rush
-
మహా కుంభమేళాకు ఒక్కసారిగా పోటెత్తిన భక్తజనం
లక్నో: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం.. మహా కుంభమేళా మరో ఐదురోజుల్లో ముగియనుంది. చివరి వారాంతం కావడంతో ప్రయాగ్రాజ్కు భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. ఇవాళ 40వ రోజు ఉదయం రికార్డు స్థాయిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించిట్లు అధికారులు ప్రకటించారు.కుంభమేళా ముగుస్తుండడంతో ప్రయాగ్రాజ్(Prayagraj) సంగమంకు భక్తుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. మేలా ప్రాంతంలో హోటల్స్, ధర్మశాలలు కిక్కిరిసిపోయాయి. గురువారం సాయంత్రం గణాంకాల ప్రకారం.. మొత్తంగా 58 కోట్ల మంది పుణ్యస్నానాలు పూర్తి చేసుకున్నారని అధికారులు ప్రకటించారు. శని, ఆది వారాల్లో భక్తుల తాకిడి మరింత అధికంగా ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా.. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు.గత వారంగా కుంభమేళా భక్తుల సంఖ్య👇ఫిబ్రవరి 13, గురువారం: 80 లక్షల 46 వేలుఫిబ్రవరి 14 శుక్రవారం: 94 లక్షల 98 వేలుఫిబ్రవరి 15 శనివారం: కోటి 36 లక్షల మందిఆదివారం: కోటి 49 లక్షల మందిసోమవారం: కోటి 35 లక్షల మందిమంగళవారం : కోటి 26 లక్షల మందిబుధవారం: కోటి 19 లక్షల మందిగురువారం: కోటి 55 లక్షల మంది..ఇక.. కుంభమేళా(KumbhmelaI నిర్వహణపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. జనవరి చివరి వారంలో మౌనీ అమవాస్య సందర్బంగా జరిగిన తొక్కిసలాట 30 మంది మరణించిన సంగతి తెలిసిందే. దీంతో రాబోయే రద్దీని నియంత్రించేలా అధిక సిబ్బందిని నియమించారు. మరోవైపు.. పరిసరాలను, సంగమ నీటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఇప్పటికే వీఐపీ పాస్లను రద్దు చేసిన అధికారులు.. వాహనాల రాకపై కూడా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.రైల్వే శాఖ కీలక నిర్ణయంమహా కుంభమేళా(Maha Kumbh Mela) ముగుస్తుండడంతో భక్తులు అధిక సంఖ్యలో ప్రయాగ్రాజ్ వెళ్తున్నారు. రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పలు స్టేషన్లలో ప్రత్యేక హోర్డింగ్లను ఏర్పాటు చేయించింది. సురక్షిత ప్రయాణం కోసం తాము సూచించే మార్గదర్శకాలను పాటించాలని అందులో విజ్ఞప్తి చేస్తోంది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట చోటు చేసుకుని 18 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. -
కుంభమేళా ఎఫెక్ట్.. గంగా హారతి నిలిపివేత
ప్రయాగ్రాజ్: మహా కుంభమేళాకు భక్తుల రద్దీ రోజురోజుకు భారీగా పెరుగుతోంది. భక్తులు పోటెత్తుండుండటంతో ఫిబ్రవరి 5 వరకు కాశీలోని ఘాట్ల వద్ద గంగా హారతి కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.వారణాసిలోని దశాశ్వమేధ్, శీత్ల, అస్సీ మొదలైన ఘాట్లలో నిర్వహించే గంగా హారతి కారక్రమాన్ని ఆపేస్తున్నట్లు చెప్పారు.కుంభమేళా జరిగే ప్రాంతాల్లో ప్రజలు అవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని పోలీస్ కమిషనర్ మోహిత్ అగర్వాల్ విజ్ఞప్తి చేశారు.ఘాట్ల వద్ద ప్రమాదాలు జరగకుండా నివారించేందుకే గంగా హారతిని తాత్కాలికంగా ఆపేసినట్లు తెలిపారు.ప్రయాగ్రాజ్ కుంభమేళాకు వచ్చిన భక్తులు వారణాసికి పెద్ద సంఖ్యలో వస్తుండడంతో కొందరు ప్రయాణికులు వారణాసి, బనారస్ రైల్వే స్టేషన్లలో చిక్కుకుపోయినట్లు చెప్పారు.మౌని అమావాస్య నుంచి కాశీలో భక్తుల రద్దీ పెరిగిందని వారి సంఖ్య తగ్గేవరకు ఇతరులు ఎవరూ వారణాసికి రావద్దని విజ్ఞప్తి చేశారు.కాగా,మహా కుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో రద్దీ నియంత్రణకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసకుంది. ఈ క్రమంలోనే కుంభమేళా ప్రాంతంలోకి వాహనాల రాకపోకలను నిషేధించారు. దీంతోపాటు వీవీఐపీ, స్పెషల్ పాసులను రద్దు చేశారు.ఇప్పటివరకు 29.64 కోట్లమంది భక్తులు కుంభమేళాకు వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. -
రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. సంక్రాంతికి మరో 52 అదనపు రైళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండగ రద్దీ నేపథ్యంలో మరో 52 అదనపు రైళ్లు (special trains) నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి రైల్వేస్టేషన్ల నుంచి కాకినాడ, నర్సాపూర్, తిరుపతి, శ్రీకాకుళం ప్రాంతాలకు ఈ రైళ్లు నడపనున్నట్లు పేర్కొంది. ఈ నెల 6 నుంచి 18వ తేదీ వరకు సర్వీసులు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది. SCR to run Additional Sankranti Special Trains between various Destinations @drmvijayawada @drmgtl @drmgnt pic.twitter.com/fdoNVWdxSq— South Central Railway (@SCRailwayIndia) January 5, 2025 -
భక్తులతో కిటకిటలాడిన అలిపిరి (ఫొటోలు)
-
సాధా‘రణ’ బోగీ.. కిక్కిరిసి
రైళ్లలో జనరల్ బోగీలు చూడగానే కిక్కిరిసి ఉంటాయి. కూర్చోవడానికే కాదు.. నిల్చోవడానికి కూడా ప్లేస్ ఉండదు. లగేజీ బెర్తు...వాష్రూమ్, ఫుట్బోర్డు ఇలా ఎక్కడచూసినా ఫుల్ రష్ కనిపిస్తుంది. గంటల తరబడి నిలబడటానికి ఇబ్బంది పడేవారు.. సీట్లలో కూర్చున్న ప్రయాణికుల కాళ్ల వద్ద కూడా కూర్చొనేవారు ఉన్నారు. వాస్తవానికి ఒక్కో జనరల్ బోగీలో కూర్చొని 75 మంది దాకా ప్రయాణించొచ్చు. కానీ ఏ జనరల్ బోగీ చూసినా... అందులో ప్రయాణించే వారి సంఖ్య 150 నుంచి 200 మంది పైనే ఉంటుంది. సికింద్రాబాద్, కాచిగూడ, మహబూబ్నగర్, వరంగల్, కామారెడ్డి, కాజీపేట రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల సమస్యలను తెలుసుకొనేందుకు ‘సాక్షి ’క్షేత్రస్థాయిలో పర్యటించింది. ప్రయాణికుల కష్టాలు తెలుసుకుంది. సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్: హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే రైళ్లలో ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. ప్రయాణికుల రద్దీ, డిమాండ్కు అనుగుణంగా సాధారణ బోగీల సంఖ్య పెంచకపోవడంతో వందలాదిమంది రెండు, మూడు బోగీల్లోనే కిక్కిరిసి ప్రయాణం చేయాల్సి వస్తోంది. దానాపూర్ ఎక్స్ప్రెస్ మాత్రమే కాదు గోదావరి, పద్మావతి, నారాయణాద్రి, విశాఖ ఎక్స్ప్రెస్, తెలంగాణ ఎక్స్ప్రెస్ తదితర అన్ని రైళ్లలోనూ సాధారణ ప్రయాణికులు నిత్యం నరకం చవిచూస్తున్నారు. మహిళలు, పిల్లలు, సీనియర్ సిటిజన్లు ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడాల్సివస్తోంది. బిహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన లక్షలాదిమంది కార్మికులు హైదరాబాద్లో నిర్మాణరంగంలో పనిచేస్తున్నారు. ఈ కార్మికుల కుటుంబాలు, బంధువులు నిత్యం తమ స్వస్థలాలకు రాకపోకలు సాగిస్తారు. ఈ ప్రయాణికుల డిమాండ్ మేరకు రైళ్లు లేక, అందుబాటులో ఉన్న రైళ్లలోనే ప్రయాణం చేస్తున్నారు. తగ్గిన ప్యాసింజర్ రైళ్లు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్యాసింజర్ రైళ్లు బాగా తగ్గుముఖం పట్టాయి. కొన్నింటిని ఎక్స్ప్రెస్లుగా మార్చారు. పదేళ్లు దాటినా ఇంటర్సిటీ రైళ్ల సంఖ్య పెరగలేదు. దీంతో హైదరాబాద్ నుంచి దూరప్రాంతాలకు బయలుదేరే రైళ్లలోనే సాధారణ బోగీలను ఆశ్రయించాల్సి వస్తోంది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి ప్రతిరోజు రాకపోకలు సాగిస్తున్న సుమారు 250 రైళ్లలో సుమారు 100 వరకు ప్యాసింజర్ రైళ్లు ఉంటే 150 వరకు ఎక్స్ప్రెస్ రైళ్లు ఉన్నాయి. కానీ 2 లక్షల మందికి పైగా సాధారణ ప్రయాణికులే కావడం గమనార్హం. ప్రస్తుతం 24 బోగీలు ఉన్న ట్రైన్లలో 2 నుంచి 3 సాధారణ బోగీలు ఉండగా, 18 బోగీలు ఉన్న రైళ్లలో కేవలం 2 సాధారణ బోగీలే ఉన్నాయి. ప్రయాణికులు మాత్రం వాటి సామర్థ్యానికి రెట్టింపు సంఖ్యలో ఉన్నారు. ఎలాగోలా ప్రయాణం ముంబయి ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినల్ నుంచి సికింద్రాబాద్ మీదుగా భువనేశ్వర్కు వెళ్లే కోణార్క్ ఎక్స్ప్రెస్కు ముందు ఒకటి, వెనుక మరొకటి చొప్పున 2 జనరల్ బోగీలు మాత్రమే ఉన్నాయి. కానీ ఒక్కో బోగీలో కనీసం 250 మందికి పైగా ప్రయాణం చేస్తూ కనిపించారు. కొందరు బాత్రూమ్ వద్ద కిటకిటలాడుతుండగా, మరికొందరు పుట్బోర్డుపైన నిండిపోయారు. అడుగు తీసి అడుగు వేయడం కష్టంగా ఉంది. » కాజీపేట్, వరంగల్ స్టేషన్లలో సాధారణ బోగీల్లో ప్రయాణికుల దుస్థితిని పరిశీలించినప్పుడు, ఒక్క కోణార్క్ ఎక్స్ప్రెస్లోనే కాకుండా ఈస్ట్కోస్ట్, సంఘమిత్ర, గోరఖ్పూర్, సాయినగర్ షిర్డీ, కృష్ణా, మచిలీపట్నం, గౌతమి, గోదావరి, శాతవాహన, గోల్కొండ, ఇంటర్సిటీ, తదితర అన్ని రైళ్లలోను ఇంచుమించు ఇదే పరిస్థితి కనిపించింది. » కామారెడ్డి మీదుగా ఇటు సికింద్రాబాద్, అటు నాందేడ్, ముంబై, షిరిడీలకు వెళ్లే ఎక్స్ప్రెస్ రైళ్లలోనూ 2 సాధారణ బోగీలు మాత్రమే ఉన్నాయి. » సికింద్రాబాద్ నుంచి ముంబయికి వెళ్లే దేవగిరి ఎక్స్ప్రెస్ ట్రైన్లోని 2 సాధారణ బోగీలు సికింద్రాబాద్లోనే కిక్కిరిసిపోతాయి. కానీ మిర్జాపల్లి, అక్కన్నపేటస్టేషన్, కామారెడ్డి, సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో నాందేడ్, ముంబయికి వెళ్లే ప్రయాణికులు దేవగిరి ఎక్స్ప్రెస్లోని సాధారణ బోగీలనే ఆశ్రయిస్తారు. దీంతో ఈ ట్రైన్ కామారెడ్డికి వచ్చేసరికి కాలు మోపేందుకు కూడా చోటు ఉండదు. అయినా సరే ముంబయికి ఉపాధి కోసం వెళ్లే కూలీలు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్నారు. రైళ్ల రద్దుతో పెరుగుతున్న రద్దీ హైదరాబాద్ నుంచి తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే పుష్ఫుల్, ప్యాసింజర్ రైళ్లను తరచు రద్దు చేయడం వల్ల మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లపైన ఒత్తిడి పెరుగుతోంది. మెయింటెనెన్స్ పనుల పేరిట వారం, పదిరోజుల పాటు రద్దు చేస్తున్నారు. మరోవైపు ఏ ట్రైన్ ఎప్పుడు, ఎందుకు రద్దవుతుందో కూడా తెలియదు. దీంతో రోజువారీ ప్రయాణం చేసే చిరువ్యాపారులు, ఉద్యోగస్తులు, విద్యార్ధులు, వివిధ వర్గాలకు చెందినవారు ఎక్స్ప్రెస్ రైళ్లను ఆశ్రయిస్తున్నారు. రోలింగ్ కారిడార్ బ్లాక్ పనుల వల్ల సాధారణ రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేయడమే ఇందుకు కారణం. ‘ఒక నెలలో పుష్ఫుల్ రైళ్లు 20 రోజులునడిస్తే కనీసం 10 రోజులు రకరకాల కారణాలతో రద్దవుతున్నాయని తాండూరుకు చెందిన శ్రీనివాస్ తెలిపారు. మరోవైపు కోవిడ్ అనంతరం చాలా వరకు పుష్ఫుల్ రైళ్లను ఎక్స్ప్రెస్లుగా మార్చారు. సాధారణ బోగీల సంఖ్యను పెంచకుండా చార్జీలు మాత్రమే పెంచారు. » మహబూబ్నగర్, జడ్చర్ల, షాద్నగర్, తదితర స్టేషన్ల నుంచి సుమారు 1000 మందికి పైగా నగరానికి రాకపోకలు సాగిస్తారు. కానీ మహబూబ్నగర్ నుంచి కాచిగూడకు రాకపోకలు సాగించే డెమో ట్రైన్ తరచు రద్దవుతోంది. గంటల తరబడి ఆలస్యంగా నడుస్తోంది. దీంతో ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొంతకాలంగా 40 నిమిషాలకు పైగా ఆలస్యంగా నడుస్తుందని , దీంతో సకాలంలో హైదరాబాద్కు చేరుకోలేకపోతున్నామని పలువురు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. బోగీలు పెంచడమే పరిష్కారం అన్ని ప్రధాన రైళ్లలో సాధారణ బోగీలను 2 నుంచి 4కు పెంచనున్నట్టు ఇటీవల రైల్వేశాఖ స్పష్టం చేసింది. కానీ దక్షిణమధ్య రైల్వేలో ఇంకా ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నాలుగైదు రైళ్లలో మాత్రమే బోగీల సంఖ్యను పెంచినట్టు అధికారులు తెలిపారు. జోన్ పరిధిలో సుమారు 320 మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ రైళ్లన్నింటిలోనూ సాధారణ బోగీలు పెంచడమే తక్షణ పరిష్కారం. » అన్ని ప్రధాన రైళ్లలో మహిళల కోసం ఒక ప్రత్యేక బోగీని ఏర్పాటు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. కిక్కిరిసిన రైళ్లలో ప్రయాణం మహిళలకు ఎంతో కష్టం. ఈ దిశగా చర్యలు చేపట్సాల్సి ఉంది. డెమో రైలును రైట్టైమ్ ప్రకారం నడపాలి మహబూబ్నగర్ డెమో రైలులో ఏడాది నుంచి ప్రయాణం చేస్తున్న. కొద్ది రోజుల నుంచి డెమో ఆలస్యంగా నడుస్తోంది. దీంతో టైమ్ ఆఫీసుకు వెళ్లలేకపోతున్నా. లేట్గా వెళ్లిన రోజుల్లో కొన్నిసార్లు సగం జీతమే లెక్కలోకి తీసుకుంటున్నారు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు తప్పడం లేదు. రైల్వే ఉన్నతాధికారులు స్పందించి డెమో రైలును టైమ్ ప్రకారం నడపాలి. – ఎం.మహేశ్, ప్రైవేట్ ఉద్యోగి, మర్లు (మహబూబ్నగర్) నాలుగు రోజుల జీతం కట్ కొన్ని రోజుల నుంచి డెమో రైలు ఆలస్యంగా బయలుదేరి వెళుతుండ డంతో చాలా ఇబ్బందులు పడుతున్నా. నేను పనిచేసే సంస్థకు ఆలస్యంగా వెళుతుండటంతో నెలలో నాలుగు రోజులైన జీతం కట్ చేస్తున్నారు. డెమో రైలును రైట్టైమ్లో నడిపి మా సమస్యను పరిష్కరించాలి. – శ్రీనివాస్, ప్రైవేట్ ఉద్యోగి, హన్వాడ బోగీలు పెంచాలి ఇరవై ఏళ్లుగా కాంట్రాక్టు రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నాను. ఉదయం 9 గంటల వరకు ఉద్యోగంలో ఉండాలి. అందుకే ప్రతి రోజు ఉదయం 7 గంటలకు ఉండే పుష్ఫుల్ ట్రైన్కు వెళ్తాను. ఇది సుమారు 45 నిమిషాల పాటు ఆలస్యంగా వస్తుంది. దీని తర్వాత వచ్చే కాకతీయ ట్రైన్ వేళలు మార్చారు. బోగీల సంఖ్య కూడా తగ్గించారు. దీంతో ఎక్స్ప్రెస్ రైళ్లపైన ఆధారపడాల్సి వస్తోంది. సాధారణ రైళ్లలో బోగీలు పెంచితే చాలు. – సత్తిబాబు, కాంట్రాక్టు రైల్వే ఉద్యోగి, భువనగిరి -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..
తిరుపతి, సాక్షి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు మంగళవారం భారీగా భక్తులు తరలివస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 6 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామి వారిని దర్శించుకోవడానికి వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. ప్రత్యేక దర్శనానికి 3 గంటలు సమయం పడుతోంది.ఇక, మంగళవారం శ్రీవారిని 69,937మంది భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇక, స్వామివారికి 22,978 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక, శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.58 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు. -
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాదారణం
తిరుపతి, సాక్షి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు మంగళవారం భారీగా భక్తులు తరలివస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 12 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామి వారిని దర్శించుకోవడానికి వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. ప్రత్యేక దర్శనానికి 3 గంటలు సమయం పడుతోంది.ఇక, సోమవారం శ్రీవారిని 65,874మంది భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇక, స్వామివారికి 23,782 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక, శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.48 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు. -
యాదాద్రికి పోటెత్తిన భక్త జనం (ఫోటోలు)
-
అయోధ్యలో హోలీ వేడుకలు.. రంగుల్లో రామ్లల్లా!
రామ్లల్లా అయోధ్యలోని నూతన రామాలయంలో కొలువైన దరిమిలా తన మొదటి హోలీని జరుపుకుంటున్నాడు. రంగుల పండుగ సందర్భంగా బాలరాముని మనోహర విగ్రహం పూలతో అలంకృతమయ్యింది. బాలరాముని నుదిటిపై గులాల్ పూశారు. గులాబీ రంగు దుస్తులతో రామ్లల్లా విగ్రహం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. హోలీ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు రామ్లల్లాను దర్శించుకునేందుకు ఆలయంలో బారులతీరారు. రంగుల పండుగ హోలీ సందర్భంగా ఆలయ ట్రస్టు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ధార్మిక నగరి అయోధ్యలో ఎక్కడ చూసినా హోలీ సందడి కనిపిస్తోంది. అయోధ్యలో గత ఏకాదశి నుంచి హోలీ వేడుకలు ప్రారంభమయ్యాయి. రామనగరిలో కొలువైన దేవతలు, రుషులకు రంగులు పూశారు. రాముని పరమ భక్తుడైన హనుమంతునికి కూడా హోలీ రంగులను పూశారు. -
శబరిమలకు పోటెత్తిన భక్తులు.. భారీగా ట్రాఫిక్ జామ్
తిరువనంతపురం: శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచేగాక కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో భక్తులు వెళుతున్నారు. భక్తుల సంఖ్య అధికంగా పెరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఎరుమేలికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే వాహనాలు నిలిచిపోయాయి. నేడు తెల్లవారుజాము నాలుగు గంటల నుంచే భక్తులు అవస్థలు పడుతున్నారు. ఎరుమేలి నుంచి శబరిమలకు పాదయాత్రగా వెళుతున్నారు. రోజుకు లక్ష మందికిపైగా భక్తులు శబరిమలకు రావడం వల్ల తీవ్ర రద్దీ ఏర్పడిందని కేరళ దేవాదాయశాఖ మంత్రి కె.రాధాకృష్ణన్ తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో సమస్యలు తలెత్తడం సాధారణమేనని వ్యాఖ్యానించారు. శబరిమలలో సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని స్పష్టంచేశారు. ప్రత్యేక రైళ్లు.. ఇదిలా ఉండగా.. అయ్యప్ప భక్తుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. శబరిమలకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 51 ప్రత్యేక రైళ్లను కేటాయించింది. ప్రత్యేక రైళ్లు.. డిసెంబర్, జనవరి నెలల్లో వివిధ తేదీల్లో శబరిమలకు చేరుకుంటాయి. ఇదీ చదవండి: ఉగ్రదాడిలో రిటైర్డ్ పోలీసు అధికారి మృతి -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. శ్రీ వారి సర్వ దర్శనం కోసం ఐదు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 60,928 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామి వారికి తలనీలాలు సమర్పించిన భక్తులు సంఖ్య 22,358 కాగా, నిన్న స్వామి వారి హుండీ అదాయం 3.34 కోట్లు. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలపల ఆక్టోపస్ భవనం వరకు క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 24 గంటలు, ప్రత్యేక దర్శనానికి 5 గంటలు సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 70,686 కాగా, తలనీలాలు సమర్పించిన వారి సంఖ్య 34,563.. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.02 కోట్లు. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటలు సమయం, ప్రత్యేక దర్శనానికి 4 గంటలు పడుతోంది. నిన్న శ్రీవారిని 70,902 మంది భక్తులు దర్శించుకోగా, తలనీలాలు 22,858 మంది సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.24 కోట్లు. నేడు టీటీడీ పాలకమండలి సమావేశం జరగనుంది. టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన అన్నమయ్య భవన్లో పాలకమండలి సభ్యులు సమావేశం కానున్నారు. వైకుంఠ ఏకాదశిపై పాటు పలు కీలక అంశాలపై పాలకమండలిలో చర్చ జరగనుంది. చదవండి: వావ్..విశాఖ! -
తొందరొద్దు బాసూ.. ఆలోచించి కొను హౌసు!
సంతలో కూరగాయలు కొనేటప్పుడు పుచ్చులేమైనా ఉన్నాయా అని గమనిస్తాం. దుస్తులు షాపింగ్ చేసేముందు ట్రయల్ చేశాకే కొంటాం. బైక్, కారు కొనాలంటే మైలేజ్, వేగం, ధర వంటి అన్ని విషయాలు తెలుసుకున్నాకే తీసుకుంటాం. ..పదులు, వందలు, వేల రూపాయల ధర ఉండే వీటినే ఒకటి రెండు సార్లు ఆరా తీశాకే కొనుగోలు చేస్తాం. మరి, అలాంటిది జీవితంలో అత్యంత కీలకమైన గృహ కొనుగోలు విషయంలో తొందరెందుకు? ధరలు పెరుగుతున్నాయనో, ఆఫర్ మళ్లీ రాదనో, డిమాండ్ ఉందని తర్వాత బిల్డర్ రేటు ఎక్కువ చెబుతాడనో కంగారు పడొద్దు. సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం స్థిరాస్తి రంగం ఎన్నికల మూడ్లో ఉంది. దీంతో గత నాలుగు నెలలుగా ప్రాపర్టీ విక్రయాలు 40–50 శాతం మేర తగ్గాయి. డిసెంబర్ వరకూ మార్కెట్ స్తబ్దుగానే కొనసాగుతుంది. స్థిరమైన ప్రభుత్వం ఏర్పడితే జనవరి తర్వాత నగర స్థిరాస్తి రంగం పరుగులు పెట్టడం ఖాయం. లేకపోతే కొత్త ప్రభుత్వం ఏర్పడి స్థిరపడే 4–5 నెలల వరకు స్తబ్ధ్దత కొనసాగుతుంది. ఆ తర్వాత పుంజుకుంటుంది. నగరంలో గత 3–4 ఏళ్లుగా భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎన్నికల తర్వాత ప్రస్తుతం ఉన్న రేట్లతో పోలిస్తే కొనుగోలుదారులు జనవరి నుంచి 20–30 శాతం అధిక ధర చెల్లించాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: ప్రాపర్టీ కొంటున్నారా? ఈ జాగ్రత్తలు లేకుంటే రిస్కే! ఔటర్ నుంచి 2 కి.మీ.లోపు.. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) కనెక్టివిటీ కారణంగా నగరం నలువైపులా ప్రయాణం సులువైపోయింది. దీంతో కొనుగోలుదారులు ఓఆర్ఆర్ నుంచి 2 కి.మీ. పరిధిలో ప్రాపరీ్టలు కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పైగా చ.అ.కు రూ.5–6 వేల మధ్య దొరకుతున్నాయి. వసతుల విషయంలో బిల్డర్లు రాజీపడటం లేదు. వెస్ట్తో పోలిస్తే 30–35 శాతం తక్కువ ధరకు ప్రాపర్టీలు దొరుకుతాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్లో విల్లాలు దొరుకుతాయి. అప్రిసియేషన్ కూడా వేగంగా ఉంటుంది. నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్, గండిమైసమ్మ, దుండిగల్, అన్నోజిగూడ, కొంపల్లి, బహదూర్పల్లి వంటి ప్రాంతాలలో ప్రాపర్టీలకు డిమాండ్ ఉంది. పశ్చిమ హైదరాబాద్లో చ.అ. 8–10 వేల మధ్య ఉన్నాయి. వసతులు, పన్నులు కలిపితే 2 బీహెచ్కే ఫ్లాట్ ఎంతలేదన్నా రూ.1.20 నుంచి రూ.1.50 కోట్ల మధ్య చెబుతున్నారు. ఇక 3 బీహెచ్కే అయితే రూ.3 కోట్ల పైమాటే. పైగా వెస్ట్ హైదరాబాద్ జనావాసాలు, కార్యాలయాలతో కిక్కిరిసిపోయింది. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! మీరే ఉత్తమ కస్టమర్ ఎన్నికల వాతావరణం నెలకొనడంతో కొనుగోలుదారులు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఇలాంటి తరుణంలో బిల్డర్లు ధర విషయంలో రాజీ పడతారు. ఉత్తమ కస్టమర్ ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకునేందుకు ఎన్నికల సమయంలోనే కొనుగోలు నిర్ణయం తీసుకుంటారు. – నరేంద్ర కుమార్, ఎండీ, ప్రణీత్ గ్రూప్ ఇదీ చదవండి: రూ.వెయ్యి కోట్ల ఇల్లు.. వందేళ్ల చరిత్ర! -
అమ్మ బాబోయ్..మెట్రోలో ఇంత మందినా!
-
భక్తజన సంద్రంగా తిరుమల
-
వైరల్ వీడియో: రోడ్డుపై వెళ్తున్న పాదచారులపై దూసుకెళ్లిన లగ్జరీ కారు
-
శబరిమల ఆలయానికి పోటెత్తిన భక్తులు..
-
Yadagirigutta: యాదాద్రి ఆలయంలో భక్తుల కోలాహలం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల కోలాహలం నెలకొంది. ఆదివారం కావడంతో జంట నగరాలతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కొండ కింద కల్యాణ కట్ట, శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపం, లక్ష్మీ పుష్కరిణి ప్రాంతాలతో పాటు కొండపై ప్రసాదం కాంప్లెక్స్, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, ఆలయ పరిసరాల్లో భక్తులు కిటకిటలాడారు. స్వామి వారి ధర్మ దర్శనానికి రెండున్నర గంటలకు పైగా, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టిందని భక్తులు వెల్లడించారు. కొండ కింద రింగ్ రోడ్డులో బస్సుల కోసం భక్తులు వేచి చూడాల్సి వచ్చింది. బస్సులు సరైన సమయానికి రాకపోవడంతో పాటు నిండుగా రావడంతో పుష్కరిణి నుంచి కొండ పైకి వెళ్లాల్సిన భక్తులు ఇబ్బందులు పడ్డారు. మి వారిని 25,219 మంది భక్తులు దర్శించుకోగా, వివిధ పూజలతో రూ.39,44,918 నిత్య ఆదాయం వచ్చింది. ప్రధాన బుకింగ్తో రూ.2,78,250, వీఐపీ దర్శనాలతో రూ.4,65,000, ప్రసాద విక్రయంతో రూ.18,04,830, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.5,00,000, సువర్ణ పుష్పర్చనతో రూ.1,91,748, ఇతర పూజలతో రూ.2,87,340 ఆదాయం వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. (క్లిక్ చేయండి: వాడిన పూలే.. సువాసనలు వెదజల్లునే..) వాహనాద్రి! యాదాద్రి క్షేత్రానికి ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. తమ వాహనాలను యాదాద్రి కొండకు దిగువన పార్కింగ్ చేశారు. పార్కింగ్ స్థలం పూర్తిగా వాహనాలతో నిండిపోయింది. వీటిని చూస్తే.. ఏదైనా భారీ సభకు వచ్చిన వారి వాహనాల్లా అనిపించింది. – సాక్షి ఫొటోగ్రా ఫర్ యాదాద్రి భువనగిరి -
12 ఏళ్లలో 339 చోరీలు.. కూలీలే కానీ కాస్ట్లీ కార్లలో తిరుగుతూ..
కాస్త రద్దీగా బస్సు కనిపిస్తే చాలు.. ఆ రెండు కార్లకు సడన్ బ్రేకులు పడతాయి. అందులో ఉన్న వాళ్ల ముఖాలు వెలిగిపోతాయి. బస్సులో మహిళల వైపు రష్ కనిపిస్తే.. ఆ ఇద్దరు ఆడవాళ్లలో ఒకరు దిగి తమ చేతివాటం ప్రదర్శించుకొస్తారు. అదే పురుషుల వైపు రద్దీ ఉంటే.. ఆ ఇద్దరు మగవాళ్లలో ఒకరు దిగి తమ పని కానిచ్చేస్తారు. ఏ మాత్రం సందేహం రాకుండా బస్సు దిగిపోయి.. తమ తమ కార్లలో గాయబ్ అవుతారు. ఇలా 12 ఏళ్లుగా 339 చోరీలకు పాల్పడ్డ రెండు జంటలను.. గుజరాత్ సోమనాథ్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నిందితులు సంజయ్-గీత, నరేష్-రేఖలను కటకటాల వెనక్కి నెట్టారు. వాళ్ల నుంచి రెండు బ్రెజ్జా కార్లను, ఐఫోన్లను, లక్ష రూపాయల దాకా నగదు, నగలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కూలీలు ఇలా.. దాహోడ్ జిల్లాకు చెందిన ఈ రెండు జంటలు కూలీ పనులు చేసుకుని జీవిస్తున్నారు. అయితే.. తేలికగా డబ్బు సంపాదించడం కోసం చేతులు కలిపి ఇలా చోరీలకు దిగారు. ఆ చోరీల ద్వారా వచ్చిన డబ్బుతోనే ఆరేసి లక్షల రూపాయల విలువ చేసే ఈ రెండు కాస్ట్లీ కార్లను కొనుగోలు చేశారు కూడా. కార్లలోనే తిరుగుతూ పోలీసులకు ఏమాత్రం అనుమానం రాకుండా దర్జాగా దొంగతనాలకు పాల్పడుతూ వచ్చారు. కానీ, స్థానికులకు ఏమాత్రం అనుమానం రాకుండా అప్పుడప్పుడు కూలీ పనులకు వెళ్తూ వస్తున్నారు. అయితే.. ఎలా పట్టారంటే.. ఆగస్టు 21, 22 తేదీల్లో వెరవల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు చోరీ కేసులు నమోదు అయ్యాయి. ఈ రెండు కేసుల్లోనూ సోమనాథ్ మాంగ్రోల్ బస్ స్టేషన్ వద ఇద్దరు బాధితులు బస్సుల్లోనే.. నగదును పొగొట్టుకున్నారు. దీంతో సీసీ టీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు పోలీసులు. అందులో బ్రెజ్జా కారులో వచ్చిన ఇద్దరు మహిళలు.. లగేజీ లేకుండా రద్దీ బస్సులు ఎక్కడం, కాసేపటికే ఆ బస్సు దిగి తిరిగి కారులో వెళ్లిపోవడం పోలీసులకు అనుమానంగా అనిపించింది. దీంతో.. కారు నెంబర్ ఆధారంగా ట్రేస్ చేసి వెరవల్ దగ్గర వాళ్లను పట్టుకున్నారు. ఆపై భార్యలు ఇచ్చిన సమాచారంతో భర్తలనూ కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. గత 12 ఏళ్లుగా గుజరాత్లో వివిధ ప్రాంతాల్లో ఇలా రద్దీ బస్సుల్లో చోరీలకు పాల్పడినట్లు ఈ రెండు జంటలు ఒప్పుకున్నాయి. ఇదీ చదవండి: మిస్సింగ్ కాదు.. డబుల్ మర్డర్! -
బీచ్లో సందడి చేస్తున్న పర్యాటకులు (ఫోటోలు)
-
కొమురవెల్లిలో భక్తుల సందడి
కొమురవెల్లి(సిద్దిపేట): కోరిన కోర్కెలు తీర్చే కొమురవెల్లి మల్లన్నను భక్తులు దర్శించుకొని తరించారు. స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో ఆదివారం భారీగా తరలివచ్చారు. మల్లన్న నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. సమ్మక్క, సారక్క జాతరకు వెళ్లే భక్తులు స్వామి వారిని దర్శించుకొని మేడారం వెళ్తుండడంతో రద్దీ పెరిగింది. మల్లన్న దర్శనానికి రాష్ట్రం నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఒక్కపొద్దులతో పాటు మట్టికుండలో పసుపు బియ్యంతో నైవేద్యం సమర్పించి గంగిరేణి చెట్టు వద్ద పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. కొంతమంది భక్తులు మల్లన్న గుట్టపైన కొలువైన రేణుక ఎల్లమ్మకు బోనాలు సమర్పించారు. స్వామి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది. పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్రెడ్డి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. -
Sankranti Special Trains: సంక్రాంతికి మరో 4 ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): సంక్రాంతికి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరో నాలుగు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. తిరుపతి–సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (07460) ఈ నెల 10న రాత్రి 8.15 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది. సికింద్రాబాద్–తిరుపతి రైలు (82720) 11వ తేదీ∙సాయంత్రం 7.20 గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరుతుంది. తిరుపతి–కాచిగూడ ప్రత్యేక రైలు (07461) 12న మధ్యాహ్నం 3.20 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది. కాచిగూడ–తిరుపతి ప్రత్యేక రైలు (07642) ఈ నెల 13న మధ్యాహ్నం 3.45 గంటలకు కాచిగూడలో బయలుదేరుతుంది. చదవండి: ఆర్జీవీకి మంత్రి పేర్ని నాని కౌంటర్ -
కార్తీక మాసం చివరి రోజు: యాదాద్రికి పోటెత్తిన భక్తులు
-
రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్..
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): ప్రయాణికుల రద్దీని తగ్గించి వారికి మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు విశాఖపట్నం–సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య పలు పూజా స్పెషల్ రైళ్లు నడిపేందుకు ఈస్ట్కోస్ట్రైల్వే నిర్ణయించినట్లు, వాల్తేర డివిజన్ సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠీ తెలిపారు. చదవండి: దేత్తడి హారిక ఇల్లు ఎంత బాగుందో చూడండి! విశాఖపట్నం–సికింద్రాబాద్–విశాఖపట్నం(08579/18580) పూజా స్పెషల్: విశాఖపట్నం–సికింద్రాబాద్(08579 పూజా స్పెషల్ రైలు ప్రతి బుధవారం రాత్రి 7గంటలకు విశాఖపట్నంలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ స్పెషల్ డిసెంబర్ 1 నుండి 29వ తేదీ వరకు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో (08580)సికింద్రాబాద్లో త్రపి గురువారం రాత్రి 7.40 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 6.40గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ స్పెషల్ డిసెంబరు 2వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నడుస్తుంది. ఈ స్పెషల్ రైళ్లు ఇరుమార్గాలలో దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, విజయవాడ, గుంటూరు, మిర్యాలగుడ, సత్తెనపల్లె స్టేషన్లలో ఆగుతాయి. ఈ స్పెషల్ రైళ్లు 3–థర్డ్ ఏసీ, 8–స్లీపర్క్లాస్, 6–సెకండ్క్లాస్, 2–సెకండ్క్లాస్ కం లగేజీ కోచ్లతో నడుస్తాయి. విశాఖపట్నం–సికింద్రాబాద్–విశాఖపట్నం(08585/08586) స్పెషల్ విశాఖపట్నం–సికింద్రాబాద్(08585) వీక్లీ పూజా స్పెషల్ ప్రతి మంగళవారం సాయంత్రం 5.35 గంట లకు విశాఖపట్నంలో బయల్దేరి, మరుసటిరోజు ఉదయం 7.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ స్పెషల్ డిసెంబరు 7వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో (08586) సికిందాబాద్లో ప్రతి బుధవారం రాత్రి 9.05గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 9.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు డిసెంబరు 8వ తేదీ నుంచి 29వ తేదీ వరకు నడుస్తుంది. ఈ స్పెషల్ రైళ్లు ఇరుమార్గాలలో దువ్వాడ, సామర్ల కోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూ రు, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతాయి. ఈ స్పెషల్ రైలు 1–సెకండ్ ఎసి, 3–థర్డ్ ఎసి, 10–స్లీపర్క్లాస్, 6–జనరల్ సెకండ్క్లాస్, 2–సెకండ్క్లాస్ కం లగేజీ/డిజేబుల్డ్ కోచ్లతో నడుస్తాయి. -
సంక్రాంతి పండగ రద్దీ
-
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనానికి 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. సర్వదర్శనానికి 5 గంటలు, కాలిబాట దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. -
తిరుమల కిటకిట
సాక్షి, తిరుమల : తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. వైకుంఠం కాంప్లెక్స్లో 22 కంపార్ట్మెంట్స్ నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. సోమవారం శ్రీవారిని 87,144 మంది భక్తులు దర్శించుకోగా, 29,118 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.94 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల
సాక్షి, తిరుమల : తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం కాంప్లెక్స్లో భక్తులతో అన్ని కంపార్ట్మెంట్స్ నిండిపోయాయి. కంపార్ట్మెంట్ల వెలుపల భక్తులు బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని 87,336 మంది భక్తులు దర్శించుకోగా, 37,780 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.49 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
సాక్షి, తిరుపతి: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం మొత్తం 5 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 4 గంటలు, శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. కాలినడక భక్తులకు 2 గంటల సమయం పడుతుంది. శుక్రవారం శ్రీవారిని 55,963 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,339 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.09 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
సాక్షి, తిరుపతి: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వ దర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. బుధవారం 63,870 మంది భక్తులకు స్వామివారిని దర్శించుకున్నారు. 20,359 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీలో భక్తులు సమర్పించిన నగదు రూ. 2.69 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల : తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి కంపార్టమెంట్లు అన్నీ నిండిపోవడంతో వెలుపల క్యూలైన్లో భక్తులు వేచి ఉండాల్సి వచ్చింది. సర్వ దర్శనానికి 12 గంటలు, కాలిబాట దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం 2.84 కోట్లు. సోమవారం నుంచి సర్వదర్శనానికి స్లాట్ విధానం ప్రారంభమవుతుంది. దీనికి గానూ 20 ప్రాంతాలలో 117 కౌంటర్లు టీటీడీ ఏర్పాటు చేసింది. ఉదయం ఆరు గంటల నుంచి టోకెన్లను జారీ చేయనున్నారు. సర్వ దర్శనం స్లాట్ విధానానికి ఆధార్ తప్పనిసరి అని అధికారులు తెలిపారు. వారం రోజులపాటు ప్రయోగాత్మక పరిశీలించనున్నారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల : తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఒక కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. మంగళవారం స్వామి వారిని 65,236 మంది భక్తులు దర్శించుకోగా, 22,034 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామి వారి హుండీ ఆదాయం రూ. 3.02 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
వరుస సెలవులు: టోల్ప్లాజాల వద్ద రద్దీ
-
వరుస సెలవులు: టోల్ప్లాజాల వద్ద రద్దీ
హైదరాబాద్: వరుస సెలవులతో హైదరాబాద్ జనం ఊళ్ల బాట పట్టారు. హైదరాబాద్ నుంచి జనం సొంతూర్లకు బయలుదేరడంతో జాతీయ రహదారులు రద్దీగా మారాయి. నల్గొండ జిల్లాలోని పంథంగి, కేతేపల్లి టోల్ప్లాజాల వద్ద శనివారం ఉదయం భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలు టోల్ప్లాజా దాటడానికి అరగంటకు పైగా సమయం పడుతోంది. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఏడుకొండలపై కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రస్తుతం 27 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన కొండపైకి వచ్చే భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. నిన్న(గురువారం) స్వామివారిని 96,361 మంది భక్తులు దర్శించుకోగా.. శ్రీవారి హుండీకి రూ. 3.19 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. -
పోటెత్తారు..
భక్తులతో కిక్కిరిసిన లోవ దేవస్థానం – రూ.4,19,845 ఆదాయం – గంటలోనే నిండుకొన్న పులిహోర ప్రసాదం – తల్లిని దర్శించుకున్న 40వేల మంది భక్తులు తునిరూరల్ : ఆషాఢమాసం తొలి ఆదివారం తలుపులమ్మ తల్లిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థాన ప్రాంగణం కిక్కిరిసిపోయింది. తెల్లవారుజాము నుంచి వచ్చిన భక్తులు, వాహనాలతో లోవ ప్రాంగణం నిండిపోయింది. 40వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్టు అసిస్టెంట్ కమిషనర్, కార్యనిర్వహణ అధికారి ఎస్.చంద్రశేఖర్ తెలిపారు. ఉచిత దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంటసేపు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. పులిహోర ప్రసాదం విక్రయాలు చేపట్టిన గంటలోనే నిండుకున్నాయి. 25వేల రవ్వ లడ్డూ ప్రసాదాలను విక్రయాలకు అందుబాటులో ఉంచినట్టు ఈఓ తెలిపారు. వివిధ విభాగాల ద్వారా రూ.4,19,845 ఆదాయం లభించినట్టు ఈఓ చెప్పారు. భక్తుల రద్దీకనుగుణంగా వసతిగదులు, కాటేజీలు లేకపోవడంతో చెట్లకింద, ఆరుబయట, కొండదిగువన ఉన్న తోటల్లో భక్తులు వంటలు చేసుకుని భోజనాలు చేశారు. తుని పట్టణ, రూరల్ సీఐలు శ్రీనివాస్, చెన్నకేశవరావుల ఆధ్వర్యంలో 80మంది పోలీసులు బందోబస్తు నిర్వహించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. రానున్న పర్వదినాల్లో భక్తుల సంఖ్య పెరగనుండడంతో మరింత పటిష్టంగా బందోబస్తుకు వంద మంది పోలీసులను కేటాయించాలని డీఎస్పీని కోరునున్నట్టు ఈఓ తెలిపారు. చైర్మన్ కరపా అప్పారావు, ధర్మకర్త యాదాల లోవకృష్ణ భక్తులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను పర్యవేక్షించారు. అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. శ్రీహరి సేవ భక్తులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ వలంటీర్లు సేవలు అందించారు. 25టియుఎన్104 : భక్తులతో రద్దీగా ఉన్న లోవదేవస్థానం ప్రాంగణం 25టియుఎన్105 : అమ్మవారిని దర్శించేందుకు క్యూలైన్లో వేచిఉన్న భక్తులు. 25టియుఎన్106 : వసతిగదుల్లేక చెట్లకింద వంటలు, భోజనాలు చేస్తున్న భక్తులు -
రత్నగిరిపై ‘ఏకాదశి’ రద్దీ
స్వామిని దర్శించిన 40 వేలమంది భక్తులు ఎండ వేడి తట్టుకోలేక భక్తుల ఇబ్బందులు అన్నవరం(ప్రత్తిపాడు) : ఏకాదశి పర్వదినం సందర్భంగా సోమవారం రత్నగిరి శ్రీసత్యదేవుని ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున ఐదు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ భక్తుల రద్దీ కొనసాగింది. సోమవారం 40 డిగ్రీల పైబడి ఎండ కాయడంతో భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఉదయం పది గంటల నుంచి నేల వేడెక్కి కాళ్లు కాలిపోవడంతో తీవ్ర అవస్థలు పడ్డారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకున్న తెల్లవారుజామున ఐదు గంటల నుంచి స్వామివారి ఆలయాన్ని తెరిచి భక్తులకు దర్శనాన్ని ఏర్పాటు చేశారు. నాలుగు గంటల నుంచి వ్రతాల నిర్వహణ ప్రారంభించారు. స్వామివారి దర్శనానికి గంట ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. సత్యదేవుని వ్రతమాచరించిన చిన రాజప్ప, రెడ్డి సుభ్రహ్మణ్యం: డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, శానసమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం సత్యదేవుని వ్రతమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామి దర్శనం అనంతరం వేదపండితులు వేదాశీస్సులు, అధికారులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఏసీ మండపంలో వ్రతాలకు డిమాండ్: ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో వ్రతాలాచరించే భక్తులు రూ.2,000 టికెట్తో ఏసీ వ్రతమండపంలో వ్రతాలాచరించేందుకు మొగ్గు చూపారు. సాధారణంగా ప్రతి రోజూ వంద వ్రతాల వరకూ మాత్రమే ఇక్కడ జరుగుతాయి. అటువంటిది సోమవారం రెండు వందలకు పైగా ఈ వ్రతాలు జరిగాయి. స్వామివారిని దర్శించిన 40 వేల మంది భక్తులు: సుమారు 40 వేలమంది భక్తులు సోమవారం సత్యదేవుని దర్శించారని అధికారులు అంచనా వేస్తున్నారు. స్వామివారి వ్రతాలు 3,611 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షలు ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఏడుకొండలపై కొలువైన శ్రీ వెంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి ప్రస్తుతం 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలినడకన కొండపైకి వచ్చే భక్తులకు 10 గంటల సమయం పడుతోంది. ఆదివారం స్వామివారిని 1,00,277 మంది దర్శించుకోగా.. శ్రీవారి హుండీకి రూ. 2.77 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఏడుకొండలపై కొలువైన శ్రీ వెంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి ప్రస్తుతం 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన కొండపైకి వచ్చే భక్తులకు 5 గంటల సమయం పడుతోంది. గురువారం 61,199 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. శ్రీవారి హుండీకి రూ. 2.13 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో బుధవారం ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రస్తుతం 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. మంగళవారం స్వామివారిని 72,841 మంది దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో సాధారణ రద్దీ
తిరుమల: తిరుమలలో మంగళవారం ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనానికి 19 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 6 గంటలు, నడకదారి భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. నేడు తిరుమలలో వైభవంగా కోయిల్ అళ్వార్ తిరుమంజనం జరుగుతుంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నేడు తిరుమలలో ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఉదయం 11 గంటల తరువాత స్వామివారి దర్శనం ఉంటుంది. సోమవారం రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 5 కోట్లు ఉన్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. -
తిరుమలలో సాధారణ రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రస్తుతం 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన కొండపైకి వచ్చే వారికి 3 గంటల సమయం పడుతోంది. శుక్రవారం స్వామివారిని 63,328 మంది భక్తులు దర్శించుకోగా.. హుండీ ఆదాయం రూ. 2.5 కోట్ల వచ్చినట్లు టీటీటీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో మంగళవారం ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి, కాలినడకన వచ్చే భక్తులకు, ప్రత్యేక దర్శనానికి ఒక గంట సమయం పడుతోంది. సోమవారం శ్రీవేంకటేశ్వరస్వామిని 60,507 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,384 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి ఆదాయం రూ.3.20 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
యాదాద్రిలో భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తుల వేల సంఖ్యలో తరలివచ్చారు. స్వామి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ వలన కొండపైకి వాహనాల అనుమతిని రద్దు చేశారు. -
శ్రీశైలంలో పోటెత్తిన భక్తులు
శ్రీశైలం: ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో 6వ రోజు శివరాత్రి మహోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బుధవారం భక్తులు పోటెత్తారు. సాయంత్రం పూల పల్లకిలో భ్రమరాంబామల్లికార్జునస్వామిలు భక్తులకు దర్శనమివ్వనున్నారు. పాదయాత్రగా భక్తులు తరలివస్తున్నారు. సర్వ దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి 3 గంటలు, శివదీక్ష భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. తెలంగాణ నుంచి 320 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఏడుకొండలపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రస్తుతం 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. మంగళవారం స్వామివారిని 67,007 మంది భక్తులు దర్శించుకోగా.. శ్రీవారి హుండీకి రూ. 2.14 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో సాధారణ రద్దీ
తిరుమల: తిరుమలలో సోమవారం ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రస్తుతం 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలనిడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. ఆదివారం 87,516 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. శ్రీవారి హుండీకి రూ. 2.94 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. -
భక్తులతో తిరుమల కిటకిట
తిరుమల: తిరుమలలో ఆదివారం ఉదయం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనార్థం 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. సర్వదర్శనానికి 8 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 5 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. శనివారం శ్రీవేంకటేశ్వరస్వామిని 83,037 మంది దర్శించుకున్నారు. 37,990 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.18 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రస్తుతం 27 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. శనివారం 81,687 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. శ్రీవారి హుండీకి రూ. 2.10 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి దర్శనానికి ప్రస్తుతం 6 కంపార్ట్మంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. గురువారం స్వామివారిని 63,487 మంది దర్శించుకోగా.. శ్రీవారి హుండీకి రూ. 2.21 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనార్థం బుధవారం ఉదయం రెండు కంపార్టెమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. మంగళవారం స్వామి వారిని 74,628 మంది భక్తులు దర్శించుకోగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.03 కోట్లు వచ్చిందని ఆలయాధికారులు తెలిపారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి మంగళవారం ఉదయం 5 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. సోమవారం 87,077 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. శ్రీవారి హుండీకి రూ. 2.36 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రస్తుతం 13 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 7 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడక భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. నిన్న(ఆదివారం) స్వామివారిని 82,242 మంది భక్తులు దర్శించుకోగా శ్రీవారి హుండీకి రూ. 2.06 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. -
ఇల వైకుంఠానికి పోటెత్తిన భక్తజనం
సాక్షి, తిరుమల: ఇల వైకుంఠం తిరుమలక్షేత్రంలో ఆదివారం వైకుంఠ ఏకాదశి పర్వదినం వైభవంగా సాగింది. ముక్కోటి దర్శనం కోసం అంచనాలకు మించి భక్తులు పోటెత్తారు. క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. క్యూలైన్లలోకి భక్తులు వెళ్లే సమయంలో తోపులాటలు జరిగాయి. గతేడా ది 2,800 వీఐపీ టికెట్లు కేటాయించగా.. ఈ ఏడాది వాటిని 4,200లకు పెంచారు. అర్ధరాత్రి తర్వాత వీఐపీలకు శ్రీవారి దర్శనం కల్పించారు. తర్వాత 4.09 గంటకు సామాన్య భక్తులను అనుమతిం చారు. ముక్కోటి దర్శనానికి వచ్చే భక్తులను తొలుత 54 కంపార్ట్మెంట్లలోకి అనుమ తించారు. తర్వాత నారాయణగిరి ఉద్యావనంలో 16 తాత్కాలిక కంపార్ట్ మెంట్లలోకి, ఆలయ నాలుగుమాడ వీధుల్లోకి అనుమతించారు. వైకుంఠద్వార ప్రవేశంతో సామాన్య భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఆలయ వీధుల్లో.. గ్యాలరీల్లో తోపులాటలు ఆలయ వీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉండే భక్తుల మధ్య తోపులాటలు జరిగాయి. భక్తులు ఒక్కసారిగా ముందుకు దూసుకురావటంతో రావడంతో భక్తులు కింద పడ్డారు. ముందస్తు ఏర్పాట్లు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు చవిచూసారు. సామాన్యులకే ప్రాధాన్యం: ఈవో సాంబశివరావు వైకుంఠ ఏకాదశిలో శ్రీవారి దర్శనాన్ని సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యం ఇచ్చామని, అందుకు అనుగుణంగానే భక్తులకు శ్రీవారి దర్శనానికి అనుమతించామని టీటీడీ ఈవో సాంబశివరావు చెప్పారు. అధిక సమయం సామాన్య భక్తులకు కేటాయించటం ఆనందంగా ఉందన్నారు. కంపార్ట్మెంట్లలో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి తిరుమల శ్రీవారిని ఆదివారం తెలుగు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యాంప్రసాద్, చల్లా కోదండరామ్, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ సభ్యుడు జస్టిస్ రవిబాబు, తమిళ నాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంతోష్కుమార్, న్యాయమూర్తి జస్టిస్ మాల దర్శిం చుకున్నారు. వైకుంఠ ఏకాదశి శుభగడియల్లో స్వామివారిని దర్శించుకున్నారు. -
ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తుల రద్దీ
-
పండగ చార్జీలు 50 శాతం అదనం
హైదరాబాద్: సంక్రాంతి పండగ రద్దీని తట్టుకునేందుకు తెలంగాణ ఆర్టీసీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. సెలవులకు సొంతూళ్లకు వెళ్లే వారి కోసం మొత్తం 2,430 బస్సులను ఏర్పాటు చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు 750 బస్సులను వేసింది. అయితే, 200 కిలోమీటర్ల దూరం దాటితే 50శాతం చార్జీ అదనంగా వసూలు చేయనున్నట్లు పేర్కొంది. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో సోమవారం ఉదయం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఏడుకొండలపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రస్తుతం 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడక భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. ఆదివారం స్వామివారిని1,02,862 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. -
యాదాద్రికి పోటెత్తిన భక్తులు
యాదాద్రి: నూతన సంవత్సరం సందర్భంగా యదాద్రిలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం తెల్లవారుజామునుంచే లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వామివారి ధర్మ దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా వాహనాలను కొండపైకి అనుమతించడం లేదు. -
తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
తిరుమల: తిరుమల శ్రీవారి సన్నిధిలో సెలవుల ప్రభావం కనిపిస్తోంది. సోమవారం ఉదయం సమయానికి 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 10 గంటలు, కాలినడక భక్తులకు 8 గంటల సమయం పడుతోంది. అలాగే, స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనం మూడు గంటల్లో పూర్తవుతోంది. -
విజయవాడలో భవానీల దీక్ష విరమణ
-
శ్రీవారి దర్శనానికి 3 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. వెంకన్న సర్వ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుండగా కాలి నడక భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. రెండు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం 78,752మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 30,424మంది తలనీలాలు సమర్పించారు. ఆదాయం రూ.2.67 కోట్లు వచ్చింది. శ్రీవారిని దర్శించుకున్నవారిలో ఎక్కువమంది అయ్యప్పస్వామి భక్తులే ఉన్నారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో ఆదివారం ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మూడు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటలు, కాలి నడక భక్తులకు మూడు గంటల సమయం పడుతోంది. కాగా, శనివారం 72,137మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సుమారు 33 వేల మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.2.36 కోట్లుగా ఉంది. -
అర్ధరాత్రిళ్లూ కష్టాలే..!
-
తిరుమలలో తగ్గిన రద్దీ
తిరుమల: తిరుమల శ్రీవారి సన్నిధిలో రద్దీ తక్కువగా ఉంది. బుధవారం ఉదయం రెండు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి రెండు గంటలు, కాలినడక భక్తులకు రెండు గంటల్లోపే దర్శన భాగ్యం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం వెంటవెంటనే పూర్తవుతోంది. -
నగదు నరకం
-
భక్తులతో తిరుమల కిటకిట
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ కాంప్లెక్స్ వెలుపల కూడా భక్తులు బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక దర్శనానికి 3 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 10 గంటల సమయం పడుతోంది. శనివారం శ్రీవేంకటేశ్వరస్వామిని 78,559 మంది భక్తులు దర్శించుకోగా 42,465 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.33 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనానికి శుక్రవారం ఉదయం నాలుగు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి నాలుగు గంటలు, కాలినడక భక్తులకు మూడు గంటల్లోపే సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం రెండు గంటల్లోపే పూర్తవుతోంది. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో బుధవారం ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రస్తుతం 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంట సమయం పడుతోంది. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి ప్రస్తుతం ఆరు కంపార్టమెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి మూడు గంటలు, నడకదారి భక్తులకు రెండు గంటల సమయం పడుతోంది. -
తగ్గిన భక్తులు.. పెరిగిన హుండీ రాబడి
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. అయితే అనూహ్యంగా హుండీ రాబడి పెరిగింది. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం మంగళవారం రెండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. సర్వ దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి ఒక గంట, కాలినడకన వచ్చే భక్తులకు రెండు గంటల సమయం పడుతోంది. సోమవారం శ్రీవారిని 67,241 మంది దర్శించుకున్నారు. 25,643 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. సోమవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.18 కోట్లు వచ్చింది. -
కిటకిటలాడిన కోటప్పకొండ
నరసరావుపేట రూరల్: కోటప్పకొండలోని శ్రీ త్రికోటేశ్వరస్వామి వారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. కార్తీక మాసం ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మహిళలు ఆలయ ప్రాంగణంలోని రావిచెట్టు వద్ద దీపాలు వెలిగించారు. స్వామి వారి మూలవిరాట్కు విరివిగా అభిషేకాలు జరిగాయి. నాగేంద్రునడి పుట్ట, ధ్యానశివుడి విగ్రహం వద్ద కూడా విశేష పూజలు నిర్వహించారు. మహిళలు పొంగళ్ళు వండి స్వామి వారికి నైవేద్యం సమర్పించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈవో డి.శ్రీనివాసరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
నాలుగవ కార్తీక సోమవారానికి ఏర్పాట్లు సిద్ధం
- 3.30గంటల నుంచే దర్శన ఆర్జితసేవలు -· క్యూల్లోని భక్తులకు పాలు, అల్పాహారం వితరణ శ్రీశైలం: ద్వాదశ జ్యోతిర్లింగ శైవక్షేత్రం శ్రీశైలమహాక్షేత్రంలో నాల్గవ కార్తీక సోమవారానికి ఏర్పాట్లు సిద్ధం చేశామని ఈఓ నారాయణ భరత్ గుప్త తెలిపారు. శనివారం ఈఓ చాంబర్లో ఏసీ మహేశ్వరరెడ్డి, ఈఈ రామిరెడ్డి, ఏఈఓ, పర్యవేక్షకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడతూ నాల్గవ కార్తీక సోమవారం రోజున లక్షలాదిగా భక్తులు తరలివస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేశామన్నారు. అందులో భాగంగా ఆలయ పూజావేళ్లలో మార్పులు చేశామన్నారు. వేకువజామున 2.30గంటలకు మంగళవాయిద్యాలు, సుప్రభాతం, మహామంగళహారతి, 3.30గంటల నుంచి దర్శన ఆర్జితసేవలు ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. క్యూ కాంప్లెక్స్లో వేచి ఉంచే భక్తులతో పాటు అభిషేక సేవాకర్తల కోసం పాలు, అల్పాహారం, మజ్జిగ అందజేయనున్నామన్నారు. వేకువజామున 3.30గంటల నుంచి 5 విడతలుగా సామూహిక అభిషేకాలు నిర్వహిస్తామని, సర్వదర్శనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఈఓ తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా క్యూలు సాఫీగా సాగేందుకు ప్రత్యేక విధులపై సిబ్బందితో పాటు, శివసేవకులను నియమిస్తున్నామన్నారు. రద్దీ కారణంగా నెట్వర్క్ ఇబ్బందులను అధిగమించడానికి వాకీటాకీలను సిబ్బందికి అందజేయనున్నట్లు చెప్పారు. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఆదివారం ఉదయం 22 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 5 గంటల సమయం పడుతోంది. శనివారం 80,248 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. -
భక్తులతో పోటెత్తిన శ్రీశైలం
శ్రీశైలం: ద్వాదశ జ్యోతిర్లింగ శైవక్షేత్రమైన శ్రీశైలం కార్తీకమాసం రెండో సోమవారం భక్తులతో పోటెత్తింది. సోమవారం ఉదయానికి లక్షకు పైగా భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని ఉంటారని అధికారుల అంచనా. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈఓ భరత్ గుప్త ఆలయ పూజా వేళల్లో మార్పులు చేశారు. వేకువజామున 3.30గంటల నుంచే దర్శన ఆర్జితసేవలు ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు చేశారు. రెండో కార్తీక సోమవారం.. సప్తమి, శ్రవణా నక్షత్రం కలిసి రావడంతో ప్రాధాన్యత సంతరించుకుందని వేదపండితులు తెలిపారు. ఇలాంటి పర్వదినాన్ని కోటి సోమవారం అని అంటారని పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో అభిషేకాలు కార్తీకమాసం సోమవారాన మల్లన్న రికార్డు స్థాయిలో 2,250 అభిషేకాలను నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వేకువజాము నుంచే భక్తులు పవ్రితపాతాళగంగలో కార్తీక స్నానాలచరించుకుని నేరుగా స్వామిఅమ్మవార్ల దర్శనార్థమైన క్యూలలోకి చేరుకున్నారు. దీంతో అన్నిక్యూలు భక్తులతో కిటకిటలాడుతూ కనిపించాయి. కార్తీకమాసంలో రెండవ సోమవారం సప్తమి,శ్రవణా నక్షత్రం కలిసి రావడంతో భక్తులు అధిక సంఖ్యలో అభిషేకాలవైపు మొగ్గు చూపారు.దీంతో 1328కిపైగా సామూహిక అభిషేకాలు, 785 సింగిల్ అభిషేకాలు, గర్భాలయంలో జరిగే రూ. 5వేల అభిషేకం టికెట్లు 137, మొత్తం 2,250 అభిషేకాల టికెట్లను విక్రయించగా, 351 కుంకుమార్చన టికెట్లను విక్రయించినట్లు అధికారులు తెలిపారు. -
ఆలయాల్లో కార్తీక శోభ
హైదరాబాద్సిటీ: కార్తీక సోమవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పలుచోట్ల నదులలో వేకువజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరించారు. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఏడుకొండలవాడి దర్శనానికి ప్రస్తుతం 20 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 7 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. నిన్న(శనివారం) స్వామివారిని 81,657 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రస్తుతం 6 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. నిన్న(గురువారం) స్వామివారిని 72,408మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.84కోట్లువచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఏడుకొండల వాడి దర్శనానికి ప్రస్తుతం 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. నిన్న(బుధవారం) శ్రీవారిని 69,317 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.38 కోట్లుగా నమోదైనట్లు టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో కార్తీక రద్దీ
తిరుమల: తిరుమల శ్రీవారి సన్నిధిలో కార్తీక మాస ప్రారంభ ప్రభావం కనిపిస్తోంది. సోమవారం ఉదయం 30 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. అలాగే, కాలినడక భక్తులకు 3 గంటల్లోనే దర్శనభాగ్యం లభిస్తోంది.