
సాక్షి, న్యూఢిల్లీ: మారుతి సుజుకి ధరలను పెంపును ప్రకటించింది. దేశంలో అతిపెద్ద వాహన తయారుదారు తన మోడళ్లు అన్నింటి ధరలను పెంచుతున్నట్టు ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో దేశీయంగా మారుతికి చెందిన అన్ని మోడళ్ల వాహనాల ధరలను గరిష్టంగా 6,100 రూపాయల (ఎక్స్ షోరూం ఢిల్లీ) వరకు ధరల పెంపు వుంటుందని గురువారం వెల్లడించింది. వస్తువుల ధరలు, పంపిణీ ధరలు పెరగడంతోపాటు విదేశీ మారకంలో పడిపోతున్న రూపాయి విలువ కూడా తమ ధరలను ప్రభావితం చేసిందని మారుతి సుజుకి ప్రతినిధి తెలిపారు. ఈ పెంపు తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.
కాగా బాగా పెరిగిన ఉత్పత్తి ఖర్చులు , తదితర వ్యయాల కారణంగా తమ వాహనాల ధరలను ఆగస్టు నుంచి పెంచుతున్నట్టు మారుతి సహా, మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా, టాటా మోటార్స్లాంటి దిగ్గజ సంస్థలు తమ వాహనాల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment