్ల ఫ్రంట్, రీర్ కెమెరాలు 1 జీబీ ర్యామ్ 2,125 ఎమ్ఏహెచ్ సామర్ధ్యం గల బ్యాటరీ ఫ్లాష్ కె10 ఆండ్రాయిడ్ వెర్షన్ 5.1తో నడిచే ఈ మొబైల్లో స్టోరేజీ సామర్ధ్యాన్ని పెంచుకోవడం కోసం ప్రత్యేకమైన స్లాట్ను ఏర్పాటు చేశారు. 5.3 అంగుళాల స్క్రీన్తో ఫుల్ హెచ్డీ(1280x720) స్నాప్ డ్రాగన్ 410 క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2జీబీ ర్యామ్ 13 మెగా పిక్సల్ రీర్ కెమెరా 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఫ్లాష్ -
పోలీసులు నన్ను చంపడానికి ప్రయత్నించారు
న్యూఢిల్లీ : పోలీస్ శాఖను తమకు అప్పగించాలన్న ఆప్ నేత దిలీప్ పాండే... ఢిల్లీ పోలీసులు తనను అంతం చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. పోలీస్ వాహనంతో ఢీకొట్టి తనను హతమార్చేందుకు పోలీసులు యత్నించినట్లు వ్యాఖ్యానించారు. మంగళవారం రాత్రి తాను మీడియాతో మాట్లాడుతూ ఉండగానే తనపై హత్యా ప్రయత్నం జరిగిందని, తృటిలో తప్పించుకున్నట్లు చెప్పారు. ఇది తనను చాలా ఆశ్యర్యానికి గురిచేసిందని, పార్టీ కార్యకర్త చొరవతో అదృష్టవశాత్తూ బతికి బయటపడినట్లు దిలీప్ పాండే అన్నారు. ఈ ఘటనపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని, ఇంకా పోలీసులు కేసు నమోదు చేయలేదని తెలిపారు. ఈ విషయాన్ని దిలీప్ పాండే తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కాగా ఆయన ఆరోపణలపై సంబంధింత పోలీసులెవరూ ఇంకా స్పందించలేదు. కాగా 19 ఏళ్ల యువతి మీనాక్షి దారుణ హత్య సంఘటనపై పోలీస్ ఉన్నతాధికారి బస్సీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్య మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ నిన్న ప్రధానమంత్రికి ఓ బహిరంగ లేఖను కూడా సంధించారు. 'దయచేసి ఢిల్లీ శాంతి భద్రతల పరిరక్షణ అంశంపై వారంలో ఒక రోజు మాకోసం కేటాయించండి..లేదా ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన పోలీసు అధికారాలను తమకు అప్పగించండి' అని ఆ లేఖ సారాంశం. మరోవైపు కేజ్రీవాల్ బహిరంగ లేఖపై బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు. ఆప్ సర్కార్ శవ రాజకీయాలకు స్వస్తి పలకాలని హితవు పలికారు. Let me guess, Modi was driving the bus and Kejriwal pushed & saved you, hain na AAPtard @dilipkpandey? Nautanki. pic.twitter.com/Z6LO3njIaJ — गीतिका (@ggiittiikkaa) July 21, 2015 -
ఎల్జీ హ్యాపియెస్ట్ సిటీగా చండీగఢ్
న్యూఢిల్లీ: సంతోషం, నమ్మకం అనే రెండు అంశాలు భారతీయుల జీవితాల్లో ఎక్కువ ప్రాధాన్యతను కలిగి ఉంటాయనే భావన ఆధారంగా ఎల్జీ, ఐఎంఆర్బీ ఇంటర్నేషనల్ ‘ఎల్జీ లైఫ్స్ గుడ్ హ్యాపినెస్’ సర్వేను నిర్వహించాయి. ఈ సర్వేలో హ్యాపియెస్ట్ సిటీగా చండీగఢ్, హ్యాపియెస్ట్ మెట్రోగా ఢిల్లీ నిలిచాయి. చండీగఢ్ తర్వాతి స్థానాల్లో ల క్నో, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు ఉన్నాయి. ఎల్జీ లైఫ్స్ గుడ్ హ్యాపినెస్ సర్వేలో 16 పట్టణాల్లోని 18-45 ఏళ్ల మధ్యనున్న దాదాపు 2424 మంది పాల్గొన్నారు. -
లెఫ్టినెంట్ గవర్నర్దే తుది నిర్ణయం
న్యూఢిల్లీ: చీఫ్ సెక్రటరీ నియామకంపై ఢిల్లీ ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్ వివాదం నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని మొదట సన్నాయి నొక్కులు నొక్కిన కేంద్రం ఇప్పుడు ప్రత్యక్షంగా రంగంలోకి వచ్చింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ అధికారాలను స్పష్టం చేస్తూ కేంద్రం శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ నోట్ పంపింది. ఢిల్లీలో పరిపాలనపై తుది నిర్ణయం లెప్ట్నెంట్ గవర్నర్దేనని స్పష్టం చేసింది. నిర్ణయాలను తీసుకునే ముందు ఢిల్లీ కేబినెట్ను సంప్రదించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. కొన్నింటిపై ప్రభుత్వం అభిప్రాయం తీసుకున్నా..లెప్ట్నెంట్దే తుది నిర్ణయమని తెలిపింది. కాగాలెప్ట్నెంట్ గవర్నర్ను అడ్డంపెట్టుకుని బీజేపీ తమ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి చూస్తోందని విమర్శిస్తున్న ఆప్ దీనిపై ఎలా స్పందింస్తుందో చూడాలి. ఆప్ ప్రభుత్వానికి, తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ శకుంతలా గామ్లిన్ను లెఫ్టినెంట్ గవర్నర్ జంగ్ నియామకం చేయటంపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ఆధిపత్య పోరు అనేక పరిణామాల మధ్య మరింత ముదిరి ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ దాకా వెళ్లాయి. ఈ వివాదంపై కేజ్రీవాల్, నజీబ్ లు పరస్పరం లేఖాస్త్రాలు సంధించుకున్నారు. ప్రభుత్వాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దంటూ ఎల్జీకి సీఎం లేఖ రాయగా, తన అధికారాల గురించి కేజ్రీవాల్ చెప్పాల్సిన పనిలేదంటూ జంగ్ ప్రతిస్పందించారు. ఇద్దరూ విడివిడిగా రాష్ట్రపతి ప్రణబ ముఖర్జీ దర్శనం చేసుకుని వివాదానికి దారి తీసిన పరిస్థితుల గురించి ఏకరువు పెట్టారు. రాష్ట్రపతి పాలన ఉన్న సమయంలో వ్యవహరించినట్లుగా ఎల్జీ వ్యవహరిస్తున్నారని సీఎం కేజ్రీవాల్ ఫిర్యాదు చేస్తూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సీఎం, ఎల్జీలకు కేంద్రం గతంలో సూచించింది. -
ఎల్జీ జీ ఫ్లెక్స్ 2 @ రూ.56,000
హైదరాబాద్: ఎల్జీ తన ప్రీమియం ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్, ఎల్జీ జీ ఫ్లెక్స్2ను భారత్లో అందుబాటులోకి తెచ్చింది. ఇటీవల ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ ఫోన్ను ప్రముఖ హిందీ సినిమా నటులు అనిల్ కపూర్, నర్గీస్ ఫక్రిలు ఆవిష్కరించారని ఎల్జీ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆండ్రాయిడ్ లాలిపాప్ ఆపరేటింగ్ సిస్టమ్పై పనిచేసే ఈ ఫోన్లో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 810 ప్రాసెసర్ను అమర్చామని ఎల్జీ మొబైల్స్ ఇండియా బిజినెస్ హెడ్ దీపక్ జస్రోషియా పేర్కొన్నారు. ధర రూ.56,000 వరకూ ఉంటుందని తెలిపారు. ఈ ఫోన్లో 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ పి-ఓఎల్ఈడీ కర్వ్డ్ డిస్ప్లే, 64-బిట్ ఆక్టకోర్ సీపీయూ, 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2జీబీ ర్యామ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. -
ఎల్జీ జీ3 బీట్ @ రూ.25,000
న్యూఢిల్లీ: ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ కొత్త స్మార్ట్ఫోన్, జీ3 బీట్ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ధర రూ.25,000 అని ఎల్జీ మొబైల్స్ ఇండియా మార్కెటింగ్ హెడ్ అమిత్ గుజ్రాల్ చెప్పారు. ఆండ్రాయిడ్ 4.4.2 కిట్క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్పై పనిచేసే ఈ ఫోన్లో 5 అంగుళాల హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 1.2 గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 1.3 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2,540 ఎంఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ, తదితర ఫీచర్లున్నాయని వివరించారు. అత్యున్నతమైన ఫీచర్లున్న స్మార్ట్ఫోన్ తక్కువ ధరలోనే లభ్యం కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారని, అందుకే ప్రీమియం ఫీచర్లతో కూడిన ఈ స్మార్ట్ఫోన్ను అందుబాటు ధరలోనే అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇంతకు ముందు తామందించిన ఎల్జీ జీ3కు మంచి స్పందన లభించిందని, ఆ ఉత్సాహాంతోనే ఈ జీ3 బీట్ను అందిస్తున్నామని వివరించారు. ఈ జీ3 సిరీస్ ఫోన్లతో ఈ ఏడాది చివరికల్లా భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో 10 శాతం వాటా సాధించాలని ఎల్జీ లక్ష్యంగా పెట్టుకుంది. 2013లో రూ.800 కోట్లుగా ఉన్న తమ స్మార్ట్ఫోన్ల ఆదాయం ఈఏడాది రూ.2,000 కోట్లను దాటుతుందని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ అంచనా వేస్తోంది. -
కొత్త సరుకు
ఇండియాలోకి ఎల్జీ జీ3 ఎల్జీ కంపెనీ తన జీ3 స్మార్ట్ఫోన్ను భారత్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. 5.5 ఇంచెస్ ఎల్సీడీ క్యూహెచ్డీ డిస్ప్లేతో ఉండే ఈ స్మార్ట్ఫోన్ ఆండ్రాయిడ్ 4.4.2 కిట్క్యాట్ వెర్షన్పై పనిచేస్తుంది. 2జీబీ ర్యామ్, 16 జీబీతో ఉండే స్మార్ట్ఫోన్ ధర 47,990 కాగా, 3జీబీ ర్యామ్తో 32 జీబీతో ఉండే స్మార్ట్ఫోన్ ధర రూ.50,990. అత్యంత తేలికగా ‘లావా ఐరిస్ ప్రో 30’ కేవలం 114 గ్రాముల బరువుతో కొత్త స్మార్ట్ఫోన్ను అందుబాటులోకి తెచ్చింది లావా. ఐరిస్ ప్రో 30 పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఫోన్ను ఆల్ట్రా లగ్జరియస్ స్మార్ట్ఫోన్గా పేర్కొంది. ఇది నమ్మలేనంత తేలికగా ఉంటుందని రివ్యూల్లో పేర్కొన్నారు. యూత్ లక్ష్యంగా రూపొందిన ఈ మిడ్రేంజ్ ఫోన్ ధర రూ.15,999. -
రైతు నెత్తిన వడ్డీ భారం
పెరవలి:రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ విషయూన్ని ఏటూ తేల్చకపోవడంతో రైతులకు అసలుకే మోసం వస్తోంది. వడ్డీలేని రుణాలు తీసుకున్న అన్నదాత లకు ఇప్పుడు ఆ మొత్తాలపై 7 శాతం వడ్డీ చెల్లించాల్సిన దుస్థితి దాపురించింది. దీర్ఘకాలిక (ఎల్టీ) రుణాలపై 16 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. వ్యవసాయ రుణాలను మాఫీ చేయకపోవడం వల్ల రైతులు రాయితీ కోల్పోవడంతోపాటు తీసుకున్న మొత్తంపై వడ్డీతోపాటు అపరాధ వడ్డీ, ఇతర చార్జీలు చెల్లించక తప్పదని బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. ఈ మేరకు అందుతున్న నోటీసులు రైతుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిం చాయి. రైతులంతా బ్యాంకర్లను నిలదీయడంతో నోటీసులు ఇవ్వడాన్ని తాత్కాలికంగా నిలిపివేసి రైతుల సెల్ఫోన్లకు మెసేజిలు పంపిస్తున్నారు. హడలిపోతున్న అన్నదాతలు వ్యవసాయ రుణాలకు సంబంధించి వడ్డీలు, ఇతర చార్జీలతో కలిపి ఎంతకట్టాలనే విషయూన్ని తెలుసుకుంటున్న రైతులు హడలి పోతున్నారు. జిల్లాలో వ్యవసాయ అవసరాల కోసం సుమారు 14లక్షల మంది రైతులు రుణాలు తీసుకున్నారు. వీరిలో సుమారు 5లక్షల మంది పంట రుణాలు (క్రాప్ లోన్లు) తీసుకోగా, మరో 3 లక్షల మంది దీర్ఘకాలిక (ఎల్టీ) రుణాలు పొందారు. మిగిలిన 6 లక్షల మంది బంగార నగలను తనఖాపెట్టి రుణాలు తీసుకున్నారు. ప్రభుత్వం పూటకో ప్రకటన.. రోజుకో శ్వేతపత్రం విడుదల చేస్తూ రైతులను అయోమయంలోకి నెట్టేస్తోంది. ఈ పరిస్థితుల్లో పాత రుణాలు కట్టలేక.. కొత్త రుణాలు దక్కక రైతులు అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నారు. రుణమాఫీ సంగతి దేవుడెరుగు ఇప్పటివరకు ప్రభుత్వం ఇస్తున్న వడ్డీ రాయితీ కూడా కోల్పోవాల్సి రావడంతో గగ్గోలు పెడుతున్నారు. వడ్డీలేని వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతులు ఆ మొత్తాలను గడచిన మే 1వ తేదీలోపు చెల్లించాల్సి ఉంది. రుణమాఫీ చేస్తామని చంద్రబాబు చెప్పడంతో నేటికీ ఆ మొత్తాలను చెల్లించలేకపోయూరు. వారంతా ఇప్పుడు 7.50 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉందని బ్యాంకుల నుంచి నోటీసులు, మెసేజిలు వస్తున్నాయి. రుణం తీసుకున్న ఏడాదిలోపు ఆ మొత్తాన్ని చెల్లిస్తే 6 శాతం వడ్డీ రాయితీ లభించేది. దీనివల్ల రైతులు తీసుకున్న అప్పు మొత్తం చెల్లిస్తే సరిపోయేది. అలా చేయకపోవడంతో 7.50 శాతం వడ్డీతోపాటు నోటీసు ఖర్చులు, ఈపీ (జప్తు నోటీసు) ఖర్చుల రూపంలో వెరుు్యకి రూ.10 చొప్పున అదనంగా చెల్లించాల్సి వస్తోంది. రైతులపై ఇప్పటికిప్పుడు రూ.175.40 కోట్ల భారం జిల్లాలో డీసీసీబీ, సహకార సంఘాల ద్వారా రూ.1,030.84 కోట్లను వ్యవసాయ రుణాలుగా ఇవ్వగా, వాణిజ్య బ్యాంకులు రూ.600 కోట్ల మేర రుణాలిచ్చాయి. మరోవైపు సహకార సంఘాల ద్వారా గేదెలు, మోటార్ సైకిళ్లు, ట్రాక్టర్లు వంటివి కొనుగోలు చేసేందుకు రైతులు తీసుకున్న దీర్ఘకాలిక (ఎల్టీ) రుణాలు జిల్లాలో రూ.360.98 కోట్ల మేర ఉన్నాయి. ఈ మొత్తాలను ఇప్పటికిప్పుడు చెల్లిస్తే వడ్డీ, అపరాధ రుసుం రూపంలో జిల్లా రైతులు కనీసం రూ.175.40 కోట్ల అదనపు భారం మోయూల్సి వస్తుందని అంచనా. దీనికి నోటీసు ఖర్చులు, జప్తు నోటీసు ఖర్చులు అదనం. వడ్డీతో కట్టాలని నోటీస్ వచ్చింది వ్యవసాయ పెట్టుబడుల కోసం సొసైటీలో లోన్ తీసుకున్నాను. ఏటా సకాలంలో కట్టేవాణ్ణి. దీనివల్ల వడ్డీ భారం ఉండేది కాదు. రుణమాఫీ చేస్తారనే ఉద్దేశంతో ఈ ఏడాది రుణం కట్టకుండా మానేశాను. ఇప్పుడు 7.50 శాతం వడ్డీతో అప్పు మొత్తం కట్టాలని బ్యాంకు నుంచి నోటీసులు ఇస్తున్నారు. ఇప్పుడేం చేయూలో అర్థం కావడం లేదు. చంద్రబాబును నమ్మడం వల్ల వడ్డీలేని రుణానికి ఇప్పుడు వడ్డీ కట్టాల్సి వస్తోంది. - యాండ్ర నరసింహమూర్తి, రైతు, కడింపాడు గోరుచుట్టుపై రోకలి పోటులా... గత ఏడాది సొసైటీలో రూ.లక్ష రుణం తీసుకున్నాను. రుణమాఫీ చేస్తే అప్పులు తీరతాయని ఆశపడ్డాను. కానీ మాఫీ కాలేదు. వెంటనే అప్పు మొత్తం వడ్డీతో కలిపి కట్టాలని బ్యాంకు అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ఈసారి వడ్డీ రారుుతీ ఉండదని, అపరాధ వడ్డీతో కలిపి రుణం మొత్తం కట్టాలంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. కొత్త అప్పు పుట్టడం లేదు. పాత అప్పు తీర్చే పరిస్థితి కనిపించడం లేదు. - మద్దిపాటి సత్యం, రైతు, ముక్కామల సబ్సిడీ పోయి వడ్డీ తగిలింది చంద్రబాబు మాట నమ్మి రుణం కట్టలేదు. ఎల్టీ రుణంగా రూ.లక్ష తీసుకున్నాను. ఏటా వాయిదా కట్టేవాణ్ణి. మాఫీ అవుతుం దనే ధీమాతో రుణం కట్టకపోవడంతో ఇప్పుడు వడ్డీతోపాటు ఈ రుణంపై ఇచ్చే సబ్సిడీ కూడా పోయే పరిస్థితి వచ్చింది. ఎన్నికల సమయంలో ఓట్లకోసం మమ్మల్ని నమ్మించి మోసం చేశారు. అసలుతోపాటు సబ్సిడీ కూడా పోరుు వడ్డీ తగిలిందన్నట్టుగా ఉంది మా పరిస్థితి. ఏం చేయాలో తెలియడం లేదు. -గండేపల్లి రామకృష్ణ, రైతు, ముక్కామల నమ్మక ద్రోహం చేస్తారనుకోలేదు మూడేళ్లుగా వరదలు, తుపాన్లతో పంటలు కోల్పోయాను. బ్యాంకులో రూ.లక్ష రుణం తీసుకున్నాను. మాఫీ అవుతుం దనే నమ్మకంతో ఉన్నాను. పరిస్థితుల్ని చూస్తుంటే రుణం మాఫీ అయ్యేలా లేదు. కొత్త అప్పు పుట్టడం లేదు. పంటలు వేయడానికి చేతిలో దమ్మిడీ కూడా లేక అవస్థలు పడుతున్నాం. మాయమాటలకు మోసపోయామని అనిపిస్తోంది. ఇంత నమ్మక ద్రోహం చేస్తారని కలలో కూడా ఊహించలేదు. -పులపర్తి సూర్యనారాయణ, రైతు, అన్నవరప్పాడు -
ఎల్జీ అల్ట్రా హెచ్డీ టీవీలు ఇక భారత్లో తయారీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ ఎల్జీ నూతన శ్రేణి అల్ట్రా హెచ్డీ టీవీలను భారత్లోనే తయారు చేయనుంది. ఖరీదైన ఈ మోడళ్లను ఇప్పటి వరకు విదేశాల్లో ఉన్న ప్లాంట్ల నుంచి కంపెనీ తెప్పిస్తోంది. ఇక్కడి వ్యాపారావకాశాలను దృష్టిలో పెట్టుకుని పునే సమీపంలోని ప్లాంటులో వీటి తయారీని చేపట్టాలని కంపెనీ నిర్ణయించింది. వచ్చే నెల నుంచే ఉత్పత్తి ప్రారంభం అవుతుందని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా హోం ఎంటర్టైన్మెంట్ మార్కెటింగ్ హెడ్ రిషి టాండన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. గురువారమిక్కడ ప్రారంభమైన గ్యాడ్జెట్ ఎక్స్పోలో అల్ట్రా హెచ్డీ విభాగంలో కొత్త మోడల్ను కంపెనీ ఆవిష్కరించింది. 49 అంగుళాల ఈ మోడల్ ధర రూ.1.55 లక్షలు. దీనితోపాటు వెబ్ ఓఎస్ ఆధారిత మోడళ్లను కూడా కంపెనీ విడుదల చేసింది. 2014లో 50 వేల యూనిట్లు.. ఈ ఏడాది భారత్లో అల్ట్రా హెచ్డీ టీవీలు 50,000 యూనిట్లు విక్రయమవుతాయని అంచనా. 40 శాతం మార్కెట్ వాటా లక్ష్యంగా చేసుకున్నట్టు రిషి టాండన్ తెలిపారు. 55 అంగుళాలుపైగా సైజున్న టీవీలను కొనేవారు వీటిపట్ల మొగ్గు చూపుతున్నారని చెప్పారు. 40 అంగుళాల సైజులో అల్ట్రా హెచ్డీ మోడల్ను పరిచయం చేస్తామన్నారు. మొత్తంగా ఈ ఏడాది అన్ని విభాగాల్లో కలిపి 50 దాకా మోడళ్లు రానున్నాయని చెప్పారు. ఫ్లాట్ ప్యానెల్ టీవీల మార్కెట్ పరిమాణం దేశంలో 85 లక్షలుంది. ఇందులో ఎల్సీడీల వాటా 5 లక్షలు. క్రమంగా ఎల్సీడీల విభాగం తన ప్రస్థానాన్ని కోల్పోతోందని చెప్పారు. సాధారణ టీవీలతో పోలిస్తే అల్ట్రా హెచ్డీ టీవీల పిక్చర్ నాణ్యత నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఎల్జీతోపాటు సోని, శాంసంగ్ కూడా వీటిని తయారు చేస్తోంది. -
స్మార్ట్ఫోన్ అమ్మకాలు @ 100 కోట్లు
న్యూఢిల్లీ: స్మార్ట్ ఫోన్ అమ్మకాలు గతేడాదిలో వంద కోట్లకు పైగా చేరాయి. భారత్, చైనా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చౌక ధరల్లో లభించే స్మార్ట్ఫోన్లకు డిమాండ్ పెరుగుతుండటంతో స్మార్ట్ఫోన్ అమ్మకాలు రికార్డ్ స్థాయికి చేరాయని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ, ఐడీసీ వెల్లడించింది. ఐడీసీ తెలిపిన వివరాల ప్రకారం..., ఒక ఏడాది కాలంలో వంద కోట్లకు పైగా స్మార్ట్ఫోన్లు అమ్ముడవడం ఇదే మొదటిసారి. గతేడాది మొత్తం 100.42 కోట్ల స్మార్ట్ఫోన్లు అమ్ముడయ్యాయి. 2012 అమ్మకాల(72.53 కోట్ల)తో పోల్చితే 38 శాతం వృద్ధి నమోదైంది. కాగా 2011లో 49.44 కోట్ల స్మార్ట్ఫోన్లు విక్రయమయ్యాయి. కేవలం రెండేళ్లలో ఈ విక్రయాలు రెట్టింపయ్యాయి. గతేడాది అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్లో 28.44 కోట్లు స్మార్ట్ఫోన్లు అమ్ముడయ్యాయి. 2012 ఇదే క్వార్టర్కు అమ్ముడైన స్మార్ట్ఫోన్లు(22.9 కోట్లు)తో పోల్చితే 24 శాతం వృద్ధి నమోదైంది. 2012లో 42 శాతంగా ఉన్న మొత్తం ఫోన్ల విక్రయాల్లో స్మార్ట్ఫోన్ల వాటా 2013లో 55 శాతానికి పెరిగింది. పెద్ద స్క్రీన్ ఉండడం, తక్కువ ధరల్లో లభ్యం కావడం... ఈ రెండు అంశాలు స్మార్ట్ఫోన్ల విక్రయాల జోరుకు ప్రధాన కారణాలు. భారత్, చైనా దేశాల్లో 150 డాలర్లు(రూ.9,000)లోపు స్మార్ట్ఫోన్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. స్మార్ట్ఫోన్ల అమ్మకాల్లో శామ్సంగ్ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో యాపిల్, హువాయ్, లెనొవొ, ఎల్జీ కంపెనీలున్నాయి. మొత్తం 31.39 కోట్ల స్మార్ట్ఫోన్లను విక్రయించి 31 శాతం మార్కెట్ వాటాతో శామ్సంగ్ కంపెనీ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో యాపిల్(15.34 కోట్ల ఫోన్లు, 15 శాతం మార్కెట్ వాటా), హువాయ్(4.88 కోట్లు-5 శాతం మార్కెట్ వాటా)లు నిలిచాయి. -
ఓ.. ఎల్ఈడీ! ఎక్కడున్నావ్?
న్యూఢిల్లీ: సీఆర్టీ, ఫ్లాట్, ప్లాస్మా, ఎల్సీడీ, ఎల్ఈడీ... ఇవన్నీ ఏంటో తెలుసా? ఒకదాని తరవాత ఒకటిగా మన ఇళ్లను ఏలేసిన టీవీ మోడళ్లు. సీఆర్టీ టీవీల తరవాత వచ్చిన ఫ్లాట్ టీవీలు కొన్నాళ్లపాటు దుమ్ము దులిపాయి. తరవాత ప్లాస్మా వచ్చినా కొన్నాళ్లకే మసకబారింది. ఆ తరవాత వచ్చిన ఎల్సీడీ, ఎల్ఈడీ టీవీలు ఇప్పటికే మన ఇళ్లను, కళ్లను అలరిస్తూనే ఉన్నాయి. వీటిని తలదన్నేలా ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్ (ఓఎల్ఈడీ) టీవీల్ని తేవాలని పెద్ద కంపెనీలన్నీ చాలా పెద్ద ప్రణాళికలేశాయి. కాకపోతే పరిస్థితులు చూస్తుంటే ఇవి పురిట్లోనే సంధికొట్టేసేలా ఉన్నాయి. ఎందుకంటే వీటి తయారీకి భారీ వ్యయం అవుతుండటం, కొత్త టెక్నాలజీపై జనంలో ఇంకా నమ్మకం ఏర్పడకపోవటంతో వీటిపై అనుమానాలు రేగుతున్నాయి. మెరుగైన టెక్నాలజీతో, అందుబాటు ధరలో ఓలెడ్ టీవీలు తేవాలని పరిశ్రమ దిగ్గజాలు సోనీ, పానాసోనిక్ ఇప్పటికే ఒక జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేశాయి. కాకపోతే దానికి డిసెంబరు 31తో గడువు ముగిసిపోయింది. పొడిగించుకునే ప్రయత్నాలేవీ కంపెనీలు చేయకపోవటం ఈ సందర్భంగా గమనార్హం. అధిక ధర, విశ్వసనీయత కొరవడటం వంటి కారణాల వల్ల టీవీ ఉత్పత్తిదారులు ఓలెడ్ టీవీలకు బదులు అల్ట్రా హెచ్డీ టీవీలవైపే మొగ్గు చూపిస్తూ వస్తున్నారు. లిక్విడ్ క్రిస్టల్ టెక్నాలజీతో తయారయ్యే వీటి రిజల్యూషన్ ప్రస్తుత హై డెఫినిషన్ స్క్రీన్ల కంటే నాలుగు రెట్లు మెరుగ్గా ఉంటుంది. నిజానికి ఎల్జీ, శామ్సంగ్లు తయారు చేస్తున్న 55 అంగుళాల ఓలెడ్ టీవీలు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చాయి. కొన్ని చోట్ల వీటి ఆరంభ ధర 8 వేల డాలర్లు. అయితే ఎల్జీ సంస్థ భారతదేశంలో తొలిసారిగా ప్రవేశపెట్టిన 55 అంగుళాల ఓలెడ్ కర్వ్డ్ టీవీని ఇటీవలే హైదరాబాద్లో కూడా ప్రదర్శనకు పెట్టింది. దీని ధర అక్షరాలా పది లక్షలు. ఎల్జీ బెస్ట్ షాపులన్నిట్లోనూ ఇది దొరుకుతుందంటూ దీన్ని మార్కెట్లోకి విడుదల చేశారు కూడా. ఓలెడ్ టీవీల ధర ఎక్కువ కావటంతో వీటిని తక్కువ ధరలోనే ఉత్పత్తి చేయడానికి సోనీ, పానాసోనిక్లు 2012లో జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేశాయి. ఉత్పత్తి మొదలు కాకముందే గత నెలతో దీని గడువు ముగిసింది. ఉత్పత్తి వ్యయం, టెక్నాలజీ సంబంధ సమస్యలను అధిగమించగలిగితే అత్యంత స్పష్టమైన చిత్రాలను చూపే ఓలెడ్ టీవీలను ప్రజలు ఆదరించగలుగుతారు. మరి ఆ అవకాశం వస్తుందా..? -
10 రోజులు గడువు కోరిన కేజ్రీవాల్