
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో ఆదివారం ఉదయం భక్తుల రద్దీ పెరిగింది
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఆదివారం ఉదయం 22 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 5 గంటల సమయం పడుతోంది. శనివారం 80,248 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు.