price
-
మొదలైన పసిడి పరుగు: భారీగా పెరిగిన ధరలు
వారంరోజులు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. నేడు (మార్చి 04) గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 760 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,100 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 87,380 వద్ద నిలిచాయి. నిన్న స్థిరంగా ఉన్న గోల్డ్ రేటు.. ఈ రోజు రూ. 700 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 760 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 700, రూ. 760 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 80,100 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 87,380 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 80,250 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 87,530 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 700, రూ. 760 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు గరిష్టంగా రూ.2,000 పెరిగింది. దీంతో ఈ రోజు (మార్చి 3) కేజీ సిల్వర్ రేటు రూ. 1,07,000 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకేవిధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 1000 పెరిగి.. రూ. 98,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
రోజుకో రేటు వద్ద బంగారం: కారణాలివే..
బంగారం ధరలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. రోజుకో రేటు.. ప్రాంతాన్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. ఒకరోజు భారీగా పెరిగితే.. ఇంకోరోజు తగ్గిపోతాయి. ఎందుకిలా జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా?.. ధరలు పెరగడానికి ప్రధానంగా ఐదు కారణాలున్నాయి. ఆ కారణాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయాల్సిందే.అంతర్జాతీయ ధరలుబంగారం ధరలు ప్రపంచ మార్కెట్ ధోరణులపై ఆధారపడి ఉంటాయి. అంతర్జాతీయ ధరలలో జరిగే ఏవైనా మార్పులు.. దేశంలో బంగారం ధరను నేరుగా ప్రభావితం చేస్తాయి. ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక స్థిరత్వం వంటి అంశాలు ప్రపంచ బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.దిగుమతి సుంకం & ప్రభుత్వ విధానాలుభారతదేశం భారీ మొత్తంలో బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. దిగుమతి సుంకాలు, పన్ను విధానాలు భారతదేశంలో బంగారం ధరను ప్రభావితం చేస్తాయి. ప్రభుత్వం దిగుమతి సుంకాలను పెంచితే, బంగారం ధరలు పెరుగుతాయి. బంగారు నిల్వకు సంబంధించిన విధానాలు కూడా ధరలను ప్రభావితం చేస్తాయి.దేశీయ మార్కెట్లో డిమాండ్ & సరఫరాభారతదేశంలో బంగారం డిమాండ్ పండుగలు.. వివాహ సీజన్లలో గరిష్టంగా ఉంటుంది. డిమాండ్ పెరిగినప్పుడు, ధరలు పెరుగుతాయి. దీనికి విరుద్ధంగా, డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు బంగారం ధరలు తగ్గవచ్చు. సరఫరా కూడా ఒక పాత్ర పోషిస్తుంది. కొరత ఉన్నప్పుడు కూడా బంగారం ధర ఎక్కువగా ఉండవచ్చు.రూపాయి vs యూఎస్ డాలర్ మారకం రేటుప్రపంచవ్యాప్తంగా బంగారం వ్యాపారం.. అమెరికా డాలర్లతోనే జరుగుతుంది. డాలర్తో పోలిస్తే భారత రూపాయి బలహీనపడితే, బంగారం ధర పెరుగుతుంది. అయితే రూపాయి బలపడితే.. బంగారం ధర తగ్గుతుంది. వడ్డీ రేట్లు & ద్రవ్యోల్బణం కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి.ప్రపంచ ఆర్థిక, రాజకీయ సంఘటనలుఆర్ధిక మాంద్యం, మహమ్మారి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి ప్రపంచ అనిశ్చితులు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. స్టాక్ మార్కెట్లు హెచ్చుతగ్గులకు గురైనప్పుడు, పెట్టుబడిదారులు బంగారం మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతారు. దీంతో బంగారం ధరలు క్రమంగా పెరుగుతాయి.ఇదీ చదవండి: 'అర్ధరాత్రి 2 గంటల వరకు మేల్కొనే ఉంటారు': తండ్రి గురించి చెప్పిన ఆకాశ్ అంబానీ -
Haleem Price Hike: హలీం లవర్స్కు షాకింగ్ న్యూస్..
చార్మినార్: రంజాన్ మాసంలో ప్రత్యేకమైన హలీం ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఈ ఏడాది రంజాన్ ప్రారంభానికి ముందే హలీం విక్రయాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మటన్ రేట్లు పెరగడంతో హలీం తయారీదారులు హలీం ధర పెంచేశారు. గతేడాది రూ.280లకు ప్లేట్ హలీం లభించగా..ప్రస్తుతం రూ.20 పెరిగి రూ.300 చేరుకుంది. ఇటీవల ముగిసిన నాంపల్లి ఎగ్జిబిషన్లో సైతం పిస్తాహౌజ్ ప్లేట్ హలీంను రూ.300 చొప్పున విక్రయించింది. అయితే ఎగ్జిబిషన్ ముగిసినా నగరంలోని పలు హోటళ్ల నిర్వాహకులు రూ.300కు విక్రయిస్తున్నారు. రేటు పెరిగినా హలీం ప్రియులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మార్చి 1న ఆకాశంలో నెల వంక కనిపిస్తే..2 నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానున్నట్లు ముస్లిం మత పెద్దలు పేర్కొంటున్నారు. రంజాన్ మాసంలో మాంసాహార వంటకాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఉపవాస దీక్షల అనంతరం నిర్వహించే ఇఫ్తార్ విందులో హాలీంను తప్పనిసరిగా వడ్డిస్తారు. పాతబస్తీ ప్రత్యేకం.. హలీం తయారీ, విక్రయాల్లో పాతబస్తీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. నగరంలోని పలు ప్రాంతాల ప్రజలు రంజాన్ మాసంలో పాతబస్తీకి వచ్చి మరీ హలీం తినడం అలవాటు. దీంతో పాతబస్తీలోని హాలీం హోటళ్లు వినియోగదారులతో కిటకిటలాడతాయి. పాతబస్తీలోని పిస్తాహౌజ్, మదీనా సర్కిల్లోని షాదాబ్ హోటల్, నయాగ్రా హోటల్, శాలిబండలోని షాగౌస్, బార్కాస్ తదితర హోటళ్లలో ఎన్నో ఏళ్లుగా హలీం విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. -
నషాళానికి పొలిటికల్ మిర్చి ‘ఘాటు’
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి ప్రతినిధి, గుంటూరు/కొరిటెపాడు: మిర్చి రైతులను కూటమి సర్కార్ అనే తెగులు పట్టిపీడిస్తోంది. నష్టాల్లో కూరుకుపోయిన రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలు ఎవరికి వారు యమునా తీరు అన్నచందంగా వ్యవహరిస్తున్నారు. మిర్చి క్వింటాల్కు మద్దతు ధర రూ.11,781 కంటే తక్కువగా ఉంటే కేంద్రం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతుండగా.. కేంద్రం మార్కెట్ ఇంటర్వెన్షన్ (ఎంఎస్ఐ) కింద రూ.11,781 మద్దతు ధర నిర్ణయించిందంటూ కేంద్ర మంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ చెబుతున్నారు. వీరిద్దరి మాటల్లో ఎవరి మాట నమ్మాలి.. అసలు కేంద్రం ఎంతకు ఒప్పుకుందనే విషయంపై మాత్రం స్పష్టత లేకుండా పోయింది. తద్వారా మిర్చి రైతులను కూటమి సర్కార్ అయోమయంలోకి నెడుతుందనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. సీఎం ఒకలా.. మంత్రి మరోలాఈ నెల 21న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రూ.10,025 కంటే ఒక్క రూపాయి కూడా పెంచేది లేదని ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్’ (ఐసీఏఆర్) కేంద్రమంత్రికి తేల్చి చెప్పింది. ఈ నెల 22న సీఎం చంద్రబాబు మిర్చి రైతులు, వ్యాపారులు, ఎగుమతిదారులు, అధికారులతో సమీక్ష నిర్వహించి ‘ప్రభుత్వం నిర్దేశించిన ధర క్వింటాల్కు రూ.11,781 కంటే తక్కువగా ఉంటే కేంద్రం ద్వారా కొనుగోలుకు చేసేలా చర్యలు తీసుకుంటాం’ అంటూ డొంకతిరుగుడు సమాధానమిచ్చా రు.గుంటూరు ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని మాత్రం ఓ అడుగు ముందుకేసి ‘మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం (ఎంఎస్ఐ) ద్వారా క్వింటాల్కు రూ.11,781 మద్దతు ధరను కేంద్రం నిర్ణయించింది. 25 శాతం ఉత్పత్తిని కొనుగోలు చేస్తుంది. అవసరమైతే కొనుగోలు మొత్తాన్ని పెంచే అవకాశం ఉంది. రైతులకు ఇది కేవలం ఊరట కాదు–బలమైన అండ’ అంటూ ఆయన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ద్వారా ప్రకటించారు. సీఎం మాటలు ఒకలా ఉంటే.. కేంద్ర మంత్రి చేస్తున్న ట్వీట్లు మరోలా ఉన్నాయి. ఇంత జరుగుతున్నా కేంద్రం నుంచి మాత్రం ఏవిధమైన స్పష్టత రాకపోవడంతో ఎవరి మాటను నమ్మాలో తెలియక రైతులు అయోమయానికి గురవుతున్నారు.ఐసీఏఆర్ నుంచి స్పష్టత లేదుమద్దతు ధర రూ.11,781గా నిర్దేశించినట్టు గానీ.. 25 శాతం పంటను కొనుగోలు చేస్తామని, అవసరాన్ని బట్టి మరింత పెంచుతామనే విషయాలపై ఏవిధమైన అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ విషయంపై ఐసీఏఆర్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ హిమాన్షు పటాక్ను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా.. ‘ఇటీవలే కేంద్ర మంత్రి అధ్యక్షతన సమావేశం జరిగింది. రైతులకు మేలైన గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఏపీలో సీఎం చంద్రబాబు కూడా సమావేశం నిర్వహించారు.ఆయన సమావేశం తర్వాత కూడా దీనిపై ఎలాంటి పురోగతి లేదు’ అని ఆయన బదులిచ్చారు. రూ.11,781 మద్దతు ధర ప్రకటించారా అని ప్రశ్నించగా.. సమాధానాన్ని దాటవేశారు. అధికారి మాటలను బట్టి చూసినా పెంపునకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన కేంద్రం నుంచి రాలేదనేది స్పష్టమవుతోంది. రూ.10,025 కంటే ఒక్క రూపాయి పెంచాలన్నా.. కేబినెట్ ఆమోదం కావాల్సిందే. కేబినెట్ ఆమోదించకుండా రైతులను గందరగోళానికి గురిచేసే ప్రకటనలు ఇవ్వడంపై కూటమి నేతలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.హడావుడి తప్ప.. అడుగులేవీ?మిర్చి రైతులను ఆదుకుంటామని హడావుడి చేసిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయకపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది క్వింటాల్ మిర్చికి గరిష్టంగా రూ. 28 వేలు రాగా.. ఈ ఏడాది రూ.13,500 దాటలేదు. అందులోనూ పది శాతం మిర్చికి మాత్రమే గరిష్ట ధర వస్తుండగా, మిగిలిన సరుకు రూ.ఐదారు వేలు దాటడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన ధరకు విక్రయిస్తే రైతుకు ఎకరానికి రూ.లక్షకు పైగా నష్టం రావడం ఖాయంగా కనపడుతోంది. ప్రస్తుతం గుంటూరు మార్కెట్ యార్డులో రకం, నాణ్యతను బట్టి క్వింటాల్కు రూ.5 వేల నుంచి రూ.13 వేల వరకు ధర పలుకుతోంది.గతేడాది ఫిబ్రవరిలో క్వింటాల్కు రూ.20 వేలు నుంచి రూ.28 వేలు పలికింది. గత ఐదేళ్లలో సగటు ధర రూ.22 వేలు తగ్గలేదు. గరిష్టంగా తేజ, 341, నంబర్–5 రకాలకు రూ.27 వేలు వరకూ, బ్యాడిగ రకానికి రూ.30 వేల వరకూ పలికింది. ప్రస్తుతం తేమ శాతం, తాలు సాకులు చూపి ధరలను మరింత తగ్గించేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం మార్కెట్లోకి వచ్చి కొనుగోళ్లు ప్రారంభిస్తే ధరలు పెరుగుతాయని రైతులు చెబుతున్నారు. కనీస మద్దతు ధర క్వింటాల్కు కనీసం రూ.20 వేలు ప్రకటించాలని, అలా అయితేనే పెట్టుబడులు వస్తాయని రైతులు స్పష్టం చేస్తున్నారు.రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర నష్టంఒకటిన్నర ఎకరాల్లో డీలక్స్ రకం మిర్చి సాగు చేశాను. తామర పురుగు, నల్లి, పచ్చదోమ, తెల్లదోమ మిర్చి పంటకు ఆశించడంతో ఎకరాకు రూ.2.50 లక్షల వరకు ఖర్చయ్యింది. మొత్తం కలిపి రూ.3.75 లక్షల వరకు ఖర్చు వచ్చింది. 15 క్వింటాళ్లు ఎరుపు కాయలు, మరో ఐదు క్వింటాళ్లు తెలుపు కాయలు వచ్చాయి. ఎరుపు కాయలు క్వింటా రూ.11 వేలు, తెలుపు కాయలు క్వింటా రూ.4 వేలు ధర పలికింది. దీంతో మొత్తం రూ.1.85 లక్షలు చేతికి వచ్చాయి. వీటిలో కమీషన్ వ్యాపారి ఎంత తీసుకుంటాడో తెలీదు. మొత్తమ్మీద ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు నష్టం వస్తుంది. – కె.శివప్ప, రైతు, దొడ్డిమేకల, కర్నూలు జిల్లాగిట్టుబాటు ధర కల్పించాలిపంటకు రకరకాల తెగుళ్లు వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా నల్లతామర, నల్లి, పచ్చ దోమ, తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉంది. దీంతో పురుగు మందులు పిచికారీ చేసేందుకు లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. పురుగు మందుల ధరలు, కూలీ రేట్లు పెరిగిపోయాయి. పంటకు తెగుళ్లు సోకడంతో దిగుబడి తగ్గి నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – తులసీనాయక్, రైతు, గాడితండా, పల్నాడు జిల్లాధర పలికితేనే పెట్టుబడి వస్తుందినాలుగు ఎకరాల్లో పంట వేశాను. గతేడాది 25 క్వింటాళ్లు వచ్చిన పంట దిగుబడి తెగుళ్లు, వాతావరణంలో మార్పుల కారణంగా ఈ ఏడాది 15 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితులు లేవు. గత ఏడాది క్వింటా రూ.27 వేలు పలికిన తేజ రకం కాయలకు ఇప్పుడు రూ.12 వేలు వేశారు. ఇవే ధరలు కొనసాగితే ఆత్మహత్యలు చేసుకోవడమే మార్గం. కనీసం క్వింటాల్ రూ.20 వేలకు కొంటేనే గట్టెక్కగలం. –భుక్యా శ్రీను నాయక్, రైతు, రేమిడిచర్ల, పల్నాడు జిల్లా -
బంగారం కొత్త రేటు: ఈ రోజు ధరలివే..
బంగారం ధరలు బ్రేకుల్లేని బండిలా.. దూసుకెల్తూనే ఉంది. ఆదివారం స్థిరంగా ఉన్న పసిడి ధరలు మళ్ళీ పెరుగుదల దిశగా సాగాయి. దీంతో నేడు (ఫిబ్రవరి 24) గోల్డ్ రేటు మళ్ళీ పెరిగింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే విషయం తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై వంటి ప్రాంతాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,550 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 87,870 వద్ద నిలిచాయి. నిన్న స్థిరంగా ఉన్న గోల్డ్ రేటు.. ఈ రోజు రూ. 100 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 100 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది.చైన్నైలో కూడా బంగారం ధరలు రూ. 100 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 80,550 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 87,870 వద్ద ఉంది. చెన్నైలో కూడా నిన్న పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి.ఇదీ చదవండి: భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. ప్రధాన కారణాలివే..దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 80,690 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 88,020 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 90, రూ. 100 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా పెరుగుదల వైపు అడుగులు వేసాయి. దీంతో ఈ రోజు (ఫిబ్రవరి 24) కేజీ సిల్వర్ రేటు రూ. 1000 పెరిగి, రూ. 1,08,000 వద్దకు చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు దాదాపు ఒకేలా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 1,01,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
రైతు నోట రాని ట‘మాటా’
పలమనేరు : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలమనేరు రెవెన్యూ డివిజన్లో టమాటా రైతులు ఎప్పటిలాగే ఈ ఏడాదీ నష్టాలు చవిచూస్తున్నారు. ధరలు భారీగా పతనమవడమే ప్రధాన కారణం. పలమనేరు టమాటా మార్కెట్లో శనివారం 15 కిలోల బాక్సు రూ.140 నుంచి రూ.150 వరకు పలికింది. అంటే.. కేజీ రూ.10 మాత్రమే. దీంతో భారీ పెట్టుబడులు పెట్టి సాగుచేసిన రైతులు లబోదిబోమంటున్నారు. మరోవైపు.. టమాట పండించే రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణలోనూ సీజన్ మొదలవడంతో భారీగా టమాటాలు ఆయా రాష్ట్రాల మార్కెట్లకు చేరుతున్నాయి. అలాగే, పొరుగునే ఉన్న అనంతపురం సరుకు ఇక్కడి మార్కెట్లను ముంచెత్తుతోంది. దీంతో ధరలు అమాంతం పడిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. అయితే.. టమాట రైతును ఆదుకునేందుకు మార్కెటింగ్ శాఖ రెండ్రోజులుగా టమాటాను కొని రైతుబజార్లకు విక్రయిస్తున్నట్లు పైకి చెబుతున్నప్పటికీ నిజానికి ఎలాంటి సాయం చేయడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. రైతులను ఆదుకునేది ఇలాగేనా?రాష్ట్రంలోని టమాటా రైతులను టీడీపీ కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని, రైతుల నుంచి నేరుగా మార్కెటింగ్ శాఖ టమాటాలను కొంటుందని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు టెలీకాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్లకు చెప్పారు. కానీ, మార్కెటింగ్ అధికారులు మాత్రం శుక్రవారం మొక్కుబడిగా కొని శనివారం కొనలేదు. అలాగే, పలమనేరు మార్కెట్కు రోజుకి 40–50 టన్నుల టమాటాలు వస్తుంటే ఇక్కడి అధికారులు శుక్రవారం కొన్న సరుకు కేవలం మూడు టన్నులే. పైగా.. పలమనేరు మార్కెట్లో శనివారం బాక్సు టమాట (15 కిలోలు) రూ.150 పలికింది. అంటే.. కిలో రూ.10 అన్నమాట. కానీ, మార్కెటింగ్ అధికారులు కిలో రూ.8తో కొన్నారు. ఇలాగేనా రైతులను ఆదుకునేదని వారు ప్రశ్నిస్తున్నారు.మద్దతు ధర ఇచ్చి ఆదుకోవాలి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎకరా పొలంలో టమాట సాగుచేయాలంటే రూ.1.20 లక్షలు పెట్టుబడిగా పెట్టాలి. పంట బాగా పండితే ఎకరానికి 800 బాక్సులు దిగుబడి రావచ్చు. ఇప్పుడున్న ధరతో రాబడి ఏముంటుంది నష్టాలు తప్ప? దీనికోసం మళ్లీ అప్పులు చేయాల్సిందే. టమాటకు మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి. – మునివెంకటరెడ్డి, కూర్మాయి, పలమనేరు మండలం అంతా కొనడం కుదురుతుందా!? ఇక్కడి మార్కెట్లో కిలో రూ.8–రూ.10 రేటుతో మూడు టన్నులు కొని రైతుబజార్కు పంపాం. ఈ మార్కెట్కు నిత్యం 50 టన్నుల లోకల్ సరుకు, మరో 40 టన్నుల అనంతపురం సరుకు వస్తోంది. ఇదంతా కొనేందుకు కుదురుతుందా అని చూస్తున్నాం. అనంతపురం సరుకు తగ్గుముఖం పట్టగానే మార్చి 15 నుంచి ఇక్కడి సరుకు పెరుగుతుంది. అప్పుడు ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. – సంజీవకుమార్, ఏఏంసీ సెక్రటరీ, పలమనేరు -
ఎక్స్ యూజర్లకు షాక్!.. భారీగా పెరిగిన ధరలు
ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' (Elon Musk) ఎక్స్ఏఐ కొత్త వర్షన్ 'గ్రోక్ 3'(Grok 3)ని లాంచ్ చేసిన తరువాత.. ఎక్స్ (ట్విటర్) ప్రీమియం+ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు రెండు రెట్లు పెరిగాయి. గత మూడు నెలల్లో సబ్స్క్రిప్షన్ ప్లాన్లను పెంచడం ఇదే రెండో సారి.ఇండియాలో ఇప్పటివరకు.. ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధర నెలకు రూ. 1750 మాత్రమే. ధరలు పెరిగిన తరువాత ఇది రూ. 3,470కు చేరింది. వార్షిక ప్లాన్ కూడా రూ. 18,300 నుంచి రూ. 34,340కి పెరిగింది. బేసిక్ ప్లాన్ ధర నెలకు రూ. 244 కాగా.. ప్రీమియం ప్లాన్ ధర రూ. 650గా ఉన్నాయి.గ్రోక్ 3టెస్లా అధినేత మస్క్.. ఎక్స్లో ఇంజినీర్ల సమక్షంలో ఏర్పాటు చేసిన లైవ్ స్ట్రీమ్ ప్రజెంటేషన్లో కొత్త జనరేటివ్ ఏఐ మోడల్ 'గ్రోక్ 3'ను ఆవిష్కరించారు. గ్రోక్ 3 ఇప్పటివరకు ఉన్న గ్రోక్ 2 కంటే 10 రెట్లు ఎక్కువ సామర్థ్యంతో పని చేస్తుందని పేర్కొన్నారు. గణితం, సైన్స్, కోడింగ్ వంటి వివిధ విభాగాల్లో మార్కెట్లో పోటీదారులుగా ఉన్న ఆల్ఫాబెట్ ఇంక్కు చెందిన గూగుల్ జెమిని, డీప్ సీక్- వీ 3 మోడల్, ఆంత్రోపిక్-క్లాడ్, ఓపెన్ఎఐ-జీపీటీ-4ఓ కంటే సమర్థంగా పని చేస్తుందని చెప్పారు.ఇదీ చదవండి: ఎల్ఐసీ కొత్త ప్లాన్: సింగిల్ పేమెంట్.. జీవితాంతం ఆదాయం! -
దందాకు పచ్చజెండా .. మద్యం ప్రియులకు బాదుడు
-
అయ్య బాబోయ్.. ఇక బంగారం కొనలేం!
కేంద్రమంత్రి 'నిర్మలా సీతారామన్' ప్రవేశపెట్టనున్న బడ్జెట్ 2025లో బంగారం దిగుమతికి సంబందించిన సుంకాలను తగ్గించాలని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో నేడు (జనవరి 31) బంగారం ధరలు (Gold Price) తారాజువ్వలాగా పైకి లేచాయి. తులం పసిడి రేటు గరిష్టంగా రూ. 1310 పెరిగింది. దీంతో బంగారం ధరల్లో భారీ మార్పులు ఏర్పడ్డాయి.హైదరాబాద్, విజయవాడలలో మాత్రమే కాకుండా గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు వంటి ప్రాంతాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 77,300 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 84,330 వద్ద నిలిచాయి. నిన్న రూ. 150, రూ. 170 పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు ఒక్కసారిగా రూ. 1200 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 1310 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 1200, రూ. 1310 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 77,300 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 84,330 వద్ద ఉంది. చెన్నైలో కూడా నిన్న పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి.ఇదీ చదవండి: బంగారం.. మరింత పెరిగే అవకాశం!దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 77450 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 84,480 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 1200, రూ. 1310 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే.. వెండి రేటు కూడా పెరిగింది. దీంతో ఈ రోజు (31 జనవరి) కేజీ సిల్వర్ రేటు రూ. 1,07,000లకు చేరుకుంది. నిన్నటి కంటే ఈ రోజు ధర రూ. 1000 పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు లక్ష వద్ద ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 99,500 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
బంగారం.. మరింత పెరిగే అవకాశం!
న్యూఢిల్లీ: యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను తగ్గించడం, 2024 నాలుగో త్రైమాసికంలో అమెరికా జీడీపీ నెమ్మదించిందన్న పరిణామాల నేపథ్యంలో పసిడి ఆల్టైమ్ రికార్డుల ర్యాలీ కొనసాగుతోంది. అంతర్జాతీయంగా ఫ్యూచర్స్ మార్కెట్లో ఏప్రిల్ కాంట్రాక్టుకు సంబంధించి ఔన్సు (31.1 గ్రాములు) ధర ఒక దశలో ఏకంగా 2,852 డాలర్లకు ఎగిసింది. ఈ నేపథ్యంలో 2025లో 3,290 డాలర్లకు కూడా చేరే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.బుధవారం అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించకపోవడంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా పసిడి రేట్లకు ఆజ్యం పోసినట్లు తెలిపాయి. తాజా పరిణామంతో దేశీయంగా స్పాట్ మార్కెట్లో పసిడి ధర శుక్రవారం మరింత పెరగవచ్చని పేర్కొన్నాయి.మరోవైపు, ఢిల్లీలో గురువారమూ పసిడి కొత్త జీవితకాల గరిష్టాలను తాకింది. 99.9 స్వచ్ఛత బంగారం 10 గ్రాముల ధర రూ.50 పెరిగి రూ.83,800కు చేరింది. బుధవారం 10 గ్రా. రూ.910 లాభపడి రూ.83,750 వద్ద ముగియడం తెలిసిందే. 99.5 స్వచ్ఛత బంగారం సైతం రూ.50 పెరిగి రూ.83,400కు చేరింది. మరోవైపు వెండికి సైతం డిమాండ్ పెరిగింది.కొనుగోళ్ల మద్దతుతో కిలోకి ఏకంగా రూ.1,150 పెరిగి రూ.94,150కి చేరింది. ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ మార్కెట్లోనూ బంగారం నూతన గరిష్టాలను నమోదు చేసింది. ఏప్రిల్ నెల కాంట్రాక్టుల ధర రూ.541 పెరిగి రూ.81,145కు చేరింది. బడ్జెట్లో దిగుమతి సుంకాలు పెంచొచ్చన్న అంచనాలతో బంగారం సానుకూలంగా ట్రేడ్ అవుతోందని నిపుణులు చెబుతున్నాయి. -
బంగారం ధరలు భారీగా పెరగడానికి కారణాలు ఇవే!
బంగారం ధరలు రోజు రోజుకి అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. జనవరి ప్రారంభంలో రూ.78,000 వున్న బంగారం ధర, ఇప్పుడు ఏకంగా రూ. 82,420 వద్ద ఉంది. దీన్నిబట్టి చూస్తే గోల్డ్ రేటు ఒక్క నెల రోజుల్లోనే ఎంత వేగంగా పెరిగిందో.. అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ గోల్డ్ రేటు పెరగడానికి కారణం ఏమిటి? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.భారతదేశంలో బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం.. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త టారిఫ్ ప్లాన్స్. కొత్త టారిఫ్ ప్లాన్స్ వల్ల పెట్టుబడిదారుల్లో కొంత భయం మొదలైంది. దీంతో చాలామంది బంగారం మీద ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపారు. అమెరికా డాలర్ విలువ కొంత తగ్గడం, అంతర్జాతీయంగా బంగారం ధరల పెరుగుదల.. మన దేశంలో కూడా గోల్డ్ రేట్లు పెరగడానికి కారణం అయింది.మన దేశంలో కూడా పెట్టుబడిదారులు రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో మాత్రమే కాకుండా.. బంగారం మీద కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎక్కడైనా కొంత నష్టాలు రావొచ్చు.. కానీ బంగారం మాత్రం ఎప్పుడూ పెరుగుతూ ఉంటుందనే కారణంగానే ఇన్వెస్టర్లు ఇటువైపు తిరుగుతున్నారు. ఇది కూడా బంగారం ధర పెరగడానికి కారణం అవుతోంది.భారతదేశంలో గోల్డ్ రేటు పెరగడానికి మరో కారణం ఏమిటంటే పండుగ సీజన్స్. పండుగల సమయంలో బంగారం కొంటే మంచిదని చాలామంది సెంటిమెంట్గా భావిస్తారు. దీంతో బంగారం కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంటుంది, ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కూడా బంగారం ధరలకు ఆజ్యం పోసినట్లే అయింది.త్వరలో రూ. 90వేలు?2023లో రూ. 58వేలు వద్ద ఉన్న బంగారం ధర.. 2024 చివరి నాటికి రూ. 77,000 దాటేసింది. ఈ ధరలు 2025లో రూ. 90వేలకు చేరుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలు ప్రతి ఏటా 2 నుంచి 3 శాతం పెరుగుతుందని కూడా చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే.. బంగారం 90000 రూపాయలకు చేరుకోవడానికి మరెన్నో రోజులు పట్టే అవకాశం లేదని స్పష్టంగా తెలుస్తోంది. -
ఊహించని రేటుకు చేరిన బంగారం.. అదే బాటలో వెండి
రూ. 82,420కు చేరిన తులం బంగారం రేటు.. ఈ రోజు (జనవరి 25) అక్కడే స్థిరంగా ఉంది. దీంతో పసిడి రేట్లలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. అయితే ఈ కథనంలో మన దేశంలో ఏ నగరం గోల్డ్ రేటు ఎక్కువగా ఉంది?.. ఎక్కడ తక్కువగా ఉందనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో మాత్రమే కాకుండా.. గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 75,550 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 82,420 వద్ద నిలిచాయి. నిన్న భారీగా పెరిగిన గోల్డ్ రేటు ఈ రోజు స్థిరంగా ఉంది.చైన్నైలో కూడా బంగారం ధరలలో ఎటువంటి మార్పులు లేదు. కాబట్టి ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 75,550 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 82,420 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 75,700 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 82,570 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలలో ఎటువంటి మార్పు లేదని స్పష్టమవుతోంది. అయితే దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాత్రమే కాకుండా.. ఈ రోజు (శనివారం) వెండి ధరలలో కూడా ఎటువంటి మార్పు లేదు. కాబట్టి కేజీ సిల్వర్ రేటు రూ. 1,05,000 వద్ద ఉంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు లక్ష వద్ద ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 97,500 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).ఇదీ చదవండి: డబ్బు లేకపోయినా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు: ఇలా.. -
మరింత పెరిగిన ఎప్రిలియా ఆర్ఎస్ 457 ధర
ఎప్రిలియా భారతదేశంలోని తన ఆర్ఎస్ 457 బైక్ ధరను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు రూ. 4.10 లక్షల ధర వద్ద లభించే ఈ మోటార్సైకిల్ ధర రూ. 4.20 లక్షలు (ఎక్స్ షోరూమ్) చేరింది. దీన్నిబట్టి చూస్తే దీని ధర మునుపటికంటే రూ.10,000 ఎక్కువని తెలుస్తోంది.డిసెంబర్ 2023లో ప్రారంభమైన ఆర్ఎస్ 457 బైక్ భారతదేశంలో ఉత్పత్తి అయినా మొదటి ఎప్రిలియా మోటార్సైకిల్. ఇది మహారాష్ట్రలోని బారామతిలో పియాజియో గ్రూప్ ఫెసిలిటీలో తయారైంది. చూడటానికి అద్భుతంగా కనిపించే ఈ బైక్ మూడు రైడింగ్ మోడ్లు, త్రీ లెవెల్ స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ పొందుతుంది.ఏప్రిలియా ఆర్ఎస్ 457 బైక్ 457 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజన్ పొందుతుంది. ఇది 47 బిహెచ్పి పవర్ అవుట్పుట్, 48 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ను అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్తో లభిస్తుంది. ఈ బైక్ మంచి పనితీరును అందిస్తుంది. కాబట్టి దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.ఏప్రిలియా ట్యూనో 457ఏప్రిలియా ఇప్పుడు ఆర్ఎస్ 457 నేక్డ్ కౌంటర్పార్ట్.. ట్యూనో 457ని లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఈ స్ట్రీట్ఫైటర్ EICMA 2024లో వెల్లడైంది. అయితే కంపెనీ బైక్కి సంబంధించిన ధరలు రాబోయే నెలల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఈ బైక్ కూడా ఆర్ఎస్ 457 వలె అదే ఇంజిన్ పొందుతుంది. కాబట్టి అదే పర్ఫామెన్స్ అందిస్తుందని సమాచారం. -
ఉన్నట్టుండి పెరిగిన బంగారం ధరలు
కొత్త ఏడాది ప్రారంభం నుంచి పెరిగిన బంగారం ధరలు.. గత మూడు రోజులుగా స్థిరంగా ఉండి, మళ్ళీ పెరుగుదల దిశగా అడుగులు వేసాయి. దీంతో గోల్డ్ రేట్లలో స్వల్ప మార్పులు జరిగాయి. గోల్డ్ రేటు (Gold Price) రూ. 78,820కు చేరింది. ఈ కథనంలో నేటి (జనవరి 8) బంగారం ధరలు ఏ ప్రాంతంలో ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం.బంగారం ధరలుహైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 72,250కు చేరుకోగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 78,820 వద్ద నిలిచింది. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు రూ.100, రూ.110 పెరిగింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఉన్నాయి.దేశ రాజధాని నగరం ఢిల్లీ (Delhi)లో 22 క్యారెట్ల 10గ్రా గోల్డ్ రేటు రూ.72,400 వద్ద.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.78,970 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ.100, రూ.110 పెరిగినట్లు స్పష్టమవుతోంది.చైన్నైలో కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 72,250 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 78,820 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటి కంటే ఈ రోజు ధరలు వరుసగా రూ. 100, రూ. 110 పెరిగినట్లు తెలుస్తోంది.వెండి ధరలు2025 ప్రారంభంలో రూ.98,000 వద్ద ఉన్న వెండి ధర (Silver Price).. ప్రస్తుతం లక్ష రూపాయలకు చేరి స్థిరంగా ఉంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు లక్ష వద్ద ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 92,500 వద్ద ఉంది.పెరగనున్న బంగారం కొనుగోళ్లువిలువ పరంగా దేశీయ బంగారు ఆభరణాల వినియోగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా పటిష్టంగా ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ 'ఇక్రా' పేర్కొంది. విలువ రూపంలో వినియోగం 14 శాతం నుంచి 18 శాతం వృద్ధి చెందుతుందని ఇక్రా నివేదిక తెలిపింది. 2023 - 24లో ఈ వృద్ధి రేటు 18 శాతంగా నివేదిక తెలిపింది.ఇదీ చదవండి: మరింత పెరగనున్న బంగారం కొనుగోళ్లు: సంచలన రిపోర్ట్ఇక్రా నివేదిక ప్రకారం.. బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ డిమాండ్ మాత్రం తగ్గలేదు. పండుగ నేపథ్యంలో.. ఇటీవలి నెలల్లో మరింత పెరిగిందని తెలిసింది. 2024 జూలైలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో 9% మేర (15 నుంచి 6 శాతానికి) దిగుమతుల సుంకం తగ్గడం, బంగారం ధరల్లో తాత్కాలిక ధరల కట్టడికి దారితీసిందని ఇది రెండవ త్రైమాసికంలో భారీ కొనుగోళ్లకు దారితీసిందని నివేదిక వివరించింది. ప్రత్యేకించి ఆభరణాలతోపాటు, నాణేలు, కడ్డీల కొనుగోళ్లూ పెరిగా యని వివరించింది. పండుగల సీజన్ కూడా పసిడి డిమాండ్కు కలిసి వచ్చిన అంశంగా పేర్కొంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
టమాట ధర ఢమాల్ : 7500 కిలోల టమాటాను తగులబెట్టిన రైతు
నిన్నటి దాకా సెంచరీ దాటేసి మంట మండించిన టమాటా ధర ఒక్కసారిగా పడిపోయింది. 50 రూపాయలకు 5 కిలోల చొప్పున విక్రయిస్తున్నా డిమాండ్ లేని పరిస్థితి. ఈనేపథ్యంలో టమాట దిగుబడి బాగా వచ్చినా మార్కెట్లో సరియైన ధర లభించక పంటను తగుల బెట్టుకుంటున్నాడు రైతన్న.శివ్వంపేట(నర్సాపూర్): టమాటాకు మార్కెట్లో ధర లేకపోవడంతో ఒక రైతు పంటను తగులబెట్టాడు. మండల పరిధి నవాబుపేట గ్రామానికి చెందిన రవిగౌడ్ నాలుగు ఎకరాల్లో టమాటా పంటను సాగు చేస్తున్నాడు. ప్రస్తు తం పొలం నుంచి పంటను సేకరించి మార్కె ట్కు తరలిస్తే.. ఒక్కొక్క బాక్స్కు రూ.50 మించి ధర రావడం లేదు. రవాణాకు ఒక్కో బాక్స్కు రూ.30 పోగా రూ.20 వస్తున్నాయని, కూలీల డబ్బులు సైతం చేతికి అందడం లేదని రైతు వాపోయాడు. దీంతో గురువారం రెండు ఎకరాల్లోని 7500 కిలోల టమాటా పంటను తొలగించి తగులబెట్టాడు. ఇదే గ్రామంలో 25 మంది రైతులు సుమారు 60 నుంచి 70 ఎకరాల్లో పంట సాగు చేస్తున్నారు. గిట్టుబాటు ధర లేకపోవడంతో వీరంతా తీవ్రంగా నష్టపోవలసిన పరిస్థితి నెలకొంది. -
చాన్నాళ్లకు తగ్గిన బంగారం ధర!.. తులం ఎంతంటే?
మూడు రోజులు వరుసగా పెరిగిన బంగారం ధరలు (Gold Price) ఎట్టకేలకు తగ్గుముఖం పట్టాయి. నేడు (డిసెంబర్ 28) గోల్డ్ రేటు గరిష్టంగా రూ.160 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో మార్పులు ఏర్పడ్డాయి. ఈ కథనంలో ఈ రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడలలో మాత్రమే కాకుండా గుంటూరు, ప్రొద్దుటూరులలో కూడా 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.77,840 కాగా.. 22 క్యారెట్ల ధర రూ.71,350 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఇదే ధరలు ఉంటాయి.చెన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 150 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 160 (24 క్యారెట్స్ 10గ్రా) తగ్గింది. కాబట్టి ఇక్కడ 22 క్యారెట్స్ 10గ్రా గోల్డ్ రేటు రూ.71,350 వద్ద, 24 క్యారెట్ల రేటు రూ.77,840 వద్ద ఉంది.ఇక దేశ రాజధాని నగరం ఢిల్లీ (Delhi) విషయానికి వస్తే.. ఇక్కడ కూడా గోల్డ్ రేటు తగ్గింది. కాబట్టి ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 77,990 రూపాయలు, 22 క్యారెట్ల పసిడి ధర రూ. 71,500 వద్ద ఉంది. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగా ఉందని తెలుస్తోంది.వెండి ధరలుబంగారం ధరలు మాదిరిగానే.. ఈ రోజు వెండి ధరలు (Silver Price) కూడా పతనమయ్యాయి. కాబట్టి కేజీ వెండి రూ. 92400 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. నేటి ధరలు రూ.100 తగ్గినట్లు తెలుస్తోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
కొత్త ఏడాది బంగారం కొనడం కష్టమే!.. ఎందుకో తెలుసా?
దేశంలో బంగారం ధరలు మరోమారు పెరిగాయి. నేడు (డిసెంబర్ 27) గోల్డ్ రేటు గరిష్టంగా రూ.270 పెరిగింది. దీంతో భారతదేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఈ రోజు బంగారం ధరలను గురించి తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.78,000 కాగా.. 22 క్యారెట్ల ధర రూ.71,500 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఇదే ధరలు ఉంటాయి.దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు పెరిగింది. అయితే ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 78,150 రూపాయలు, 22 క్యారెట్ల పసిడి ధర రూ. 71,650.పసిడి ధరలు చెన్నైలో కూడా పెరుగుదల దిశగా అడుగులు వేసాయి. కాబట్టి ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.78,000 కాగా.. 22 క్యారెట్ల రేటు రూ.71,500 వద్ద ఉంది. ధరలు ఎలా ఉన్నా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.వెండి ధరలుదేశంలో బంగారం ధరలు కొంత పెరిగినప్పటికీ.. వెండి ధరల్లో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఈ రోజు కేజీ వెండి ధర రూ. 1,00,000 వద్ద నిలిచింది. బంగారం, వెండి ధరలు పెరగడం వల్ల.. కొత్త ఏడాది ప్రారంభంలో గోల్డ్, సిల్వర్ కొనాలనుకునే.. కొనుగోలుదారులు కొంత ఎక్కువ డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
బంగారం ఇప్పుడు కొనండి!.. ఎందుకంటే?
డిసెంబర్ నెల ప్రారంభం నుంచి పడుతూ.. లేస్తూ.. వస్తున్న బంగారం ధరలు నేడు (డిసెంబర్ 23) స్థిరంగా ఉన్నాయి. కాబట్టి పసిడి ధరలలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయి? ఏ నగరంలో ధరలు ఎక్కువగా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం.ఆంధ్రప్రదేశ్ (విజయవాడ), తెలంగాణ (హైదరాబాద్)లలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 77,450 కాగా.. 22 క్యారెట్ల ధర రూ.71,000 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఇదే ధరలు ఉంటాయి.దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు స్థిరంగా ఉంది. అయితే ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 77,600 రూపాయలు, 22 క్యారెట్ల పసిడి ధర రూ. 71,150. ధరలు ఎలా ఉన్నా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ బంగారం రేటు కొంత ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.చెన్నైలో పసిడి ధరలు నిశ్చలంగానే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.77,450 కాగా.. 22 క్యారెట్ల రేటు రూ.71,000 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరల్లో ఎటువంటి మార్పు లేదు.వెండి ధరలుదేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ వెండి ధరలు కూడా రూ.1,00 మాత్రమే తగ్గింది. దీంతో కేజీ సిల్వర్ ధర రూ. 98,900 వద్ద నిలిచింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
దేశీయ దిగ్గజం కీలక నిర్ణయం: భారీగా పెరగనున్న ధరలు
మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకి, హ్యుందాయ్ మోటార్స్, బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి కంపెనీలు ఇప్పటికే తమ బ్రాండ్ వాహనాల ధరలను 2025 జనవరి ప్రారంభం నుంచే పెంచనున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి దేశీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' కూడా చేరింది.టాటా మోటార్స్ తన మోడల్స్ ధరలను 3 శాతం వరకు పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ కొత్త ధరలు 2025 జనవరి నుంచే అమలులోకి వస్తాయి. కానీ ఏ వేరియంట్ ధర ఎంత అనేది త్వరలోనే వెల్లడవుతుంది. ఫ్యూయెల్ వాహనాలు మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.ఇన్పుట్ ఖర్చులు, ద్రవ్యోల్బణం పెరుగుదల కారణంగానే ధరలను పెంచుతున్నట్లు టాటా మోటార్స్ స్పష్టం చేసింది. కాగా కంపెనీ వచ్చే ఏడాదిలో మరిన్ని కొత్త కార్లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. 2025 భారత్ మొబిలిటీ ఎక్స్పోలో టాటా కొత్త ఉత్పత్తులు కనువిందు చేసే అవకాశం ఉంది.ఇదీ చదవండి: భారత్లో అత్యధికంగా అమ్ముడైన కారు: 1.86 లక్షల మంది కొనేశారువాహన తయారీ సంస్థలు ధరలను పెంచడం ఇదే మొదటిసారి కాదు. ప్రతి ఏటా.. ఏడాది చివరలో లేదా పండుగ సీజన్లలో ధరలను పెంచుతాయి. ఇప్పుడు కూడా ఇదే విధానం అనుసరించి.. పలు కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ధరల పెరుగుదల అమ్మకాలపైన ప్రభావం చూపుతుందా?.. లేదా? అనేది తెలియాల్సి ఉంది. -
జనవరి నుంచి పెరగనున్న కార్ల ధరలు: ఎంతంటే..
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ 'మారుతి సుజుకి ఇండియా' జనవరి 2025లో తమ కార్ల ధరలను 4 శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు.. నిర్వహణ ఖర్చుల కారణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే మోడల్ వారీగా ధర పెరుగుదలకు సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడి కాలేదు.మారుతి తన కొత్త కార్లను నెక్సా & అరేనా అవుట్లెట్ల ద్వారా విక్రయిస్తుంది. నెక్సా అవుట్లెట్లలో ఇగ్నీస్, బాలెనొ, సియాజ్, గ్రాండ్ విటారా, జిమ్నీ, ఎక్స్ఎల్6, ఇన్విక్టో కార్లను విక్రయిస్తోంది. అరేనా అవుట్లెట్ల ద్వారా ఆల్టో కే10, ఎస్ ప్రెస్సో, సెలెరియో, ఈకో, వ్యాగన్ ఆర్, స్విఫ్ట్, బ్రెజ్జా, ఎర్టిగా కార్లను విక్రయిస్తోంది.మారుతి సుజుకి కొత్త ధరలను 2025 జనవరి నుంచే ప్రారంభించనుంది. ధరల పెరుగుదల.. కస్టమర్ల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి కంపెనీ సేల్స్ వచ్చే ఏడాదిలో ఎలా ఉండనున్నాయనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.వాహనాల ధరలను పెంచిన సంస్థల జాబితాలో ఇప్పటికే హ్యుందాయ్, మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి, నిస్సాన్ మోటార్ వంటి కంపెనీలు చేరాయి. ఇప్పుడు తాజాగా మారుతి సుజుకి కూడా ఈ జాబితాలోకి చేరింది. -
అసలే ఖరీదైన బైకులు.. మరింత పెరగనున్న ధరలు
ప్రముఖ బైక్ తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మోటోరాడ్.. తన బైకుల ధరలను 2.5 శాతం పెంచనున్నట్లు ప్రకటించింది. ఈ ధరలు 2024 జనవరి 1నుంచే అమలులోకి రానున్నట్లు సమాచారం. ఇన్పుట్ ఖర్చులు పెరగడం వల్ల ధరలను పెంచినట్లు కంపెనీ వెల్లడించింది.ఏప్రిల్ 2017లో బీఎండబ్ల్యూ ఇండియా అనుబంధ సంస్థగా, తన కార్యకలాపాలను ప్రారంభించిన బీఎండబ్ల్యూ మోటోరాడ్.. ఖరీదైన బైకులను, స్కూటర్లను మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ జాబితాలో బీఎండబ్ల్యూ జీ310 ఆర్ఆర్, బీఎండబ్ల్యూ జీ310 ఆర్, బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్, బీఎండబ్ల్యూ జీ 310 జీఎస్, బీఎండబ్ల్యూ ఎం 1000 ఆర్ఆర్, బీఎండబ్ల్యూ సీఈ 02, బీఎండబ్ల్యూ సీఈ 04 మొదలైనవి ఉన్నాయి.ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో అత్యంత ఖరీదైన స్కూటర్గా బీఎండబ్ల్యూ సీఈ 04 (రూ. 14.90 లక్షలు). ప్రస్తుతం, దేశంలో విక్రయించే అన్ని బీఎండబ్ల్యూ బైక్లు, స్కూటర్లు ప్రామాణికంగా 3 సంవత్సరాల, అపరిమిత మైలేజ్ వారంటీతో వస్తున్నాయి. బీఎండబ్ల్యూ ఇండియన్ పోర్ట్ఫోలియోలో మొత్తం 27 మోడల్స్ ఉన్నట్లు సమాచారం. వీటి ధరలన్నీ జనవరి 1నుంచి గణనీయంగా పెరుగుతాయి. -
ఇక సబ్బులు మరింత ఖరీదు
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్న హెచ్యూఎల్, విప్రో వంటి ప్రముఖ సంస్థలు సబ్బుల ధరలను దాదాపు 7–8 శాతం పెంచాయి. సబ్బుల తయారీలో కీలక ముడిసరుకు అయిన పామాయిల్ ధరల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాయి. అస్థిర వాతావరణ పరిస్థితుల కారణంగా దిగుబడి తగ్గడంతో హెచ్యూఎల్, టాటా కంజ్యూమర్ వంటి కంపెనీలు ఇటీవల టీ ధరలను పెంచాయి.సెప్టెంబరు త్రైమాసికం ఎర్నింగ్ కాల్స్ సందర్భంగా అనేక లిస్టెడ్ కంపెనీలు తమ మార్జిన్లను కాపాడుకోవడానికి ప్రస్తుత త్రైమాసికంలో సబ్బుల ధరల సవరణ ఉంటుందని సూచనగా తెలిపాయి. పామాయిల్, కాఫీ, కోకో వంటి ముడిసరుకు ప్రియం కావడమే ఇందుకు కారణం. పామాయిల్ డెరివేటివ్స్ ధరలు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి 30 శాతం దూసుకెళ్లాయని విప్రో కంజ్యూమర్ కేర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నీరజ్ ఖత్రీ తెలిపారు. ఇతర ఉత్పత్తులు సైతం.. దిగుమతి సుంకం అధికం కావడం, అంతర్జాతీయ ధరల పెరుగుదల కారణంగా సెప్టెంబర్ మధ్య నుండి పామాయిల్ ధరలు దాదాపు 35–40 శాతం ఎగశాయి. హెచ్యూఎల్ కంపెనీకి చెందిన వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు సైతం ప్రియం అయ్యాయి. టీ వంటి విభాగాలలో దశలవారీగా ధరలను 25–30 శాతం పెంచినట్టు టాటా కంజ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఎండీ, సీఈవో సునీల్ డిసౌజా గత వారం వెల్లడించారు.వినియోగదార్లపై ఒకేసారి భారం మోపకూడదని తమ యాజమాన్యం నిర్ణయించినట్టు గోద్రెజ్ కంజ్యూమర్ ప్రొడక్ట్స్ వెల్లడించింది. 5 యూనిట్ల ప్యాక్ లక్స్ సబ్బుల ధర రూ.145 నుంచి రూ.155కి, లైఫ్బాయ్ రూ.155 నుంచి రూ.165కి చేరాయి. 4 యూనిట్ల పియర్స్ ప్యాక్ రూ.149 నుండి రూ.162కి దూసుకెళ్లింది. -
ఒక్కసారిగా పెరిగిన సీఎన్జీ ధరలు..
సాధారణంగా పెట్రోల్, డీజల్ ధరలే ప్రజలకు షాకిస్తుంటాయి. కానీ ఇప్పుడు సీఎన్జీ ధరలు కూడా ఇదే బాటలో కొనసాగుతున్నాయి. కేజీ సీఎన్జీ ధర ఉన్నట్టుండి.. ఏకంగా రెండు రూపాయల పెరిగింది.ముంబైతో పాటు నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్ వంటి ప్రాంతాల్లో సీఎన్జీ ధరలు పెరిగాయి. అయితే ఢిల్లీలో సీఎన్జీ ధరలు పెరగలేదని సమాచారం. దీనికి కారణం దేశ రాజధానిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే అని తెలుస్తోంది. కాబట్టి ఢిల్లీలో కేజీ సీఎన్జీ ధర రూ. 75.09 వద్ద ఉంది.ధరల పెరుగుదల తరువాత ముంబైలో కేజీ సీఎన్జీ 77 రూపాయలు దాటేసింది. నోయిడా, ఘజియాబాద్లలో కేజీ సీఎన్జీ ధరలు వరుసగా రూ. 81.70, రూ. 82.12గా ఉంది. దీన్ని బట్టి చూస్తే ఢిల్లీతో పోలిస్తే.. దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో సీఎన్జీ రేటు కొంత ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.ఇదీ చదవండి: యాపిల్ యూజర్లకు కేంద్రం హెచ్చరికఎన్నికలు ముగియడంతో.. ముంబైలోని సిటీ గ్యాస్ రిటైలర్ మహానగర్ గ్యాస్ లిమిటెడ్ (MGL) ముంబై, పరిసర ప్రాంతాల్లో సీఎన్జీ ధరలను కిలోపై రూ. 2 చొప్పున పెంచినట్లు వెల్లడించింది. గత రెండు నెలలుగా ధరలను పెంచని అదానీ టోటన్ గ్యాస్ కూడా సీఎన్జీ రేటును పెంచింది. ప్రస్తుతం హైదరాబాద్లో కేజీ ధర రూ. 96వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే దేశం మొత్తం మీద హైదరాబాద్లోనే సీఎన్జీ రేటు చాలా ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. -
ఇది కదా అసలైన పండుగ.. మళ్ళీ తగ్గిన బంగారం ధరలు
దీపావళి ముగియగానే బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పట్టాయి. పసిడి ధర రెండో రోజు గరిష్టంగా రూ. 160 తగ్గింది. దీంతో ఈ రోజు (నవంబర్ 2) మళ్ళీ గోల్డ్ రేటు పతనమైంది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.80,400.. 22 క్యారెట్ల ధర రూ.73,700 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటి కంటే ఈ రోజు గోల్డ్ ధరలు వరుసగా రూ.150, రూ.160 తగ్గినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఇదే ధరలు ఉంటాయి.చెన్నైలో కూడా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. నేడు పసిడి ధర రూ.150, రూ.160 తగ్గింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.80,400 కాగా.. 22 క్యారెట్ల రేటు రూ.73,700 వద్ద ఉంది.తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా.. దేశ రాజధాని నగరంలో కూడా ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 200 తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రామ్స్ పసిడి రేటు రూ. 160 తగ్గింది. కాబట్టి ఈ రోజు ఢిల్లీలో బంగారు ధర రూ. 80,550 (10 గ్రా 24 క్యారెట్స్), రూ. 73,800 (10 గ్రా 22 క్యారెట్స్) వద్ద ఉంది.వెండి ధరలుబంగారం ధరలు తగ్గినప్పటికీ.. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. దీంతో కేజీ వెండి రేటు రూ.1,06,000 వద్ద నిలిచింది. నిన్న రూ. 3000 తగ్గిన వెండి ఈ రోజు ఎలాంటి పెరుగుదలను, తగ్గుదలను నమోదు చేయలేదు.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
పండగ పోయింది: బంగారం ధర తగ్గింది
ధన త్రయోదశి, దీపావళికి భారీగా పెరిగిన బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు (నవంబర్ 1) గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 770 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో మార్పులు జరిగాయి. ఈ కథనంలో నేటి బంగారం ధరల గురించి మరిన్ని వివరాలు చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడలలో మాత్రమే కాకుండా బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో కూడా బంగారం ధరలు తగ్గాయి. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 80,560, 22 క్యారెట్ల ధర రూ. 73,850 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటి కంటే ఈ రోజు గోల్డ్ ధరలు వరుసగా రూ. 700, రూ. 770 తగ్గింది.తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా.. దేశ రాజధాని నగరంలో కూడా ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 700 తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రామ్స్ పసిడి రేటు రూ. 770 తగ్గింది. కాబట్టి ఈ రోజు ఢిల్లీలో బంగారు ధర రూ. 80,710 (10 గ్రా 24 క్యారెట్స్), రూ. 74,000 (10 గ్రా 22 క్యారెట్స్) వద్ద ఉంది.చెన్నైలో కూడా పసిడి ధరలు తగ్గుదముఖం పట్టాయి. నేడు పసిడి ధర రూ. 700, రూ. 770 తగ్గింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,560 కాగా.. 22 క్యారెట్ల రేటు రూ. 73,850 వద్ద ఉంది.ఇదీ చదవండి: బంగారంపై పెట్టుబడి.. ఇప్పుడు సురక్షితమేనా?వెండి ధరలుబంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా భారీగా తగ్గింది. దీంతో కేజీ వెండి రేటు రూ.1,06,000 వద్ద నిలిచింది. నిన్న స్థిరంగా ఉన్న సిల్వర్ రేటు ఈ రోజు రూ. 3000 తగ్గింది. దాదాపు వారం రోజుల తరువాత ఇంత పెద్ద మొత్తం వెండి ధర తగ్గడం ఇదే మొదటిసారి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
మళ్ళీ షాకిచ్చిన పసిడి.. భారీగా పెరిగిన ధరలు
ధన త్రయోదశి.. బంగారం కొనుగోలు చేస్తే శుభమని చాలామంది భావిస్తారు. అయితే నేడు పసిడి ధరలు మళ్ళీ తారాస్థాయికి చేరాయి. కాబట్టి దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరల్లో మార్పులు జరిగాయి. ఈ కథనంలో నేటి (మంగళవారం) గోల్డ్ రేట్లు గురించి వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఈ రోజు బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 80,450 వద్ద, 22 క్యారెట్ల ధర రూ. 73,750 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. నేడు ధరలు రూ. 600, రూ. 650 పెరిగింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో కూడా ఉన్నాయి.చెన్నైలో కూడా పసిడి ధరలు పెరుగుదలను నమోదు చేశాయి. తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే చెన్నైలో కూడా పసిడి ధర రూ. 600, రూ. 650 పెరిగింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,450 కాగా.. 22 క్యారెట్ల రేటు రూ. 73,750 వద్ద ఉంది.ఇక ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ కూడా పసిడి ధరలు భారీగానే పెరిగాయి. అయితే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఢిల్లీలో ధరలు కొంత ఎక్కువ. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 73,900 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 80,600 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. నేటి ధరలు వరుసగా రూ. 600, రూ. 650 పెరిగింది.ఇదీ చదవండి: 10 నిమిషాల్లో బంగారు, వెండి నాణేల డెలివరీ..సిల్వర్ ధరలుబంగారం ధరలు పెరిగినప్పటికీ.. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో కేజీ వెండి రేటు రూ.1,06,900 వద్ద నిలిచింది. గత మూడు రోజులు స్థిరంగా ఉన్న వెండి ధర ఈ రోజు రూ. 100 మాత్రమే తగ్గింది. ఇదే ధరలు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా కొనసాగుతాయి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
ఆ మందులు ఇక మరింత ఖరీదు.. ధర పెరగనున్న 8 మెడిసిన్లు!
ఆస్తమా, గ్లకోమా, తలసేమియా, క్షయతోపాటు బైపోలార్ డిజార్డర్ వంటి మానసిక రుగ్మతలతో బాధపడేవారికి మందుల భారం మరింత పెరగనుంది. ఆయా చికిత్సలకు వినియోగించే ఎనిమిది సాధారణ మందుల ధరలు మరింత ఖరీదు కానున్నాయి.ఈ మేరకు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) ఈ ఔషధాల 11 షెడ్యూల్డ్ ఫార్ములేషన్ల ధరలను వాటి ప్రస్తుత సీలింగ్ ధరపై 50 శాతం పెంచడానికి ఆమోదించినట్లు ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ కథనం పేర్కొంది. ఉత్పత్తి వ్యయం, మారకపు ధరలు పెరగడం వంటి కారణాలతో ఔషధ తయారీదారులు ధరలను పెంచడానికి దరఖాస్తు చేసుకోగా ఎన్పీపీఏ ఆమోదించినట్లు తెలుస్తోంది.పెరగనున్న మందులు ఇవే..» బెంజిల్ పెన్సిలిన్ 10 లక్షల IU ఇంజెక్షన్» అట్రోపిన్ ఇంజెక్షన్ 06.mg/ml» ఇంజెక్షన్లో వాడే స్ట్రెప్టోమైసిన్ పౌడర్ 750 mg, 1000 mg» సాల్బుటమాల్ టాబ్లెట్ 2 mg, 4 mg, రెస్పిరేటర్ ద్రావణం 5 mg/ml» పిలోకార్పైన్ 2% డ్రాప్స్» సెఫాడ్రోక్సిల్ టాబ్లెట్ 500 mg» ఇంజెక్షన్లో వినియోగించే డెస్ఫెర్రిఆక్సమైన్ 500 mg» లిథియం మాత్రలు 300 mgడ్రగ్స్ ప్రైసెస్ కంట్రోల్ ఆర్డర్ (DPCO), 2013 నిబంధనల ప్రకారం 20 కొత్త ఔషధాల రిటైల్ ధరను కూడా నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ నిర్ణయించింది. అలాగే డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్కు చెందిన సెఫురోక్సిమ్ ఆక్సెటిల్ టాబ్లెట్, క్యాడిలా ఫార్మాస్యూటికల్స్కు చెందిన ఎల్-కార్నిటిన్ మెకోబాలమిన్, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ రిటైల్ ధరను కూడా నిర్ణయించింది. -
ఆలూ, ఉల్లి ధరలు తీవ్రం
టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం సెప్టెంబర్లో 1.84 శాతంగా (2023 ఇదే నెలతో పోల్చి) నమోదయ్యింది. ఆగస్టులో ఇది 1.31 శాతం కాగా, 2023 సెప్టెంబర్లో అసలు పెరుగుదల లేకపోగా -0.07 శాతం క్షీణించింది. కూరగాయల ధరలు ప్రత్యేకించి ఆలూ, ఉల్లి ధరల తీవ్రత అధికంగా ఉంది. సమీక్షా నెల్లో మూడు ప్రధాన విభాగాలు చూస్తే..ఫుడ్ ఐటమ్స్ టోకు ద్రవ్యోల్బణం 11.53 శాతంగా నమోదయ్యింది. ఆగస్టులో ఈ రేటు కేవలం 3.11 శాతం కావడం గమనార్హం. ఆగస్టులో కూరగాయల ధరల్లో అసలు పెరుగుదల లేకపోగా -10.01 శాతం తగ్గుదల నమోదయ్యింది. అయితే సమీక్షా నెల సెప్టెంబర్లో ఈ పెరుగుదల రేటు ఏకంగా 48.73 శాతంగా ఉంది. ఆలూ ధరలు 78.13 శాతం పెరిగితే, ఉల్లి ధరలు ఏకంగా 78.82 శాతం ఎగశాయి.ఇంధనం, విద్యుత్ విభాగంలో ధరలు 4.05 శాతం తగ్గాయి. రిటైల్ ధరలూ భారమే..! ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం కూడా సెప్టెంబర్లో తీవ్రంగా ఉండడం గమనార్హం. సమీక్షా నెల్లో ఈ స్పీడ్ ఏకంగా 9నెలల గరిష్ట స్థాయిలో 5.49 శాతంగా నమోదయ్యింది. ఆగస్టులో ఈ రేటు కేవలం 3.65 శాతం. అధిక కూరగాయల ధరలు దీనికి కారణమని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. జాతీయ గణాంకాల కార్యాలయం వివరాల ప్రకారం ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం సమీక్షా నెల్లో 9.24 శాతంగా ఉంది. ఆగస్టులో ఈ రేటు 5.66 శాతంగా ఉంది. గత ఏడాది ఇదే నెల్లో 6.62 శాతం. -
బంగారం కొనడానికి గోల్డెన్ ఛాన్స్!.. ఎందుకంటే?
దీపావళి సమీపిస్తున్న తరుణంలో గోల్డ్ రేటు క్రమంగా తగ్గుముఖం పడుతోంది. వరుసగా రెండో రోజు పసిడి ధరలు కొంత మేర తగ్గాయి. దీంతో నేటి (మంగళవారం) బంగారం ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయనేది వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రేటు రూ. 70,950 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాములు పసిడి ధర రూ.77,400 వద్ద ఉంది. నిన్నటి ధరలో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 200, రూ. 220 తగ్గింది. గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్లలో మాత్రమే కాకుండా.. బెంగళూరు, ముంబైలలో కూడా ఇదే ధరలు ఉంటాయి.దేశ రాజధానిలో కూడా 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 200, రూ. 220 తగ్గాయి. దీంతో నేడు ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ. 71,100 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ. 77,550 వద్ద ఉంది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఢిల్లీలో బంగారం ధర కొంత ఎక్కువనే తెలుస్తోంది.చెన్నైలో 10 గ్రామ్స్ గోల్డ్ రేటు నిన్నటికంటే రూ. 200, రూ. 220 తక్కువ. కాబట్టి ఇక్కడ 22 క్యారెట్ల పసిడి ధర రూ. 70,950 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 77,400 వద్ద ఉంది.వెండి ధరబంగారం ధర స్వల్ప తగ్గుదలను నమోదు చేసినప్పటికీ.. గత మూడు రోజులుగా వెండి ధరలు తగ్గేదేలే అన్నట్లు ముందుకు సాగుతున్నాయి. దీంతో కేజీ వెండి రేటు రూ. 1.03 లక్షల వద్ద ఉంది. ఇదే ధరలు దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా కొనసాగుతాయి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
ధర దడ
తెనాలి: రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు నింగినంటుతున్నాయి. దసరా పండుగ సమీపిస్తున్న కొద్దీ ఈ జోరు మరింత ఎక్కువగా ఉంది. శరన్నవరాత్రుల సంబరాల హోరులో టమాటా, ఉల్లి సహా అనేక నిత్యావసర సరుకుల ధరలు సామాన్య, మధ్య తరగతి ప్రజలు ‘కొనబోతే కొరివి..’ అన్నట్లుగా ఉన్నాయి. ముందుముందు ఇవి ఇంకెంత భారమవుతాయోనని బెంబేలెత్తిపోతున్నారు. ఉదా.. బియ్యం, కందిపప్పు, ఉల్లిపాయలు, వంట నూనెలు, నిమ్మకాయ, పూల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. రైతుబజారులో టమాటా కిలో ధర గురువారం రూ.64 ఉంటే, శుక్రవారానికి రూ.73కు చేరుకుంది. బహిరంగ మార్కెట్లో రూ.80లకు విక్రయిస్తున్నారు. పది రోజుల క్రితం వరకూ రూ.40–45 పలికిన టమాటా ఇప్పుడు రెట్టింపు కావడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. మిగిలిన కూరగాయల పరిస్థితి కూడా కొంచెం అటూఇటుగా అదే పరిస్థితి. ఘాటెక్కిన ఉల్లి..వెల్లుల్లి ధరలు..ఉల్లిపాయలైతే కర్నూలువి రూ.45 పైమాటే. మహారాష్ట్ర నుంచి వచ్చే ఆరుదల పాయ కిలో రూ.70 పైమాటగానే ఉంది. వెల్లుల్లి ధర చుక్కలనంటింది. నాణ్యత ప్రకారం కిలో రూ.250 నుంచి రూ.450 వరకు అమ్ముతున్నారు. ఇక అన్ని రకాల నూనెలూ లీటరుకు రూ.20 పెరిగాయి. అయిదు లీటర్ల డబ్బాలు దాదాపు అన్నీ కొంచెం అటూఇటుగా రూ.680లకు అమ్ముతున్నారు.బియ్యం ధరలూ పైపైకి..బియ్యం ధరలు కూడా పెరిగిపోతున్నాయి. 25 కిలోల బియ్యం బస్తా రూ.1,450–1,600లకు అమ్ముతున్నారు. ఎగుమతులకు అనుమతివ్వడంతో బియ్యం ధరలకు రెక్కలొచ్చాయని చెబుతున్నారు. స్థానిక నిమ్మ మార్కెట్లో నిమ్మకాయలు కిలో రూ.70 ఉంటే రిటైల్ మార్కెట్లో డజను రూ.70కి తక్కువకు దొరకటంలేదు. అలాగే, పూల ధరలు ఠారెత్తిస్తున్నాయి. హోల్సేల్లో మల్లెపూలు కిలో రూ.1,500 కాగా, గతంలో ఎన్నడూ లేనివిధంగా రిటైల్లో మూర రూ.100లకు అమ్ముతున్నారు. సన్నజాజులు కిలో రూ.1,000, కనకాంబరాలు కిలో రూ.2,000గా ఉంది. ఇతర రకాలైనా కనీసం రూ.50–60 పెట్టనిదే మూర పూలు లభించడంలేదు. దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలతో ఏర్పడిన డిమాండ్తో వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వరదలే కారణమట..మరోవైపు.. ధరల పెరుగుదలకు ఇటీవల వచ్చిన వరదలను కారణంగా చెబుతున్నారు. ధరలను నియంత్రించే యంత్రాంగమేదీ రాష్ట్రంలో ఉన్నట్లుగా కనిపించటంలేదు. పండుగ రోజుల్లో ఈ విధంగా నిత్యావసర వస్తువుల ధరలు అమాంతంగా పెరగడంతో సామాన్య ప్రజలు పండగ గట్టెక్కేదెలా అని మథనపడుతున్నారు. -
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే?
న్యూఢిల్లీ: దేశంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు అక్టోబర్ ఒకటిన ఉదయాన్నే వంటగ్యాస్ వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. 19 కిలోల గ్యాస్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.48.50 నుంచి రూ.50కి పెరిగింది.ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్సైట్లోని వివరాల ప్రకారం ఇప్పుడు ఢిల్లీలో 19 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర 1740 రూపాయలకు చేరింది. అయితే డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలో కంపెనీలు ఎలాంటి మార్పు చేయలేదు. గతంలో మాదిరిగానే ఢిల్లీలో రూ.803కే లభ్యం కానుంది.2024, అక్టోబర్ ఒకటి నుండి, వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ముంబైలో రూ. 1,692.50, కోల్కతాలో రూ. 1,850.50, చెన్నైలో రూ. 1,903కు చేరింది. దీనికిముందు సెప్టెంబర్లో కూడా ఎల్పీజీ సిలిండర్ ధర సుమారు రూ.39 పెరిగి రూ.1,691.50కి చేరింది. దీనికి ముందు రూ.1,652.50గా ఉంది. కోల్కతాలో మంగళవారం నుంచి 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.48 పెరిగింది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరల పెరుగుదల కారణంగా, రెస్టారెంట్లు, హోటళ్లు, ధాబాలలోని ఆహార ధరలు పెరగనున్నాయి.ఇది కూడా చదవండి: 31నే దీపావళి.. తేల్చిచెప్పిన కాశీ పండితులు -
థార్ రాక్స్ 4x4 ధరలు ఇవే
థార్ రాక్స్ 4x4 వేరియంట్ ధరలను మహీంద్రా కంపెనీ వెల్లడించింది. ఈ SUV ధరలు రూ. 14.79 లక్షల నుంచి రూ. 22.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ ఎడిషన్ ఎంఎక్స్5, ఏఎక్స్5 ఎల్, ఏఎక్స్7 ఎల్ అనే మూడు వేరియంట్లలో కేవలం డీజిల్ ఇంజిన్ ఆప్షన్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.మహీంద్రా థార్ రాక్స్ 4x4 ఎడిషన్ 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ 6 స్పీడ్ గేర్బాక్స్తో 330 Nm టార్క్ 150 Bhp పవర్ అందిస్తుంది. అదే 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో 172 Bhp పవర్, 370 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది స్నో, సాండ్, మడ్ అనే మూడు పవర్ మోడ్స్ పొందుతుంది.ఇదీ చదవండి: పరిమాణం చిన్నది.. పనిమాత్రం పెద్దది: 'పవర్'ఫుల్ రియాక్టర్థార్ రాక్స్ ఎంఎక్స్5 4x4 ఎడిషన్ 10.25 ఇంచెస్ టచ్స్క్రీన్, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, రివర్స్ కెమెరా, సన్రూఫ్, ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్, ఆటో హెడ్లైట్స్ వంటి ఫీచర్స్ పొందుతుంది. ఏఎక్స్5 ఎల్ వేరియంట్ 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కనెక్టెడ్ కార్ టెక్, లెవల్ 2 ఏడీఏఎస్ టెక్ వంటివి పొందుతుంది. ఏఎక్స్7 ఎల్ పనోరమిక్ సన్రూఫ్, హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా వంటివి పొందుతాయి. -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం!.. ఎంతంటే?
గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. కొన్ని రోజులకు ముందు ఒక బ్యారెల్ చమురు ధర 80 డాలర్ల కంటే ఎక్కువగా ఉండేది. అయితే ఉప్పుడు ఈ ధర 70 డాలర్ల నుంచి 72 డాలర్ల మధ్య ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గడంతో మనదేశంలో లీటరు ధర రూ. 2 నుంచి రూ. 3 వరకు తగ్గే అవకాశం ఉంది.ఐసీఆర్ఏ కార్పొరేట్ రేటింగ్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ గ్రూప్ హెడ్ 'గిరీష్ కుమార్ కదమ్' ఇంధన ధరల గురించి మాట్లాడుతూ.. అంతర్జాతీయ ఉత్పత్తుల ధరలతో పోలిస్తే చమురు కంపెనీలు పెట్రోల్.. డీజిల్ ధరలపై లీటర్కు వరుసగా రూ.15, రూ.12 చొప్పున ఆర్జిస్తున్నాయని పేర్కొన్నారు.2024 మార్చి15న పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుపై రూ. 2 తగ్గింది. ఆ తరువాత ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా ముందుకు సాగుతూనే ఉంది. అయితే ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరల తగ్గుదల భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గుదలకు కారణమవుతాయని తెలుస్తోంది. అయితే ధరలు ఎప్పుడు తగ్గుతాయనేది తెలియాల్సి ఉంది. -
వంట నూనె ధరల మంటలు
-
మెరుపు తగ్గిన ‘మిరప’
సాక్షి, అమరావతి: మిరప మెరుపు తగ్గింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గే అవకాశాలు కన్పిస్తున్నాయి. వర్షాలు, వరదలతో పంటలు భారీగా దెబ్బతినడంతో పాటు నల్లతామరతో సహా చీడపీడలు, తెగుళ్ల ప్రభావానికి తోడు మార్కెట్లో ధర లేకపోవడం మిరప రైతులను కలవర పెడుతోంది. రాష్ట్రంలో మిరప సాధారణ విస్తీర్ణం 3.95 లక్షల ఎకరాలు కాగా, 2022లో 5.70 లక్షల ఎకరాల్లో సాగవగా, 2023లో రికార్డు స్థాయిలో 6 లక్షల ఎకరాల్లో సాగైంది. కానీ ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 3.36లక్షల ఎకరాల్లో మాత్రమే మిరప నారు వేయగలిగారు. ఇప్పటికే సాగైన విస్తీర్ణంలో 15 వేల ఎకరాలకు పైగా వర్షాలు, వరదల వల్ల పూర్తిగా దెబ్బతిన్నాయి. సీజన్ ముగిసే నాటికి 4.50 లక్షల ఎకరాలు దాటడం కూడా కష్టమేనని అధికారులు అంచనా వేస్తున్నారు.అవగాహన కల్పించే వారేరి?సీజన్ ఆరంభంలో వర్షాభావ పరిస్థితులు కాస్త కలవరపెట్టాయి. ఆ తర్వాత సమృద్ధిగా వర్షాలు కురిసినా ఎరువుల కొరత తీవ్రంగా వేధించింది. తెల్లతామర తెగులుతో పాటు ఇతర చీడపీడలపై గడచిన నాలుగేళ్లుగా వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ రూపొందించిన ప్రొటోకాల్ మేరకు ఆర్బీకే స్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించేవారు. ఫలితంగా నల్లతామరతో సహా ఇతర చీడపీడలు, తెగుళ్ల జాడ కనిపించలేదు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి ఎక్కడా మచ్చుకైనా కన్పించడంలేదు. నల్లతామర నివారణకు ఉద్యాన శాఖ ద్వారా తీసుకుంటున్న చర్యలు పూజ్యమనే చెప్పాలి.భారీగా పతనమైన ధర2022–23లో క్వింటాకు గరిష్టంగా రూ.27వేల ధర పలకగా, 2023–24 సీజన్లో గరిష్టంగా రూ.29 వేల వరకు పలికింది. అలాంటిది ప్రస్తుతం గుంటూరు మిర్చియార్డులో క్వింటాకు గరిష్టంగా రూ.18,600, కనిష్టంగా రూ.9,500 చొప్పున ధర పలకడం ఆందోళన కలిగిస్తోంది. గతేడాది క్వింటా రూ.50వేలకుపైగా పలికిన బాడిగ రకం మిరపకు ఈసారి రూ.10వేలకు మించి పలకని పరిస్థితి నెలకొంది. మరొక పక్క 2022–23 సీజన్లో ఎకరాకు 18–23 క్వింటాళ్ల చొప్పున 11.50లక్షల టన్నుల దిగుబడి రాగా, 2023–24లో 20–25 క్వింటాళ్ల చొప్పున 12.50 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. కాగా ఈ ఏడాది సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గనుండడంతో 10లక్షల టన్నుల దిగుబడులు కూడా వచ్చే పరిస్థితి కన్పించడం లేదని అధికారులు చెబుతున్నారు. -
ఇది సాయమా? మరో గాయమా!?
సాక్షి, అమరావతి: అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు.. అన్నట్లుగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం తీరు చూస్తుంటే. విజయవాడను వరదలు ముంచెత్తి 15 రోజులు పూర్తయినా బాధితులకు చిల్లిగవ్వ సాయం కూడా చేయని రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు వారి జేబులకు చిల్లులుపడే బాధ్యతను మాత్రం భుజానికెత్తుకుంది. బాధితులకు మేలు చేస్తున్నట్లు ఓ వైపు బిల్డప్ ఇస్తూనే మరోవైపు ఓ కార్పొరేట్ సంస్థకు మేలు చేకూర్చేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా.. బాధితుల ఇళ్లలో పనికిరాకుండా పోయిన గృహోపకరణాలతోపాటు ఇళ్లలో నీటి పైపులైన్లు, నీటి కుళాయిలు వంటి ప్లంబింగ్ పనులకు నిర్ణీత రేట్లతో మరమ్మతులు చేయించేందుకు ప్రభుత్వం ఓ కార్పొరేట్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఈ మరమ్మతుల రేట్లు అవాక్కయ్యేలా ఉండడం ముంపు ప్రాంతాల్లో పెద్ద చర్చనీయాంశమవుతోంది. ఉదా.. స్విచ్బాక్స్ బిగించడానికి రూ.279, ఫ్యాన్ రెగ్యులేటర్ మార్చడానికి రూ.99, ఫ్యాన్ రిపేరుకు రూ.199, ఫ్యాన్ మార్చడానికి రూ.239, గీజర్ చెక్ చేయడానికి రూ.299, వాష్ బేసిన్ లీకేజీ రిపేరుకు రూ.169, సింక్ డ్రెయిన్ పైపు రిపేరుకు రూ.209, డ్రెయిన్ పైపులో అడ్డుతొలగించేందుకు రూ.169, వాటర్ ట్యాప్ రిపేరుకు రూ.139, ఫ్లష్ ట్యాంకు రిపేరుకు రూ.299, వెస్ట్రన్ టాయిలెట్ రిపేరుకు రూ.799, వెస్ట్రన్ టాయిలెట్ మార్చడానికి రూ.1,499, ఇండియన్ టాయిలెట్ బిగించడానికి రూ.1,699.. అంటూ సదరు సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుని ధరలను నిర్ణయించింది. అంటే.. ఈ ధరలను బాధితులు స్వయంగా డబ్బులు చెల్లించి రిపేర్లు చేయించుకోవాల్సి ఉంటుంది. నిజానికి.. బయట మార్కెట్లో ఈ ధరలు ఇంకా తక్కువగానే ఉన్నాయని బాధితులే స్వయంగా చెబుతున్నారు. మరోవైపు.. ఈ కార్పొరేట్ సంస్థకు అదనంగా అవసరమయ్యే టెక్నీíÙయన్లను స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ పొందిన వారిని ప్రభుత్వమే కేటాయించడం గమనార్హం. బాధితులకు యాప్ బాధ్యత ప్రభుత్వ సిబ్బందికి.. ఇదిలా ఉంటే.. వరద ముంపు బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 9–12 వరకు ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వ సిబ్బందితో ఇంటింటి సర్వే నిర్వహించింది. ఏ ఇంట్లో ఏ వస్తువులు పాడయ్యాయో వివరాలను సేకరించింది. ఇప్పుడు వీరి సమాచారం పరోక్షంగా ఆ సంస్థ చేతిలో ప్రభుత్వం పెట్టేసింది. అలాగే, పొదుపు సంఘాల కార్యక్రమాలను పర్యవేక్షించే ఉన్నతాధికారులు ఇటీవలే విజయవాడ పరిధిలోని మెప్మా సిబ్బందితో సమావేశం నిర్వహించి ముంపు ప్రాంతాల్లోని పొదుపు మహిళల ఫోన్లలో సదరు కార్పొరేట్ సంస్థ యాప్ను డౌన్లోడ్ చేయించే బాధ్యతను వారికి అప్పగించారు. కొన్నిచోట్ల సచివాలయాల ఉద్యోగులు ఈ బాధ్యతను చేపట్టినట్లు సమాచారం. అంతేకాక.. ‘మీ ఇంట్లో పాడైన వాటిని సంబంధిత కంపెనీతో తక్కువ ఖర్చుతో బాగుచేయించుకోండి’ అంటూ ఆ సంస్థ క్యూఆర్ కోడ్తో ప్రభుత్వమే కరపత్రాలను బాధితులకు అందిస్తూ ఆ సంస్థను ప్రోత్సహిస్తోంది.కళ్లుచెదిరేలా రిపేరింగ్ రేట్లు.. నిజానికి.. పాడైన వస్తువులను ఇంటి చుట్టుపక్కల ఉండే టెక్నీషియన్తో బాగుచేయించుకుంటే తక్కువ ఖర్చుతో అయిపోతుంది. కానీ, ప్రభుత్వ ఒప్పందం ప్రకారం నిర్ణయించిన రేట్లు చూస్తే బయట మార్కెట్ రేట్లు లేదా ఆ కార్పొరేట్ సంస్థ తన యాప్లో ప్రదర్శించే ధరల కన్నా ఎక్కువగా ఉన్నాయి. వీరిని ఆశ్రయిస్తే బాధితుల ఖర్చులు తడిసిమోపెడవడం ఖాయం. ఎందుకంటే.. ఒకే ఇంట మూడు ట్యూబ్లైట్లను ఆ కంపెనీ ద్వారా మార్చుకుంటే మొత్తం రూ.360 చెల్లించాల్సి ఉంటుంది. కానీ, బయట మెకానిక్లో చేయిస్తే 150–200 మించి కావు. అలాగే.. ఎలక్ట్రికల్ స్విచ్ బాక్స్ బిగించడానికి రూ.239లు అని యాప్లో పేర్కొనగా, వరద ప్రాంతాల్లో ఇదే సేవకు రూ.279లుగా ధరను ప్రభుత్వం నిర్ణయించింది. లోకల్గా ఉండే మెకానిక్లు ఇదే పనికి రూ.100 నుంచి రూ.250 వరకు వసూలు చేస్తామని చెబుతున్నారు. మరోవైపు.. ఫ్యాన్ మార్చడానికి యాప్ ధర రూ.199లు ఉంటే వరద ప్రాంతాల్లో రూ.239లుగా నిర్ణయించారు. అదే స్థానిక మెకానిక్లు ఈ పనికి కేవలం రూ.100–150ల చొప్పున తీసుకుంటామని చెబుతున్నారు. నీటి కుళాయి మార్చడానికి రూ.50 అని యాప్లో ఉంటే ఇదే పనికి వరద ప్రాంతాల్లో ప్రభుత్వం రూ.139లు నిర్ణయించింది. స్థానిక మెకానిక్లు ఈ పనికి రూ.100 తీసుకుంటున్నారు. వాస్తవానికి.. అనేక ప్రైవేట్ సంస్థలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి బాధితులకు ఉచితంగా సేవలందిస్తుంటే ప్రభుత్వం వీటిని ప్రోత్సహించకుండా కార్పొరేట్ సంస్థకు కొమ్ముకాయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాక.. విపత్తు సమయంలో నిండా మునిగిన బా«ధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోకుండా బాధితుల నుంచి కార్పొరేట్ కంపెనీలు అధిక ధరలు వసూలుచేసుకునేలా వీలు కల్పించడం విడ్డూరంగా ఉందని బాధితులు వాపోతున్నారు. ఆదుకుంటామని చెప్పి ఇలా చేస్తారా!? ఇక వరద తగ్గిన ప్రాంతాల్లో ఫైర్ ఇంజన్లతో నీట మునిగిన ఇళ్ల పరిసరాలు శుభ్రం చేయిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇంట్లోని సామాన్లు, దుస్తులు, గృహోపకరణాలు పాడైపోయిన వారిని ఏ విధంగా ఆదుకోవాలో కూడా ప్రకటిస్తామన్నారు. తీరా ఇప్పుడు బాధితులే డబ్బులు కట్టి బాగుచేయించుకోవాలని సూచించడంతో పాటు ఆయా పనులకు ప్రభుత్వం ధరలు నిర్ణయించి కార్పొరేట్ సంస్థతో ఒప్పందం చేసుకోవడంపై బాధితులు మండిపడుతున్నారు. సాయం మాట దేవుడెరుగు ఇది తమను మరింత గాయపర్చేలా ఉందని వారు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. -
తగ్గిన బంగారం, వెండి ధరలు: ఎంతంటే?
సెప్టెంబర్ నెలలో మొదటిసారి పెరిగిన బంగారం ధరలు మళ్ళీ తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు తులం బంగారం రేటు రూ. 440 తగ్గింది. దీంతో బంగారం ధర రూ.72870 వద్ద నిలిచింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు చూసేద్దాం.విజయవాడ, హైదరాబాద్లలో మాత్రమే కాకుండా బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్లలో శనివారం బంగారం ధరలు మళ్ళీ తగ్గాయి. తులం 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 400 తగ్గి రూ. 66800 వద్దకు చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధరలు రూ. 440 తగ్గి రూ.72870 వద్ద నిలిచింది.చెన్నైలో కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇక్కడ 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 66800 & 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72870గా ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 400, రూ. 440 తక్కువ.దేశ రాజధాని నగరం ఢిల్లీలో గోల్డ్ ధరలు వరుసగా రూ. 66,950 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ.73020 (24 క్యారెట్స్ 10గ్రా) వద్ద ఉన్నాయి. నిన్న కొంత పెరిగిన పసిడి ధరలు ఈ రోజు వరుసగా రూ. 400, రూ. 440 తగ్గింది. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో ధరలు కొంత అధికంగా ఉన్నయని స్పష్టంగా తెలుస్తోంది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే.. వెండి ధర రూ. 2500 తగ్గింది. నిన్న రూ. 2000 పెరిగిన కేజీ వెండి ధర ఈ రోజు రూ. 2500 తగ్గింది. దీంతో ఈ రోజు కేజీ వెండి ధర రూ. 84500 వద్ద నిలిచింది. ఇదే ధరలు దేశంలోని వివిధ నగరాల్లో కూడా ఉంటాయి.ఇదీ చదవండి: అమెరికాకు కమల్ హాసన్: ఆ కోర్సు నేర్చుకోవడానికే..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
తగ్గిన బంగారం, పెరిగిన వెండి: ఈ రోజు ధరలు ఇవే
ఆగష్టు 17న భారీగా పెరిగిన బంగారం ధరలు రెండు రోజులు స్థిరంగా ఉండి, ఈ రోజు (మంగళవారం) స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. దీంతో పసిడి ధరలలో కొంత మార్పు సంభవించింది. దేశ వ్యాప్తంగా ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయనేది ఇక్కడ తెలుసుకుందాం.విజయవాడ, హైదరాబాద్లలో మాత్రమే కాకుండా బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్లలో కూడా గోల్డ్ రేటు ఈ రోజు రూ. 100 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ. 120 (24 క్యారెట్స్ 10 గ్రా) తగ్గింది. దీంతో ఈ ప్రాంతాల్లో తులం బంగారం ధర రూ. 66600 & రూ. 72650 వద్ద ఉన్నాయి.ఇక చెన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ కూడా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. కాబట్టి చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రా గోల్డ్ రేటు రూ. 66600, 24 క్యారెట్ల 10 గ్రా బంగారం ధర రూ. 72650గా ఉంది. నిన్న, మొన్న స్థిరంగా ఉన్న బంగారం రెండు రోజుల తరువాత కొంత తగ్గుముఖం పట్టింది.దేశ రాజధానిలో కూడా 10 గ్రా 22 క్యారెట్స్ & 24 క్యారెట్స్ గోల్డ్ రేట్లు వరుసగా రూ. 100, రూ. 120 తగ్గింది. దీంతో పసిడి ధరలు రూ. 66750 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 72800 (24 క్యారెట్స్ 10గ్రా) వద్ద ఉన్నాయి. నిన్న స్థిరంగా ఉన్న బంగారం రేటు.. ఈ రోజు మాత్రం స్వల్పంగా మాత్రమే తగ్గింది.వెండి ధరలుదేశంలో బంగారం ధరలు కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ.. వెండి మాత్రం అస్సలు తగ్గేదేలే అన్నట్లు దూసుకెళ్తోంది. దీంతో సిల్వర్ రేటు మళ్ళీ గరిష్టాలకు చేరింది. ఈ రోజు (ఆగష్టు 20) కేజీ వెండి రేటు రూ. 1000 పెరిగి రూ. 87000 వద్ద నిలిచింది. ఇదే ధరలు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా ఉంటాయి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
ఇప్పుడు బంగారం కొనొచ్చా!.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..
కేంద్ర బడ్జెట్ ప్రకటించిన రోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. దీంతో పసిడి ప్రియులు తెగ సంబరపడిపోయారు. గోల్డ్ రేట్లు ఇక తగ్గుముఖం పడతాయని చాలామంది భావించారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అనుకున్నదొకటి.. అయినది ఒకటి మాదిరిగా అయిపోయింది. ఆగష్టు ప్రారంభం నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల తులం బంగారం రూ. 70వేలు దాటేసింది.బంగారం కొనుగోలు సురక్షితమైన పెట్టుబడిగా భావించి చాలామంది ఇన్వెస్టర్లు గోల్డ్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఆగష్టు 9 నుంచి 13 వరకు బంగారం ధరలు గరిష్టంగా రూ. 2350 (10 గ్రా) పెరిగింది. దీన్ని బట్టి చూస్తే గోల్డ్ రేటు మళ్ళీ భారీగా పెరిగే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది.కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుఎస్లో వడ్డీ రేట్ల తగ్గింపుపై పెరుగుతున్న అంచనాలు, డాలర్ ఇండెక్స్లో మృదుత్వం, బంగారానికి దేశంలో పెరుగుతున్న డిమాండ్ వంటివన్నీ గోల్డ్ రేట్లు పెరగటానికి కారణమవుతున్నాయని కెడియా అడ్వైజరీ డైరెక్టర్ అజయ్ కెడియా అన్నారు.గంటల వ్యవధిలోనే బంగారం ధరల్లో మార్పులు సంభవిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. గోల్డ్ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. వారంలో రెండు రోజులు స్వల్ప తగ్గుదలను నమోదు చేస్తున్న బంగారం ధరలు.. మిగిలిన రోజులు పెరుగుదల వైపే అడుగులు వేస్తున్నాయి. కాబట్టి బంగారం కొనాలనుకునే వారు కొంత తగ్గుముఖం పట్టినప్పుడు కొనుగోలు చేయడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. -
తులం బంగారం రూ. 113 మాత్రమే *
మనదేశంలో పెళ్లిళ్లు, వేడుకలు, అక్షయతృతీయ, వరలక్ష్మీ వ్రతం లాంటి సందర్భాల్లో బంగారం కొనుగోలుకు అధిక డిమాండ్ ఉంటుంది. గతంతో పోలిస్తే బంగారం ధర భారీగా పెరిగినప్పటికీ, చాలామంది దానిని కొనుగోలు చేసేందుకు ఏమాత్రం వెనుకాడరు. అయితే ఒకప్పుడు 11.66(తులం) గ్రాముల బంగారం ధర కేవలం రూ.113 అని తెలిస్తే ఎవరికైనా ఆ కాలానికి తిరిగి వెళ్లాలనిపిస్తుంది. అయితే బంగారం ధర చాలా తక్కువగా ఉన్న కాలంలో ప్రజల ఆదాయం కూడా చాలా పరిమితంగానే ఉండేది. బంగారం కొనుగోలుకు సంబంధించిన పాత రసీదు ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ రసీదులో 11.66 గ్రాముల బంగారం ధర రూ.113 అని ఉంది. ఈ బిల్లు 1959 నాటిది.ప్రస్తుతం తులం బంగారం ధర రూ.70 నుంచి 75 వేలుగా ఉందని ఆ పోస్ట్లో పేర్కొన్నారు. ఈ పాత బిల్లు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతోంది. దీనిని చూసిన యూజర్స్ తెగ ఆశ్చర్యపోతున్నారు. ‘జిందగీ గుల్జార్ హై’ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ బిల్లు ఫొటోను షేర్ చేశారు. ఈ పోస్ట్ను ఇప్పటివరకు 69 వేల మందికి పైగా లైక్ చేశారు. అలాగే పలువురు తమ కామెంట్లు పెడుతున్నారు. ఒక యూజర్ ‘సమయం వేగంగా కదులుతోంది’అని రాయగా, మరొక యూజర్ ‘నాటి ఆదాయాల ప్రకారం చూస్తే బంగారం ఎంతో ఖరీదైనది’ అని రాశారు. ఇంకో యూజర్ ‘అప్పట్లో చాలామంది జీతం నెలకు 40 రూపాయలు’ అని రాశారు. -
మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు - ఎంతంటే?
దేశంలో బంగారం ధరలు మళ్ళీ తగ్గుముఖం పట్టాయి. మంగళవారం (జులై 30) పసిడి ధరలు గరిష్టంగా రూ. 330 తగ్గింది. దీంతో గోల్డ్ రేట్లలో స్వల్ప మార్పులు జరిగాయి. దేశ వ్యాప్తంగా ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయనేది ఇక్కడ చూసేద్దాం.విజయవాడ, హైదరాబాద్లలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 63200 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 68950 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ.200, రూ. 210 తగ్గింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్లలో కూడా ఉన్నాయి.చెన్నైలో గోల్డ్ రేటు వరుసగా రూ. 300, రూ. 330 తగ్గింది. దీంతో అక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63850 కాగా, 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ బంగారం ధర రూ. 69650 వద్ద ఉన్నాయి. నిన్న దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగినప్పటికీ.. చెన్నైలో మాత్రం ధరలు తగ్గాయి.దేశ రాజధాని నగరంలో కూడా బంగారం ధరలు స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. దీంతో ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 63350 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 69100 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 200, రూ. 210 తగ్గింది.వెండి ధరలుబంగారం మాదిరిగానే దేశంలో వెండి ధరలు కూడా తగ్గాయి. సోమవారం రూ. 500 పెరిగిన వెండి ధర మంగళవారం (జులై 30) రూ. 500 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ. 84500లకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
ఇకపై తగ్గనున్న మొబైల్ ఫోన్ ధరలు.. ఎందుకంటే?
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2024-25లో సాంకేతిక రంగానికి ప్రోత్సాహకాలను అందించింది. మొబైల్ ఫోన్స్, ఛార్జర్లు, పీసీబీఏ సుంకాలను 20 నుంచి 15 శాతానికి తగ్గించారు. దేశంలో మొబైల్ ఫోన్స్ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. దేశం నుంచి ఎగుమతులు కూడా విరివిగా జరుగుతున్నాయి.గత ఆరేళ్లలో మొబైల్ ఫోన్స్ ఉత్పత్తి ఏకంగా మూడు రెట్లు పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. మొబైల్ పరిశ్రమ గణనీయంగా వృద్ధి చెందటంతో బేసిక్ కస్టమ్స్ డ్యూటీని తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. అంతే కాకుండా ఈ ఏది జనవరిలోనే కేంద్ర ప్రభుత్వం మొబైల్ ఫోన్ విడిభాగాల దిగుమతి సుంకాలను కూడా 15 నుంచి 10 శాతానికి తగ్గించింది.యాపిల్, ఒప్పో, వివో మొదలైన కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ టారిఫ్ స్లాబ్ హేతుబద్ధీకరణ ప్రతిపాదనను కూడా అంగీకరించింది. దిగుమతి సుంకాలు తగ్గించడంతో భారతదేశంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు బాగా తగ్గుతాయని స్పష్టమవుతోంది. -
అపుడు రాజును బతికించిన ఐకానిక్ తుపాకీలు : ఇపుడు వేలంలో కోట్లు
ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టే ఫ్రాన్స్ చరిత్రపై బలమైన ముద్రవేసిన సైన్యాధ్యక్షుడు. 1814లో విదేశీ సైన్యం పారిస్ను ఆక్రమించుకున్నాడు. దీంతో అధికారాన్ని కోల్పోయిన నెపోలియన్ చాలా తీవ్ర నిరాశ, ఒత్తిడికి గురయ్యాడు. ఈ కారణంతోనే ఏడాది 1814 ఏప్రిల్ 12 రాత్రి ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. తొలుత తుపాకీతో ఆత్మహత్య చేసుకోవాలను కున్నాడు. అయితే ఆయన వద్ద పనిచేసే అధికారి ఒకరు తుపాకీలోని పౌడర్ను తొలగించడంతో బతికిపోయాడు. ఆ తరువాత కూడా విషం తీసుకున్నాడు కానీ ఈ సారీ ప్రాణాలతో బయటపడ్డాడు. ఇదంతా ఇపుడు ఎందుకూ అంటే ఆ నాడు చక్రవర్తి తనను తాను చంపుకోవడానికి ఉపయోగించాలని భావించిన రెండు పిస్తోళ్లను వేలం వేయగా భారీ ధర పలికాయి. ఫ్రాన్స్లో నిర్వహించిన వేలంలో ఈ రెండు పిస్తోళ్లు ఏకంగా 1.69 మిలియన్ యూరోలకు (సుమారు రూ. 15.26 కోట్లు) అమ్ముడు పోవడం విశేషంగా నిలిచింది. ఫ్రాన్స్లోని ఫోంటైన్బ్లూ ప్యాలెస్ పక్కన ఉన్న ఒసేనాట్ ఆక్షన్ హౌస్లో ఈ వేలాన్ని ఆదివారం నిర్వహించారు. అయితే కొనుగోలు చేసినవారి పేర్లను మాత్రం వెల్లడించలేదు. ఈ పిస్టల్స్ని జాతీయ సంపదగా ఉంచాలని భావించిన ఫ్రాన్స్ ప్రభుత్వం వాటి ఎగుమతిని నిషేధించింది. ఈ మేరకు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ కమిషన్ నిర్ణయాన్ని అధికారిక పత్రికా ప్రకటన జారీ చేసింది. దీంతో వేలం పాటలో దక్కించుకున్న వ్యక్తుల నుంచి ఈ పిస్తోళ్లను ఫ్రాన్స్ తిరిగి దక్కించుకునే అవకాశాలున్నాయని స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది. అయితే కొనుగోలు చేసిన వ్యక్తి నుంచి 30 నెలల వ్యవధిలో పిస్తోళ్లను తిరిగి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఒక వేళ ఫ్రాన్స్ ప్రభుత్వం కొనుగోలు ఆఫర్ను ప్రకటిస్తే, దీన్ని తిరస్కరించే హక్కు వేలంలో దక్కించుకున్న వ్యక్తికి ఉంటుంది. మరోవైపు ఫ్రాన్స్ నిబంధనల ప్రకారం దేశ సంపదగా ప్రకటించిన ఏ వస్తువునైనా తాత్కాలికంగా మాత్రమే బయటకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత తప్పనిసరిగా తిరిగి ఇవ్వాల్సి ఉంటుందని ‘ఒసేనాట్ ఆక్షన్’ ప్రతినిధి తెలిపారు.ఈ పిస్టల్స్ స్పెషాల్టీ ఏంటి? ఈ రెండు ఐకానిక్ తుపాకులను చక్రవర్తి నెపోలియన్ బొమ్మతో బంగారం, వెండితో తయారు చేశారు. ఈ పిస్టల్స్ను పారిస్ తుపాకీ తయారీదారు లూయిస్-మారిన్ గోసెట్ రూపొందించారు. 1814లో నెపోలియన్ అధికారాన్ని కోల్పోయాడు. వేలం హౌస్ నిపుణుడు జీన్-పియర్ ఒసేనాట్ సమాచారం ప్రకారం తీవ్ర నిరాశ, ఒత్తిడితో, ఈ తుపాకీలతోనే కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన ఆయన వద్ద పనిచేసే ముఖ్య ఆర్మీ అధికారి అర్మాండ్ డి కౌలైన్కోర్ట్ తుపాకీలోని పౌడర్ను తొలగించారు. దీంతో తన పట్ల విధేయత చూపిన ఆ అధికారికి ఈ పిస్తోళ్లను బహుమతిగా అందించారట. -
పసిడి ప్రియులకు షాక్!.. ఒక్కసారిగా పెరిగిన ధరలు
జులై ప్రారంభం నుంచి స్వల్పంగా పెరుగుతూ ఉన్న పసిడి ధరలు ఈ రోజు (జులై 4) మరింత పైకి లేచాయి. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈ రోజు గరిష్టంగా రూ.710 పెరిగింది. దీంతో బంగారం ధర మళ్ళీ తారా స్థాయికి చేరుకుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు నేడు ఎలా ఉన్నాయో.. ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.విజయవాడ, హైదరాబాద్లలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.67000 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.73090 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 650, రూ. 710 పెరిగింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్లలో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో కూడా ఈ రోజు బంగారం ధరలు పెరిగాయి. కాబట్టి నేడు ఒక తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 67150 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73240 వద్ద ఉంది. నేడు 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 650 పెరిగింది. 24 క్యారెట్స్ ధరలు రూ. 710 పెరిగింది.చెన్నై విషయానికి వస్తే.. బంగారం ధరలు వరుసగా రూ. 650, రూ. 710 పెరిగి.. రూ. 67600 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ. 73750 (24 క్యారెట్స్ 10 గ్రా) వద్ద నిలిచాయి. ఇతర రాష్ట్రాలకంటే చెన్నైలో బంగారం ధరలు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.వెండి ధరలుదేశంలో వెండి ధరలు గత నాలుగు రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. నేడు ఒక కేజీ వెండి ధర నిన్నటి కంటే రూ. 1500 పెరిగింది. దేంతో ఈ రోజు (జులై 4) కేజీ వెండి రూ. 93000లకు చేరింది. గంట నాలుగు రోజుల్లో వెండి ధర ఏకంగా రూ. 3000 పెరిగింది. ఈ ధరలు ఇలాగె కొనసాగితే కేజీ వెండి లక్ష రూపాయలకు చేరుతుందని తెలుస్తోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
కొండెక్కిన టమాటా : బోలెడన్ని ప్రత్యామ్నాయాలు, ట్రై చేశారా?
మన వంట ఇంట్లో టమాటా లేనిదే సాధారణంగా ఏ వంటకం పూర్తికాదు. ప్రతీ కూరలో టమాటా ఉండాల్సిందే. ఇపుడేమో టమాటా కొండెక్కి కూచుంది. కిలో వందరూపాయలు పెట్టి కొనాలా? వద్దా అని వంద సార్లు ఆలోచించి. చివరికి పావుకిలోతో సరిపెట్టుకుంటున్న పరిస్థితి. అయితే ఏదైనా ఒకటి మార్కెట్లో ఆకాశాన్నంటుతున్నపుడు ప్రత్యామ్నాయం వెతుక్కోవాల్సిందే. అందుకే టమాటాకు బదులుగా, దాదాపు అదే రుచి, చిక్కదనం వచ్చేలా ఇతర ప్రత్యామ్నాయాల గురించి ఒకసారి చూద్దాం.చింతపండు: సాధారణంగాకూరల్లో గ్రేవీ, పులుపు రుచి కోసం టమాటాను వాడతాం. కాబట్టి టమాటాకు బదులుగా చింతపండును వాడుకోవచ్చు. చిక్కదనం కూడా పొందవచ్చు. వెనిగర్: టామాటామాదిరిగానే వెనిగర్ కూడా పుల్లని రుచి కలిగి ఉంటుంది. సో.. పచ్చడి, పులుసుల్లో వెనిగర్తో టమాటా లోటును పూరించుకోవచ్చు. చక్కని రుచి కూడా లభిస్తుంది. మామిడి కాయ: సీజన్ను బట్టి పచ్చి మామిడికాయను టమాటాకు బదులుగా వాడుకోవచ్చు. చవగ్గా దొరికితే చింతచిగురు మంచిదే.మామిడి ఒరుగులు: అలాగే వేసవి కాలంలో ఎక్కువగా దొరికే మామిడి కాయలను ఉప్పు వేసి ఊరబెట్టి, బాగా ఎండబెట్టకుని నిల్వ చేసుకని, టమాటాకు బదులుగా వాడుకోచ్చు.పుల్లటి పెరుగు: పెరుగు టమాటాకు బదులు వంటల్లో వాడితే కూర గ్రేవీ వస్తుంది. చిక్క దనాన్ని, టామాటా తిన్న అనుభూతిని ఇస్తుంది. కాబట్టి టామాటాకు బదులు వెజ్, నాన్ వెజ్ అన్ని వంటకాల్లో పెరుగును వేసుకోవచ్చు. గుమ్మడి: సహజమైన తీపితో ఉండే గుమ్మడికాయను వంటకాల్లో టమాటాకు బదులు గుమ్మడికాయను వాడవచ్చు.క్యాప్సికమ్,లేదా బెల్ పెప్పర్: పసుపు, రెడ్, గ్రీన్ కలర్స్ల లభించే క్యాప్సికమ్ను కూరల్లో టమాటాకు బదులు, కలుపుగా వాడుకోవచ్చు. ఎలిఫెంట్ యాపిల్ : మన దేశంలో ఎక్కువగా తూర్పువైపున సాగు చేస్తారు. బంగ్లాదేశ్, మలేషియాలో ఎక్కువగా ఉంటాయి. అస్సామీ, బెంగాలీ వంటలలో ప్రత్యేక రుచి కోసం వీటిని వినియోగిస్తారు. దొరికితే ఇవి కూడా వంటలకు టమాటా రుచిని ఇస్తాయి.ఆనియన్ పౌడర్ లేదా గ్రాన్యూల్స్: మార్కెట్లోరెడీమేడ్గా దొరికే ఉల్లిపాయ పొడి ఉల్లి రుచి లోటును తీరుస్తుంది.స్ప్రింగ్ ఆనియన్స్ : నాన్వెజ్ లాంటి కూరల్లో స్ప్రింగ్ ఆనియన్స్ ఉపయోగించవచ్చు. చిన్న బాల్కనీల్లో , మిద్దె తోటల్లో ఈజీగా పెంచుకోవచ్చు.పీనట్ పేస్ట్: టమాటా గ్రేవీవాడే కూరల్లో పీనట్ పేస్ట్ మిక్స్ యాడ్ చేసుకోవచ్చు. వేయించిన వేరుశెనగలను మెత్తని పేస్ట్గా గ్రైండ్ చేసి గ్రేవీలాగా వాడుకోవడమే.టమాటా ఒరుగులువర్షాల కారణంగా సరఫరా తగ్గిపోవడం, డిమాండ్ పెరగడం, నిల్వలు తగ్గిపోవడం ధరలు పెరగడానికి కారణం. అందుకే టొమాటో తక్కువ రేటులో సులభంగా దొరికినపుడు వాటిని ఎండబెట్టి ఒరుగులు మాదిరిగా చేసుకొని నిల్వ చేసుకోవడం మరో చక్కటి పరిష్కారం. -
పెరిగిన ఉల్లి ధర
దేవరకద్ర: ఉల్లి ధరలు గత వారంతో పోల్చుకుంటే మరింత పెరిగాయి. ప్రస్తుతం ఉల్లి సీజన్ తగ్గిన తర్వాత ధరలు ౖపైపెకి ఎగబాకుతున్నాయి. గత వారం కొంత వరకు తగ్గిన ఉల్లి ధర బుధవారం జరిగిన వేలంలో మరింత పెరిగాయి. వర్షాలు లేకపోవడంతో రైతులు నిల్వ చేసిన ఉల్లిని మార్కెట్కు అమ్మకానికి తెచ్చారు. దాదాపు 500 బస్తాల ఉల్లి అమ్మకానికి వచ్చింది. దీంతో వ్యాపారులు వేలం వేసి ఉల్లిని కొనుగోలు చేశారు. ఈ క్రమంలో మార్కెట్లో వేలం పాటలు పోటీపోటీగా సాగాయి. స్థానిక వ్యాపారులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు వేలంలో పాల్గొన్నారు. వేలంలో క్వింటాల్ ఉల్లి గరిష్టంగా రూ.3,100, కనిష్టంగా రూ.2,510 చొప్పున పలికాయి. గత వారంతో పోల్చితే గరిష్టంగా రూ.200, కనిష్టంగా రూ.310 వరకు ధరలు పెరిగాయి. అలాగే 45 కిలోల ఉల్లి బస్తా గరిష్టంగా రూ.1,550, కనిష్టంగా రూ.1,250 చొప్పున విక్రయించారు.ఆర్ఎన్ఆర్ క్వింటా రూ.2,459దేవరకద్ర మార్కెట్లో జరిగిన టెండర్లలో ఆర్ఎన్ఆర్ ధాన్యం క్వింటాల్కు గరిష్టంగా రూ.2,459 ఒకే ధర లభించింది. సీజన్ లేకపోవడంతో కొద్దిపాటిగా వచ్చిన ధాన్యానికి టెండర్లు వేశారు.● గరిష్టంగా రూ.3,100, కనిష్టంగా రూ.2,510 -
పెరగనున్న టూ వీలర్స్ ధరలు.. జులై 1నుంచే అమలు
భారతదేశంలో అతిపెద్ద టూ వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన లైనప్లో ఎంపిక చేసిన ద్విచక్ర వాహనాల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. కంపెనీ ఏ మోడల్ మీద ఎంత ధరలను పెంచనుంది అనే వివరాలను ప్రస్తుతానికి అధికారికంగా వెల్లడించలేదు.హీరో మోటోకార్ప్ తన టూ వీలర్ల ధరలను పెంచినట్లయితే.. రూ. 1500 వరకు పెంచే అవకాశం ఉంది. ఇది కూడా మోడల్ను బట్టి మారుతూ ఉండే అవకాశం ఉంది. ధరల పెంపు 2024 జులై 1 నుంచి వర్తిస్తుంది. ఇన్పుట్ ఖర్చులు పెరగటం వల్ల కంపెనీ తన ఉత్పత్తుల ధరలను పెంచాల్సి వచ్చిందని కంపెనీ పేర్కొంది.హీరో మోటోకార్ప్ మోటార్సైకిళ్ల శ్రేణిలో స్ప్లెండర్ ప్లస్ వేరియంట్లు, హెచ్ఎఫ్ డీలక్స్, హెచ్ఎఫ్ 100, ప్యాషన్ ప్లస్, ప్యాషన్ ఎక్స్టెక్, సూపర్ స్ప్లెండర్, సూపర్ స్ప్లెండర్ ఎక్స్టెక్, గ్లామర్, గ్లామర్ ఎక్స్టెక్, ఎక్స్ట్రీమ్ 125ఆర్, ఎక్స్ట్రీమ్ 4వీ, ఎక్స్ట్రీమ్ 200 4వీ, ఎక్స్ట్రీమ్ 160ఆర్, మావ్రిక్ 440 వంటివి ఉన్నాయి. స్కూటర్ల విభాగంలో హీరో డెస్టిని ప్రైమ్, డెస్టిని 125 ఎక్స్టీఈసీ, జూమ్, ప్లెజర్ ప్లస్ ఎక్స్టెక్ వున్నాయి. -
అపరాలే బెస్ట్
సాక్షి, అమరావతి: రైతులు విత్తు నాటుకునేటప్పుడే కోత సమయంలో తమ పంట ఉత్పత్తులకు ఎంత ధర లభిస్తుందో తెలిస్తే వారికి చాలా ప్రయోజనం ఉంటుంది. ఏ పంట ఉత్పత్తులకు మంచి ధరలు లభించే అవకాశం ఉందో తెలిస్తే ఆ పంటలనే సాగు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఖరీఫ్ పంటలు కోతకొచ్చే సమయంలో మార్కెట్లో ధరలు ఎలా ఉండబోతున్నాయో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పనిచేసే వ్యవసాయ మార్కెట్ ఇంటెలిజెన్స్ కేంద్రం (ఏఎంఐసీ) అంచనా వేస్తోంది. విత్తుకునే సమయంలో ఉండే ధరలు కోతకొచ్చేవేళ ఉండకపోవడంతో రైతులు ఏటా తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2019లో ఏఎంఐసీని ఏర్పాటు చేశారు. దీనిద్వారా సీజన్ల వారీగా నిర్దేశించిన పంటల సాగు లక్ష్యం, సాధారణ వాతావరణ పరిస్థితులు, దిగుబడులు, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ స్థితిగతులు, వివిధ మార్కెట్ సర్వేల సమాచారం, 25–30 ఏళ్ల మార్కెట్ ధరల హెచ్చుతగ్గులను శాస్త్రీయంగా అంచనా వేస్తున్నారు. సమగ్ర కంప్యూటర్ సాఫ్ట్వేర్ ప్యాకేజీల ద్వారా శాస్త్రీయంగా మూల్యంకనం చేస్తున్నారు. వీటితోపాటు విశ్వవిద్యాలయ గణాంక విభాగ నిపుణులు లోతైన అధ్యయనం చేశాక ఖచ్చితమైన ప్రమాణాల ఆధారంగా పంట ఉత్పత్తులకు ముందస్తు మార్కెట్ ధరలను ఏఎంఐసీ అంచనా వేస్తోంది. తేజా మిరపకే విదేశాల్లో గిరాకీ ఖరీఫ్లో ఎక్కువగా సాగయ్యే మిర్చి విషయానికి వస్తే అధిక ఉత్పత్తి ఫలితంగా ధరలు తగ్గే అవకాశం ఉందని ఏఎంఐసీ అంచనా వేసింది. తేజా రకం మిరపకు మాత్రమే ఎగుమతి రకంగా డిమాండ్ ఉంది. మిగిలిన రకాలకు పెద్దగా ధర లభించే అవకాశాలు ఉండవని అంచనా. ప్రస్తుతం అంచనా వేసిన ముందస్తు ధరలు పంట కోత సమయంలో మద్దతు ధరకు దగ్గరగా లేదా హెచ్చుగా ఉంటాయని ఏఐఎంసీ తెలిపింది. ఇప్పటివరకు విడుదల చేసిన అంచనా ధరల వివరాలను www.angrau.ac.in లో పొందుపర్చింది. వీటిపై విశ్వవిద్యాలయ పరిశోధన, విస్తరణ విభాగాలతో పాటు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంలోని వ్యవసాయ మార్కెట్ ఇంటెలిజెన్స్ కేంద్రంలోనూ సంప్రదించొచ్చు. అయితే వాతావరణంలో అసాధారణ మార్పులు, వరదలు, అకాల వర్షాలు, తుపాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాల ప్రభావం దిగుబడులపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా అంచనా ధరల హెచ్చుతగ్గుల్లో కూడా మార్పులు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదని ఏఎంఐసీ ప్రకటించింది.ఈ ఉత్పత్తులకు మంచి ధరలు ఖరీఫ్–2024–25 సీజన్ ఊపందుకుంటోంది. 149.32 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటల సాగవుతాయని అంచనా వేశారు. ఏఎంఐసీ అంచనా ప్రకారం.. ఈసారి వరి, మొక్కజొన్న, పత్తితో పోలిస్తే అపరాలు, మిరప, పసుపు, వేరుశనగ పంట ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ధరలు లభిస్తాయి. ముఖ్యంగా కందులు, మినుములు, పెసలు రైతులకు మార్కెట్లో మంచి ధరలు దక్కుతాయి. తక్కువ ఉత్పత్తి ఖర్చు, స్థిరమైన దేశీయ గిరాకీ, డిమాండ్ కారణంగా ఈ పంటల రైతులు మంచి రాబడిని పొందే వీలుంది. ఆసియా, ఆఫ్రికా దేశాల నుంచి మన వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా సన్నబియ్యం ఎగుమతులు గణనీయంగా పెరుగుతాయి. ఫలితంగా ఈ రకాలు సాగు చేసే రైతులకు మంచి ధర లభిస్తుంది. మిగిలిన వరి రకాల ధరలు కూడా స్థిరంగానే ఉండనున్నాయని ఏఎంఐసీ అంచనా వేసింది. అలాగే బంగ్లాదేశ్, చైనా, వియత్నాం దేశాలకు గణనీయంగా మెరుగుపడిన ఎగుమతుల ద్వారా పత్తి ధరలు లాభదాయకంగా ఉంటాయని అంచనా. ఎగుమతులు పెరగడం, తక్కువ ఉత్పత్తి కారణంగా పసుపు ధరలు కూడా ఆశాజనకంగా ఉండబోతున్నాయి.విత్తుకునే ముందు రైతులకు సమాచారం ప్రధాన పంట ఉత్పత్తులకు ముందస్తు ధరలను నిర్ణయించేటప్పుడు పంట నిల్వలు, సాగు విస్తీర్ణం, ఎగుమతులు, దిగుమతులు, వ్యాపారుల అంచనాలు మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకుంటున్నాం. ఏటా రాష్ట్రంలో సాగయ్యే ప్రధాన పంట ఉత్పత్తుల ముందస్తు అంచనా ధరలను అంచనా వేసి విత్తుకునే ముందు రైతులకు స్పష్టమైన సమాచారం అందిస్తున్నాం. విశ్వవిద్యాలయ పరిశోధన, విస్తరణ విభాగాలను సంప్రదించి పంటసాగు నిర్ణయాలను తీసుకునేలా ఏఎంఐసీ రైతులకు అవసరమైన తోడ్పాటునందిస్తోంది. – డాక్టర్ జి.రఘునాథ్రెడ్డి, ప్రధాన పరిశోధకులు, వ్యవసాయ మార్కెట్ ఇంటెలిజెన్స్ సెంటర్ కచ్చితమైన సమాచారంతోనే రైతుకు మేలు ప్రస్తుతం పంటల మార్కెట్ ధరలు.. డిమాండ్ సరఫరా సూత్రంతో పాటు స్థానికత, దేశ అవసరాలు, విదేశాలకు ఎగుమతులపైనే ఆధారపడి ఉన్నాయి. రైతులకు సకాలంలో ఖచి్చతమైన మార్కెట్ సమాచారాన్ని అందించడం కీలకం. పంటల ఉత్పత్తి సరఫరా కంటే మార్కెట్ ఆధారిత డిమాండ్ను గుర్తించడం చాలా ముఖ్యం. స్వాతంత్య్రం వచ్చాక ఆహార ధాన్యాల ఉత్పత్తి ఆరు రెట్లు పెరిగినప్పటికీ.. మెజార్టీ రైతులకు నేటికీ నికర ఆదాయం దక్కని పరిస్థితి నెలకొంది. ఏపీ తరహాలోనే ప్రతి రాష్ట్రం తప్పనిసరిగా అగ్రికల్చర్ మార్కెట్ ఇంటెలిజెన్స్ సెంటర్ను కలిగి ఉండాలి. ఖచి్చతమైన సమాచారంతో పంటల సాగు ప్రణాళిక రూపొందించుకోవడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో పోటీతత్వం పెరుగుతుంది.. రైతుల ఆదాయం రెట్టింపు అవుతుంది. – డాక్టర్ శారద జయలక్ష్మీదేవి, వీసీ, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం -
తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న కూరగాయల ధరలు
-
ఈ కంపెనీ వాహనాలు ఇప్పుడే కొనేయండి.. లేటయితే..
దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. వాణిజ్య వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. టాటా మోటార్స్ వాహనాలు సుమారు 2 శాతం పెరగనున్నాయి. జూలై 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. కమోడిటీ ధరల పెరుగుదల కారణంగా తమ వాహనాల రేట్లను పెంచాల్సి వస్తోందని టాటా మోటార్స్ బుధవారం తెలిపింది.టాటా మోటార్స్ ప్రస్తుతం కొత్త ఉత్పత్తులను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోందని ఒక ప్రకటన విడుదల చేసింది. జెన్ నెక్ట్స్ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా భారత్, బ్రిటన్, అమెరికా, ఇటలీ, దక్షిణ కొరియాల్లో ఈ వాహనాలను డిజైన్ చేస్తున్నారు. ఈ వాహనాలన్నీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉంటాయి. ఆదాయం పరంగా దేశంలో అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ అయిన టాటా మోటార్స్ చివరిసారిగా మార్చిలో తన వాణిజ్య వాహనాల ధరలను 2 శాతం పెంచింది.2024 ఆర్థిక సంవత్సరంలో టాటా మోటార్స్ ఆదాయం 52.44 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ఏడాది టాటా మోటార్స్ షేరు కూడా మంచి పనితీరును కనబరుస్తోంది. 26.6 శాతం పెరిగింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)లో కంపెనీ షేరు ప్రస్తుతం (బుధవారం మధ్యాహ్నం) రూ.983 వద్ద ట్రేడవుతోంది. గత కొన్ని రోజులుగా ఇది నిరంతరాయంగా పెరుగుతోంది. ఈ ఏడాది కూడా పలుమార్లు రూ.1000 మార్కును దాటింది. -
మళ్లీ సెంచరీ కొట్టిన టమాటా
సాక్షి,కర్నూలు: కూరగాయల ధరలు మండుతున్నాయి. కేజీ టమాట ధర 80 నుంచి 100 రూపాయలు పలుకుతోంది. రైతు బజార్లో మాత్రం కేజీ టమాటా 80 రూపాయలకు అందిస్తున్నారు. వంటింట్లో ఎక్కువగా వాడే టమాటాతో పాటు ఇతర కూరగాయల ధరలు ఆకాశాన్నంటుండుంతుండటంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. టమాట ధర వారం రోజుల్లోనే అమాంతం పెరిగిపోయింది. గతంలో అధిక ధరలున్న వేళ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం టమాటాను సబ్సిడీ ధరతో అందించింది. కేజీ టమాటాను రూ.50కే వినియోగదారులకు అందుబాటులో ఉంచారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం మాత్రం టమాటను నోలాస్ నో పప్రాఫిట్ పేరుతో పెరిగిన ధరలకు కాస్త అటుఇటుగానే ప్రజలకు అందజేస్తోంది. -
భారీగా పెరిగిన కూరగాయల ధరలు
-
నెలరోజుల్లో అనూహ్యంగా పెరిగిన కూరగాయల ధరలు
-
ఈ గొడుగు ఖరీదు వింటే.. వ్హా.. అంటూ నోరెల్లబెట్టాల్సిందే!!
ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గొడుగు. పురుషుల ఫ్యాషన్ వస్తువులను తయారు చేసే ఇటాలియన్ కంపెనీ ‘బిలియనీర్ కూటూర్’ దీనిని ప్రత్యేకంగా మొసలి తోలుతో రూపొందించింది. దీనిని కొనుగోలు చేయాలంటే, ముందుగా ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్డర్ల ఒత్తిడి పెరిగితే, ఈ గొడుగు చేతికి అందడం కొంత ఆలస్యం కూడా కావచ్చు.‘బిలియనీర్ కూటూర్’ తయారు చేసే విలాసవంతమైన వస్తువుల కోసం పోటీపడే అపర కుబేరులు ఈ గొడుగు కోసం కూడా పోటీ పడుతున్నారు. దీని ధర 50 వేల డాలర్లు (రూ.41.54 లక్షలు). అత్యంత ఖరీదైన గొడుగుల్లో ఇప్పటి వరకు ఈ మొసలి తోలు గొడుగుదే రికార్డు. ఫార్ములా వన్ రేసింగ్ దిగ్గజం ఫ్లావియో బ్రియాటోర్ వంటి అతి కొద్దిమంది అపర కుబేరులు మాత్రమే ఇప్పటి వరకు ఈ మొసలితోలు గొడుగును కొనుగోలు చేశారు.ఇవి చదవండి: ఇదేంటో తెలుసా? దీనిని తాకితే.. ప్రాణాలకే? -
పత్తికి గరిష్ట ధర రూ.7,200
సాక్షి, హైదరాబాద్: వరి, పత్తి, కంది, మొక్కజొన్న, సోయాచిక్కుడు వంటి పంట ఉత్పత్తులకు మార్కెట్లో అధిక ధరలు లభిస్తాయి. ఈ విషయాన్ని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది. శాస్త్రీయ పద్ధతుల్లో విశ్లేషణ చేసి ఈ ధరలను రూపొందించింది. 22 ఏళ్లుగా రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లలో నెలవారీగా ఉన్న 21 రకాల పంట దిగుబడుల ధరలను నమూనాగా తీసుకొని వాటి ఆధారంగా ధరల అంచనాలను సిద్ధం చేసింది. వాటి ఆధారంగా ఏఏ పంటలు వేస్తే ఏ మేరకు దిగుబడులు వస్తాయో, వాటి ఆదాయంపై రైతులకు అవగాహన పెరుగుతుందనే ఉద్దేశంతో ఈ మేరకు కసరత్తు చేసినట్టు చెబుతున్నారు. » ఈ సీజన్లో పత్తి దిగుబడి వచ్చే నవంబర్–ఫిబ్రవరి మధ్య గరిష్టంగా క్వింటాకు రూ.7,200 వరకు ధర వస్తుందని వ్యవసాయ వర్సిటీ ప్రకటించింది. కనిష్టంగా రూ. 6,600 ఉంటుంది. » వరి సాధారణ రకానికి నవంబర్–డిసెంబర్ మధ్య కాలంలో రూ. 2,203 నుంచి రూ. 2,350 ధర పలుకుతుంది. ఇక వరి గ్రేడ్ ఏ రకానికి అదే కాలంలో రూ. 2,290 నుంచి రూ. 2,680 వరకు ధర పలుకుతుందని పేర్కొంది. » మొక్కజొన్నకు అక్టోబర్–నవంబర్ మధ్యకాలంలో రూ. 2,150 నుంచి రూ. 2,350 వరకు ధర వస్తుంది. » పంట రకం, నాణ్యత, అంతర్జాతీయ ధర లు, ఎగుమతులు, దిగుమతులు పరిమితు ల మూలంగా ధరల్లో మార్పులు ఉండొచ్చు. ధరను బట్టి పంటలు వేసుకోవచ్చని వర్సిటీ సూచించింది. -
ఈ 'బంగారు తేనీరు'.. ధర ఎంతంటే? అక్షరాలా..
ప్రపంచంలో తేయాకు రకాలు ఎన్నో ఉన్నాయి. అరుదైన రకాల తేయాకుకు, అలాంటి రకాల తేయాకు తయారు చేసిన తేనీటికి ధర ఎక్కువగా ఉంటుంది. చైనాకు చెందిన ఊలాంగ్ టీ చూడటానికి బంగారు రంగులో ఉంటుంది. అంతమాత్రాన అది బంగారు తేనీరు కాదు. సింగపూర్లోని టీడబ్ల్యూజీ కంపెనీ మాత్రం అచ్చంగా బంగారు తేయాకు విక్రయిస్తోంది.నాణ్యమైన తేయాకులను పొడవుగా కత్తిరించి, ఆరబెట్టిన తర్వాత ఆ తేయాకులకు 24 కేరట్ల బంగారు పూత పూసి కళ్లు చెదిరే ప్యాకింగ్తో అందిస్తోంది. బంగారు పూత పూసిన ఈ తేయాకును 50 గ్రాముల మొదలుకొని 1 కిలో వరకు ప్యాకెట్లలో అమ్ముతోంది. ఈ తేయాకు తయారు చేసిన తేనీరు బంగారు రంగులో ధగధగలాడుతూ కళ్లు చెదరగొడుతుంది.ప్రస్తుతం దీని ధర కిలో 12,830 డాలర్లు (రూ.10.70 లక్షలు) మాత్రమే! టీడబ్ల్యూజీ కంపెనీ సింగపూర్లో రెస్టారంట్ను కూడా నిర్వహిస్తున్నా, అక్కడ ఈ బంగారు తేనీటిని అందించరు. కావలసిన వారు ఈ తేయాకు ప్యాకెట్లను కొని తీసుకువెళ్లాల్సిందే!ఇవి చదవండి: ఈ 'ట్రే గార్డెన్' ని ఎప్పుడైనా చూశారా? -
తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు!
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శుభవార్త చెప్పాయి. హోటల్స్, రెస్టారెంట్లలో ఉపయోగించే 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.69 మేర తగ్గిస్తూ కీలక ప్రకటన చేశాయి. నేటి నుంచే (జూన్ 1వ తేదీ) ఈ ధరలు అమలులోకి వస్తాయని పేర్కొన్నాయి. అయితే డొమెస్టిక్ సిలిండర్ల ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశాయి. -
ఉప్పు రైతుకు ధరల తీపి
సింగరాయకొండ: వాతావరణం అనుకూలించడం, ధరలు ఆశాజనకంగా ఉండటంతో ఉప్పు రైతుల్లో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. తమిళనాడులోని ఉప్పు పండించే ట్యుటికోరన్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఫలితంగా ఆ ప్రాంతాల్లో ఉప్పు తయారీ నిలిచిపోయింది. దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాల్లో పండించే ఉప్పుకు గిరాకీ ఏర్పడింది. ఆ ఏడాది ఫిబ్రవరిలో ఉప్పు తయారీ ప్రారంభం కాగా.. నిన్న మొన్నటివరకు 75 కేజీల బస్తా ఉప్పు ధర రూ.100 నుంచి రూ.150 పలికింది. తమిళనాడు నుంచి భారీఎత్తున వ్యాపారులు ఇక్కడికి వచ్చి ఉప్పు కొనుగోలు చేస్తుండటంతో బస్తా రూ.200 ధర పలుకుతోంది. 9 నెలలూ ఉప్పు సాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చినగంజాం, కనపర్తి, పాకల, ఊళ్లపాలెం, బింగినపల్లి పంచాయతీల పరిధిలోని సుమారు 4 వేల ఎకరాల్లో ఉప్పు పండిస్తున్నారు. వర్షాకాలం తప్ప మిగిలిన కాలాల్లో సుమారు 9 నెలలపాటు ఉప్పు సాగు చేస్తారు. ఎకరాకు 800 నుంచి 900 బస్తాల వరకు ఉప్పు దిగుబడి వస్తోంది.ఈ ఏడాది వాతావరణం బాగా అనుకూలించడంతో 1,300 నుంచి 1,400 బస్తాల వరకు దిగబడి వస్తోంది. ప్రతినెలా ఇక్కడ 20 వేల టన్నుల వరకు ఉప్పు ఉత్పత్తి అవుతోంది. తయారీ బాగా ఉండటంతో ఉమ్మడి జిల్లాలో 7 వేల మంది వరకు రైతులు, 10 వేలకు పైగా కూలీలు లబ్ధి పొందుతున్నారు. ధరలు బాగున్నాయి 10 ఎకరాలను కౌలుకు తీసుకుని ఉప్పు సాగు చేస్తున్నాను. ఈ ఏడాది ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. ధరలు పెరుగుతుండటంతో ఉప్పు నిల్వ చేశాను. తమిళనాడు వ్యాపారులు నేరుగా వచ్చి నన్ను కలవటంతో మంచి ధర లభించింది. – పురిణి శ్రీనివాసులరెడ్డి, ఉప్పు రైతు, ఊళ్లపాలెందిగుబడి బాగా వచ్చింది ఐదెకరాల్లో ఉప్పు సాగు చేస్తున్నాను. ఏడాది ప్రారంభంలో ధరలు తక్కువగా ఉన్నా దిగుబడి బాగా వచ్చింది. ప్రస్తుతం తమిళనాడు వ్యాపారుల రాకతో ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. దళారీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా ఉప్పు కొనుగోలు చేస్తే రైతుకు మంచి ధరలు లభిస్తాయి. – గౌరవరపు శ్రీనివాసులరెడ్డి, ఉప్పు రైతు, ఊళ్లపాలెం -
దేశంలో బంగారం ధరలు.. ఎలా ఉన్నాయంటే?
బంగారం ప్రియులకు శుభవార్త. ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్న పసిడి ధరలకు బ్రేకులు పడ్డాయి. ఈ వారంలో వరుసగా తగ్గుముఖం పడుతుండడం కొనుగోలు దారులకు కలిసొచ్చే అంశమేనని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ధరలు స్థిరంగా ఉన్నాయని, పసిడి కొనుగోలుకు ఇదే మంచి తరుణమని అంటున్నారు. ఇక తాజాగా, ఆదివారం (మే 26) పసిడి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో..హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (తులం) ధర రూ.66,400 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ. 72,440 గా ఉంది.ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,550 ఉండగా 24 క్యారెట్ల పసిడి రూ.72,590 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రూ.66,400 ఉండగా 24 క్యారెట్ల పసిడి రూ. 73,410కి చేరిందిచెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,550 ఉండగా 24 క్యారెట్ల పసిడి రూ.72,600 కు చేరింది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,400 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ. 72,440గా ఉంది. -
దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
దేశంలో బంగారం హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఓ రోజు పసిడి ధర పెరిగితే..మరో రోజు స్వల్పంగా తగ్గతూ వస్తుంది. తాజాగా, శనివారం (మే 25) పసిడి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో..హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (తులం) ధర రూ.66,400 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ. 72,440 గా ఉంది.ఇతర నగరాల్లో..ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,550 ఉండగా 24 క్యారెట్ల పసిడి రూ.72,590 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రూ.66,400 ఉండగా 24 క్యారెట్ల పసిడి రూ. 73,410కి చేరిందిచెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,550 ఉండగా 24 క్యారెట్ల పసిడి రూ.72,600 కు చేరింది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,400 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ. 72,440గా ఉంది. -
దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
దేశంలో బంగారం హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఓ రోజు పసిడి ధర పెరిగితే.. మరో రోజు స్వల్పంగా తగ్గతూ వస్తుంది. తాజాగా, శుక్రవారం (ఏప్రిల్ 24) పసిడి ధరల్లో అత్యంత స్వల్పంగా కేవలం రూ.10 మాత్రమే తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో..హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (తులం) ధర రూ.67,290 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ. 73,410 గా ఉంది.ఇతర నగరాల్లో..ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.67,440 ఉండగా 24 క్యారెట్ల పసిడి రూ.73,560గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రూ.67,290 ఉండగా 24 క్యారెట్ల పసిడి రూ. 73,410కి చేరిందిచెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.67,490 ఉండగా 24 క్యారెట్ల పసిడి రూ.73,630కు చేరింది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.67,290 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ. 73,410గా ఉంది. -
మహీంద్రా XUV700 కొత్త వేరియంట్.. ప్రత్యేకతలివే..
ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా XUV700లో కొత్త AX5 సెలెక్ట్ (AX5 S) వేరియంట్ను విడుదల చేసింది. దీని ధర రూ. 16.89 లక్షలు (ఎక్స్-షోరూమ్). స్కైరూఫ్, డ్యూయల్ 26.03cm హెచ్డీ సూపర్స్క్రీన్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, రూమి 7-సీటర్ కాన్ఫిగరేషన్ వంటి ఆకట్టుకునే ఫీచర్ల లైనప్ను AX5 సెలెక్ట్ వేరియంట్ అందిస్తుంది.సాధారణంగా హై-ఎండ్ మోడల్లతో ఇలాంటి ఫీచర్లు ఉంటాయి. ఈ ఫీచర్లు బడ్జెట్ ధరలో హై-ఎండ్ ఫీచర్ల కోసం చూస్తున్న కస్టమర్లకు AX5 మంచి ఎంపికగా నిలుపుతున్నాయి. 2022లో విడుదలైన మహీంద్రా XUV700 దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, నేపాల్, న్యూజిలాండ్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో మంచి ఆదరణ పొంది గ్లోబల్ ఎస్యూవీగా మారింది.మహీంద్రా ఇటీవలే MX వేరియంట్లో 7-సీటర్ను విడుదల చేసింది. బ్లేజ్ రెడ్ కలర్, డ్యూయల్-టోన్ బ్లాక్ ఎక్స్టీరియర్ ఎలిమెంట్స్, రెడ్ యాక్సెంట్లతో ఆల్-బ్లాక్ ఇంటీరియర్తో లిమిటెడ్ బ్లేజ్ ఎడిషన్ను కస్టమర్ల ముందుకు తీసుకొచ్చింది. కస్టమర్లకు వెయిటింగ్ పీరియడ్ను తగ్గించడానికి ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచింది. వేరియంట్ను బట్టి నాలుగు నుంచి ఎనిమిది వారాలలోపు కస్టమర్లకు డెలివరీ ఇచ్చేలా చర్యలు చేపట్టింది. -
నిమ్మ.. ‘ధర’హాసం
తెనాలి: నిమ్మ ధరలు ఆశాజనకంగా ఉండడంతో ఆ రైతుల మోముల్లో ‘ధర’ హాసం కనిపిస్తోంది. దిగుబడి కొంతమేర తగ్గినప్పటికీ, మార్కెట్లో గరిష్ట ధరలకు క్రయ, విక్రయాలు సాగడంతో రైతులు దిల్ఖుష్ గా ఉన్నారు. నిమ్మకాయల ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానంలో ఉన్న ఏడు రాష్ట్రాల్లో ఆంధప్రదేశ్ ఒకటి. రాష్ట్రంలో గూడూరు, ఏలూరు మార్కెట్ల తర్వాత నిమ్మకాయలకు ప్రసిద్ధి తెనాలి మార్కెట్. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆరు వేల ఎకరాలకుపైగా నిమ్మతోటలు సాగులో ఉంటే అందులో అత్యధిక విస్తీర్ణం తెనాలి డివిజనులోనే ఉంది. కృష్ణా జిల్లాలో తిరువూరు ప్రాంతంలో 800 ఎకరాల్లో నిమ్మతోటలున్నాయి. ఆ జిల్లా రైతులు దగ్గర్లోని ఏలూరు మార్కెట్కు వెళుతుంటారు. తెనాలి మార్కెట్ యార్డు ఆవరణలోని నిమ్మ మార్కెట్లో ప్రతిరోజూ లావాదేవీలు జరుగుతుంటాయి. ఇక్కడ్నుంచి ఉత్తర భారతదేశంలోని కాశీ, కోల్కతా, ఢిల్లీ, కాన్పూర్కు ఎగుమతి చేస్తున్నారు. సీజనులో 12 లారీలకుపైగా అన్ సీజనులో నాలుగైదు లారీల సరుకు ఎగుమతి అవుతుంటుంది. నికరమైన ఆదాయం నిమ్మతోటలు ఏటా జూలై, డిసెంబరు, మే నెలల్లో మూడు కాపులనిస్తాయి. ఒక కాపు మూడేసి నెలలు దిగుబడి నిస్తుంటాయి. ప్రతి కాపునకు సుమారు 200 టిక్కీల వరకు కాయ దిగుబడి వస్తుంది. కాయ సైజు ఆధారంగా ఒక్కో టిక్కీకి 55 కిలోలు వస్తాయి. కొన్నేళ్లుగా నిమ్మతోటల రైతులకు నికరమైన ఆదాయం వస్తున్నందున, కౌలు ధరలు పెరిగాయి. ఎకరా కౌలు రూ.90 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు చేరిన సందర్భాలున్నాయి. ఎరువులు, పురుగు మందులు, నీటితడులకు కలిపి ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకూ ఖర్చు చేయాల్సివస్తుంది. అయినా సరే నిమ్మసాగు లాభిస్తున్నందున మెట్ట ప్రాంతం నుంచి డెల్టా, మాగాణి భూములకు విస్తరించింది. ఈ ఏడాది భేషుగ్గా... గతంకన్నా ఈ ఏడాది నిమ్మ సాగు రైతులకు సంతృప్తినిచ్చింది. తెనాలి నిమ్మ మార్కెట్లో కిలో రూ.50 నుంచి రూ.70 మధ్య విక్రయాలు జరుగుతూ వచ్చాయి. గత ఏప్రిల్లో కనిష్ట ధర రూ.68, గరిష్టంగా రూ.80కి పైగా కొనుగోళ్లు జరిగాయి. ఏప్రిల్ 24న కిలో రూ.90లకు అమ్మకాలు జరిగాయి. ఏప్రిల్ 28 నుంచి కిలో రూ.65లపైన మార్కెట్ లావాదేవీలు కొనసాగుతూ వచ్చాయి. మే ఒకటో తేదీన గరిష్ట ధర రూ.78 పలికింది. ఫుల్ జోష్లో ఉన్న రైతులకు, సీజను ముగింపు దశలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత ధరల్లో తగ్గుదల కొంత నిరాశపరిచింది. ఎన్నికల కోసం నాలుగు రోజులు సెలవులివ్వటం, తర్వాత వర్షాలు పడటంతో వ్యాపారులు రేటు తగ్గించినట్టు చెబుతున్నారు. అయినప్పటికీ కిలో రూ.30కిపైగా కొనుగోళ్లు జరుగుతుండటం ఒకింత ఊరట. ఎకరాకు రూ.70 వేల నుంచి రూ.1.25 లక్షల వరకు కౌలుకు తీసుకున్న రైతులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. జూన్లో వచ్చే ఏరువాక పౌర్ణమికి నిమ్మ తోటలకు రైతులు మళ్లీ కౌలు ఒప్పందాలు చేసుకుంటారు. గతంలో తీవ్ర నష్టాలు లాభదాయకమైన నిమ్మతోటల సాగు 2017, 2018 సంవత్సరాల్లో రైతులకు చేదు అనుభవాలను మిగిల్చింది. 2017 ఏప్రిల్లో కిలో రూ.20–30 మధ్య పలికిన ధర, మరో నెలకు రూ.12–20 మధ్యకు దిగజారింది. జూన్లో మరింతగా పతనమై రూ.5 నుంచి రూ.10లకు పడిపోయింది. జులైలో రూ.7లకు మించలేదు. మళ్లీ 2018లోనూ అదే పరిస్థితి ఎదురైంది. కిలో ఆరేడు రూపాయలకు మించటం లేదని రైతులు గొల్లుమన్నారు. కోత కూలీ కూడా దక్కదన్న భావనతో కాపు కోయకుండా వదిలేసిన సందర్భాలున్నాయి. ఖర్చులు లెక్కేసుకుంటే ఒక్కో నిమ్మకాయకు రైతుకు మిగిలేది కేవలం 10 పైసలు మాత్రమే. అప్పట్లో ఈ పరిణామాలు నిమ్మ తోటల కౌలు ఒప్పందాలపైనా నష్టాల ప్రభావం చూపాయి. ఎకరా కౌలు రూ.65 నుంచి రూ.70 వేలకు మించలేదు.కరోనాలో ఆదుకున్న ప్రభుత్వం కరోనా మహమ్మారి నిమ్మతోటల కౌలుదార్లను బెంబేలెత్తించింది. దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా అమ్మకాలకు బ్రేక్ పడింది. తర్వాత కూడా ఇతర రాష్ట్రాల్నుంచి ఆర్డర్లు లేకుండాపోయాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో మార్కెటింగ్ శాఖ చొరవ తీసుకుని వారానికి మూడు రోజులు కొనుగోళ్లు చేసి, ఆదుకోవడంతో కొంతలో కొంత కోలుకోగలిగాం. అప్పట్లో కేవలం నెల రోజుల్లో 850 టన్నులను రైతుల్నుంచి కొనుగోలు చేసి ఎగుమతి చేసింది. లారీల సమ్మె రోజుల్లోనూ నిమ్మ రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం నిలకడగా మంచి ధర లభిస్తుండటంతో ఫర్వాలేదని చెబుతున్నారు.మిగులు గ్రాములు లెక్కిస్తే మేలు నిమ్మ కాపు కాస్త తగ్గినప్పటికీ నిమ్మకాయ ధరలు ఈ ఏడాది సంతృప్తికరంగా ఉన్నాయి. మార్కెట్ యార్డులో మిగులు గ్రాములు లెక్కలోకి తీసుకోవటం లేదు. 10 కిలోల 500 గ్రాములు తూకం వస్తే 10 కిలోలకే లెక్కిస్తున్నారు. దీనివల్ల రైతులకు నష్టం. గ్రాములను కూడా పరిగణనలోకి తీసుకుంటే మాకు మేలు జరుగుతుంది. – కొత్త రమేష్ బాబు, నిమ్మ రైతు, సంగంజాగర్లమూడి -
దేశంలో బంగారం ధరలు.. ఎలా ఉన్నాయంటే?
దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బుధవారం రోజు దేశంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.600, 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.650 తగ్గింది.దీంతో తగ్గిన బంగారం ధరలు దేశంలో పలు ప్రధాన నగరాల్లోహైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,510 గా ఉంది.విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,510 గా ఉంది.వైజాగ్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,510 గా ఉంది.బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,510 గా ఉంది.చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,600 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,840 గా ఉంది.ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,510 గా ఉంది.ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,450 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,660గా ఉంది. -
బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
దేశంలో బంగారం కొనుగోలు దారులకు ఊరట లభించింది. గత కొద్ది రోజులుగా ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్న బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.600, 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.650 తగ్గింది.దీంతో తగ్గిన బంగారం ధరలు దేశంలో పలు ప్రధాన నగరాల్లోహైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,510 గా ఉంది.విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,510 గా ఉంది.వైజాగ్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,510 గా ఉంది.బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,510 గా ఉంది.చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,600 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,840 గా ఉంది.ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,510 గా ఉంది.ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,450 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,660గా ఉంది. -
దేశంలో బంగారం ధరలు .. ఎలా ఉన్నాయంటే?
గత కొద్ది రోజులుగా పరుగులు పెడుతున్న బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు (మే 20) పసిడి అత్యంత స్వల్పంగా తగ్గింది.ఇక దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటేహైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,390 వద్ద ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రూ. 74,610 వద్ద కొనసాగుతుంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.68,540 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.74,760గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.68,390 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,610గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.68,490 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.74,7200గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.68,390 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.74,610 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
షుగర్ పేషంట్లకు శుభవార్త.. మందుల ధరలు తగ్గింపు
మధుమేహం, గుండె, కాలేయ జబ్బులు వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగించే 41 సాధారణ మందులు, ఆరు ఔషధ మిశ్రమాల ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) నోటిఫికేషన్ జారీ చేసింది.ఎన్పీపీఏ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. యాంటాసిడ్లు, మల్టీవిటమిన్లు, యాంటీబయాటిక్ ఔషధాలు చౌకగా లభించే మందులలో ఉన్నాయి. వివిధ ఔషధాల తగ్గింపు ధరలకు సంబంధించిన సమాచారాన్ని డీలర్లు, స్టాకిస్టులకు తక్షణమే తెలియజేయాలని ఫార్మా కంపెనీలను ఎన్పీపీఏ ఆదేశించింది. నిత్యావసర ఔషధాల ధర ప్రజలకు అందుబాటులో ఉండేలా చూసేందుకు ఎన్పీపీఏ 143వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.ప్రపంచంలోనే అత్యధిక మధుమేహం కేసులు ఉన్న దేశాలలో భారతదేశం ఒకటి. మందుల ధర తగ్గింపు వల్ల దేశంలోని 10 కోట్ల మందికి పైగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనం కలగనుంది. కాగా గత నెలలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ 923 షెడ్యూల్డ్ డ్రగ్ ఫార్ములేషన్లకు వార్షిక సవరించిన సీలింగ్ ధరలను, 65 ఫార్ములేషన్లకు రిటైల్ ధరలను ఏప్రిల్ 1 నుంచి అమలులోకి తెచ్చింది. -
ఆహార ధరల తీవ్రత
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్లో 1.26 శాతంగా నమోదైంది. గడచిన 13 నెలల్లో ఈ స్థాయి టోకు ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. ఆహార ఉత్పత్తుల ధరలు పెరగడం దీనికి ప్రధాన కారణం. ఫుడ్ ఆరి్టకల్స్లో పాటు, విద్యుత్, క్రూడ్ పెట్రోలియం, సహజ వాయువు, కొన్ని తయారీ ఉత్పత్తుల ధరలూ పెరిగినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సూచీ వరుసగా రెండు నెలల నుంచి పెరుగుతూ వస్తోంది. ఫిబ్రవరిలో 0.20% ఉన్న డబ్ల్యూపీఐ, మార్చిలో 0.53 శాతానికి ఎగసింది. గత 2023 ఏప్రిల్లో సూచీ 0.79 శాతం పెరిగింది. అధికారిక గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే.. ⇒ ఫుడ్ ఆర్టికల్స్ ధరలు మార్చిలో 6.88 శాతం పెరిగితే, ఏప్రిల్లో 7.74 శాతం ఎగశాయి. ఇదే కాలంలో కూరగాయల ధరలు 19.52 శాతం నుంచి 23.60 శాతానికి ఎగశాయి. ఆలూ ధరలు 52.96 శాతం నుంచి 71.97 శాతానికి పెరిగాయి. ఇక ఉల్లి ధరలు మార్చిలో 56.99% పెరిగితే, ఏప్రిల్లో 59.75 % ఎగశాయి. ⇒ఫ్యూయల్ అండ్ పవర్ బాస్కెట్ విభాగంలో ద్రవ్యోల్బణం ఏప్రిల్లో 1.38 శాతంగా ఉంది. మార్చిలో ఈ విభాగంలో అసలు పెరుగుదల లేకపోగా మైనస్ 0.77 శాతంగా (క్షీణత) నమోదైంది. ⇒సూచీలో మెజారిటీ వాటా కలిగిన తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం మాత్రం ఏప్రిల్లో పెరక్కపోగా, 0.42 శాతం క్షీణించింది. అయితే మార్చిలో ఈ క్షీణ రేటు 0.85 శాతం ఉండడం గమనార్హం. -
దేశంలో బంగారం ధరలు.. తగ్గాయా? పెరిగాయా?
దేశంలో బంగారం ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,250 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,360 వద్ద కొనసాగుతోంది. ఇక దేశంలో పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయిహైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,360గా ఉందివిజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,360గా ఉందివిశాఖ పట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,360గా ఉందిబెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,360గా ఉందిచెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,500 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,640గా ఉంది.ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,360గా ఉందిఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,400 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,510గా ఉంది.కోల్కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,360గా ఉంది. -
దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
దేశంలో బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి. మంగళవారం పసిడి ధర మరోసారి పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.300, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.330 పెరిగింది.దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయిహైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,380గా ఉందివిజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,380 గా ఉందివైజాగ్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,380 గా ఉందిబెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,380 గా ఉందిచెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,400 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,430 గా ఉందిముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,380 గా ఉందిఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,380 గా ఉందికోల్కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,380 గా ఉంది -
అత్యంత చౌకగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు
ఎలక్ట్రిక్ బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో శుభవార్త. ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్ దిగ్గజం ఓలా కీలక ప్రకటన చేసింది. తన తక్కువ ధర ఎస్1 ఎక్స్ మోడల్ ధరల్ని మరింత తగ్గిస్తున్నట్లు తెలిపింది. గతంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లను పెంచేందుకు కేంద్రం ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ బైక్లకు సబ్సిడీ ఇచ్చేది. ఆ తర్వాత ఆ సబ్సిడీపై కోత విధించింది. దీంతో అప్పటి వరకు ఊపందుకున్న ఈవీ కొనుగోళ్లు, అమ్మకాలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో తమ వాహనల అమ్మకాల్ని పెంచేందుకు ఓలా ఎలక్ట్రిక్ తన చౌకైన వేరియంట్ ధరను 12.5శాతం తగ్గించిందని,తద్వారా అమ్మకాలు పెంచుకోవచ్చని భావిస్తుంది. ఓలా దాని ఎస్1ఎక్స్ మోడల్ చౌకైన వేరియంట్ ధర రూ.79,999 నుండి రూ.69,999లకు తగ్గించిందని కంపెనీ మార్కెటింగ్ చీఫ్ అన్షుల్ ఖండేల్వాల్ తెలిపారు. ఇతర ఎస్1ఎక్స్ వేరియంట్ల ధరలు 5.6 శాతం, 9.1శాతం మధ్య తగ్గించినట్లు సమాచారం. ' ఓలా ఎస్1 ఎక్స్ (4కేడబ్ల్యూహెచ్) ఇప్పుడు దాని ధర రూ.1.09 లక్షల నుండి రూ.10,000 తగ్గి రూ.99,999 చేరింది. 3 డబ్ల్యూకేహెచ్ వేరియంట్ ధర రూ.84,999 కాగా.. 2కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వచ్చే చవకైన వెర్షన్ రూ. 69,999 ప్రారంభ ధరకే అందుబాటులో ఉంది. -
ఈ మల్టీకలర్ ఫేస్మాస్క్ ధర వింటే షాకే..!
కరోనా బారీనుంచి ఆ సమయంలో ఎన్నోరకాల ఫేస్మాస్క్లను వాడారు. వాటి వలన ఫలితాలు, నష్టాలు కూడా అనుభవించారు. అదొక విధమైతే.., ఈ చర్మ సమస్యలు మరో విధము. వయసు పెరిగేకొద్దీ చర్మం ముడతలు బారుతుంది. ముఖంలో గ్లో తగ్గుతుంది. ఈ సమస్యలను డీల్ చేయాలంటే ఈ లైట్ థెరపీ మాస్క్ను వాడాల్సిందే.. దీన్ని 15 నుంచి 25 నిమిషాల వరకు ముఖానికి పెట్టుకుని ఉంచితే.. మంచి ఫలితం లభిస్తుంది. ఆప్షన్స్లో మల్టీ కలర్స్ని మార్చుకోవడంతో వివిధ చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఎటువంటి నొప్పి, శ్రమ, ఇబ్బంది లేకుండా ముఖంలో మెరుపుని సొంతం చేసుకోవచ్చు. ఈ మాస్క్ సాయంతో రెడ్, బ్లూ, ఆరెంజ్, పర్పుల్, వైట్, గ్రీన్, సియాన్ ఇలా మొత్తంగా 7 రంగుల్లో ట్రీట్మెంట్ని అందుకోవచ్చు. రిమోట్ సాయంతో దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది పోర్టబుల్గానూ, కంఫర్టబుల్గానూ పని చేస్తుంది. స్త్రీల సౌలభ్యం, సౌకర్యం కోసం రూపొందిన ఈ ఎల్ఈడీ బ్యూటీ మాస్క్.. ఫుడ్–గ్రేడ్ సిలికాన్ మెటీరియల్తో తయారైంది. ఇంట్లోనే కాదు ప్రయాణాల్లోనూ సులభంగా ఉపయోగించుకోవచ్చు, ఈ మాస్క్ బిజీ లైఫ్స్టయిల్కి సరైనది. ఎప్పుడైనా, ఎక్కడైనా.. ఏపని చేసుకుంటూ అయినా దీన్ని చక్కగా వాడుకోవచ్చు. ఈ స్కిన్కేర్ టూల్.. చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. ముడతలు, మచ్చలు వంటి ఎన్నో సమస్యలను దూరం చేస్తుంది. బ్లూ లైట్ చికాకు, అలసటలను దూరం చేస్తుంది. వైట్ లైట్ చర్మానికి పునరుజ్జీవాన్ని అందిస్తుంది. సియాన్ లైట్ స్కిన్ టోన్ను బ్యాలెన్స్ చేస్తుంది. ఇలా ఒక్కో కలర్ ఒక్కో సమస్యను దూరం చేస్తుంది. ఈ పరికరం ఇంట్లో ఉంటే హోమ్ స్పాను ఎంజాయ్ చేయొచ్చు. దీని ధర 169 డాలర్లు. అంటే 14,083 రూపాయలు. ఇవి చదవండి: ఈ భయం.. ఒక ఫోబియా అని మీకు తెలుసా! -
బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
గత కొద్ది రోజులుగా పట్టపగ్గాల్లేకుండా పరుగులు పెడుతున్న పసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా రెండో రోజుల్లో బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశీయ మార్కెట్లో పెరిగిపోతున్న బంగారం ధరలు సరికొత్త రికార్డ్లను సృష్టిస్తున్నాయి. జాతీయ అంతర్జాతీయ అంశాలు,పెళ్లిళ్ల సీజన్ కావడంతో పసిడికి విపరీమైన డిమాండ్ పెరుగుతోంది. ఒకానొక దశలో 10 రోజుల వ్యవధిలో రూ.10 వేలు పెరగడంపై బంగారం వర్తకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరిగే కొద్ది కొనుగోలు శక్తి తగ్గిపోవడం..ఫలితంగా వ్యాపారం సైతం కుంటుపడుతుందని అంటున్నారు. ఈ తరుణంలో పసిడి ధరలు స్థిరంగా ఉండడం కొనుగోలు, అమ్మకం దారులకు ఊరటనిచ్చినట్లైందని ఆర్ధిక నిపుణులు అభిప్రాయం వ్యక్త చేస్తున్నారు. అంతేకాదు ధరలు తగ్గుముఖం పట్టినప్పుడు కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు. ఇక ఏప్రిల్ 14న దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.66,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,550గా ఉంది విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.66,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,550గా ఉంది వైజాగ్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.66,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,550గా ఉంది గుంటూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.66,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,550గా ఉంది ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.66,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,550గా ఉంది బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.66,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,550గా ఉంది చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.67,800 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,960గా ఉంది -
బంగారం కొనుగోలు దారులకు ‘భారీ’ శుభవార్త
బంగారం కొనుగోలు దారులకు భారీ శుభవార్త. నిన్న మొన్నటి వరకు ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్న పసిడి ధరలకు బ్రేకులు పడ్డాయి. శనివారం నాటికి బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఏప్రిల్ 13న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.700, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.760 తగ్గాయి. దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.66,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,550గా ఉంది విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.66,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,550గా ఉంది వైజాగ్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.66,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,550గా ఉంది గుంటూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.66,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,550గా ఉంది ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.66,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,550గా ఉంది బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.66,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,550గా ఉంది చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.67,800 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,960గా ఉంది -
పసిడి ధరలు పైపైకి.. త్వరలో తులం బంగారం లక్ష
ఢిల్లీ : గతంలో ఎన్నడూ లేనంతగా పసిడి ధరలు గరిష్టానికి చేరుతున్నాయి. ఫలితంగా ఉగాది పర్వదినం సందర్భంగా పసిడి ధరలు ఇంకాస్త పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి రూ.65,750 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరిగి.. రూ.71,730 చేరింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదారబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,750 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,730గా ఉంది విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,750 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,730గా ఉంది వైజాగ్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,750 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,730గా ఉంది బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,750 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,730గా ఉంది చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,700గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,760గా ఉంది ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,750 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,730 ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,900 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,880 బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్? సాధారణంగా బంగారం, స్టాక్ మార్కెట్లో లాభాలకు సంబంధం ఉంది. స్టాక్ మార్కెట్లో లాభాలు గడిస్తే బంగారం ధరలు తగ్గుముఖం పడతాయి. అయితే ప్రస్తుతం స్టాక్ మార్కెట్, బంగారం ధర ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. బంగారం ధరలు కేవలం భారత్లోనే కాకుండా ప్రపంచ దేశాల్లో సైతం పెరుగుతున్నాయి. యుఎస్లో బంగారం ధరలు (ఏప్రిల్2 నాటికి) 2,250 డాలర్లకు పైగా ఆల్ టైమ్ హైని తాకాయి.2022లో చివరి కనిష్ట స్థాయి నుండి బంగారం ధర 38శాతం పెరిగింది. దేశీయంగా కొత్త ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్1) ప్రారంభంతో దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధర 10 గ్రాములకు రూ.70,000 కొత్త మైలురాయిని దాటాయి. ఊహాగానాలు, సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు, డాలర్ ఇండెక్స్ పతనం, చైనాలో డిమాండ్,యూఎస్ వడ్డీ రేటు తగ్గుదల అంచనాలతో సహా అనేక అంశాలు కారణంగా పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. దీంతో రానున్న రోజుల్లో తులం బంగారం రూ.లక్షకు చేరిన ఆశ్చర్య పోనక్కర్లేదని ఆర్ధిక నిపుణుల అంచన -
Lok Sabha Elections 2024: ఈసీ ‘మెనూ కార్డు’
చాయ్కి పంజాబ్లోని జలంధర్లో రూ.15. అదే మధ్యప్రదేశ్లోని మాండ్లాలో అయితే రూ.7. సమోసా కూడా పంజాబ్లో రూ.15 అయితే మధ్యప్రదేశ్లో రూ.7.5. ఏమిటీ ధరలంటారా? లోక్సభ ఎన్నికల ప్రచార నిమిత్తం అభ్యర్థులకు ఎన్నికల సంఘం నిర్ధారించిన ధరలివి. వీటిని జిల్లా ఎన్నికల విభాగాలు స్థానికంగా నిర్ధారిస్తుంటాయి. దాంతో అవి ఒక్కో ప్రాంతానికి ఒక్కోలా ఉంటాయి. అభ్యర్థుల ఎన్నికల వ్యయంపై గరిష్ట పరిమితి ఉందన్నది తెలిసిందే. లోక్సభ ఎన్నికల్లో ఒక్కో అభ్యరి్థకి ఈసీ నిర్ధారించిన పరిమితి రూ.95 లక్షలు. అరుణాచల్, గోవా, సిక్కిం రాష్ట్రాల్లో మాత్రం రూ.75 లక్షలు. కేంద్రపాలిత ప్రాంతాల్లో రూ.75–95 లక్షల మధ్య ఉంది. నామినేషనల్ దాఖలు చేసిన నాటి నుంచి ఫలితాలు వెల్లడించే తేదీ దాకా అభ్యర్థులు చేసే ఎన్నికల వ్యయం ఈ పరిమితిని దాటకుండా ఈసీ డేగ కళ్లతో గమనిస్తూ ఉంటుంది. ఇందుకోసం బ్యానర్లు, ఫ్లెక్సీలు, సభా వేదికలు మొదలుకుని కార్యకర్తలు, అభిమానులకు ఆహారం దాకా ప్రతిదానికీ రేటును ఫిక్స్ చేస్తుంది. అయితే వాటికీ, వాస్తవ ధరలకూ చాలాసార్లు పొంతనే ఉండదు. దాంతో ఈసీ ‘మెనూ కార్డు’పై మీడియాలో, సోషల్ మీడియాలో జోకులు పేలుతుండటం పరిపాటి. మరోవైపు, ఎన్నికల వ్యయంపై అభ్యర్థులకు పరిమితి ఉన్నా పార్టీలు చేసే ఖర్చుకు మాత్రం అలాంటిదేమీ లేకపోవడం విశేషం! చాయ్ రూ.5 నుంచి 15 దాకా... చాయ్ ధరను దేశవ్యాప్తంగా ప్రాంతాన్ని బట్టి రూ.5 నుంచి రూ.15 దాకా ఈసీ నిర్ధారించింది. మధ్యప్రదేశ్లోని బాలాఘాట్లో కప్పు చాయ్ రూ.5, సమోసా రూ.10. ఇడ్లీ, సాంబార్ వడా, పోహా–జిలేబీ ప్లేటు రూ.20. దోసా, ఉప్మా మాత్రం ప్లేటు రూ.30. మణిపూర్లో జాతుల హింసకు కేంద్రాల్లో ఒకటైన తౌబల్ జిల్లాలో చాయ్, సమోసా, కచోరీ, ఖజూర్, గాజా ఒక్కోటీ రూ.10. రాష్ట్రంలోని తెంగ్నౌపాల్ జిల్లాలో బ్లాక్ టీ రూ.5, సాదా టీ రూ.10. మణిపూర్లో బాతు మాంసం రూ.300. పంది మాంసం రూ.400. ఇక్కడి ఈసీ మెనూలో చికెన్తో పాటు చేపలు కూడా ఉన్నాయి. జలంధర్లో ప్లేటు చోలే భటూరేకు ఈసీ నిర్ధారించిన ధర రూ.40. కిలో చికెన్కు రూ.250, మటన్కు రూ.500. మిఠాయిల్లో ధోడా రూ.450, ఘీ పిన్నీ రూ.300. గ్లాసు లస్సీ రూ.20, నిమ్మరసం రూ.15. చెన్నైలో తగ్గిన చికెన్ బిర్యానీ రేటు చెన్నైలో 2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే చాయ్ ధరను రూ.10 నుంచి రూ.15కు ఈసీ పెంచింది. కాఫీ కూడా రూ.15 నుంచి రూ.20కి పెరిగింది. కానీ చికెన్ బిర్యానీ ధరను మాత్రం రూ.180 నుంచి రూ.150కి తగ్గించడం విశేషం! ఢిల్లీ శివార్లలో నోయిడా పరిధిలోని గౌతంబుద్ధ నగర్లో వెజ్ భోజనం రూ.100. సమోసా, చాయ్ రూ.10. కచోరీ రూ.15, శాండ్విచ్ రూ.25, జిలేబీ కిలో రూ.90. ఉత్తర గోవాలో బటాటా (ఆలూ) వడ, సమోసా రూ.15. చాయ్ రూ.15, కాఫీ రూ.20. హరియాణాలోని జింద్లో దాల్ మఖానీ, మిక్స్డ్ వెజ్ కర్రీ రూ.130. మటర్ పనీర్ రూ.160. ఇక్కడ ఈసీ మెనూలో బటర్ నాన్, మిస్సీ రోటీ, ప్లెయిన్ రోటీలతో పాటు కాజూ కట్లీ, గులాబ్జామ్ వంటివి కూడా ఉన్నాయి. వీటికీ రేట్లు ఫిక్స్... ► ఖరీదైన హెలీప్యాడ్లు, లగ్జరీ వాహనాలు, ఫామ్హౌజ్లతో పాటు పూలు, కూలర్లు, టవర్ ఏసీలు, సోఫాల వంటివాటికి కూడా ఈసీ రేట్లు నిర్ధారించింది. ► సభలు, సమావేశాలకు జనాన్ని తరలించేందుకు బస్సులు మొదలుకుని టాటా సఫారీ, స్కార్పియో, హోండా సిటీ, సియాజ్... ఇలా బ్రాండ్లవారీగా కూడా ఒక్కో వాహనానికి ఒక్కో రేటు నిర్ణయించింది. ► దండల్లో కూడా గులాబీ, బంతి... ఇలా పూలను బట్టి రేట్లు నిర్ణయమయ్యాయి. పార్టీల జెండాలు, టోపీలకూ అంతే. ► సభలు, సమావేశాలకు వేదికలు, నేతలకు బస తదితరాలతో పాటు ప్రకటనలు, హోర్డింగులు, కరపత్రాలు, ఫ్లెక్సీలు, ఇతర ప్రచార సామగ్రికి కూడా ఇంత అని ఈసీ ముందే రేట్లు ఫిక్స్ చేసి పెట్టింది. కొసమెరుపు: ఎన్నికల వేళ కార్యకర్తలకు పారీ్టలు, అభ్యర్థులు మద్యం అందుబాటులో ఉంచడం బహిరంగ రహస్యమే. కానీ ఈసీ మెనూలో మద్యానికి మాత్రం చోటులేకపోవడం విశేషం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
స్వేచ్ఛా మార్కెట్ పరిష్కారం కాదు!
గతేడాది కనీసం 65 దేశాలలో రైతులు నిరసనలు చేపట్టారు. ఖండాంతరాలలో జరిగిన ఈ నిరసనలు ప్రధానంగా పంటల ధరలు, అధిక ఉత్పత్తి వ్యయం, చౌకైన దిగుమతులు, ప్రోత్సాహకాల ఉపసంహరణ, స్థానిక సమస్యలకు వ్యతిరేకంగా సాగాయి. నిజానికి వ్యవసాయ సంక్షోభం కొనసాగడానికి స్వేచ్ఛా మార్కెట్లే కారణం. మార్కెట్లకు విజ్ఞత ఉంటే, రైతులు నష్టపోవడానికి కారణమే లేదు. ఆర్థిక వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉందో చెప్పడానికి రైతుల నిరసనలు నిదర్శనం. చట్టబద్ధమైన కనీస మద్దతు ధర అనేది భారతీయ రైతులకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాగుదారులకు కూడా అనుసరణీయ మార్గం. వ్యవసాయాన్ని ఉద్దేశపూర్వకంగా పేదరికంలో ఉంచిన ఆర్థిక రూపకల్పనను సమూలంగా సరిదిద్దడానికి ఇదే సమయం. భారతదేశంలో, ఐరోపాలోని కొన్ని ప్రాంతాల్లో రైతుల తిరగబడటాన్ని ప్రపంచం గమ నిస్తోంది. 2023 జనవరి నుండి కనీసం 65 దేశాలలో రైతులు నిరస నలు చేపట్టారు. కనీవినీ ఎరుగని నిరసనల వెల్లువ వెనుక కారణాలు వేరువేరుగా ఉన్నప్పటికీ, వాటన్నింటినీ కలిపే సాధారణ సూత్రం ఒకటే: నియంత్రణ లేని మార్కెట్ ఆర్థిక వ్యవస్థ వైఫల్యం.రైతులు తమ అసంతృప్తిని వెళ్లగక్కేందుకు ఉపయోగించే పదాలు ఒక దేశం నుండి మరొక దేశానికి భిన్నంగా ఉండవచ్చు. కానీ అంత ర్లీన సందేశం ఒకటే: వ్యవసాయ ఆదాయాన్ని పెంచడంలో మార్కెట్లు విఫలమయ్యాయి. భారతదేశ రైతులు కనీస మద్దతు ధరను చట్ట బద్ధమైన హక్కుగా కోరుకుంటుండగా, యూరోపియన్ రైతులు తమ ఉత్పత్తులకు సరైన విలువను డిమాండ్ చేస్తున్నారు. కెన్యాలో బంగా ళాదుంపల ధర పతనం, నేపాల్లో కూరగాయల ధరలు తక్కువగా ఉండటంతో పాటు జర్మనీ, ఫ్రాన్స్ , బెల్జియంతో సహా యూరప్లోని అనేక దేశాలలో ఉత్పత్తి వ్యయం పెరగడం, చౌక దిగుమతులు, ఉత్పత్తి ధరలు పడిపోవడాన్ని కూడా నిరసనలు హైలైట్ చేశాయి. స్పెయిన్ లోని రైతులు నాలుగు లక్షల లీటర్ల పాలను వీధుల్లో పారబోశారు. మలేషియా సాగుదారులు తక్కువ వరి ధరలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఫ్రాన్స్ లో, అధ్యక్షుడు మాక్రాన్ తో ఇటీవల జరిగిన సమావేశంలో చిన్న రైతుల ప్రముఖ సంస్థ అయిన ‘కాన్ఫెడరేషన్ పేసన్’... రైతులకు సామాజిక రక్షణ కల్పించడంతో సహా హామీ ఇవ్వబడిన వ్యవసాయ ధర కంటే తక్కువ ధరకు కొనుగోళ్లను అనుమతించకూడదనే వాగ్దానాన్ని కోరింది. వాణిజ్య సరళీకరణను కూడా రైతులు వ్యతిరేకించారు.జర్మనీ, ఫ్రాన్స్ , రొమేనియా, ఇటలీ, పోలాండ్లలో రైతులు ఉక్రె యిన్ నుండి వచ్చే చౌక దిగుమతులకు వ్యతిరేకంగా నిరసనలు నిర్వ హించారు. పైగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను సమీక్షించాలని కోరుతున్నారు. వారు హైవేలను అడ్డుకున్నారు, దిగుమతి చేసుకున్న వ్యవసాయ ఉత్పత్తులను తీసుకువెళుతున్న ట్రక్కులను నిలిపివేశారు, చాలా చోట్ల దిగుమతి చేసుకున్న ఆహార పదార్థాలను ధ్వంసం చేశారు. ఫ్రాన్స్ లో, చౌకైన చేపల దిగుమతులకు వ్యతిరేకంగా వేలాది మంది రైతులు, మత్స్యకారులు ఓడరేవుల వద్ద నిరసన తెలిపారు. ఇది వ్యవ సాయ జీవనోపాధిని నాశనం చేస్తుందని వారు చెప్పారు. భారతదేశం విషయానికి వస్తే, ప్రపంచ వాణిజ్య సంస్థ నుండి భారత్ వైదొలగా లని నిరసన తెలుపుతున్న రైతులు తమ డిమాండ్ను పునరుద్ఘాటించారు. ‘డౌన్ టు ఎర్త్’ మ్యాగజైన్ సంకలనం ప్రకారం, యూరప్లోని 24 దేశాలు రైతు నిరసనలను ఎదుర్కొంటుండగా, ఆఫ్రికాలో 12, ఆసియాలో 11, దక్షిణ, ఉత్తర, మధ్య అమెరికాల్లో ఎనిమిదేసి దేశాలు, ఓషియానియాలో రెండు దేశాలు గత సంవత్సరం రైతు ప్రదర్శనల వల్ల ప్రకంపించిపోయాయి. ఐరోపాలో, స్వతంత్ర పాన్–యూరోప్ మీడియా నెట్వర్క్ అయిన ‘యూరాక్టివ్’ 2024 జనవరి–ఫిబ్రవరిలో తాజా దశ నిరసనలపై చేసిన అధ్యయనం... రైతులకు న్యాయమైన, లాభదాయకమైన ధర కోసం బలమైన డిమాండ్ ఉంటోందని తెలిపింది. ప్రధానంగా ఫ్రాన్స్ , జర్మనీ, స్పెయిన్, ఇటలీ నుండి ఈడిమాండ్ వెలువడింది. బెల్జియం రైతులు ఆహార గొలుసు విధానంలో కూడా రక్షణ కోరుకుంటున్నారు. నికర సున్నా ఉద్గారాలను సాధించే ప్రయత్నంలో యూరోపియన్ కమిషన్ విధించడానికి ప్రయత్నిస్తున్న కఠినమైన పర్యావరణ నిబంధనలపై కూడా వారి కోపం నిర్దేశితమైంది. వ్యవసాయ రంగంపై వాణిజ్య ప్రభావం యూరోపియన్ యూనియన్ రైతులకు ఆందోళన కలిగిస్తోంది. జర్మన్ రైతుల ప్రద ర్శనలు... వ్యవసాయ వాహనాలకు ఇంధనంపై పన్ను మినహాయింపులను ఉపసంహరించుకోవడం గురించి సాగాయి (దీనిని జర్మనీ దశలవారీగా రద్దు చేయడానికి అంగీకరించింది); ‘నైట్రేట్ డైరెక్టివ్’ లాంటి కఠినమైన పర్యావరణ నిబంధన లతోపాటు తక్కువ ధరలను భర్తీ చేయడానికి ప్రోత్సాహకాల డిమాండ్పై దృష్టి సారించాయి. సారాంశంలో, ఖండాంతరాలలో జరిగిన ఈ నిరసనలలో చాలా వరకు ప్రధానంగా పంటల ధరలు, అధిక ఉత్పత్తి వ్యయం, చౌకైన దిగు మతులు, ప్రోత్సాహకాల ఉపసంహరణ, స్థానిక సమస్యలకు వ్యతి రేకంగా ఉన్నాయి. వ్యవసాయాన్ని మార్కెట్ల చేతుల్లోకి వదిలేయడం వల్ల వ్యవ సాయ రంగానికి మేలు జరగలేదు. ప్రపంచవ్యాప్తంగా రైతుల నిరస నలే ఇందుకు నిదర్శనం. ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు ఉద్దేశపూర్వ కంగా ఆహార ధరలు తక్కువగా ఉండేలా చూసుకున్న ఆధిపత్య ఆర్థిక ఆలోచనకు భారతీయ వ్యవసాయం బలయ్యింది. ఇది కాలం చెల్లిన విధానం. మారుతున్న వాస్తవాలకు అనుగుణంగా ఆర్బీఐ తన స్థూల ఆర్థిక విధానాలను పునఃసమీక్షించే సమయం ఆసన్నమైంది. 2022– 23 గృహ వ్యయ సర్వే ప్రకారం, ప్రతి కుటుంబం మీద గృహం, ఆరోగ్యం, విద్యపై నిరంతరం పెరుగుతున్న వ్యయంతో భారం పడి నప్పటికీ, ఆహారంపై ఖర్చు గణనీయంగా తగ్గింది. కఠినమైన స్థూల ఆర్థిక నియంత్రణ నుండి వ్యవసాయ ధరలకు అవసరమైన దిద్దుబాటు చర్యల ఆవశ్యకతను నొక్కిచెప్పిన క్షణం, దానికి బలమైన వ్యతిరేకత వస్తుంది. ‘ఇది అధిక ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది, తద్వారా మార్కెట్ వక్రీకరణలు జరుగుతాయని మేము హెచ్చరించాము’ అంటూ గ్యారెంటీ ధర కావాలని రైతులు పునరుద్ఘాటించినప్పుడల్లా విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ ఒక కార్పొరేట్ వైఫల్యం ఫలితంగా కోవిడ్ మహమ్మారి సంవత్సరాల్లో ద్రవ్యోల్బణం 57 శాతం పెరిగి, 2023లో 53 శాతం చుట్టూ చేరిన ప్పుడు మాత్రం అదే ఆర్థిక ఆలోచన స్పష్టంగా నిశ్శబ్దంగా ఉంది. వ్యవసాయ ధరలను స్థిరీకరించడానికి అనేక దశాబ్దాలుగా అనేక ప్రోత్సాహకాలు, దేశీయ మద్దతు యంత్రాంగాలు ప్రయత్నించిన ప్పటికీ, వాస్తవికత ఏమిటంటే వ్యవసాయ కష్టాలు ప్రపంచవ్యాప్తంగా మరింత తీవ్రమవుతున్నాయి. వ్యవసాయంలో మార్కెట్ సంస్క రణలు అరువు తెచ్చుకున్న అమెరికాలో కూడా స్వేచ్ఛా మార్కెట్ రూపకల్పన అనేది చిన్న రైతులను వ్యవసాయం నుండి ఎలా బయటకు నెట్టిందో, వారిని కష్టాల బాటలో ఎలా వదిలివేసిందో, పొలంలో విధ్వంసాన్ని ఎలా సృష్టించిందో ‘నాసా’ మాజీ శాస్త్రవేత్త వేదవ్రత పెయిన్ దర్శకత్వం వహించిన ‘డెజా వు’ డాక్యుమెంటరీ చూపిస్తుంది. కాబట్టి స్వేచ్ఛా మార్కెట్ పరిష్కారం కాదు. నిజానికి వ్యవసాయ సంక్షోభం కొనసాగడానికి ఇదే కారణం. మార్కెట్లకు విజ్ఞతఉంటే, సమర్థతకు ప్రతిఫలమివ్వగలిగితే, వ్యవసాయం నష్టపోయే ప్రతిపాదనగా ఉండటానికి కారణమే లేదు. ఆర్థిక వ్యవస్థ ఎంతలోప భూయిష్టంగా ఉందో చెప్పడానికి ప్రపంచవ్యాప్తంగా రైతుల నిరసనలు నిదర్శనం. వ్యవసాయాన్ని ఉద్దేశపూర్వకంగా పేదరికంలో ఉంచిన ఆర్థిక రూపకల్పనను సమూలంగా సరిదిద్దడానికి ఇది సమయం. చట్టబద్ధమైన కనీస మద్దతు ధర అనేది భారతీయ రైతులకు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాగుదారులుఅందరికీ వర్తించే మార్గం. మార్కెట్లు తదనుగుణంగా సర్దుబాటు అవుతాయి. - వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు , దేవీందర్ శర్మ - ఈ–మెయిల్: hunger55@gmail.com -
దేశంలో బంగారం ధరలు.. పెరిగాయా? తగ్గాయా?
దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు పరుగులు పెట్టిన పసిడి గత కొన్ని రోజులు నుంచి తగ్గుముఖం పడుతూ వస్తుంది. నేటి బంగారం ధరలు ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి పరిశీలిస్తే హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ రూ.61,250 ఉండగా 10 క్యారెట్ల 24 గ్రాముల బంగారం ధర రూ.66820గా ఉంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ రూ.61,250 ఉండగా 10 క్యారెట్ల 24 గ్రాముల బంగారం ధర రూ.66820గా ఉంది. వైజాగ్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ రూ.61,250 ఉండగా 10 క్యారెట్ల 24 గ్రాముల బంగారం ధర రూ.66820గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.61,850 ఉండగా 10 క్యారెట్ల 24 గ్రాముల బంగారం ధర రూ.66,470గా ఉంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.61,250 ఉండగా 10 క్యారెట్ల 24 గ్రాముల బంగారం ధర రూ.66820గా ఉంది ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.61,400 ఉండగా.. 10 క్యారెట్ల 24 గ్రాముల బంగారం ధర రూ.66,970గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.61,250 ఉండగా 10 క్యారెట్ల 24 గ్రాముల బంగారం ధర రూ.66,820గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.61,250 ఉండగా 10 క్యారెట్ల 24 గ్రాముల బంగారం ధర రూ.66,280గా ఉంది. -
దేశంలో బంగారం ధరలు.. ఎలా ఉన్నాయంటే?
దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మార్చి 17న పసిడి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరల్ని ఒక్కసారి పరిశీలిస్తే హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,590 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,100గా ఉంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,590 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,100గా ఉంది. వైజాగ్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,590 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,100గా ఉంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,590 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,100గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.61,150 ఉండగా.. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.66,710గా ఉంది. ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,740 ఉండగా.. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.66,250గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60590 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,100గా ఉంది -
ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు పెరగడానికి కారణం ఇదేనా?
దేశంలో పసిడి పరుగులు పెడుతోంది. ఇలాగే కొనసాగితే ఈ ఏడాది పది గ్రాముల బంగారం రూ.70వేలు దాటే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో పసిడి ధరల మార్పులకు గల కారణాల్ని అన్వేషిస్తున్నారు నిపుణులు. మార్చి నెల ప్రారంభం నుంచి గత గురువారం వరకు పసిడి ధర రూ. 2,700 కంటే ఎక్కువ పెరిగింది. దీంతో మల్టీ కమోడిటీ ఎక్ఛేంజ్లో 10 గ్రాముల బంగారం ధర రూ.65,298కి ఎగబాకింది. అయితే ఇలా ఊహించని విధంగా బంగారం ధరలు పెరగడానికి ఈ ఏడాది జూన్లో ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం తెలుస్తోంది. ఈ వార్తల నేపథ్యంలో మదుపుర్లు పసిడిపై పెట్టుబడులు పెడుతున్నారు. లాభాల్ని గడిస్తున్నారు. ఈ అంచనా ప్రకారం..జాతీయ,అంతర్జాతీయ మార్కెట్లలో స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం మదుపర్ల సెంటిమెంట్ను బలహీనపరిచింది ఇది బంగారం ధరల పెరుగుదలకు మరింత ఆజ్యం పోసింది. ఈ సందర్భంగా .. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు,ఆర్థిక రంగంలో అనిశ్చితి మధ్య ఈ సంవత్సరం బంగారం పెరుగుదల ధోరణి కొనసాగుతుందని మేము విశ్వసిస్తున్నాం. ఈక్విటీ మార్కెట్లు క్రమంగా ఖరీదైనవిగా మారుతున్నందున పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను బంగారం వైపుకు మళ్లించవచ్చు అని క్వాంటమ్ ఏఎంసీ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ చిరాగ్ మెహతా అన్నారు. -
ఫండే: ఈ ఖనిజం ధరెంతో మీకు తెలుసా!
మన జీవితంలో మనం ఎన్నోరకాల, ఎంతో ఖరీదైన వస్తువల ధరలను విని ఉంటాం. అవసరమైతే ఆ వస్తువులను చూసుంటాం. అత్యంత ఖరీదైన ఆ వస్తువులలో బంగారం, ప్లాటినమ్ అనుకుంటే పొరబడినట్లే. మరి వాటన్నింటికన్నా మరింత ఖరీదైన వస్తువు(ఖనిజం) గురించి మీకు తెలుసా..! ఇక అదేంటో చూద్దాం. అత్యంత ఖరీదైన ఖనిజాలు బంగారం, ప్లాటినమ్ అని చాలామంది అనుకుంటారు. వీటన్నింటి కంటే అత్యంత ఖరీదైన ఖనిజం ఫ్రాంకియమ్. దీని ధర ఒక గ్రాముకు 100 కోట్ల డాలర్లు (రూ.8229 కోట్లు) ఉంటుంది. ఇవి కూడా చదవండి: ఫండే: పర్వతమే హోటల్! కాదు.. అదొక 'హిల్థ్రిల్'!! -
దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
రానున్న రోజుల్లో పసిడి ధరలు పరుగులు పెట్టనున్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ.66,270 ఉండగా రానున్న కాలంలో అది కాస్త 70వేలకు చేరువయ్యే అవకాశం ఉంది. ఆల్ ఇండియా జెమ్ అండ్ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (జీజేసీ) ప్రకారం, కొనసాగుతున్న ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారం ధరలను రాబోయే సంవత్సరంలో 10 గ్రాముల చారిత్రాత్మక గరిష్ట స్థాయికి రూ.70వేలకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో మార్చి 10న దేశంలో పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరల్ని పరిశీలిస్తే హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,750 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,270గా ఉంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,750 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,270గా ఉంది. వైజాగ్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,750 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,270గా ఉంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,750 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,270గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.61,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.67,100గా ఉంది ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,900 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,420గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,750 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,270గా ఉంది. -
దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. మార్చి 2న దేశంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.10 పెరగగా.. 24 క్యారెట్ల బంగారంపై రూ.10 పెరిగింది. దేశంలో వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,910 ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,170గా ఉంది వైజాగ్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,910 ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,170గా ఉంది విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,910 ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,170గా ఉంది గుంటూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,910 ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,170గా ఉంది ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,910 ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,170గా ఉంది చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,410 ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,720గా ఉంది ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,060 ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,320గా ఉంది బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,910 ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,170గా ఉంది -
బంగారం కొనేవారికి మంచి ఛాన్స్.. నేటి ధరలు ఇవే
దేశంలో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఆదివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,700 ఉండగా, సోమవారం నాటికి రూ.100 తగ్గి రూ.57,600కి చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,950గా ఉంది. ఈ సందర్భంగా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే.. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,600 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,840గా ఉంది విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,600 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,840గా ఉంది వైజాగ్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,600 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,840గా ఉంది ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,600 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,840గా ఉంది ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,750 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,940 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,600 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,840గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,100 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,380గా ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,600 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,840గా ఉంది. -
దేశంలో బంగారం ధరలు - ఏపీ, తెలంగాణాల్లో ఎంతంటే?
దేశంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 25న దేశంలో బంగారం ధరలు ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. స్థిరంగా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే? హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది విశాఖలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,850 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,100గా ఉంది చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,200 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,490గా ఉంది కోల్ కత్తాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది -
దేశంలో బంగారం ధరలు..ఎంతంటే?
దేశంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 24న దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయని పరిశీలిస్తే..10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం అత్యంత స్పల్పంగా రూ.10, 24 క్యారెట్ల బంగారంపై రూ.10 తగ్గింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే? హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది విశాఖలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,850 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,100గా ఉంది చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,200 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,490గా ఉంది కోల్ కత్తాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది -
దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
దేశంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.శుభకార్యాలకు మంచిరోజులు ప్రారంభం కావడంతో కొనుగోలు దారులు బంగారం ధరలు భారీ స్థాయిలో తగ్గుతుందని భావించారు. కానీ ఆశించిన స్థాయిలో తగ్గడం లేదు. 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు ఒక్కోరోజు రూ.100 తగ్గుతుంటే..మరో రోజు రూ.50 తగ్గుతున్నాయి. అయితే స్వల్పంగా తగ్గుతున్నప్పటికి రానున్న రోజుల్లో పసిడికి ఉన్న డిమాండ్ కారణంగా ధరలు మరింత దిగివచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఫిబ్రవరి 23న దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయని పరిశీలిస్తే హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,500 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,730గా ఉంది విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,500 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,730గా ఉంది విశాఖలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,500 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,730గా ఉంది ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,500 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,730గా ఉంది ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,650 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,880గా ఉంది చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,000 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,230గా ఉంది కోల్ కత్తాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,500 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,730గా ఉంది -
నేడు మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
దేశంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. మాఘమాసం ముందు వరకు బంగారం ధరలు పెరుగుతూ వచ్చాయి. అయితే పెళ్లి సీజన్ ప్రారంభంతో మార్కెట్ లో బంగారంపై డిమాండ్ పెరిగింది. పసిడి ధరలు సైతం తగ్గుముఖం పట్టాయి. ఇక, ఫిబ్రవరి 21న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.10, పది గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.10లు తగ్గింది. ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో పడిసి ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి పరిశీలిస్తే హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,340 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,550గా ఉంది విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,340 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,550గా ఉంది విశాఖలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,340 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,550గా ఉంది ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,340 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,550గా ఉంది ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,340 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,550గా ఉంది ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,340 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,550గా ఉంది చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,840 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,100గా ఉంది కోల్ కత్తాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,340 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,550గా ఉంది -
దేశంలో బంగారం ధరలు.. తగ్గాయా? పెరిగాయా?
దేశంలో కొనసాగుతున్నపెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. మాఘమాసం ముందు వరకు బంగారం ధరలు పెరుగుతూ వచ్చాయి. అయితే పెళ్లి సీజన్ ప్రారంభంతో మార్కెట్ లో బంగారంపై డిమాండ్ పెరిగింది. పసిడి ధరలు సైతం తగ్గుముఖం పట్టాయి. ఇక, ఫిబ్రవరి 20న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.100, పది గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.80 లు తగ్గింది. ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో పడిసి ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి పరిశీలిస్తే హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,350 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,560గా ఉంది విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,350 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,560గా ఉంది విశాఖలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,350 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,560గా ఉంది ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,350 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,560గా ఉంది ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,350 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,560గా ఉంది ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,350 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,560గా ఉంది చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,850 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,110గా ఉంది కోల్ కత్తాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,350 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,560గా ఉంది -
ఎల్పీజీ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం ఏమిటి?
దేశంలోని దాదాపు ప్రతి ఇంటిలోనూ వంటగ్యాస్ అంటే ఎల్పీజీ కనెక్షన్ ఉంది. గ్రామాల్లో కూడా మట్టి పొయ్యిలకు బదులు గ్యాస్ స్టవ్లు వినియోగిస్తున్నారు. అయితే ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఏడాదికేడాది పెరుగుతున్నాయి. ఉజ్వల పథకం ద్వారా పేద కుటుంబాలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు అందించిన తర్వాత వంటగ్యాస్ వినియోగం మరింతగా పెరిగింది. గత 10 సంవత్సరాలలో ఎల్పీజీ వినియోగదారుల సంఖ్య 32 కోట్లకు పైగా పెరిగింది. గత ఐదేళ్లలో దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తి నాలుగు శాతం పెరిగింది. అయితే వినియోగం 22 శాతం మేరకు పెరిగింది. పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని గ్యాస్ను ప్రభుత్వం దిగుమతి చేస్తోంది. గత ఐదేళ్లలో ఎల్పీజీ దిగుమతులు 60 శాతం మేరకు పెరిగాయి. భారతదేశానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, సౌదీ అరేబియా, కువైట్ నుండి గ్యాస్ సరఫరా అవుతోంది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అందించిన డేటా ప్రకారం గత కొన్నేళ్లుగా భారత్.. అమెరికా నుంచి కూడా గ్యాస్ దిగుమతి చేసుకుంటోంది. ఇలా ఎల్పీజీ దిగుమతులు పెరిగిన కారణంగానే వాటి ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. భారతదేశంలో 90 శాతం ఎల్పీజీ గృహ వినియోగం కోసం ఉపయోగిస్తున్నారు. మిగిలిన మొత్తం పారిశ్రామిక, వాణిజ్యపరంగా ఉపయోగిస్తున్నారు. దేశంలో ఎల్పీజీ వినియోగంలో 13 శాతం ఉత్తరప్రదేశ్లో కొనసాగుతోంది. ఇది మహారాష్ట్రలో 12 శాతం మేరకు ఉంది. ఈ విషయంలో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. -
అసలే పెళ్లిళ్ల సీజన్.. దేశంలో బంగారం ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా?
దేశంలో పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. దీంతో బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నిన్న మొన్నటి వరకు తగ్గినట్లే తగ్గిన పసిడి ధరల్లో మళ్లీ పెరుగుదల మొదలైంది. మార్కెట్లో బంగారంపై ఉన్న డిమాండ్ దృష్ట్యా రానున్న రోజుల్లో పసిడి ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫిబ్రవరి 17న దేశంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా రూ.100 పెరగగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.110 పెరిగింది. ఇక దేశంలో వివిధ ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి పరిశీలిస్తే హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,200 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,400గా ఉంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,200 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,400గా ఉంది. విశాఖ పట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,200 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,400గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,800 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,050గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,200 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,400గా ఉంది. ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,350 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,550గా ఉంది. -
హనుమాన్ మూవీ.. భారీ ఆఫర్ ప్రకటించిన మేకర్స్!
ఈ ఏడాది సంక్రాంతికి సందడి చేసిన సినిమాల్లో హనుమాన్ ఒకటి. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. తేజ సజ్జా కీలక పాత్రలో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం నెల రోజుల పూర్తయ్యాక కూడా థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా ఆడియన్స్కు మరింత మందికి అందుబాటులోకి తెచ్చేందుకు టికెట్స్ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. నైజాంలోని థియేటర్స్లో హను-మాన్ టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో టికెట్ ధర రూ.175లుగా ఉంది. ఈ టికెట్స్ ఇకపై రూ.100 కే లభించనున్నాయి. అలాగే మల్టీప్లెక్స్లలో రూ.295గా ఉన్న టికెట్ ధరను ఏకంగా రూ.150 కి తగ్గించారు. అయితే ఈ ధరలు ఫిబ్రవరి 16 నుంచి 23 వరకు అందుబాటులో ఉంటాయని మేకర్స్ తెలిపారు. ఫ్యామిలీ ఆడియెన్స్ కోసమే ఈ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. The #HanuManRAMpage is not over yet❤️🔥 Celebrate the #HanuMania at the most affordable & Lowest prices in the Nizam Area since the release💥 Book your tickets now! - https://t.co/nM6rXb7n54#HanuMan 🔥 Nizam Release by @MythriOfficial A @PrasanthVarma film 🌟ing @tejasajja123… pic.twitter.com/wV0cWFvAA6 — Prasanth Varma (@PrasanthVarma) February 16, 2024 -
దేశంలో స్థిరంగా బంగారం ధరలు!
దేశంలో గత కొద్ది రోజులుగా బంగారం వినియోగం భారీగా పెరిగిపోతుంది. ఫలితంగా వాటి ధరలు సైతం అమాంతంగా పెరిగిపోతున్నాయి. అయితే ఆదివారం ధరల పెరుగుదలకు బ్రేకులు పడ్డాయి. స్థిరంగా ఉన్నాయి. వాటి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఈ సందర్భంగా దేశంలోని పలు నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి విజయవాడ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,100 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63, 380గా ఉంది హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,100 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63, 380గా ఉంది వైజాగ్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,100 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63, 380గా ఉంది చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,700 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64, 040గా ఉంది బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,100 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,380గా ఉంది -
రానున్న రోజుల్లో చమురు సంక్షోభం..!
-
కొత్త ప్రభుత్వం ఏర్పాటుతోనే తగ్గిన పెట్రో ధరలు
ముడిచమురు ధరలు పెరుగుతున్నప్పటికీ నేడు(సోమవారం)బీహార్, యూపీలలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధర 84 డాలర్లను దాటేసింది. సోమవారం ఉదయం దేశీయ ప్రభుత్వ చమురు సంస్థలు విడుదల చేసిన పెట్రోల్, డీజిల్ ధరల్లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఈరోజు యూపీ, బీహార్లలో చమురు చౌకగా మారింది. ప్రభుత్వ చమురు సంస్థలు అందించిన వివరాల ప్రకారం నోయిడాలో పెట్రోల్ ధర 17 పైసలు తగ్గి లీటరు రూ. 96.59కు చేరింది. డీజిల్ కూడా 17 పైసలు తగ్గి రూ. 89.76కి చేరుకుంది. బీహార్ రాజధాని పాట్నాలో పెట్రోల్ ధర తగ్గింది. ఇక్కడ పెట్రోల్ ధర 11 పైసలు తగ్గి, లీటరు రూ. 107.48కి విక్రయిస్తున్నారు. డీజిల్ కూడా లీటరుకు 10 పైసలు తగ్గి రూ.94.26కి చేరుకుంది. హర్యానా రాజధాని గురుగ్రామ్లో ఈరోజు పెట్రోలు ధర 29 పైసలు పెరిగి లీటరుకు రూ. 97.10కి చేరగా, డీజిల్ ధర 27 పైసలు పెరిగి రూ. 89.96కి చేరింది. గ్లోబల్ మార్కెట్లో సోమవారం ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 84.18 డాలర్లకు చేరుకోగా, డబ్ల్యుటిఐ రేటు బ్యారెల్కు 78.60 డాలర్లకు చేరింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలు మారుతుంటాయి. కొత్త రేట్లు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్ మొదలైనవి జోడించిన తర్వాత, దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపవుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా మారడానికి ఇదే కారణంగా నిలుస్తోంది. కాగా బీహార్లో కొత్త ప్రభుత్వం ఏర్పడగానే చమురు ధరలు తగ్గడం శుభపరిణామంగా ఆ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. -
దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
జనవరి 30, 31 తేదీల్లో యూఎస్ ఫెడ్ పాలసీ మీటింగ్ జరగనుంది. ఈ తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మదుపర్లు పెట్టుబడులపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఫలితంగా మనదేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది గుంటూరు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది విశాఖపట్నం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 58,400 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,710గా ఉంది బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62950గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది. -
దేశంలో బంగారం ధరలు..పెరిగాయా?.. తగ్గాయా?
దేశంలో తగినంత బంగారం లేదంటే అవసరాల కోసం విదేశాలకు మనదేశానికి దిగుమతి చేసుకుంటుంటాం. ఇలా దిగుమతి చేసుకునే బంగారంపై కేంద్రం దిగుమతి సుంకాలను విధిస్తుంది. ఇటీవల ఆ సుంకాలను పెంచింది. దీంతో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిపుణుల అంచనాలకు అనుగుణంగా కొద్ది రోజులుగా బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 27న మన దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయని ఒక్కసారి పరిశీలిస్తే హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది గుంటూరు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది విశాఖపట్నం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 58,400 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,710గా ఉంది బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62950గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది. -
పట్టుచీరలో మెరిసిన మాధురి, ఆ చీర ధర ఎంతో తెలుసా?
వయసు పెరుగుతున్నా వన్నె తగ్గని అందం ఆమె. వయసుతో పాటు అందాన్ని కూడా పెంచుకున్న బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ మాధురీ దీక్షిత్ లివింగ్ లెజెండ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. సాంప్రదాయ దుస్తులలో, ముఖ్యంగా చీరలలో మెరిసిపోతూ ఉంటుంది ఈ ఎవర్గ్రీన్ దివా. పాప్ ఆఫ్ పింక్, ఏ డ్యాష్ ఆఫ్ గ్రేస్ అంటూ తన అందాన్ని పొగడకుండానే తెగ పొగిడేసుకుంది. తన బ్యూటిఫుల్ స్మైల్తో పాటు, చక్కటి డ్యాన్స్తో అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. ఆమె అందమైన ఫోటోలను తన సోషల్ మీడియాలో ఫ్యాన్స్తో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా మాధు దీక్షిత్ గుజరాత్ బంధాని (బంధేజీ) పట్టుచీరలో మెరిసిపోతున్న ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. బ్రైట్ కలర్ ఆరు గజాల చీరలో మాధురి లుక్ అదిరిపోయిందంటున్నారు ఫ్యాన్స్. పింక్, పర్పుల్ కాంబినేషన్లో బంగారు రంగు అంచు చీరలో అద్భుతంగా కనిపించింది. పర్పుల్ హ్యూడ్ బ్లౌజ్, చక్కటి మేకప్, సాధారణ హెయిర్ బన్, యాంటిక్ జ్యూయల్లరీతో మరింత ఫ్యాషన్ను జోడించింది. దీంతో ఈ చీర ఎంత అనే ఆసక్తి నెలకొంది. గ్రాండ్ పీస్ ధర 75వేల రూపాయలట. కాగా జవనరి 22న అయోధ్యలో జరిగిన రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి భర్త శ్రీరామ్ తో కలిసి హజరైంది. View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) -
నీతా అంబానీ మొబైల్ రూ.400 కోట్లా? నిజమెంత?
భారతదేశంలో అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ ఫ్యామిలీ విలాసవంతమైన జీవితం గడుపుతారనే విషయం అందరికీ తెలిసిందే. ఖరీదైన బంగ్లా, అన్యదేశ్య కార్లతో పాటు, వాచ్లు, మొబైల్స్ ఫోన్స్ అన్నీ కూడా వారి రేంజ్కు తగ్గట్టుగానే ఉంటాయి. గతంలో నీతా అంబానీ ఉపయోగించే మొబైల్ ఫోన్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చలు జరిగాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నీతా అంబానీ రూ.400 కోట్లు విలువైన మొబైల్ ఉపయోగిస్తుందని గతంలో వార్తలు సోషల్ మీడియా వేదికగా ప్రచారమయ్యాయి. కానీ ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిసిపోయింది. ఎందుకంటే ఈమె యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ 15ప్రో మ్యాక్స్ ఉపయోగిస్తుందని సమాచారం. ఈ మొబైల్ ధర రూ.159900 నుంచి రూ.199900 వరకు ఉంటుంది. యాపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ భారతీయ మార్కెట్లో తయన్త ఖరీదైన మొబైల్స్ జాబితాలో ఒకటైన 'యాపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్' నేచురల్ టైటానియం, బ్లూ టైటానియం, వైట్ టైటానియం, బ్లాక్ టైటానియం అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇదీ చదవండి: రూ.4000 కోట్ల పెట్టుబడికి సిద్దమైన అంబానీ.. పెద్ద ప్లానే ఇది! ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ అనేది కొత్త పెరిస్కోప్ లెన్స్, టైటానియం ఛాసిస్, ఏ17 బయోనిక్ చిప్ వంటి మరిన్ని ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇవి 128, 256, 512 జీబీ స్టోరేజి కెపాసిటీతో లభిస్తాయి. కంపెనీ మొదటి సారి ఈ మొబైల్స్కి USB టైప్ సీ పోర్ట్, ఫ్రీమియం టైటానియం బాడీ, లేటెస్ట్ కెమెరా లెన్స్ వంటివి అందిస్తుంది. ఇవన్నీ కూడా కొనుగోలుదారులను తెగ ఆకర్శించేస్తున్నాయి. -
'శాండ్విచ్ బ్యాగ్' ధర వింటే షాకవ్వడం ఖాయం!
కొన్ని రకాల ఫ్యాషన్ బ్రాండ్ల ధర వింటే మతిపోతుంది. ఎందుకింత ధర అనిపించేలా ఉంటుంది. పైగా ఆ వస్తువుకి అంత ధర వెచ్చించాల్సినంత విశేషాలేంటో కూడా తెలియదు. అలాటి సరికొత్త ప్రొడక్ట్ని ఓ ప్రముఖ లగ్జరీ ఫ్యాషన్ కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే దాని ధర వింటే మాత్రం కంగుతినడం ఖాయం. ఇంతకీ ఆ కంపెనీ ఎలాంటి ప్రొడక్ట్ని రూపొందించింది. ఏంటా వస్తువు అంటే.. వివరాల్లోకెళ్తే.. ప్రెంచ్ ఫ్యాషన్ బ్రాండ్ లూయిస్ విట్టన్ శాండ్విచ్ బ్యాగ్ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ బ్యాగ్ని ఆవు చర్మంతో శాండ్విచ్ మాదిరిగా రూపొందించారు. దీన్ని ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ క్రియేటివ్ డైరెక్టర్ ఫారెల్ విలియమ్స్ రూపొందించారు. అతను ఇలా సరికొత్త మోడల్లో శాండ్విచ్ బ్యాగ్ని రూపొందిచడానికి క్లాసిక్ పేపర్తో చేసిన శాండ్విచ్ బ్యాగ్ ప్రేరణ అని పేర్కొంది. ఈ బ్యాగ్లను జనవరి 4న మార్కెట్లో విడుదల చేసి, అమ్మకానికి సిద్ధం చేశారు. ఈ బ్యాగ్ ఫీచర్స్ చూస్తే..ఆవు చర్మంతో తయారయ్యిన లెదర్ బ్యాగ్ బ్రౌన్ కలర్లో ఉండగా, క్లోజ్ చేయడానికి నీలం కలర్ ఉంటుంది. ఆ బ్యాగ్పై లూయిస్ విట్టన్' 'మైసన్ ఫాండీ ఎన్ 1854' అక్షరాలు ఉంటాయి. జిప్తో కూడిన పాకెట్లు ఉంటాయి. లోపల వస్తువులు క్రమబద్ధంగా పెట్టుకునేలా డబుల్ ఫ్లాటెడ్ పాకెట్లు ఉంటాయి. ఈ బ్యాగ్ పొడవు 30 సెంటీమీటర్లు, ఎత్తు 27 సెంటీమీటర్లు, వెడల్పు 17 సెంటీమీటర్లు ఉంటుంది. కాగా, ఈ ఫ్రెంచ్ బ్రాండ్ లూయిస్ విట్టన్ బ్యాగ్ ధర ఏకంగా రూ 2,80,000 పలుకుతోంది. ఇది చూడటానికి మన ఇంట్లో ఉండే షాపింగ్ బ్యాగ్ల మాదిరిగానే ఉంటుంది. ఇప్పుడు ఈ శాండ్విచ్ బ్యాగ్ ధర నెట్టింట్ వైరల్గా మారింది. బహుశా ఇది ఏఐ టెక్నాలజీ రూపొందించిన బ్యాగ్ కాబోలని ఒకరూ, ఇలాంటి అత్యంత లగ్జరియస్ బ్యాగ్లు కూడా ఉండాలని మరొకరు కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: మిస్ అమెరికాగా ఎయిర్ఫోర్స్ అధికారిణి) -
ప్రయాణికులకు అలెర్ట్, పెరిగిన ఇండిగో విమాన సీట్ల ధరలు
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో వినియోగదారులకు భారీ షాకిచ్చింది. విమానంలోని ఆయా సీట్ల ధరల్ని భారీగా పెంచింది. దీంతో ఫ్రంట్ రో విండో సీటుకు రూ.2000 చెల్లించాల్సి ఉంటుంది. ఇండిగో సీట్ల ఎంపిక ఛార్జ్ ఇండిగో అదనపు స్థలాన్ని అందించే ‘ఎక్స్ఎల్’ సీట్లు లెగ్రూమ్ ఆధారంగా వివిధ సీట్ల కేటగిరీల కింద ప్రయాణికులకు సీట్లను అందిస్తుంది. దీంతో పెంచిన మొదటి వరుస ఎక్స్ఎల్ సీట్ల ఛార్జీలు ఇప్పుడు రూ .1400 నుండి రూ .2000 వరకు పెరిగాయి. మిడిల్ సీట్లకు రూ.150 నుంచి రూ.2000 వరకు ధరల్ని సవరించింది. కాగా, గతంలో ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్న ఇంధన ఛార్జీని ఉపసంహరించుకున్నట్లు ఇండిగో ఇటీవల ప్రకటించింది. దీంతో టికెట్ ధరలు కనిష్టంగా రూ.300 మేర తగ్గగా.. దూర ప్రాంతాల్ని బట్టి ధర రూ.1000కి పెరిగాయి. అయితే ఇటీవల ఇంధన ధరలు తగ్గడంతో ఇంధన ఛార్జీలను ఉపసంహరించుకుంది. -
దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
గత కొద్ది కాలంగా కొనుగోలు దారులకు పసిడి ధరలు షాకిస్తున్న విషయం తెలిసిందే. అయితే కొత్త ఏడాది ప్రారంభంతో పెరిగిపోతున్న బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా దేశీయంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి పరిశీలిస్తే..అంతర్జాతీయ మార్కెట్లో నేడు (డిసెంబర్ 26) స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2,055 డాలర్ల పైన కొనసాగుతోంది. దేశీయ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,200 ఉండగా.. స్వచ్ఛమైన బంగారం 24 క్యారెట్ల ధర రూ. 63,490గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,350లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,640గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,800లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 64,150గా నమోదైంది. ముంబై, బెంగళూరు, కేరళ, హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 58,200 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 63,490గా కొనసాగుతోంది. బంగారం ధర స్థిరంగా.. వెండి ధర మాత్రం బంగారం ధర స్థిరంగా ఉంటే.. వెండి ధర మాత్రం పెరిగింది. మంగళవారం దేశీయ మార్కెట్లో కిలో వెండిపై రూ. 200 పెరిగి.. రూ. 79,200లుగా ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్కతా, పుణెలో కిలో వెండి ధర రూ. 79,200గా ఉంది. బెంగళూరులో మాత్రం అత్యల్పంగా 76,750గా ఉంది. ఇక చెన్నై, కేరళ, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 80,700 వద్ద కొనసాగుతోంది. -
చుక్కలు చూపించిన పప్పులు, కూరగాయలు!
నిత్యావసర సరుకుల ధరల ప్రభావం సామాన్యుల జీవితాలపై ఎంతగానో ప్రభావం చూపుతుంది. ఆహార ద్రవ్యోల్బణంలో 2023వ సంవత్సరం అనేక రికార్డులను బద్దలు కొట్టింది. పప్పులు, టమాటాలు, అల్లం, ఉల్లి, బీన్స్, క్యారెట్, మిర్చి, టమాటా ఇలా రోజువారీ ఉపయోగించే అనేక నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. ధరలు ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టి, ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. కిలో రూ. 300 దాటిన టమాటా సాధారణ రోజుల్లో కిలో రూ. 20 నుంచి 30కి విక్రయించే టమాటా ఈ ఏడాది ఖరీదు పరంగా అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. ఆగస్టు చివరిలో కిలో రూ.250 నుంచి 260 వరకూ పలికింది. దేశంలోని కొన్ని నగరాల్లో టమాటా ధర కిలో రూ.300 దాటింది. ఇలా ధరలు ఎందుకు అదుపు తప్పుతున్నాయనే దానిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అప్పట్లో హిమాచల్ ప్రదేశ్లో కొండచరియలు విరిగిపడటం, భారీ వర్షాల కారణంగా కూరగాయల రవాణాకు పలు ఇబ్బందులు ఎదురయ్యాయి. కొండవాలు రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు పంటలకు నష్టం కలిగించాయి. ఆకాశాన్ని అంటిన కంది పప్పు ధర 2023వ సంవత్సరంలో అన్ని పప్పుల ధరలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా కంది పప్పు ధర 2023వ సంవత్సరంలో అన్ని రికార్డులను అధిగమించింది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది జనవరి 12న ఢిల్లీలో కంది పప్పు కిలో ధర రూ.118గా ఉంది. జూలై 12న ఢిల్లీలో కిలో కంది పప్పు ధర రూ.100కి చేరింది. ఈ పప్పు ధర ఇప్పటికీ ఆకాశంలోనే ఉంది. కందిపప్పు చిల్లర ధర కిలో రూ.170 నుంచి రూ.300 వరకు ఉంది. ఇతర పప్పుల ధరలు కూడా అధికంగానే ఉన్నాయి. పొలాల నుంచి అల్లం చోరీ 2023లో అల్లం ధర సామాన్యులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఈ ఏడాది అల్లం ధర కిలో రూ. 400కు చేరుకుంది. ఏడాది చివరి భాగంలో ధరల్లో తగ్గుదల కనిపించింది. కాగా ఆన్లైన్లో కిలో వెల్లుల్లి ధర రూ.320 నుంచి రూ.500 వరకు పలుకుతున్న పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది జూలైలో అల్లం ధర రూ.300 నుంచి రూ.400కి చేరింది. ధర పెరిగిన నేపధ్యంలో కర్ణాటకలో పొలాల నుంచి అల్లం చోరీకి గురైన సంఘటనలు వెలుగు చూశాయి. గణనీయంగా కూరగాయల ద్రవ్యోల్బణం ఈ ఏడాది జూలైలో కూరగాయల ద్రవ్యోల్బణం గణనీయంగా పెరిగింది. జూలై 2023లో వార్షిక ప్రాతిపదికన 37.34 శాతానికి పెరిగింది. ఇది కాకుండా ఆహార, పానీయాల ద్రవ్యోల్బణం స్థాయి జూన్ 2023లో 4.63 శాతం నుండి జూలై 2023 నాటికి 10.57 శాతానికి పెరిగింది. ధాన్యాల ద్రవ్యోల్బణం జూన్ 2023లో 12.71 శాతం నుంచి 13.04 శాతానికి పెరిగింది. ఇది కూడా చదవండి: ఆ రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు... తీవ్రమైన చలిగాలులు! -
గోల్డ్ బాండ్ @ రూ. 6,199
ముంబై: తదుపరి దశ సావరిన్ గోల్డ్ బాండ్ల(ఎస్జీబీ)కు రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) తాజాగా ధరను ప్రకటించింది. ఒక గ్రాము బాండుకు రూ. 6,199ను నిర్ణయించింది. వీటి సబ్్రస్కిప్షన్ ఈ నెల సోమవారం(18న) ప్రారంభమై ఐదు రోజులపాటు కొనసాగనుంది. ఎస్జీబీ పథకం 2023–24– సిరీస్–3లో భాగంగా ఆర్బీఐ ఈ నెల 18–22 మధ్య పసిడి బాండ్ల సబ్ర్స్కిప్షన్కు తెరతీస్తోంది. స్మాల్, పేమెంట్, గ్రామీణ బ్యాంకులు మినహా షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు వీటిని విక్రయిస్తాయి. వీటితోపాటు స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్, క్లియరింగ్ కార్పొరేషన్, ఎంపిక చేసిన పోస్టాఫీసులు, స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ ద్వారా కొనుగోలు చేయవచ్చు. పూర్తి స్వచ్ఛత(999)గల పసిడి సగటు ముగింపు ధర ఆధారంగా గ్రాముకు రూ. 6,199 ధరను నిర్ధారించినట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఆర్బీఐతో చర్చల తదుపరి కేంద్ర ప్రభుత్వం గ్రాముకు రూ. 50 చొ ప్పున ఇన్వెస్టర్లకు డిస్కౌంట్ను ఆఫర్ చేసేందుకు నిర్ణయించింది. అయితే ఇందుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయడంతోపాటు.. డిజిటల్ విధానంలో చెల్లింపులు చేపట్టవలసి ఉంటుంది. వెరసి గోల్డ్ బాండ్ రూ. 6,149కు లభించనున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. కాగా.. ఎస్జీబీ సిరీస్–4లో భాగంగా వచ్చే (2024) ఫిబ్రవరి 12–16 మధ్య బాండ్లను ఆఫర్ చేయనున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. -
బీఎండబ్ల్యూ కార్లు ప్రియం
న్యూఢిల్లీ: బీఎండబ్ల్యూ అన్ని మోడళ్ల ధరలను 2% వరకు పెంచుతోంది. జనవరి 1 నుంచి సవరించిన ధరలు అమలులోకి రానున్నాయని కంపెనీ సోమవారం ప్రకటించింది. విదేశీ మారకపు రేట్లు, పెరుగుతున్న తయారీ ఖర్చులలో హెచ్చుతగ్గుల ప్రతికూల ప్రభావాలను పాక్షికంగా భర్తీ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీఎండబ్ల్యూ వెల్లడించింది. ఇప్పటికే మారుతీ, హ్యుందాయ్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా, ఆడి తదితర కంపెనీలు ధరలను పెంచుతున్నట్టు ప్రకటించాయి. -
ఎన్నికలు ముగియగానే పెరిగిన వంటగ్యాస్
ఎన్నికలు ముగియగానే పెరిగిన వంటగ్యాస్ -
హాట్టాపిక్గా మారిన మహేశ్ బాబు టీషర్ట్.. ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. టాలీవుడ్ టాప్ హీరోగా దూసుకుపోతున్న మహేశ్ తాజాగా యానిమల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో మహేశ్ బాబు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాడు. సింపుల్ టీ షర్ట్లో క్లాసీ లుక్స్తో కనిపించాడు. దీంతో మహేశ్ ధరించిన టీ షర్ట్ ధర ఎంత ఉంటుందబ్బా అంటూ నెటిజన్లు గూగుల్లో వెతకడం మొదలుపెట్టారు.సాధారణంగా సెలబ్రిటీలు వేసుకున్న దుస్తులు, వస్తువుల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఫ్యాన్స్లో ఎక్కువగా ఉంటుంది. అలా మహేశ్ బాబు యానిమల్ ఈవెంట్కు ధరించిన టీషర్ట్ ధర ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్టాపిక్గా మారింది. ఇది 'గివెంచి' బ్రాండ్కు సంబంధించినది.చూడటానికి సింపుల్గా ఉన్నా దీని ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే ఈ టీషర్ట్ ధర వందల్లో కాదు సుమారు రూ. 47వేలు మరి. ఈ విషయం తెలిసి.. సింపుల్ టీషర్ట్ ఏకంగా ఇంత కాస్ట్లీనా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. -
లేని బ్రాండ్లకు ధరల పెంపా!?
సాక్షి, అమరావతి : ఎన్టీఆర్ హయాంలోలాగ తాను తలచుకుంటే ఎవరినైనా సీఎం కుర్చీలో కూర్చోబెట్టగలనన్న అతివిశ్వాసం రామోజీరావులో ఇంకా చావలేదు. తన వికృత రాతలతో రాష్ట్ర ప్రభుత్వానికి మద్యంపై పైసా ఆదాయం రాకుండా చేయాలని.. అలా ప్రభుత్వ ఆదాయ మార్గాలకు గండికొడితే రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకోవచ్చని.. తద్వారా వాటిని అమలుచేయలేని పరిస్థితిల్లోకి నెడితే వైఎస్ జగన్ సర్కార్ ప్రజావిశ్వాసం కోల్పోతుందనేది రామోజీ దింపుడు కళ్లెం ఆశ. కానీ, ఇప్పుడున్నవి ఎన్టీఆర్ హయాం నాటి రోజులు కాదని ఆయన గుర్తించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన మనసంతా బాబును అర్జెంటుగా సీఎం కుర్చీపై కూర్చోపెట్టడంపైనే కేంద్రీకృతమై ఉంది. ఇందుకోసం ఆయన పడుతున్న ప్రయాస అంతాఇంతా కాదు. ఇందులో భాగమే ఆయన విషపుత్రిక ఈనాడులో అచ్చోసి ప్రజలకు ఏమాత్రం కిక్కివ్వని తాజా కథనం ‘ఆ కిక్కు ఎవరికో.. అస్మదీయుల బ్రాండ్ల ధరలు తగ్గింపు’.. బాగోతం. రాష్ట్రంలో మద్యం ధరలపై పన్నుల విధానాన్ని ప్రభుత్వం ఇటీవల హేతుబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీనికి మసిపూసి మారేడుకాయ చేసే క్రమంలో ‘పచ్చ’కిక్కు ఎక్కించుకుని ఉన్నవి లేనివి ఊహించుకుని పచ్చమీడియా చేతికొచ్చింది పిచ్చిరాతలు రాసిపారేసింది. అబద్ధాలను రంగరించి చంద్రబాబుకు ప్రీతిగా వండామని సంబరపడ్డాయి. కానీ, ఈ వంటకం వండే క్రమంలో పప్పులో కాలేశారు. అదేమిటంటే.. రాష్ట్ర మార్కెట్లో లేని మద్యం బ్రాండ్లు, దాదాపు బ్యాలెన్స్ స్టాక్లేని బ్రాండ్ల పేర్లను పేర్కొంటూ కథనాన్ని నమ్మించేందుకు ప్రయత్నించి ఎల్లో ముఠా అభాసుపాలైంది. ‘పచ్చ’ పైత్యంలోని అసలు వాస్తవాలు ఏమిటంటే.. ♦ మద్యం ఉత్పత్తులపై పన్నుల విధానాన్ని హేతుబద్ధీకరిస్తూ ప్రభుత్వం చాలా స్వల్పంగా ఏఆర్ఈటీ, ఏఈడీ, వ్యాట్ పన్నులతోపాటు స్పెషల్ మార్జిన్ను సవరించింది. అన్ని బ్రాండ్ల మద్యం ఉత్పత్తుల బేసిక్ ధరపై పన్నుల శాతాన్ని నిర్ణయిస్తూ పన్నుల విధానంలో ఏకరూపత తీసుకొచ్చింది. దాంతో అతికొద్ది బ్రాండ్ల ధరలే స్వల్పంగా పెరిగాయి. అత్యధిక బ్రాండ్ల ధరలు యధాతథంగానే ఉన్నాయి. మొత్తం మీద ఆదాయం కొద్దీగా పెరిగినట్లు కనిపిస్తున్నా అత్యధిక బ్రాండ్ల మద్యం ధరల్లో మాత్రం ఏమాత్రం మార్పులేదు. ♦ ఇక అస్మదీయుల బ్రాండ్ల ధరలు పెరగలేదంటూ పచ్చ పత్రికలు ప్రచురించిన మద్యం బ్రాండ్లు అసలు మార్కెట్లో లేనేలేవు. సంబంధిత కంపెనీలు ఆ మద్యం బ్రాండ్లను రెన్యూవల్ చేసుకోలేదు. ఆ కంపెనీల మద్యం నిల్వలు దాదాపు ముగింపునకు చేరుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో హోల్సేల్, రిటెయిల్ మద్యం దుకాణాల్లో ఆ మద్యం బ్రాండ్ల నిల్వలు కూడా దాదాపులేవు. అంటే ఆ బ్రాండ్లు, వాటి ధరలు కేవలం కాగితాలపైనే కనిపిస్తున్నాయి తప్ప మార్కెట్లో అందుబాటులో లేవన్నది వాస్తవం. కానీ, ఆ బ్రాండ్ల ధరలు పెరగనే లేదంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు పచ్చ పత్రికలు యత్నించాయి. ♦ రాష్ట్రంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న మద్యం బ్రాండ్ల గురించి పచ్చ పత్రికలు కనీసం పేర్కొనలేదు. ఎందుకంటే ఆ బ్రాండ్ల మద్యం ధరలు ఏమాత్రం పెరగలేదు కనుక. ఆ విషయాన్ని ప్రజలకు తెలియకుండా ఉండేందుకే ఆ బ్రాండ్ల పేర్లను పచ్చ పత్రికలు ఉద్దేశపూర్వకంగా విస్మరించాయి. ♦ ఎంఎస్ బయోటెక్, ఈగిల్ డిస్టిలరీస్, ఎస్పీవై ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్, ఎస్ఎన్జీ సుగర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉత్పిత్తి చేసే మద్యం బ్రాండ్లకు సంబంధించి మార్కెట్లో అందుబాటులో ఉన్న వాటి ధరలు పెరగలేదు. ప్రస్తుతం రాష్ట్ర మార్కెట్లో అందుబాటులోలేని ఆ కంపెనీల బ్రాండ్ల ధరలే స్వల్పంగా పెరిగాయి తప్పా మార్కెట్లో ఉన్న బ్రాండ్ల ధరలు పెరగలేదు. ఉదా.. కింగ్ఫిషర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్, ఎస్ఎన్జే 10000 సూపర్ స్ట్రాంగ్ బీర్ ధరల గురించి పచ్చ పత్రికలు ప్రధానంగా రాశాయి. కానీ, ఆ బ్రాండ్లు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో దాదాపు అందుబాటులో లేనేలేవు. గతంలో తెచ్చిన స్టాక్ దాదాపు పూర్తయ్యింది. ♦ పన్నులను హేతుబద్ధీకరించడంతో అతికొద్ది కంపెనీల లీటర్ సైజు లిక్కర్ బాటిళ్ల ధరలు మాత్రమే స్వల్పంగా తగ్గాయి. రాష్ట్రంలో ఒక లీటర్ అంతకంటే పెద్ద పరిమాణంలో మద్యం బాటిళ్ల ఉత్పత్తి, అమ్మకాలు కేవలం నామమాత్రమే. ♦ ఇక మద్యం కంపెనీల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం దాదాపు చెల్లించేసింది. ఇటీవల రూ.175 కోట్లు చెల్లించడంతో బకాయిలన్నీ తీరిపోయాయి. ♦ కొన్ని కంపెనీలకు మద్యం ఉత్పత్తులపై కేసుకు రూ.250 చెల్లించమన్నారని పచ్చ పత్రికలు పేర్కొన్న విషయం పూర్తిగా అవాస్తవం. పూర్తి పారదర్శక విధానంలో ప్రభుత్వం మద్యం కంపెనీల నుంచి మద్యం కొనుగోలు చేస్తోంది. రాష్ట్రంలో దశలవారీగా మద్య నియంత్రణ విధానాన్ని కచ్చితంగా పాటిస్తూ ప్రభుత్వం మద్యం కొనుగోలు చేస్తోంది. -
మళ్లీ పెరుగుతున్న టమాటా రేట్లు
దీపావళి అనంతరం మార్కెట్లో టమాటా ధర ప్రతి ఏటా రూ.15 నుంచి రూ.20 వరకు పలుకుతుండగా, ఈ ఏడాది వర్షాభావంతో టమోటా పంట దెబ్బతింది. ఫలితంగా మహారాష్ట్రలోని నాగ్పూర్తో సహా విదర్భలోని రిటైల్ మార్కెట్లో టమోటాలు కిలోకు రూ.55 నుండి 60 వరకు అమ్ముడవుతున్నాయి. పెరుగుతున్న టమాట ధరలు ఉల్లి ధరలతో పోటీపడుతున్నట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని పలు ప్రాంతాల నుంచి టమాటాలను విక్రయించేందుకు నాగ్పూర్లోని కలమన మండీకి తీసుకువస్తుంటారు. అయితే ఈసారి చాలా తక్కువగా టమాటాలు వస్తుండటంతో వీటి ధరలు మళ్లీ పెరిగాయి. టమాటా వ్యాపారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో పెద్ద ఎత్తున టమోటాలు కలమన మండీకి వస్తుంటాయి. ఫలితంగా ధరలు తక్కువగా ఉంటాయి. కాగా పొలంలో టమోటాలు పండించిన రైతులు వాటిని మార్కెట్కు తీసుకురావాలంటే రవాణా ఖర్చులు భారీగా అవుతుంటాయి. ఈ కారణంగా రైతులు టమోటాలను రోడ్లపై పారవేస్తుంటారు. అయితే ఈసారి పరిస్థితి అలా లేదు. టమాటాలు డిమాండ్కు తగ్గట్టుగానే సరఫరా అవుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్ర, బెంగళూరు నుంచి టమోటాలు నాగపూర్కు విక్రయానికి వస్తున్నాయి. హోల్సేల్ మార్కెట్లో టమాటా ధర నాణ్యతను బట్టి రూ. 40 నుండి 45 వరకు ఉంటుంది. నాగపూర్ పట్టణానికి ప్రతీరోజు 15 నుండి 16 ట్రక్కుల టమాటాలు వస్తున్నాయి. పెరుగుతున్న టమాటా ధరలు ఉల్లికి గట్టి పోటీనిస్తున్నాయి. ఇప్పటికే రిటైల్ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.65 నుంచి రూ.70 పలుకుతోంది. మార్కెట్లో ఉల్లి రాక పెరగడంతో ధరలు తగ్గుముఖం పట్టాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: పెళ్లిలో రసగుల్లా కోసం కొట్లాట.. ఆరుగురికి తీవ్రగాయాలు! -
అందాల చందమామ కాజల్ ధరించిన చీర ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
చందమామ వన్నె తగ్గుతుందా? టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ అందం కూడా అంతే! బిడ్డకు తల్లి అయినా తరగని సొగసుతో మెరిసిపోతోంది! ఖాళీ లేని కాల్షీట్లతో కెరీర్లో దూసుకుపోతోంది. ఆ అవకాశాల వెల్లువకు ఆమె టాలెంట్, ఫిట్నెస్లే కాదు ఆమె క్రియేట్ చేసుకున్న ఫ్యాషన్ స్టయిల్ కూడా కారణమే! ఆ క్రెడిట్లో ఈ బ్రాండ్స్నీ భాగం చేయాల్సిందే! ఫ్యాషన్ విషయంలో నేను చాలా బద్ధకంగా ఉంటాను. షూటింగ్ లేనప్పుడు క్యాజువల్ వేర్లోనే ఉంటాను. ఎందుకంటే నాకు.. నేను ధరించే దుస్తులు సౌకర్యవంతంగా ఉండాలి. వరుణ్ బహ్లా.. .. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్స్లో ఒకరు. 2004లో తన పేరు మీదనే ఫ్యాషన్ హౌస్ని ప్రారంభించి, అనతి కాలంలోనే సూపర్ ఇమేజ్ను సంపాదించాడు. దాదాపు బాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ కనీసం ఒక్కసారైనా ఈ డిజైనర్ వేర్ని ధరించి ఉంటారు. దేశంలోని ప్రముఖ నగరాలతో పాటు అమెరికా, లండన్లోనూ స్టోర్స్ ఉన్నాయి. ధర లక్షల్లోనే! ఆన్లైన్లోనూ లభ్యం. కాజల్ ధరించిన వరణ్ బహ్లా డిజైనర్ చీర ధర రూ. 2,10,000/- మినరలి జ్యూయెల్స్ వెబ్సైట్ ద్వారా ప్రారంభించిన వ్యాపారం.. తన అందమైన డిజైన్స్తో ఇప్పుడు సెలబ్రిటీలకూ మోస్ట్ ఫేవరెట్ అయింది. ఎవరికైనా నప్పే.. ఎవరైనా మెచ్చే ఆభరణాలను అందించడం ‘మినరలి’ జ్యూయెల్స్ ప్రత్యేకత. ఈమధ్యనే ముంబైలో ఒక స్టోర్ ఓపెన్ చేశారు. ఆన్లైన్లోనూ కొనుగోలు చేయొచ్చు. ఆభరణాల నాణ్యత, డిజైన్ను బట్టే ధరలు.జ్యూలరీ బ్రాండ్: మినరలి జ్యూయెల్స్ ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. --దీపిక కొండి (చదవండి: బుట్టబొమ్మ పూజా హెగ్డే ధరించిన చీర ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!) -
మహీంద్రా నుంచి ‘జీతో స్ట్రాంగ్’ వాహనం.. ధర ఎంతంటే?
బెంగళూరు: మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ (ఎంఎల్ఎంఎంఎల్) కొత్తగా సరకు రవాణా కోసం ’జీతో స్ట్రాంగ్’ వాహనాన్ని ప్రవేశపెట్టింది. జీతో ప్లస్ వాహనానికి కొనసాగింపుగా మరింత ఎక్కువ పేలోడ్ సామర్థ్యం, మరిన్ని ఫీచర్లతో దీన్ని రూపొందించినట్లు సంస్థ ఎండీ సుమన్ మిశ్రా తెలిపారు. వెర్షన్ను బట్టి (డీజిల్, సీఎన్జీ) దీని ధర రూ. 5.28 లక్షల నుంచి రూ. 5.55 లక్షల వరకు (పుణె ఎక్స్–షోరూం) ఉంటుంది. డీజిల్ వెర్షన్లో పేలోడ్ సామర్థ్యం 815 కేజీలుగాను, లీటరుకు 32 కి.మీ. మైలేజీ ఉంటుంది. సీఎన్జీ వెర్షన్ పేలోడ్ సామర్థ్యం 750 కేజీలుగా, మైలేజీ 35 కి.మీ.గా ఉంటుంది. మూడేళ్లు లేదా 72,000 కి.మీ. వారంటీ, అలా గే డ్రైవరుకు ఉచితంగా రూ. 10 లక్షల ప్రమాద బీమా కవరేజీ ఇస్తున్నట్లు సంస్థ తెలిపింది. -
ఇలాంటి షూస్ ఎప్పుడైనా చూసారా! ధర ఎక్కువే..
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో కొత్త కొత్త ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల సరికొత్త 'మూన్వాకర్స్' అనే ఎలక్ట్రిక్ షూస్ పుట్టుకొచ్చాయి. ఈ లేటెస్ట్ షూస్ ధర ఎంత? దీన్ని ఎలా ఉపయోగించాలనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అమెరికన్ బేస్డ్ కంపెనీ 'షిఫ్ట్ రోబోటిక్స్' అభివృద్ధి చేసిన మూన్వాకర్స్ షూస్ సాధారణ ఎలక్ట్రిక్ షూస్ కంటే కూడా వేగంగా ఉంటాయని సంస్థ ప్రకటించింది. ఇది రోజు వారీ వినియోగానికి ఉపయోగించే షూస్ మాదిరిగానే ఉపయోగించాల్సి ఉంటుంది. స్కేటింగ్ షూస్ మాదిరిగా ఉపయోగించవచ్చనుకుంటే పొరపాటే. మూన్వాకర్స్ ఎలక్ట్రిక్ షూస్ బ్యాటరీ మీద ఆధారపడి, ఏఐ టెక్నాలజీతో పనిచేస్తాయి. ఇవి ఐపీ45 వాటర్ రెసిస్టెంట్ కావడం వల్ల వర్షం సమయంలో నీటిలో తడిచినా సురక్షితంగా ఉంటాయి. ఛార్జింగ్ కోసం USB టైప్-సీ పోర్ట్ ఇందులో లభిస్తుంది. ఇదీ చదవండి: నడిరోడ్డుపై ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు - వైరల్ వీడియో రెండు కేజీల బరువున్న ఈ షూస్ కేవలం EU 42-45 సైజులో పురుషులకు మాత్రమే తయారు చేశారు. అంతే కాకుండా ఈ షూస్ ధరించేవారు బరువు 100 కేజీల కంటే ఎక్కువ ఉండకూడదు. దీని ధర 1399 డాలర్లు (భారతీయ కరెన్సీ ప్రకారం రూ.1.16 లక్షలు). -
దేశంలో బంగారం ధరలు పెరిగాయా? తగ్గాయా?
జాతీయ, అంతర్జాతీయ అంశాలతో పసిడి ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో పాటు దసరా, దీపావళి పండుగలతో పెట్టి బడిదారులు అనిశ్చితి సమయాల్లో లాభాల్ని అందించే బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో పసిడి ధరలు పరుగులు తీస్తున్నాయి. ఇక దేశంలో బంగారం ధరల విషయానికొస్తే.. ఆదివారం ఒక గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ.5,660 ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.6,175గా ఉంది. అదే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,600 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,750గా ఉంది ముంబై, కోల్కతా,కేరళ, బెంగళూరు, హైదరాబాద్లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,600 ఉండగా 24 క్యారెట్ గోల్డ్ రూ.61,750గా ఉంది ఢిల్లీ, చెన్నైలలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.56,750 ఉండగా రూ.24 క్యారెట్ల బంగారం ధర రూ.61,900గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,600 ఉండగా 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర రూ.61,750గా ఉంది. -
తగ్గిన పెట్రోల్, డీజిల్ విక్రయాలు - కారణం ఏంటంటే?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 2023 అక్టోబర్ 1–15 మధ్య పెట్రోల్, డీజిల్ అమ్మకాలు పడిపోయాయి. ప్రభుత్వ రంగంలోని మూడు చమురు సంస్థల గణాంకాల ప్రకారం.. గతేడాది అక్టోబర్ 1–15తో పోలిస్తే ఈ నెల తొలి అర్ధ భాగంలో పెట్రోల్ విక్రయాలు 9 శాతం క్షీణించి 1.17 మిలియన్ టన్నులుగా ఉంది. డీజిల్ అమ్మకాలు 3.2 శాతం తగ్గి 2.99 మిలియన్ టన్నులకు వచ్చి చేరింది. 2022 అక్టోబర్లో దుర్గా పూజ/దసరా, దీపావళి ఒకే నెలలో రావడంతో పెట్రోల్, డీజిల్ వినియోగం అధికంగా ఉంది. 2023 సెప్టెంబర్ 1–15తో పోలిస్తే ఈ నెల 1–15 మధ్య పెట్రోల్ విక్రయాలు 9 శాతం తగ్గాయి. డీజిల్ అమ్మకాలు మాత్రం 9.6 శాతం ఎగశాయి. 2022 అక్టోబర్తో పోలిస్తే ఈ నెల అర్ధ భాగంలో విమాన ఇంధన డిమాండ్ 5.7 శాతం దూసుకెళ్లి 2,95,200 టన్నులు నమోదైంది. నెలవారీగా పెరుగుతూ.. నీటి పారుదల, సాగు, రవాణా కోసం ఇంధనాన్ని ఉపయోగించే వ్యవసాయ రంగంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో డీజిల్ అమ్మకాలు సాధారణంగా రుతుపవన నెలలలో క్షీణిస్తాయి. అలాగే వర్షం కురిస్తే వాహనాల రాకపోకలు మందగిస్తాయి. దీంతో గత మూడు నెలల్లో డీజిల్ వినియోగం తగ్గింది. రుతుపవనాలు ముగిసిన తర్వాత వినియోగం నెలవారీగా పెరిగింది. 2023 అక్టోబర్ 1–15 మధ్య పెట్రోల్ వినియోగం 2021 అక్టోబర్తో పోలిస్తే 12 శాతం, 2019 అక్టోబర్తో పోలిస్తే 21.7 శాతం పెరిగింది. అలాగే డీజిల్ వాడకం 2021 అక్టోబర్తో పోలిస్తే 23.4 శాతం, 2019 అక్టోబర్తో పోలిస్తే 23.1 శాతం అధికమైంది. విమాన ఇంధన వినియోగం 2021 అక్టోబర్తో పోలిస్తే 36.5 శాతం అధికంగా, 2019 అక్టోబర్తో పోలిస్తే 6.6 శాతం తక్కువ నమోదైంది. వంటకు ఉపయోగించే ఎల్పీజీ విక్రయాలు 1.2 శాతం పెరిగి 1.25 మిలియన్ టన్నులుగా ఉంది. -
ఇంకా పెరగాలి ఓటు ధర!
ఓ జర్నలిస్టు... ఓ (అ)సామాన్య ఓటరును ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఓటును నోటుకూ, ఓ రేటుకూ అమ్ముకుంటున్నారనీ, ఈ పద్ధతి తప్పు అని తెలియజెప్పాలని సదరు జర్నలిస్టు ఉద్దేశం. అదే విషయాన్ని అతణ్ణి అడిగాడు. ‘‘సార్... పేపర్లలో టీవీల్లో... మీరే దాన్ని ‘విలువైన ఓటు’, ‘విలువైన ఓటు’ అంటుంటారా, లేదా? మరి అంత విలువైనదాన్ని ఫిరీగా ఇచ్చేయడమేంటి?... నాన్చెంచ్’’ ‘‘ఓటు ధర ఇలా పెరిగిపోవడం ఓ చెడు సంకేతం కాదా?’’ ‘‘ఎంతమాత్రమూ కాదు. నిజానికి నా ఒపీనియనింగు పెకారం ఓటింగు ప్రైసింగు వింకా పెరగాలి. ఒకప్పటి రేట్లూ..ఇప్పటి ధరలూ, ఇప్పటికి తరిగిపోయిన రూపాయి విలువా.. వీటన్నింటినీ కూలంకచంగా పరిచీలింపచేసి, ఏ ఆడమ్ చ్మిత్తుతోనో, అమర్తచేనుతోనో లెక్కలు కట్టించారనుకోండి, పెరిగిన ద్రవ్యోల్బణం పెకారం.. ప్చ్..ఇప్పటి మన ఓటు ధర చాలా తక్కువని తెలుతుంది. ఇంకో విషయం.. ఓటు ధర బాగా పెరిగిందనుకోండి.. ‘అమ్మో.. మా చీటు ఇంతటి వ్యాల్యుయేషనబుల్ కదా’ అంటూ, దాన్ని నిలబెట్టుకోవడం కోసం మమ్మల్ని మరింత చంతృప్తిపరచేలా పాలిస్తుంటారు సార్ నేతలు’’ ‘‘అదేంటీ... ఇలా చెబుతున్నారు?’’ ‘‘సార్... మీకు మీ ఆఫీసువాళ్లు ఏడాదికోసారి బోనచు ఇస్తుంటారా, లేదా? దాన్ని మీరు తీసుకుంటారా లేక ‘అబ్బే..అప్పనంగా వచ్చింది మాకెందుకండీ’ అని వదిలేస్తారా?’’ ‘‘తీసుకుంటాం’’ ‘‘మాకు నెలనెలా వచ్చే మా పింఛనే జీతమనుకుందాం. జన్మకో శివరాత్రి అన్నట్టుగా ఎప్పుడో... ఐదేళ్లకోసారి బోనచుగా ఏ ఐదువేలో, ఆరువేలో ఇస్తారు. మీరు ఏడాదికోసారి బోనచు రాకపోతేనే ఎంతో అల్లల్లాడిపోతారు కదా. మాకేమో ఏదో ఓ రెణ్ణెల్ల పింఛన్ను..అది కూడా ఐదేళ్లకు..మచ్చుకు కొద్దిగా బోనచులాగా పడేస్తే..మీరీమాత్రానికే ఇంతగా విదైపోతుంటారెందుకో నాకు అర్థంకావడం లేదు’’ ‘‘ఇలా ఓటుకు ధర పెరుగుతూ పోవడం ప్రజాస్వామ్యానికి అనర్థం కాదా?’’ ‘‘ఓటును అమ్మడం, అమ్ముకోవడం అని మాటిమాటికీ అనకండి సిరాగ్గా! అమ్ముతున్నాడంటూ బదనాం చేయడానికి ఓటరే దొరికాడా మీకు తేరగా? అసలుఓటును అమ్ముకోడం అనడమేంటి? బార్బేరియన్’’ అన్నాడు చిరాగ్గా. ‘‘మరి ఏమనాలి?’’ ‘‘సార్.. నిజానికి ఇదొక వెకనమిక్ యాక్టివిటీ. అనగా... ఓ ఆర్థిక కార్యెకలాపం. ఉదాహరణకు..ఓ విలువైన పనికి టెండర్లు పిలుస్తారు. బిడ్డింగు వేస్తారు. ఎవరు ఎక్కువ లాభదాయకంగా కోటింగు చేస్తే, వాళ్లకు ఇస్తారు. ఓటు విషయంలోనూ అదే జరుగుతోందని ఎందుకనుకోరు? ‘అరె ఓ విలువైన పనికి బిడ్డింగు జరిగింది, ఎవరు ఎక్కువగా ఇస్తే, వాళ్లకు ఓటిచ్చారు’ అని మీరెందుకనుకోరు?’’ ‘‘బిడ్డింగులో ఎవరు లాభదాయకంగా కోట్ చేస్తే వారికే పని అప్పగిస్తారు. కానీ ఓటు విషయంలో అభ్యర్థులందరినుంచీ డబ్బులు తీసుకుంటారు కదా ఓటర్లు?’’ ‘‘నేను ముందే చెప్పాను కదా... ఇదొక ఆర్థిక కార్యెకలాపం అని. ‘ఓట్లు అమ్ముకుంటుంటారూ, అమ్ముకుంటున్నారం’టూ అదేపనిగా ఓటరును బ్లేమింగు చేస్తుంటారుగానీ..వాస్తవానికి ఏ ముగ్గురో, నలుగురో పోటీపడి ఆక్షనింగులో మానుంచి ఎమ్మెల్లే పదవిని కొనుక్కుంటున్నారననే ‘ఓ–కామర్స్’లా దీన్ని మీరెందుకు చూడరు? అరె... మార్కెట్ అన్నాక వొడిదొడుకులుంటాయ్. డిమాండును బట్టి ‘ఎలక్షన్ ఓటు రేటు సూచీ’ విండెక్చు ప్రకారం.. ఒక్కోసారి ఓటు ధర అమాంతం పెరుగుతుంది. ఒక్కోసారి పడిపోతుంది. కొన్నిసార్లు కొందరు ఓడిన అభ్యర్థులు తామిచ్చిన డబ్బులు తిరిగి వసూలు చేసుకున్న దాఖలాలు లేవా? మిగతా కామర్చు విషయాల్లోలాగే..చెరతులు వర్తిస్తాయనీ లేదా ‘ద వోటు ప్రైసెస్ ఆర్ సజ్జెట్టు టు మార్కెట్ రిచుకు’ అని పేపర్లలో మీరే రాస్తుంటారు కదా. ఇక్కడా అంతే. చేమ్ టు చేమ్. దీనికి మీరెందుకంతగా ఆశ్చర్యపోతుంటారెందుకో నాకర్థం కావడం లేదు’’ ‘‘మీరు పేపర్లు బాగా చదువుతూ, టీవీ ఎక్కువగా చూస్తుంటారు కదా? అందునా బిజినెస్ రిలేటెడ్ ప్రోగ్రాములు’’ ‘‘అవును... మీకెలా తెలుసు?’’ కాస్త సిగ్గు నటిస్తూ, కాంప్లిమెంటులా తీసుకున్నాడా ఎక్్చపర్టు!! -
ఒక్క నెయిల్ పాలిష్ ఇన్ని కోట్లా..!! ఆ డబ్బుతో మూడు బెంజ్ కార్లు కొనేయొచ్చు!
ఇప్పటి వరకు గ్లోబల్ మార్కెట్లో అత్యంత ఖరీదైన బైక్ లేదా కారు గురించి విని ఉంటారు. అయితే ప్రపంచంలో అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్ గురించి బహుశా విని ఉండకపోవచ్చు. ఈ కథనంలో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ప్రపంచంలో అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్ 'అజాచూర్'. దీని ధర రూ. 1.5 కోట్లకంటే ఎక్కువ. దీని ధర ఎందుకింత ఎక్కువగా ఉందంటే.. కారణం ఈ నెయిల్ పాలిష్లో మొత్తం 1,118 వజ్రాలు ఉంటాయని తెలుస్తోంది. అంతే కాకుండా దీని క్యాప్ కూడా డైమండ్ కావడం ఇక్కడ విశేషం. దీనిని లాస్ ఏంజెల్స్కు చెందిన డిజైనర్ అజాచూర్ పోగోసియన్ రూపొందించారు. ఈ నెయిల్ పాలిష్ సీసా కూడా చాలా ప్రత్యేకంగా తయారు చేసి ఉంటారు. కావున సీసా కాలి అయిపోయిన తరువాత కూడా దాచుకోవచ్చు. ఈ ఒక్క నెయిల్ పాలిష్ కొనే డబ్బుతో ఏకంగా మూడు మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఏ కార్లను కొనుగోలు చేయొచ్చు. ఇదీ చదవండి: ఒక్క ఆలోచన రూ.200 కోట్ల సామ్రాజ్యంగా.. దంపతుల ఐడియా అదుర్స్! 2012లో తయారైన ఈ నెయిల్ పాలిష్ని ఇప్పటి వరకు 25 మంది కొనుగోలు చేసినట్లు సమాచారం. సాధారణ ప్రజలు ఇలాంటి ఖరీదైన నెయిల్ పాలిష్ కొనుగోలు చేయడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. కానీ డబ్బున్న సంపన్నులు అందరిలోకంటే ప్రత్యేకంగా కనిపించడానికి ఇలాంటి వాటిని కొనుగోలు చేస్తూ ఉంటాయి. -
మహాత్మా గాంధీ వీలునామా ఏ భాషలో రాశారు? ఎంతకు విక్రయమయ్యింది?
దేశవ్యాప్తంగా నేడు (అక్టోబర్ 2) గాంధీ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. పలు పాఠశాలల్లో గాంధీజీని గుర్తుచేస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మనం గాంధీజీ వినియోగించిన వస్తువులకు సంబంధించిన వేలం వివరాలను తెలుసుకుందాం. నాటి రోజుల్లో గాంధీ వినియోగించిన పలు వస్తువులు అత్యధిక ధరలకు వేలంలో అమ్ముడయ్యాయి. గతంలో నిర్వహించిన ఈ వేలంలో గాంధీజీ రాసిన వీలునామా అత్యధిక ధరకు అమ్ముడయ్యింది. ఈ వేలంలో గాంధీజీ వినియోగించిన బ్రౌన్ స్లిప్పర్, లెదర్ బ్యాగ్ కూడా అమ్ముడయ్యాయి. ఈ రెండింటికీ కొనుగోలుదారులు అధిక ధరలను చెల్లించారు. మహాత్మా గాంధీ గుజరాతీ భాషలో రాసిన రెండు పేజీల వీలునామా పత్రం అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. ఈ వీలునామా పత్రం వేలంలో 55 వేల పౌండ్లకు విక్రయమయ్యింది. ఇది ఇప్పటి మన కరెన్సీలో రూ. 55 లక్షల కంటే అధికం. దీని వేలం కోసం ప్రారంభమైన బిడ్డింగ్ 30 నుండి 40 వేల పౌండ్లతో ప్రారంభం కావడం విశేషం. అయితే ఈ వీలునామాను ఎవరు కొనుగోలు చేశారనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. అదే వేలంలో గాంధీజీ వినియోగించిన బ్రౌన్ లెదర్ స్లిప్పర్ కూడా అమ్ముడుపోయింది. దీని కోసం కొనుగోలుదారులు 19000 పౌండ్లు చెల్లించారు. దీన్ని భారత రూపాయిల్లోకి మార్చినట్లయితే దాదాపు రూ.19 లక్షలు అవుతుంది. బీబీసీలో ప్రచురితమైన నివేదిక ప్రకారం గాంధీ ముంబైలోని జుహు బీచ్ సమీపంలోని ఒక ఇంట్లో 1917 నుండి 1934 వరకు నివసించారు. అక్కడే గాంధీ వినియోగించిన చెప్పులు లభ్యమయ్యాయి. ఇది కూడా చదవండి: స్వాతంత్ర్యం వచ్చాక మహాత్మాగాంధీ ఏం చేశారు? -
డొమెస్టిక్ నేచురల్ గ్యాస్ ధర పెంపు
డొమెస్టిక్ నేచురల్ గ్యాస్ ధరను కేంద్ర ప్రభుత్వం పెంచింది. అక్టోబర్ నెలలో డొమెస్టిక్ నేచురల్ గ్యాస్ ధరను ఒక మెట్రిక్ మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ (mmBtu)కు 8.60 డాలర్లు (రూ.715) నుంచి 9.20 డాలర్లు (రూ.765) కు పెంచింది. 2023 అక్టోబర్ 1 నుంచి 31వ తేదీ మధ్య కాలానికి దేశీయ సహజ వాయువు ధరను పెంచినట్లు తెలియజేస్తూ కేంద్ర పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ శాఖ తాజాగా ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. సీఎన్జీ ధరలపై ప్రభావం ప్రభుత్వం డొమెస్టిక్ నేచురల్ గ్యాస్ను పెంచడంతో గ్యాస్ పంపిణీ సంస్థలు సీఎన్జీ, పీఎన్జీ ధరలను పెంచే అవకాశం ఉంది. నేచురల్ గ్యాస్ అనేది శిలాజ ఇంధనం. దీన్ని పలు పారిశ్రామిక అవసరాలతోపాటు వంట గ్యాస్ గానూ ఉపయోగిస్తారు. వరుసగా రెండో నెల డొమెస్టిక్ నేచురల్ గ్యాస్ ధర పెంచడం ఇది వరుసగా రెండో నెల. సెప్టెంబర్లో ఈ గ్యాస్ ధర ఒక మెట్రిక్ మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ (mmBtu)కు 7.85 డాలర్ల నుంచి 8.60 డాలర్లకు పెరిగింది. ఇప్పుడు అక్టోబర్లోనూ 8.60 డాలర్ల నుంచి 9.20 డాలర్లు పెరిగింది. -
పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం & వెండి ధరలు
Gold And Silver Price: వినాయక చవితి సంబరాలు దాదాపు ముగింపు దశకు వచ్చాయి, త్వరలో విజయదశమి కూడా రానుంది. ఈ తరుణంలో బంగారం ధర భారీగా తగ్గింది. ఈ రోజు (2023 సెప్టెంబర్ 28) 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ మీద ఏకంగా రూ. 600 తగ్గింది. ప్రాంతాల వారీగా పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూసేద్దాం. 👉 విజయవాడలో ఒక గ్రాము 22, 24 క్యారెట్ ధరలు వరుసగా రూ. 5390 & రూ. 5880గా ఉంది. ఈ లెక్కన 10 గ్రామ్స్ గోల్డ్ ధర రూ. 53900, రూ. 5880. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు రూ. 600 తగ్గుదల కనిపించింది. హైదరాబాద్, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, విశాఖపట్టణంలో కూడా ఇదే ధరలు ఉంటాయి. 👉 వెండి విషయానికి వస్తే, హైదరాబాద్ & విజయవాడలో ఒక గ్రామ్ వెండి రూ. 76.50. అంటే 1 కేజీ వెండి ధర ఇక్కడ రూ. 76500. నిన్నటి కంటే ఈ రోజు వెండి ధర కేజీ మీద 500 తగ్గినట్లు స్పష్టంగా తెలుస్తోంది. 👉 చెన్నైలో ఒక గ్రాము 22 క్యారెట్ల & 24 క్యారెట్ల బంగారం ధర రూ. 5410 అండ్ రూ. 5902. దీని ప్రకారం 10 గ్రాముల బంగారం రూ. 54100 (22క్యారెట్స్) రూ. 59020 (24 క్యారెట్స్)గా ఉంది. 👉 ఒక గ్రామ్ వెండి ధర చెన్నైలో రూ. 76.50. అంటే 1 కేజీ వెండి ధర ఇక్కడ రూ. 76500. నిన్నటి కంటే ఈ రోజు వెండి ధర కేజీ మీద 500 తగ్గినట్లు స్పష్టంగా తెలుస్తోంది. 👉 దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఒక గ్రామ్ 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 5405 కాగా 24 క్యారెట్ బంగారం రూ. 5895గా ఉంది. 10 గ్రాముల పసిడి ఇక్కడ రూ. 54050 (22 క్యారెట్) రూ. 58950 (24 క్యారెట్). 👉 వెండి ఒక గ్రామ్ ధర ఢిల్లీలో రూ. 73.70. దీని ప్రకారం ఒక కేజీ వెండి ధర రూ. 73700. నిన్న కంటే నేడు వెండి ధర కేజీపై రూ. 500 వరకు తగ్గింది. మొత్తం మీద పండుగ సీజన్లో బంగారం వెండి ధరలు తగ్గడం పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి. -
పరిణీతి-రాఘవ్ చద్దా వెడ్డింగ్: ఒక్క నైట్కి హోటల్ సూట్ ఖర్చు ఎంతంటే?
Parineeti Chopra-Raghav Chadha Weddingబాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా (Parineeti Chopra) ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) పెళ్లి సందడి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే వీరి వెడ్డింగ్లో కీలకమైన మెహీందీ, హల్దీ వేడుకు ఫోటోలు నెట్లో సందడి చేస్తున్నాయి. ఈ జంట సెప్టెంబర్ 24న రాజస్థాన్ ఉదయ్పూర్ (Udaipur)లోని లీలా ప్యాలెస్ (Leela Palace) వేదికగా వివాహానికి సన్నాహాలు జోరందుకున్నాయి. ఇప్పటికే వధూవరులతోపాటు బంధుమిత్ర సపరివారం ఉదయ్పూర్లో ల్యాండ్ అయ్యారు. ముఖ్యంగా బఈ వివాహ వేడుక నిమిత్తం ఆప్ నాయకుడు సంజయ్ సింగ్ ఉదయ్పూర్ చేరుకున్నారు. రాఘవ్ , పరిణీతి వారి జీవితంలో కొత్త అధ్యాయంలోకి అడుగు పెట్టబోతున్నారంటూ వారికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇవాళ రేపు(శని, ఆది) వివాహ వేడుకలు జరుగాయని వెల్లడించారు. ఈసందర్బంగా ఉదయ్పూర్ మరోసారి వార్తల్లో నిలిచింది.ఈ సిటీలోని లీలా ప్యాలెస్, తాజ్ లేక్ ప్యాలెస్ లాంటి కొన్ని విలాసవంతమైన లగ్జరీ సూట్లను లాక్ చేసుకున్నారు. వీరి పెళ్లికి బుక్ చేసిన హోటల్లోని అత్యంత ఖరీదైన మహారాజా సూట్ అద్దెఎంత అనేది ఆసక్తికరంగా మారింది. హోటల్ సూట్ ఒక రాత్రికి రూ. 10 లక్షలు వసూలు చేస్తుందట. 3500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ హోటల్ ట్రావెల్ ప్లస్ లీజర్ వరల్డ్ సర్వే అవార్డ్స్ – 2023లో ర్యాంక్ .అంతేకాదు లీలా ప్యాలెస్ ప్రపంచంలోని అత్యుత్తమ 100 మరియు భారతదేశానికి ఇష్టమైన 5 హోటళ్లలో కూడా స్థానాన్ని కూడా సంపాదించింది. శిల్పకళా సౌందర్యానికి పాపులర్ అయిన లీలా ప్యాలెస్ హోటల్అతిథులకు రుచికరమైన వంటల్ని వడ్డించనున్నారు. VIDEO | “Raghav and Parineeti are set to step into a new chapter of their lives for which I want to extend my heartiest congratulations to them,” says AAP leader Sanjay Singh as he arrives in Udaipur to attend Raghav Chadha and Parineeti Chopra’s wedding. pic.twitter.com/vRn0MGcRmH — Press Trust of India (@PTI_News) September 23, 2023 డిజైనర్ దుస్తుల్లో పరిణీతి, రాఘవ్ చద్దా జంట , అతిథులకు నో- ఫోన్ రాఘవ్ మామ, ఫ్యాషన్ డిజైనర్ పవన్ సచ్దేవా, వరుడి కోసం అన్ని వివాహ దుస్తులను డిజైన్ చేసినట్టు వెల్లడించారు. ఇక పెళ్లి కూతురు పరిణీతి మనీష్ మల్హోత్రా సమిష్టిని ధరించనుంది. బేసిక్ సాలిడ్ పాస్టెల్ కలర్ లెహంగా, స్టేట్మెంట్ జ్యువెలరీ స్పెషల్ లుక్లో ఎట్రాక్షన్గా కనిపించనుందని టాక్. అంతేకాదు ఈ గ్రాండ్ వెడ్డింగ్కు హాజరయ్యే అతిథులు గోప్యతను పాటించాల్సి ఉంది. అందుకే నో-ఫోన్ విధానాన్ని పాటించాలని వారికి సూచించినట్టు పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. -
కొత్త మార్గాల్లో స్టార్ ఎయిర్ సర్వీసులు - ధరలు ఇలా!
బెంగళూరు: హైదరాబాద్–నాగ్పూర్–అజ్మీర్ రూట్లో సెప్టెంబర్ 30 నుంచి విమాన సేవలు ప్రారంభిస్తున్నట్లు సంజయ్ ఘొడావత్ గ్రూప్లో భాగమైన స్టార్ ఎయిర్ తెలిపింది. ప్రాంతీయ కనెక్టివిటీకి సంబంధించిన ఆర్సీఎస్–ఉడాన్ స్కీములో భాగంగా తమకు లభించిన 40 రూట్లలో ఇవి కూడా ఉన్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం హైదరాబాద్–నాగ్పూర్–అజ్మీర్ (కిషన్గఢ్) ఎకానమీ టికెట్టు ధర రూ. 5,499గా, బిజినెస్ క్లాస్ టికెట్టు రేటు రూ. 10,999గా ఉంటుంది. హైదరాబాద్–నాగ్పూర్ రూట్లో టికెట్ల రేట్లు వరుసగా రూ. 3,499 .. రూ. 8,999గా ఉంటాయి. -
పెరిగిన బంగారం & వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేడు..
ఇటు వినాయక చవితి మరోవైపు వస్తున్న విజయదశమి సందర్భంగా బంగారం ధరలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. గత ఐదు రోజుల నుంచి గోల్డ్ రేట్లు ఎక్కువవుతూనే ఉన్నాయి. ఈ రోజు పసిడి ధరలు ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉన్నాయి? తెలంగాణలో ఎలా ఉన్నాయనే మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ఈ రోజు (19 సెప్టెంబర్ 2023) ఒక గ్రామ్ 22, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 5520 & రూ. 6022గా ఉంది. అంటే నిన్నటి కంటే ఈ రోజు గోల్డ్ రేట్ రూ. 15 & రూ. 14 ఎక్కువ అని తెలుస్తోంది. దీని ప్రకారం నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం విలువ రూ. 55200 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60220. 👉హైదరాబాద్లో 10 గ్రాముల బంగారం 22 క్యారెట్స్ అండ్ 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 55200 & రూ. 60220గా ఉంది. విజయవాడలో కూడా ఇదే ధరలు ఉన్నాయి. 👉వెండి విషయానికి వస్తే, హైదరాబాద్ & విజయవాడలో ఒక గ్రామ్ వెండి రూ. 78.30. అంటే 1 కేజీ వెండి ధర ఇక్కడ రూ. 78300. నిన్నటి కంటే ఈ రోజు వెండి ధర కేజీ మీద 100 పెరిగినట్లు తెలుస్తోంది. 👉చెన్నైలో ఒక గ్రాము 22 క్యారెట్ల & 24 క్యారెట్ల బంగారం ధర రూ. 5550 అండ్ రూ. 6055. 10 గ్రాముల బంగారం రూ. 55500 (22క్యారెట్స్) రూ. 60550 (24 క్యారెట్స్) 👉ఢిల్లీలో ఒక గ్రామ్ 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 5535 కాగా 24 క్యారెట్ బంగారం రూ. 6037గా ఉంది. 10 గ్రాముల పసిడి ఇక్కడ రూ. 55350 (22 క్యారెట్) రూ. 60370 (24 క్యారెట్). 👉చెన్నైలో 1 గ్రామ్ వెండి రూ. 78.30. కావున కేజీ వెండి ధర రూ. 78300. నిన్నటి కంటే ఈ రోజు వెండి ధరలు కేజీపై రూ. 300 పెరిగింది. 👉ఢిల్లీలో వెండి ఒక గ్రామ్ ధర రూ. 74.80. దీని ప్రకారం ఒక కేజీ వెండి ధర రూ. 74800. నిన్న కంటే నేడు వెండి ధర రూ. 300 అధికం కావడం గమనార్హం. -
ఆన్లైన్ షాపింగ్ చేసేవారికి గుడ్న్యూస్.. ఫ్లిప్కార్ట్లో సరికొత్త ఫీచర్!
Flipkart price lock Feature: పండుగల సమయంలో ఆన్లైన్ షాపింగ్ చేసేవారి కోసం ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్ (Flipkart) సరికొత్త ఫీచర్ను తీసుకొస్తోంది. కస్టమర్లు తమకు కావాల్సిన వస్తువులు.. తాము కొనుగోలు చేసేంత వరకూ ధరలు పెరగకుండా లాక్ చేసుకునేలా 'ప్రైస్ లాక్' ఫీచర్ (price lock feature)ను ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తాజాగా ప్రకటించారు. (ఇంత కంటే చీప్ ఇంకేమైనా ఉందా? రూ. 6.6 కోట్ల విలువైన ఫ్లాట్లు రూ.100కే..) "పండుగ సీజన్లలో తమకు కావాల్సిన ఉత్పత్తులు అమ్ముడైపోయాయని లేదా నిమిషాల్లోనే అందుబాటులో లేకుండా పోతున్నాయని కస్టమర్ల నుంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. దీనికి పరిష్కారంగా ప్రైస్ లాక్ ఫీచర్తో కస్టమర్లు తమకు అవసరమైన ఇన్వెంటరీని లాక్ చేసుకోవచ్చు" అని ఫ్లిప్కార్ట్ చీఫ్ ప్రాడక్ట్ అండ టెక్నాలజీ ఆఫీసర్ (CPTO) జయందరన్ వేణుగోపాల్ ఫ్లిప్కార్ట్ మాతృ సంస్థ వాల్మార్ట్ నిర్వహించిన కన్వర్జ్ ఈవెంట్లో తెలిపారు. అయితే, ఈ ఫీచర్ను ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారనేది ఆయన చెప్పలేదు. 'ప్రైస్ లాక్' ఫీచర్ ఇలా.. ఫ్లిప్కార్ట్ తీసుకొస్తున్న 'ప్రైస్ లాక్' ఫీచర్ కింద కస్టమర్లు తమకు కావాల్సిన వస్తువులను లాక్ చేసుకునేందుకు కొంత మొత్తం ముందుగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత పండుగ సమయాల్లో ఆయా వస్తువులకు డిమాండ్ పెరిగినప్పటికీ, లాక్ చేసుకున్న కస్టమర్లకు అవి అందుబాటులో ఉండేలా చేస్తారు. అలాగే ధరలు పెరిగినప్పటికీ లాక్ చేసుకున్న ధరకే ఆయా వస్తువులను కొనుక్కోవచ్చు. సాధారణంగా ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ల అమ్మకాలలో 50 శాతం పండుగ సీజన్లలోనే జరుగుతాయి. -
టెక్నో మెగాబుక్ టీ1 ల్యాప్టాప్స్ - వివరాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం చైనాకు చెందిన ట్రాన్సన్ గ్రూప్ బ్రాండ్ టెక్నో తాజాగా మెగాబుక్ టీ1 సిరీస్ ల్యాప్టాప్స్ను ప్రవేశపెట్టింది. 11వ తరం ఇంటెల్ ప్రాసెసర్స్తో ప్రీమియం అల్యూమినియం మెటల్ కేసింగ్తో రూపొందాయి. వేరియంట్నుబట్టి 16 జీబీ వరకు ర్యామ్, 1 టీబీ వరకు స్టోరేజ్ స్పేస్తో వీటిని విడుదల చేసింది. ధర రూ.37,999 నుంచి మొదలై రూ.59,999 వరకు ఉంది. 17.5 గంటల బ్యాటరీ లైఫ్, 14.8 మిల్లీ మీటర్ల మందం, 1.48 కిలోల బరువు, 2 ఎంపీ ఫిజికల్ ప్రైవసీ కెమెరా, ఫింగర్ ప్రింట్ పవర్ బటన్, 180 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్, 9 పోర్ట్స్ వంటి హంగులు ఉన్నాయి. అమెజాన్ స్పెషల్ ఉత్పాదనగా విడుదల చేశారు. -
‘వర్జీనియా’కు రికార్డు ధర
జంగారెడ్డిగూడెం: ఈ ఏడాది వర్జీనియా పొగాకుకు రికార్డుస్థాయిలో ధర పలకడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని ఐదు వర్జీనియా పొగాకు వేలం కేంద్రాల్లో పొగాకు వేలం దశల వారీగా ముగిసింది. గత ఏడాది కంటే కేజీ సరాసరి ధర రూ.50 పైగానే లభించింది. ఎన్ఎల్ఎస్ (ఉత్తర ప్రాంత తేలిక నేలలు) ప్రాంతంలో పండే వర్జీనియాకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. ఈ పరిధిలో జంగారెడ్డిగూడెం 1, 2 వేలం కేంద్రాలు, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి వేలం కేంద్రాలు ఉన్నాయి. ఈ వేలం కేంద్రాల పరిధిలో మొత్తం రూ.1,422.53 కోట్ల విలువైన పొగాకు అమ్మకాలు జరిగాయి. ఎన్ఎల్ఎస్ పరిధిలో 55 మిలియన్ కిలోల పొగాకును రైతులు అమ్ముకున్నారు. గత ఏడాది ఎన్ఎల్ఎస్ పరిధిలో కేజీ సరాసరి ధర రూ.191.72 లభించగా, ఈ ఏడాది కేజీ సరాసరి ధర రూ.248 లభించింది. అంటే ఈ ఏడాది కేజీకి రూ.56.28 అధికంగా లభించింది. -
200 రూపాయలు తగ్గిన వంట గ్యాస్ సిలిండర్ ధర.. ఇంకా ఇతర అప్డేట్స్
-
గ్యాస్ బండ రూ. 200 తగ్గింది
వంటగ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు నిర్ణయానికిఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదు. ఇది ఓనం, రక్షాబంధన్ పండుగల సందర్భంగా మహిళలకు మోదీ ప్రభుత్వం ఇస్తున్న కానుక.– అనురాగ్ ఠాకూర్, కేంద్ర మంత్రి న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ.200 చొప్పున తగ్గించింది. ఈ నిర్ణయం బుధవారం నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం మంగళవారం సమావేశమైంది. మధ్యప్రదేశ్తోపాటు తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే చౌక ధరకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తామంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ హామీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో గ్యాస్ బండ ధరను రూ.200 చొప్పున తగ్గిస్తూ మోదీ సర్కారు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దేశంలో గత రెండేళ్లుగా గ్యాస్ సిలిండర్ ధర పెరగడమే తప్ప తగ్గిన దాఖలాలు లేవు. దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర ప్రస్తుతం రూ.1,103 ఉండగా, బుధవారం నుంచి రూ.903కు లభించనుంది. ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ లబ్ధిదారులు వంట గ్యాస్ సిలిండర్పై ఇప్పటికే రూ.200 చొప్పున రాయితీ పొందుతున్నారు. తాజా తగ్గింపు ధర వారికి కూడా వర్తిస్తుంది. అంటే ఒక్కో సిలిండర్ రూ.703కే పొందవచ్చు. అంతేకాకుండా ఉజ్వల యోజన కింద అదనంగా 75 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ పథకం కింద లబ్ధి పొందేవారి సంఖ్య 10.34 కోట్లకు చేరుకోనుంది. ఎన్నికలతో సంబంధం లేదు: మంత్రి ప్రజలకు ఉపశమనం కలి్పంచడానికే వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గించాలని నిర్ణయించినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ఈ నిర్ణయానికి ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఇది ఓనం, రక్షాబంధన్ పండుగల సందర్భంగా మహిళలకు మోదీ ప్రభుత్వం ఇస్తున్న కానుక అని వివరించారు. ప్రజలపై ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యంగా చేపట్టిన చర్యల్లో భాగంగానే గ్యాస్ ధరను తగ్గించినట్లు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రజల సంక్షేమం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి, అంకితభావానికి ఇదొక నిదర్శనమని స్పష్టం చేసింది. నిత్యావసరాలు సరసమైన ధరలకే ప్రజలకు అందాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొంది. సోదరీమణులకు ఉపశమనం: మోదీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.200 చొప్పున కేంద్ర ప్రభుత్వం తగ్గించడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. రక్షాబంధన్ పండుగ సందర్భంగా వెలువడిన ఈ నిర్ణయం కుటుంబాల్లో సంతోషాన్ని పెంచుతుందని చెప్పారు. అక్కాచెల్లెమ్మలకు మరింత ఉపశమనం లభిస్తుందని వెల్లడించారు. తన సోదరీమణులంతా సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలంటూ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందడానికే వంట గ్యాస్ సిలిండర్ ధరను ప్రభుత్వం తగ్గించినట్లు ప్రచారం సాగుతోంది. వంట గ్యాస్తోపాటు నిత్యావసరాల ధరల పెరుగుదలను కాంగ్రెస్ ప్రచారాస్త్రంగా మార్చుకుంది. కాంగ్రెస్ పాలిత రాజస్తాన్లో రూ.500కే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్, తెలంగాణలో అధికారంలోకి వస్తే రూ.500కు సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తోంది. కొన్ని నెలల క్రితం జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఇలాంటి హామీతో కాంగ్రెస్ విజయం సాధించింది. అందుకే కాంగ్రెస్ ప్రచార ఎత్తుగడలను తిప్పికొట్టి జనాన్ని తమవైపు తిప్పుకోవాలన్న వ్యూహంలో భాగంగానే సిలిండర్ ధరను మోదీ సర్కారు భారీగా తగ్గించినట్లు సమాచారం. ఈ తగ్గింపు వల్ల చమురు సంస్థలపై పడే భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించనుంది. ఎన్నికల వ్యూహమే!? రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందడానికే వంట గ్యాస్ సిలిండర్ ధరను ప్రభుత్వం తగ్గించినట్లు ప్రచారం సాగుతోంది. వంట గ్యాస్తోపాటు నిత్యావసరాల ధరల పెరుగుదలను కాంగ్రెస్ ప్రచారాస్త్రంగా మార్చుకుంది. కాంగ్రెస్ పాలిత రాజస్తాన్లో రూ.500కే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్, తెలంగాణలో అధికారంలోకి వస్తే రూ.500కు సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తోంది. కొన్ని నెలల క్రితం జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఇలాంటి హామీతో కాంగ్రెస్ విజయం సాధించింది. అందుకే కాంగ్రెస్ ప్రచార ఎత్తుగడలను తిప్పికొట్టి జనాన్ని తమవైపు తిప్పుకోవాలన్న వ్యూహంలో భాగంగానే సిలిండర్ ధరను మోదీ సర్కారు భారీగా తగ్గించినట్లు సమాచారం. ఈ తగ్గింపు వల్ల చమురు సంస్థలపై పడే భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించనుంది. -
నయా టమాటా
సాక్షి, అమరావతి: కొత్త రకం టమాటా వంగడాలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి. యూఎస్–6242, అన్సోల్, జువేల్ వంటి హైబ్రీడ్ రకాలను రబీలో పైలట్ ప్రాజెక్ట్ కింద సాగు చేయగా.. సూపర్ సక్సెస్ కావడంతోపాటు రైతులకు మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. దీంతో నూతన వంగడాల సాగును ప్రోత్సహించేందుకు ఉద్యాన శాఖ సన్నాహాలు చేస్తోంది. ఏడాది పొడవునా టమాటాలు పండుతున్నా.. మార్కెట్ ధరల్లో తీవ్రమైన వ్యత్యాసాలు ఉంటున్నాయి. కొన్ని రోజులు రైతులకు లాభాలు వస్తుండగా.. కొన్ని రోజులు కనీసం పెట్టుబడి కూడా దక్కడం గగనంగా మారుతోంది. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ.. స్థానిక వెరైటీలకు ప్రత్యామ్నాయంగా యూఎస్–6242, అన్సోల్, జువేల్ వంటి హైబ్రీడ్ రకాలను ఉద్యాన శాఖ అందు బాటులోకి తెచ్చింది. గుజ్జు ఎక్కువ.. ధర మక్కువ లోకల్ వెరైటీ టమాటా రకాల్లో గుజ్జు శాతం ఎక్కువ లేకపోవడం వల్ల ప్రాసెసింగ్కు పూర్తిస్థాయిలో పనికిరావడం లేదు. విధిలేని పరిస్థితుల్లో రైతుల నుంచి తక్కువ ధరకు ప్రాసెసింగ్ కంపెనీలు వీటిని కొనుగోలు చేస్తున్నాయి. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ గుజ్జు శాతం అధికంగా ఉండి ప్రాసెసింగ్తోపాటు స్థానికంగా వినియోగించుకునేందుకు వీలుగా ఉండే ఈ హైబ్రీడ్ రకాలను ప్రోత్సహించాలని ఉద్యాన శాఖ సంకల్పించింది. ఒకవేళ మార్కెట్లో కనీస ధర లేకపోయినప్పటికీ కిలోకు రూ.6 తక్కువ కాకుండా రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా సేకరించి ప్రాసెసింగ్ కంపెనీలకు విక్రయించేలా అవగాహన ఒప్పందం కూడా చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వేసవిలో చిత్తూరు జిల్లా పలమనేరు, వి.కోట మండలాల్లో 136 మంది రైతులను గుర్తించి వారి ద్వారా 250 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా హైబ్రీడ్ రకాలను సాగు చేశారు. సాగును ప్రోత్సహించేందుకు వివిధ రూపాల్లో హెక్టార్కు రూ.68,225 సబ్సిడీ ఇచ్చారు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా లోకల్ వెరైటీలైన సాహో, సాహితీ రకాలకు ఆశించిన స్థాయిలో పూత రాలేదు. వచ్చిన పూత, పిందె రాలిపోవడంతో ఎకరాకు 15–20 టన్నుల వరకు దిగుబడి వచ్చింది. ఇదే సమయంలో హైబ్రీడ్ టమాటాలు 35–40 టన్నుల వరకు దిగుబడులొచ్చాయి. వైరస్ను తట్టుకుని తీవ్రమైన ఉష్ణోగ్రతల సమయంలో కూడా ఆశించిన స్థాయిలో దిగుబడులొచ్చాయి. మరోవైపు లోకల్ వెరైటీ టమాటాలు 15 కేజీల బాక్స్ రూ.70–రూ.80 ధర లభించగా.. హైబ్రీడ్ వెరైటీలకు రూ.190–రూ.200 వరకు ధర పలికింది. హైబ్రీడ్ రకాలకు రెట్టింపు ధరలు రావడంతో రైతులు మంచి లాభాలను ఆర్జించారు. దీంతో రానున్న రబీలోనూ ఈ రకాలను ప్రోత్సహించాలని ఉద్యాన శాఖ సంకల్పించింది. హైబ్రీడ్ రకాలకు ఊతం సంప్రదాయ నాటు వెరైటీలకు ప్రత్యామ్నాయంగా హైబ్రీడ్ వెరైటీలను అందుబాటులోకి తీసుకొచ్చాం. రబీలో పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో రానున్న రబీలో కూడా హైబ్రీడ్ రకాల సాగును ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకున్నాం. ధర లేకపోతే ప్రాసెసింగ్ కంపెనీల ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటాం.– డి.మధుసూదనరెడ్డి, డీహెచ్ఓ, చిత్తూరు జిల్లా -
కొత్త లగ్జరీ కారు కొన్న పుష్ప నటుడు - ధర ఎంతైనా తగ్గేదేలే!
ప్రముఖ మలయాళ నటుడు 'ఫహద్ ఫాసిల్' పేరు తెలియకపోయినా.. 'పార్టీ లేదా పుష్పా' అనే డైలాగ్ వింటే మాత్రం వెంటనే ఆయనెవరో గుర్తొచ్చేస్తుంది. అంతగా పాపులర్ అయిన నటుడు ఇటీవల ఒక ఖరీదైన కారుని కొనుగోలు చేసాడు. దీని ధర ఎంత? ఇతర వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఫహద్ ఫాసిల్ కొనుగోలు చేసిన కారు 'ల్యాండ్ రోవర్' (Land Rover) కంపెనీకి చెందిన 'డిఫెండర్' అని తెలుస్తోంది. ఇటీవల వారి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న సందర్భంగా ఈ కారు కొనుగోలు చేసినట్లు సమాచారం. దీని ధర రూ. 2.11 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఇప్పటికే ఈ కారు అర్జున్ కపూర్, ప్రకాష్రాజ్, ఆయుష్ శర్మ, సన్నీ డియోల్, సునీల్ శెట్టి వంటి చాలామంది సెలబ్రిటీల గ్యారేజిలో ఉంది. గోండ్వానా స్టోన్ పెయింట్ స్కీమ్ కలిగిన ఈ కారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది భారతీయ మార్కెట్లో డిఫెండర్ 130, డిఫెండర్ 110 & డిఫెండర్ 90 అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఫహద్ ఫాసిల్ డిఫెండర్ 90 కొనుగోలు చేసినట్లు చిత్రాల ద్వారా తెలుస్తుంది. ఇది కూడా మూడు డోర్లు కలిగిన వేరియంట్. ఇదీ చదవండి: రూ. 76000 మ్యాక్బుక్ ఆర్డర్ చేస్తే.. వచ్చింది ఇదా? ఖంగుతిన్న కస్టమర్! ల్యాండ్ రోవర్ డిఫెండర్ 90 వేరియంట్ 5.0 లీటర్ వి8 ఇంజన్ కలిగి 296 హార్స్ పవర్ & 650 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పనితీరు పరంగా అద్భుతమైన ఈ కారు వాహన వినియోగదారులకు ఉపయోగపడే దాదాపు అన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇప్పటికే ఫహద్ ఫాసిల్ లంబోర్ఘిని ఉరస్, మినీ కంట్రీమ్యాన్, పోర్షే 911 కారెరా ఎస్ స్పోర్ట్స్ వంటి ఖరీదైన కార్లను కలిగి ఉన్నారు. -
ఊరట: వచ్చే నెల నుంచి కూరగాయల రేట్లు తగ్గుముఖం
న్యూఢిల్లీ: కొత్త పంటలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో వచ్చే నెల నుంచి కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టొచ్చని కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే, క్రూడాయిల్ రేట్లు పెరుగుతుండటమే ఆందోళనకర అంశంగా మారిందని ఆయన చెప్పారు. జులైలో రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్టమైన 7.44 శాతం స్థాయికి ఎగిసిన నేపథ్యంలో ప్రభుత్వ అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కూరగాయల రేట్ల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం ఎగియడం తాత్కాలికమేనని, ధరలు వేగంగా దిగి వచ్చే అవకాశం ఉందని అధికారి వివరించారు. వర్షపాతం 6 శాతం తక్కువగా నమోదు కావడం వల్ల ఖరీఫ్ సీజన్పై పెద్దగా ప్రభావం చూపబోదని ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా ప్రపంచమంతటా ధరలు పెరిగిపోయాయని, భారత్ కూడా ఇందుకు మినహాయింపు కాదని ఆయన చెప్పారు. అయితే, ధరలను తక్కువ స్థాయిలో ఉంచేందుకు సరళతర వాణిజ్య విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుండటం వల్ల భారత్ కాస్త మెరుగైన స్థితిలో ఉందన్నారు. అటు పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు యోచనేదీ ప్రభుత్వానికి లేదని అధికారి తెలిపారు. మరోవైపు, క్రూడాయిల్ రేట్లు ఇటీవలి కాలంలో పెరుగుతుండటం కాస్త ఆందోళనకర అంశమే అయినప్పటికీ.. చమురు మార్కెటింగ్ కంపెనీల కోణంలో ప్రస్తుతానికైతే భరించగలిగే స్థాయిలోనే ఉన్నాయని ఆయన వివరించారు. ముడిచమురు రేట్లు 80-90 డాలర్ల మధ్య వరకూ ఉంటే ఫర్వాలేదని, 90 డాలర్లు దాటితేనే ద్రవ్యోల్బణం, ఇతరత్రా అంశాలపై ప్రభావం పడగలదని పేర్కొన్నారు. -
గోధుమలు, బియ్యం ధరల స్థిరీకరణ
సాక్షి, అమరావతి: గోధుమలు, గోధుమ పిండి, బియ్యం రిటైల్ ధరలను స్థిరీకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ (ఓఎంఎస్ఎస్ – డొమెస్టిక్) ద్వారా బహిరంగ మార్కెట్లో గోధుమలు, బియ్యాన్ని విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ పథకం కింద 25 లక్షల టన్నుల బియ్యం, 50 లక్షల టన్నుల గోధుమలను మార్కెట్లోకి తెస్తోంది. ప్రస్తుతం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) వద్ద ఆంధ్రప్రదేశ్లో 7.61 లక్షల టన్నుల బియ్యం, 10,703 టన్నుల గోధుమలు ఉన్నాయి. వీటికి అదనంగా సెంట్రల్ పూల్ కింద రాష్ట్ర ప్రభుత్వం వద్ద మరో 8.40 లక్షల టన్నుల బియ్యం ఉన్నాయి. ఓఎంఎస్ఎస్ (డీ) పథకం కింద ఎఫ్సీఐ ప్రతివారం నిర్వహించే ఈ–వేలంలో భాగంగా అమరావతిలోని ఎఫ్సీఐ ప్రాంతీయ కార్యాలయంలో ఈ నెల 23న 5 వేల టన్నుల గోధుమలు, 13,200 టన్నుల బియ్యాన్ని మార్కెట్లోకి తెస్తున్నారు. ఈ–వేలంలో పాల్గొనదలి్చన వారు ఈఎండీ మొత్తాన్ని ఎల్రక్టానిక్ మోడ్ ద్వారా జనరల్ మేనేజర్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ప్రాంతీయ కార్యాలయం, అమరావతి పేరిట ఈ నెల 21వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు జమ చేయాలి. ఆసక్తి కలిగిన పిండి మిల్లులు, గోధుమ పిండి ప్రాసెసర్లు, గోధుమ ఉత్పత్తుల తయారీదారులు ఈ–వేలంలో పాల్గొనేందుకు www. valuejunction.in/ fci లో ఎం.జంక్షన్ని సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు. వేలంలో గోధుమలు కొన్న వారు 30 రోజులలోపు ప్రాసెస్ చేసి రిటైల్ మార్కెట్లోకి విడుదల చేయాలి. బియ్యం వేలంలో వ్యాపారులు కూడా పాల్గొనవచ్చు. ఎఫ్ఆర్కే బియ్యం రిజర్వ్ ధర క్వింటాల్కు రూ.2,973, ఎఫ్ఆర్కే కాని బియ్యం రిజర్వ్ ధర క్వింటాల్కు రూ.2,900గా నిర్ణయించారు. ఆసక్తి గల బిడ్డర్లు, వ్యాపారులు వెబ్సైట్ ద్వారా వారి వివరాలను సమరి్పంచి ఈ వేలంలో పాల్గొనవచ్చని ఎఫ్సీఐ ఏపీ జనరల్ మేనేజర్ చంద్రశేఖర్ జోషి శనివారం ఓ ప్రకటనలో కోరారు. -
ఊరట: రూ. 50లకు కిలో టమాటా: కేంద్రం ఆదేశం
ఆగస్టు 15 నుంచి కిలోకు రూ. 50 రిటైల్ ధరకు టమోటాలను విక్రయించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇటీవలి కాలంలో టమాట ధరలు దేశ వ్యాప్తంగా భగ్గుమన్న నేపథ్యంలో కేంద్రం మరోసారి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NCCF), నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NAFED)ని ఆదేశించింది. మార్కెట్లో పెరుగుతున్న ధరలు, సరసమైన ధరలో టమాటాలను సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే చర్యల్లో భాగంగా ఈ చర్య తీసుకుంది. (టమాట భగ్గు: 15 నెలల గరిష్ఠానికి రీటైల్ ద్రవ్యోల్బణం ) ఇటీవలి కాలంలో టమాటా ధర క్రమంగా పెరుగుతూ వచ్చి డబుల్ సెంచరీ దాటేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కిలో రూ.70 వరకు విక్రయిస్తున్నారు. ఢిల్లీలో ప్రాంతంలో జూలై 14న టమాటా రిటైల్ విక్రయాలు ప్రారంభం కాగా ఆగస్టు 13 వరకు మొత్తం 15 లక్షల కిలోల పంటను రెండు ఏజెన్సీలు కొనుగోలు చేశాయని ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది. (ఎల్ఐసీ కొత్త ఎండీగా ఆర్ దొరైస్వామి) -
ఐఎఫ్ఎఫ్ఎం అవార్డ్స్ 2023: అదరగొట్టిన నటి, బ్లాక్ చీర ధరపై చర్చ
IFFM Awards 2023 Rani Mukerji మెల్బోర్న్లో (ఆగష్టు 11,2023న) జరిగిన ఐఎఫ్ఎఫ్ఎం అవార్డ్స్ 2023 ప్రదానోత్సవంలో బాలీవుడ్ హీరోయిన్ రాణీ ముఖర్జీ స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది. మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వేలో తన అద్భుతమైన నటనకు గాను రాణి ముఖర్జీ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. ఈ సందర్బంగా ఆమె ధరించిన చీర, ఆమె రూపం అక్కడున్న వారందరినీ మెస్మరైజ్ చేసింది. మిసెస్ ఛటర్జీ Vs నార్వేని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆదరించడం చాలా గర్వంగా ఉందంటూ, IFFM జ్యూరీకి తోపాటు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది. ఇది తల్లి శక్తి ప్రదర్శించే విశ్వవ్యాప్త కథ అని దీనికి ఉత్తమ నటి అవార్డు రావడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా అన్నారు. అలాగే షారుఖ్ ఖాన్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ పఠాన్ IIFMలో పీపుల్స్ ఛాయిస్ అవార్డును అందుకుంది. ఆస్ట్రేలియాలో 4.7 మిలియన్ డాలర్లు అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. భర్త, నిర్మాత ఆదిత్య చోప్రా, పఠాన్ టీం తరపున రాణీ ముఖర్జీ ఆస్ట్రేలియాలో ప్రతిష్టాత్మక అవార్డును అందుకుంది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ నటించిన తెలుగు చిత్రం సీతా రామం ఉత్తమ చిత్రం అవార్డును కైవసం చేసుకుంది ఈ ఈవెంట్లో రాణి ముఖర్జీ లుక్ అదిరిపోయింది. ప్రఖ్యాత డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ డిజైన్ చేసిన బ్లాక్ చీరలో అందరి కళ్లను తనవైపు తిప్పుకుంది. విశాలమైన ఈ ఫెదర్ బోర్డ్ర్ చీరకు జతగా సీక్విన్డ్ హాఫ్-స్లీవ్ బ్లౌజ్తో జత చేసి అద్భుతంగా కనిపించింది. అంతేనా లగ్జరీ బ్రాండ్ మల్టిపుల్ టైర్డ్ పెర్ల్ నెక్లెస్, చక్కటి మేకప్తో మరింత స్టన్నింగ్ లుక్స్లో కనిపించడం ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. అంతకుముందు కూడా మసాబా గుప్తా రూపొందించిన నలుపు-రంగు చందేరీ ముల్, వైట్ థ్రెడ్స్ ముడి పట్టు చీరను ధరించింది. దీనిపై దేవనాగరిలో ముద్రించిన 'మా', తెల్లటి టాసెల్ ఎంబ్రాయిడరీ చేయించి ఉండటం విశేషం. దీని ధర రూ. 17,000. దీంతో లేటెస్ట్ సవ్యసాచి డిజైన్డ్ సారీ ధర ఎంత ఉంటుందనే దాని అభిమానుల్లో చర్చ మొదలు కావడం విశేషం View this post on Instagram A post shared by Indian Film Festival of Melbourne (@iffmelbourne) -
టమాట ధరలు.. సామాన్యులకు భారీ ఊరట?!
దేశ ప్రజలకు శుభవార్త. టమాట ధరల్ని తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా దిగుబడి ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి టమాటలను కొనుగోలు చేయాలని సంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో దాదాపు రెండు నెలలుగా కొండెక్కి కూర్చున్న టమాట ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. రూ.100 నుంచి రూ.300 మధ్యలో ఉన్న టమాటా ధరలు పదీ ఇరవైకి దొరకనున్నాయి. నిన్న మొన్నటి వరకు రూ.10, రూ.20 దొరికిన కేజీ టమాట ఒక్కసారిగా రూ.100 దాటింది. కొన్ని చోట్ల రూ.150 నుండి రూ.300 మధ్యలో విక్రయిస్తున్నారు. రోజూ వినియోగించే టమాట ధరలు ఒక్కసారిగా పెరగడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వాటిని కొనడానికే వెనకాడుతున్నారు. ఈ క్రమంలో భగ్గుమంటున్న టమాట సాగుపై కేంద్రం ఆరా తీసింది. వాటి ఆధారంగా గత ఏడాది కంటే ఈ ఏడాది టమాట పంట దిగుబడి భారీగా పెరుగుతుందని అంచనా వేసింది. పలు నివేదికల ప్రకారం.. దేశంలో పలు రాష్ట్రాల్లో జులై నెలలో టామటా దిగుబడి 2,23,000 మెట్రిక్ టన్నుల నుంచి ఆగస్ట్లో 5,44,000 టన్నులకు పెరుగుతుందని సమాచారం. ఈ పెరుగుదలతో చికెన్ ధరలతో పోటీ పడుతున్న టమాట ధరలు మరింత తగ్గుముఖం పట్టనున్నాయి. ఈ సందర్భంగా.. వినియోగదారుల వ్యవహారాలు , ఆహారం, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. దేశంలో ప్రధాన టమాట సాగు ప్రాంతాలైన హిమాచల్ ప్రదేశ్తో పాటు ఇతర ప్రాంతాల్లో టామాట ఉత్పత్తి పెరుగుతుంది. తద్వారా ధరలు తగ్గే అవకాశం ఉందని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో టమాట సాగు ఎక్కువగా ఉంటుంది. అక్కడి నుంచి ఢిల్లీతో సహా ఉత్తరాది మార్కెట్లకు సరఫరా చేస్తోంది. ఈ రాష్ట్రంలో జూలైలో 2,000 మెట్రిక్ టన్నుల నుండి ఆగస్ట్లో 30,000 మెట్రిక్ టన్నుల వరకు టామాట పంట పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, మధ్యప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాల్లో సైతం టామాట ఉత్పత్తి పెరగనుంది. ఉత్పత్తి అంచనాలు సెప్టెంబరులో 9,56,000 మెట్రిక్ టన్నుల నుంచి అక్టోబర్లో గణనీయంగా 13,33,000 మెట్రిక్ టన్నులు పెరిగే అవకాశం ఉంది. టమాట ధరలు పెరగడానికి కారణం గత నెల జులైలో మన దేశంలోని ఉత్తర, వాయువ్య ప్రాంతాలలో అత్యధిక వర్షపాతం నమోదైంది. వరదలు భీభత్స సృష్టించాయి. దీంతో పంట పొలాలు నీట మునగడం.. పంట నష్టం భారీ ఎత్తున వాటిల్లింది. ఆ ప్రభావం టమోటా సరఫరాపై ప్రభావం చూపింది. ఢిల్లీ మార్కెట్లో టమాట రిటైల్ ధర కేజీ రూ. 200 మించి పెరిగాయి. హిమాచల్ ప్రదేశ్లో గత ఏడాది జులై నెలలో టమాట 10875 మెట్రిక్ టన్నులు పండితే ఈ జూలైలో 1505 మెట్రిక్ టన్నులకు పడిపోయింది. టమాట ధరలు.. కేంద్రం కీలక నిర్ణయం పెరుగుతున్న టమాట ధరల్ని కట్టడి చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. టమాట సాగు ఎక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుండి కొనుగోలు చేయాలని, తరువాత వాటిని పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ (NAFED), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ (NCCF)లకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం ఆదేశాలు అమలుతో దేశంలో టమాట ధరలు సామాన్యులకు అందుబాటులోకి రానున్నాయి. చదవండి👉 బ్యాంకుల్లో మూలుగుతున్న డిపాజిట్లు..అంత డబ్బును బ్యాంక్లు ఏం చేశాయంటే? -
కొబ్బరి పొట్టు..లాభాలు పట్టు
సాక్షి, అమలాపురం: ఇరవై ఏళ్ల క్రితం కొబ్బరి పొట్టు నిరుపయోగ వ్యర్థ పదార్థం. దీనిని వదిలించుకోవడం పీచు పరిశ్రమల యజమానులకు తలకు మించిన భారంగా ఉండేది. కొబ్బరి పీచుకు ధర ఉంటేనే పరిశ్రమలు నడవడం.. లేదంటే మూసేయడంలా ఉండేది. కానీ.. ఆ వ్యర్థమే ఇప్పుడు బంగారమైంది. కొబ్బరి పొట్టును ఇటుకల తయారీలో వాడితే లాభమని గుర్తించారు. ఇటుక తేలిక కావడంతోపాటు ఆకర్షణీయమైన రంగు రావడంతో బట్టి యజమానులు దీని కొనుగోలు మొదలు పెట్టారు. ఆ తరువాత దీని నుంచి అత్యంత నాణ్యమైన కంపోస్టు తయారవుతోందని గుర్తించడంతో కంపోస్టును ఇటుక (కోకోపీట్ బ్లాక్)లుగా మార్చి విదేశాలకు ఎగుమతి చేస్తుండటంతో దీని దశ తిరిగింది. నష్టాల్లో ఉన్న పీచు పరిశ్రమల ఉనికిని ఇప్పుడు కొబ్బరి పొట్టు కాపాడుతోంది. రాష్ట్రంలో ఏడాదికి 24 వేల టన్నుల పొట్టు రాష్ట్రంలో చిన్నాపెద్ద కలిపి సుమారు 950 వరకు కొబ్బరి పీచు పరిశ్రమలు ఉండగా.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 550 వరకు ఉన్నాయి. సగటున 350 గ్రాముల బరువు ఉన్న ఎండు కొబ్బరి కాయ నుంచి 80 గ్రాములు పీచు వస్తే.. కొబ్బరి పొట్టు 160 గ్రాముల వరకు వస్తోంది. రాష్ట్రంలో ఏడాదికి 24 వేల మెట్రిక్ టన్నుల పొట్టు ఉత్పత్తి అవుతోందని అంచనా. ఇందులో విద్యుత్ వాహకత (ఎలక్ట్రిక్ కండెక్టివిటీ–ఈసీ) 6 నుంచి 8 శాతం వరకు ఉంటోంది. అధిక ఈసీ ఉన్న కొబ్బరి పొట్టును నేరుగా వినియోగిస్తే మొక్కలు దెబ్బతింటాయి. దీంతో వివిధ పద్ధతులలో ఈసీ శాతం తగ్గించి కంపోస్టుగాను, బ్రిక్స్ రూపంలో తయారు చేసి ఎగుమతి చేస్తున్నారు. ఈసీ ఎక్కువగా ఉన్న పొట్టును ఇటుక బట్టీలకు టన్ను రూ.2,500 చొప్పున విక్రయిస్తుండగా.. తక్కువ ఈసీ ఉన్న పొట్టును టన్ను రూ.5 వేలకు విక్రయిస్తున్నారు. కొబ్బరి పొట్టు నాణ్యమైన సేంద్రియ ఎరువుగా తయారైతే.. దాని ధర పొట్టు రూపంలో టన్ను రూ.14 వేల నుంచి రూ.20 వేల వరకు ధర ఉంది. అదే ఇటుకల రూపంలో అయితే టన్ను ధర రూ.22 వేల నుంచి రూ.26 వేలు పలుకుతోంది. ఆన్లైన్ మార్కెటింగ్ చేసే అమెజాన్, ఇండియా మార్ట్ వంటి సంస్థలు కేజీ రూ.25 నుంచి రూ.55 వరకు కోకో బ్రిక్ అమ్మకాలు చేస్తున్నాయి. విదేశాలకు కోకోపీట్ బ్లాక్స్ కొబ్బరి పొట్టు ఉత్తరాది రాష్ట్రాలకు అధికంగా ఎగుమతి అవుతోంది. వీటిలో గుజరాత్ది అగ్రస్థానం. ఇక్కడి నర్సరీలకు మట్టికన్నా కొబ్బరి పొట్టు మేలైన ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్నారు. మన రాష్ట్రంతోపాటు దక్షణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), సింగపూర్, మలేసియా, చైనా, జపాన్, అమెరికా, నెదర్ల్యాండ్, ఆస్ట్రేలియాలకు పొట్టుతో తయారు చేసిన బ్రిక్స్ ఎగుమతి అవుతున్నాయి. మొత్తం కొబ్బరి పొట్టు ఉత్పత్తిలో కేవలం 10% మాత్రమే బ్లాక్ రూపంలో వెళుతుండగా.. 20% కంపోస్టు రూపంలోను, 70% ఇటుక బట్టీలకు వెళుతోంది. మంచి డిమాండ్ ఉంది అంతర్జాతీయంగా కోకోపీట్ బ్లాక్స్కు మంచి డిమాండ్ ఉంది. కానీ.. ఎగుమతులకు వీలుగా కొబ్బరి పొట్టును తక్కువ ఈసీకి తీసుకువచ్చి బ్లాక్లుగా తయారు చేయడం వ్యయప్రయాసలతో కూడుకున్న వ్యవహారం. మాకు స్థానికంగా ఇటుక బట్టీలకు అధికంగా వెళుతోంది. క్వాయర్ పరిశ్రమలు నడుస్తున్నాయంటే అందుకు కొబ్బరి పొట్టే కారణం. – నండూరి ఫణికుమార్, క్వాయర్ పరిశ్రమ యజమాని -
సామాన్యులకు మరో షాక్.. పీజీ హాస్టళ్లపై జీఎస్టీ, ఇక బాదుడు షురూ!
శివాజీనగర(బెంగళూరు): ఇప్పటికే పలు రకాల భారాలతో అయ్యో అంటున్న సామాన్య ప్రజలకు మరో భారం పొంచి ఉంది. ప్రైవేటు హాస్టళ్లు (పీజీ)ల బాడుగ ఫీజుకు జీఎస్టీ సెగ తగలనుంది. విద్యార్థులు, బ్యాచిలర్లు, ఒంటరి ఉద్యోగులకు ఆదరువుగా పీజీలు ఉండడం తెలిసిందే. నగరంలో వేలాది మంది పీజీల్లో వసతి పొందుతూ వృత్తి ఉద్యోగాలను, చదువులను కొనసాగిస్తున్నారు. కొత్త జీఎస్టీ నియమాల ప్రకారం రోజు బాడుగ రూ. వెయ్యి కంటే తక్కువ అయితే 12 శాతం జీఎస్టీ, వెయ్యి కంటే ఎక్కువైతే 18 శాతం జీఎస్టీ విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. బెంగళూరులోని జీఎస్టీ పీఠం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. ఫలితంగా బాడుగల్ని పెంచడం తప్పదని బెంగళూరు పీజీ యజమానుల క్షేమాభివృద్ధి సంఘం వెల్లడించింది. జీఎస్టీని వసతిదారుల నుంచే వసూలు చేస్తామని తెలిపింది. ఇప్పటికే బెంగళూరులో పీజీల బాడుగ ఎక్కువగా ఉందని వసతిదారులు చెబుతున్నారు. చదవండి సైకో టెక్కీ.. ప్రియురాలిపై ఉన్మాదం.. -
టమాటా షాక్: ఇప్పట్లో తగ్గేదే లేదు, కారణాలివిగో..!
ఎక్కడ చూసినా టమాటా మాటలు.. మంటలే.. సూపర్ బ్యాట్మెన్స్తో పోటీపడుతూ సెంచరీ..డబుల్ సెంచరీ.. దాటేసి ట్రిపుల్ సెంచరీ వైపు దూసుకుపోతోంది. ఇప్పటికే అందనంత ఎత్తుకు ఎదిగి సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న టమాట ధరలు ఇంకా పైపైకి దూసుకు పోతున్నాయి. దేశంలో చాలా ప్రాంతాల్లో రూ. 250 స్థాయిని కూడా దాటేసింది. తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. త్వరలోనే కేజీకి రూ. 300 లకు చేరే అవకాశముంది. (విమాన ప్రయాణీకులకు బంపర్ ఆఫర్:మెగా సేల్) నెల రోజులుగా టమాటా ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో కిలో రూ.300లకు చేరుకుంటుందని హోల్సేల్ వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. టమాట రాక తగ్గడంతో హోల్ సేల్ ధరలు పెరుగుతాయని హోల్ సేల్ వ్యాపారులు తెలిపారు. దాని ప్రభావం చిల్లర ధరల పెరుగుదల కనిపిస్తుందని అంటున్నారు. దీనికి తోడు భారీ వర్షాలుకూడా మరింత అగ్గి రాజేస్తున్నాయి. ఢిల్లీలోని ఆజాద్పూర్ టమోటా అసోసియేషన్ అధ్యక్షుడు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ) సభ్యుడు అశోక్ కౌశిక్ మాట్లాడుతూ.. గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురియడంతో సాగులో పంట దెబ్బతినడంతో టమోటాల రాక తగ్గింది. అలాగే టమోటాలు, క్యాప్సికం, ఇతర సీజనల్ కూరగాయల విక్రయాలు భారీగా తగ్గిపోవడంతో కూరగాయల హోల్సేల్ వ్యాపారులు నష్టాలను ఎదుర్కొంటున్నారన్నారు. (నితిన్ దేశాయ్ అకాల మరణం: అదే కొంప ముంచింది!) వర్షాలు, సరఫరా,రవాణా ఇబ్బందులు ప్రధానంగా సాగుచేసే ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో నెల రోజులుగా టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆజాద్పూర్ కూరగాయల మార్కెట్ హోల్సేలర్ సంజయ్ భగత్ “హిమాచల్ ప్రదేశ్లో కొండచరియలు విరిగిపడటం , భారీ వర్షాల కారణంగా, కూరగాయల రవాణాలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. సాగుదారుల నుంచి కూరగాయలు తీసుకురావడానికి సాధారణం కంటే ఆరు-ఎనిమిది గంటలు ఎక్కువ సమయం పడుతోంది. ఫలితంగా ధర పెరగడంతో పాటు, కూరగాయల నాణ్యతపై ప్రభావం పడుతోందన్నారు. మొత్తంగా టమాటా ధర కిలో రూ.300కి చేరడం ఖాయమంటున్నారు. కాగా ధర విపరీతంగా పెరిగిన నేపథ్యంలో జులై 14 నుంచి కేంద్ర ప్రభుత్వం టమాటాలను సబ్సిడీపై విక్రయిస్తోంది. దీని కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో చిల్లర ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ, సరఫరా కొరత కారణంగా ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. అటు మదర్ డెయిరీ తన ‘సఫాల్ స్టోర్స్’ ద్వారా కిలో రూ.259కి టమాట విక్రయిస్తోంది. -
టమాట కిలో 264/- నాట్ అవుట్
-
గత నెలలో విడుదలైంది.. అప్పుడే కొత్త ధరలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హార్లే డేవిడ్సన్ ఎక్స్440 ధరను అన్ని వేరియంట్లలో రూ.10,500 పెంచినట్లు హీరో మోటోకార్ప్ బుధవారం ప్రకటించింది. ఎక్స్షోరూంలో పరిచయ ఆఫర్లో రూ.2.29–2.69 లక్షల ధరలో కంపెనీ ఈ మోడల్ను గత నెలలో ఆవిష్కరించింది. తాజా సవరణతో ప్రస్తుతం ఈ ధర రూ.2.39 లక్షల నుంచి ప్రారంభం. కొత్త ధర ఆగస్ట్ 4 నుంచి అమలులోకి రానుందని కంపెనీ వెల్లడించింది. 2023 నుంచి ఎక్స్440 డెలివరీలు ఉంటాయని వివరించింది. -
‘ఉబర్ సీఈవో తిక్క కుదిరింది’
రైడ్ హెయిలింగ్ కంపెనీ ఉబర్ కస్టమర్లపై అదనపు ఛార్జీలు వసూలు చేస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. గతంలో క్యాబ్ బుక్ చేసుకున్న కస్టమర్ల ఫోన్లో ఛార్జింగ్ తక్కువ ఉంటే వారి నుంచి ఎక్కువ ఛార్జీ విధిస్తుందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అయితే, ఈ అదనపు ఛార్జీల బాదుడు సెగ కస్టమర్లకే కాదు ఉబర్ సీఈవో ఖోస్రోషాహికి తగలింది. ఎలా అంటారా? మ్యాగజైన్ సంస్థ వైర్డ్ ఎడిటర్ స్టీవెన్ లెవీ ఉబర్ సీఈవోని ఇంటర్వ్యూ చేసేందుకు ఉబర్ క్యాబ్నే బుక్ చేసుకున్నారు. ఇంటర్వ్యూ కోసం న్యూయార్క్లోని డౌన్టౌన్ సిటీ నుంచి నాలుగున్న కిలోమీటర్ల దూరంలో వెస్ట్సైడ్ ఉబర్ ఆఫీస్కి వెళ్లారు. అక్కడే 2.95 మైళ్ల ఉబెర్ రైడ్ ఛార్జీ ఎంత అయ్యింటుందో చెప్పాలని స్టీవెన్ లెవీ.. ఖోస్రాషాహిని అడిగారు. అందుకు ఉబర్ సీఈవో ఇరవై డాలర్లు ఉంటుందని అంచనా వేశారు. కానీ అనూహ్యంగా డ్రైవర్ టిప్తో కలిపి ఉబర్ రైడ్కి 51.69 డాలర్లు ఛార్జీ పడిందని అన్నారు. వైర్డ్ ఎడిటర్ ఊహించని దానికంటే ఎక్కువ చెల్లించడంపై ఉబర్ సీఈవో సైతం షాక్ తిన్నారు. ‘ఓ మై గాడ్’ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేవలం ఐదు నిమిషాల ముందు 20 డాలర్ల కంటే ఎక్కువగా ఉందని జర్నలిస్ట్ సీఈవోకి చెప్పారు. అంతేకాదు ఉబర్ రైడ్లో ఈ ధరల వ్యత్యాసం గురించి ప్రశ్నించారు. బదులుగా ఖోస్రోషాహి ద్రవ్యోల్బణం, రైడ్ సమయం పెరిగిపోతున్న కొద్ది ఛార్జీల విధింపు, కార్మికుల చెల్లించే వేతనాలే కారణమని తెలిపారు. ఇలా భారీగా ఉన్న ఉబర్ క్యాబ్ ధరలపై జర్నలిస్ట్ ఖోస్రోషాహిని ప్రశ్నించడం, సంభాషణల మధ్యలో ఉబర్ విధిస్తున్న ఛార్జీల్ని సీఈవో సమర్ధించడం.. అందుకు జర్నలిస్ట్ వ్యతిరేకించడం వంటి అంశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చాకు దారి తీశాయి. దీంతో పలువురు నెటిజన్లు ఉబర్ క్యాబ్ ధరలు ఎక్కువగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు ఉబర్ సీఈవో సమాధానం చెప్పలేకపోయారు. తిక్క కుదిరింది అంటూ సమర్ధిస్తున్నారు. కాగా, ఫోర్బ్స్ నివేదిక ప్రకారం..అమెరికాలో ఉబర్ ధరలు 2018 నుండి 2022 వరకు ద్రవ్యోల్బణం రేటు కంటే నాలుగు రెట్లు పెరిగాయని, దాదాపు నాలుగు సంవత్సరాలలో మొత్తం 83శాతం ధరలు పెరిగాయని వెల్లడించింది. -
విరాట్ కోహ్లీ కొత్త ఇయర్బడ్స్ ధరెంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Beats Powerbeats Pro Earbuds: క్రికెట్ గురించి తెలిసినవారికి 'విరాట్ కోహ్లీ' (Virat Kohli) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో ఉన్న ఈయన ఒక ఖరీదైన ఇయర్బడ్స్ పెట్టుకుని కనిపించారు. దీని ధర ఎంత? ఏ కంపెనీకి చెందినదనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర.. నివేదికల ప్రకారం, విరాట్ కోహ్లీ పెట్టుకున్న ఈ ఇయర్బడ్స్ మన దేశంలో లభించవని తెలుస్తోంది. ఇది బీట్స్ పవర్బీట్స్ ప్రో టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ అని.. దీని ధర రూ. 249.95 డాలర్లు లేదా రూ. 20,000 వరకు ఉంటుందని సమాచారం. సాధారణంగా చాలామంది క్రికెటర్లు, సెలబ్రిటీలు యాపిల్ ఇయర్బడ్స్ ఉపయోగిస్తారు, కానీ కోహ్లీ ఇందుకు భిన్నంగా వేరే బ్రాండ్ ఉపయోగిస్తున్నారు. ఈ ఇయర్బడ్స్ కేవలం యుఎస్ మార్కెట్లోని ఆపిల్ స్టోర్లలో లేదా అమెజాన్ వంటి ఆన్లైన్ సెక్టార్లలో లభిస్తుంది. పవర్బీట్స్ ప్రో మొదటి సారి 2018లో ప్రారంభమైంది. కాగా దీని లేటెస్ట్ వెర్షన్ నవంబర్ 2022లో విడుదలైంది. ఇదీ చదవండి: కొత్త స్మార్ట్ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా? త్వరలో లాంచ్ అయ్యే మొబైల్స్ చూసారా! కోహ్లీ వెస్టిండీస్ వికెట్ కీపర్ 'జాషువా డా సిల్వా' తల్లిని కలవడం, ఆలింగనం చేసుకోవడం వంటి సన్నివేశాలకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటికి వేలమంది ఈ వీడియో లైక్ చేశారు, కొంత మంది అభిమానులు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. 𝙒𝙝𝙤𝙡𝙚𝙨𝙤𝙢𝙚 😊 ❤️ When Virat Kohli made Josh's mom's day & "year" 🤗#TeamIndia | #WIvIND | @imVkohli | @windiescricket | @joshuadasilva08 pic.twitter.com/0RL20rRcYL — BCCI (@BCCI) July 22, 2023 -
విపరీతంగా పెరిగిపోతూ డబుల్ సెంచరీ కొట్టిన టమాట
-
గుంటూరు మిర్చి: అ‘ధర’గొట్టిన ఎగుమతులు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు మిర్చి ధరతో పాటు ఎగుమతుల్లోనూ తనకు పోటీ లేదని నిరూపించుకుంటోంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు రూ.10,445 కోట్ల మార్కును దాటా యి. మిర్చి ఎగుమతుల చరిత్రలోనే ఇదో సరికొత్త రికార్డు కావటం విశేషం. ఎగుమతుల పరంగా పరిమాణంలో కొంతమేర తగ్గినప్పటికీ.. ధర ఎక్కువ గా ఉండటంతో గత ఏడాది కంటే రూ.1,861 కోట్ల ఆదాయం అధికంగా లభించింది. మిర్చి ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మిర్చి సాధారణ సాగు విస్తీర్ణం 78 వేల హెక్టార్లు కాగా.. 2022– 23లో అత్యధికంగా 84,861 హెక్టార్లలో సాగు చేశారు. అంతర్జాతీయంగా పెరిగిన గిరాకీ ప్రస్తుతం మన దేశం నుంచి చైనా, శ్రీలంక, మలేషియా, థాయ్లాండ్, స్పెయిన్, అమెరికా, ఇంగ్లండ్, నేపాల్, నెదర్లాండ్స్, నైజీరియా, ఇండోనేషియా, బంగ్లాదేశ్ సహా సుమారు 20 దేశాలకు మిర్చి ఎగుమతి అవుతోంది. కారం, విత్తనాలను సైతం ఎగుమతి చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఇతర దేశాల్లోని మార్కెట్లపైనా గురిపెట్టేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. రెండేళ్లలో గుంటూరు జిల్లాను అన్నిరకాల మిర్చికి ఎగుమతుల హబ్గా తయారు చేసేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. జిల్లా ఎగుమతుల కార్యాచరణ ప్రణాళిక (డీఈఏపీ)లో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ప్రతిపాదించింది. మిర్చితో పాటు పసుపు, అల్లం, ఇతర మసాలా ఉత్పత్తులతోపాటు పత్తి, నూలు ఎగుమతులపైనా దృష్టి సారించాలని నిర్ణయించింది. ఎక్స్పోర్టు హబ్గా మారుస్తాం గుంటూరును మిర్చి ఎక్స్పోర్ట్ హబ్గా మారిస్తే మౌలిక సదుపాయాల కల్పన, కనెక్టివిటీ, ముడి పదార్థాల లభ్యత పెంపు, నైపుణ్యం పెంపు, సాంకేతికత బదిలీ జరుగుతుంది. టూరిజాన్ని అభివృద్ధి చేయడం, అంతర్జాతీయ మార్కెటింగ్ ఈవెంట్స్ నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా ఎగుమతులకు మరింత ప్రోత్సాహం లభిస్తుంది. – ఎం.వేణుగోపాలరెడ్డి, కలెక్టర్, గుంటూరు చిల్లీస్ బోర్డు ఏర్పాటు చేయాలి స్పైసెస్ బోర్డులో అత్యధిక విదేశీ ఆదాయాన్ని సమకూరుస్తున్న మిర్చి పంట కోసం కేంద్రం ప్రత్యేకంగా చిల్లీస్ బోర్డును ఏర్పాటు చేయాలి. పంట చేతికొచ్చిన తర్వాత విదేశాలకు ఎగుమతులపై దృష్టి పెడుతున్న బోర్డు, రైతులకు కావాల్సిన మంచి విత్తనం, దీనికి సంబంధించిన పరిశోధనలపై దృష్టి పెట్టడం లేదు. అందుకే చిల్లీస్కు ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేయాలి. – తోట రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి, చిల్లీస్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ ధర ‘తేజో’మయమే ప్రస్తుతం గుంటూరు మిర్చి యార్డులో మిర్చికి మంచి గిట్టుబాటు ధర లభిస్తోంది. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర క్వింటాల్కు రూ.9,000 నుంచి రూ.24,000 వరకు పలుకుతోంది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగి, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి ధర గరిష్టంగా రూ.25 వేల వరకు పలికింది. ఏసీ కామన్ రకం మిర్చి క్వింటాల్కు రూ.12,500 నుంచి రూ.23,500 వరకు, ఏసీ ప్రత్యేక రకాల మిర్చికి రూ.14 వేల నుంచి రూ.25,500 వరకు ధర లభిస్తోంది. కారం తయారీకి అధికంగా ఉపయోగించే 341, దేవనూరు డీలక్స్, 334 రకాల మిర్చి క్వింటాల్ రూ.23 వేలకు పైగా పలుకుతోంది. -
కళ్లకు విశ్రాంతినిచ్చే ఐ మసాజర్ మాస్క్.. ధర ఎంతంటే?
గాగుల్స్లా ఈ పరికరాన్ని కళ్లకు తొడుక్కుంటే చాలు, అలసిన కళ్లకు విశ్రాంతినిస్తుంది. కనురెప్పలు, కళ్ల చుట్టూ ఉండే కండరాలకు సున్నితంగా మర్దన చేస్తుంది. అమెరికన్ కంపెనీ పాట్రియాట్ హెల్త్ అలయన్స్ ఇటీవల ‘ఐ స్పా’ పేరుతో ఈ ఐ మసాజర్ మాస్క్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. కోరుకున్న విధంగా దీని ఉష్ణోగ్రతలను అడ్జస్ట్ చేసుకోవచ్చు. కళ్లకు వెచ్చదనం కావాలనుకుంటే, 43.3 డిగ్రీల నుంచి 45.5 డిగ్రీల సెల్సియస్ వరకు, చల్లదనం కావాలనుకుంటే 15 డిగ్రీల నుంచి 18.3 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలను ఎంపిక చేసుకోవచ్చు. ఇందులో మిస్ట్ మసాజ్ ఆప్షన్ కూడా ఉంది. దీనిని సెట్ చేసుకుంటే, కళ్లకు తగినంతగా చల్లని తేమను విడుదల చేస్తుంది. స్మార్ట్ఫోన్ యాప్ ద్వారా ఇది పనిచేస్తుంది. దీని ఖరీదు 34.98 డాలర్లు (రూ.2,869) మాత్రమే! -
గుడ్ న్యూస్.. ఆన్లైన్లో రూ. 70కే కేజీ టమాటలు!
గత కొన్ని రోజులుగా టమాట ధరలకు రెక్కలొచ్చి సామాన్య ప్రజలకు అందనంత స్థాయికి ఎదిగిపోయాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కేజీ ధర రూ. 200 దాటింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎన్సిసిఎఫ్ టమోటాలను కిలో రూ.70కి అందజేస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ఓఎన్డీసీ (ONDC) కొనుగోలుదారులకు ఎలాంటి అదనపు ఛార్జీలు విధించకుండా ఆన్లైన్లో రూ. 70కి అందిస్తోంది. దీనికోసం పేటీఎం యాప్ ద్వారా కస్టమర్ ఆర్డర్ చేయవచ్చని, ఒక కస్టమర్ కేవలం 2 కేజీల టమాటలను మాత్రమే ఆర్డర్ చేసుకోవచ్చని మేనేజింగ్ డైరెక్టర్ టి కోశి తెలిపారు. ఈ సదుపాయం ప్రస్తుతం ఢిల్లీ ప్రజలకు మాత్రమే అందుబాటులో ఉంది. పెరుగుతున్న ధరల నుంచి ఉపశమనం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం గత వారంలో టమాటాలను సబ్సిడీపై విక్రయించాలని నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NCCF) అండ్ నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NAFED)లను ఆదేశించింది. (ఇదీ చదవండి: ఐఐటీ నుంచి సాఫ్ట్వేర్.. లక్షల ఉద్యోగం వదిలి కమెడియన్గా.. ఎంత సంపాదిస్తున్నాడంటే?) కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మొదట్లో కేజీ టమాటలను రూ.90కి విక్రయించారు. ఆ తరువాత జులై 16 నుంచి కేజీ రూ.80కి, జూలై 20 నుంచి కిలో రూ.70కి తగ్గించారు. మొత్తం మీద అధిక ధరల నుంచి ప్రజలను కొంత వరకు విముక్తి కలిగించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. -
పెరగనున్న పాల ధరలు.. ఆగష్టు 01 నుంచే..
టమాట ధరల పెరుగుదల మిగతా నిత్యావసరాల ధరల మీద ప్రభావం చూపుతోంది. కర్ణాటకలో పాల ధరలు కూడా 2023 ఆగష్టు 01 నుంచి పెరగనున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కెఎమ్ఎఫ్) బృందం & ముఖ్యమంత్రి సిద్దరామయ్య మధ్య జరిగిన సమావేశం తరువాత ప్రముఖ పాల బ్రాండ్ నందిని (Nandini) ధరలు లీటరుకు రూ. 3 పెంచాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్పత్తి వ్యయం పెరుగుతున్న కారణంగా పాల ధరలను పెంచాల్సి వచ్చినట్లు కెఎమ్ఎఫ్ ప్రతినిధి తెలిపారు. కెఎమ్ఎఫ్ చైర్మన్ భీమా నాయక్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ప్రభుత్వానికి చేసిన అభ్యర్థనను ఆమోదించింది. కావున కొత్త ధరలు ఆగష్టు 01 నుండి అమలులోకి రానున్నాయి. ధరల పెరుగుదల కేవలం పాలకు మాత్రమే వర్తిస్తుందని.. పెరుగు, ఇతర పాల పదార్థాలు వర్తించే అవకాశం లేదని తెలిపారు. (ఇదీ చదవండి: భారత్లో టాప్ 5 సన్రూఫ్ ఫీచర్ కార్లు - వివరాలు) ప్రస్తుతం మార్కెట్లో నందిని టోన్డ్ మిల్క్ ధర రూ. 39 ఉండగా.. ఆగష్టు 01 నుంచి ఇది రూ. 42కి చేరుతుంది. పాల పొడి ధరలు కూడా పెంచాలన్న బృందం విజ్ఞప్తిని ప్రభుత్వం తిరస్కరించినట్లు సమాచారం. ధరల పెరుగుదల వల్ల పాడి పరిశ్రమ కూడా అదనపు ఆదాయాన్ని పొందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కాగా ఇది ప్రజల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది తెలియాల్సి ఉంది. కర్ణాటక ప్రభుత్వం నియంత్రణలో నడిచే నందిని ఇప్పుడు పాల ధరను పెంచనుండడంతో మిగతా ప్రైవేట్ డెయిరీలు కూడా ఇదే బాట పట్టే అవకాశం కనిపిస్తోంది. నందిని రూ.3 పెంచితే ప్రైవేట్ కంపెనీలు కనీసం రూ.5 వరకు పెంచే అవకాశం ఉందని అక్కడి వర్గాలు తెలిపాయి. -
అలెర్జీలకు చెక్ పెట్టే యంత్రం - ధర రూ. 10795 మాత్రమే!
వాతావరణం మారినప్పుడు, గాలిలో కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు చాలామందికి అలర్జీ బాధలు తప్పవు. అలర్జీలు తీవ్రమైతే కొందరికి ఉబ్బసం కూడా మొదలవుతుంది. అలెర్జీలకు, ఉబ్బసానికి ఇప్పటి వరకు మందులు, ఇన్హేలర్లే గతి. అలెర్జీలకు పరిష్కారంగా ఎస్టోనియాకు చెందిన ‘రెస్పిరే’ కంపెనీ ఇటీవల మెడలో తొడుక్కునేందుకు వీలైన ‘ఏ ప్లస్ వేర్’ పేరుతో అలెర్జీ ఫిల్టర్ను అందుబాటులోకి తెచ్చింది. ఇది మెడలో తొడుక్కున్నట్లయితే, గాలిలోని అలెర్జీకి కారణమయ్యే కణాలేవీ దీనిని దాటి ముక్కులోకి చొరబడలేవు. (ఇదీ చదవండి: భారత్ కీలక నిర్ణయం.. ఇలాగే జరిగితే చైనా కంపెనీల కథ కంచికే!) ఇందులోని హెపా ఫిల్టర్లు అలెర్జీలకు దారితీసే సూక్ష్మాతి సూక్ష్మకణాలను సైతం ఇట్టే లోపలకు పీల్చేసుకుని, గాలిని శుభ్రం చేస్తాయి. ఇది రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. ఇది చార్జ్ కావడానికి గంటన్నర సమయం పడుతుంది. పూర్తిగా చార్జ్ అయ్యాక ఎనిమిది గంటల సేపు నిరంతరాయంగా పనిచేస్తుంది. దీని ధర 119 యూరోలు (రూ.10,795). దీనిని వాడటం మొదలుపెడితే అలెర్జీల కోసం మందులు వాడాల్సిన అవసరం దాదాపుగా ఉండదు. -
సెల్ఫ్ క్లీనింగ్ రోబో వాక్యూమ్ క్లీనర్ - ధర ఎంతో తెలుసా?
విద్యుత్తుతో పనిచేసే వాక్యూమ్ క్లీనర్లు ఇప్పటికే చాలా చోట్ల వాడుకలో ఉన్నాయి. ఇటీవలి కాలంలో రోబో వాక్యూమ్ క్లీనర్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. రోబో వాక్యూమ్ క్లీనర్లు గదిలోని చెత్తను పూర్తిగా తొలగించాక, వాటిలోని అర చెత్తతో నిండిపోతోంది. ఆ చెత్తను మనం తొలగించాల్సి ఉంటుంది. అయితే, చైనీస్ హైటెక్ కంపెనీ ‘జియావోమీ’ ఇటీవల సెల్ఫ్ క్లీనింగ్ రోబో వాక్యూమ్ క్లీనర్ను అందుబాటులోకి తెచ్చింది. ‘రోబోరాక్ ఎస్7 మాక్స్ అల్ట్రా’ పేరుతో తెచ్చిన ఈ రోబో వాక్యూమ్ క్లీనర్ గదిలోని చెత్తను తొలగించాక, తనను తాను శుభ్రం చేసుకుంటుంది. (ఇదీ చదవండి: మొదటిసారి రోడ్డుపై కనిపించిన ప్రపంచములోనే ఖరీదైన కారు - చూస్తే హవాక్కావల్సిందే!) ఇందులోని సెన్సర్లు గదిలోని చెత్తను రకాల వారీగా గుర్తించి, అందుకు అనుగుణంగా పనిచేస్తాయి. సూక్ష్మమైన ధూళికణాలను కూడా ఏరివేసేందుకు ఇవి దోహదపడతాయి. గదిలో అడ్డదిడ్డంగా వస్తువులు పడి ఉంటే, అడ్డంకులను దాటుకుని మరీ ఈ రోబో వాక్యూమ్ క్లీనర్ పనిచేస్తుంది. దీని ధర 1299 డాలర్లు (రూ.1,06,581). -
ప్రపంచ దేశాల్లో వణుకుపుట్టిస్తున్న భారత్ నిర్ణయం - బియ్యం ధరల్లో పెనుమార్పులు!
ప్రపంచంలో అతి పెద్ద బియ్యం సరఫరాదారుగా ఉన్న భారత్ పెరుగుతున్న ధరలను అదుపులో ఉంచేందుకు ఎగుమతులను నిషేధించింది. ఈ కారణంగా ప్రపంచంలోని చాలా దేశాల్లో బియ్యం ధరలు ఆకాశాన్నంటాయి. ముఖ్యంగా అమెరికా వంటి అగ్ర రాజ్యాలు కూడా ఈ ప్రభావానికి గురయ్యాయి. ప్రపంచ బియ్యం ఎగుమతుల్లో 40% వాటా కలిగి ఉన్న ఇండియా ఎగుమతులను నిలిపివేయడంతో ధరలు గరిష్ట స్థాయికి చేరాయి. ఒక మెట్రిక్ టన్ను ధరలు కనిష్టంగా 50 డాలర్లు నుంచి 100 డాలర్లు ఎక్కువ ఉండవచ్చని సింగపూర్కు చెందిన అంతర్జాతీయ వ్యాపార సంస్థలో ఒక వ్యాపారి వెల్లడించారు. కాగా ఈ ధరలు ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయనేది మున్ముందు తెలియాల్సి ఉందని మరొకరు అభిప్రాయపడ్డారు. బియ్యం ఎగుమతులను నిషేధించాలని భారతదేశం తీసుకున్న నిర్ణయం ప్రపంచ గోధుమ మార్కెట్లో బలమైన లాభాలను తీసుకు వస్తోంది. ఈ కారణంగానే గోధుమ ధరలు కూడా ఈ వారంలో 10 శాతం కంటే ఎక్కువ పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచంలోని దాదాపు 3 బిలియన్ల కంటే ఎక్కువ మంది వరి మీద ఆధారపడి జీవిస్తున్నారు. సుమారు 90 శాతం నీటి ఆధారంగా పెరిగే ఈ పంట దాదాపు ఎక్కువ భాగం ఆసియా ఖండంలో ఉత్పత్తవుతుంది. (ఇదీ చదవండి: ఆత్మీయుల మరణంతో సన్యాసం - ఓ కొత్త ఆలోచనతో వేల కోట్లు!) ఇక ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఎగుమతిదారు అయిన థాయ్లాండ్, కొత్త ఒప్పందాలపై సంతకం చేయడానికి ముందు ధరలను తెలుసుకోవడానికి సరఫరాదారులు వేచి ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే చాలా దేశాల్లో బియ్యం ధరలు అమాంతం పెరుగుతున్నాయి. వియాత్నం, సింగపూర్ వంటి దేశాల్లో కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. చదవండి: భారత్ బ్యాన్ డెసిషన్.. యూఎస్లో బియ్యం కష్టాలకు అసలు కారణం ఇదే.. -
ఓలా ఎస్1 ఎయిర్ లాంచింగ్ బంపర్ ఆఫర్: మూడు రోజులే!
Ola S1 Air introductory price: దేశీయ అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారు ఓలా లేటెస్ట్ ఓలా S1 ఎయిర్. దీనికి సంబంధించి ఒక కీలకవిషయాన్ని ఓలా సీఈఓ భవిష్అగర్వాల్ ప్రకటించారు. పరిచయ ఆఫర్గా 10వేల తగ్గింపును ప్రకటించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు.ఎస్1 ఎయిర్ జూలై 28- 30 తేదీల మధ్య కొనుగోలు చేసిన వారికి ప్రారంభ ధర రూ. 1,09,999కే లభిస్తుందని పేర్కొన్నారు. జూలై 31 తరువాత దీని ధర రూ. 1,19,999గా ఉంటుదని, అందుకే ఇపుడే మీ ఎలాఎస్1 ఎయిర్ను తక్కువ ధరకే రిజర్వ్ చేసుకోమ్మని సూచించారు. అలాగే S1ఎయిర్ డెలివరీ ఆగస్టు ప్రారంభంలో ప్రారంభమవు తుందని చెప్పారు. 500,000 కి.మీ వరకు పరీక్షించామని కూడా ఆయన వెల్లడించారు. గత రెండు నెలలుగా వ్యక్తిగతంగా ఎస్1 ఎయిర్ని చాలా ఎక్కువగా నడిపాను.. ఇది నిజంగా అద్భుతమైన స్కూటర్ అతి త్వరలో వస్తుందిన ట్వీట్ చేశారు. ఓలా నుంచి అత్యంత చవకైన మోడల్ ఓలా ఎస్ 1 ఎయిర్ స్కూటర్ జూలై నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయని గతంలో ప్రకటించారు. 999 రూపాయల వద్ద ఈ స్కూటర్ కు సంబంధించిన ప్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ప్రధానంగా FAME సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం సవరించిన నేపథ్యంలో రూ.1.10 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. 3 kWh బ్యాటరీతో లాంచ్ అయిన ఎస్1 ఎయిర్ పూర్తి ఛార్జ్పై 125 కిమీ రేంజ్ను అందిస్తుంది. అలాగే గరిష్ఠంగా గంటకు 85 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. Purchase for S1 Air will open from 28th July-30th July for reservers and all our existing community, at an introductory price of ₹1,09,999. Everyone else can purchase from 31st July at ₹1,19,999. Reserve now to get the introductory price! Deliveries start early August! pic.twitter.com/EBM35oSh0B — Bhavish Aggarwal (@bhash) July 21, 2023