తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ | Devotees Rush Increases At Tirumala, It Takes 12 Hours For Sarvadarshan And 4 Hours For Special Darshan - Sakshi
Sakshi News home page

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Published Tue, Nov 14 2023 8:28 AM

Devotees Rush Increases At Tirumala - Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటలు సమయం, ప్రత్యేక దర్శనానికి 4 గంటలు పడుతోంది. నిన్న శ్రీవారిని  70,902 మంది భక్తులు దర్శించుకోగా, తలనీలాలు 22,858 మంది సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.24 కోట్లు.

నేడు టీటీడీ పాలకమండలి సమావేశం జరగనుంది. టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన అన్నమయ్య భవన్‌లో పాలకమండలి సభ్యులు సమావేశం కానున్నారు. వైకుంఠ ఏకాదశిపై పాటు పలు కీలక అంశాలపై పాలకమండలిలో చర్చ జరగనుంది.
చదవండి: వావ్‌..విశాఖ!

Advertisement
Advertisement