
తిరుమలలో సాధారణ రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రస్తుతం 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన కొండపైకి వచ్చే వారికి 3 గంటల సమయం పడుతోంది.
శుక్రవారం స్వామివారిని 63,328 మంది భక్తులు దర్శించుకోగా.. హుండీ ఆదాయం రూ. 2.5 కోట్ల వచ్చినట్లు టీటీటీ అధికారులు తెలిపారు.