ఇకపై తగ్గనున్న మొబైల్ ఫోన్ ధరలు.. ఎందుకంటే? | Mobile Phones Price Down in India | Sakshi
Sakshi News home page

ఇకపై తగ్గనున్న మొబైల్ ఫోన్ ధరలు.. ఎందుకంటే?

Published Tue, Jul 23 2024 9:37 PM | Last Updated on Tue, Jul 23 2024 9:36 PM

Mobile Phones Price Down in India

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2024-25లో సాంకేతిక రంగానికి ప్రోత్సాహకాలను అందించింది. మొబైల్ ఫోన్స్, ఛార్జర్లు, పీసీబీఏ సుంకాలను 20 నుంచి 15 శాతానికి తగ్గించారు. దేశంలో మొబైల్ ఫోన్స్ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. దేశం నుంచి ఎగుమతులు కూడా విరివిగా జరుగుతున్నాయి.

గత ఆరేళ్లలో మొబైల్ ఫోన్స్ ఉత్పత్తి ఏకంగా మూడు రెట్లు పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. మొబైల్ పరిశ్రమ గణనీయంగా వృద్ధి చెందటంతో బేసిక్ కస్టమ్స్ డ్యూటీని తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. అంతే కాకుండా ఈ ఏది జనవరిలోనే కేంద్ర ప్రభుత్వం మొబైల్ ఫోన్ విడిభాగాల దిగుమతి సుంకాలను కూడా 15 నుంచి 10 శాతానికి తగ్గించింది.

యాపిల్, ఒప్పో, వివో మొదలైన కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ టారిఫ్ స్లాబ్ హేతుబద్ధీకరణ ప్రతిపాదనను కూడా అంగీకరించింది. దిగుమతి సుంకాలు తగ్గించడంతో భారతదేశంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు బాగా తగ్గుతాయని స్పష్టమవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement