మహా కుంభమేళాకు ఒక్కసారిగా పోటెత్తిన భక్తజనం | Mahakumbh 2025: Kumbh Mela Hits Record Breaking Crowds as Final Weekend Approaches | Sakshi
Sakshi News home page

మహా కుంభమేళాకు ఒక్కసారిగా పోటెత్తిన భక్తజనం

Published Fri, Feb 21 2025 12:39 PM | Last Updated on Fri, Feb 21 2025 12:52 PM

Mahakumbh 2025: Kumbh Mela Hits Record Breaking Crowds as Final Weekend Approaches

లక్నో: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం.. మహా కుంభమేళా మరో ఐదురోజుల్లో ముగియనుంది. చివరి వారాంతం కావడంతో ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. ఇవాళ 40వ రోజు ఉదయం రికార్డు స్థాయిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించిట్లు అధికారులు ప్రకటించారు.

కుంభమేళా ముగుస్తుండడంతో ప్రయాగ్‌రాజ్‌(Prayagraj) సంగమంకు భక్తుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. మేలా ప్రాంతంలో హోటల్స్‌, ధర్మశాలలు కిక్కిరిసిపోయాయి. గురువారం సాయంత్రం గణాంకాల ప్రకారం.. మొత్తంగా 58 కోట్ల మంది పుణ్యస్నానాలు పూర్తి చేసుకున్నారని అధికారులు ప్రకటించారు. శని, ఆది వారాల్లో భక్తుల తాకిడి మరింత అధికంగా ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా.. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు.

గత వారంగా కుంభమేళా భక్తుల సంఖ్య👇

  • ఫిబ్రవరి 13, గురువారం: 80 లక్షల 46 వేలు

  • ఫిబ్రవరి 14 శుక్రవారం: 94 లక్షల 98 వేలు

  • ఫిబ్రవరి 15 శనివారం: కోటి 36 లక్షల మంది

  • ఆదివారం:  కోటి 49 లక్షల మంది

  • సోమవారం: కోటి 35 లక్షల మంది

  • మంగళవారం : కోటి 26 లక్షల మంది

  • బుధవారం: కోటి 19 లక్షల మంది

  • గురువారం: కోటి 55 లక్షల మంది..

ఇక.. కుంభమేళా(KumbhmelaI నిర్వహణపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. జనవరి చివరి వారంలో మౌనీ అమవాస్య సందర్బంగా జరిగిన తొక్కిసలాట 30 మంది మరణించిన సంగతి తెలిసిందే. దీంతో రాబోయే  రద్దీని నియంత్రించేలా అధిక సిబ్బందిని నియమించారు. మరోవైపు.. పరిసరాలను, సంగమ నీటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఇప్పటికే వీఐపీ పాస్‌లను రద్దు చేసిన అధికారులు.. వాహనాల రాకపై కూడా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.

రైల్వే శాఖ కీలక నిర్ణయం
మహా కుంభమేళా(Maha Kumbh Mela) ముగుస్తుండడంతో భక్తులు అధిక సంఖ్యలో ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారు. రైల్వే స్టేషన్‌లు కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో  రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పలు స్టేషన్‌లలో ప్రత్యేక హోర్డింగ్‌లను ఏర్పాటు చేయించింది. సురక్షిత ప్రయాణం కోసం తాము సూచించే మార్గదర్శకాలను పాటించాలని అందులో విజ్ఞప్తి చేస్తోంది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట చోటు చేసుకుని 18 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement