
తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
తిరుమల శ్రీవారి సన్నిధిలో సెలవుల ప్రభావం కనిపిస్తోంది.
తిరుమల: తిరుమల శ్రీవారి సన్నిధిలో సెలవుల ప్రభావం కనిపిస్తోంది. సోమవారం ఉదయం సమయానికి 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 10 గంటలు, కాలినడక భక్తులకు 8 గంటల సమయం పడుతోంది.
అలాగే, స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనం మూడు గంటల్లో పూర్తవుతోంది.