
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమలలో బుధవారం ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది
తిరుమల: తిరుమలలో బుధవారం ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రస్తుతం 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు.
శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. మంగళవారం స్వామివారిని 72,841 మంది దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.