Published
Sun, Jul 31 2016 11:10 PM
| Last Updated on Mon, Sep 4 2017 7:13 AM
యాదాద్రిలో తగ్గిన భక్తుల రద్దీ
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహా స్వామి దేవస్థానానికి ఆదివారం భక్తుల రద్దీ తగ్గింది. సికింద్రాబాద్, హైదరాబాద్లలో బోనాల పండుగ సందర్భంగా భక్తుల రద్దీ పూర్తిగా తగ్గు ముఖం పట్టింది. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైలన్నీ భక్తులు లేక వెలవెలబోయాయి. కేవలం అరగంటలో స్వామి, అమ్మవార్ల దర్శనం జరిగినట్లు భక్తులు తెలిపారు. ఆదివారం సుమారు 5 వేల మంది భక్తులు వచ్చినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.