
న్యూఢిల్లీ : చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీదారి షావోమి తన బెజెల్ లెస్ స్మార్ట్ఫోన్ ఎంఐ మిక్స్2ను భారత్లోకి విడుదల చేసింది. ఢిల్లీ వేదికగా దీన్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ధర రూ.35,999గా కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్ఫోన్ ఎక్స్క్లూజివ్గా ఫ్లిప్కార్ట్లోనే అందుబాటులో ఉంచుతోంది. ఎంఐ మిక్స్2 ఎక్స్క్లూజివ్గా ఫ్లిప్కార్ట్లోనే అందుబాటులో ఉంటుందనే విషయాన్ని వీడియా ట్వీట్ ద్వారా అంతకమున్నుపే చెప్పింది. గత నెలలో ఈ ఫోన్ను చైనాలో విడుదల చేసింది. కంపెనీ నుంచి విడుదలైన తొలి బెజెల్ లెస్ స్మార్ట్ఫోన్ ఇదే కావడం విశేషం.
ఎంఐ మిక్స్2 ఫీచర్లు...
5.99 అంగుళాల డిస్ప్లే
2.4 గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్
6జీబీ/8జీబీ ర్యామ్
64జీబీ/128జీబీ, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
12 ఎంపీ రియర్ కెమెరా
5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
ఫింగర్ ప్రింట్ సెన్సార్
3400 ఎంఏహెచ్ బ్యాటరీ
4జీ, వాయిస్ఓవర్ ఎల్టీఈ