సాక్షి, తిరుమల : తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. వైకుంఠం కాంప్లెక్స్లో 22 కంపార్ట్మెంట్స్ నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.
సోమవారం శ్రీవారిని 87,144 మంది భక్తులు దర్శించుకోగా, 29,118 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.94 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.