
ప్రీపెయిడ్ కస్టమర్లకు కాన్ఫరెన్స్ కాల్ సదుపాయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగ సంస్థ వొడాఫోన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం కాన్ఫరెన్స్ కాల్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఒక కాల్పై ఏకకాలంలో అయిదుగురితో మాట్లాడుకునేందుకు కాన్ఫరెన్స్ సౌకర్యం వీలు కల్పిస్తుంది. ఇప్పటికే ఉన్న, ఎంపిక చేసుకున్న ప్యాకేజీలకు అనుగుణంగా కాల్ చార్జీలు ఉంటాయని సర్కిల్ బిజినెస్ హెడ్ మన్దీప్ సింగ్ భాటియా తెలిపారు. సర్కిల్లో వొడాఫోన్కు 67 లక్షల మంది ప్రీపెయిడ్ వినియోగదార్లు ఉన్నారు.