
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి దర్శనానికి ప్రస్తుతం 6 కంపార్ట్మంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. గురువారం స్వామివారిని 63,487 మంది దర్శించుకోగా.. శ్రీవారి హుండీకి రూ. 2.21 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.