mobile phones
-
కాలర్ ఐడీ ఫీచర్ను వెంటనే అమలు చేయాలని ఆదేశాలు
మోసపూరిత కాల్స్ను అరికట్టడానికి భారత టెలికమ్యూనికేషన్ శాఖ(DoT) చర్యలు తీసుకుంటోంది. కాలర్ ఐడీ ఫీచర్ను అన్ని టెలికాం అపరేటర్లు వెంటనే అమలు చేయాలని ఆదేశించింది. మొబైల్ ఫోన్లలో కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ (CNAP) సేవలను అందుబాటులోకి తీసుకురావాలని తెలిపింది. ఇన్ కమింగ్ కాల్స్కు సంబంధించి ఎవరు కాల్ చేశారో పేరు డిస్ ప్లే అయ్యేలా ఈ చర్యలు ఉపయోగపడనున్నాయి. దాంతో స్పామ్, స్కామ్ కాల్స్ను కట్టడి చేయవచ్చని డాట్ అంచనా వేస్తుంది.ఇటీవల టెలికాం ఆపరేటర్లతో జరిగిన సమావేశంలో సీఎన్ఏపీ సర్వీసులో ఆలస్యం జరగకుండా వెంటనే అమలు చేయాల్సిన అవసరాన్ని టెలికాం శాఖ నొక్కి చెప్పింది. టెలికాం కంపెనీలు ఈ టెక్నాలజీ కోసం ఇప్పటికే ట్రయల్స్ ప్రారంభించాయి. కానీ సాంకేతిక పరిమితుల కారణంగా 2జీ వినియోగదారులకు దీన్ని అమలు చేయడం సవాలుగా మరినట్లు అధికారులు తెలిపారు.ఇప్పటికే ఈ సేవలందిస్తున్న ప్రైవేట్ కంపెనీలుకాల్ చేసింది ఎవరనే వివరాలు డిస్ప్లేపై కనిపించడంతో కాల్ రిసీవ్ చేసుకునేవారికి సీఎన్ఏపీ సర్వీసు ఎంతో ఉపయోగపడుతుంది. దీని ద్వారా స్పామ్, స్కామ్ కాల్స్కు గురయ్యే ప్రమాదం తగ్గుతుంది. అయితే ఇప్పటికే ట్రూకాలర్ వంటి కొన్ని కంపెనీలు.. తమకు కాల్స్ చేసే వారి పేరును రిసీవర్ ఫోన్(mobile phones) డిస్ప్లేపై వచ్చేలా సేవలందిస్తున్నాయి. ప్రభుత్వం ఈ కొత్త సర్వీసు తీసుకురావడంతో ఈ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.అంతర్జాతీయ కాల్స్కు ఇలా..సీఎన్ఏపీ సర్వీస్తో పాటు, వినియోగదారులు అంతర్జాతీయ కాల్స్ ద్వారా మోసపోకుండా నిరోధించడానికి +91 కాల్స్ను అంతర్జాతీయ కాల్స్గా మార్క్ చేయాలని టెలికాం శాఖ టెల్కోలకు సూచించింది. ఇటీవల అంతర్జాతీయ స్కామ్ కాల్స్ పెరగడం ఎక్కువవుతుందని, ఈ చర్యల వల్ల ప్రమాదాన్ని కట్టడి చేసే అవకాశం ఉంటుందని తెలిపింది.సవాళ్లున్నా అమలుకు సిద్ధంసీఎన్ఏపీ సర్వీసు కోసం ట్రయల్స్ ఇంకా కొనసాగుతున్నాయి. అయితే కాల్స్ ఒక టెలికాం సర్కిల్లో ప్రారంభమమై మరొక సర్కిల్లో ముగుస్తాయి. గ్రౌండ్ రియాలిటీలను పరిగణనలోకి తీసుకోకుండా ఈ సర్వీసును తప్పనిసరి చేయాల్సిన అవసరం లేదని మొబైల్ పరిశ్రమ నిపుణులు వాదిస్తున్నారు. ఏదేమైనా టెక్నికల్ సవాళ్లు ముగిసి, వ్యవస్థ స్థిరపడిన తర్వాత ఈ సేవను అమలు చేస్తామని టెల్కోలు తెలిపాయి.ఇదీ చదవండి: పాలసీబజార్ కార్యాలయంలో జీఎస్టీ సోదాలు -
2024లో బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే (ఫొటోలు)
-
2024లో బెస్ట్ స్మార్ట్ఫోన్లు: ధర రూ. 25వేలు కంటే తక్కువే..
2024 ముగుస్తోంది. లెక్కకు మించిన స్మార్ట్ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ కథనంలో రూ.25,000 లోపు ధర వద్ద లభించే బెస్ట్ స్మార్ట్ఫోన్ల గురించి వివరంగా తెలుసుకుందాం.వన్ప్లస్ నార్డ్ సీఈ4 (OnePlus Nord CE4)ప్రస్తుతం మార్కెట్లో రూ. 25వేలలోపు ధర వద్ద లభిస్తున్న అత్యుత్తమ స్మార్ట్ఫోన్లలో 'వన్ప్లస్ నార్డ్ సీఈ4' ఒకటి. ఇది మంచి పనితీరును అందించడం మాత్రమే కాకుండా.. బ్యాటరీ కెపాసిటీ కూడా ఉత్తమగానే ఉంటుంది. 6.74 ఇంచెస్ వైబ్రెంట్ అమోలెడ్ డిస్ప్లే కలిగి ఉన్న ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ పొందుతుంది. మంచి ఫోటోల కోసం లేదా ఫ్లాగ్షిప్ గ్రేడ్ డిస్ప్లే క్వాలిటీ వంటివి కోరుకునవారికి ఇది బెస్ట్ ఆప్షన్.రెడ్మీ నోట్ 13 ప్రో (Redmi Note 13 Pro)మంచి డిస్ప్లే, బెస్ట్ పర్ఫామెన్స్ కోరుకునే వారికి 'రెడ్మీ నోట్ 13 ప్రో' ఉత్తమ ఎంపిక. దీని ధర కూడా రూ. 25వేలు కంటే తక్కువే. 6.67 ఇంచెస్ 1.5కే అమోలెడ్ డిస్ప్లే కలిగిన ఈ ఫోన్.. 120 Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ పొందుతుంది. ఇందులో స్నాప్డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్ ఉంటుంది. 5100mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీ రోజంతా పనిచేస్తుంది.మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ (Motorola Edge 50 Fusion)అద్భుతమైన డిజైన్ కలిగి, మంచి పనితీరును అందించే స్మార్ట్ఫోన్ కోసం ఎదురు చూసేవారికి మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఓ మంచి ఆప్షన్. ఇది స్నాప్డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్ పొందుతుంది. ఈ స్మార్ట్ఫోన్ డిస్ప్లే 6.7 ఇంచెస్ వరకు ఉంటుంది. ఇందులోని 5000 mAh బ్యాటరీ.. 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్కు సపోర్ట్ చేస్తుంది.మోటరోలా ఎడ్జ్ 50 నియో (Motorola Edge 50 Neo)మోటరోలా ఎడ్జ్ 50 నియో కూడా మన జాబితాలో చెప్పుకోదగ్గ స్మార్ట్ఫోన్. ఇది డైనమిక్ 120 Hz రిఫ్రెష్ రేట్తో కూడిన.. 6.4 ఇంచెస్ డిస్ప్లే పొందుతుంది. IP68 వాటర్ రెసిస్టెన్స్, 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్, గుండ్రంగా ఉండే కెమెరా సిస్టమ్ వంటి ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. 50 MP ప్రైమరీ లెన్స్ & 32 MP సెల్ఫీ షూటర్ వంటివి ఈ స్మార్ట్ఫోన్లో ఉన్నాయి.వివో టీ3 ప్రో (Vivo T3 Pro)లెదర్ బ్యాక్తో సొగసైన.. స్లిమ్ డిజైన్ పొందిన ఈ స్మార్ట్ఫోన్ 6.77 ఇంచెస్ అమోలెడ్ డిస్ప్లే పొందుతుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ కలిగిన ఈ ఫోన్ 5500 mAh బ్యాటరీ పొందుతుంది. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉండటం వల్ల తక్కువ కాంతిలో కూడా ఫోటోలు తీసుకోవడానికి ఉత్తమంగా ఉంటుంది.నథింగ్ ఫోన్ (2ఏ) (Nothing Phone (2a))పాలికార్బోనేట్ బ్యాక్తో, ప్లాస్టిక్ బిల్డ్ కలిగిన ఈ ప్రీమియం ఫోన్ ధర కూడా రూ. 25వేలు కంటే తక్కువే. ఇందులోని గ్లిఫ్ ఇంటర్ఫేస్ ప్రత్యేకంగా నిలుస్తుంది. రోజువారీ వినియోగానికి మాత్రమే కాకుండా.. గేమింగ్ కోసం కూడా ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ రోజు వినియోగాన్ని నిర్ధారిస్తుంది. ఇది డ్యూయల్ 50 MP రియర్ కెమెరాలు కలిగి ఉండటం వల్ల ఉత్తమ ఫోటో అనుభవాన్ని పొందవచ్చు. -
పాత మొబైల్ ఫోన్లతో సైబర్ నేరాలు
సాక్షి, హైదరాబాద్: డబ్బులు, ప్లాస్టిక్ వస్తువులు ఇచ్చి ప్రజల నుంచి పాత, వినియోగంలో లేని మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసి సైబర్ నేరాలకు వాడుతున్న కేటుగాళ్ల ముఠాను రామగుండం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీ సీఎస్బీ) అధికారులు అరెస్టు చేశారు. పట్టుబడిన ముగ్గురు నిందితుల వద్ద నుంచి ఏకంగా 4 వేల పాత మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్లను బిహార్లోని కొందరికి ఎగుమతి చేస్తున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. సేకరించిన పాత మొబైల్ ఫోన్లను రిపేర్ చేసి వాటిని జామ్తార, దియోగఢ్లోని సైబర్ నేరగాళ్లకు సరఫరా చేస్తున్నట్టు నిందితులు వెల్లడించారు. వారిని బిహార్కు చెందిన మహ్మద్ షమీమ్, అబ్దుల్ సలామ్, మహ్మద్ ఇఫ్తికర్గా గుర్తించారు. నిందితులపై రామగుండం సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో ఐటీ యాక్ట్ 66 డీ, బీఎన్ఎస్ఎస్లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు టీజీ సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ శిఖాగోయల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇలా చిక్కారు..బిహార్కు చెందిన కొందరు వ్యక్తులు పట్టణంలో తిరుగుతూ పాత మొబైల్ ఫోన్లను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నట్టు రామగుండం సైబర్ క్రైం పోలీస్స్టేషన్ సిబ్బందికి విశ్వసనీయ సమాచారం అందింది. వారు గోదావరిఖనిలో తనిఖీ చేయగా ముగ్గురు అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 4 వేల పాత మొబైల్ ఫోన్లు పట్టుబడ్డాయి. గత నెల రోజులుగా రామగుండంతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి పాత మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసి బిహార్లోని తమ ముఠాలకు చేరవేసినట్టు నిందితులు అంగీకరించారు. కాగా అపరిచిత వ్యక్తులకు పాత మొబైల్ ఫోన్లను విక్రయించవద్దని శిఖాగోయల్ సూచించారు. సైబర్ నేరాలు జరిగినప్పుడు మొబైల్ ఫోన్ పాత యజమాని డివైస్ ఐడెంటీనే పోలీసుల దర్యాప్తులో బయటకు వస్తుందని, దీనివల్ల చిక్కుల్లో పడతారని హెచ్చరించారు. -
ఇకపై తగ్గనున్న మొబైల్ ఫోన్ ధరలు.. ఎందుకంటే?
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2024-25లో సాంకేతిక రంగానికి ప్రోత్సాహకాలను అందించింది. మొబైల్ ఫోన్స్, ఛార్జర్లు, పీసీబీఏ సుంకాలను 20 నుంచి 15 శాతానికి తగ్గించారు. దేశంలో మొబైల్ ఫోన్స్ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. దేశం నుంచి ఎగుమతులు కూడా విరివిగా జరుగుతున్నాయి.గత ఆరేళ్లలో మొబైల్ ఫోన్స్ ఉత్పత్తి ఏకంగా మూడు రెట్లు పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. మొబైల్ పరిశ్రమ గణనీయంగా వృద్ధి చెందటంతో బేసిక్ కస్టమ్స్ డ్యూటీని తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. అంతే కాకుండా ఈ ఏది జనవరిలోనే కేంద్ర ప్రభుత్వం మొబైల్ ఫోన్ విడిభాగాల దిగుమతి సుంకాలను కూడా 15 నుంచి 10 శాతానికి తగ్గించింది.యాపిల్, ఒప్పో, వివో మొదలైన కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ టారిఫ్ స్లాబ్ హేతుబద్ధీకరణ ప్రతిపాదనను కూడా అంగీకరించింది. దిగుమతి సుంకాలు తగ్గించడంతో భారతదేశంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు బాగా తగ్గుతాయని స్పష్టమవుతోంది. -
వద్దమ్మా.. తప్పూ!
ఈ మధ్య ‘గైడింగ్ హ్యాండ్స్’ అంటూ ఒక వీడియో వచ్చింది. అది వెక్కిరింత వీడియో. ఫోన్ చూసుకుంటూ తల ఎల్లవేళలా కిందకు దించి ఉండేవారిని చేయి పట్టి చేరవలసిన చోటుకు చేర్చే‘సహాయక చేతులను’ భవిష్యత్తులో ఉపాధిగా చేసుకోవచ్చని అందులో చూపుతారు. అంటే అంధులను చేయి పట్టి నడిపించేవారికి మల్లే ఈ ఫోన్ బానిసలను చేయి పట్టి నడిపించి చార్జ్ తీసుకునే వ్యక్తులు భవిష్యత్తులో వస్తారన్న మాట. మనం ఫోన్కు శ్రుతి మించి ఎడిక్ట్ అయ్యామని చెప్పేందుకు ఈ వీడియో చేశారు. బండి మీద వెళుతూ ఫోన్ మాట్లాడితే ప్రమాదం అని ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ వినడం లేదు. కొందరు హెల్మెట్లో దూర్చి మరీ ఫోన్ మాట్లాడుతూ ప్రమాదం బారిన పడతారు. మరికొందరు హెడ్ఫోన్స్తో మాట్లాడుతూ వెనకొచ్చే వాహనాల హారన్ వినక ప్రమాదంలో పడుతున్నారు. మొన్నటి మార్చి 26న బెంగళూరు విద్యారణ్యపురలో ఒక మహిళ ఇలా ఫోన్ బిగించి కట్టి మాట్లాడుతూ ఒక వ్యక్తి కెమెరాకు చిక్కింది. అతను షూట్ చేసి ఇన్స్టాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. అందరూ ఇలా చేయడం ప్రమాదం అన్నారు. ఈ ఎండల్లో ఫోన్ వేడెక్కి పేలినా ప్రమాదమే అని మరికొందరు హెచ్చరించారు. పోలీసులు ఏం చేస్తున్నారని కొందరు ప్రశ్నించారు. చివరకు వీడియో పోలీసుల వరకూ వెళ్లింది. బండి నంబర్ ఆధారంగా ఆ మహిళను గుర్తించి యలహంక ట్రాఫిక్ స్టేషన్ వారు 5 వేల రూపాయల ఫైన్ వేశారు. అవసరమా ఇదంతా? -
ఏపీ పోలీస్: చోరీ అయిన ఫోన్ల రికవరీ.. యజమానులకు అందజేత (ఫొటోలు)
-
పిల్లలకి పోన్లు ఇచ్చి మీ పనుల్లో బిజీగా ఉంటున్నారా?
‘స్విగ్గి, జొమాటోల ఫుడ్డు తెప్పించి చేతులు దులుపుకోవద్దు. పిల్లల్ని అమ్మ చేతి రుచికరమైన వంట తిననివ్వండి’ అని కేరళ హైకోర్టు హితవు పలికింది. ఒక మొబైల్ ఫోన్ కేసులో బుధవారం తీర్పు వెలువరిస్తూ ‘సాయంత్రం ఆడుకుని వచ్చిన పిల్లలు ఇంట్లో వంట ఘుమఘులకు ఉత్సాహపడాలి. అన్నం అడగాలి. అలాంటి స్థితి నేడు ఉన్నదా?’ అని ప్రశ్నించింది. పిల్లల పెంపకంలో ఎన్నెన్నో మార్పులు వచ్చాయి.కాని, పిల్లల ఆటలు, ఆహారం విషయంలో కేరళ హైకోర్టు హెచ్చరికలు చాలా ముఖ్యమైనవి. ‘మైనర్ పిల్లల చేతికి తల్లిదండ్రులు సెల్ఫోన్లు ఇచ్చి వారిని సంతోషపెట్టవద్దు. పిల్లల చేతికి ఫోన్లు ఇచ్చి వారు ఏం చూస్తున్నారో పట్టించుకోకుండా తల్లిదండ్రులు ఇంటి పనులో సొంత పనులో చేసుకోవద్దు. పిల్లలు సెల్ఫోన్లలో చూడకూడనివి చూస్తే వాటి దుష్ఫలితాలు సుదీర్ఘకాలం ఉంటాయి’ అని కేరళ హైకోర్టు బుధవారం తల్లిదండ్రులకు హితవు చెప్పింది. కేరళలోని అలవు ప్రాంతంలో ఒక వ్యక్తి బహిరంగ ప్రదేశంలో ఫోన్లో పోర్న్ వీడియోలు చూస్తున్నాడని పోలీసులు పెట్టిన కేసును కొట్టి వేస్తూ (ఐపిసి సెక్షన్ 292 చెల్లదని) జస్టిస్ కున్హి కృష్ణన్ తల్లిదండ్రులకు సెల్ఫోన్ల గురించి హెచ్చరించారు. ‘పిల్లలు సెల్ఫోన్లలో విజ్ఞాన, వినోదానికి సంబంధించి వీడియోలు చూడాలి... అదీ తల్లిదండ్రుల సమక్షంలో. తల్లిదండ్రుల అజమాయిషీ లేకుండా వారు మొబైల్ చూడకూడదు. పిల్లలు ఆడుకునే సమయాల్లో ఆడుకోవాలి. వారిని ఫుట్బాలో, క్రికెట్టో ఆడేలా చేయండి. శారీరకంగా దృఢంగా ఎదిగేలా చేసి దేశ భవిష్యత్తు కోసం ఆశ పెట్టుకునేలా తీర్చిదిద్దండి’ అని కున్హి కృష్ణన్ అన్నారు. తల్లి చేసేదే రుచికరం అదే సమయంలో పిల్లల ఆహారం గురించి ఇటీవల వచ్చిన మార్పును కూడా జస్టిస్ వ్యాఖ్యానించారు. ‘పిల్లలకు స్విగ్గి, జొమాటోల నుంచి ఆహారం తెప్పించి ఇస్తున్నారు. కాని పిల్లలు తల్లి చేసిన రుచికరమైన తిండినే తినాలి. పిల్లలు సాయంత్రం ఆడుకోవడానికి వెళ్లి ఇంట్లో వంట ఘుమఘుమలు మొదలయ్యే సమయానికి చేరుకుని అన్నం కోసం ఎదురు చూడాలి. అలా జరిగితే ఎంత బాగుంటుంది? మేం చెప్పాల్సింది చెప్పాం. ఇక తల్లిదండ్రుల విచక్షణ’ అని కున్హి కృష్ణన్ అన్నారు. మేధో ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం కేరళ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు స్థూలంగా నేటి పిల్లల పెంపకాన్ని వ్యాఖ్యానిస్తున్నాయి. పరిశీలించి చూస్తే అవి పిల్లల మేధో, భౌతిక ఆరోగ్యం గురించి హెచ్చరిక చేస్తున్నాయి. ఇవాళ రేపు స్కూళ్లు, తల్లిదండ్రులు పిల్లల శారీరక వ్యాయామానికి వీలు ఇవ్వడం లేదు. ఆటలాడమని ప్రోత్సహించడం లేదు. ఆడుకునే వీలు కూడా కల్పించడం లేదు. దాంతో పిల్లలు కదలికలు మందగించి బద్దకం, స్థూలకాయం వంటి సమస్యలతో బాధ పడుతున్నారు. మరోవైపు ఆ సమయాన్ని సెల్ఫోన్లలో అనవసరమైన విషయాలు చూస్తూ బుర్ర పాడుచేసుకుంటున్నారు. ఫిల్టర్లు పెడితే తప్ప సెల్ఫోన్లలో పోర్నోగ్రఫీ, వయొలెంట్ వీడియోలు మీట దూరంలో ఉంటాయి. తెలిసీ తెలియని వయసులో వాటిని గంటల కొద్ది చూస్తే తీవ్ర మానసిక ప్రభావాలకు లోనవుతారు. జరగవలసిన నష్టం జరిగే వరకు తల్లిదండ్రులకు విషయం తెలియడం లేదు. ఇంకోవైపు వంటకు సమయం లేకనో లేదా పిల్లలు అడుగుతున్నారనో చీటికి మాటికి స్విగ్గీలో టిఫిన్లు, భోజనాలు తెప్పించే తల్లిదండ్రులు పెరిగారు. హోటల్ తిండి పిల్లలకు ఏ మాత్రం మంచిది కాదు. ఒకప్పుడు ఎప్పుడో తప్ప బయటి తిండి తిననివారు ఇవాళ ప్రతి రెండో రోజు ఏదో ఒకటి తెప్పిస్తున్నారు. తల్లి చేసే ఒకటి రెండు కూరలైనా ఎంతో శుచిగా, రుచిగా ఉంటాయి. వంట పని భారం కాకుండా భర్త, పిల్లలు సాయం చేస్తే శుభ్రమైన ఇంటి భోజనం చేయవచ్చు. కలిసి కూచుని భోంచేయడం ద్వారా కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పెరుగుతుంది కూడా. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. (చదవండి: కుక్కలా మారిన వ్యక్తి..ఆడ కుక్కతో ప్రేమలో..) -
‘లొకేషన్’తో ప్రైవసీ చిక్కులు!
సాక్షి, హైదరాబాద్: ‘లొకేషన్ పంపు.. నేను వచ్చేస్తా..’ ఎవరినైనా కలవడానికి వెళ్తేనో, కొత్త ప్రదేశానికి వెళ్తేనో ఈ మాట తప్పకుండా వినిపిస్తుంది. ఎవరికైనా మనం ఎక్కడున్నామో అడ్రస్ చెప్పాలన్నా.. కొత్త ప్రాంతంలో నిర్దిష్టమైన ప్రాంతానికి వెళ్లాలన్నా ఈ లొకేషన్ ఫీచర్ ఎంతో ప్రయోజనకరం. పెద్దగా తికమక పడాల్సిన అవసరం లేకుండానే అవసరమైన ప్రదేశానికి చేరుకోవచ్చు. కానీ ఇది ఎంత సౌకర్యవంతమో అంతే స్థాయిలో ఇబ్బందికరం కూడా అని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది మన ప్రైవసీని దెబ్బతీస్తుందని.. మనం ఎక్కడున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడ ఎంత సేపు ఉన్నామనే ప్రతి అంశం ఈ లొకేషన్తో తెలిసిపోతుందని స్పష్టం చేస్తున్నారు. ఉదాహరణకు మనం ఏదైనా షాపింగ్ మాల్కు వెళ్లామా? సినిమా థియేటర్లో ఉన్నామా? ఏదైనా పర్యాటక ప్రాంతానికి వెళ్లామా? అన్న వివరాలు గూగుల్తో పాటు మన ఫోన్లోని వివిధ యాప్ సంస్థలకు చేరిపోతాయి. ఇది మన వ్యక్తిగత అంశాలను బహిరంగం చేయడమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందువల్ల అవసరమైనప్పుడు మాత్రమే మన మొబైల్ ఫోన్లలోని లొకేషన్ను ఆన్ చేసుకోవాలని.. తర్వాత ఆఫ్ చేసి పెట్టడం వల్ల మనపై ఎవరూ నిఘా పెట్టకుండా ఉంటుందని వివరిస్తున్నారు. నిపుణులు సూచిస్తున్న జాగ్రత్తలివీ.. మొబైల్ ఫోన్లలోని అన్ని అప్లికేషన్స్ (యాప్ల)కు లొకేషన్ సర్వీసెస్ అనుమతులు (పర్మిషన్) ఇవ్వొద్దు. అపరిచిత, అనుమానాస్పద యాప్లకు మన లొకేషన్ యాక్సెస్ ఇస్తే.. అది మన వ్యక్తిగత భద్రతకు ముప్పుగా మారుతుంది. కొన్ని యాప్లకు మనం ఇచ్చే పర్మిషన్లతో.. మన లొకేషన్ వివరాలు తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే అవకాశం, మన కదలికలపై నిఘా పెట్టేందుకు ఆస్కారం ఉంటుంది. లొకేషన్ ఆన్లో ఉండటంతో మనం ఎప్పుడు ఎక్కడ ఉంటున్నామన్న సమాచారం ఇతరులకు సులువుగా తెలిసే అవకాశం ఉంది. లొకేషన్ను ఆధారంగా చేసుకుని కొందరు ఆకతాయిలు వేధింపులకు పాల్పడే ప్రమాదం ఉంటుంది. మొబైల్లో ఎప్పుడూ లొకేషన్ ఆన్లో ఉండటం వల్ల బ్యాగ్రౌండ్లో ఈ యాప్ పనిచేస్తూ, బ్యాటరీలో చార్జింగ్ త్వరగా తగ్గుతుంది. మొబైల్లో డేటా కూడా త్వరగా అయిపోయే అవకాశం ఉంటుంది. -
ఆన్లైన్ + ఆఫ్లైన్ పండుగలకు ‘హైబ్రిడ్ షాపింగ్’
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుత పండుగల సీజన్లో... ‘హైబ్రిడ్ షాపింగ్’నకు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది. ‘రాఖీ బంధన్’తో మొదలై వచ్చే ఏడాది ప్రథమార్థం దాకా ఈ ఫెస్టివల్ సీజన్ సుదీర్ఘంగా సాగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదలైన ఈ సీజన్లో హైబ్రిడ్ షాపింగ్నకే అధికశాతం మొగ్గుచూపుతున్నట్టు వివిధ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత వినియోగదారులు మరీ ముఖ్యంగా నవ, యువతరం ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంతో పాటు డిజిటల్ టెక్నాలజీని విరివిగా ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో...ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లోనూ షాపింగ్కు కస్టమర్లు సిద్ధమవుతున్నారు. కోవిడ్ తెచ్చి న మార్పుచేర్పులతో... షాపింగ్, ఇతర విషయాల్లో కొత్త కొత్త విధానాలు, పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. గతేడాదితో పోల్చితే ఈసారి 84 శాతం వినియోగదారులు తమ షాపింగ్ బడ్జెట్ను గణనీయంగా పెంచినట్టు అడ్వర్టయిజ్మెంట్ యూనికార్న్ సంస్థ ‘ఇన్మోబీ’తాజా నివేదికలో వెల్లడైంది. నివేదికలో ఏముందంటే... చేతిలో ఇమిడిపోయే మొబైల్ ఫోన్లతోనే షాపింగ్ చేయడం, సంస్థల సైట్లను ఆన్లైన్లోనే వీక్షించి, సమీక్షించుకునే సౌలభ్యం ఉన్నందున పలువురు ఆన్లైన్ కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. ఐతే...ఆన్లైన్తో పాటు స్వయంగా షాప్లకు వెళ్లి వివిధరకాల వస్తువులు, ఇతరత్రా సామగ్రి కొనేందుకు ఇష్టపడుతున్న వారి సంఖ్య గణనీయంగా ఉన్నట్టుగా... అ రెండింటిని సమ్మిళితం చేసి హైబ్రిడ్ షాపింగ్ చేసే వారు 54 శాతం ఉన్నట్టుగా ఈ నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొబైల్ఫోన్లను వినియోగించే వారి నుంచి వివిధ అంశాల వారీగా ఈ సంస్థ సమాచారాన్ని సేకరించింది. ఆఫర్ల సమాచారం ఎలా తెలుసుకుంటున్నారు? మొబైల్లో సెర్చింగ్, ప్రకటనల ద్వారా.. 46% బ్రాండ్ వెబ్సైట్లు/ వివిధ యాప్ల ద్వారా.. 15% ప్రత్యక్షంగా షాపులకు వెళ్లి తెలుసుకునేవారు.. 11% కుటుంబం, స్నేహితుల ద్వారా.. 7% టీవీ ప్రకటనలు, ఇతర రూపాల్లో.. 7% వార్తాపత్రికలు, మ్యాగజైన్ల ద్వారా.. 6% ఈమెయిళ్లు, బ్రాండ్ల నుంచి న్యూస్లెటర్లతో.. 4% వాట్సాప్లో బ్రాండ్ల ద్వారా వచ్చే సమాచారంతో.. 3% తదనుగుణంగా మార్కెటింగ్ వ్యూహాలు... ‘తమ స్మార్ట్ఫోన్ల ద్వారానే షాపింగ్ చేయాలని 78 శాతం మంది భావిస్తున్నారు. దీనికి తగ్గట్టుగా వివిధ కంపెనీలు, సంస్థలు కూడా తమ మార్కెటింగ్ వ్యూహాలను రూపొందించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా ప్రస్తుత పండుగల సీజన్లో కస్టమర్లను ఆకర్షించేందుకు, వారు కోరుకున్న విధంగా ఆయా వస్తువులను అందించేందుకు, వారితో నేరుగా కనెక్ట్ అయ్యేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నాము’ - వసుత అగర్వాల్,చీఫ్ బిజినెస్ ఆఫీసర్, కన్జ్యూమర్ అడ్వర్టయిజింగ్ ప్లాట్ఫామ్, ఇన్మోబీ -
తక్కువ ధరలో బెస్ట్ మొబైల్ కావాలా? ఎంచుకో ఓ మంచి ఆప్షన్..
Best Mobile Phones Under 15,000: భారతీయ మార్కెట్లో రోజు రోజుకి కొత్త ఉత్పత్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇందులో స్మార్ట్ఫోన్లు ఎక్కువగా ఉన్నాయి. చాలా బ్రాండ్స్ ఖరీదైనవి కాగా.. మరికొన్ని బడ్జెట్ ధరలోనే లభిస్తాయి. ఆగష్టు నెలలో రూ. 15,000 కంటే తక్కువ ధర కొనుగోలుచేయదగిన టాప్ 5జీ మొబైల్స్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. రెడ్మీ 12 5జీ (Redmi 12 5G).. ఆధునిక మార్కెట్లో రెడ్మీ మొబైల్స్కి డిమాండ్ భారీగా ఉంది. దీనికి కారణం తక్కువ ధర వద్ద వినియోగదారునికి కావలసిన ఫీచర్స్ లభించడమే. మన జాబితాలో బడ్జెట్ ధరలో లభించే స్మార్ట్ఫోన్లలో రెడ్మీ 12 5జీ ఒకటి. దీని ధర రూ. 10,999 మాత్రమే. ఇది స్నాప్డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ కలిగి మంచి కెమెరా సెటప్ కూడా పొందుతుంది. శాంసంగ్ గెలాక్సీ ఎమ్14 5జీ (Samsung Galaxy M14 5G).. శాంసంగ్ కంపెనీకి చెందిన 'గెలాక్సీ ఎమ్14 5జీ' రూ. 15,000 కంటే తక్కువ ధర వద్ద లభించే బెస్ట్ మోడల్. రోజు వారీ వినియోగానికి మాత్రమే కాకుండా గేమింగ్ వంటి వాటికి కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. పనితీరు పరంగా ఉత్తమంగా ఉండే ఈ మొబైల్ 93Hz డిస్ప్లే పొందుతుంది. మంచి డిజైన్, అద్భుతమైన బ్యాటరీ పర్ఫామెన్స్ కలిగి వినియోగదారులకు అన్ని విధాలా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇదీ చదవండి: ధనవంతుడవ్వాలనే తపన సరిపోదు.. ఈ టిప్స్ తప్పనిసరి! రియల్మీ నర్జో ఎన్53 5జీ (Realme Narzo N53).. చూడటానికి ఐఫోన్ మాదిరిగా కనిపించడమే కాకుండా వినియోగదారులను ఒక్క చూపుతోనే ఆకట్టుకునే ఈ 'రియల్మీ నర్జో ఎన్53 5జీ' మన జాబితాలో చెప్పుకోదగ్గ స్మార్ట్ఫోన్. ఇది ప్రత్యేకంగా గేమింగ్ ఫోన్ కానప్పటికీ.. గేమ్లకు కూడా సపోర్ట్ చేస్తుంది. ఫింగర్ప్రింట్ రెసిస్టెంట్ బ్యాక్ ప్యానెల్ కలిగి అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. ఇదీ చదవండి: ఎక్స్ బాయ్ ఫ్రెండ్పై జొమాటో ద్వారా రివేంజ్! యువతి చేసిన పనికి.. ఐక్యూ జెడ్6 లైట్ 5జీ (iQOO Z6 Lite 5G).. మన జాబితాలో తక్కువ ధరలో లభించే మరో మొబైల్.. ఐక్యూ జెడ్6 లైట్ 5జీ. ఇది ఆకర్షణీయమైన డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఈ స్మార్ట్ఫోన్ స్నాప్డ్రాగన్ 4 జెన్ 1 ఎస్ఓసీ చిప్సెట్ కలిగి, మంచి బ్యాటరీ కెపాసిటీ కలిగి ఉంటుంది.అంతే కాకుండా ఇందులో 50 మెగా పిక్సెల్ డ్యూయెల్ రియర్ కెమెరా ఉంటుంది. -
అన్నీ మొబైల్లోనే.. ఆఖరికి కాపురాలు కూడా ఆన్లైన్లోనే!
మా ఊరు రాయికల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న రోజుల్లో ( 1956-68) కే వీ రాజు గారుమా తెలుగు సారు. మంచి జోకులు వేస్తూ పాఠాలు చెప్పేవాడు కాబట్టి ఆయన క్లాస్ ఎప్పుడూ నిండుగా ఉండేది. 'పిచ్చి సన్నాసి' అన్నది ఆయనకు ఊతపదం. మీరు మా అందరినీ పిచ్చోళ్ళనే అంటున్నారు మాలో అసలు పిచ్చోడు ఎవడు సార్!అని అడిగాం ఒక రోజు. 'ఎవడైతే ఒంటరిగా కూర్చొని తనలో తాను నవ్వుకుంటూ, తనతో తాను మాట్లాడుకుంటాడో, చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేస్తాడో వాడేరా ఏక్ నెంబర్ పిచ్చోడు!' అన్నాడాయన. ఇది దాదాపు అరవై సంవత్సరాల నాటి విషయం. మా మాస్టారు చెప్పిన లక్షణాలనుబట్టి చూస్తే ఇప్పుడు అలాంటివాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందనే చెప్పాలి. రోడ్లమీద,బస్స్టాప్ ల దగ్గర,పార్కులు పబ్లిక్ స్థలాల్లో, కార్యాలయాల్లో ఇందుగలరందు లేరన్నట్లుగా ఎక్కడ చూసినా ఒంటరిగా పరిసరాలను, చేయాల్సిన పనులను కూడా మరిచిపోయి చెవి పుల్ల తగిలించుకొని, చూపుడు వెలుతో ప్రపంచాన్ని చుట్టేస్తూ తమలో తామే నవ్వుకుంటూ, తమతో తామే గంటలు గంటలు మాట్లాడుకుంటున్నట్లు కనబడే సెల్ ఫోన్ పిచ్చిగాళ్ళు విచ్చలవిడిగా కనబడుతున్నారు, ఎవరి పిచ్చి వారికానందం ! మొబైల్ వ్యసనంగా మారిన తర్వాత వచ్చిన దుష్పరిణామాలు 1. జ్ఞాపకశక్తి బాగా తగ్గిపోయింది (గతంలో కనీసం 50 లాండ్లైన్ నెంబర్లు గుర్తుండేవి), ఇప్పుడు దేనికయినా కాంటాక్ట్స్లోకి వెళ్లి పేరు, ఫోటో చూసి నొక్కడమే. 2. మెదడుకు మేత అసలే లేదు ఇప్పుడు ఏదయినా మొబైలే. కాలిక్యులేటర్ మొబైల్లోనే, క్యాలెండర్ మొబైల్లోనే, పెయింట్, ఆర్ట్, ఎడిటింగ్ అన్నీ AI సహకారంతోనే. అంటే నీ మెదడుకు పని చెప్పడమే లేదు. మేత వేయనప్పుడు.. మెదడు కూడా పని చేయడం మానేస్తుంది. 3. సృజనాత్మకత ప్రదర్శించే అవకాశమే లేదు మనిషి అన్నాక కాసింత కళాపోషణ ఉండాలన్నది నాటి మాట. జీవితాల్లోకి మొబైల్ ఎంటరయ్యాక.. మరొకరిని చూసి ఫాలో కావడమే తప్ప మనలో జ్ఞానం వికసించేది చాలా తక్కువ. కోటిలో ఒకరు బాగుపడితే.. మిగతా అంతా దానికి బానిసలవుతున్నారు. 4. రుచిని గ్రహించే సమయం లేదు ఏం తింటున్నామన్నా స్పృహనే లేదు, తింటున్నంత సేపు చేతిలో మొబైల్, తల తీసుకెళ్లి స్క్రీన్లో పెట్టడమా. మన ముందున్న ప్లేట్లో ఏముంది, దాని రుచి ఏంటీ? అది ఎలా తినాలి? ఏం తెలియట్లేదు. నోట్లోకి నెట్టడం, కడుపులోకి కుక్కడం.. 5. సెల్కు జై, బంధుత్వాలకు బై బై గతంలో సెలవులు వస్తే.. ఊళ్లకు వెళ్లి బంధువులతో, మిత్రులతో గడిపేవాళ్లు. ఇప్పుడిది బాగా తగ్గింది. ఎవడి సెల్ వాడికి లోకం. సినిమాలు, క్రికెట్, చాటింగ్లు అన్నీ మొబైల్లోనే.. 6. సర్వం సెల్ మయం తినాలంటే మొబైల్లో ఆర్డర్, చదువుకోవాలంటే మొబైల్లో ఆన్లైన్ క్లాస్లు, ఆఫీస్ మీటింగ్లు మొబైల్లో వర్చువల్, ఇంకా రేపు స్పర్శ కూడా తెస్తారట. అప్పుడు కాపురాలు కూడా ఆన్లైన్లో ఉంటాయేమో. పోయేకాలం.. మొబైల్ రూపంలో దాపురిస్తే.. ఎవరేం చేయగలరు. కే వీ రాజు గారు పిచ్చి సన్నాసి అన్నది ప్రత్యేకంగా ఇప్పుడు ఒకరిని ఉద్దేశించే అవసరమే లేదు. వేముల ప్రభాకర్, హైదరాబాద్ -
పబ్లిక్ కి లక్షల విలువ చేసే మొబైల్ ఫోన్స్ పంచిన పోలీసులు
-
సీఈఐఆర్తో 2,43,875 మొబైల్ ఫోన్లు గుర్తించాం
సాక్షి, హైదరాబాద్/రాంగోపాల్పేట్: చోరీకి గురైన, కనిపించకుండా పోయిన మొబైల్ ఫోన్లను గుర్తించేందుకు అమల్లోకి తెచ్చిన సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) ద్వారా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2,43,875 మొబైల్ ఫోన్లను గుర్తించినట్టు టెలికాం స్పెషల్ డైరెక్టర్ జనరల్ అశోక్కుమార్ తెలిపారు. ప్రపంచ టెలీ కమ్యూనికేషన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నుంచి సంచార్ సాథీ పోర్టల్ను అందుబాటులోకి తెస్తున్నట్టు వెల్లడించారు. మంగళవారం సికింద్రాబాద్లోని సీటీఓ భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ పోర్టల్లోని టాప్కాఫ్ (టీఏఎఫ్సీఓపీ) మాడ్యుల్ ద్వారా ఒక ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్కార్డులు వాడుతున్నారనేది తెలుస్తుందని చెప్పారు. దీనివల్ల మన గుర్తింపు కార్డుతో ఎవరైనా సిమ్లు వాడుతుంటే గుర్తించవచ్చన్నారు. అదే పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేసి, సిమ్లను బ్లాక్ చేయవచ్చని చెప్పారు. టాప్కాఫ్ను ఏపీఎల్ఎస్ఏ విజయవాడ బ్రాంచ్ తయారు చేయగా ఏడాదిన్నరగా ఉపయోగిస్తున్నామని ఇప్పుడు జాతీయ స్థాయిలో అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 40.87లక్షల అనుమానాస్పద కనెక్షన్లను గుర్తించి, అందులో 36.61 కనెక్షన్లు రద్దుచేసినట్లు చెప్పారు. సైబర్క్రైమ్, బ్యాంకింగ్ మోసాలను నిరోధించేందుకు ఈ పోర్టల్ ఉపయోగపడుతుందని చెప్పారు. -
Google Pixel 7a: విడుదలకు ముందే లీకైన వివరాలు
ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ వాడకానికి అలవాటుపడ్డ జనం కోసం గూగుల్ మిడ్ రేంజ్లో 'పిక్సెల్ 7ఏ' విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. కంపెనీ ఈ ఏడాది మేలో జరిగే గూగుల్ ఐ/ఓ 2023 (Google I/O 2023) ఈవెంట్లో కంపెనీ దీనిని లాంచ్ చేయనుంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న గూగుల్ పిక్సెల్ 6ఏ కంటే కూడా 7ఏ చాలా అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ప్రాసెసర్ నుంచి కెమెరాల వరకు చాలా విభాగాల్లో పిక్సెల్ 7ఏ అప్గ్రేడ్ పొందినట్లు సమాచారం. ఈ మొబైల్ ఫోన్ 6.1 ఫుల్ హెచ్డీ+ 90హెర్ట్జ్ OLED డిస్ప్లే పొందుతుంది. అంతే కాకుండా గూగుల్ టెన్సార్ జీ2 ప్రాసెసర్ కూడా ఇందులో ఉంటుంది. త్వరలో విడుదలకానున్న గూగుల్ పిక్సెల్ 7ఏ వెనుక 64 మెగాపిక్సెల్ సోనీ IMX787 ప్రైమరీ, 12 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉంటాయని సమాచారం. అయితే కంపెనీ ఈ మొబైల్ ఫ్రంట్ కెమెరా గురించి ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. ఇది వైర్లెస్ చార్జింగ్కు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. అయితే ఛార్జింగ్ కెపాసిటీ గురించి తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: దెబ్బకు 17 కార్లు డిస్కంటిన్యూ: జాబితాలో ఉన్న కార్లు ఏవంటే?) గూగుల్ పిక్సెల్ 7ఏ మొబైల్ ధరల గురించి కూడా కంపెనీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే గత సంవత్సరం విడుదలైన 6ఏ ధర రూ. 30,000 కంటే తక్కువ. కావున కొత్త ఏ7 దీని కంటే కొంత ఎక్కువ ధర వద్ద విడుదలయ్యే అవకాశం ఉంది. -
సెల్ రోగం..అధికమవుతున్న టెక్స్ట్ నెక్ సిండ్రోమ్
ప్రస్తుత పరిస్థితుల్లో సెల్ఫోన్ లేకపోతే ఏ ఒక్క పని జరగని పరిస్థితి. సెల్ఫోన్ వల్ల జరిగే మంచిని అటుంచితే... ఇప్పటికే చాలామంది ఎక్కువగా మొబైల్ఫోన్లు వినియోగిస్తూ రకరకాల రుగ్మతల బారిన పడుతున్నారు. కంటి సమస్యలతో కొందరు, గేమింగ్కు బానిసలై మరికొందరు, మానసిక సమస్యలతో కూడా ఎంతో మంది అవస్థలు పడుతున్నారు. తాజాగా ‘టెక్ట్స్ నెక్ సిండ్రోమ్’ (మెడకు సంబంధించిన నొప్పి) పట్టిపీడిస్తోంది. ఉరవకొండకు చెందిన ఓ యువతి హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు కాలేజీలో బీటెక్ చదువుతోంది. తల ఓవైపునకు వంచినట్టు ఉందని బాధపడుతుంటే తల్లిదండ్రులు డాక్టర్కు చూపించారు. ఈమె ఎక్కువగా సెల్ఫోన్ వాడటం వల్ల ఇలా జరిగిందని న్యూరో వైద్యులు చెప్పారు. ఇప్పుడామె నొప్పి భరించలేక ఆక్యుపేషనల్ థెరఫీ చేయిస్తోంది. అనంతపురానికి చెందిన అనీల్కుమార్ సాఫ్ట్వేర్ ఇంజినీర్. అమెరికాలో కూడా పదేళ్లు పనిచేసి వచ్చారు. మొబైల్ ఫోన్ వాడకం పెరిగి ఆయనకు మెడనొప్పితో పాటు నడుమునొప్పి వచ్చింది. నగరంలోనే ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంత జిల్లాలో స్మార్ట్ ఫోన్ వాడుతున్న వారిలో ఎక్కువ మంది ‘టెక్ట్స్ నెక్ సిండ్రోమ్ ’కు గురవుతున్నట్లు తేలింది. దీనివల్ల మెడ వంకర్లు పోవడం, మెడనొప్పి రావడం, తలెత్తుకు తిరగలేకపోవడం జరుగుతోంది. ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ ఎర్గొనోమిక్స్ అనే జర్నల్ టెక్ట్స్ నెక్ సిండ్రోమ్ పెద్ద భూతంలా వేధిస్తోందని వెల్లడించింది. ఈ సిండ్రోమ్ కారణంగా నాడీ వ్యవస్థ దెబ్బతింటోందని వైద్యులు చెబుతున్నారు. ఏమిటీ టెక్ట్స్ నెక్ సిండ్రోమ్? టెక్ట్స్ నెక్ సిండ్రోమ్ అనేది వైరసో, బాక్టీరియానో కాదు. తదేకంగా సెల్ఫోన్ను వాడుతున్న వారికి వచ్చే ప్రత్యేక జబ్బు. స్మార్ట్ఫోన్లు వాడుతున్న వారిలో ఈ పరిణామాలు తీవ్రంగా ఉన్నాయి. ప్రధానంగా టెక్ట్స్ మెసేజ్లు ఎక్కువ సేపు చూస్తూండటం వల్ల మెడ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు తేలింది. దీంతో మెడ కండరాలు, నరాలు ఒత్తిడికి గురై నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తున్నాయి. దీనివల్ల విపరీతమైన తలనొప్పి, భుజాల నొప్పి రావడం, ఇది ఇలాగే కొనసాగి, తొడ నుంచి పాదం వరకూ జాలుగా నొప్పిరావడం వంటివి జరుగుతున్నాయి. నిద్రలేమి, మానసిక ఒత్తిడి కూడా ఎదుర్కొంటున్నారు. టెక్ట్స్ నెక్ సిండ్రోమ్ నుంచి బయట పడండిలా... రెండు, మూడు నిముషాలకు కంటే ఎక్కువగా మెడలు వంచి సెల్ఫోన్లో మెసేజ్లు చూడకూడదు. స్మార్ట్ఫోన్ వాడుతున్న వారు పదే పదే మెడను రొటేట్ అంటే కుడి నుంచి ఎడమకు ఎడమ నుంచి కుడికి తిప్పుతూ ఉండాలి. ప్రతి గంటకోసారి రెండు మూడు సార్లు తలను పైకెత్తి మళ్లీ కిందికి బలవంతంగా వంచాలి. మెసేజ్ను చదవాలనుకున్నప్పుడు కుర్చీలో వెనక్కు వాలి ఫోన్ను ముఖంపైకి తెచ్చుకుని చదువుకోవాలి. పెద్ద పెద్ద మెసేజ్లు ఉన్నప్పుడు అంతా ఒకేసారి చదవకుండా మధ్యలో విరామం తీసుకుని మెడ వ్యాయామం చేయాలి. రోజూ యోగాసనాలు చేస్తే కండరాలు, నరాల వ్యవస్థ సానుకూలంగా మారి నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. వ్యాయామమే పరిష్కారం చాలామంది టెక్ట్స్ నెక్ సిండ్రోమ్ గురై మెడనొప్పి తట్టుకోలేక పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారు. ఇది కరెక్టు కాదు. దీనివల్ల తాత్కాలికంగా నొప్పి తగ్గచ్చుగానీ, భవిష్యత్లో ప్రమాదం ఎక్కువ. తలకు, మెడకు సంబంధించి వ్యాయామం మంచిది. యోగా వల్ల చాలా వరకు నొప్పిని నియంత్రించుకోవచ్చు. – జె.నరేష్బాబు, మెడ, వెన్నుపూస వైద్య నిపుణులు తక్కువ సేపు వాడాలి మొబైల్ ఫ్లోన్లు చిన్నతనం నుంచే అలవాటు పడిన చాలామంది పిల్లలు ఇప్పటికే దృష్టిలోపంతో బాధపడుతున్నారు. గంటల తరబడి ఫోన్ చూడటం వల్ల సున్నితమైన కంటికి సంబంధించి అవయవాలు దెబ్బతింటున్నాయి. వీలైనంత తక్కువ సేపు వాడటం మంచిది. – పల్లంరెడ్డి నివేదిత, కంటివైద్య నిపుణురాలు ఉచ్చులో ఇరుక్కుపోయారు ఓ వైపు మెడనొప్పి, నడుమునొప్పులే కాదు.. రాత్రిళ్లు ఎక్కువగా మొబైల్ వాడి గేమింగ్, బెట్టింగ్ల కారణంగా వ్యసనాలకు లోనయ్యారు. నిద్రలేమి కారణంగా మెంటల్ కండీషన్ ఇన్బ్యాలెన్స్ అవుతోంది. చాలా మందికి చదువుమీద దృష్టి పోతోంది. మానసిక బలహీనతల వల్ల డ్రగ్స్ వైపు దృష్టి సారిస్తున్నారు. – డా.విశ్వనాథరెడ్డి, మానసిక వైద్యనిపుణులు -
అధీకృత సంస్థగా ఎంఈడీఈపీసీ
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచెస్, మానిటర్స్, మొబైల్స్ విడిభాగాల ఎగుమతికై ఎగుమతి కంపెనీలకు కావాల్సిన రిజిస్ట్రేషన్/మెంబర్షిప్ సర్టిఫికేట్ జారీ చేయడానికి.. మొబైల్, ఎలక్ట్రానిక్ డివైసెస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్కు (ఎంఈడీఈపీసీ) ప్రభుత్వం అధికారం ఇచ్చింది. ప్రొజెక్టర్లు, టీవీలు, ప్రింటర్లు, ఫోటోకాపీయింగ్ మెషీన్స్ వంటి ఇతర ఉత్పత్తులకూ ఎంఈడీఈపీసీ ధ్రువీకరణ పత్రం జారీ చేయనుంది. ఎగుమతి కంపెనీలు ఫారెన్ ట్రేడ్ పాలసీ కింద ప్రయోజనాలు పొందాలంటే ఈ సర్టిఫికేట్ తప్పనిసరి. -
ఫాక్స్కాన్కు రూ.357 కోట్లు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్లకు సంబంధించి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం కింద (పీఎల్ఐ).. యాపిల్ ఉత్పత్తుల కాంట్రాక్ట్ తయారీ సంస్థ ఫాక్స్కాన్ ఇండియాకు రూ.357 కోట్లు చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. అలాగే, డిక్సన్ టెక్నాలజీస్ సబ్సిడరీ అయిన పాడ్గెట్ ఎలక్ట్రానిక్స్కు రూ.58 కోట్ల ఉత్పత్తి ప్రోత్సాహకాల మంజూరునకు సైతం ఆమోదం తెలిపింది. పాడ్గెట్ ఎలక్ట్రానిక్స్కు మొబైల్ ఫోన్ల విభాగంలో తయారీ ప్రోత్సాహకాలు రావడం ఇది రెండో విడత కావడం గమనార్హం. ఈ విభాగంలో ప్రోత్సాహకాలను అందుకోనున్న తొలి కంపెనీ ఫాక్స్కాన్ కానుంది. చదవండి: కొత్త సంవత్సరంలో టీవీ ప్రేక్షకులకు ఊహించని షాక్! -
స్మార్ట్గా అతుక్కుపోతున్నారు.. తక్కువ ఆదాయం ఉన్నవాళ్లే!
సాక్షి, అమరావతి: ప్రస్తుతం మనిషి బాహ్య ప్రపంచానికి దూరంగా ఆన్లైన్లో గడుపుతున్నాడు. పక్కవాడిని కూడా చాటింగ్లోనే పలకరిస్తున్నాడు. సుఖదుఃఖాలన్నీ కూర్చున్నచోటునే అనుభవిస్తున్నాడు. గంటల కొద్దీ స్మార్ట్ఫోన్, టీవీ, ఇంటర్నెట్ స్క్రీనింగ్లో మునిగిపోతున్నాడు. దైనందిన జీవితంలో చాలామంది మేల్కొని ఉండే సమయంలో ఏకంగా 44 శాతం సమయాన్ని స్క్రీనింగ్ కోసమే కేటాయిస్తుండటం (40 శాతం ఇంటర్నెట్లో) ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రోజుకు సగటు స్క్రీనింగ్ రేటు 6.58 గంటలుగా ఉంది. ఇది 2013తో పోలిస్తే 49 నిమిషాలు పెరగడం గమనార్హం. అత్యధికంగా దక్షిణాఫ్రికాలో 10.46 గంటలు, అమెరికాలో అయితే 7.04 గంటలు, భారత్లో అయితే 7.18 గంటలుగా నివేదికలు చెబుతున్నాయి. ఇక్కడ తల్లిదండ్రులతో కలిసి 0–2 ఏళ్లలోపు పిల్లలు 49 శాతం మంది సెల్ఫోన్లలో ఉంటున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 2019లో సగటున 2.56 గంటల పాటు మొబైల్ స్క్రీన్ చూసిన వాళ్లు ఇప్పుడు 4.12 గంటలు చూస్తున్నారు. దేశంలో టీనేజర్లు అయితే ఏకంగా 8 గంటలకు పైగా ఆన్లైన్లోనే బతికేస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా సగటు స్క్రీనింగ్ సమయం కంటే ఎక్కువ. కళ్లు పొడారిపోతాయి ఎక్కువసేపు మొబైల్స్, టీవీ, కంప్యూటర్లు చూడటంవల్ల కళ్లు పొడారిపోతాయి. దీంతో కళ్లు ఎర్రగా మారి దురదలు, మంటలు వస్తుంటాయి. క్రమేణా నల్లగుడ్డు సమస్యలకు దారితీస్తాయి. వీటితో పాటు నిద్రలేమి, మానసిక సమస్యలకు దారితీస్తాయి. విద్యార్థులైతే చదువుపై దృష్టి సారించలేక పోవడం, చదివినవి మర్చిపోవడం వంటి సమస్యలకు గురవుతారు. అవసరమైన మేరకే టీవీలు, కంప్యూటర్, మొబైల్స్ను చూడాలి. – ఈఎస్ఎన్ మూర్తి, నేత్ర వైద్య నిపుణులు, జీజీహెచ్, విజయవాడ చిన్నారుల కోసం నిర్ణీత సమయం.. అమెరికన్ టీనేజర్లు అయితే కేవలం 3 గంటలు మాత్రమే టీవీ, వీడియోలు చూడటానికి సమయాన్ని కేటాయిస్తున్నారు. చైనాలో వారానికి మూడు గంటలు మాత్రమే చిన్నారులకు స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయాలని ఆ దేశం లక్ష్యంగా పెట్టుకుంది. అంటే రోజుకు 26 నిమిషాలు మాత్రమే నచ్చిన పరికరంలో నచ్చిన అంశాలను వీక్షించవచ్చు. ఇదే దారిలో జపాన్, రష్యా కూడా 30 నిమిషాలు, ఇజ్రాయెల్ 19 నిమిషాలు చాలంటూ పెద్దఎత్తున అవగాహన కల్పిస్తున్నాయి. ఆరోగ్యానికి హానికరం గంటల కొద్దీ తదేకంగా టీవీలు, ఫోన్లు, ఇంటర్నెట్కు అతుక్కుపోతే తీవ్ర అనారోగ్య పరిస్థితులు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్నారులు, యుక్త వయస్కులకు స్మార్ట్ఫోన్ వ్యసనంగా మారింది. దీనిని నోమోఫోబియాగా పిలుస్తారు. ఫోన్ లేకుండా వారు ఉండలేరు. చిన్నారుల్లో మానసికంగా, భావోద్వేగాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎలిమెంటరీ స్కూల్ స్థాయి పిల్లలు రెండు గంటలు అంతకంటే ఎక్కువసేపు స్క్రీనింగ్లో ఉంటే వారికి మెల్లగా స్థిరత్వాన్ని, నిర్ణయించుకునే శక్తి కోల్పోతారు. పలు దేశాల్లో 5–17 ఏళ్ల మధ్య వయసు చిన్నారుల్లో ఊబకాయం పెరిగింది. 9–10 ఏళ్ల వయసు పిల్లల్లో 3 గంటలకు పైగా స్క్రీన్ను చూస్తే టైప్–2 డయాబెటిస్ వచ్చినట్లు, గ్రహణశక్తిలో వెనుబడినట్లు గుర్తించారు. పెద్దల్లో అయితే నిద్రలేమికి దారితీస్తుంది. కంటి చూపును తీవ్రంగా దెబ్బతీస్తుంది. శరీరం పనితీరులో మార్పులొస్తాయి. వీటిని అరికట్టేందుకు సోషల్ మీడియా వాడకాన్ని ప్రతిఒక్కరూ రోజుకు 30 నిమిషాలకు పరిమితం చేయాలని పరిశోధకులు సూచిస్తున్నారు. తక్కువ ఆదాయం ఉన్నవాళ్లే ఎక్కువ సమయం స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, స్మార్ట్వాచ్లు, స్మార్ట్టీవీలు.. స్క్రీనింగ్కు ఎక్కువగా కారణమవుతున్నాయి. అయితే, వార్షిక ఆదాయం తక్కువ ఉన్న వాళ్లే ఎలక్ట్రానిక్ స్క్రీనింగ్లో ఎక్కువసేపు లీనమవుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. దేశంలో 97.2 శాతం మంది టీవీ, 92 శాతం మంది వీడియో గేములు ఆడుతున్నట్లు సర్వేల్లో తేలింది. ఇక్కడ 74 శాతం తల్లిదండ్రులు ఏడేళ్ల వయసు పిల్లలతో కలిసి ఎక్కువగా టీవీలు చూస్తున్నారు. -
ఫోన్ల వినియోగంలో ఢిల్లీదే అగ్రస్థానం
సాక్షి, అమరావతి: ఫోన్ల వినియోగంలో దేశంలోనే ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. అక్కడ ప్రతి వంద మందికి 267.63 ఫోన్లు వినియోగిస్తున్నట్టు ఆర్బీఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆ తరువాత కోల్కత్తాలో ప్రతి వంద మంది జనాభాకు 143.38 ఫోన్లు వినియోగిస్తుండగా.. ముంబైలో 139.95, హిమాచల్ ప్రదేశ్లో 138.44 చొప్పున ఫోన్లు వినియోగంలో ఉన్నాయి. ఈ మేరకు ఆర్బీఐ నివేదిక విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం 2022 మార్చి నాటికి దేశంలో ప్రతి వంద మంది జనాభాకు ల్యాండ్ ఫోన్లు, సెల్ ఫోన్లు, ఇతర ఫోన్లు అన్నీ కలిపి 84.87 ఉన్నట్టు స్పష్టమైంది. ఏపీలో 93.63% వినియోగం ఆంధ్రప్రదేశ్లో ప్రతి వంద మందికి 93.63 ఫోన్లు ఉన్నట్టు ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. దేశంలోనే అత్యల్పంగా ఫోన్లను వినియోగిస్తున్న రాష్ట్రంగా బిహార్ స్థానం దక్కించుకుంది. అక్కడ ప్రతి వంద మందికి 52.87 ఫోన్లు వినియోగిస్తున్నారు. 2019 నాటికి దేశవ్యాప్తంగా ప్రతి వంద జనాభాకు 90.10 ఫోన్లు ఉండగా.. 2022 మార్చి నాటికి ఆ సంఖ్య 84.87కు తగ్గడం గమనార్హం. -
కబళిస్తోన్న స్మార్ట్ ఫోన్.. పౌరుల భవిష్యత్తుపై వైద్య నిపుణుల ఆందోళన
సాక్షి, నిజామాబాద్ : కొన్నేళ్ల క్రితం క్రీడా మైదానాలు పిల్లలతో కిటకిటలాడేవి.. ఎక్కువ సేపు మైదానంలో గడిపితే ఇళ్లకు రావాలని తల్లిదండ్రులు మందలించేవారు. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. విద్యార్థులు ఆన్లైన్ గేమ్స్ పట్ల మక్కువ చూపుతూ మైదానాలకు, ఆటలకు దూరమవుతున్నారు. దీంతో తల్లిదండ్రులు పిల్లలను మైదానాలకు వెళ్లి ఆడుకోవాలని సూచిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావడం, కోవిడ్ కాలంలో ఆన్లైన్ పాఠా లు చెప్పడం తదితర కారణాలలో విద్యార్థులు ఆన్లైన్ పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఆన్లైన్ గేమ్లు వ్యసనంగా మారాయి. అనేక కొత్త అంశాలు తెలుసుకునేందుకు, ప్రాజెక్టు వర్క్లు సృజనాత్మకంగా చేసేందుకు ఇంటర్నెట్ ఉపయోగపడుతున్నప్పటికీ.. ఎక్కువ మంది విద్యార్థులు స్మార్ట్ ఫోన్లకు బానిసలుగా మారుతుండడంతో రేపటి పౌరుల భవిత ఏమిటనే ఆందోళనను పలువురు మనస్తత్వ శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. బాలల దినోత్సవం నేపథ్యంలో జిల్లాలోని బోధన్, బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాల్లోని 3 ప్రభుత్వ, 3 ప్రైవేటు పాఠశాలల్లోని 9, 10 తరగతులకు చెందిన 120 మంది విద్యార్థులపై ‘సాక్షి’ సర్వే నిర్వహించింది. వారి అభిప్రాయాలను సేక రించింది. ఇందులో 60 మంది బాలురు, 60 మంది బాలికలు ఉన్నారు. జాతిపితపై అభిమానం.. ఆసక్తిలేని రాజకీయాలు స్వాతంత్య్ర సమర యోధుల్లో జాతిపిత మ హాత్మా గాంధీ అంటే అభిమానమని ఎక్కువ మంది విద్యార్థులు మనోభిప్రాయం వ్యక్తం చేశారు. తర్వాత స్థానం భగత్ సింగ్కు దక్కింది. రాజకీయాల పట్ల ఆసక్తి కనబర్చలేదు. ఇంజినీరు, వైద్య వృత్తిపై మక్కువ చూపారు. తల్లిదండ్రుల్లో అమ్మకే ఎక్కువ ఓటేశారు. బాల్యం తమ అభిరుచుల మేరకు గడుస్తోందని, చదువును ఇష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. గణిత శాస్త్రానికి ప్రాధాన్యత ఇచ్చారు. సాఫ్ట్వేర్ వైపే మొగ్గు మంచి వేతనంతో కూడిన ఉద్యోగాలతో దేశ, విదేశాల్లో స్థిరపడవచ్చనే ఆలోచనతో డాక్టర్ చదువుల కంటే సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్పై ఎక్కువ ఆసక్తి చూపుతున్న విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గణితంతో కూడిన ఎంపీసీపై శ్రద్ధ పెడుతున్నారు. – ఖాందేశ్ రాజేశ్వర్రావు, విద్యార్థి తండ్రి, ఆర్మూర్ అవసరానికే వాడాలి కోవిడ్కు ముందు పిల్లలు సెల్ఫోన్లు ముడితే కోపగించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, కోవిడ్ అనంతరం ఆన్లైన్ తరగతుల కారణంగా సెల్ఫోన్ల వినియోగాన్ని ప్రోత్సహించాల్సి వచ్చింది. సెల్ఫోన్ వల్ల మంచి ఎంత ఉందో చెడు అంతే ఉంది. విద్యార్థుల చదువుల అవసరానికి మాత్రమే సెల్ఫోన్, ఇంటర్నెట్ ఉపయోగించేలా అవగాహన కల్పించాలి. మా పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయి. – ప్రవీణ్ పవార్, ప్రధానోపాధ్యాయుడు, విద్య హైస్కూల్, ఆర్మూర్ రోగగ్రస్త యువతగా రేపటి పౌరులు విద్యార్థులు స్మార్ట్ ఫోన్కు బానిసలవుతున్నారు. శారీరక శ్రమ లేకుంటే మానసిక ధృఢత్వం ఉండ దు. విద్యార్థులను జంక్ ఫుడ్కు అలవాటు చేయ డంతో ఊబకాయం, శక్తి, యుక్తి, ఉత్తేజం లేని యువత తయారవుతోంది. స్మార్ట్ ఫోన్లలో పో ర్నోగ్రఫీతో మానసిక రోగగ్రస్తులుగా మారుతున్నారు. తలనొప్పి, కంటిచూపు దెబ్బతినడం, కోపం, చికాకు చిన్నవయస్సులోనే వస్తున్నాయి. ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడి తల్లి,దండ్రుల హత్యకు తెగిస్తున్నారు. ఆత్మహత్యలు చేసు కుంటున్నారు. – డాక్టర్ కేశవులు, మానసిక వైద్య నిపుణులు బాల్యం మీ అభిరుచుల మేరకు గడుస్తోందా? ►అవును 99, కాదు 21 చదువును ఇష్టంగా భావిస్తున్నారా..? ►అవును 98, కష్టంగానా ? : కాదు 22 ఇష్టమైన పని ►చదవడం 58, ఆన్లైన్ గేమ్ ఆడడం 36, మైదానంలో ఆడడం 26 పెద్దయ్యాక ఏమవుతారు ►డాక్టర్ 38, ఇంజినీర్ 42, పోలీస్ 17, కలెక్టర్ 14, సాప్ట్వేర్ 2, ఆర్మీ 2, టీచర్ 3, సీఏ 1, రాజకీయం 1 అమ్మానాన్నల్లో ఎవరంటే ఇష్టం ►అమ్మ 55, నాన్న 30, ఇద్దరు 35 ఇష్టమైన సబ్జెక్టు ►ఆంగ్లం 25, గణితం 43, రసాయన శాస్త్రం 10, భౌతికశాస్త్రం 11, సోషల్ 20, తెలుగు 11 స్వాతంత్య్ర పోరాట యోధుల్లో ఇష్టమైనవారు ►గాంధీ 53, నెహ్రూ 13, సర్దార్ పటేల్ 19, భగత్సింగ్ 20, సుభాష్ చంద్రబోస్ 15 తల్లిదండ్రుల ప్రభావం ఉంటోంది విద్యార్థుల ఆలోచనలపై తల్లిదండ్రులు, కుటుంబాల ప్రభావం ఎంతో ఉంది. సెల్ఫోన్లు, టీవీ ల వల్ల విద్యార్థులు నష్టపోతున్నారు. పాఠశాల ల్లో కౌన్సెలింగ్ నిర్వహించడం ద్వారా క్రీడలపై ఆసక్తి పెంచాలి. తల్లిదండ్రులు పిల్లలకు సెల్ఫోన్లు ఇవ్వడం మానుకోవాలి. ఒక వేళ ఇచ్చినా కొంత సమయమే గడిపే విధంగా వ్యవహరించాలి. –అజారుద్దీన్, తిమ్మాపూర్, మోర్తాడ్ మండలం ఇబ్బందికరంగా సెల్ఫోన్లు సెల్ఫోన్లు విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. చదువుపై శ్రద్ధ తగ్గుతోంది. కోవిడ్ అనంతరం ఈ పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో కొంత మార్పు వచ్చింది. చదవాలనే పట్టుదల పెరిగింది. బాలుర కంటే బాలికలే ఉంతో ఉత్సాహంగా చదువులో ముందుంటున్నారు. –శేఖర్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ముబారక్నగర్ ఉన్నత పాఠశాల, నిజామాబాద్ క్రీడలను ప్రోత్సహించాలి పిల్లలు ఇంటి బయట ఆడు తుంటే ఇంట్లోకి పిలిచి బయటకు వెళ్లకుండా టీవీ చూస్తూ ఆడుకో అనే తల్లిదండ్రుల సంఖ్య కూడా పెరిగిపోయింది. దీంతో పిల్లలు మానసిక, శారీరక సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలల్లో గేమ్స్ పీరియడ్ను విధిగా నిర్వహిస్తూ మైదానంలో క్రీడలు ఆడించాలి. – జాదె శ్రీనివాస్, విద్యార్థి తండ్రి, ఆర్మూర్ తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలి ఆన్లైన్ తరగతులతో ప్రతి విద్యార్థి మొబైల్ వాడాల్సి వచ్చింది. క్లాసుల తరువా త పిల్లలు మొబైల్ ఫోన్ల లో గేమ్స్కు అలవాటు పడ్డారు. ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైనప్పటికీ ఇష్టంగా చదవలేకపోతున్నారు. తల్లిదండ్రులు శ్రద్ధతో విద్యార్థులు చదువుకునేలా చూడాలి. –బచ్చు రవి, ఉపాధ్యాయుడు, ఘన్పూర్, డిచ్పల్లి మండలం ప్రాథమిక స్థాయి నుంచే .. ప్రాథమిక పాఠశాల దశ నుంచి పిల్లలు సెల్ఫోన్కు అలవాటు పడుతున్నారు. పిల్లల సెల్ఫోన్ వియోగంపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి.తరగతి గదిలో కాకుండా ఇంటి వద్ద పాఠ్యాంశాలను చదవటంపై ఆసక్తి కనబర్చేందుకు పిల్లలపైప్రత్యేక దృష్టిపెట్టాలి. –మధుకుమార్, టీచర్, ఇందూర్ హైస్కూల్, బోధన్ అభిరుచులు మారుతున్నాయి విద్యార్థుల అభిరుచులు రోజుకో విధంగా మారుతున్నాయి. కొంత మంది అపారమైన జ్ఞానం కలిగి ఉంటే మరి కొందరికి బద్దకం ఎక్కువ. భవిష్యత్తులో ఏమి కావాలో నిర్ణయించుకుని కృషి చేస్తున్నవారూ ఉన్నారు. –శ్యామ్, పీఈటీ, తిమ్మాపూర్, మోర్తాడ్ మండలం మొబైల్ ఫోన్లకే ప్రాధాన్యత పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వాడకంపై కౌన్సెలింగ్ ఇవ్వాలి. తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులను గాడిలో పెట్టాలి. ప్రభుత్వం మెరుగైన విద్యను అందించడానికి కృషి చేయాలి. – అబ్దుల్ హఫీజ్, ఘన్పూర్, డిచ్పల్లి మండలం సెల్ను దూరం చేయలేని పరిస్థితి ఆన్లైన్ పాఠాల వల్ల పిల్లలకు సెల్ ఫోన్ వాడకం ఎక్కువైంది. బడి నుంఇ ఇంటి రాగానే తల్లిదండ్రుల వద్ద ఉన్న సెల్ ఫోన్లను తీసుకుంటున్నారు. చదవటం, హోం వర్క్ చాలా వరకు పాఠశాలల్లోనే సాగుతోంది. ఇంటి వద్ద చదవటం గతం కంటే తగ్గింది. పిల్లలను సెల్ ఫోన్ నుంచి దూరం చేయలేని పరిస్థితి ఉంది. –మంజుల, విద్యార్థి తల్లి, బోధన్ -
బాత్రూమ్లో ఫోన్ వాడుతున్నారా.. ఈ సమస్యలు తప్పవా?
అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్ ఫోన్ ఇప్పుడు మన జీవితంలో అంతర్భాగమై పోయింది. గత దశాబ్దంన్నర కాలం నుంచి వ్యక్తులతో కమ్యూనికేట్ అవ్వడం దగ్గర నుంచి , కాలు కదపకుండా హోటల్ నుంచి ఫుడ్ ఇంటికి తెప్పించుకోవడం, ఆన్లైన్ షాపింగ్ వరకూ ఇలా అన్నింట్లో సహాయ పడుతుంది. అయితే దాని వల్ల ఎంత లాభం ఉందో అంతకంటే ఎక్కువ ప్రమాదం ఉందని సైంటిస్ట్లు హెచ్చరిస్తున్నారు. ఇటీవల అరిజోనా యూనివర్సిటీ సైంటిస్టులు జరిపిన ఓ అధ్యయనంలో మనం వినియోగించే స్మార్ట్ ఫోన్లలో 17 వేల బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా వినియోగించే టాయిలెట్ సీటు మీద ఉండే బ్యాక్టీరియా కంటే స్మార్ట్ ఫోన్ల మీద 10 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు. ► టీనేజర్లు వినియోగించే ఫోన్లమీద బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్నట్లు అరిజోనా సైంటిస్ట్లు చెబుతున్నారు. ఎందుకంటే వారిలో ఎక్కువ మందికి బాత్రూంకు మొబైల్ తీసుకొని వెళ్లే అలవాటు ఉందని , ఎక్కువ సమయం బాత్రూంలో మొబైల్ వినియోగించడం వల్ల ఫోన్పై బ్యాక్టీరియా ఏర్పుడుతుందని హెచ్చరిస్తున్నారు. ► 2016లో సోనీ సంస్థ జరిపిన సర్వేలో 41 శాతం మంది ఆస్ట్రేలియన్లు టాయిలెట్లో ఫోన్ వినియోగిస్తుండగా.. 75శాతం మంది అమెరికన్లు వాడుతున్నారు. అయితే అలా ఫోన్ వినియోగిస్తున్న వారు టైం వేస్ట్ చేయకుండా మల్టీ టాస్కింగ్ చేస్తున్నామని అనుకుంటున్నట్లు తేలింది. కానీ టాయిలెట్లో మొబైల్ వినియోగించడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నామనే విషయాన్ని మరిచిపోతున్నారని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ► డాక్టర్ కర్మాకర్ సలహా మేరకు.. ఫోన్ను బాత్రూంలోకి లేదంటే పబ్లిక్ ఏరియాల్లో వినియోగించకపోవడం ఉత్తమం. ఆహారం తీసుకునేటప్పుడు కూడా చాలా మంది తమ ఫోన్ని ఉపయోగిస్తుంటారు. నోటి ద్వారా ఇన్ఫెక్షన్లు సంక్రమించే అవకాశం ఉంది. కాబట్టి, ఫోన్లోని బ్యాక్టీరియా వల్ల అనారోగ్యానికి గురయ్యే ప్రమాదాల్ని పెంచుతుంది. చదవండి👉 'డాక్టర్ బాబు' నీ సేవలకు సలాం ఫోన్ను బాత్రూంలో వినియోగిస్తే వాటిల్లే ప్రమాదాలు ►►ఫోన్ వినియోగిస్తూ బాత్రూంలో ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల పెద్ద ప్రేగుల్లో ఒత్తిడి పెరిగిపోతుంది.తద్వారా రెక్టల్ (మల ద్వార) సమస్యలు ఎక్కవుగా ఉత్పన్నమవుతాయి. ►► పెద్ద ప్రేగుల్లో ఒత్తిడి పెరిగితే జీర్ణాశయాంతర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు గుర్తించాలి ►► బాత్రూంలో ఫోన్ వినియోగిండం వల్ల టైం దుర్వినియోగం అవుతుంది. చేయాల్సిన వర్క్ ఆగిపోతుంది. మనకు తెలియకుండా మన లోపలి శరీరం ఒత్తిడికి గురవుతుంది. ►► మీరు ఉదయం పూట నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకునేందుకు బాత్రూం వెళ్లే సమయంలో ఫోన్ను వెంట తీసుకొని వెళుతున్నారా? అయితే మీరు ఉదయం పూట బాత్రూంలో ఫోన్ వినియోగించే సమయం కంటే.. ఫోన్ లేనప్పుడు బాత్రూంలో గడిపే సమయం ఎక్కువగా ఉంటుందని సైంటిస్ట్లు చెబుతున్నారు. అందుకే ఉదయం టాయిలెట్లోకి ఫోన్ తీసుకొని వెళ్లకపోవడమే ఉత్తమం. ►► వెడ్ఎమ్డి హెల్త్ జర్నల్ ప్రకారం..ఈ బాక్టీరియాలో సాల్మొనెల్లా, ఇ.కోలి, షిగెల్లా, క్యాంపిలో బాక్టర్ అనే బ్యాక్టీరియాలు మన శరీరంలో ప్రవేశించి అనారోగ్యానికి గురి చేస్తాయి. ►► ఒకరి నుంచి మరొకరికి వైరస్ను వ్యాప్తి చేయడంలో ప్రముఖ పాత్ర పోషించే ఈ ఫోన్ను టాయిలెట్లో వినియోగిస్తే గ్యాస్ట్రో, స్టాఫ్ వంటి వైరస్ల ఇతరకు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. చదవండి👉 యాపిల్ లోగోను టచ్ చేసి చూడండి.. అదిరిపోద్దంతే..! ఫోన్ నుంచి సురక్షితంగా ఉండాలంటే ►► నిపుణుల అభిప్రాయం ప్రకారం 60% నీరు, 40% శానిటైజర్లతో ఫోన్ను శుభ్రం చేసుకోవాలి. మీ ఫోన్ను నేరుగా లిక్విడ్తో శుభ్రం చేయడం వల్ల డిస్ప్లే చెడిపోతుందని స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు చెబుతున్నాయి. ►► ఫోన్ నుంచి సురక్షితంగా ఉండాలంటే బాత్రూమ్లోకి తీసుకొని వెళ్లిపోకూడదు. తినేటప్పుడు ఫోన్ను వినియోగించపోవడం ఉత్తమం ►► టచ్స్క్రీన్లను శుభ్రం చేయడానికి నిర్దిష్ట స్ప్రేలను కొనుగోలు చేయవచ్చు. స్క్రీన్ ప్రొటెక్ట్ చేసేందుకు సహాయ పడతాయి. ►► బాత్రూమ్ నుండి బయటకు వచ్చినప్పుడు లేదా ఇతరుల స్మార్ట్ఫోన్ను తాకినప్పుడు చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. చదవండి👉 ‘ఆఫీస్కు రండి.. లేదంటే గెట్ ఔట్’! -
డీవీడి రైటర్లో రూ. 40 లక్షలు ఖరీదు చేసే బంగారం
చెన్నై: అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు వేర్వేరు ఘటనల్లో దాదాపు 40 లక్షలు ఖరీదు చేసే బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారలు తెలిపారు. ఈ మేరకు అక్టోబర్ 29న దుబాయ్ నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడు బ్యాగ్లో ఉంచిన పోర్టబుల్ డిజిటల్ వీడియో డిస్క్(డీవీడీ) రైటర్లో దాచిన బంగారు కడ్డీలను అధికారులు గుర్తించారు. ఆ బ్యాగ్ను మరింతగా చెక్ చేయగా సుమారు 15 మొబైల్ ఫోన్లు, దాదాపు 9 వేల విదేశీ సిగరెట్లు లభించినట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. మరోక ఘటనలో దుబాయ్ నుంచి వచ్చిన మరో ప్రయాణికుడు ఏకంగా పేస్ట్ రూపంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా ఇద్దరు ప్రయాణకుల నుంచి దాదాపు రూ. 40 లక్షలు విలువ చేసే 900 గ్రాముల బంగారం, మొబైల్ ఫోన్లు, సుమారు రూ. 3.15 లక్షలు విలువ చేసే విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. (చదవండి: యమునా నదిపై ఎంపీ సంచలన వ్యాఖ్యలు... ప్రూవ్ చేసిన అధికారి) -
పేపర్పై రాసిస్తే చాలు.. పోగొట్టుకున్న మొబైల్.. మీ ఇంటికే!
మొబైల్ మిస్సయిందా..? బస్సులో కూర్చున్న వ్యక్తి చోరీ చేశాడా..? అయితే ఎలాంటి బెంగ అవసరం లేదు. ఎందుకంటే పోగొట్టుకున్న, చోరీకి గురైన సెల్ఫోన్లను చిత్తూరు పోలీసుశాఖ ట్రాక్ చేసి.. దేశంలో ఎక్కడ ఉన్నా వాటిని రూపాయి ఖర్చులేకుండా తీసుకొచ్చి బాధితులకు అందజేస్తోంది. ఇందుకోసం టెక్నికల్ అనాలసిస్ వింగ్ (టీఏడబ్ల్యూ) పేరిట ఓ ప్రత్యేక సాంకేతిక బృందం పని చేస్తోంది. సాక్షి, చిత్తూరు: ఇటీవల ఫోన్ చోరీ కేసులు పెరిగాయి. ఏదో ఒక చోట తరచూ మొబైల్ ఫోన్లు కనిపించకుండా పోతున్నాయి. పోలీస్ స్టేషన్లకు ఇలాంటి కేసులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతుండడంతో ఈ కేసులు ఛేదించడం తొలుత పోలీసులకు పెను సవాల్గా మారింది. అయితే సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి చోరీకి గురైన మొబైల్ ఫోన్లను కనిపెడుతూ మాయమైన ఫోన్లను ఇట్టే పట్టేస్తున్నారు. చోరీ చేసిన వ్యక్తి పట్టుబడితే వారిని పోలీసులు కటకటాలపాలు చేస్తున్నారు. నిత్యం ఎక్కడో ఓ చోట్ల మొబైల్ ఫోన్లు చోరీకి గురవుతున్నాయి. మరికొన్నిసార్లు ఫోన్లు పోగొట్టుకుంటారు. ఇలాంటి మొబైల్స్ ప్రస్తుతం ఎవరి వద్ద ఉన్నాయి..? ఎక్కడ ఉన్నాయి..? పోగొట్టుకున్న ఫోన్ ఎవరు వాడుతున్నారు..? అనే వివరాలను ఛేదించడానికి చిత్తూరు పోలీసు శాఖలో టీఏడబ్ల్యూ విభాగం పనిచేస్తోంది. ఇక్కడ 30 మంది వరకు పోలీసులు పనిచేస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా, బిహార్, కేరళ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలలో వినియోగిస్తున్న మొబైల్స్ను స్వాధీనం చేసుకుంటున్నారు. వీటిని బాధితులకు ఎప్పటికప్పుడు అందజేస్తున్నారు. మొబైల్స్ రికవరీ చేయడంలో టీఏడబ్ల్యూ బృందం ఇప్పటికే పలు రివార్డులు, అవార్డులు అందుకుంది. ►గతేడాది డిసెంబరు నెలలో రూ.75 లక్షల విలువ చేసే 506 సెల్ఫోన్లను చిత్తూరు పోలీసులు పలు ప్రాంతాల నుంచి తెప్పించారు. వీటిలో కొన్ని చోరీకి గురైనవిగా నిర్ధారించి 17 మందిని అరెస్టు చేశారు. మరికొన్ని పోగొట్టుకోగా, వాటిని ఉపయోగిస్తున్న వాళ్లకు ఫోన్చేసి చిత్తూరుకు తెప్పించి బాధితులకు అందజేశారు. ►అదే ఏడాది మే నెలలో రూ.60 లక్షలు విలువ చేసే 405 సెల్ఫోన్లను చిత్తూరుకు తెప్పించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో చలామణి అవుతున్న మిస్సింగ్ మొబైల్స్ను మన పోలీసులు ఎలాంటి ఖర్చులేకుండా తీసుకొచ్చి వాటి యజమానులకు అప్పగించారు. ►2020లో రూ.40 లక్షలు విలువచేసే 277 సెల్ఫోన్లను సైతం పలు ప్రాంతాల నుంచి తెప్పించగలిగారు. ►తాజాగా రెండు రోజుల క్రితం రూ.30 లక్షల విలువైన 300 మొబైల్ ఫోన్లను సీజ్ చేసిన చిత్తూరు పోలీసులు వాటిని యజమానులకు అప్పగించారు. ఇలా చేస్తే సరి.. సెల్ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు ఆలస్యం చేయకుండా బిల్లు, మొబైల్ కొన్నప్పుడు ఇచ్చిన బాక్సును తీసుకెళ్లి సమీపంలో ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ప్రతి స్టేషన్లో ఇలాంటి ఫిర్యాదులు వస్తే తప్పనిసరిగా రసీదు ఇస్తారు. స్టేషన్కు వెళ్లలేనివాళ్లు పోలీస్ సేవా యాప్ ద్వారా కూడా ఫిర్యాదులు ఇవ్వొచ్చు. ఐఎంఈఐ నంబర్ ఆధారంగా ఫోన్ ఎక్కడుంది..? ఎవరు ఉపయోగిస్తున్నారో పోలీసులు తెలుసుకుంటారు. వాళ్లతో మాట్లాడి ఫోన్లు తెప్పించి.. బాధితులకు సమాచారం ఇచ్చి ఫోన్లను అందచేస్తున్నారు. పేపర్పై రాసిస్తే చాలు.. మొబైల్ పోగొట్టుకున్నా, చోరీకి గురైనా ఓ పేపర్పై ఫిర్యాదు రాసి స్టేషన్లో ఇస్తేచాలు. 90 శాతం కేసుల్లో ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందచేస్తున్నాం. మిగిలినవి తప్పక కనిపెడతాం. కొద్దిగా సమయం పడుతుంది. మీరు ఫిర్యాదు ఇవ్వకుంటే ఆ ఫోన్లతో ఏదైనా క్రైమ్ చేసినపుడు పోలీసుల విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయం గుర్తించుకోండి. –వై.రిషాంత్రెడ్డి, ఎస్పీ, చిత్తూరు -
స్వాతంత్ర భారతి: 1995/2022 మొబైల్ ఫోన్ల శకారంభం
జన్ధన్, ఆధార్ ఔర్ మొబైల్ అన్నది ఇప్పుడైతే ఆచరణీయ నినాదంలా ధ్వనిస్తోంది కానీ, సెల్ ఫోన్లు రంగ ప్రవేశం చేసిన కొత్తలో అవి ధనికుల ఆట వస్తువుల్లానే ఉండేవి. ఈ పరిస్థితి 1999 వరకు కొనసాగింది. అసలు 1999 కి కొన్నేళ్ల ముందు వరకు కూడా సాధారణ టెలిఫోన్ సైతం కొద్దిమందికే సంక్రమించిన ప్రత్యేక హక్కులా ఉండేది. పరిమితంగా పంచవలసిన ఆస్తిగా ఉండేది. అలాంటిది నేడు దాదాపు 100 కోట్ల మందికి పైగా భారతీయులు చేతిలో సెల్ఫోన్ లేకుండా గడప దాటడం లేదంటే... అది రెండు విధాన నిర్ణయాల ఫలితమేనని చెప్పాలి. 1990 దశకం మధ్యలో టెలికామ్ రంగంలో ప్రైవేట్ సంస్థల ప్రవేశాన్ని అనుమతించడంతో అనేక సర్వీస్ ప్రొవైడర్లు వినిమయదారులకు నాణ్యమైన సేవలు అందించడం ప్రారంభించారు. అప్పటి వరకు సొంత ఇల్లు సంపాదించుకోవడం కన్నా సాధారణ టెలిఫోన్ సంపాదించడమే కష్టమన్న పరిస్థితి ఉన్న మన దేశంలో ఎట్టకేలకు ఒక్క ఫోన్ చేస్తే చాలు బేసిక్ టెలిఫోన్ కనెక్షన్ వచ్చి వాలిపోవడం మొదలైంది. ఆ పైన, 1999లో లైసెన్స్ ఫీజుల శకం అంతరించి ప్రభుత్వం, టెలికామ్ ఆపరేటర్లు ఆదాయన్ని పంచుకునే యుగం అవతరించింది. దీంతో ఒకప్పుడు నిముషానికి రు.16 రూపాయలు ఉన్న ఫోన్ చార్జీలు ఇప్పుడు పైసల్లోకి పడిపోయాయి. ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు డబ్ల్యూ.టి.ఓ. (వర ల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్) లో భారత్ చేరిక. ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ లిమిటెడ్ స్థాపన. గ్యాంగ్స్టర్ ఆటో శంకర్కు తమిళనాడు సేలంలోని కేంద్ర కారాగారంలో ఉరి. దేశంలో ఇంటర్నెట్ను లాంఛనంగా ఆరంభించిన వి.ఎస్.ఎన్.ఎల్. (టాటా కమ్యూనికేషన్స్) (చదవండి: దేశం రెండు ముక్కలైంది నేడే!) -
పాక్... మరో శ్రీలంక
ఇస్లామాబాద్: శ్రీలంక మాదిరిగానే పాకిస్తాన్ కూడా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో గంటల కొద్దీ విద్యుత్ కోతలు అమల్లో ఉండటంతో మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయే ప్రమాదం ఉందని పాకిస్తాన్ ప్రభుత్వమే ప్రజలను హెచ్చరించింది. విద్యుత్ కోతల కారణంగా ఇప్పటికే మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని శుక్రవారం నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బోర్డ్ (ఎన్ఐబీటీ) ట్విట్టర్లో తెలిపింది. దేశ అవసరాలకు సరిపోను ద్రవీకృత సహజ వాయువు(ఎల్ఎన్జీ) అందకపోవడంతో జూలైలో ఈ సమస్య మరింత తీవ్రం కావచ్చని ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కూడా ఇటీవల పేర్కొన్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్ డిమాండ్ ఒక వైపు పెరుగుతుండగా జూన్లో దిగుమతులు తగ్గిపోయినట్లు జియో న్యూస్ పేర్కొంది. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా కరాచీ తదితర నగరాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, షాపింగ్ మాల్స్, ఫ్యాక్టరీల్లో పని గంటలను కుదించారు. ఇంధన కొరతను అధిగమించేందుకు ఖతార్తో చర్చలు జరుగుతున్నాయి. విదేశీ కరెన్సీ నిల్వలు పడిపోవడంతో దేశంలో ద్రవ్యోల్బణం ఒక్కసారిగా రెట్టింపయింది. -
శామ్సంగ్కు 75 కోట్ల జరిమానా
మెల్బోర్న్: ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ శామ్సంగ్కు ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టు ఝలకిచ్చింది. మొబైల్ ఫోన్లు వాటర్ ప్రూఫ్ అంటూ తప్పుదోవ పట్టించినట్లు వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపిన కోర్టు శామ్సంగ్కు రూ.75 కోట్ల మేర జరిమానా విధించిందని ప్రభుత్వ నియంత్రణ సంస్థ వెల్లడించింది. 2016 మార్చి నుంచి 2018 అక్టోబర్ మధ్య ఎస్7, ఎస్8 సిరీస్ చెందిన 31 లక్షల గ్యాలెక్సీ ఫోన్లను శామ్సంగ్ ఆస్ట్రేలియా విక్రయించింది. ఈ ఫోన్లు నీళ్లలో తడిచినా పాడవవంటూ ప్రకటనలు ఇచ్చింది. అయితే, నీళ్లలో తడిచిన తర్వాత తమ ఫోన్లు పనిచేయడం లేదంటూ వందలాదిగా వినియోగదారులు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి 2019లో నమోదైన కేసులపై కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. సంబంధిత ఫోన్లను కొనుగోలు చేసిన వినియోగదారులు శామ్సంగ్ను సంప్రదించాలని సూచించింది. -
టీసీఎల్ ద్వారా 2వేల మందికి ఉపాధి లభిస్తోంది: సీఎం వైఎస్ జగన్
-
ఏ సమస్య వచ్చినా.. ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నాం: సీఎం జగన్
తిరుపతి: సన్నీ ఆప్కోటిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను ఏర్పేడు మండలం వికృతమాల గ్రామంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. మొబైల్ ఫోన్ కెమెరా లెన్స్ను సన్నీ ఆప్కోటెక్ తయారు చేస్తోంది. వివిధ రకాల మొబైల్ కంపెనీలకు కెమెరాలను ఆ సంస్థ సరఫరా చేయనుంది. రూ.254 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయగా, 3వేల మందికి ఉద్యోగ అవకాశం కలగనుంది. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగించారు. సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. ►ఈ క్లస్టర్లో మూడు ప్రాజెక్టులను ప్రారంభించాం ►మరో రెండు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం ►టీసీఎల్ యూనిట్ను ప్రారంభించాం ►టీవీ ప్యానెళ్లు, మొబైల్ డిస్ప్లే ప్యానెళ్లు ఇక్కడ తయారుచేస్తారు ►3200 మందికి ఉపాధినిస్తున్నారు ►ట్రయల్రన్స్కూడా జరుగుతున్నాయి ►ఫాక్స్లింక్స్ అనే సంస్థ యూఎస్బీ కేబుళ్లు, సర్క్యూట్ బోర్డులను తయారు చేస్తోంది ►ఫ్యాక్టరీని పూర్తిచేసింది. మరో 2వేల మందికి ఉపాధిని కల్పిస్తోంది ►సన్నో ఒప్పోటెక్ సెల్ఫోన్లు కెమెరా లెన్స్లు తయారు చేస్తోంది ►ఈ ఫ్యాక్టరీ కూడా పూర్తయ్యింది ►1200 మందికి ఉద్యోగాలు కల్పిస్తోంది ►నెలరోజులు తిరక్కముందే 6,400 మంది మన కళ్లముందే ఉద్యోగాలు చేసే పరిస్థితి వస్తుంది ►శంకుస్థాపన మూడు ప్రాజెక్టులకు వేశాం ►ఇదే ఈఎంసీలో డిక్సన్ టెక్నాలజీస్ యూనిట్కు శంకుస్థాపన చేశాం ►నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఏడాది కాలంలో పూర్తవుతుంది. 850 మందికి ఉద్యోగాలు వస్తాయి ►ఫాక్స్లింక్ ఇండియా లిమిటెడ్ కంపెనీ మరో రూ.300 కోట్ల పెట్టుబడి పెడుతుంది ►ఏడాదిలో ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేస్తుంది ►ఈ ఈఎంసీకి రాకముందు అపాచీ సంస్థకు సంబంధించిన సంస్థకు రూ.800 కోట్ల పెట్టుబడితో ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నారు ►15 నెలల్లో పూర్తవుతుంది. 10వేల మందికి ఉద్యోగా అవకాశాలు వస్తాయి ►ఇవాళ అన్నీ కలిపితే మూడు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశాం ►మరో 3 ప్రాజెక్టులనుకూడా ప్రారంభించాం ►వీటి అన్నింటి ద్వారా దాదాపుగా రూ.4వేల కోట్ల పైచిలుకు పెట్టుబడి, దాదాపుగా రూ.20వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి ►ఇక్కడ యూనిట్లు పెట్టిన వారందరికీ ఒక్కటి చెప్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం మీతో ఉంది ►ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి ఒక్క ఫోన్కాల్ దూరంలో ఉన్నాం ►కచ్చితంగా ఆ సమస్యను పరిష్కరించి.. మా రాష్ట్రంలో మీ ప్రయాణం అద్భుతంగా ఉండేలా చూస్తామని హామీ ఇస్తున్నాం. అందరికీ అభినందనలు అంటూ సీఎం జగన్ తన ప్రసంగాన్ని ముగించారు. -
మొబైల్ ఫోన్లు కొంప ముంచుతున్నాయి!
యుద్ధంలో బాంబులు వేసుకోవడం మామూలే. ఆ బాంబులు ఎక్కడ వేయాలో నిర్ణయించడానికి రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో సెల్ఫోన్ లను వాడుతున్నారంటే ఎవరికీ వింతగా తోచడం లేదు. అవి అధునాతనమయిన స్మార్ట్ ఫోన్లయినా; కేవలం కాల్స్, మెసేజ్లు మాత్రమే పంపగల సింపుల్ ఫోన్లయినా సైనికులందరికీ అందుబాటులో ఉండి సాయం చేస్తున్నాయి. ఇరుపక్షాల వారు ఎదుటివారి కదలికలను, స్థావరాలను గుర్తించడానికి ఈ ఫోన్లు సాయపడుతున్నాయి. మొబైల్ ఫోన్లు అన్నీ దగ్గరలోని కమ్యూనికేషన్ టవర్కు సంకేతాలు పంపుతుంటాయి. వాటి ఆధారంగానే కాల్స్, మెసేజెస్ వీలవుతాయి. ఈ మధ్యన ఈ సంకేతాల ఆధారంగా నేరస్థులను, ఇతరులను అనుసరించి ఆరా తీయడం మామూలయింది. మూడు టవర్ల నుంచి సంకేతాలను ‘ట్రయాంగులేషన్’ అనే పద్ధతిలో విశ్లేషిస్తే, వాటిని పంపిన ఫోన్ ఉన్న స్థలం తెలిసిపోతుంది. దీంతో రష్యా–ఉక్రెయిన్ సైన్యాలు దీన్ని అనువుగా వాడుకుని శత్రుపక్షం ఆచూకీ సులభంగా తెలుసుకుంటున్నాయి. ‘ఇదేదో, ఇదుగో నేను నీ లక్ష్యాన్ని’ అని వీపు మీద బొమ్మ గీసుకుని తిరుగుతున్నట్లయిందని అంటారు యూకేలోని సర్రె విశ్వవిద్యాలయం పరిశోధకులు అలన్ వుడ్వర్డ్. ఇక రష్యావారు ఒక అడుగు ముందుకు వేసి ‘లియత్–3’ అనే సిస్టమ్ను తయారు చేశారు. ఇందులో మొబైల్ ఫోన్ టవర్స్లాగ పనిచేసే డ్రోన్స్ ఉంటాయి. అవి ఆరు కిలో మీటర్ల పరిధిలోనున్న సుమారు రెండు వేలకు పైగా మొబైల్ ఫోన్ల ఆచూకీ తెలుసుకునే శక్తి గలవి. ఈ రకంగా అధికారులను అనుసరించి మట్టుబెట్టిన సందర్భాల గురించి ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రికలో వివరంగా రాశారు. ఇంటెలిజెన్స్, సర్వైలెన్స్, టార్గెట్ అక్విజేషన్, రీకన్నాయిజాన్స్ అంటే కంప్యూటర్ వాడకం సాయంగా గమ్యాలను గుర్తించే ‘ఇస్తార్’ సిస్టమ్లు ప్రస్తుతం అందరికీ అందుబాటులో ఉన్నాయి. కనుక క్షణాల్లో గమ్యాలను తెలుసుకుని మిసైల్స్ ప్రయోగించే వీలు కలుగుతున్నది. (క్లిక్: యుద్ధ నివారణే పాలకుల కర్తవ్యం!) ఇక స్మార్ట్ ఫోన్లలో ‘జీపీఎస్’ అనే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఉంటుంది. అది సులభంగా ఎదుటివారికి అందరి స్థావరాల ఉనికినీ అందజేస్తుంది. అన్నింటికీ మించి యుద్ధరంగంలోని సైనికులను భయానికి గురిచేసే, సందేశాలు కూడా మొబైల్ ఫోన్లలో వస్తున్నాయి అంటారు ‘కోపెన్ హేగెన్ యూనివర్సిటీ’ పరిశోధకులు గొలోవ్షెంకో. మీవాడు చనిపోయాడంటూ తప్పుడు సమాచారాన్ని అందించిన సందర్భాలను ఆయన గుర్తు చేస్తున్నారు. ఈ బాధలు రెండు పక్షాల వారికీ తప్పడం లేదు. (క్లిక్: అందుకే రష్యాను సమర్థించక తప్పదు) బాల్టిక్ స్టేట్స్లోనూ, అఫ్గానిస్తాన్లో కూడా ఈ రకం పద్ధతులను వాడి సైనికులను మానసికంగా వ్యథకు గురిచేసిన సందర్భాలను గురించి గొలోన్షెంకో వంటి పరిశోధకులు గుర్తు చేస్తున్నారు. రష్యా సైన్యం ఏప్రిల్ మొదటి తేదీన సుమారు 5 వేలమంది ఉక్రెయిన్, సైన్యాధికారులు, రక్షణ సిబ్బందికి మెసేజీలు పంపినట్టు సమాచారం. తాము కూడా ఇటువంటి సందేశాలు పంపుతున్నట్టు ఉక్రెయిన్ ఇంటీరియర్ అఫెయిర్స్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫోన్ వాడుతున్న ప్రతి సైనికుడూ ఒక డేటా పాయింట్గా నిలచి, తమ గురించి సమాచారం వెదజల్లుతున్నట్లే లెక్క. అది సైనికులకు ప్రాణాపాయం కలిగిస్తున్నది. - డాక్టర్ కె.బి. గోపాలం రచయిత, అనువాదకులు -
వేసవి సెలవుల్లోనూ పిల్లలు నాలుగు గోడల మధ్యే ఉన్నారా?
ఎండకాలం సెలవుల్లో కూడా పిల్లలు నాలుగు గోడల మధ్య ఉన్నారా? వారికి మీరు పాదలేపనం పూయడం లేదనే అర్థం. వారి చేతికి కథల పుస్తకం ఇవ్వండి. అందులో రాకుమారుడు వద్దన్నా ఉత్తరం వైపుకు వెళతాడు. పిల్లలూ వెళతారు. రాక్షసుడు ఉన్న చోటుకు గండభేరుండ పక్షి మీద చేరుకుంటాడు. పిల్లలూ చేరుకుంటారు. తెలివైన కొడుక్కే రాజ్యం ఇస్తానని రాజు అంటే ఆ తెలివి పుస్తకం చదివే పిల్లలకూ వచ్చి జ్ఞానరాజ్యం దక్కుతుంది. వేసవి అంటే పిల్లలకు ఆటలు పాటలతోపాటు పుస్తకం కూడా. వారి చేతి నుంచి ఫోన్ లాక్కోండి. పుస్తకం ఇవ్వండి. ఇప్పటిలా పాడుకాలం కాదు. పూర్వం ఎండాకాలం సెలవులు ఎప్పుడొస్తాయా అని పిల్లలు కాచుక్కూచునేవారు. దేనికి? ఆడుకోవచ్చు. పాడుకోవచ్చు. కాని అసలు సంగతి కథలు ఎంత సేపైనా చదువుకోవచ్చు. అందుకే ఎదురుచూపు. పక్కింటి నుంచి, ఎదురింటి నుంచి, అద్దె పుస్తకాల షాపుల నుంచి చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు, బుజ్జాయి, బాలజ్యోతి... ఇన్ని మేగజీన్లు... చాలక పాకెట్ సైజు పిల్లల నవలలు ‘మంత్రాల అవ్వ.. తంత్రాల తాత’, ‘భైరవ ద్వీపం’,‘కపాల మాంత్రికుడు’, ‘పేదరాశి పెద్దమ్మ’... ఇవన్నీ చదవడం... చాలనట్టు మేజిక్ ట్రిక్కుల పుస్తకాలు, లెక్కలతో చిక్కులు, సైన్లు ప్రయోగాలు, సూపర్మేన్.. స్పైడర్మేన్ కామిక్స్... వీటన్నింటిలో కూరుకుపోయేవారు... ఊహల లోకాల్లో తేలిపోయేవారు. వేసవి కాలం మండే ఎండల కాలం అందరికీ. పిల్లలకు మాత్రం కథలు చదివే కాలం. పుస్తకాల్లో మునిగే కాలం. సింద్బాద్... గలీవర్.. బాల్యంలో పుస్తకాలు చదివితే ఏమవుతుంది? సింద్బాద్.. గలీవర్ తెలుస్తారు. జీవితం అంటే ఉన్న చోటునే ఉండిపోవడం కాదని.. కదలాలని.. కొత్త ప్రపంచాలను చూడాలని... మనుషులను తెలుసుకోవాలని తెలుస్తుంది. అపాయాలు వచ్చినా విజయం వరిస్తుందనే ధైర్యం వస్తుంది. సింద్బాద్ సాహసాలు పిల్లల్ని ఉత్కంఠ రేపేలా చేస్తాయి. అతడు చేసిన సముద్ర యానాలలో ఎన్ని వింతలు. విడ్డూరాలు. సినిమా చూస్తే, గేమ్స్ చూస్తే వీలుకాని ఊహ, కల్పన చదవడం వల్ల పిల్లలకు వస్తుంది. వారి ఊహల్లో తామే సింద్బాద్లు అవుతారు. మత్స్యకన్యను చూస్తారు. రాకాసి సముద్రజీవితో తలపడతారు. ఇక గలీవర్ చేరుకునే లిల్లీపుట్ ల దేశం ఎంత వింత. చీమంత ఉన్నా వాళ్లు అందరూ కలిసి అపాయాన్ని ఎదుర్కొనాలని చూస్తారు. ఆ తర్వాత గలీవర్ మంచివాడని గ్రహిస్తారు. స్నేహితులను శత్రువులుగా పొరపడటం, శత్రువులను స్నేహితులుగా నమ్మడం ఈ పాఠాలు పిల్లలకు కథలే చెబుతాయి. అప్రమత్తం చేస్తాయి. సమయస్ఫూర్తి కథలు చదివితే సమయస్ఫూర్తి వస్తుంది. కఠినమైన సన్నివేశాలను కూడా సమయస్ఫూర్తితో దాటడం తెలుస్తుంది. మర్యాద రామన్న, బీర్బల్, తెనాలి రామలింగడు, షేక్ షిల్లీ, ముల్లా నసీరుద్దీన్, మర్యాద రామన్న వీరందరూ తమ కామన్సెన్స్ను ఉపయోగించే జటిల సమస్యలను ఛేదిస్తారు. పదహారు భాషలు తెలిసిన పండితుడు తన మాతృభాష కనిపెట్టమన్నప్పుడు తెనాలి రామలింగడు ఏం చేశాడు... ఒకే బిడ్డను ఇద్దరు తల్లులు నా బిడ్డంటే నా బిడ్డని కొట్లాడినప్పుడు మర్యాద రామన్న ఏం చేశాడు ఇవన్నీ పిల్లలకు తెలియాలి. అందుకు కథలు చదవాలి. ఇక చందమామలో చాలా కథలు పరీక్షలు పెడతాయి. ముగ్గురు వ్యక్తుల్లో ఎవరు తెలివైన వారైతే వారికి ఉద్యోగం, రాచకొలువు, సింహాసనం దక్కుతుందనుకుంటే సాధారణంగా మూడోవ్యక్తే గెలుస్తాడు. అతని తెలివి పిల్లలకు తెలుస్తుంది. నీతి– బతుకునీతి దేశదేశాల నీతి కథల భాండాగారం పిల్లల కోసం సిద్ధంగా ఉంది. మన పంచతంత్రం, అరేబియన్ నైట్స్, ఈసప్ కతలు... ఇవన్నీ నీతిగా బతకడం గురించి బతుకులో పాటించాల్సిన నీతి గురించి తెలియచేస్తాయి. బంగారు కడియం ఆశ చూపి గుటుక్కుమనిపించే పులులు, నమ్మించి మోసం చేసే గుంటనక్కలు జీవితంలో ఎదురుపడతాయని చెబుతూనే కలిసికట్టుగా ఉంటే వలను ఎగరేసుకుపోయి తప్పించుకోవచ్చని చెప్పే పావురాలను, వలను కొరికి ఉపయోగపడే స్నేహితులను చూపుతాయి. గుండె చెట్టు మీద ఉంది అని చావుతెలివి చూపి మొసలి నుంచి కాపాడుకునే కోతి పాఠం తక్కువది కాదు. నోర్మూసుకోవాల్సిన చోట నోరు మూసుకోకుండా తెరిచి ఆకాశం నుంచి కిందపడే తాబేలును చూసి ఎంతో నేర్చుకుంటారు. అత్యాశకు పోతే బంగారు గుడ్లు దక్కవని తెలుసుకుంటారు. రాకుమారుని వెంట ఎన్నో కతల్లో రాకుమారుడు సాహసాలు చేస్తాడు. పేదరాశి పెద్దవ్వ దగ్గర బస చేస్తే‘ఏ దిక్కయినా వెళ్లు కాని ఉత్తర దిక్కు మాత్రం వద్దు’ అంటుంది. రాకుమారుడు అటే వెళ్లి కష్టనష్టాలకు ఓర్చి విజయం సాధిస్తాడు. రిస్క్ అవతల కూడా అద్భుత విజయం ఉంటుంది అని ఈ కథలు చెబుతాయి. భట్టి విక్రమార్క కథలు తెగువను నేర్పిస్తాయి. ఎంతటి భయంకర మాంత్రికుణ్ణయినా ప్రాణం కనిపెట్టి తుద ముట్టించవచ్చని ఇతర కథలు చెబుతాయి. కథలు చదివిన వారి తెలివి, భాష, వకాబులరీ, ఉచ్ఛరణ... ఇవన్నీ కథలు చదవని వారి కంటే ఎక్కువ ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. స్కూళ్లు తెరిస్తే ఎలాగూ ఆ పాఠాల్లో పడక తప్పదు. నెల రోజులు దాదాపు చేతిలో ఉన్నాయి.పిల్లల్ని పుస్తకాల లోకంలోకి తోయండి. -
Global Web Index: సోషల్ మీడియా మళ్లీ పుంజుకుంది
తలెత్తుకు తిరగాలని అనేవారు.. పూర్వం.. ఇప్పుడు ఎవర్ని చూసినా.. తల దించుకుని.. ఫోన్లో బిజీబిజీగా మునిగిపోయేవారే కనిపిస్తున్నారు. సోషల్ మీడియా హవా మొదలయ్యాక.. ఇది మరింత పెరిగింది. ప్రపంచవ్యాప్త లెక్క తీసుకుంటే.. 2021లో రోజులో సగటున 2.27 గంటల సమయం జనం సోషల్ మీడియాలోనే గడిపేశారని తేలింది. 2018, 19లతో పోలిస్తే.. 2020 తొలి నెలల్లో కొన్ని దేశాల్లో ఈ ట్రెండ్లో క్షీణత కనిపించినప్పటికీ.. కరోనా మహమ్మారి మొదలయ్యాక.. మళ్లీ పుంజుకుందని ‘గ్లోబల్ వెబ్ ఇండెక్స్’ సర్వే తెలిపింది. అంతేకాదు.. జనాభాలో యువత శాతం ఎక్కువగా ఉన్న దేశాల్లో ఈ వ్యసనం ఎక్కువగా ఉండగా.. మిగతా దేశాలతో పోలిస్తే.. వృద్ధుల శాతం ఎక్కువగా ఉన్న జపాన్, జర్మనీల్లో ఇది కొంచెం తక్కువగా ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది. చదవండి: (పక్షులన్నీ కలిసి రాకాసి పక్షిలా.. ఎందుకిలా..?) -
ఆఫర్లో రూ.1,700 లకే ఫోన్!.. ప్రముఖ మొబైల్ కంపెనీ పేరు చెప్పడంతో..
బి.కొత్తకోట : ఓ ప్రముఖ కంపెనీ 500 మందికి ఆఫర్లో మొబైల్ ఫోన్ను ఇస్తోందని నమ్మించి పార్శిల్లో సోంపాపిడి పంపిన ఉదంతం బుధవారం జరిగింది. డబ్బు చెల్లించి పార్శిల్ విప్పిచూసిన రైతు మోసపోయి లబోదిబోమంటున్నాడు. బాధిత రైతు కథనం మేరకు వివరాలు..బి.కొత్తకోట మండలం గుట్టపాళ్యంకు చెందిన రైతు రమణారెడ్డికి ఎనిమిదిరోజుల క్రితం బెంగళూరు నుంచి ఫోన్ వచ్చింది. ప్రముఖ మొబైల్ కంపెనీ నుంచి 500 మందికి ఆఫర్లో మొబైల్ ఫోన్లు ఇస్తున్నామని, అందులో మీ పేరుందని చెప్పగా రమణారెడ్డి తిరస్కరించారు. ప్రముఖ మొబైల్ కంపెనీ పేరు చెప్పడంతో ధర ఎంతని అడగ్గా అసలు ధర రూ.7,500 అని ఆఫర్లో రూ.1,700కు ఇస్తున్నట్టు చెప్పి పార్శిల్ పంపారు. కర్ణాటకలోని బెంగళూరు నగరం అలసంద్ర నుంచి బుధవారం గట్టు తపాలా కార్యాలయానికి పార్శిల్ వచ్చింది. ఈ పార్శిల్ తీసుకోవడానికి రమణారెడ్డి వెళ్లగా పోస్ట్మాస్టర్ గణేష్కు అనుమానం కలిగి పార్శిల్ను వెనక్కు పంపుదామని చెప్పాడు. అయితే మొబైల్ వచ్చిందని నమ్మి రమణారెడ్డి పోస్ట్మాస్టర్కు రూ.1,700 చెల్లించి అక్కడే అందరి సమక్షంలో పార్శిల్ తెరవగా అందులో సోంపాపిడి ప్యాకెట్ ఒకటి మాత్రమే ఉండటంతో మోసపోయినట్టు గుర్తించిన రమణారెడ్డి సంబంధిత ఫోన్ నంబర్కు ఫోన్ చేసి విషయం చెప్పినా... మాట్లాడిన మహిళ ఇవేమి వినిపించుకోకుండా పార్శిల్ తీసుకొండంటూ చెప్పింది. ఇలాంటి మోసాలు నిత్యం జరుగుతున్నా అమాయక ప్రజలు మోసపోతున్నారు. (చదవండి: భర్తతో విడాకులు.. 40 ఏళ్ల వ్యక్తితో స్నేహం.. అసలు విషయం తెలిసి..) -
మీ చెవులు బిజీయా.. అయితే వీటి ముప్పు తప్పదు
రోజుకు ఎన్ని గంటలు చెవి ఒగ్గుతున్నారు? అదేనండీ! రోజుకు ఎంత సేపు ఫోన్ వాడుతున్నారు? ఇయర్ ఫోన్స్... హెడ్ ఫోన్తో చెవిని బిజీగా ఉంచుతున్నారా? ఇక... ఇన్ఫ్లమేషన్... ఇరిటేషన్... ఇన్ఫెక్షన్ పొంచి ఉంటాయి. ‘చెయ్యి ఖాళీ లేదు’ అనే మాట ఇప్పుడు పెద్దగా వినిపించడం లేదు. కానీ చెవి ఖాళీ లేదని మాత్రం చెప్పాల్సిన పనిలేకనే కనిపిస్తోంది. ఒక ఇంట్లో నలుగురు ఉంటే ఆరు ఫోన్లుంటాయి. కొన్ని ఫోన్లకు రెండు సిమ్లు కూడా. ఒక ఫోన్లో మాట్లాడుతూ ఉండగానే మరో ఫోన్ రింగవుతుంది. ఆన్సర్ చేయడానికి చెయ్యి ఖాళీ ఉండదు. ఒకవేళ ఇయర్ ఫోన్స్తో వింటూ మాట్లాడుతూ ఉంటే చెయ్యి ఫ్రీగానే ఉంటుంది. కానీ చెవి మాత్రం ఖాళీ ఉండదు. రోజులో ఓ రెండు గంటల సేపు ఫోన్ కోసం చెవిని అంకితం చేయక తప్పని లైఫ్స్టైల్ ఇది. ఆ పైన ఖాళీ సమయాన్ని ఎవరికి వాళ్లు స్మార్ట్ఫోన్లో తమకు నచ్చిన చానెల్లో ఇష్టమైన ప్రోగ్రామ్ చూస్తూ గడిపేస్తారు. పక్క వాళ్లకు అసౌకర్యం కలగకుండా ఉండడానికి ఇయర్ఫోన్స్ను ఆశ్రయించక తప్పదు. ఇలా రోజులో ఐదారు గంటల సమయం చెవుల్లో ఇయర్ ఫోన్ ఉంటోంది. మరికొన్ని వృత్తుల్లో అయితే హెడ్ఫోన్ తప్పనిసరి. వాళ్లు ఏడెనిమిది గంటల సమయం హెడ్ఫోన్ ధరించి ఉంటారు. మొదట్లో బాగానే ఉంటుంది. కానీ క్రమంగా తమకు తెలియకనే కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. పెద్దగా గొంతు పెంచి మాట్లాడడం అలవాటవుతుంది. ఇంట్లో వాళ్లు చెప్పేది సరిగ్గా వినిపించదు. చిరాకులు మొదలవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య తెలియని దూరం పెరుగుతుంది. ఆ తర్వాత చెవిలో దురద, వాపు, ఇన్ఫెక్షన్లు మొదలవుతాయి. వీటన్నింటికీ కారణం ఇయర్ఫోన్స్, హెడ్ ఫోన్స్తో చెవులను రొద పెట్టడమేనంటే నమ్ముతారా? నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఈ సమస్యను ‘స్విమ్మర్స్ ఇయర్’ అంటారు. ఈ రకమైన ఇబ్బంది మొదలైన వాళ్లలో పన్నెండు శాతం మందికి వినికిడి శాశ్వతంగా తగ్గిపోతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇందుకు కారణం చెవి అదేపనిగా శబ్దాలను వినాల్సి రావడమేనంటే... వింతగానూ, విచిత్రంగానూ అనిపిస్తుంది. కానీ ఇదే వాస్తవం. అనుక్షణం మితిమీరిన శబ్దాల మధ్య ఈదులాడాల్సిన దుస్థితి చెవిది. గ్రాఫ్ పెరుగుతోంది పాశ్చాత్యదేశాలతో పోలిస్తే ఈ సమస్య మనదేశంలో వేగంగా పెరుగుతోంది. టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉండడం, సామాన్యులకు కూడా అందుబాటు ధరలో లభించడం స్వాగతించాల్సిన పరిణామమే. కానీ టెక్నాలజీని ఎంత వరకు ఉపయోగించుకోవాలనే విషయంలో స్వీయ నియంత్రణ ఉండి తీరాలి. ఇక తప్పని సరిగా ఎక్కువ సేపు మాట్లాడాల్సిన ఫోన్కాల్స్ విషయంలో స్పీకర్ ఆన్ చేసి మాట్లాడడం ఓ మధ్యేమార్గం. ట్రాఫిక్ శబ్దాల్లో ఎక్కువ సమయం పని చేయాల్సిన వాళ్లు... ఇయర్ కెనాల్ను (చెవిరంధ్రాన్ని) కాటన్ బాల్ లేదా ఇయర్ప్లగ్స్తో కప్పి ఉంచడం మంచిది. చివరగా ఒకమాట... చెవుల నుంచి వైర్లు వేళ్లాడుతూ, సంగీతానికి అనుగుణంగా మెలికలు తిరుగుతూ ఉంటే... మోడరన్ లుక్ ఫీలవచ్చేమో కానీ... ఇది శృతి మించితే హియరింగ్ మెషీన్తో సహజీవనం చేయాల్సిందే. ఎంతటి సంగీత ప్రియులైనా సరే... ఇయర్ఫోన్స్లో పాటలు వినేటప్పుడు 70 నుంచి 80 డెసిబుల్స్కు మించితే హియరింగ్ మెషీన్కు దగ్గరగా వెళ్తున్నట్లే. అలాగే ఇయర్ఫోన్స్, హెడ్ఫోన్స్ వాడే వాళ్లు అరగంటకోసారి వాటిని తీసి చెవులను సొంతంగా మామూలు శబ్దాలను కూడా విననివ్వాలి. -
‘ధరల’ వ్యూహం పరిమిత కాలమే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘మొబైల్ ఫోన్స్ మార్కెట్లో చవక ధరల వ్యూహం ఎంతో కాలం పనిచేయదు. నిలదొక్కుకోవాలంటే అందుబాటు ధర ఒక్కటే సరిపోదు. నాణ్యమైన ఫీచర్లు, విక్రయానంతర సేవలు ఉండాల్సిందే’ అని ఐటెల్ మొబైల్ను ప్రమోట్ చేస్తున్న ట్రాన్సియన్ ఇండియా సీఈవో అరిజీత్ తలపత్ర తెలిపారు. మార్కెట్ను అర్థం చేసుకోకపోతే మొబైల్ ఫోన్స్ రంగంలో బ్రాండ్లకు మనుగడ లేదన్నారు. భారత్లో కార్యకలాపాలు ప్రారంభించిన ఏడాదిలోనే ఫీచర్ ఫోన్ల విభాగంలో రెండవ స్థానాన్ని చేజిక్కించుకుని ఇతర బ్రాండ్లకు సవాల్ విసిరామన్నారు. సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మార్కెట్ తీరుతెన్నులు, కంపెనీ గురించి ఆయన మాటల్లో.. ఆ సెగ్మెంట్లో తొలి స్థానం.. చైనా కేంద్రంగా 2007లో ట్రాన్సియన్ ప్రారంభమైంది. ఆఫ్రికా తొలి మార్కెట్. సబ్ సహారన్ ఆఫ్రికాలో 70 శాతం వాటా ట్రాన్సియన్దే. ఇక 2016లో భారత్లో అడుగు పెట్టే ముందే జనాల్లోకి వెళ్లి సర్వే నిర్వహించాం. వారికి ఏం కావాలో అర్థం చేసుకుని మొబైల్స్ను రూపొందించాం. విక్రయాల ప్రారంభానికి ముందే సర్వీస్ సెంటర్లను తెరిచాం. భారత్లో ఏడాదిలోనే ఫీచర్ ఫోన్ల రంగంలో రెండవ స్థానానికి చేరుకున్నాం. రూ.7 వేల లోపు ధరల విభాగంలో ఫీచర్, స్మార్ట్ఫోన్లలో అగ్రస్థానంలో నిలిచాం. 8 కోట్ల పైచిలుకు వినియోగదార్లు సొంతమయ్యారు. సీఎంఆర్ గణాంకాల ప్రకారం ఐటెల్కు రూ.7 వేలలోపు ధరల విభాగంలో 27 శాతం, మొత్తం మార్కెట్లో 9.2 శాతం వాటా ఉంది. కంపెనీకి 85 శాతం మంది ఆఫ్లైన్ కస్టమర్లు ఉన్నారు. 1,100 పైగా సర్వీస్ కేంద్రాలు ఉన్నాయి. కస్టమర్లు 2జీ నుంచి 4జీకి.. దేశంలో ప్రస్తుతం 35 కోట్ల మంది 2జీ సేవలను వినియోగిస్తున్నారు. మాకు ఇదే పెద్ద మార్కెట్. వినియోగదార్లు 4జీ వైపు మళ్లేందుకు కృషి చేస్తాం. భవిష్యత్లో సాంకేతిక పరిజ్ఞానం ఖరీదు తగ్గితే రూ.10 వేల లోపు ధరలో 5జీ స్మార్ట్ఫోన్స్ లభించే అవకాశం ఉంది. కంపెనీకి నోయిడాలో మూడు ప్లాంట్లు ఉన్నాయి. అమ్మకాలనుబట్టి చూస్తుంటే జూన్–జూలై నాటికి పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకునే అవకాశం ఉంది. నాలుగో ప్లాంటు దక్షిణాదిన ఏర్పాటు చేస్తాం. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకాన్ని (పీఎల్ఐ) వినియోగించుకుని ఎగుమతులపై దృష్టిసారిస్తాం. మొబైల్స్తోపాటు టీవీలు, సౌండ్బార్స్, స్మార్ట్గ్యాడ్జెట్స్ అందుబాటులోకి తెచ్చాం. ఆఫ్రికాలో గృహోపకరణాలను ట్రాన్సియన్ విక్రయిస్తోంది. క్రమంగా భారత్లోనూ వీటిని పరిచయం చేస్తాం. -
పిల్లలకు బోర్ కొట్టిస్తున్న సంక్రాంతి సెలవులు
సాక్షి, హైదరాబాద్: ‘సెల్ ఫోన్తో ఆడుకోవడం లేదా డల్గా పడుకోవడం’.. ప్రస్తుత సంక్రాంతి సెలవుల్లో పిల్లలు చేసేది ఇదే అంటున్నారు చాలామంది తల్లిదండ్రులు. కరోనా పుణ్యమాని ఉత్సాహంగా ఊరెళ్లే పరిస్థితి లేదు. ఆనందంగా అయిన వాళ్లను రమ్మనే అవకాశం లేదు. కనీసం పక్కింటి పిల్లలతో ఆడుకుందామన్నా ఆందోళన.. వెరసి సంక్రాంతి సెలవులు విద్యార్థులకు బోర్ కొట్టిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అర్ధరాత్రి వరకు సెల్ పట్టుకుని, అదే పనిగా ఆన్లైన్ గేమ్స్ ఆడుతుంటే మౌనంగా చూడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని తల్లిదండ్రులు వాపోయారు. సరే అని కట్టడి చేస్తే ఏదో కోల్పోయినట్టుగా ఉండిపోతున్నారని చెప్పారు. కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో విద్యార్థులు కనీసం పక్కింటి పిల్లలతో ఆడుకోవడానికి కూడా సంశయించాల్సి వస్తోంది. కరోనా పరిస్థితుల్లో వచ్చిన సంక్రాంతి సెలవుల్లో స్కూల్ పిల్లల దిన చర్యను ‘సాక్షి’క్షేత్రస్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేసింది. కొన్ని ప్రాంతాల్లోని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను పలకరించింది. ఇంట్లో బందీగా పిల్లలు ‘ఇది వరకు సంక్రాంతి సెలవులొస్తే చాలు పిల్లాడిని పట్టుకోవడం కష్టంగా ఉండేది. పొద్దున లేస్తే గాలి పటాల గోలే. ఇప్పుడు ఇల్లు కదలడం లేదు. బయట కూడా అంతా సందడిగా ఉండేది. ఇప్పుడా వాతావరణం లేదు..’ అని వరంగల్ పట్టణానికి చెందిన లలిత చెప్పారు. కరోనా భయంతో పిల్లల్ని ఇల్లు కదలనివ్వడం లేదు. ఇంటికి వేరే పిల్లల్నీ రానివ్వడం లేదు. పక్క పక్క ఇళ్ళవాళ్ళయితే కాస్త సర్దుకుపోతున్నారు. అదీకూడా వాళ్ళింటికి కొత్తవాళ్ళు ఎవరూ రాకపోతేనే. నిజానికి సంక్రాంతి పండగొస్తే పోస్టాఫీసు కాలనీ మొత్తం హడావిడిగా ఉంటుందని, ఎక్కడెక్కడి నుంచో గాలి పటాలు ఎగరెయ్యడానికి, ఆటల పోటీల్లో పాల్గొనడానికి వస్తుంటారని హన్మకొండ పోస్టాఫీసు కాలనీకి చెందని రవి తెలిపారు. ఇప్పుడు అవేవీ కన్పించడం లేదని అన్నారు. పక్క వీధిలోని ఫ్రెండ్ ఇంటికి తన కొడుకు వస్తానంటే, అతని తల్లిదండ్రులు ‘రోజులు బాగోలేవు కదా’అని సున్నితంగా వద్దని చెప్పారని వెల్లడించారు. రెండేళ్ళ క్రితం చూసిన ముగ్గుల పోటీలు, కబడ్డీ ఆటలు, కుస్తీ పోటీలు ఏవీ పిల్లలు ఎంజాయ్ చేసే పరిస్థితి కన్పించడం లేదని అన్నారు. అమ్మమ్మ ఇంటికెళ్ళినా అదే సీన్... ‘నేనొచ్చానని అమ్మమ్మ ఎన్నో పిండి వంటలు చేసింది. కొత్త దుస్తులూ కొన్నది. కానీ ఇల్లు మాత్రం దాటనివ్వడం లేదు..’అని కరీంనగర్ జిల్లా కమాన్పూర్లో అమ్మమ్మ ఇంటికొచ్చిన 9వ తరగతి విద్యార్థి రామకృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశాడు. నిజానికి ఆ ఊళ్ళో వారం రోజులుగా పరిస్థితి బాగాలేదు. జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. కొన్నిచోట్ల మనవళ్లు, మనవరాళ్లు ఊరికి వస్తామన్నా వద్దన్న ఘటనలున్నాయి. ఖమ్మం పట్టణంలో ఉంటున్న చంద్రం దంపతులు.. తమ ఇంటికి హైదరాబాద్ నుంచి మనవడు, మనమరాలు సంక్రాంతికి వస్తామన్నా.. వద్దన్నారు. ‘రోజులు బాగోలేవు. ఇక్కడ వాళ్ళకు ఏవైనా వచ్చినా వాళ్ళనే అంటారు. వాళ్ళకు ఏమైనా అయినా మాటొస్తుంది’అని చంద్రం వ్యాఖ్యానించారు. కొత్త గేమ్స్ కోసం వేట లాక్డౌన్లో విద్యార్థులు ఆడే గేమ్స్పై సూపర్ స్కూల్స్ అనే సంస్థ ఓ సర్వే చేపట్టింది. ఆన్లైన్ గేమ్స్ విషయంలోనూ పిల్లల్లో ఒకింత అసంతృప్తి వ్యక్తమవుతోందని ఆ సంస్థ సీఈవో భానూ ప్రసాద్ తెలిపారు. పబ్జీ, క్యాండీ క్రష్, యాంగ్రీ బర్డ్, సబ్వే సర్ఫర్స్, టెంపుల్ రన్ వంటి ఆటలు వాళ్ళకు పెద్దగా కిక్కెకించడం లేదు. దీంతో కొత్త కొత్త గేమ్స్ ఏమొచ్చాయా అనే దిశగా నెట్లో వెతుకుతున్నారు. కరోనా కారణంగా బయటకెళ్ళే అవకాశం లేకపోవడంతో 24 గంటలూ సెల్ఫోన్ గేమ్స్పై ఆధారపడుతున్నారని సర్వేల్లో తేలింది. సంక్రాంతి సెలవుల్లోనూ ఇదే కన్పిస్తోందని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇక్కడే జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గేమ్స్ మోజులో నెట్ లింక్స్ తెలియకుండా క్లిక్ చేస్తే తలిదండ్రుల బ్యాంకు సమాచారం తెలుసుకుని, సైబర్ నేరగాళ్ళు దాడి చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పిల్లల మానసిక స్థితిపై ప్రభావం కరోనా కాలంలో పిల్లలకు ఆన్లైన్ విద్య కోసం తల్లిదండ్రులే ఫోన్లు కొనిచ్చారు. ఇప్పుడు వాళ్ళ జీవితంలో అది అంతర్భాగమైంది. సెలవులొస్తే చాలు ఫిజికల్ గేమ్స్ గురించి వాళ్ళు అసలు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు కరోనా ఉధృతి దీనికి మరింత అవకాశం ఇచ్చింది. ఎంతసేపూ మొబైల్ పట్టుకుని కాలం గడిపేస్తున్నారు. ఇది విద్యార్థి మానసిక స్థితిలో మార్పు తెస్తుంది. తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్త వహించాలి – పణితి రామనాథం (ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు, బూర్గుంపాడు, కొత్తగూడెం జిల్లా) సెల్ఫోన్లకు దూరంగా ఉంచాలి సెల్ ఆటలే విద్యార్థులకు శరణ్యం అయినట్టయ్యింది. అయితే ఇవి హద్దుమీరడానికి నియంత్రణ లేకపోవడమే కారణం. పిల్లల్ని తల్లిదండ్రులు అలా వదిలేయకూడదు. వాళ్ళ బాగుకోరి కొంతసేపైనా సెలవుల్లో పుస్తకాల పఠనం వైపు దృష్టి మళ్లించే ప్రయత్నం చేయాలి. తల్లిదండ్రులూ వాళ్ళతో ఆడుకుంటూ, సెల్ఫోన్లకు దూరంగా ఉండేలా చేయడం మంచిది. – శ్రీధర్ (భారత్ పబ్లిక్ స్కూల్, కోదాడ) -
కీలక డేటా తొలగించిన అనన్య!
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై తీరంలో క్రూయిజ్ నౌకలో పట్టుబడిన మాదక ద్రవ్యాల కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నిందితుడు, బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్కు మిత్రురాలైన నటి అనన్య పాండేను విచారిస్తోంది. ఆమె నివాసం నుంచి రెండు మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్ను ఎన్సీబీ ఇప్పటికే స్వాధీనం చేసుకుంది. ఇందులోని వాట్సాప్ చాటింగ్లు, ఫొటోలు, వాయిస్ నోట్లను ఆనన్య పాండే చాలావరకు తొలగించినట్లు ఎన్సీబీ గుర్తించింది. డిలీట్ చేసిన ఈ డేటాను తిరిగి రప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఆర్యన్ ఖాన్తో ఆమె సాగించిన వాట్సాప్ చాటింగ్లలో కొన్ని అనుమానాస్పద ఆర్థిక లావాదేవీల వివరాలు ఎన్సీబీ దర్యాప్తులో బయటపడినట్లు తెలుస్తోంది. ఈ ఆర్థిక లావాదేవీలు, ఆర్యన్ ఖాన్తో చాటింగ్లపై ఆనన్య పాండేను ఎన్సీబీ నిశితంగా ప్రశ్నించింది. అయితే, ఆమె అన్నింటికీ ఒకటే సమాధానం చెబుతోంది. తనపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేస్తోంది. తనకు డ్రగ్స్ అలవాటు లేదని, డ్రగ్స్ కొనడానికి ఆర్యన్కు ఎలాంటి సాయం చేయలేదని, అతడితో ఆర్థిక లావాదేవీలు లేవని పేర్కొంటోంది. అయితే, ఆర్యన్ ఖాన్కు డ్రగ్స్ సరఫరా చేసిన వ్యక్తులెవరో అనన్యకు తెలుసని ఎన్సీబీ అనుమానిస్తోంది. మరోవైపు డ్రగ్స్ కేసులో ఆర్యన్ బెయిల్ పిటిషన్పై 30న విచారణ చేపడతామని బాంబే హైకోర్టు వెల్లడించింది. నిందితుల ఆర్థిక లావాదేవీలపై ఆరా ఆర్యన్ ఖాన్ సహా నిందితులందరి ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నట్లు ఎన్సీబీ అధికారులు తెలిపారు. ఆర్యన్కు బెయిల్ ఇవ్వొద్దని కోర్టును అభ్యర్థిస్తామన్నారు. ఈ కేసులో ఎన్సీబీ ఇప్పటిదాకా 20 మందిని అరెస్టు చేసింది. వారి ఆదాయ వనరులను పరిశీలిస్తోంది. -
మొబైల్స్ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు
కాలం మారిపోయింది..సెల్ఫోన్ దేహంలో భాగమైపోయింది..ఫోన్ లేనిదే పొద్దు పోవడంలేదు..అత్యవసర పనుల నుంచి.. సరదా కబుర్లకు కూడా సెల్ ఉండాల్సిందే..! అంతెందుకు ఎక్కడో సప్త సముద్రాల అవతల ఉన్న కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఈ ఫోన్తో కమ్యూనికేట్ అవ్వొచ్చు. అలాంటి సెల్ ఫోన్కు ఓ హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ గురించి తెలుసా? ఉదాహరణకు పీసీ(personal computer)ల కంటే ప్రపంచంలోనే ఎక్కువ మొబైల్ ఫోన్లు ఉన్నాయని తెలుసా? చేతిలో ఫోన్ లేకపోతే పుట్టే భయాన్ని ఏమంటారో తెలుసా? అత్యంత ఖరీదైన స్మార్ట్ఫోన్ పేరేంటో తెలుసా? మొదటి మొబైల్ ఫోన్ బరువు ఎంతో తెలుసా? ఇలాంటి ఇంటస్ట్రింగ్ ఫ్యాక్స్ చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని ►మనం వినియోగించే 'స్మార్ట్ ఫోన్' అసలు పేరు 'సిమోన్'. ఈ ఫోన్లో క్యాలండర్ యాప్స్, అడ్రస్ బుక్, వరల్డ్ క్లాక్, క్యాలిక్లేటర్, నోట్ ప్యాడ్, ఈమెయిల్, ఫ్యాక్స్, గేమ్స్ ఆడేవారు. టచ్ స్క్రీన్తో లభించే ఈ ఫోన్ ధర వెయ్యి డాలర్లు. ►ఫస్ట్ సెల్ ఫోన్ ను 1973లో తయారు చేశారు.ఆఫోన్ నుంచి 1992లో ఫస్ట్ మెసేజ్ పంపారు. ►ఫస్ట్ కెమెరా ఫోన్ 2002 జపాన్లో విడుదలైంది. ►టెక్ దిగ్గజం యాపిల్ విడుదల చేసిన అన్నీ ఫోన్లలో కంటే ఐఫోన్ 5ఎస్ ఎక్కువగా అమ్ముడు పోయింది. 2013 సెప్టెంబర్ 20న విడుదలైన ఈ ఫోన్ ఇప్పటి వరకు 70వేల మిలియన్ల యూనిట్లు అమ్ముడుపోయాయి. ►ప్రపంచంలో వాటర్ ఫ్రూఫ్ ఫోన్లు అమ్ముతున్న దేశం జపాన్. ►సైంటిస్ట్లు తొలిసారి యూరిన్ సాయంతో సెల్ ఫోన్ కు ఛార్జింగ్ పెట్టారు. ►2015లో ఆపిల్ సంస్థ పాత ఐఫోన్లను రీసైకిల్ చేసి టన్ను గోల్డ్ను వెలికి తీసింది. అలా వెలికి తీసిన ప్రస్తుతం గోల్డ్ ధర 40మిలియన్ల (ఇండియన్ కరెన్సీలో రూ.2,99,88,62,000.00) ఉంది. ► మొబైల్ ఫోన్లను విసిరేయడం ఫిన్ల్యాండ్లో అధికారిక క్రీడ ► టాయిలెట్ హ్యాండిల్ కు ఉన్న బ్యాక్టీరియా కంటే 18 టైమ్స్ కంటే ఎక్కువ బ్యాక్టీరియా మన ఫోన్లో ఉంది.శాక్రమెంటో బీ రిపోర్ట్ ప్రకారం ఐఫోన్లు, ఐప్యాడ్లు, ఆండ్రాయిడ్ ఫోన్లు, టచ్ స్క్రీన్లపై బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ►ప్రతిరోజు ఓ వ్యక్తి యావరేజ్గా 110 సార్లు తమ స్మార్ట్ ఫోన్లను అన్ లాక్ చేస్తుంటాడు. ►చేతిలో ఫోన్ లేకపోతే కలిగే భయాన్ని వైద్య పరిభాషలో నోమో ఫోబియా అంటారు. ►1999లో తొలిసారి బెనిఫాన్ ఈఎస్ఈ అనే ఫోన్లో జీపీఎస్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ► 2015లో వరల్డ్ వైడ్ గా 1.4 బిలియన్ల ఫోన్లు అమ్ముడయ్యాయి. ► హాంకాంగ్ పాపులేషన్ 7.2 మిలియన్ల మంది ఉండగా..యాక్టీవ్గా ఉన్న మొబైల్స్ సంఖ్య 17.4 మిలియన్లుగా ఉంది. ► 40శాతం స్మార్ట్ ఫోన్లు దొంగతనానికి గురయ్యే సమయం సాయంత్రం 5 గంటల సమయం లోపలే. ► 11శాతం మొబైల్స్ దొంగతనం పనిచేసే ప్రదేశాల్లో జరిగినట్లు తేలింది. ► తొలిసారి వాడుకలోకి వచ్చిన స్మార్ట్ ఫోన్ బరువు 2.5 పౌండ్లు.. అదే ఫోన్ ఇప్పుడు యావరేజ్గా 250 గ్రాములు. చదవండి: జర భద్రం! మీ ఫోన్ హ్యాక్ అయ్యిందేమో.. ఇలా చెక్ చేయండి -
స్మార్ట్ఫోన్లపై అమెజాన్, ఫ్లిప్కార్ట్ అందిస్తోన్న బెస్ట్ డీల్స్ ఇవే...!
Amazon Great Indian Festival Flipkart Big Billion Days 2021 Best Offers On Mobile Phones: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’ ను ఫ్లిప్కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్ సేల్ను ప్రకటించిన విషయం తెలిసిందే. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ను అక్టోబర్ 3 నుంచి ఒక నెల రోజుల పాటు అమెజాన్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. బిగ్ బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ 10 వరకు జరగనుంది. ఈ సేల్లో భాగంగా పలు స్మార్ట్ఫోన్లపై అమెజాన్, ఫ్లిప్కార్ట్ అందిస్తోన్న బెస్ట్ డీల్స్పై ఒక లుక్కేయండి...! చదవండి: ప్రైమ్ యూజర్లకు బంపర్ఆఫర్ ప్రకటించిన అమెజాన్..! స్మార్ట్ఫోన్లపై అమెజాన్ అందిస్తోన్న బెస్ట్ డీల్స్...! ఆపిల్ ఐఫోన్ 11 గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో కొనుగోలుదారులకు ఐఫోన్ 11 స్మార్ట్ఫోన్ ధర రూ. 38,999 కు లభించనుంది. స్మార్ట్ఫోన్ ఎక్సేచేంజ్పై సుమారు రూ. 12,350 తక్షణ డిస్కౌంట్ను అమెజాన్ అందిస్తోంది. 64జీబీ ఆపిల్ ఐఫోన్ 11 స్మార్ట్ఫోన్ అసలు ధర రూ. 68,300. శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీ స్మార్ట్ఫోన్ అత్యంత తక్కువ ధరలో రూ. 36,990 కే కొనుగోలుదారులకు లభించనుంది. స్మార్ట్ఫోన్ ఎక్సేచేంజ్పై సుమారు రూ. 12,350 తక్షణ డిస్కౌంట్ను అమెజాన్ అందిస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ అసలు ధర రూ. 74,999. ఆపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్ ఆపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్ కొనుగోలుదారులకు రూ. 32,999కు లభించనుంది. ఎక్సేచేంజ్పై సుమారు రూ. 12,350 తక్షణ డిస్కౌంట్ను అమెజాన్ అందిస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ అసలు ధర రూ. 47,900. ఐక్యూ జెడ్3 5జీ వివో సబ్ బ్రాండ్ ఐనా ఐక్యూ కంపెనీ స్మార్ట్ఫోన్ ఐక్యూ జెడ్3 5జీ స్మార్ట్ఫోన్ (6జీబీ+128 జీబీ) వేరియంట్ కొనుగోలుదారులకు రూ. 17,990 కే లభించనుంది. అంతేకాకుండా 9 నెలల నో కాస్ట్ ఈఎమ్ఐ, ఆర్నెల్ల ఫ్రీ స్క్రీన్ రిప్లేస్మెంట్ను కూడా అందిస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ అసలు ధర రూ. 22,990. రెడ్మీ నోట్ 10ప్రో రెడ్మీనోట్ 10 ప్రో కొనుగోలుదారులకు రూ. 16,499 కే లభించనుంది. ఈ స్మార్ట్ఫోన్ అసలు ధర రూ. 19,999. స్మార్ట్ఫోన్లపై ఫ్లిప్కార్ట్ అందిస్తోన్న బెస్ట్ డీల్స్...! ఆపిల్ ఐఫోన్ ఎస్ఈ బిగ్బిలియన్ డేస్ సేల్లో భాగంగా ఐఫోన్ ఎస్ఈ స్మార్ట్ఫోన్ కొనుగోలుదారులకు రూ. 26, 999 కు లభించనుంది. ఈ స్మార్ట్ఫోన్ అసలు ధర రూ. 39, 900. గూగుల్ పిక్సెల్ 4ఏ బిగ్బిలియన్ డేస్ సేల్లో భాగంగా గూగుల్ పిక్సెల్ 4ఏ స్మార్ట్ఫోన్ కొనుగోలుదారులకు రూ. 25,999 కు లభించనుంది. ఈ స్మార్ట్ఫోన్ అసలు ధర రూ. 31, 999. ఈ స్మార్ట్ఫోన్ కొనుగోలుపై ఫ్లిప్కార్ట్ బండిల్ ఆఫర్ను కూడా అందిస్తోంది. గూగుల్ నెస్ట్ ను కేవలం రూ. 1, గూగుల్ పిక్సెల్ బడ్స్ ఏ సిరీస్ను కేవలం రూ. 4999కు అందించనుంది. అంతేకాకుండా కొనుగోలు సమయంలో యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డుపై 10 శాతం తక్షణ తగ్గింపు కూడా రానుంది. పోకో ఎక్స్ 3 ప్రో పోకో ఎక్స్ 3 ప్రో స్మార్ట్ఫోన్ కొనుగోలుదారులకు రూ. 16,999కే అందుబాటులో ఉండనుంది. ఈ స్మార్ట్ఫోన్ అసలు ధర రూ. 23, 999. మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ బిగ్ బిలియన్ డేస్ సేల్లో భాగంగా మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ స్మార్ట్ఫోన్ రూ. 19,999కే కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. ఈ స్మార్ట్ఫోన్ అసలు ధర రూ. 24, 999. అంతేకాకుండా యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం మేర తక్షణ తగ్గింపును ఫ్లిప్కార్ట్ అందిస్తోంది. చదవండి: యాక్సిస్ బ్యాంకుతో షాపింగ్ చేస్తే 45 శాతం మేర క్యాష్బ్యాక్...! -
వైరల్: బుజ్జగించడానికి మీ పిల్లలకు ఇవి ఇస్తున్నారా..
లండన్: ఇంట్లో పిల్లలను బుజ్జగించడానికి ఏదో సరదాగా ఇచ్చిన మొలైల్ ఫోన్ ఆ తర్వాత వారి పాలిట శాపంగా మారవచ్చు. బొమ్మలతో ఆడుకోవాల్సిన వాళ్లు మొబైల్ మాత్రమే కావాలని మారాం చేయవచ్చు. చిన్నగా మొదలైన ఈ వ్యసనం చిలికి చిలికి గాలి వానగా మారితే.. ఇదిగో ఈ బుడ్డోడి ముందు ఎన్ని బొమ్మలు వేసిన మొబైల్ కోసమే వెతికినట్లు తయారయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఓ చిన్న పిల్లవాడు ముందు ఆడుకునే బొమ్మలతో పాటు.. ఓ మొబైల్ ఫోన్ను ఉంచారు. అయితే ఆ పిల్లవాడిని ఎన్నిసార్లు వదిలినా మొబైల్ ఫోన్ కోసమే వెదుకుతాడు. ఈ వీడియోను ఇంగ్లండ్లోని నార్ఫోక్లో గోర్లేస్టన్-ఆన్-సీకి చెందిన లెన్నీ అనే వారి ఇంట్లో చిత్రీకరించారు. ఈ వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలను తాత్కాలికంగా బుజ్జగించడానికి మొబైల్స్ని ఇస్తే.. దాని తర్వాతి పరిణామాలకు వారే బాధ్యులు.’’ అంటూ కామెంట్ చేశాడు. మరో నెటిజన్ స్పందిస్తూ ‘‘తల్లిదండ్రులు పిల్లల ముందు మొబైల్ ఫోన్లు పట్టుకుని కూర్చోవడం కంటే.. వారితో సరదాగా గడిపి.. ఆడిస్తే బాగుంటుంది.’’ అంటూ రాసుకొచ్చాడు. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
షావోమికి షాక్: సెల్ ఫోన్లతో వెళ్తున్న లారీనీ దోచేశారు
కోలారు: చెన్నై-బెంగళూరు జాతీయ రహదారి-75పై దోపిడీదారులు చెలరేగిపోయారు. కంటైనర్ లారీని అడ్డుకుని రూ.6.4 కోట్ల విలువైన సెల్ఫోన్లను దోపిడీ చేశారు. ఈ ఉదంతం కర్ణాటకలోని కోలారు జిల్లా, ముళబాగిలు తాలూకాలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. చైనా మొబైల్ కంపెనీ షావోమికి చెందిన ఎంఐ కంపెనీకి చెందిన మొబైల్ ఫోన్లతో బయలుదేరిన కంటైనర్ను వెంటాడి మరీ దోచుకున్న వైనం కలకలం రేపింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ముళబాగిలు పోలీసుల కథనం మేరకు...చెన్నై నుంచి బెంగళూరుకు ఎంఐ కంపెనీకి చెందిన సెల్ఫోన్ల లోడ్తో గురువారం సాయంత్రం పీజీ ట్రాన్స్పోర్ట్కు చెందిన కంటైనర్ లారీ (నం.కేఏ01ఏపీ6824) బయల్దేరింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ముళబాగిలు తాలూకా దేవరాయసముద్ర గ్రామ సమీపంలోకి చేరుకోగానే కారులో వెంటాడిన 8 మంది దుండగులు లారీని అడ్డగించారు. డ్రైవర్ను తాళ్లతో బంధించి నిర్జన ప్రదేశంలో వదిలేసి సెల్ఫోన్ల లారీతో ఉడాయించారు. నేర్లహళ్లి గ్రామం వద్ద సెల్ఫోన్లను మరో లారీలోకి తరలించి తీసుకెళ్లారు. తెల్లవారుజామున డ్రైవర్ కట్లు విప్పుకుని ముళబాగిలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సెంట్రల్ జోన్ ఐజీ చంద్రశేఖర్, కోలారు ఎస్పీ కిశోర్బాబు, డీఎస్పీ గోపాల్ నాయక్, ముళబాగిలు ఎస్ఐ ప్రదీప్ సింగ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డీఎస్పీ గోపాల్నాయక్ ఆధ్వర్యంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి దుండగుల కోసం గాలింపు చేపట్టారు. సెల్ఫోన్ బాక్స్లు ఎత్తుకెళ్లిన తర్వాత ఖాళీగా ఉన్న కంటైనర్ -
సీసీ కెమెరాలను పైకి తిప్పేసి.. దర్జాగా దోచుకుపోయాడు..
సాక్షి, సత్తుపల్లి: సీసీ కెమెరాలున్నా వాటిని పైకి తిప్పేసి..ఓ దొంగ దోచుకున్న తీరు సత్తుపల్లి పట్టణం బస్టాండ్ రింగ్ సెంటర్లోని చిన్నా సెల్ వరల్డ్ షాపులో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనలో రూ.6.50 లక్షల విలువైన సెల్ఫోన్లను అపహరించాడు. ఆగంతకుడు అర్ధరాత్రి 1.23 గంటలకు మొదటి అంతస్తు లోపల నుంచి కిందకు దిగి ఒక వైపు తాళం వేసిన ఉన్న షట్టర్ను చాకచక్యంగా తెరిచి 1.26 గంటలకు లోనికి ప్రవేశించాడు. ఆ తర్వాత షాపులోని సీసీ కెమెరాలను పైకి తిప్పేశాడు. సుమారు 40 నిమిషాలకుపైగా షాపులో ఉన్న ఆగంతకుడు షో కేసుల్లోని బ్రాండెడ్ సెల్ఫోన్లు మాత్రమే ఎంపిక చేసుకొని ఎత్తుకెళ్లాడు. అయితే, షట్టర్పైన ఉన్న సీసీ కెమెరాను గమనించకపోవటంతో ఆగంతకుడి కదలికలన్నీ రికార్డు అయ్యాయి. ఎత్తుగా, సన్నగా ఉండి తలకు టోపీ, ముఖానికి మాస్క్, చేతులకు గ్లౌస్ ధరించి ఉండడాన్ని పుటేజీలో పోలీసులు గుర్తించారు. అయితే వచ్చిందా ఒకరా, ఇద్దరా అనేది తేలడం లేదు. కాగా, చోరీ జరిగిన సెల్ పాయింట్ను కల్లూరు ఏసీపీ ఎన్.వెంకటేష్, సత్తుపల్లి పట్టణ సీఐ ఎ.రమాకాంత్ గురువారం ఉదయం పరిశీలించారు. అలాగే, ఖమ్మం నుంచి ప్రత్యేక క్లూస్టీం రంగంలోకి దిగి వేలిముద్రలను సేకరించారు. యజమాని వేణుగోపాలరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, సుమారు 6.50 లక్షల విలువైన సెల్ఫోన్లు చోరీకి గురైనట్టు ప్రాథమిక విచారణలో తేలిందని ఏసీపీ తెలిపారు. -
Pegasus: కాస్ట్లీ గూఢచారి.. పెగాసస్!
పెగాసస్ స్పైవేర్ రహస్యాల పుట్ట పగులుతోంది.. ఒక్కటొక్కటిగా వివరాలు వెల్లడవుతూంటే.. ముక్కున వేలేసుకోవడం.. సామాన్యుల వంతు అవుతోంది! నేతలు, విలేకరులు, హక్కుల కార్యకర్తలు..బోలెడంత మందిపై నిఘానేత్రానికి అయిన ఖర్చెంత? వ్యాప్తి ఏ మేరకు? ఏం చేయగలదు? ఎలా చేస్తుంది? పెగాసస్ సాఫ్ట్వేర్ను ఉపయోగించడం సామాన్యుల వల్ల అయ్యే పని కానే కాదు. ఎన్ఎస్ఓ టెక్నాలజీస్ స్వయంగా చెప్పినట్లు, ప్రభుత్వాలు, ప్రభుత్వ నిఘా సంస్థలు మాత్రమే కొనుగోలు చేయగలవు. ఉపయోగించగలవు. ఖరీదు కోట్లలోనే. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం మొదలుకొని నిఘా వేయాల్సిన ఫోన్లు, డెస్క్టాప్ల సంఖ్య, ఏ రకమైన వివరాలు కావాలి? వంటి అనేక అంశాలకు వేర్వేరుగా ఛార్జీలు వసూలు చేస్తుంది ఎన్ఎస్ఓ టెక్నాలజీస్. 2016లో న్యూయార్క్ టైమ్స్ సేకరించిన వివరాల ప్రకారం చూస్తే.. పెగాసస్ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చార్జీనే దాదాపు రూ.3.5 కోట్లు ఉంటుంది. ఐఫోన్/ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లు పదింటిపై నిఘా పెట్టేందుకు అయ్యే ఖర్చు ఇంకో రూ.నాలుగు కోట్లు ఖరీదు చేస్తుంది. అప్పట్లో విస్తృత వాడకంలో ఉన్న బ్లాక్బెర్రీ ఫోన్లు ఐదింటిపై నిఘా పెట్టేందుకు రూ.3.5 కోట్లు, ఇన్నే సింబియాన్ ఫోన్లకు రూ.కోటి వరకూ అవుతుందని న్యూయార్క్ టైమ్స్ కథనం తెలిపింది. ఇది బేసిక్ ప్యాకేజీ.. నిఘా వేయాల్సిన స్మార్ట్ఫోన్ల సంఖ్య ఇంకో వంద పెరిగితే రూ.5.5 కోట్లు వదిలించుకోవాలి. ఇంకో యాభై మందిపై నిఘాకు రూ.3.5 కోట్లు, సంఖ్య 20 అయితే కోటి రూపాయలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కాకుండా.. మెయింటెన్స్ ఛార్జీలు మొత్తం ఛార్జీల్లో 17 శాతం వరకూ ఉండగా.. నిర్దిష్ట సమయం తరువాత రెన్యువల్ ఛార్జీలు వేరుగా చెల్లించాల్సి ఉంటుంది. భారత్లో పెగాసస్ సాఫ్ట్వేర్ బారిన పడ్డ వారి సంఖ్య దాదాపు 300 అన్నది నిజమైతే.. మొత్తం ఖర్చు సుమారు 40 లక్షల డాలర్లు లేదా రూ.28 కోట్లు అవుతుందన్నమాట. మెయింటెనెన్స్ చార్జీలు, ఇతర ఖర్చులు కూడా కలుపుకుంటే.. మొత్తం ఖర్చు రూ.యాభై కోట్ల వరకూ అయి ఉండవచ్చునని అంచనా. 2016 నాటి లెక్కలకు ద్రవ్యోల్బణం తదితర అంశాలను జోడించి చూస్తే.. ప్రస్తుతం పెగాసస్ సాఫ్ట్వేర్ కోసం కనీసం రూ.వెయ్యికోట్ల కంటే ఎక్కువే ఖర్చుఅయి ఉండాలి. అన్నింటిలోకీ చొరబడిందా? భారత్లో పెగాసస్ సాఫ్ట్వేర్ ద్వారా 300 మందిపై నిఘా వేసేందుకు ప్రయత్నాలు జరిగాయని వార్తలొచ్చాయి. అయితే వీరందరి స్మార్ట్ఫోన్లలోనూ ఆ స్పైవేర్ జొరబడిందా? అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాచారం లేదు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్కు చెందిన సెక్యూరిటీ ల్యాబ్ 67 స్మార్ట్ఫోన్లను పరిశీలించగా ఇరవై మూడింటిలో స్పైవేర్ ఉందని, ఇంకో 14 వాటిలో లోనికి జొరబడే ప్రయత్నం జరిగిన ఆనవాళ్లు ఉన్నాయని ‘ద వైర్’ ఒక కథనంలో తెలిపింది. మిగిలిన 30 మంది స్మార్ట్ఫోన్ల పరీక్షలు ఏ రకమైన ఫలితమూ ఇవ్వలేదని, ఫోన్లను వదిలించుకోవడం ఇందుకు కారణం కావచ్చునని తెలిపింది. రెండేళ్ల క్రితం పార్లమెంటరీ కమిటీ విచారణ ఈ అంశంపై 2019లో ఐటీపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ విచారణ జరిపింది. అప్పట్లో ఈ సాఫ్ట్వేర్ 121 మందిపై ప్రభావం చూపినట్లు సమాచారం. తమిళనాడులోని కుడంకుళం అణువిద్యుత్ కేంద్రంపై, అణుశక్తి విభాగాలపై సైబర్ దాడి జరిగిందని తెలిసింది. కుడంకుళం అణువిద్యుత్ కేంద్రం పరిపాలన విభాగంపై ఈ సాఫ్ట్వేర్ దాడి చేసినట్లుగా సమాచారం. అయితే కేంద్ర హోంశాఖ, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలు ఈ అంశంపై ఎలాంటి వ్యాఖ్య చేయకపోవడం గమనార్హం. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన విచారణలో భాగంగా 17 మందిని విచారించినట్లు, ఇందులో మానవహక్కుల కార్యకర్తలతోపాటు జగదల్పూర్ లీగల్ ఎయిడ్ సభ్యులు ఉన్నారు. మొత్తం విచారణపై కమిటీ ఏ రకమైన నివేదిక ప్రభుత్వానికి సమర్పించకపోవడం కొసమెరుపు! చొరబడేది ఇలా... ► ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఎన్ఎస్ఓ టెక్నాలజీస్ సిద్ధం చేసిన పెగాసస్ సాఫ్ట్వేర్ ఇంటర్నెట్ ఉన్న స్మార్ట్ఫోన్లలోకే చొరబడుతుంది. తాజా వెర్షన్లు ఫోన్కు వచ్చిన లింకులు, మెసేజ్ను క్లిక్ చేయకుండానే సాఫ్ట్వేర్ను జొప్పించగలదని చెప్తున్నారు. ► స్పైవేర్, స్టాకర్వేర్లు యాంటీ థెఫ్ట్ (ఫోన్ చోరీకి గురికాకుండా చూసేవి) అప్లికేషన్ల రూపంలో వస్తూంటుంది. యాంటీ వైరస్ సాఫ్ట్వేర్లు స్మార్ట్ఫోన్లలోకి జొరబడే వైరస్, మాల్వేర్లను గుర్తించగలదు. స్పైవేర్, స్టాకర్వేర్లు వీటి కంటపడకుండా మనకు ఏదో ఉపయోగాన్ని ఇచ్చేవన్న ముసుగులో మన స్మార్ట్ఫోన్లలోని సమాచారాన్ని సెంట్రల్ సర్వర్కు పంపుతూ ఉంటుంది. ► ఒక్కసారి లోనికి జొరబడితే పెగాసస్ లాంటి స్పైవేర్లు బ్యాక్గ్రౌండ్లోనే పనిచేస్తూంటాయి. వాట్సాప్, ఎస్ఎంఎస్ వంటి అప్లికేషన్ల సాఫ్ట్వేర్లలో ఉండే లొసుగులను ఆసరాగా చేసుకుని పనిచేస్తుంది ఇది. అంతేకాదు.. పెగాసస్ స్మార్ట్ఫోన్ ‘రూట్ ప్రివిలైజెస్’ను పొందేందుకు ప్రయత్నిస్తుంది. ఈ రూట్ ప్రివిలైజెస్తో పెగాసస్ తనకు అవసరమైన వివరాలు సేకరించేందుకు తగిన సాఫ్ట్వేర్ను ఫోన్లో ఇన్స్టాల్ చేయగలదు. ఈ క్రమంలో ఫోన్ అడ్మినిస్ట్రేటర్గానూ ఈ పెగాసస్ మారిపోతుంది. సోకిన తరువాత...? రిమోట్ సర్వర్ ద్వారా అందే సూచనతో మన ఫోన్ పనిచేస్తూంటుంది. అవసరమనుకుంటే.. మన కెమెరా ఆటోమెటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఫొటోలు తీసేస్తుంది కూడా. అంతేకాకుండా.. మైక్రోఫోన్ ఆన్ చేసి మన మాటలు రికార్డ్ చేయడం, లేదా ఎస్ఎంఎస్, వాట్సప్ సందేశాల్లోని సమాచారాన్ని సర్వర్కు చేరవేడం చేయగలదు. కేలండర్లోకి జొరబడి మన అపాయింట్మెంట్లను గుర్తిస్తుంది. గుర్తించేంత వరకూ రిమోట్ సర్వర్కు సంకేతాలు పంపుతూనే ఉంటుంది. పెగాసస్ సాఫ్ట్వేర్ ప్రభుత్వాల వద్ద మాత్రమే ఉంటుంది. జాతీయ భద్రత, ఉగ్రవాదం మినహా మిగిలిన అంశాల కోసం భారత ప్రభుత్వం ఈ సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఉంటే అది కచ్చితంగా అక్రమమే. ఒకవేళ ప్రభుత్వం వాడకపోయి ఉంటే మరీ ప్రమాదం. జాతీయ భద్రతకు భంగం కలిగినట్లే. పెగాసస్ సాఫ్ట్వేర్పై న్యాయ విచారణ జరగాల్సిందే – శశి థరూర్, ఐటీపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ – సాక్షి, నేషనల్ డెస్క్ -
చిల్డ్రన్–సోషల్ మీడియా.. చూస్తున్నారా... ఏం చూస్తున్నారో!
పిల్లలు ఫోన్ తీసుకుని ఏం చూస్తున్నారు? పిల్లల్ని టార్గెట్ చేసుకొని సోషల్ మీడియాలో ఏమేమి వస్తోంది? ఎవరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతున్నారు? ఏ గేమ్కు బానిసవుతున్నారు? తెలియక ఏ పోర్నోగ్రఫీ కంటెంట్కు ఎక్స్పోజ్ అవుతున్నారు? అశ్లీల చిత్రాలను సోషల్ మీడియా యాప్స్లో పెడుతున్నందుకు ఇటీవల జరిగిన బాలీవుడ్ అరెస్ట్ నేర విచారణ గురించి కంటే అలాంటి కంటెంట్ పిల్లల వరకూ చేరుతున్నదా అనే ఆందోళనే ఎక్కువ కలిగిస్తోంది. తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక. లోకంలో చాలా పనులు జరుగుతున్నాయి. మనం మాత్రం పిల్లల చేతికి ఫోన్లు ఇచ్చి మన పనుల్లో పడుతున్నాం. ఆన్లైన్ క్లాసుల కోసమో, తల్లిదండ్రులు ఉద్యోగస్తులైతే పిల్లలతో మాట్లాడటం కోసమో, పిల్లలతో టైమ్ స్పెండ్ చేసే వీలు లేక వారిని ఎంగేజ్ చేయడం కోసమో, స్టేటస్ కోసమో, గారాబం కోసమో ఇవాళ చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల చేతికి ఫోన్లు ఇస్తున్నారు. ఇవ్వక తప్పడం లేదు. కాని వారి చేతిలో ఉన్న ఆ ఫోన్ వారికి చాలా మేలు చేయగలదు. చాలానే కీడు కూడా చేయగలదు. ఆ విషయం వారికి తెలిసే వరకు స్నేహంగా వారిని అలెర్ట్ చేస్తున్నామా? చెక్ చేస్తున్నామా? అంతా అయ్యాక ‘నువ్వు గేమ్స్కు బానిసయ్యావు.. నిన్నూ’.. అని ఫోన్లు పగలగొడితే ఆ పిల్లలు అలిగి ఆత్మహత్యలు చేసుకునేవరకు తీసుకువెళుతున్నాం. ఇప్పుడు ఫోన్ అనేది ఇద్దరి బాధ్యతతో ముడిపడి ఉన్న వస్తువు... తల్లిదండ్రులూ... పిల్లలూ... ఢిల్లీలో వినూత్న కేసు రెండు రోజుల క్రితం ఢిల్లీ మహిళా కమిషన్ అక్కడి పోలీసులకు ఒక మహిళ మీద ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయమని ఆదేశాలు ఇచ్చింది. దానికి కారణం ‘ఇన్స్టాగ్రామ్’ అకౌంట్లో ఆ మహిళ పెట్టే వీడియోల్లో కుమారుణ్ణి నటింపచేయడమే. సాధారణంగా తగిన ఆపోజిట్ పార్టనర్ ఉంటేనే కొన్ని వీడియోలు చేయాలి. ఆ వీలు లేనివారు చిన్న పిల్లలతో పాటలకు డాన్సులు చేయడం చేస్తున్నారు. ఆ మహిళ తన కొడుకుతో కలిసి చేసిన డాన్సు ‘అశ్లీలంగా’ ఉందని మహిళా కమిషన్ గుర్తించింది. వెంటనే ఆ మహిళను అరెస్ట్ చేయమంది. పిల్లాడ్ని కౌన్సిలింగ్కి తీసుకువెళ్లమని చెప్పింది. పిల్లల్ని ఇవాళ విపరీతంగా ప్రభావితం చేస్తున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఇన్స్టాగ్రామ్’. ఇందులో ‘రీల్స్ మేకర్లు’గా పిల్లలు డాన్సులు చేస్తూ పాపులారిటీ సంపాదిస్తున్నారు. కాని అవి ఒక్కోసారి శృతి మించి ఫాలోయెర్స్ను పెంచుకోవడానికి శరీరం కనిపించే లేదా పెద్దల్లా శరీర కదలికలు చేసే విధంగా ఉండటం ప్రమాదంగా పరిణమించింది. కొందరు తల్లిదండ్రులు పిల్లలతో ఇలాంటి వీడియోలను చేసి మరీ పెడుతున్నారు. 30 సెకన్ల సేపు ఉండే ఇన్స్టా రీల్స్ ఇవాళ చాలామంది పిల్లలను తప్పు దోవ పట్టించడమే కాక ఇతర ‘ఉద్రేకపరిచే’ డాన్సులను, డమ్మీ సంభాషణలను వారు చూసేలా చేస్తోంది. ఫొటోల ప్రమాదం ఫేస్బుక్లో 18 ఏళ్ల లోపు పిల్లలు అకౌంట్లు కలిగి ఉంటున్నారు. వీరు అకౌంట్స్ ఓపెన్ చేసేలా కొంతమంది తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. ఒకసారి అకౌంట్ ఓపెన్ చేశాక ఇక ఎవరెవరు ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పెడతారో చెప్పలేం. మెసెంజర్లో ఎవరు చాట్కు ఆహ్వానిస్తారో తెలియదు. అలాంటివి ఏమీ లేకపోయినా చీటికి మాటికి పిల్లల ఫొటోలు పిల్లలుగాని పెద్దలు కాని పోస్ట్ చేయడం క్షేమం కాదు. వాటిని సేవ్ చేసుకుని మార్ఫింగ్ చేసే వీలు ఉంటుంది. ఫేస్బుక్లో రకరకాల భావజాలాలు, వీడియోలు, యాడ్స్ ప్లే అవుతూ ఉంటాయి. అవన్నీ పిల్లల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో మనకు తెలిసే అవకాశం లేదు. అడిక్షన్ అంటే పిల్లలు ఫోన్కు అడిక్ట్ అయితే వారు కేవలం గేమ్స్ ఆడుతూ మాత్రమే అడిక్ట్ కారు. ఇవాళ వస్తున్న కామెడీ స్కిట్లు, డాన్స్ షోలు, ఓటిటి ప్లాట్ఫామ్స్లో ఉన్న సిరీస్లు... వీటన్నింటిని చూస్తూ ఫోన్కు అడిక్ట్ అవుతారు. కొన్ని రకాల గేమ్స్ వారిని పదే పదే ఫోన్ చేతిలో పట్టుకునే విధంగా ఎప్పుడెప్పుడు క్లాస్/తల్లిదండ్రులు చెప్పిన పని పూర్తవుతుందా ఎప్పుడు ఫోన్ చేతిలోకి తీసుకుందామా అని అస్థిమితం చేస్తాయి. కామెడీ పేరుతో సాగే అశ్లీల సంభాషణలు వేస్తున్న ప్రభావం తక్కువ ఏమీ కాదు. ఓటిటి ప్లాట్ఫామ్స్లో చాలా సిరీస్ ‘18 ప్లస్’గా ఉంటాయి. కాని వాటిని కూడా 10–13 ఏళ్ల మధ్య పిల్లలు చూస్తున్నారు. మార్కెట్ మార్కెట్ కూడా పిల్లల వెంట పడుతుంది. సోషల్ మీడియాలో ఉండే పిల్లలు వారు బ్రౌజ్ చేసే సైట్లు, ప్రొడక్ట్స్ను బట్టి వారికి యాడ్స్ ప్రత్యక్షమవుతాయి. స్లిమ్ కావాలంటే ఈ ఫుడ్ తినండి, అందంగా కనిపించాలంటే ఈ బట్టలు వాడండి, ఫలానా యాప్ ద్వారా ట్యూషన్ క్లాసులు వినండి, ఫలానా చోటుకు ప్రయాణాలు కట్టండి అని వారిని ఆకర్షిస్తూ ఉంటాయి. పిల్లలు అవి చూసి కావాలని తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. పుస్తకం బెటర్ పిల్లలు ఏ పుస్తకం చదువుతున్నారో దాని కవర్ మనకు కనపడుతూ ఉండటం వల్ల తెలుస్తుంది. కాని వారు ఫోన్ చూస్తూ ఉంటే అందులో ఏం చూస్తున్నారో ఎదురుగా ఉన్న మనకు తెలియదు. ఎదిగే వయసులో ఉన్న పిల్లలను ఒక మాయా ప్రపంచంలో దించినట్టే... వారి చేతికి సెల్ ఇవ్వడం అంటే. వారిని కనిపెట్టే సమయం లేదని ఇప్పుడు ఊరుకుంటే భవిష్యత్తు సమయమంతా వారి కోసం బెంగపడాల్సి వస్తుంది. జాగ్రత్త పడదాం. ఫోన్ తగ్గించి పుస్తకం ఎక్కువగా పెడదాం. -
చెమటతో మొబైల్ ఫోన్ ఛార్జింగ్...!
Charging With Finger Strip: మానవ పరిణామ క్రమంలో చక్రం నుంచి మొదలైన ఆవిష్కరణలు ఎన్నో ఇతర ఆవిష్కరణలకు దారితీశాయి. తన మేధ సంపత్తితో అనేక విషయాలను జయించాడు. రాబోయే విపత్తులను తెలుసుకోవడంలో, ప్రపంచంలో జరిగే ప్రతి విషయాన్ని తన మునివేళ్లపై తెచ్చుకున్నాడు. రకరకాల ఆవిష్కరణలతో సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలను కనుగొంటున్నాడు. మానవుడి ఆవిష్కరణలో భాగంగా చెప్పుకోదగిన ఇన్నోవేషన్ మొబైల్ ఫోన్. సాధారణంగా మొబైల్ ఫోన్లు ఎదుర్కోంటున్న ప్రధాన సమస్య ఛార్జింగ్. ఫోన్లలో బ్యాటరీ పూర్తిగా ఐపోతే ఎందుకు పనికిరాదు. కాగా ఛార్జింగ్ సమస్యను కూడా పరిష్కరించడం కోసం సైంటిస్టులు ఇప్పటికే ప్రయత్నాలను మొదలుపెట్టారు.తాజాగా మానవ శరీరం నుంచి వెలువడే చెమటతో మొబైల్ ఫోన్లకు ఛార్జింగ్ చేయవచ్చునని పరిశోధకులు నిరూపించారు. చెమటతో ఛార్జింగ్ చేసే ప్రత్యేక ఆవిష్కరణను యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు ఆవిష్కరించారు. పరిశోధకుల ప్రకారం.. చేతి వేళ్లకు ఒక ప్రత్యేకమైన స్ట్రిప్ను ఉంచుకోవడం ద్వారా మానవ శరీరం నుంచి వెలువడే చెమటనుపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని పేర్కొన్నారు. 10 గంటల పాటు స్ట్రిప్ను ధరించడంతో సుమారు 400 మిల్లీజౌల్స్ వరకు శక్తిని ఉత్పత్తి చేయవచ్చునని పరిశోధనలో తేలింది. ఈ శక్తితో ఒక స్మార్ట్వాచ్ 24 గంటలపాటు నడుస్తుందని తెలిపారు. అంతేకాకుండా చేతి వేళ్లకు, మొబైల్ ఫోన్ స్క్రీన్పై ప్రత్యేక ఏర్పాటుతో మొబైల్ ఫోన్ ఛార్జింగ్ చేయవచ్చునని సైంటిస్టులు పేర్కొన్నారు. -
భారత్ భారీవాటా: మొబైల్స్ ఆన్‘లైన్’..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా మహమ్మారి కారణంగా ఈ-కామర్స్ అనూహ్యంగా పుంజుకున్న సంగతి తెలిసిందే. మొబైల్స్ విషయంలోనూ 2020లో అదే జోరు కనపడింది. గతేడాది దేశవ్యాప్తంగా అమ్ముడైన మొబైల్స్లో ఆన్లైన్ వాటా 45 శాతం నమోదైందని పరిశోధన సంస్థ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తాజా నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇదే అత్యధికం కావడం గమనార్హం. అంతర్జాతీయంగా 26 శాతం మొబైల్స్ ఆన్లైన్ ద్వారా కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. ఆన్లైన్ వాటా యూకేలో 39 శాతం, చైనా 34, బ్రెజిల్ 31, యూఎస్ 24, దక్షిణ కొరియాలో 16 శాతం కైవసం చేసుకుంది. ఆన్లైన్ జోరు క్రమంగా తగ్గుముఖం పడుతుందని.. ఈ ఏడాది 2020 ఏడాది మాదిరిగా లేదా స్వల్పంగా తగ్గుదల ఉండొచ్చని నివేదిక తెలిపింది. మల్టీ బ్రాండ్ రిటైల్ స్టోర్లు విస్తరిస్తున్నందున భారత్లో 2022 తర్వాత ఆన్లైన్ వాటా క్షీణిస్తుందని వెల్లడించింది. లాక్డౌన్లో తగ్గిన ఆన్లైన్.. సెకండ్ వేవ్ కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా రవాణా పరిమితులు విధించడంతో ఈ-కామర్స్ కంపెనీలకు డెలివరీ సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఈ ప్రభావం స్మార్ట్ఫోన్ల విక్రయాలపైనా పడింది. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వారం తర్వాతగానీ కస్టమర్లకు గ్యాడ్జెట్స్ చేరకపోవడంతో.. చాలా మంది వినియోగదార్లు తమ ఆర్డర్లను రద్దు చేసుకున్నారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. సమయానికి కస్టమర్కు ఉత్పత్తులను చేర్చలేని పరిస్థితి తలెత్తడంతో అటు విక్రేతలు సైతం ఈ-కామర్స్లో లిస్టింగ్కు వెనుకడుగు వేశారు. దీంతో రెండు నెలలుగా ఆన్లైన్ జోరు తగ్గింది. ఈ పరిణామాలన్నీ ఆఫ్లైన్ రిటైలర్లకు కలిసొచ్చిందని బిగ్-సి మొబైల్స్ సీఎండీ ఎం.బాలు చౌదరి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. రెండు గంటల్లోనే డెలివరీ.. ఈ-కామర్స్ కంపెనీలకు దీటుగా మల్టీ బ్రాండ్ మొబైల్ రిటైల్ స్టోర్లు ఆన్లైన్ ప్లాట్ఫాంను పటిష్టం చేసుకున్నాయి. ఆన్లైన్లో ఆర్డర్ అందుకున్న 2 గంటల్లోనే ఈ సంస్థలు డెలివరీ చేస్తున్నాయి. బిగ్–సి మొబైల్స్, లాట్ మొబైల్స్, సంగీత, బి-న్యూ మొబైల్స్, హ్యాపీ మొబైల్స్, సెలెక్ట్ మొబైల్స్, సెల్ పాయింట్ వంటి సంస్థలు చిన్న పట్టణాలకూ విస్తరించాయి. దీంతో ఆన్లైన్తోపాటు ఆఫ్లైన్ కస్టమర్లను చేరుకోవడం వీటికి సులభం అయింది. మొబైల్స్ విషయంలో ఈ-కామర్స్ కంపెనీల నుంచి ఆఫ్లైన్కు రెండు నెలల్లో 25 శాతం కస్టమర్లు మళ్లారని మల్టీ బ్రాండ్ రిటైల్ సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఆఫ్లైన్లో మాత్రమే ప్రత్యక్షంగా ఎంచుకోవడానికి విస్తృత శ్రేణి మొబైల్స్ డిస్ప్లేలో ఉంటాయని బి-న్యూ మొబైల్స్ సీఎండీ వై.డి.బాలాజీ చౌదరి వివరించారు. అమెజాన్ పే, ఫోన్పే వంటి పేమెంట్ యాప్స్ భాగస్వామ్యంతో మల్టీ బ్రాండ్ రిటైల్ స్టోర్లు కస్టమర్లను డిస్కౌంట్లతో ఆకట్టుకుంటున్నాయి. -
ఓటీటీ.. యువత పోటాపోటీ
ఏలూరు టౌన్: వినోద రంగంలో ఓవర్ ద టాప్ (ఓటీటీ) కీలక భూమి పోషిస్తోంది. కరోనాతో పాత పద్ధతులకు భిన్నంగా నూతన మార్గాలపై యువత మొగ్గుచూపుతోంది. టీవీ సీరియళ్లను మరిపించేలా వెబ్సిరీస్లు, థియేటర్లలో విడుదల కాని సినిమాలు ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఓటీటీల వినియోగం బాగా పెరిగింది. సెల్ఫోన్లో యాప్ల ద్వారా యువత, విద్యార్థులు అరచేతిలో వినోదాన్ని పొందుతున్నారు. ఇది వ్యసనంలా మారితే మానసిక, శారీరక ఇబ్బందులు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రూ.500లోపు ఖర్చుతో.. కరోనా కాలంలో ఓటీటీ (ఓవర్ ద టాప్) హవా విపరీతంగా పెరిగిపోయింది. మొన్నటివరకూ సినిమా థియేటర్లు సైతం మూసివేయడంతో వినోద ప్రియుల చూపు ఓటీటీలపై పడింది. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్స్టార్, ఆహా, జీ5, సోనీ లివ్, వూట్ వంటి ఓటీటీ చానల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిపై యువత, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు ఇలా అన్ని వర్గాల దృష్టి పడింది. ముఖ్యంగా యువత అత్యధికంగా వీటిని వినియోగిస్తున్నారు. ఏడాదికి కేవలం రూ.500లోపు మాత్రమే సబ్స్రిప్షన్ చెల్లిస్తే ఐదుగురు నుంచి పదిమంది వరకూ వారి సెల్ఫోన్లలో లాగిన్ అయ్యి వీక్షించే అవకాశం ఉండటంతో వీటి వినియోగం బాగా పెరిగింది. ‘వెబ్సిరీస్’ మాయాజాలం సరికొత్త సినిమాలతోపాటు హాలీవుడ్ సినిమాలకు తీసిపోని విధంగా రూపొందుతున్న వెబ్సిరీస్పై యువత అమితాసక్తి చూపుతోంది. కొన్ని సిరీస్ల కోసం ప్రత్యేకంగా ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. నేరం, మాఫియా, ఆర్థిక నేరాలు, రాజకీయ నేపథ్యాల సిరీస్లు ఎక్కువగా వీరిని ఆకట్టుకుంటున్నాయి. ఒక్కో సిరీస్లో పది నుంచి పదిహేను ఎపిసోడ్లు ఉండటం, రెండు, మూడు ఎపిసోడ్లను ఒకేసారి విడుదల చేస్తూ ఉండటంతో వీక్షకులు రెట్టింపు అవుతున్నారు. ఓ మాయాజాలంలా ఓటీటీల విస్తృతి పెరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యసనంలా మారుతోంది సెల్ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచాన్నే చుట్టిరావచ్చు. సెల్ఫోన్ ఆన్లైన్ వినియోగం అనర్థాలకు దారితీస్తోంది. యువత, విద్యార్థులు వెబ్సిరీస్లకు బానిసలవుతున్నారు. వ్యసనంలా మారిపోవటం ఆందోళన కలిగిస్తోంది. అత్యధిక సమయం నేర సంబంధిత సిరీస్లు చూడటంతో ఏకాగ్రత కోల్పోవటం, ప్రతికూల ఉద్వేగాలకు లోనుకావటం, కోపం, ఆందోళనలు, అసహనం వంటి మానసిక సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. గంటల తరబడి సెల్ఫోన్లు చూడటంతో శారీరక సమస్యలు తప్పవు. తల్లిదండ్రులు గుర్తించి మొదట్లోనే పిల్లలు వాటికి బానిసలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. –అక్కింశెట్టి రాంబాబు, సైకాలజిస్ట్, తణుకు కంటి సమస్యలు మనిషికి వెలుగు కన్ను. కంటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఏకధాటిగా సెల్ఫోన్, టీవీ, ల్యాప్టాప్ వంటివి చూస్తూ ఉంటే దాని ప్రభావం కంటిపై పడుతుంది. పిల్లలు, పెద్దల్లో ప్రధానంగా డ్రై ఐ అనే సమస్య ఏర్పడుతుంది. మయోఫియా అనే సమస్యకూ దారితీసే అవకాశం ఉంది. మైనస్ కళ్లజోడు వేయించుకోవాల్సిన ఇబ్బంది ఏర్పడుతుంది. అల్ట్రావయోలెట్ కిరణాల కారణంగా కంటి రెటీనా దెబ్బతిని మెల్లగా కంటికి సంబంధించిన తీవ్ర సమస్యలు బాధిస్తాయి. కంటికి రెప్పలా.. మన కంటిని మనమే కాపాడుకోవాలి. –డాక్టర్ ఏఎస్ రామ్, కంటివైద్య నిపుణులు, ఏలూరు -
వాలంటీర్ల ఫోన్లను స్వాధీనం చేసుకోవడమేంటి?
సాక్షి, విశాఖ: వాలంటీర్ల మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవాలన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు మండిపడ్డారు. ప్రతిరోజు ఏదో ఒక న్యాయ విరుద్ధమైన ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రభుత్వ యంత్రాగాన్ని పని చేయనీయకుండా అడ్డు తగులుతున్నారని ధ్వజమెత్తారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని 2 లక్షల 60 వేల మంది వలంటీర్ల ఫోన్లను స్వాధీనం చేసుకోవాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్ ఆదేశాలు జారీ చేయటాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టు వారి ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి ఉత్తర్వులను జారీ చేయకుండా ఎన్నికల కమిషనర్ను నియంత్రించాలని ఆయన కోరారు. కమిషనర్ ఇచ్చిన న్యాయ విరుద్ధమైన ఉత్తర్వులపై ప్రభుత్వం ప్రతిసారీ కోర్టులను ఆశ్రయించడం ద్వారా కోర్టు సమయం కూడా వృధా అవుతుందని పేర్కొన్నారు. వాలంటీర్ల ఫోన్లను స్వాధీనం చేసుకుంటే ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలకు విఘాతం కలుగుతుందని, దాని వల్ల రాష్ట్రంలోని పేదలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే ప్రమాదముందని వెల్లడించారు. ఎన్నికల కమిషనర్ ఒక అధికారిలా కాకుండా రాజకీయ తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు కుప్పం ప్రజలు తగిన బుద్ధి చెప్పినా ఇంకా తీరు మార్చుకోలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇకనైనా నీచ రాజకీయాలు మానకుంటే కుప్పంలో పట్టిన గతే రానున్న ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా పడుతుందని జోస్యం చెప్పారు. -
277 ఫోన్లు: వారి ముఖాల్లో చిరునవ్వులు
సాక్షి, చిత్తూరు : పోగొట్టుకున్న, దొంగిలించబడ్డ మొబైల్ ఫోన్లను కనుక్కోవటమే కాకుండా తిరిగి వాటిని యజమానులకు అందించి చిత్తూరు పోలీసులు వారి ముఖాల్లో చిరునవ్వులు నింపారు. చిత్తూరు పోలీస్ టెక్నికల్ అనాలిసిస్ వింగ్ దాదాపు 277 ఫోన్లను ట్రేస్ చేసి పట్టుకుంది. దాదాపు 40 లక్షల రూపాయలు విలువ చేసే ఆ ఫోన్లను సోమవారం యజమానులకు ఇచ్చేసింది. దీనిపై సెల్ఫోన్ల యజమానులు హర్షం వ్యక్తం చేశారు. చిత్తూరు పోలీసుల కృషిని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ తమ ట్విటర్ ఖాతా వేదికగా ఈ వివరాలను వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేసింది. A thankful phone owner commends the work done by the police team in retrieving his mobile phone which his father bought for his studies during the pandemic.@NTVJustIn @htTweets @TimesNow @TheHansIndiaWeb @aajtak @PTI_News @newsmint18 @NewsX @MirrorNow @IndiaNews24x7 @BTVI @dna pic.twitter.com/UwtyqxZBa0 — Andhra Pradesh Police (@APPOLICE100) November 30, 2020 -
ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి.. నో సెల్ఫోన్
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటర్ల మొబైల్ ఫోన్లను ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి అనుమతించొద్దని ప్రిసైడింగ్ అధికారులను ఎన్నికల కమిషన్ ఆదేశించింది. పంచాయతీరాజ్ ఎన్నికల్లో కొందరు ఓటర్లు ఓటేసే క్రమంలో సెల్ఫోన్లో వీడియోలు తీసిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టాలని పేర్కొంది. అలాగే ఓటర్లు ఓటింగ్ కంపార్ట్మెంట్లోనే ఓటేసేలా చూడాలని, రహస్య ఓటింగ్కు భంగం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించింది. ఎన్నికల అధికారులు, సిబ్బంది గోప్యత పాటించాలని, సమాచారాన్ని బహిర్గతం చేయొద్దని స్పష్టం చేసింది. ఎన్నికల అధికారులు, సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా ఏదైనా సమాచారాన్ని బయటపెడితే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు గడువు సవరణ పోస్టల్ బ్యాలెట్ కోసం పోలింగ్ తేదీకి 4 రోజుల ముందు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనే సౌలభ్యాన్ని ఎస్ఈసీ కల్పించింది. గతంలో వారం ముం దు దరఖాస్తు చేసుకోవాలన్న నిబంధనను ఈ మేరకు సవరించింది. అదేవిధంగా డిప్యూటీ కమిషనర్లు, రిటర్నింగ్ అధికారులు పోలింగ్కు 4 రోజుల ముందు బదులు 3 రోజుల ముందు వరకు పోస్టల్ బ్యాలెట్ జారీచేసేలా సవరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 100 శాతం ఓటర్ స్లిప్పుల పంపిణీ... జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 100 శాతం ఓటర్ స్లిప్పులను పంపిణీ చేయాలని ఎస్ఈసీ ఆదేశించింది. గతంలో జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం 50 శాతం మించనందున ఈసారి పోలింగ్కు బుధవారంలోగా ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తి చేయాలని సూచించింది. స్లిప్పుల పంపిణీ సరిగ్గా జరిగిందా లేదా అనే విషయాన్ని అధికారులు ధ్రువీకరించుకోవాలని పేర్కొంది. ఈ విషయంలో అలసత్వంతో వ్యవహరించే వారిపై కఠినచర్యలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించింది. -
12 గంటల్లో 1.75 లక్షల ఫోన్ల అమ్మకం
దసరా పండుగ సీజన్ మరోసారి ఎలక్ట్రానిక్ గూడ్స్కు ఎంత డిమాండ్ ఉందో నిరూపించింది. అందులోనూ కొత్తరకం ఫోన్స్కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదని మరోసారి నిరూపితమయ్యింది. ఫ్లిప్కార్ట్ బిగ్బిలియన్ డేస్లో కొత్తగా లాంచ్ చేసిన ఎల్జీ జీ8ఎక్స్ డ్యుయల్ స్క్రీన్ రికార్డు సృష్టించింది. ఏకంగా 12 గంటల్లోనే 350 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. 1.75 లక్షల ఫోన్లు అమ్ముడుపోయాయి. ఈ సందర్భంగా ఎల్ జీ ఫోన్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా హెడ్ అద్వైత వైద్య మాట్లాడుతూ, లాక్డౌన్లో చాలా మంది ఇంట్లో నుంచి పని చేయాల్సి వచ్చిందని అప్పుడు వాళ్లు మల్టీ టాస్క్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. వారు ఒకేసారి ఆఫీస్ పని చేస్తూ వేరే యాప్స్ కూడా చూడాల్సి వచ్చిందని దానిలో నుంచే ఈ డ్యుయల్ స్క్రీన్ ఆలోచన వచ్చిందన్నారు. ఈ ఫోన్లో ఒక స్క్రీన్లో మీకు కావాల్సిన పని చూసుకుంటూనే మరో స్క్రీన్లో మీకు కావాల్సినవి తెరవొచ్చని పేర్కొన్నారు. చూడటానికి చాలా బాగుండటంతో చాలా మంది ఈ ఫోన్ వైపు మొగ్గు చూపారని వెల్లడించారు. కస్టమర్ డిమాండ్స్కు అనుగుణంగా ఇంకొన్ని ఫోన్లను అందుబాటులోకి తీసురానున్నామని పేర్కొన్నారు. ఇక అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా లాంటి ఆన్లైన్ రిటైల్ దిగ్గజాలు దసరా సందర్భంగా భారీ డిస్కౌంట్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి: అమెజాన్, ఫ్లిప్కార్ట్ వేదికలపై భారీగా అమ్మకాలు -
ఉచితంగా ల్యాప్టాప్, ఫోన్లు ఇవ్వాలి
న్యూఢిల్లీ: పేద విద్యార్థులకు ఆన్లైన్లో పాఠాలు నేర్చుకొనేందుకు ఎలక్ట్రానిక్ సాధనాలు, ఇంటర్నెట్ ప్యాకేజీ ఉచితంగా కల్పించాలని, అలా చేయకపోవడం వివక్షేనని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఎలక్ట్రానిక్ సాధనాలు, ఉపకరణాలు లేవనే పేరుతో ఒకే తరగతిలో విద్యార్థులను వేర్వేరుగా చూస్తే, అది పేద విద్యార్థుల్లో న్యూనతాభావాన్ని పెంచుతుందని, అది వారి హృదయాలను గాయపరుస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, అణగారిన వర్గాలు ఆన్లైన్ విద్యావకాశాలు పొందేలాగా చూడాల్సిన బాధ్యత పాఠశాల యాజమాన్యాల మీద ఉందని తెలిపింది. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు ఉచితంగా అందించాలని ఆదేశించింది. ‘జస్టిస్ ఫర్ ఆల్’ వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్ మన్మోహన్, జస్టిస్ సంజీవ్ నరూలాల ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. రాజ్యాంగంలోని సమానత్వ హక్కుని నిరాకరించడమేనని, విద్యాహక్కు చట్టానికి కూడా వ్యతిరేకమైనదని కోర్టు స్పష్టం చేసింది. పేద విద్యార్థులకు ఎలక్ట్రానిక్ ఉపకరణాలను అందించే ప్రక్రియను వేగవంతం చేయడానికి ఈ కమిటీ చర్యలు చేపట్టాలని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలను ఆదేశించింది. (చదవండి: మాస్క్ లేదని ఫైన్.. 10 లక్షల పరిహారం) -
మొబైల్ ఫోన్ల ఈఎమ్ఐ పేరిట భారీ మోసం
న్యూఢిల్లీ : మొబైల్ ఫోన్ల ఈఎమ్ఐ పేరిట 2500 మందిని మోసగించాడో వ్యక్తి. ఫేక్ వెబ్సైట్ల పేరిట మోసాలకు పాల్పడుతున్న అతడి గుట్టు రట్టయి చివరకు పోలీసులకు చిక్కాడు. ఈ సంఘటన న్యూఢిల్లీలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఘజియాబాద్కు చెందిన జితేంద్ర సింగ్ అనే వ్యక్తి ఫేక్ వెబ్సైట్ల ద్వారా తక్కువ మొత్తం ఈఎమ్ఐలకు ఖరీదైన మొబైల్ ఫోన్లు ఇస్తామని చెప్పి ప్రజల్ని మోసగించసాగాడు. పోలీసుల నిఘానుంచి తప్పించుకోవటానికి వీపీఏ ద్వారా పేమెంట్లు చేయమనే వాడు. గత సంవత్సరం డిసెంబర్లో జితేంద్ర చేతిలో మోసపోయిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. ( దారుణం: కస్తూర్భ టీచర్పై భర్త కత్తి దాడి ) తాజాగా అతడ్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విచారణలో 2500 మందిని ఇప్పటివరకు తాను మోసం చేసినట్లు చెప్పాడు. జితేంద్రతో పాటు మరో వ్యక్తి ఈ మోసాలలో భాగంగా ఉన్నాడని పోలీసులు తేల్చారు. గడిచిన రెండేళ్లలో వివిధ నకిలీ వెబ్సైట్ల పేరుతో వీరు మోసాలు చేసినట్లు గుర్తించారు. వీపీఏ ద్వారా 1,999నుంచి 7,999 రూపాయలు వరకు చిన్న చిన్న మొత్తాలను మాత్రమే తీసుకునే వారని విచారణలో వెల్లడైంది. ( రైనా బంధువులపై దాడి కేసు: ముఠా అరెస్ట్ ) -
రూ.70 లక్షల రెడ్ మీ ఫోన్లు గోవిందా!
గుంటూరు: చిత్తూరు జిల్లా నగరిలో మొబైల్ ఫోన్ల కంటైనర్ దొంగతనం మరువకముందే అలాంటి ఘటనే మరొకటి వెలుగు చూసింది. గుంటూరు-కోల్కత హైవే (ఎన్హెచ్-16)పై బుధవారం భారీ చోరీ జరిగింది. శ్రీసిటీ నుంచి కోల్కత వెళ్తున్న మొబైల్ ఫోన్ల లారీలో రూ.70 లక్షల విలువైన రెడ్ మీ ఫోన్లను దుండగులు అపహరించారు. తన లారీలో దొంగతనం జరిగిందని గుర్తించిన డ్రైవర్ మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. ఇదిలాఉండగా. తమిళనాడులోని శ్రీపెరంబూర్ నుంచి ముంబైకి వెళ్తున్న మొబైల్ ఫోన్ల లారీలో గత ఆగస్టు 26న దొంగతనం జరిగిన సంగతి తెలిసిందే. కంటైనర్ ఆంధ్రా బార్డర్ నగరి వద్దకు రాగానే లారీని అడ్డం పెట్టిన దుండగులు.. డ్రైవర్ను కొట్టి అందులోని 6 కోట్ల రూపాయల విలువైన మొబైల్ ఫోన్లను ఎత్తుకెళ్లారు. (చదవండి: సినీ ఫక్కీలో కంటైనర్ లూటీ) -
సినీ ఫక్కీలో కంటైనర్ లూటీ
-
6 కోట్ల విలువైన షావోమి మొబైల్ ఫోన్లను..
సాక్షి, చిత్తూరు : సినీ ఫక్కీలో మొబైల్ఫోన్ల లోడ్తో వెళుతున్న ఓ కంటైనర్ను అడ్డగించి అందులోని కోట్ల రూపాయలు విలువ చేసే ఫోన్లను ఎత్తుకుపోయారు దుండగులు. ఈ సంఘటన మంగళవారం రాత్రి చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిన్న రాత్రి మొబైల్ లోడ్ కంటైనర్ శ్రీ పెరంబూర్ నుండి ముంబైకి బయలు దేరింది. కంటైనర్ ఆంధ్రా బార్డర్ నగిరి వద్దకు రాగానే దానికి లారీని అడ్డం పెట్టారు దుండగులు. అనంతరం డ్రైవర్ను కొట్టి అందులోని 6 కోట్ల రూపాయల విలువైన మొబైల్ ఫోన్లను ఎత్తుకెళ్లారు. ( దాచి.. దోచుకుంటున్నారు...! ) ఆ తర్వాత లారీ పుత్తూరు చేరుకోగానే మొబైల్స్ను వేరే లారీలోకి మార్చుకుని దొంగతనానికి ఉపయోగించిన లారీనీ అక్కడే వదిలేశారు. దొంగతనం జరిగిన సమయంలో కంటైనర్లో దాదాపు 12 కోట్ల రూపాయల విలువ చేసే ఫోన్స్ ఉన్నట్లు సమాచారం. అందులో 16 బాక్స్లు ఉండగా 8 బాక్సుల్లోని 7500 మొబైల్ ఫోన్లను దుండగులు దోచుకెళ్లారు. కంటైనర్లోని మొబైల్ ఫోన్లు అన్నీ కూడా షావోమీ కంపెనీ చెందినవి. బాధితుడు నగరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తుపాకీ గురిపెట్టి తనను కొట్టి దుండగులు లూటీకి పాల్పడినట్టు బాధితుడు ఇక్బాల్ వెల్లడించాడు. -
అంతగా స్క్రీన్లకు అతుక్కుపోకండి!
సాక్షి, న్యూఢిల్లీ: లాక్డౌన్ సందర్భంగా దేశంలో ఎక్కువ మంది ప్రజలు టీవీలు కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్ స్క్రీన్లకు అతుక్కుపోతున్నారు. లాక్డౌన్ సందర్భంగానే కాకుండా అంతకుముందు కూడా స్క్రీన్లకు అతుక్కుపోయే అలవాటు పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ఉంది. అధిక సమయం స్క్రీన్లకు అతుక్కుపోవడం వల్ల కళ్లు లాగడం, తలనొప్పి లేవడం, ఒళ్లు లావెక్కడం, నిద్రరాక పోవడం, హింసాత్మక దోరణులు ప్రబలడం, పలు రకాల మానసిక రుగ్మతలకు గురవడం జరుగుతుందని మొదటి నుంచి వైద్యులు హెచ్చరిస్తూనే ఉన్నారు. మూడు నెలల వయస్సు నుంచి ప్రపంచంలో 40 శాతం పిల్లలు టెలివిజన్, డీవీడీలు, ఇతర వీడియోలు తరచుగా చూస్తున్నారని, అమెరికాలో వీరి సంఖ్య 90 శాతానికి చేరుకుందని సర్వేలు తెలియజేస్తున్నాయి. అమెరికాలో ఎనిమిదేళ్ల నుంచి 18 ఏళ్ల మధ్య వయస్కులైన పిల్లలు ప్రతి రోజు సరాసరి ఏడు గంటల 11 నిమిషాల సేపు పలు రకాల వినోద స్క్రీన్లకు అతుక్కుపోతున్నారు. బ్రిటన్లో పెద్ద వాళ్లు ప్రతి 12 నిమిషాలకోసారి తమ ఫోన్లను చెక్ చేస్తున్నారట. ముఖ్యంగా లాక్డౌన్ సందర్భంగా స్క్రీన్లకు దూరంగా ఉండేందుకు నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. వారానికోరోజు: టీవీ, లాప్టాప్, ట్యాబ్లెట్లు ఆఫ్ చేయండి. స్మార్ట్ ఫోన్లను పక్కకు పెట్టండి. ఇంట్లో గార్డెనింగ్ పనులు చేయండి లేదా కుటుంబ సభ్యుల కోసం వంట చేసి పెట్టండి. వాకింగ్, జాగింగ్ లేదా ప్రావీణ్యం ఇతర క్రీడల్లో పాల్గొనండి, క్యారమ్స్, ఇతర హాబీలతో బిజీగా ఉండండి. ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా స్మార్ట్ ఫోన్ను జేబులో పెట్టుకోరాదు. అలా పెట్టుకున్నట్లయితే డైనింగ్ టేబుల్పైనా, టాయ్లెట్లో, పడకమీద పోస్టింగ్ల కోసం తరచూ స్క్రీన్ను చూస్తుంటాం. స్క్రీన్లకు ఎక్కువసేపు చూడడం వల్ల మెదడులో డొపమైన్ అనే హార్మోన్ ఎక్కువ విడుదలవుతుంది. అది అలవాటును బానిసగా మారుస్తుంది. డొపమైన్ ఎక్కువ విడదలయితే నిద్రరాదు. స్క్రీన్లకు దూరంగా ఉండడం వల్ల బోర్ కొడుతుంది. అది చాలా మంచిది బోర్ కొట్టినప్పుడు మనం సాధించాల్సిన లక్ష్యాల గురించి, వాటì కి అనుసరించాల్సిన మార్గాల గురించి ఆలోచిస్తాం. ఆ దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. (కరోనా వేళ : సినిమా చూసొద్దాం మామా..) వారానికి కొన్ని రోజుల్లో కొంత సమయాన్ని కుటుంబ సభ్యుల కోసమే కేటాయించండి. ఆ సమయాల్లో స్క్రీన్లకు దూరంగా వారితోనే గడపండి. మొదట ఇబ్బందిగానే ఉంటుంది. ఆ తర్వాత అలవాటు అవుతుంది. ఆ తర్వాత అందులోనుంచి వచ్చే అనుభూతి ఆనందాన్ని ఇస్తుంది. ప్రొఫెషన్లో భాగంగా ఇంటి వద్ద స్క్రీన్ మీద పని చేయాల్సి వచ్చినప్పుడు గంటకోసారి లేవండి. పది నిమిషాలు అలా ఇల్లు చుట్టి రండి. టీ చేసుకొని తాగండి, ఇంటి ప్రహారాలోపల ఖాళీ స్థలంలో ఉంటే లేదంటే మేడ మీద అడ్డదిడ్డంగా వేగంగా పరుగెత్తండి. తెలిసిన వ్యాయామాలు చేయండి. వొళ్లు విరుచుకోండి. స్క్రీన్పై చేయాల్సిన పని పూర్తయ్యాక కాసేపు అటు, ఇటు నడిచి వేళకు భోజనం చేసి, నిద్రవేళకు పడక ఎక్కండి. వినోదం కోసం రోజుకు రెండు గంటలకు మించి స్క్రీన్లకు అతుక్కుపోతే అది మెదడు మీద ప్రభావాన్ని చూపుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకని ప్రతి ఒక్కరిని స్క్రీన్లకు అతుక్కుపోయే సమయాన్ని తగ్గించాలని వారు కోరుతున్నారు. -
13 వేల ఫోన్లకు ఒకే ఐఎమ్ఈఐ నెంబర్
మీరట్ : 13,500 మొబైల్ ఫోన్లు ఒకే ఐఎమ్ఈఐ నెంబర్(ఇంటర్ నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ) కలిగి ఉన్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని మీరట్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మీరట్కు చెందిన ఓ పోలీసు అధికారి సెల్ఫోన్ కొద్దిరోజుల క్రితం పాడైంది. అయన దాన్ని రిపేరు చేయించారు. అయినప్పటికి అది సరిగా పనిచేయలేదు. దీంతో దాన్ని సైబర్ క్రైం విభాగానికి చెందిన ఓ సిబ్బందికి అప్పగించి, సమస్య ఎంటో చూడమన్నారు. ఈ నేపథ్యంలో ఐఎమ్ఈఐల విషయం వెలుగులోకి వచ్చింది. ( కొడుకు కళ్లెదుటే.. భర్త దారుణం ) దీంతో సదరు మొబైల్ కంపెనీ, సర్వీస్ సెంటర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై మీరట్ ఎస్పీ అఖిలేష్ ఎన్. సింగ్ మాట్లాడుతూ.. ‘‘ దాదాపు 13,500 ఫోన్లు ఒకే ఐఎమ్ఈఐ నెంబర్పై పనిచేస్తున్నాయి. ఇది భద్రతకు సంబంధించిన సీరియస్ సమస్య. మొబైల్ కంపెనీ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. నేరస్తులు వారి స్వలాభానికి దాన్ని వాడుకునే అవకాశం ఉంది’’ అని అన్నారు. ( మేనకా గాంధీపై కేసు నమోదు ) -
ఇంట్లో వాళ్లు మొబైల్ బిల్ కట్టలేదు: యువీ
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ తాజాగా ఓ సరదా ఫొటోను షేర్ చేశాడు. పెద్దగా సెల్ఫోన్లు అందుబాటులో లేని సమయంలో.. తన సహచరులతో కలిసి పబ్లిక్ టెలీఫోన్లో ఇంటికి కాల్ చేసి మాట్లాడుతున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. సహచరులు వీవీఎస్ లక్ష్మణ్, వీరేందర్ సెహ్వాగ్, ఆశిష్ నెహ్రాతో ఉన్న ఆనాటి జ్ఞాపకాను గుర్తు చేశాడు. ఫోటోకు యువీ ఓ సరదా క్యాప్షన్ కూడా జత చేశాడు. ‘మ్యాచ్లో చెత్త ప్రదర్శన చేయడంతో ఇంట్లో వాళ్లు మా మొబైల్ బిల్స్ కట్టలేదు. దాంతో ఈ పరిస్థితి తలెత్తింది’అంటూ పేర్కొన్నాడు. సెల్ఫోన్లు లేని ఆ రోజులకు వెళ్దాం అంటూ రాసుకొచ్చాడు. (చదవండి: తప్పు నాదే మహా ప్రభో: యువీ) ఇక ఈ ఫొటో 2001లో టీమిండియా శ్రీలంక టూర్కు వెళ్లినప్పటిదిగా తెలుస్తోంది. న్యూజిలాండ్, శ్రీలంక, భారత్ మధ్య త్రైపాక్షిక వన్డే సిరీస్ జరిగింది. అనంతరం శ్రీలంకతో టీమిండియా రెండు టెస్టుల సిరీస్లో కూడా పాల్గొంది. రెండు సిరీస్లను సనత్ జయసూర్య సారథ్యంలోని ఆతిథ్య జట్టు గెలుచుకుంది. యువీ షేర్ చేసిన ఫొటోపై మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్.. ‘ఫ్రీ కాల్’అటూ కామెండ్ చేశాడు. ‘శ్రీలంక నుంచి భారత్కు కాలింగ్ కార్డు’అంటూ యువీ సమాధానం ఇచ్చాడు. (చదవండి: జడేజాను అందుకోవడం కష్టం: రోడ్స్) View this post on Instagram When your parents don’t pay your mobile phone bill after a bad performance 😆! #throwback to days without 📱😇 @rd.nehra @virendersehwag @vvslaxman281 A post shared by Yuvraj Singh (@yuvisofficial) on May 24, 2020 at 9:08am PDT -
మొబైల్ ఫోన్లతో వైరస్ ముప్పు
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్లతో కరోనా వైరస్ ముప్పు అధికంగా ఉంటుందని రాయపూర్కు చెందిన ఎయిమ్స్ వైద్యులు హెచ్చరించారు. కోవిడ్–19 సంక్షోభం నేపథ్యంలో ఆసుపత్రుల్లో మొబైల్స్ ఫోన్ల వాడకంపై నియంత్రణలు విధించాలని వారు సూచించారు. ఈ అంశంపై బీఎంజే గ్లోబల్ హెల్త్ జనరల్లో ఒక కథనం ప్రచురితమైంది. వైరస్ను వ్యాప్తి చేసే సాధనాల్లో మొబైల్ ఫోన్లు ముందుంటాయని, దీనివల్ల ఆరోగ్య సిబ్బందికి కరోనా సోకే అవకాశం ఉంటుందని ఎయిమ్స్ వైద్య బృందం హెచ్చరించింది. వైరస్ మనిషి శరీరంలోకి ప్రవేశించడానికి ముఖం, నోరు, కళ్లు, చేతులు అత్యంత కీలకం. ముఖానికి అత్యంత దగ్గరగా వచ్చే వస్తువు మొబైల్ ఫోనే కావడంతో వైరస్ విస్తరణలో అత్యంత ప్రమాదకరమని తెలిపింది. డబ్ల్యూహెచ్వో వంటి సంస్థలు మొబైల్ ఫోన్ల వాడకంపై ఎలాంటి నియంత్రణా చర్యలు చేపట్టకపోవడం ఆశ్చర్యం కలిగించిందని తెలిపింది. ఆస్పత్రుల్లో సిబ్బంది అంతా ఫోన్లను వినియోగిస్తున్నా, వారిలో 10 శాతం మంది కూడా వాటిని పరిశుభ్రంగా ఉంచడం లేదని వారి పరిశీలనలో తేలిందని అన్నారు. -
కరోనా: ఫోన్లతో అధిక ప్రమాదం
న్యూఢిల్లీ : మొబైల్ ఫోన్ల వాడకం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువని రాయ్పూర్కు చెందిన ఏఐఐఎమ్ఎస్ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మొబైల్ ఫోన్లు ముఖానికి, నోటి దగ్గరకి తరచుగా రావటం జరుగుతుందని, ఒకవేళ వాటికి వైరస్ అంటుకుని ఉన్నట్లయితే మనం చేతులను ఎంత శుభ్రం చేసుకున్నప్పటికి ఫలితం లేకుండా పోతుందని అంటున్నారు. బీఎమ్జే గ్లోబల్ హెల్త్ జర్నల్లో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ముఖ్యంగా ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వారు ప్రతీ 15నుంచి 2 గంటల లోపు మొబైల్ ఫోన్లను వాడుతున్నారని, తద్వారా ఆరోగ్య సిబ్బందికి కరోనా వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్ఓ, సీడీఎస్లు విడుదల చేసిన సేఫ్టీ గైడ్లైన్స్లో మొబైల్ ఫోన్ల వాడకంపై దృష్టి సారించలేదని తెలిపారు. మొబైల్ ఫోన్ల ద్వారా చేతుల శుభ్రత దెబ్బ తింటుందని, అవి హానికరమైన సూక్ష్మ జీవులకు నెలవులని వెల్లడించారు. ( కోవిడ్: మరో సరికొత్త ఆవిష్కరణ! ) ఆరోగ్య కేంద్రాలు, ఐసీయూలు, ఆపరేషన్ థియోటర్లలో ఫోన్లను ఉపయోగించటంపై నిబంధనలు విధించాలని అన్నారు. మొబైల్ ఫోన్లు, హెడ్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్లను ఒకరివి మరొకరు వాడటం మానేయాలని తెలిపారు. ఫోన్లు, కంప్యూటర్లు శుభ్రం చేసుకోవటానికి వీలుగా ఉండేలా చూసుకోవాలని, వీటి వాడకానికి ముందు తర్వాత చేతులను శానటైజర్తో శుభ్రం చేసుకోవాలని సలహా ఇచ్చారు. -
పేద విద్యార్థులకు ల్యాప్టాప్లు, ఫోన్లు
న్యూఢిల్లీ: లాక్డౌన్ సమయంలో పేద విద్యార్థులు ఇంటి నుంచే ఆన్లైన్లో చదువు కొనసాగించేందుకు వీలుగా ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లను ఉచితంగా అందివ్వాలంటూ దాఖలైన పిల్పై ఢిల్లీ హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులిచ్చింది. లాక్డౌన్ సమయంలో పిల్లలకు ఆన్లైన్లోనే తరగతులు నిర్వహించాలంటూ ఢిల్లీలోని 10 ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూళ్లు తీసుకున్న నిర్ణయ ప్రభావం సుమారు 50వేల మంది నిరుపేద విద్యార్థులపై పడిందనీ, వీరికి ల్యాప్టాప్లు, ఫోన్లు, హై స్పీడ్ ఇంటర్నెట్ సమకూర్చుకునే స్తోమత లేదని ‘జస్టిస్ ఫర్ ఆల్’అనే ఎన్జీవో పేర్కొంది. ఈ పిటిషన్ను విచారించిన ధర్మాసనం జూన్ 10వ తేదీలోగా స్పందించాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులిచ్చింది. -
ఆన్లైన్లో మళ్లీ టీవీలు, ఫ్రిజ్లు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం విధించిన లాక్డౌన్ను క్రమంగా ఎత్తివేసే ప్రక్రియలో భాగంగా ఈ–కామర్స్లో విక్రయాలకు కేంద్రం అనుమతించింది. దీంతో ఏప్రిల్ 20 నుంచి అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ వంటి ఈ–కామర్స్ పోర్టల్స్లో మళ్లీ మొబైల్ ఫోన్లు, టీవీలు, ఫ్రిజ్లు, ల్యాప్టాప్లు వంటి ఉత్పత్తుల అమ్మకం ప్రారంభం కానుంది. మే 3 దాకా పొడిగించిన లాక్డౌన్ మార్గదర్శకాలకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు ఈ మేరకు వివరణనిచ్చారు. టీవీలు, మొబైల్ ఫోన్స్ కూడా ఆన్లైన్ పోర్టల్స్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. అయితే, ఈ–కామర్స్ కంపెనీల డెలివరీ వ్యాన్లు.. రోడ్ల మీదికి రావాలంటే ప్రత్యేకంగా అనుమతులు తీసుకోవాలన్నారు. మార్చి 25న తొలిసారిగా లాక్డౌన్ ప్రకటించినప్పుడు ఈ–కామర్స్ సంస్థలు కేవలం ఔషధాలు, ఆహారపదార్థాలు వంటి నిత్యావసరాలే విక్రయించడానికి అనుమతినిచ్చారు. సరుకు రవాణా, డెలివరీ మొదలైన సర్వీసుల ద్వారా చాలా మంది ఉపాధి పొందుతుండటంతో వారి ప్రయోజనాలు కాపాడేందుకు కేంద్రం ఈ నిర్ణ యం తీసుకుంది. దీనికి సంబంధించి బుధవారం ప్రకటించిన మార్గదర్శకాలపై నెలకొన్న సందేహాలను ఇప్పుడు నివృత్తి చేసింది. -
మొబైల్ గేమ్స్ మోత
సాక్షి, అమరావతి: లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా సర్వం స్తంభించిపోయిన వేళ మొబైల్ గేమ్స్ మోత మోగిస్తున్నాయి. ఇళ్లకే పరిమితమైన ప్రజలు మొబైల్ ఫోన్లలో డిజిటల్ గేమ్స్ను ఆశ్రయిస్తున్నారు. కాలక్షేపం కోసం టీవీల్లో కార్యక్రమాల్ని చూస్తున్న వారు కొందరైతే, ఓవర్ ద టాప్ (ఓటీటీ) ప్లాట్ఫామ్స్లో సినిమాలతో పాటు మొబైల్ గేమింగ్ యాప్లను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. దీంతో రెండు వారాలుగా దేశంలో మొబైల్ గేమింగ్ యాప్లకు క్రేజ్ విపరీతంగా పెరుగుతోంది. భారీగా పెరుగుతున్న యూజర్లు ► మొబైల్ గేమింగ్ సెక్టార్లో ‘గేమ్స్ 2 విన్’ యాప్ యూజర్లు బాగా పెరుగుతున్నారు. లాక్ డౌన్కు ముందు ఆ యాప్ను వినియోగించే వారు రోజుకు సగటున 12 లక్షల మంది పెరుగుతుండేవారు. రెండు వారాలుగా యూజర్లు రోజుకు 15 లక్షల మంది పెరుగుతున్నారు. ► బాజీ గేమ్’ యాప్నకు మరింత క్రేజ్ పెరుగుతోంది. ఆ యాప్ అందిస్తున్న ‘పోకర్ బాజీ’ గేమ్పై యువతలో ఆసక్తి ఉండటంతో గడచిన రెండు వారాల్లో ఆ యాప్ యూజర్లు 15 శాతం పెరిగారు. ► ఇప్పటివరకు చిన్న పట్టణాల వరకే పరిమితమైన ‘విన్ జో’ గేమింగ్ యాప్నకు నిప్పుడు మెట్రో నగరాల్లోనూ డిమాండ్ పెరిగింది. రెండు వారాల క్రితంతో పోలిస్తే ఆ యాప్ యూజర్ల సంఖ్య 41శాతం పెరిగింది. ► క్రికెట్ గేమింగ్ యాప్లకు క్రేజ్ అమాంతంగా పెరిగింది. ‘హిట్ వికెట్’, ‘రియల్ క్రికెట్’ గేమింగ్ యాప్ల యూజర్లు 15శాతం పెరిగారు. ► ‘గేమర్ జీ’ మొబైల్ యాప్ యూజర్లు కూడా పెరుగుతున్నారు. ‘పేటిమ్ ఫస్ట్ గేమ్స్’ యాప్ యూజర్లు 200 శాతం పెరిగారు. ► లాక్డౌన్కు ముందు మొబైల్ గేమింగ్ యాప్ల పీక్ టైం రాత్రి 7నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఉండేది. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు పీక్ టైమ్గానే ఉంటోంది. ► ఇదే సందర్భంలో స్టేడియంలలో జరిగే క్రికెట్, కబడ్డీ, ఫుట్బాల్ మ్యాచ్లను అనుసరిస్తూ మొబైల్ ఫోన్ల ద్వారా ఆటలు ఆడించే లైవ్ గేమింగ్ యాప్లు మాత్రం క్రీడా పోటీలు నిలిచిపోవడంతో లాక్డౌన్లోకి వెళ్లిపోయాయి. 2021 నాటికి 31 కోట్ల యూజర్లు దేశంలో గేమింగ్ యాప్ల మార్కెట్ మరింతగా విస్తరిస్తుందని గూగుల్–కేపీఎంజీ నివేదిక వెల్లడించింది. 2021నాటికి దేశంలో మొబైల్ గేమింగ్ యాప్ల యూజర్లు 31 కోట్లకు చేరుతారని అంచనా వేసింది. 2019లో రూ.6,200 కోట్లుగా ఉన్న మొబైల్ గేమింగ్ యాప్ల టర్నోవర్ 2021 నాటికి రూ.7 వేల కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. -
ఫ్లిప్కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్.. ఆఫర్స్ ఇవే
సాక్షి, ముంబై: ఆన్లైన్లో షాపింగ్ చేయాలనుకునే వారికి ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ శుభవార్తను అందించింది. మార్చి 19వ తేదీ నుంచి బిగ్ షాపింగ్ డేస్ సేల్ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ఆ సేల్లో అందివ్వనున్న ఆఫర్ల వివరాలను ఫ్లిప్కార్ట్ తాజాగా వెల్లడించింది. మార్చి 19 నుంచి 22వ తేదీ వరకు ఫ్లిప్కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ 2020 సేల్ జరగనుంది. ఈ నాలుగు రోజుల సేల్లో స్మార్ట్ఫోన్లతో పాటు ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్, టీవీలు, అప్లయెన్సెస్, ఫ్యాషన్ ప్రొడక్ట్స్, హోమ్ అండ్ ఫర్నీచర్పై ఆఫర్లు ఉన్నాయి. ఈ సేల్కు సంబంధించి మార్చి 15 నుంచి 17 వరకు ప్రీ బుక్ సేల్ కూడా ప్రారంభించింది. అంటే కొన్ని ప్రొడక్ట్స్ను మార్చి 17 వరకు బుక్ చేసుకొని కొంత డబ్బులు చెల్లించాలి. సేల్ సమయంలో మిగతా పేమెంట్ చేసి ఆర్డర్ పూర్తి చేయాలి. ప్రీ బుక్ సేల్లో కొనేవారికి ప్రొడక్ట్స్ కొంత తక్కువ ధరకే లభిస్తాయి. మార్చి 18 రాత్రి 8 గంటల నుంచే ఈ సేల్ ప్రారంభం కానుంది. ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్పై 80% వరకు తగ్గింపు లభిస్తుంది. ఫ్యాషన్పై 50% నుంచి 80% వరకు, హోమ్ ఎసెన్షియల్, ఫర్నీచర్పై 80% వరకు, ఫ్లిప్కార్ట్ బ్రాండ్లపై 80% వరకు తగ్గింపు పొందొచ్చు. ఢమాల్ డీల్స్ పేరుతో మొబైల్స్, టీవీలు, ఎలక్ట్రానిక్స్పై ఎక్స్ట్రా డిస్కౌంట్, ప్రైస్ క్రాష్ డీల్లో దుస్తులు, బ్యూటీ ప్రొడక్ట్స్పై 15% తగ్గింపు పొందొచ్చు. దీంతో పాటు ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో బుక్ చేసిన వారికి 10% ఇన్స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. -
సెల్ఫోన్లపై జీఎస్టీ ఇకపై 18%
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్లపై జీఎస్టీని 18 శాతానికి పెంచాలని జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయించింది. ఇది ఏప్రిల్ 1నుంచి అమలవనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ఇక్కడ జరిగిన 39వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఈ మేరకు అంగీకరించింది. వినియోగదారుల సమస్యలను అధిగమించేలా జీఎస్టీ నెట్వర్క్ డిజైన్ మెరుగుపరచాలని ఈ సమావేశం ఇన్ఫోసిస్ను కోరింది. ► పూర్తి స్థాయిలో జీఎస్టీ నెట్వర్క్ సామర్ధ్యం పెంపు, నిపుణులైన సిబ్బంది నియామకం, సమస్యలకు సులభ పరిష్కారాలు చూపడం వంటివి ఈ ఏడాది జూలై కల్లా పూర్తి కావాలి. కొత్త వ్యవస్థ 2021 జనవరి నుంచి అమల్లోకి వస్తుంది. ► మొబైల్ ఫోన్లు, కొన్ని కీలక విడిభాగాలపై 12 శాతంగా ఉన్న జీఎస్టీని 18 శాతానికి పెంచింది. ► విమానాల మెయింటెనెన్స్ అండ్ రిపైర్, ఓవర్హౌల్(ఎంఆర్వో)సేవలపై జీఎస్టీ రేటును 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. దీనివల్ల ఎంఆర్వో సేవలు దేశంలోనే ప్రారంభం కావడానికి అవకాశం ఏర్పడుతుంది. ► ఈ–వాయిస్, క్యూఆర్ కోడ్ అక్టోబర్ ఒకటి నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. ► ఎగుమతిదారులకు ఈ–వాలెట్ స్కీం నమోదు గడువును 2021 మార్చి 31కి పొడిగించింది. ► ఆలస్యమైన జీఎస్టీ చెల్లింపులపై వడ్డీని జూలై 2017 నుంచి అమలయ్యేలా చట్టాన్ని సవరణకు నిర్ణయం. ► మార్చి 14 వరకు జీఎస్టీ రిజిస్ట్రేషన్లు రద్దయిన వారు కావాలనుకుంటే తిరిగి జూన్ 30వ తేదీ వరకు రిజిస్ట్రేషన్కు దరఖాస్తు చేసుకోవచ్చు. ► 2018–19 సంవత్సరంలో రూ.5 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యశ్రేణి వ్యాపార సంస్థలకు జీఎస్టీఆర్–9సీ దాఖలు చేయనవసరం లేకుండా మినహాయింపు నిచ్చింది. ► జీఎస్టీ కింద రిజిస్టరయిన ప్రతి వ్యక్తి తన వ్యాపారానికి అనుగుణంగా సరఫరాదారుల ప్రాథమిక సమాచారం తెలుసునేందుకు వీలుగా త్వరలో ‘నో యువర్ సప్లయర్’ పేరుతో కొత్త సౌకర్యం. -
ల్యాప్టాప్లు, ఫోన్లు దొరికాయి.. తీసుకెళ్లండి
సాక్షి, తిరుపతి అర్బన్: తిరుపతి రైల్వే స్టేషన్లోని 4వ ఫ్లాట్ఫాంలో 2015 సంవత్సరం నవంబర్ 18వ తేదీన 7 మొబైల్స్, మూడు ల్యాప్ట్యాప్లు (వివిధ రంగుల్లో, వివిధ కంఫెనీలకు చెందినవి) గుర్తు తెలియని వ్యక్తులు వదిలిపెట్టి వెళ్లారు. ఆమేరకు రైల్వే ప్రభుత్వ పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. కాగా విశాఖపట్నం మువ్వలపాలెం పోలీస్స్టేషన్ వారు శుక్రవారం వాటిలో ఓ ల్యాప్టాప్, ఓ మొబైల్ ఫోన్కు చెందిన బిల్లులతోపాటు తగిన ఆధారాలతో రావడంతో వారికి తిరుపతి రైల్వే ప్రభుత్వ సీఐ రామకృష్ణ నేతృత్వంలో అందజేశారు. మిగిలిన 6 మొబైల్స్, రెండు ల్యాప్టాప్లకు చెందిన బిల్లులు తగిన ఆధారాలతో సీఐ రామకృష్ణను సంప్రదిస్తే వారికి అందజేయడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. వివరాలకు 0877 2225347, 94406 27638 సంప్రదించాల్సి ఉందని తెలియజేశారు. (చదవండి: బెడిసికొట్టి జనసేన కిడ్నాప్ డ్రామా) -
సభలో సెల్ఫోన్ మోతలు.. స్పీకర్ ఆగ్రహం!
కోల్కత: పశ్చిమ బెంగాల్ శాసనసభ స్పీకర్ బీమాన్ బెనర్జీ ఎమ్మెల్యేల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సభలోకి సెల్ఫోన్లు తీసుకొచ్చిన సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీ తొలిరోజున ఈ ఘటన వెలుగుచూసింది. ఇటీవల స్వర్గస్థులైన రాజకీయ ప్రముఖులకు సభ శ్రద్ధాంజలి ఘటిస్తున్న సమయంలో కొంతమంది సభ్యుల మొబైల్ ఫోన్లు మోగాయి. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ మొబైల్ ఫోన్లతో హౌజ్లోకి వచ్చిన ఎమ్మెల్యేలు.. ఫోన్లు తెచ్చివ్వాలని స్పష్టం చేశారు. అయితే, ఒక సభ్యుడు మాత్రమే తన ఫోన్ తీసుకెళ్లి స్పీకర్కు అందించాడు. కాగా, ఈ వ్యవహరంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యుల్లో కొందరు సభా నియామాల్ని ఉల్లంఘిస్తున్నారని అన్నారు. ఫోన్ వెంట తెచ్చుకుంటే తమను తిప్పి పంపరు కదా అని భావించే నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటున్నారని అన్నారు. సభా మర్యాదల్ని కాపాడాలని హితవు పలికారు. కాగా, బడ్జెట్ సమావేశాల్లో భాగంగా తొలిరోజు.. సంతాప తీర్మానాలు చేశారు. ఇటీవల మరణించిన లోక్సభ మాజీ ఎంపీలు కృష్ణా బోస్, తపస్ పాల్, మాజీ ఎమ్మెల్యేలు ప్రజాగోపాల్ నియోగి, పరిమల్ ఘోష్, వినయ్ దత్తా, ఫుట్బాల్ ఆటగాడు అశోక్ ఛటర్జీకి నివాళులర్పించారు. -
అరె ! ఫోటో భలే ఉందే : కోహ్లి
గువాహటి : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై అభిమానాన్ని ఓ వ్యక్తి సరికొత్తగా చాటాడు. పాత మొబైల్ పోన్లతో కోహ్లి చిత్రపటాన్ని రూపొందించాడు. వివరాల్లోకి వెళితే.. రాహుల్ అనే అభిమాని.. పాత మొబైల్ ఫోన్లను ఉపయోగించి కోహ్లి చిత్రపటం రూపొందించాడు. ప్రస్తుతం కోహ్లి సేన శ్రీలంకతో జరగనున్న తొలి టీ20 కోసం గువాహటిలో ఉంది. దీంతో అక్కడి హోటల్లో కోహ్లిని కలిసిన రాహుల్.. ఆ చిత్రపటాన్ని చూపించాడు. తనకు వచ్చిన బహుమతిని చూసి ఆశ్చర్యపోయిన కోహ్లి ఆ చిత్రపటంపై సంతకం చేశారు. అలాగే రాహుల్కు థ్యాంక్స్ చెప్పారు. ‘ఇది చాలా అత్యుత్తమ క్రియేషన్.. వెల్ డన్.. బెస్ట్ విషెస్ ఫ్రమ్ కోహ్లి’ అని రాశారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో పోస్ట్ చేసింది. దీని గురించి రాహుల్ మాట్లాడుతూ.. ‘కొద్ది నెలల కోసం కోహ్లి గువాహటిలో మ్యాచ్ కోసం వస్తున్నాడని నాకు తెలిసింది. దీంతో పాత మొబైల్ ఫోన్లు, వైర్లతో చిత్రపటాన్ని రూపొందించాను. ఇందుకోసం నాకు మూడు రోజుల పూర్తి సమయం పట్టింది. కోహ్లిని కలిసినప్పుడు నా గుండె వేగంగా కొట్టుకుంది. ఆయన నాకు ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చార’ని తెలిపారు. Making art out of old phones. How is this for fan love! 👏👏 #TeamIndia @imVkohli pic.twitter.com/wnOAg3nYGD — BCCI (@BCCI) January 5, 2020 -
సెల్ఫోన్ వినియోగం తగ్గించండిలా...
ఇటీవల సెల్ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. సెల్ఫోన్ కారణంగా మెదడుపై, శరీరభాగాలపై చెడు ప్రభావం ఉంటుందన్న అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దాంతో ఇది నిత్యం చర్చల్లో ఉండే ఒక (డిబేటబుల్) అంశం. ఇక సెల్ఫోన్ కారణంగా మన దేహంపై పడే దుష్ప్రభావాలపై ఇంకా చాలా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఆ దుష్ప్రభావాలు ఎక్కువ అన్న విషయం స్పష్టంగా ఇంకా తేలకపోయినా... దీనినుంచి రేడియేషన్ వెలువడుతుందన్నది నిర్వివాదాంశం. ఇక రేడియేషన్తో మనకు ప్రమాదమే అన్న విషయం కూడా తెలిసిందే. అందుకే సెల్ఫోన్ వాడటం తప్పనిసరిగా చేటు చేస్తుందా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే... కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం అవసరమని వైద్యనిపుణులు, పరిశోధకులు/అధ్యయనవేత్తలు చెబుతుంటారు. ఆ జాగ్రత్తలివి... మీ మొబైల్ఫోన్ మీ శరీరానికి వీలైనంత దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. వీలైతే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడండి. సెల్ఫోన్ను షర్ట్ జేబులో గుండె దగ్గర, మన ప్రైవేట్ పార్ట్స్కు దగ్గరగా ఉండేలా ప్యాంట్ పాకెట్స్లో ఉంచడం అంత మంచిది కాదు. పౌచ్లో ఉంచడమే మంచిది. వీలైతే బ్రీఫ్కేసులు, హ్యాండ్బ్యాగులలో ఉంచడం ఇంకా బెటర్. సాధ్యమైనంత వరకు సెల్ఫోన్ను ఉపయోగించకుండానే పనులు జరిగేలా చూసుకోండి. మీటింగులు, కాన్ఫరెన్స్హాల్స్, దేవాలయాలు, ఆసుపత్రుల్లో తప్పనిసరిగా స్విచ్ ఆఫ్ చేయండి. పన్నెండేళ్ల లోపు పిల్లలను దీని నుంచి తప్పనిసరిగా దూరంగా ఉంచండి. అదనపు ఫీచర్లు ఉన్న సెల్ఫోన్లను పిల్లలు విపరీతంగా ఉపయోగిస్తుంటారు. పిల్లలకు గేమ్స్ ఆడటానికి కూడా సెల్ఫోన్ ఇవ్వకండి. ఎక్కువసేపు సంభాషణను కొనసాగించాల్సి వస్తే.. తప్పనిసరిగా ల్యాండ్లైన్నే ఉపయోగించాలి. ఇక సెల్ఫోన్లోనే ఎక్కువ సేపు కాల్ చేయాల్సి వస్తే తరచు ఫోన్ని కుడి చెవికి, ఎడమ చెవికి ఇలా మారుస్తుండాలి. సెల్ఫోన్ ఛార్జింగ్లో ఉన్నపుడు మాట్లాడడం ప్రమాదకరం. సెల్ఫోన్స్తో పోలిస్తే హెడ్ సెట్స్ నుంచి రేడియేషన్ వెలువడటం తక్కువ. అందుకే ఎక్కువసేపు మాట్లాడాల్సి వస్తే హెడ్ఫోన్స్ కూడా వాడటం మంచిదే. వినేటప్పుడు కంటే మాట్లాడేటప్పుడు మన ఫోన్ ఎక్కువ రేడియేషన్ను విడుదల చేస్తున్నట్టు గుర్తించారు. కాబట్టి ఎక్కువ వినడం, తక్కువ మాట్లాడడం కొంత మేలు. దేహంలోని మృదువైన కండరాలపై రేడియేషన్ ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. కాబట్టి హృదయానికి ఎదురుగానో, ఒళ్ళో పెట్టుకునో మాట్లాడడం వద్దు. ఏంటెన్నా క్యాప్స్, కీపాడ్ కవర్స్ వంటివి కనెక్షన్ నాణ్యతను తగ్గిస్తాయి. ఇది ఫోన్ను మరింత శక్తిమంతంగా పని చేసేందుకు ప్రేరేపిస్తుంది. తద్వారా రేడియేషన్ మరింత ఎక్కువగా విడుదలవుతుంది. సెల్ఫోన్ను ఉపయోగించండిలా... సెల్ఫోన్ను అత్యవసర వినియోగానికి మాత్రమే పరిమితం చేయండి. మాట్లాడటం కంటే వాట్సాప్, మెసేజెస్ రూపంలోనే వీలైనంతవరకు ఎక్కువ సమాచారం పంపండి. సెల్ఫోన్ నెంబరును బాగా సన్నిహితులకు మాత్రమే ఇవ్వండి. ఇలా చేయడం ద్వారా అనవసరమైన కాల్స్ను చాలావరకు తగ్గించుకోవచ్చు. పొద్దున్న లేవడానికి అలారంతో మొదలుపెట్టి రిమైండర్లు, ఆటలు, పాటలు, కాలిక్యులేటర్... ఇలా ప్రతిదానికీ సెల్ఫోన్ మీదే అతిగా ఆధారపడిపోవడం అడిక్షన్కు దారితీస్తుంది. కాబట్టి ఫోన్ను కేవలం సంభాషణలకు మాత్రమే పరిమితం చేయండి. ఎక్కువగా ఫోన్ వాడే అవసరం ఉన్నవాళ్ళు ఇంట్లో ల్యాండ్లైన్ కనెక్షన్ తీసుకోవడం మేలు. కనీసం ఇంట్లో ఉన్నపుడైనా సెల్ఫోన్ వినియోగాన్ని తగ్గించవచ్చు. డ్రైవింగ్ చేస్తూ ఇయర్ఫోన్స్తోగాని మరే రకంగానూ సెల్ఫోన్ మాట్లాడకూడదని వ్యక్తిగతంగా దృఢమైన నిర్ణయం తీసుకోండి. అది ప్రాణానికి ప్రమాదం. అది చట్టరీత్యా నేరం కూడా. కాబట్టి వీలైనంత తక్కువగా మాట్లాడటం అన్నది మీ సెల్ఫోన్ వినియోగాన్ని పరిమితం చేస్తుంది. ఈ సూచనలు పాటించడం అన్నది మీ ఆరోగ్యమూ ఇటు మెడికల్గానూ, అటు సామాజికంగానూ చాలాకాలం బాగుండేలా చేస్తుంది. -
కాలేజ్ల్లో మొబైల్స్పై నిషేధం విధించలేదు
లక్నో : యూనివర్సిటీలు, కాలేజ్ల్లో మొబైల్స్ ఫోన్ల వాడకంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించిందనే వార్తలు గత వారం రోజులుగా ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తేలింది. తాము విద్యాసంస్థల్లో మొబైల్స్ వాడకంపై ఎటువంటి నిషేధం విధించలేదని యూపీ ఉన్నత విద్యాశాఖ తెలిపింది. మొబైల్స్ వాడకంపై నిషేధం విధించినట్టు వచ్చిన వార్తలో ఏ మాత్రం నిజం లేదని ఆ శాఖ డైరక్టర్ వందన శర్మ స్పష్టం చేశారు. తాము అలాంటి సర్క్యులర్ జారీ చేయలేదని వెల్లడించారు. ఈ వార్తలను యూపీ డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ కూడా ఖండించారు. కాగా, యూపీ ప్రభుత్వం కాలేజ్లు, యూనివర్సిటీల పరిసరాల్లో మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం విధిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ప్రముఖ మీడియా సంస్థలు, మీడియా ఏజెన్సీలు కూడా దీనిపై కథనాలు ప్రచురించాయి. అంతేకాకుండా సోషల్ మీడియలో ఈ అంశం విస్తృతంగా ప్రచారం జరిగింది. సంచలన నిర్ణయాలకు కేరాఫ్గా నిలిచే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిజంగానే విద్యాసంస్థలో మొబైల్స్ ఫోన్ల వాడకంపై నిషేధం విధించారని అంతా భావించారు. అయితే తాజాగా అందులో ఏ మాత్రం నిజం లేదని.. తప్పుడు వార్త అని తేలింది. -
ఇకపై కాలేజీల్లో మొబైల్స్పై నిషేధం
లక్నో : ఇటీవలి కాలంలో చాలా మంది విద్యార్థులు మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారుతన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మొబైల్ ఫోన్ల వాడకంపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని కాలేజ్లు, యూనివర్సిటీల్లో మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం విధిస్తున్నట్టు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ గురువారం సర్క్యులర్ జారీచేసింది. క్లాస్లు జరుతున్న సమయంలో చాలా మంది విద్యార్థులు మొబైల్ ఫోన్లపై దృష్టి పెట్టి.. అధ్యాపకులు చెప్పే విషయాలను పట్టించుకోకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నిబంధనల ప్రకారం విద్యార్థులు ఇకపై యూనివర్సిటీ, కాలేజ్ల్లో పరిసరాల్లో మొబైల్స్ వాడేందుకు అవకాశం ఉండదు. మరీ ముఖ్యంగా ఈ నిబంధన బోధన సిబ్బందికి కూడా వర్తించనున్నట్టు ఉన్నత విద్యాశాఖ పేర్కొంది. విద్యార్థులు, అధ్యాపకులు తమ విలువైన సమయాన్ని ఎక్కువగా మొబైల్ ఫోన్ల వాడకానికి కేటాయిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించడమే తమ లక్ష్యమని పేర్కొంది. గతంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ముఖ్యమైన సమావేశాలకు అధికారులు, మంత్రులు మొబైల్ ఫోన్లు తీసుకురావడంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. -
చైనాలో తయారీకి శాంసంగ్ గుడ్బై
సియోల్: పెరుగుతున్న వ్యయాలు, ఆర్థిక మందగమనం, తీవ్రమైన పోటీ తదితర అంశాల కారణంగా చైనా నుంచి దిగ్గజ కంపెనీలు ఒక్కొక్కటిగా వైదొలుగుతున్నాయి. తాజాగా శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కూడా చైనాలో తమ మొబైల్ ఫోన్స్ తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దేశీయంగా పోటీ తీవ్రంగా పెరిగిపోతుండటమే ఇందుకు కారణంగా పేర్కొంది. గతేడాదే ఒక ఫ్యాక్టరీలో కార్యకలాపాలు నిలిపివేసిన శాంసంగ్ ఇటీవల జూన్లో మరో ప్లాంటులో ఉత్పత్తి ఆపివేసింది. ప్రస్తుతం హువైజూలోని చివరి ప్లాంటును కూడా మూసివేస్తున్నట్లు వెల్లడించింది. ఇటీవలే బీజింగ్లోని స్మార్ట్ఫోన్స్ ప్లాంటును మూసివేసిన మరో పోటీ సంస్థ సోనీ.. థాయ్ల్యాండ్లో మాత్రమే తయారీ కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో శాంసంగ్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. అటు చైనాలో తయారీ నిలిపివేస్తున్న శాంసంగ్.. ఇటు భారత్, వియత్నాం దేశాల్లో తమ ప్లాంట్ల సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోవడంపై దృష్టి పెడుతోంది. దీంతో ఈ దేశాల మార్కెట్లు శాంసంగ్కు మరింత కీలకంగా మారుతున్నాయి. 1 శాతానికి పడిపోయిన వాటా.. చైనాలో దేశీ కంపెనీలైన హువావే టెక్నాలజీస్, షావోమీ సంస్థల నుంచి శాంసంగ్కు గట్టి పోటీ ఎదురవుతోంది. చౌక ఫోన్లు కావాలనుకునే చైనీయులు.. దేశీ స్మార్ట్ఫోన్లను, కాస్త ఖరీదైనవి కోరుకునే వారు యాపిల్ లేదా హువావే వంటి సంస్థల మొబైల్స్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో 2013లో చైనాలో దాదాపు 15 శాతంగా నమోదైన శాంసంగ్ మార్కెట్ వాటా ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 1 శాతానికి పడిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇక చైనా మార్కెట్లో శాంసంగ్ పుంజుకునే అవకాశాలు కూడా కనిపించడం లేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, చైనాలో తయారీ నిలిపివేసినప్పటికీ.. మొబైల్స్ అమ్మకాలు య«థాప్రకారం కొనసాగుతాయని శాంసంగ్ పేర్కొంది. ఉత్పత్తికి సంబంధించిన యంత్రాలు, పరికరాలను అంతర్జాతీయంగా ఇతర సైట్లకు తరలిస్తున్నట్లు వివరించింది. కంపెనీ అధికారికంగా వెల్లడించనప్పటికీ, 2017 నాటి గణాంకాల ప్రకారం.. చైనాలో శాంసంగ్ ఉద్యోగులు సుమారు 6,000 మంది ఉండగా, 6.3 కోట్ల యూనిట్లు ఉత్పత్తి చేసింది. ఆ ఏడాది అంతర్జాతీయంగా శాంసంగ్ 39.4 కోట్ల హ్యాండ్సెట్స్ను తయారు చేసింది. -
వామ్మో ఈ ప్రిన్సిపల్ యమ డేంజర్
-
మొబైల్ఫోన్, ల్యాండ్లైన్ సేవలు రీస్టార్ట్!
శ్రీనగర్: ఆర్టికల్ 370 రద్దు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూకశ్మీర్, లదాఖ్ విభజన నేపథ్యంలో జమ్మూకశ్మీర్లో భారీగా భద్రతా బలగాలను మోహరించి.. నిషేధాజ్ఞలను అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో, ముఖ్యంగా కశ్మీర్ లోయలో 144 సెక్షన్ అమల్లో ఉంచి.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, భారీ నిరసనలు జరగకుండా ముందజాగ్రత్త చర్యల్లో భాగంగా పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. కేంద్రం నిర్ణయాల నేపథ్యంలో భద్రతా దళాల నీడలో ఉన్న కశ్మీర్ లోయలో జనజీవనం పలు ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా మొబైల్ ఫోన్, ల్యాండ్లైన్ సేవలు నిలిపేయడం, ఇంటర్నెట్ సేవలను సస్పెండ్ చేయడంతో బయటి ప్రపంచానికి కశ్మీర్తో దాదాపుగా సంబంధాలు తెగిపోయాయి. దీంతో లోయలోని తమ వారి యోగక్షేమాలు తెలియక బయట ఉన్న కశ్మీరీలు ఆందోళన చెందుతుండగా.. బయట ఏం జరుగుతుందో తెలియ లోయ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ విభజనపై కశ్మీర్లో పెద్దగా నిరసనలు.. అలజడి చెలరేగకపోవడంతో కేంద్ర ప్రభుత్వం క్రమంగా ఆంక్షలు ఎత్తివేస్తోంది. శనివారం సాయంత్రం కల్లా జమ్మూకశ్మీర్లో మొబైల్ ఫోన్ వాయిస్ కాల్ సేవలు, లాండ్లైన్ సేవలు అందుబాటులోకి రానున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అదేవిధంగా 144 సెక్షన్ అమలులోనూ సడలింపులు ఇచ్చే అవకాశముంది. ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణకు మాత్రం కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. -
హలో..వద్దు మాస్టారు
సాక్షి, గుంటూరు(త్తెనపల్లి) : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సెల్ఫోన్లను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాఠశాలల్లో సెల్ఫోన్ల వినియోగానికి ఎట్టకేలకు తాళం పడింది. ఉపాధ్యాయులు విధి నిర్వహణ ఉన్న సమయంలో వీటిని వాడకూడదన్న నిబంధన ఎప్పటి నుంచో ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. తాజాగా తరగతి గదుల్లో వీటి వినియోగాన్ని నిషేధిస్తూ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలల్లో సెల్ఫోన్ వినియోగాన్ని నిషేధిస్తూ గతంలోనే విద్యా శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ, అవి ఎక్కడా అమలు కాలేదు. దీనిపై ఎప్పటికప్పుడు విద్యాశాఖ ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నా ఫలితం ఉండట్లేదు. ప్రభుత్వ విద్యావ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్న కారణంగా సెల్ఫోన్ వాడకాన్ని నిషేధించాలని ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు. ప్రధానోపాధ్యాయులదే బాధ్యత జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఇప్పుడు సెల్ఫోన్ల నిషేధం పక్కాగా అమలు చేయాల్సి ఉంది. పాఠశాలలోని ప్రధానోపాధ్యాయులకు వీటి విషయంలో బాధ్యత పెరిగింది. ఉపాధ్యాయులు సెల్ఫోన్లు తీసుకుని స్టాఫ్ రూములో భద్రపరుచుకోవాల్సి ఉంటుంది. బడి సమయం ముగిసిన తర్వాత వాటిని తిరిగి తీసుకోవాలి. ప్రధానోపాధ్యాయులు సైతం వీటిని వినియోగించడానికి వీలు లేదు. తరగతి గదిలో ఫోన్ వాడితే ఉపాధ్యాయులతోపాటు ఆ పాఠశాల హెచ్ఎంలను కూడా బాధ్యులను చేస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని విద్యా శాఖ ఉన్నతాధికారుల నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇకపై సెల్ఫోన్లను పాఠశాలలకు తీసుకెళ్లకూడదని కొందరు ఉపాధ్యాయులు భావిస్తున్నారు. ఈ నిబంధనలు తప్పనిసరి.. తరగతి గదిలో ఉన్నంత సేపు సెల్ఫోన్ మాట్లాడరాదని, వాట్సాప్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలను తరగతి గదుల్లో ఉపయోగించరాదని ఆదేశాల్లో పేర్కొన్నారు. వాటిని వినియోగిండం వలన ఉపాధ్యాయుల ఏకాగ్రత దెబ్బతినడమే కాకుండా విద్యార్థుల దృష్టి మరలే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇటువంటి అలవాట్లు ఉపాధ్యాయుల నుంచి విద్యార్థులకు సంక్రమిస్తాయని భావిస్తున్నారు. ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్లిన వెంటనే సెల్ఫోన్లు సైలెంట్ మోడ్లో పెట్టి స్టాఫ్ రూములో భద్రపరుచుకోవాలి, లేకంటే ప్రధానోపాధ్యాయుడి నియంత్రణలో ఉంచాల్సి ఉంటుంది. భోజన విరామ సమయంలో మాత్రమే ఉపాధ్యాయులు సెల్ఫోన్లు వాడుకోవాల్సి ఉంది. డ్రెస్ కోడ్.. వీటితో పాటు పాఠశాలల్లో గురువులు డ్రెస్ కోడ్ నిబంధనలు పాటించేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రధానంగా ఉపాధ్యాయులు, ప్రధానో పాధ్యాయులు విధిగా డ్రెస్ కోడ్ పాటించాల్సి ఉంది. 8/4 జేబులతో కూడిన ఫ్యాంట్లు కానీ, టీషర్టులు కానీ వేసుకోకూడదు. ఉపాధ్యాయినులు విధిగా చీరలు ధరించాలి. వ్యాయామ ఉపాధ్యాయులకు మాత్రం వీటిలో మినహాయింపు ఇచ్చారు. ఈ నిబంధనలను ఉపాధ్యాయులు తప్పనిసరిగా పాటించాలని, వీటిని అతిక్రమిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ బడుల్లో సెల్ఫోన్ వినియోగంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే నిబంధనలు అమలు చేస్తున్నా.. ఉపాధ్యాయులు పట్టించుకోకపోవడంతో కఠిన నిర్ణయం తీసుకుంది. పాఠాలు పక్కనబెట్టి కొందరు టీచర్లు తరగతి గదుల్లోనే సెల్ఫోన్ కబుర్లతో కాలం వెళ్ల్లదీస్తున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్లు కావడంతో ఇంటర్నెట్లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో విద్యార్థుల చదువుపై ప్రభావం చూపుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
స్కూల్ టైమ్లో ఫోన్ వాడితే కఠిన చర్యలు
సాక్షి, ఒంగోలు టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు పాఠాలు చెప్పకుండా ఫోన్ను వినియోగిస్తున్నారా.. జాగ్రత్త! ఇక నుంచి ప్రభుత్వం అలాంటి వారిపై ప్రత్యేక దృష్టి సారించనుంది. తరగతి గదుల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా సెల్ ఫోన్లలో మాట్లాడుకుంటున్నా, మెసేజ్లు పంపించుకుంటున్నా, వీడియోలు చూస్తున్నా, నెట్లో చిట్చాట్లు చేసుకుంటున్నా ఇక నుండి వాటన్నింటికీ ఉపాధ్యాయులు స్వస్తి పలకాల్సిందే. తరగతి గదుల్లో పాఠాలు చెప్పే సమయంలో ఉపాధ్యాయులు సెల్ఫోన్లను వినియోగించరాదంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆదేశించారు. మంత్రి ప్రకటనతో ఉపాధ్యాయులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అంతేగాకుండా ఉపాధ్యాయులకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేసుకునేందుకు వీలుగా ఉపాధ్యాయ సంఘాలన్నీ సెల్ఫోన్లో గ్రూపులు పెట్టుకున్నాయి. ఆ గ్రూపుల ద్వారా వారికి సంబంధించిన సమాచారం చేరవేసేందుకు గ్రూపులో మెసేజ్లు, వీడియోలు పోస్టు చేసుకోవడం ఆనవాయితీగా మారింది. మంత్రి ప్రకటనతో ఆయా గ్రూపులకు చెందిన అడ్మిన్లు సమాచారం చేరవేస్తున్నారు. పాఠశాలల్లో తరగతులు చెప్పే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మెసేజ్లు, వీడియోలు పోస్టు చేయరాదని, ఒకవేళ పోస్టు చేస్తే అడ్మిన్తో పాటు పోస్టు చేసిన వారు కూడా ఇబ్బందులు పడే ప్రమాదం ఉందని ఉపాధ్యాయులు ఒకరికొకరు హెచ్చరించుకుంటున్నారు. స్వాగతిస్తున్న విద్యారంగ నిపుణులు పాఠశాలల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా సెల్ఫోన్లు వాడుతున్న వారిపై ప్రభుత్వం కొంతమేర కఠినంగా వ్యవహరించడాన్ని విద్యారంగ నిపుణులు స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా సెల్ఫోన్లు వాడరాదంటూ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటనను స్వాగతిస్తూ ఉపాధ్యాయులు కూడా సమయాన్ని తరగతి గదుల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకే కేటాయించుకోవాలని సూచిస్తున్నారు. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యను బలోపేతం చేయడంలో భాగంగా తరగతి గదుల్లో సెల్ఫోన్ల వినియోగానికి చెక్ పెట్టడం మంచి పరిణామమని విద్యారంగ నిపుణులతో పాటు అనేకమంది ఉపాధ్యాయులు హర్షిస్తున్నారు. -
సెల్ఫోన్తో కనిపిస్తే ఫిర్యాదు చేయొచ్చు
‘‘పాఠశాల సమయంలో టీచర్లు సెల్ఫోన్ వినియోగించడం వల్ల ఆ ప్రభావం పిల్లల చదువుపై పడుతోంది. ఎట్టి పరిస్థితుల్లో తరగతి గదిలో టీచరు చేతిలో సెల్ఫోన్ కనిపించకూడదు. ఇందుకు ప్రధానోపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలి. తరగతి గదిలో టీచరు సెల్ఫోన్తో కనిపిస్తే ఆయనతో పాటు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయున్ని కూడా బాధ్యుడిని చేస్తా. ఇద్దరిపైనా చర్యలుంటాయి. ఎవరైనా టీచరు తరగతి గదిలో సెల్ఫోన్ పట్టుకున్నట్లు కనిపిస్తే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా నేరుగా నాకు ఫిర్యాదు చేయవచ్చు.’’ – శామ్యూల్, జిల్లా విద్యా శాఖ అధికారి నాణ్యమైన విద్యకు అత్యంత ప్రాధాన్యత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తాం. ఈ విషయంలో కలెక్టర్ సత్యనారాయణ కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చాలా స్కూళ్లలో ఐదో తరగతి పిల్లలకు కూడా రాయడం, చదవడం రాకపోవడం బాధాకరం. ప్రైమరీ విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు పెంపొందించేలా చర్యలు తీసుకుంటా. ఇక ఉన్నత పాఠశాలల్లో ఆయా తరగతులకు సంబంధించిన పాఠ్యాంశాల్లో పిల్లలకు కనీస పరిజ్ఞానం ఉండేలా చూడాల్సిన బాధ్యత టీచర్లపై ఉంది. సాక్షి, అనంతపురం ఎడ్యుకేషన్ : ‘అనంత’ కరువుకు చిరునామా.. వ్యవసాయమే జీవనాధారం. పంటలు సరిగా పండవు. ఆర్థిక ఇబ్బందులున్న కుటుంబాలే అధికం. అందుకే అందరూ తమ పిల్లలను ప్రభుత్వ బడులకే పంపుతారు. నూతన సర్కార్ కూడా విద్యారంగాన్ని పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ పాఠశాలల్లోని చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించేందుకు సిద్ధమైంది. పాఠశాలల్లో మౌలిక వసతులకు ప్రాధాన్యమిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని 5.50 లక్షల మంది విద్యార్థుల భవిత, ఉపాధ్యాయుల పనితీరు, ఉపాధ్యాయ సంఘాల నేతల వ్యవహారం, డీఈఓ కార్యాలయ సిబ్బందిపై వస్తున్న ఆరోపణలు తదితరాలపై ఇటీవలే జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన కాగిత శామ్యూల్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. విద్యార్థుల సంక్షేమానికి, ప్రభుత్వ విద్య బలోపేతానికి తీసుకోనున్న చర్యలు ఆయన మాటల్లోనే.. విద్యార్థుల సంఖ్యను పెంచుతాం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడం కూడా ప్రాధాన్యతగా తీసు కుంటా. ఈ విద్యా సంవత్సరం ఇప్పటిదాకా అందిన సమాచారం మేరకు 13 వేల మందికిపైగా విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. మరింతమంది పిల్లలు ప్రభుత్వ స్కూళ్ల బాట పట్టేలా చర్యలు తీసుకుంటాం. షెడ్యూలు ప్రకారం ఫార్మేటివ్ పరీక్షలు ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం ప్రతి స్కూల్లోనూ ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షలు నిర్వహించాలి. టీచర్లు రిజిష్టర్లు పక్కాగా నిర్వహించాలి. టీచర్లు డైరీలు రాయాలి. లెసన్ ప్లాన్ తప్పకుండా రావాలి. ఎంఈఓలు, డిప్యుటీ డీఈఓలు తరచూ తనిఖీలు నిర్వహించి ఈ అంశాలన్నీ పరిశీలించాలి. అవినీతి రహిత పాలన డీఈఓ కార్యాలయంలో అవినీతికి తావులేకుండా పాలన సాగిస్తా. ప్రతి ఫైలుకూ ఒక రేటు ఫిక్స్ చేశారనే వార్తలు రావడం దారుణం. ఇప్పటిదాకా ఎలా జరిగిందో నాకు తెలీదు. ఇకపై ఈ విషయంలో చాలా సీరియస్గా ఉంటా. పెండింగ్ ఫైళ్ల విషయమై బాధితులెవరైనా నన్ను కలిసి నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. బయోమెట్రిక్ పక్కాగా అమలు పది రోజులు గడువు పెట్టుకున్నా. జిల్లాలో అన్ని కేడర్ల టీచర్లు 18 వేలమంది దాకా ఉన్నారు. వారంతా వందశాతం బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాల్సిందే. కుంటిసాకులు చెబితే ఒప్పుకోను. ఏవైనా సాంకేతికపరమైన ఇబ్బందులుంటే ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం. 1,700 డివైజ్లు కొత్తగా వచ్చాయి. అవసరమైన స్కూళ్లకు వాటిని అందజేస్తాం. అప్పటికీ అటెండెన్స్ శాతం పెరగకపోతే మాత్రం కఠినంగా వ్యవహరిస్తా. ‘నవ ప్రయాస్’కు నోటీసులు పెనుకొండ, రొద్దం, సోమందేపల్లి మండలాల్లోని పాఠశాలలకు మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తున్న ‘నవ ప్రయాస్’ ఏజెన్సీపై ప్రజల నుంచి ఫిర్యాదులు అందాయి. భోజనం సరిగా లేకపోవడంతో మూడు మండలాల్లోని స్కూళ్లలో 50 శాతం మంది విద్యార్థులు కూడా భోజనం తినడం లేదు. దీనిపై ఏజెన్సీకి నోటీసులిచ్చాం. నవ ప్రయాస్ సంస్థ సరఫరా చేస్తున్న భోజనం నాణ్యతపై ఆహారభద్రత అధికారులతో విచారణ చేయిస్తున్నాం. వారి నివేదిక రాగానే విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటాం. అందరూ సమానమే స్కూల్ పనివేళల్లో ప్రతి టీచరూ బడిలోనే ఉండాలి. ఈ విషయంలో సామాన్య టీచర్లయినా, ఉపాధ్యాయ సంఘాల నాయకులైనా ఒకటే. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే మాత్రం... ఎవరినీ ఉపేక్షించను. పనివేళల్లో టీచర్లు ఎవరూ కూడా నన్ను కలిసేందుకు కార్యాలయానికి రావొద్దు. వారంలో మూడు రోజులు సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు కార్యాలయంలో అందుబాటులో ఉంటా. ఏదైనా సమస్య ఉంటే ఆ సమయంలో నన్ను కలవవచ్చు. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న కొందరు టీచర్లపై పక్కా ఆధారాలతో ఫిర్యాదులు అందాయి. అలాంటి వారి భరతం పడతా. -
కులాంతర వివాహమా? మొబైల్ వాడుతున్నారా?
ఆధునిక టెక్నాలజీ పరుగులు తీస్తోంది. మోడరన్ యుగం మానవజీవితాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది. ఈ రోజుల్లో ఇంకా కులాల పట్టింపులేంటి? రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించింది. మనుషులంతా ఒక్కటే..అన్ని రంగాల్లోనూ మహిళలు పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. ఈ వాక్యాలు చదవడానికి, వినడానికి బావుంటాయి. కానీ వాస్తవ జీవితంలో మహిళలు, బాలికల పరిస్థితి పెనంమీదినుంచి పొయ్యిలో పడ్డ చందంగానే తయారవుతోంది. గుజరాత్ ఠాకూర్లు తీసుకున్న నిర్ణయం గురించి తెలుసుకుంటే ఈ అభిప్రాయం కలగక మానదు. బనస్కాంత జిల్లా దంతేవాడ తాలూకాలోని 12 గ్రామాల్లోని ఠాకూర్ సంఘం మహిళలకు సంబంధించి ఆంక్షలను అమలు చేయనుంది. ఈ మేరకు నాయకులు ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించారు. 12 గ్రామాల ప్రతినిధులు, యువకులతో సహా దాదాపు 800 మంది ఠాకూర్ నాయకులు జూలై 14 న సమావేశమయ్యారు. ఇక్కడ తొమ్మిది పాయింట్ల తీర్మానం ఆమోదించారు. దీనికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని ఆదేశించారు. తొమ్మిది పాయింట్లలో ఏ ఒక్క పాయింటును ఉల్లంఘించినా, అపరాధిగా పరిగణించి, శిక్షను విధించాలని తీర్మానించు కున్నారు. ముఖ్యంగా పెళ్లికాని అమ్మాయిలు మొబైల్ ఫోన్లు వాడకూడదు. దీనికి అమ్మాయిల తల్లిదండ్రులే బాధ్యత వహించి, శిక్ష అనుభవించాలని తీర్మానించింది. అలాగే కులాంతర వివాహాల్ని ఎట్టిపరిస్థితుల్లోని అంగీకరించమని తేల్చి పారేశారు. కులాంతర వివాహాలు చేసుకున్నఆయా కుటుంబాలకు జరిమానాలు విధించాలని నిర్ణయించి, ఎంత విధించాలనేది కూడా ఖాయం చేశారు. జిల్లాలో ఇటీవల అనేక కులాల వివాహాలు జరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఠాకూర్ అమ్మాయి ప్రేమలో పడి వేరే వర్గానికి చెందిన అబ్బాయిని వివాహం చేసుకుంటే, ఆ కుటుంబం రూ.1.5 లక్షల జరిమానా చెల్లించాలి. ఠాకూర్ కుర్రాడు వేరే కులానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకుంటే రూ.2 లక్షలు జరిమానా చెల్లించాల్సి వుంటుంది. కొసమెరుపు ఏమంటే..కట్నాలను తీసుకోకూడదని, పెళ్లితంతులో బాణాసంచా కాల్చకూడదని, అన్నదమ్ములు ఘర్షణ పడిన కుటుంబాన్నిబాయ్కాట్ చేయాలని, వివాహ తంతులో పెళ్లి కొడుకు గుర్రంపై ఊరేగే తతంగాన్ని కూడా నిషేధించడం. -
బాని‘సెల్’ కావొద్దు..
నేడు సెల్ఫోన్లు లేని జీవితాన్ని ఊహించుకోలేం. 20 ఏళ్ల క్రితం ధనికుల ఇళ్లలో ఒక ల్యాండ్ఫోన్ ఉండటమే గొప్పగా భావించేవారు. ప్రస్తుతం దినసరి కూలీ వద్ద కూడా ఒకటికి మించిన ఖరీదైన ఫోన్లు ఉండటం మామూలైంది. మూడేళ్ల పిల్లల నుంచి 30 ఏళ్ల యువత వరకు సెల్ఫోన్ ఆరోగ్యం, చదువు, మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆధునికీకరణ పేరుతో జరుగుతున్న ఈ సామాజిక నష్టాన్ని వారించేందుకు అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా ప్రయత్నించాలని మానసిక శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. కడప కల్చరల్/ ప్రొద్దుటూరు క్రైం: ప్రస్తుతం మూడేళ్ల చిన్నారి కూడా సెల్ఫోన్ చూస్తున్నారు. ఇంట్లో స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉండటం.. అందులోని రంగులు, బొమ్మలు వారిని ఆకర్షిస్తుండటంతో పిల్లలు సెల్ఫోన్ దొరికితే గంటల కొద్ది ఆడుకుంటున్నారు. పెద్ద పిల్లలు సెల్ఫోన్లతో మరింత ఎక్కువ సమయం గడుపుతున్నారు. మొండికేసి, అలకబూని పెద్దలను బ్లాక్మెయిల్ చేసి మరీ స్మార్ట్ ఫోన్ ఇప్పించుకుంటున్నారు. పెద్దలకు ఇచ్చిన మాటను తప్పి స్కూళ్లలో ఖాళీ సమయాల్లో కూడా సెల్ఫోన్తో గడుపుతున్నారు. కొందరు తరగతుల్లో వెనుకవైపు కూర్చొని సైలెన్స్లో పెట్టి మరీ ఫోన్తో వినోదిస్తున్నారు. యువత కూడా అంతే.. ఎప్పటికప్పుడు మారుతున్న లేటెస్ట్ రకాల ఫోన్లు లేకుంటే నేటి యువతకు గడిచేటట్టు లేదు. కనీసం రెండు స్మార్ట్ ఫోన్లు లేకుంటే బతకలేమన్నట్లుగా భావిస్తున్నారు. తెల్ల వారుజాము నుంచి అర్ధరాత్రి వరకు నిరంతరాయంగా సెల్ఫోన్ను వాడుతూనే ఉన్నారు. ఇందులో అశ్లీల వెబ్సైట్లనే ఎక్కువ చూస్తుంటారని ఓ సర్వేలో తేలింది. యువత కూడా దాన్ని అంతగా ఖండించేందుకు ప్రయత్నించడం లేదు. వారి కెరీర్కు సంబంధించి ఉపయోగకరంగా ఉంటుందని పెద్దలు స్మార్ట్ ఫోన్లు కొనిస్తే యువకుల్లో ఎక్కువ శాతం మంది ఫోర్న్ సైట్లలోనే గడుపుతుంటారని సమాచారం. దీంతో వారి ఆలోచన తీరులో మార్పు రావడం.. నైతిక, సామాజిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం.. తొమ్మిది నెలల చిన్నారి నుంచి 90 ఏళ్ల వృద్ధులైన మహిళల వరకు లైంగిక దాడులకు గురి కావడం స్మార్ట్ ఫోన్ల ప్రభావం 50 శాతానికి పైగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రాకముందు ఇలాంటి క్రైమ్ రేట్ ఐదు శాతానికి మించి ఉండేది కాదని, ›ప్రస్తుతం అది తారాస్థాయికి చేరిందని పోలీసుల రికార్డులు తెలియజేస్తున్నాయి. కుటుంబ పెద్దలైన తల్లిదండ్రులు సెల్ఫోన్ల వాడకం విషయంలో.. యువత కంటే 60 శాతం తక్కువే అయినా పురుషుల కంటే స్త్రీలే ఫోన్ను ఎక్కువగా వాడుతున్నట్లు తెలుస్తోంది. ఆరోగ్యంపై ప్రభావం సమయం వృథా, విలువల సంగతి అటుంచితే.. స్మార్ట్ ఫోన్లు ప్రజల ఆరోగ్యం, జీవితాలపై చూపుతున్న దుష్ప్రభావం చాపకింద నీరులా విస్తరిస్తోంది. ముఖ్యంగా యువత అర్ధరాత్రి వరకు చాటింగ్ చేస్తుండటంతో నిద్రకు దూరమై క్రమంగా అనారోగ్యం పాలవుతున్నారు. యువతకు చాటింగ్ ఓ వ్యసనంగా మారింది. ఫలితంగా చదువు కుంటుపడుతోంది. అసహనం పెరగడంతో ఆలోచన కోల్పోతున్నారు. లక్ష్య సాధన దిశగా విఫలమవుతున్నారు. పగలంతా రొటీన్ పనులతో అలిసిపోయినపుడు మనిషికి గంటసేపు నిద్ర కూడా మంచి ఉపశమనం ఇస్తుంది. నిజానికి మన శరీరానికి తగినంత విశ్రాంతి ఉన్నప్పుడే తిరిగి పని చేసేందుకు నూతన శక్తి లభిస్తుంది. మానసిక ఒత్తిళ్లు, శారీరక శ్రమ అధికంగా ఉండే విద్యార్థి దశలో బాలలకు తగిన నిద్ర ఎంతో ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. చదివింది గుర్తుండాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. రోజుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి. పరీక్షల సమయంలో మానసిక ప్రశాంతత ఎంతో అవసరం. కానీ నేటి యువత సామాజిక మాధ్యమాలతో పగలు, రాత్రి బిజీ అవుతూ నిద్రలేమితో బాధపడుతున్నారు. యువతతోపాటు మిగతా వయసుల వారు కూడా స్మార్ట్ఫోన్తో అర్ధరాత్రి వరకు గడుపుతున్నారు. సామాజిక మాధ్యమాలతో సమాజానికి మంచితోపాటు చెడు కూడా ఎక్కువగా జరుగుతోంది. సోషల్ మీడియా ద్వారా పిల్లలు మంచి కంటే చెడే ఎక్కువగా నేర్చుకుంటున్నారని సామాజిక శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేలాది మందిలో ఒంటరై.. స్మార్ట్ ఫోన్లలో ఎక్కువ యాప్స్తో గడుపుతుండటంతో యువత, బాలలకు చుట్టుపక్కల పరిస్థితులను గమనించే స్థితి పోతుంది. చుట్టూ తెలిసిన వారు, స్నేహితులున్నా వారిని కూడా పట్టించుకోకుం డా ఫోన్లో చాటింగ్ చేస్తూ పరిసరాలు మరిచిపోతున్నారు. వయసు, హోదా, స్థాయి భేదం లేకుండా ఇప్పుడు పదేళ్ల వయసు బాలల నుంచి చేతుల్లో స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. ఇం టర్నెట్ ప్యాకేజీల ధర భారీగా తగ్గడంతో.. రోజంతా అన్నీ లిమిటెడ్గా స్మార్ట్ ఫోన్తో గడుపుతున్నారు. ఫేస్బుక్లో లైకులు, కామెంట్లు ఫ్యాషన్గా మారాయి. నాలుగు గోడల మధ్య అర్ధరాత్రి వరకు సెల్ఫోన్తోనే గడుపుతూ నిద్రకు దూరమవుతున్నారు. రాత్రిళ్లు ఎంత ఆలస్యంగానైనా పడుకుంటారు గానీ ఉదయాన్నే నిద్రలేవడం మాత్రం తమ చేతుల్లో లేదన్నట్లు ప్రవర్తిస్తున్నారు. రోజంతా కష్టపడి ఉదయం త్వరగా నిద్రలేస్తే ఆ రోజంతా ఉల్లాసంగా ఉంటుం దని వైద్యులు చెబుతున్నా.. ఈ తరం మనుషులు ఆ ధ్యాస వదిలేసి నిరంతరం సెల్ఫోన్తోనే గడుపుతున్నారు. మన దేశంలో పదేళ్ల వయసు నుంచి పాతికేళ్లలోపు వారు రోజూ ఐదు గంటలపాటు స్మార్ట్ ఫోన్తో గడుపుతున్నట్లు ఆరోగ్య నిపుణుల అంచనా. సెల్ఫోన్ తక్కువగా వాడితే అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఇటీవల సెల్ఫీలు ఫ్యాషన్గా మారడంతో ప్రమాదకరమైన సన్నివేశాలను ఫోన్లలో బంధించాలన్న ఆవేశంతో ముఖ్యంగా యువకులు ప్రాణాలను కోల్పోతున్నారు. తల్లిదండ్రులు మేల్కోవాలి ► చిన్నారులు, విద్యార్థులు సెల్ గేమ్లలో మునిగిపోకుండా చూసుకోవడంలో తల్లిదండ్రుల పాత్రే కీలకమని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ► భారతదేశ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం ఆడే ఆటలు చాలా ఉన్నాయని, ఇలాంటి గేమ్ల జోలికి పోవద్దని సున్నితంగా చెప్పాలి. ► పాశ్చాత్య సంస్కృతిలో అందుబాటులో వచ్చిన వీడియో గేమ్ల వల్ల కలిగే అనర్థాలను వివరించాలి. ► సాధ్యమైనంత వరకు అత్యవసరమైతే తప్ప మొబైల్ డేటా వేయకపోవడమే మంచిది. ► పిల్లల అభిరుచులు, అలవాట్లను గౌరవిస్తూనే వారిపై ప్రత్యేక శ్రద్ధ కనబరచి అవుట్డోర్ క్రీడల్లో ప్రోత్సహించాలి. దగ్గరుండి పిల్లలను తీసుకొని వెళ్లాలి. ► రోజూ శారీరక వ్యాయామం చేయించడం, శారీరక అలసట ఉండే క్రీడల్లో ప్రోత్సహించాలని వైద్యులు చెబుతున్నారు. ప్రమాదకరం సెల్ఫోన్లలో గేమ్లు ఆడటం చాలా ప్రమాదకరం. జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, ఏకాగ్రత లోపించడం, కలుపుగోలుతనం లేకపోవడం వంటివి జరుగుతాయి. ముఖ్యంగా కంటి జబ్బులు వస్తాయి. పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అప్రమత్తంగా ఉండాలి. – డాక్టర్ నాగదస్తగిరిరెడ్డి, ప్రొద్దుటూరు సమయం వృథా మానవాభివృద్ధికి దోహదపడే సాంకేతిక పరిజ్ఞానం ఇదే స్థాయిలో వారి మనుగడకు ముప్పుగా పరిణమిస్తోంది. వయసు, లింగ భేదాలు తేడా లేకుండా అందరినీ అంధకారంలోకి నెట్టివేస్తోంది. ఆన్లైన్ గేమ్లతో ఎంతో విలువైన సమయానికి నిర్ధాక్షిణ్యంగా వృథా చేసుకుంటున్నారు. గంటల తరబడి సెల్ఫోన్ చూడటం వల్ల వెన్నెముక దెబ్బతినే అవకాశం ఉంది.