
తిరుమలలో కార్తీక రద్దీ
తిరుమల శ్రీవారి సన్నిధిలో కార్తీక మాస ప్రారంభ ప్రభావం కనిపిస్తోంది.
తిరుమల: తిరుమల శ్రీవారి సన్నిధిలో కార్తీక మాస ప్రారంభ ప్రభావం కనిపిస్తోంది. సోమవారం ఉదయం 30 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. అలాగే, కాలినడక భక్తులకు 3 గంటల్లోనే దర్శనభాగ్యం లభిస్తోంది.