
భక్తులతో తిరుమల కిటకిట
తిరుమల: తిరుమలలో ఆదివారం ఉదయం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనార్థం 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. సర్వదర్శనానికి 8 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 5 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. శనివారం శ్రీవేంకటేశ్వరస్వామిని 83,037 మంది దర్శించుకున్నారు. 37,990 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.18 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.