ప్రధాన వార్తలు

రైతులపై రౌడీషీట్లు తెరుస్తామని బెదిరిస్తారా : వైఎస్ జగన్
సాక్షి,చిత్తూరు: కనీస గిట్టుబాటు ధర లేక తీవ్ర కష్టనష్టాల్లో కూరుకుపోయిన మామిడి రైతులను పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్జగన్మోహన్ రెడ్డి బుధవారం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్యార్డు సందర్శించారు. అక్కడ మామిడి రైతులను కలిసి, వారి సమస్యలపై ఆరా తీశారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు మామిడి రైతులను నిరంకుశంగా నియంత్రించారుమామిడి రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకు ఇక్కడికి వచ్చాను. జగన్ వస్తున్నాడని తెలిసి, ఇక్కడ 2 వేల మంది పోలీసులను మొహరించి, రైతులను రానీయకుండా అడ్డుకున్నారు. రైతులు ఇక్కడికి రాకుండా బెదిరించారు. చివరకు టూవీలర్లపై వచ్చిన వారిని కూడా అడ్డుకున్నారు. ఇక్కడికి కేవలం 500 మంది మాత్రమే రావాలని ఎందుకు అన్నారు. ఎందుకీ ఆంక్షలు? అయినా ఇక్కడికి వేల మంది రైతులు వచ్చి, వారి ఆవేదన చెప్పుకున్నారు.ఏ పంటకు కనీస గిట్టుబాటు ధర లేదువరికి కూడా ధర లేదు. కనీసం రూ.300కు తక్కువకు అమ్ముకుంటున్నారు. వరి, పెసర, జొన్న.. చివరకు మామిడి రైతులకు కూడా కనీస గిట్టుబాటు ధర రావడం లేదు.ఒక్క మన రాష్ట్రంలో తప్ప, వేరే రాష్ట్రంలో అయినా కిలో మామిడి రూ.2కి దొరుకుతుందా?. ఈ ప్రభుత్వానికి నా సూటి ప్రశ్న. ఎందుకు ధర లేదు? ఇదే మామిడికి మా ప్రభుత్వ హయాంలో కిలో రూ.22 నుంచి రూ.29 వరకు అమ్ముకున్నారు.కొనుగోళ్లలో ఎందుకంత జాప్యం?చంద్రబాబు ప్రభుత్వానికి నా సూటి ప్రశ్న.. ఏటా మామిడి కొనుగోలు ఉంటుంది. దాన్ని మే మొదటి వారంలో మొదలుపెట్టాలి. కానీ, ఆ పని ఎందుకు చేయలేదు? జూన్ రెండో వారం తర్వాత మామిడి కొనుగోలు చేయడంతో.. మొత్తం పంట మార్కెట్ను ముంచెత్తింది. దీంతో కంపెనీలు ధరలు తగ్గించాయి.దీంతో మామిడి రైతులకు దిక్కు తోచడం లేదు. చిత్తూరు జిల్లాలో 52 పల్ప్ కంపెనీలు ఉన్నాయి. కానీ రైతులకు ధర రావడం లేదు.నిజంగా ఆ ధరకు ఎంత పంట కొన్నారు?కానీ, ఈ ప్రభుత్వం కంపెనీలు కిలోకు రూ.8 ఇస్తుంటే, ప్రభుత్వం మరో రూ.4 చొప్పున ఇస్తోందని చెబుతున్నారు. మరి ఇక్కడ ఆ ధరకు ఎంత పంట అమ్ముడుపోయింది. అదే పొరుగున్న ఉన్న కర్ణాటకలో కుమారస్వామి కేంద్రానికి లేఖ రాస్తే.. కిలో మామిడి రూ.16 చొప్పున కొన్నారు.ఇక్కడ 76 వేల మంది రైతులు మామిడి సాగుమీద బతుకున్నారు. 6.45 లక్షల టన్నుల పంట పండింది. ఇక్కడ 2.20 లక్షల ఎకరాల్లో మామిడి సాగు చేశారు.నాడు కిలో రూ.29. మరి నేడు?మా ప్రభుత్వ హయాంలో కిలో మామిడి రూ.29 కి కొంటే, ఇప్పుడు కనీసం రూ.12 కూడా రావడం లేదు. ఇంకా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కూడా అందడం లేదు. నాడు ఆర్బీకే వ్యవస్థ ప్రతి అడుగులో రైతులకు తోడుగా ఉండేవి. కానీ, ఈ ప్రభుత్వం ఆ వ్యవస్థను నిర్వీరం చేసింది. ఇవాళ అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి.ప్రభుత్వమే కొనుగోలు చేయాలిఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వదలాలి. మొత్తం పంటను ప్రభుత్వం స్వయంగా కొనుగోలు చేసి, మామిడి రైతులను ఆదుకోవాలి.లేని పక్షంలో రైతుల పక్షాన నిలబడి పోరాడుతాం. ఇదే నా హెచ్చరిక.అసలు మీరు మనుషులేనా?ప్రభుత్వం ఇంత క్రూరంగా వ్యవహరిస్తోంది. ఎందుకు రైతులను రానీయకుండా అడ్డుకుంటోంది? దాదాపు 1200 మంది రైతులను అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ ఒకరి తల పగలగొట్టారు. అసలు మీరు మనుషులేనా?. ఎవరికి ఏ సమస్య వచ్చినా జగన్ పలుకుతున్నాడు. మిర్చి, పొగాకు, మామిడి రైతుల సమస్యలపై జగన్ మాత్రమే మాట్లాడుతున్నాడు. ఇంకా ఎవరికి ఏ సమస్య వచ్చినా, జగన్ ముందు ఉంటున్నాడు.వచ్చేది జగన్ ప్రభుత్వమే. ఇది గుర్తు పెట్టుకొండి’అని ముగించారుమార్కెట్ యార్డు వద్దకు చేరుకున్న వైఎస్ జగన్బంగారుపాళ్యం మామిడి మార్కెట్ యార్డుకు చేరుకున్న వైఎస్ జగన్మామిడి రైతుల సమస్యలను తెలుసుకోనున్న వైఎస్ జగన్జనసందోహంగా మారిన మార్కెట్ యార్డ్. పోలీసుల వలయం దాటుకుని మార్కెట్ యార్డుకు రైతులు తరలివచ్చారు. తమ సమస్యలు చెప్పుకొనేందుకు రైతులు తరలివచ్చారు. వేలాది సంఖ్యలో రైతులు అక్కడికి వచ్చారు. మామిడి రైతుల ఆవేదనమామిడి మార్కెట్ యార్డ్కు రాకుండా 25 చెక్పోస్టులు పెట్టారు.బంగారుపాళ్యం రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.పోలీసుల ఆంక్షలను ఛేదించి యార్డుకు చేరుకున్నాం.అడ్డదారుల్లోపరుగులు పెట్టుకుంటూ యార్డుకు వచ్చాం.కూటమి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడం లేదు.ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం అయ్యింది. వైఎస్ జగన్ పర్యటనపై కూటమి కుట్రలు.. వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనపై ప్రభుత్వం కుట్రలు.వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుటిల యత్నం.వైఎస్ జగన్ పర్యటనకు అడుగడుగునా పోలీసుల ఆంక్షలు.వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్.పోలీసుల లాఠీచార్జ్లో కార్యకర్తకు గాయాలు.గాయపడిన కార్యకర్త వద్దకు వెళ్లకుండా జగన్ను అడ్డుకున్న ఎస్పీ.కాన్వాయ్లోని వాహనాలను అడ్డుకున్న పోలీసులుమాజీ మంత్రులు పెద్దిరెడ్డి, ఆర్కే రోజా వాహనాలు అడ్డగింత.రైతులు కూడా బంగారుపాళ్యం రాకుండా బారికేడ్లు.రైతుల సమస్యలు జగన్కు చెప్పుకోకుండా చేయాలని కుట్ర. చిత్తూరు జిల్లా పోలీసుల ఓవరాక్షన్అడుగడుగునా పోలీసుల చెక్ పోస్టులు, వాహనాల తనిఖీలుహెలిప్యాడ్ నుండి మార్కెట్ యార్డు వరకు రోడ్డు పొడవునా పోలీసులు, చెక్ పోస్టులుచివరికి వైఎస్ జగన్ కాన్వాయ్ వాహనాలనూ లెక్కించి పంపుతున్న పోలీసులుఒక ఎస్కాట్ వాహనాన్ని కూడా ఆపేసిన పోలీసులుYSRCP నేతల కార్లకూ అనుమతి లేదంటూ నిలిపివేతహైవే మీద బారికేడ్లు పెట్టి ట్రాఫిక్ కు అంతరాయంచిత్తూరు-బెంగుళూరు వైవే మీద ప్రయాణీకులకు ఇబ్బందులుపోలీసులు లాఠీచార్జ్లో వైఎస్సార్సీపీ కార్యకర్త తలకు గాయం.వెంటనే ఆసుప్రతికి తరలించిన వైఎస్సార్సీపీ శ్రేణులు. వైఎస్ జగన్కు మా సమస్యలు చెప్పుకుంటాం: రైతులుజగన్ మా దగ్గరికి వస్తే ప్రభుత్వానికి ఎందుకంత ఉలికిపాటు.బంగారుపాళ్యం రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.పోలీసుల ఆంక్షలను ఛేదించి యార్డుకు చేరుకున్నాం.ఫ్యాక్టరీలు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు.వైఎస్ జగన్కు మా సమస్యలు చెప్పుకుంటాం.జగన్ పాలనలో మాకు గిట్టుబాటు ధర వచ్చింది. యార్డుకు వచ్చిన రైతులు..వైఎస్ జగన్ కోసం భారీగా తరలివచ్చిన రైతులు, ప్రజలుపోలీసులు చెక్పోస్టులు పెట్టినప్పటికీ రైతులు యార్డ్కు చేరుకున్నారు. వైఎస్ జగన్ కోసమే యార్డ్కు వచ్చినట్టు పలువురు కార్యకర్తలు, ప్రజలు తెలిపారు వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొనకుండా రైతులకు ఆటంకాలు.సమీప ప్రాంతాల్లో భారీగా పోలీసుల మోహరింపు.ఆటోలు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలు కనిపిస్తే సీజ్పోలీసుల ఆంక్షలను ఛేదించి యార్డుకు తరలివచ్చిన రైతులు. బంగారుపాళ్యం చేరుకున్న వైఎస్ జగన్ కాసేపట్లో మార్కెట్ యార్డ్కు వైఎస్ జగన్కూటమి సర్కార్ కుట్రలు, పోలీసులను చేధించిన రైతులుమామిడి మార్కెట్కు భారీ సంఖ్యలో తరలి వచ్చిన రైతులు, ప్రజలువైఎస్ జగన్ కోసం తరలిన అభిమానులు..వైఎస్ జగన్ పర్యటనకు భారీగా తరలివస్తున్న ప్రజలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలుఅడుగడుగునా అడ్డుకుంటున్న పోలీసులువైఎస్ జగన్ పర్యటనకు వచ్చేవారి వాహనాలు సీజ్ చేసి, చార్జ్షీట్ ఓపెన్ చేస్తామంటూ పోలీసుల బెదిరింపులుఅయినా తగ్గిన అభిమానులునడుచుకుంటూ వైఎస్ జగన్ని చూడటానికి వెళ్తున్న ప్రజలుబంగారుపాళ్యం వచ్చే రహదారులలో చెక్ పోస్టులు ఏర్పాటువైఎస్సార్సీపీ నేతలతో పోలీసులు వాగ్వాదం.కొన్నిచోట్ల పార్టీ కార్యకర్తలు, అభిమానులపై పోలీసుల లాఠీచార్జ్. బంగారుపాళ్యం బయలుదేరిన వైఎస్ జగన్కాసేపట్లో మామిడి మార్కెట్ యార్డ్కు వైఎస్ జగన్గిట్టుబాటు ధరలేక అల్లాడిపోతున్న రైతులు మామిడి రైతులను పరామర్శించనున్న వైఎస్ జగన్ చెక్పోస్టుల ఏర్పాటు.. తిరుపతి, కర్ణాటక ప్రధాన రహదారి నాలుగు ప్రాంతాలలో చెక్ పోస్ట్ ఏర్పాటుకర్వేటినగరం, చిత్తూరు మార్గమధ్యంలో రెండు చోట్ల చెక్పోస్టులుకొత్తపల్లి మిట్ట, గంగాధర నెల్లూరులో రెండు చెక్ పోస్టులు ఏర్పాటువాహనాలను అడ్డుకుంటున్న పోలీసులు.వైఎస్ జగన్ పర్యటన వచ్చే వాహనాలను సీజ్ చేస్తామంటున్న పోలీసులుఉదయం నుండి వాహనాలలో వస్తున్న అభిమానులు, పార్టీ నాయకులుప్రధాన నాయకులను అనుమతించి, ఇతర నాయకులను దింపేస్తున్న పోలీసులుభారీగా పోలీసుల మోహరింపువైఎస్ జగన్ పర్యటనపై ప్రభుత్వ కుట్రలుబంగారుపాళ్యం మామిడి యార్డును ఖాళీ చేయించిన అధికారులురైతులను రానివ్వకుండా యార్డుకు తాళాలురైతులను జగన్ పర్యటనలో పాల్గొననీయకుండా అడుగడుగునా ఆటంకాలుసమీప గ్రామాల్లో భారీగా పోలీసుల మోహరింపుఆటోలు, ట్రాక్టర్లు ఇతర వాహనాలు కనిపిస్తే సీజ్ చేస్తున్న పోలీసులుప్రభుత్వ చర్యలపై వైఎస్సార్సీపీ నేతల ఆగ్రహంపోలీసుల ఓవరాక్షన్బంగారుపాళ్యం చెక్ పోస్ట్ దగ్గర పోలీసుల ఓవరాక్షన్వైఎస్ జగన్ పర్యటనకు వచ్చే రైతులు, నాయకులు, కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులువాహనాలను సీజ్ చేస్తున్న పోలీసులుకూటమి ప్రభుత్వం, పోలీసుల వ్యవస్థతో నిరంకుశ పాలన కొనసాగిస్తుందని రైతుల ఆగ్రహంటోల్ గేట్ వద్దకు చేరుకున్న మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామినారాయణ స్వామి కామెంట్స్..జగన్ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని ప్రభుత్వం చూస్తుందివైఎస్ జగన్ అంటే కూటమి ప్రభుత్వానికి భయం.అందుకే అడుగడుగునా అడ్డుకుంటున్నారుచిత్తూరు జిల్లా బంగారుపాళ్యం రహదారుల్లో అడుగడుగునా ఆంక్షలుపోలీసులు ఆంక్షలు..బంగారుపాళ్యంలో ఆటంకాలు సృష్టిస్తున్న పోలీసులుబంగారుపాళ్యం మార్కెట్ యార్డుకు రైతులు రాకుండా వి.కోట మండలం కారకుంట వద్ద పోలీసుల తనిఖీలు, వీడియో రికార్డుబైరెడ్డిపల్లి మండలం కైగల్ వద్ద కుప్పం-పలమనేరు జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలుబంగారుపాళ్యం మండలం మిట్టపల్లి టోల్ గేట్ వద్ద పోలీసులు తనిఖీలు, వీడియో రికార్డింగ్ చేసిన తర్వాతనే అనుమతి చిత్తూరు..వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పర్యటనపై అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొనకూడదని వందలాది మందికి నోటీసులు జారీ చేయడం.. రౌడీషీట్లు తెరుస్తామని బెదిరించడం జరుగుతోంది.కూటమి నేతల బెదిరింపులు...దారుణంగా ధరల పతనంతో కుదేలైన మామిడి రైతుల దుస్థితిని నేరుగా తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు బుధవారం చిత్తూరు జిల్లా బంగారుపాళెం మార్కెట్ను సందర్శించనున్న మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పర్యటనకు టీడీపీ కూటమి సర్కారు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది.ఎన్ని ఆటంకాలు సృష్టించినా...మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలకు ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వస్తుండటంతో టీడీపీ కూటమి సర్కారు అడుగడుగునా ఆంక్షలు విధిస్తోంది. వైఎస్ జగన్ ఇటీవల నెల్లూరులో పర్యటించాల్సి ఉన్నా.. హెలికాప్టర్కు అనుమతులు ఇవ్వకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు బంగారుపాళ్యం పర్యటనను అడ్డుకునేందుకు కుట్రలకు తెర తీశారు.ఎన్ని ఆటంకాలు సృష్టించినా వైఎస్ జగన్ పర్యటనలో ఎటువంటి మార్పులు ఉండవని వైఎస్సార్సీపీ నేతలు తేల్చి చెప్పటంతో.. ఎట్టకేలకు అనుమతులు ఇస్తూనే హెలిప్యాడ్ వద్ద కేవలం 30 మంది, మార్కెట్ యార్డులో 500 మంది మాత్రమే ఉండాలంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. మంగళవారం ఉదయం నుంచి వైఎస్సార్ సీపీ కార్యకర్తలు సుమారు 400 మందికి నోటీసులు జారీ చేశారు.వైఎస్ జగన్ పర్యటన ఇలా... వైఎస్ జగన్ బుధవారం ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి చిత్తూరు జిల్లాకు బయలుదేరుతారు. బంగారుపాళ్యం మండలం కొత్తపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు ఉదయం 11 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఉదయం 11.20 గంటలకు బంగారుపాళ్యం మామిడి మార్కెట్కు చేరుకుని మామిడి రైతులతో సమావేశమవుతారు. వారి కష్టాలను స్వయంగా తెలుసుకుంటారు.

టీమిండియాతో మూడో టెస్టు.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన
ఆండర్సన్–టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు లార్డ్స్ వేదికగా గురువారం(జూలై 10) నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో లార్డ్స్ టెస్టు కోసం తమ ప్లేయింగ్ ఎలెవన్ను ఇంగ్లండ్ బుధవారం ప్రకటించింది.స్టార్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ 52 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇంగ్లండ్ టెస్టు జెర్సీలో కన్పించనున్నాడు. యువ పేసర్ జోష్ టాంగ్ స్ధానంలో ఆర్చర్ను తుది జట్టులోకి ఇంగ్లీష్ జట్టు మెనెజ్మెంట్ తీసుకుంది. రెండో టెస్టుకు ఆర్చర్ అందుబాటులోకి వచ్చినప్పటికి ఫిట్నెస్ సమస్యల కారణంగా బెంచ్కే పరిమితమ్యాడు.ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించడంతో టీమిండియాపై నిప్పులు చెరిగేందుకు ఈ స్పీడ్స్టార్ సిద్దమయ్యాడు. ఆర్చర్ చివరగా 2021లో ఇంగ్లండ్ తరపున టెస్టు మ్యాచ్ ఆడాడు. ఇక ఈ ఒక మార్పు మినహా రెండో టెస్టులో ఆడినే జట్టును ఇంగ్లండ్ కొనసాగించింది. తొలి రెండు టెస్టుల్లో విఫలమైన ఓపెనర్ జాక్ క్రాలీకి ఇంగ్లండ్ మెనెజ్మెంట్ మరో ఛాన్స్ ఇచ్చింది.ఈ మూడో టెస్టు కోసం లార్డ్స్ క్యూరేటర్స్ పచ్చికతో కూడిన పిచ్ను తాయారు చేశారు. దీంతో ఈ పిచ్పై ఫాస్ట్ బౌలర్లు పండగ చేసుకోనున్నారు. దీంతో ఈ వికెట్పై భారత బ్యాటర్లకు ఆర్చర్ గట్టి సవాల్ ఎదురుకానుంది. అయితే భారత జట్టులోకి జస్ప్రీత్ బుమ్రా తిరిగి రానునుండడంతో బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారనుంది. పిచ్ కండీషన్స్ దృష్టా మూడో టెస్టులో యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ కూడా ఆడే ఛాన్స్ ఉంది.ఇంగ్లండ్ తుది జట్టు..జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్ మరియు షోయబ్ బషీర్.

పోలీసుల్లారా.. చంద్రబాబు రేపు మిమ్మల్ని మోసం చేయొచ్చు
సాక్షి,చిత్తూరు: బంగారుపాళ్యంలో ఇవాళ పోలీసులు వ్యవహరించిన తీరును వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. రైతులను ఏదో రౌడీ షీటర్లుగా వ్యవహరిస్తూ దురుసుగా ప్రవర్తించారంటూ పోలీసులపై మండిపడ్డారాయన.‘రైతుల తలలు పగలకొడతారా? 1,200 మందిని జైల్లో పెడతారా?. రాష్ట్రంలో ఉంది పోలీసులా? రాక్షసులా?. కూటమి ప్రలోభాలు,లంచాలకు పోలీసులు లొంగొద్దు. రేపు పోలీసులను కూడా చంద్రబాబు మోసం చేయొచ్చు. అప్పుడు కూడా నేనే మీ తరుఫున పోరాటం చేయాల్సి వస్తుంది. ఒక్కటి గుర్తుంచుకోండి.. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు. రేపు రాబోయేది జగన్ ప్రభుత్వం. గుర్తుంచుకోండి’’ అని హితబోధ చేశారాయన. కనీస గిట్టుబాటు ధర లేక తీవ్ర కష్ట నష్టాల్లో కూరుకుపోయిన మామిడి రైతులను బుధవారం వైఎస్ జగన్ పరామర్శించారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్లో మామిడి రైతులను కలిసి, వారి సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా.. కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారాయన.

అప్పుడు మోర్బీ.. ఇప్పుడు గాంభీరా!
గుజరాత్లో జరిగిన ఘోర బ్రిడ్జి ప్రమాదం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉన్నట్లుండి బ్రిడ్జి చీలిపోయి కుప్పకూలిపోవడంతో.. ఐదు వాహనాలు మహీసాగర్ నదిలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఇప్పటిదాకా 10 మంది మరణించగా.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే.. 40 ఏళ్ల కిందట ప్రారంభమైన ఈ వంతెనకు మరమ్మత్తులు చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తుండడం విశేషం. గుజరాత్లోని వడోదర జిల్లాలో ఘోరం జరిగింది. పాడ్రా తాలుకాలో ఆనంద్-వడోదర జిల్లాలను కలిపే గాంభీరా వంతెనలో ఓ స్లాబ్ బుధవారం ఉదయం విరిగిపడింది. ఈ హఠాత్ పరిణామంతో రెండు ట్రక్కులు, రెండు వ్యానులు, ఓ ఆటో కింద ఉన్న మహీసాగర్ నదిలో పడిపోయాయి. ప్రమాదం ఉదయం వేళ ట్రాఫిక్ రద్దీ ఉన్న సమయంలోనే జరిగింది. ప్రమాదంలో ఇప్పటిదాకా 10 మంది మరణించారు. మరో 9 మందికి గాయాలయ్యాయి. పిల్లర్స్ మధ్య భాగం పూర్తిగా కుప్పకూలడంతో వాహనాలు నదిలో పడిపోయాయి. ఘటన సమయంలో ఓ ట్యాంకర్ బ్రిడ్జి అంచునకు వచ్చి ఆగిపోయింది. ఆ ట్యాంకరే అడ్డు లేకుంటే మరికొన్ని వాహనాలు పడిపోయి మరింత నష్టమే జరిగి ఉండేదని అధికారులు అంటున్నారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే.. అగ్నిమాపక బృందాలు, స్థానిక పోలీసులు, వడోదర జిల్లా యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యల్లో నిమగ్నమయ్యారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వడోదర కలెక్టర్ను సంప్రదించి.. గాయపడినవాళ్లకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్డు & భవనాల శాఖను ఈ ప్రమాదంపై తక్షణ విచారణ చేపట్టాలని ఆదేశించారాయన. ఫైర్ బ్రిగేడ్, బోట్లు, డైవర్స్, NDRF బృందాలు సంఘటనా స్థలంలో సహాయ చర్యలు చేపట్టాయి. క్రేన్ల సహాయంతో వాహనాల్ని వెలికితీసే ప్రయత్నం జరుగుతోంది. మరోవైపు.. ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ₹2 లక్షల ఎక్స్గ్రేషియా, గాయపడినవారికి ₹50,000 నష్ట పరిహారాన్ని పీఎంవో ప్రకటించింది. గాంభీరా బ్రిడ్జ్.. గుజరాత్-సౌరాష్ట్రను కలిపే కీలక మార్గం. 1985లో దీనిని ప్రారంభించారు. ఇది ఆనంద్, వడోదర, భరూచ్, అంక్లేశ్వర్ మధ్య ప్రయాణించే వారికీ ప్రధాన రూట్ కావడంతో నిత్యం వాహన రద్దీ ఉంటుంది. అయితే చాలా కాలంగా ఈ బ్రిడ్జి పాడైపోయిన స్థితిలో ఉందని, అధికారుల దృష్టికి తీసుకెళ్లిన కనీస స్పందన లేకుండా పోయిందని స్థానికులు అంటున్నారు. అంతేకాదు.. తరచూ ఈ వంతెన సూసైడ్ స్పాట్గా మారిందని, పోలీసులు కూడా ఇక్కడ నిఘా వహించడం లేదని విమర్శిస్తున్నారు. అయితే.. How this happened ? “The Gambhira Bridge connecting Vadodara and Anand has collapsed in the middle. Several vehicles are feared to have fallen into the river; rescue operations are ongoing.”The middle portion just vanished. #Vadodara pic.twitter.com/t2yZSoXexz— Kumar Manish (@kumarmanish9) July 9, 2025ప్రభుత్వం ఈ విమర్శలను తోసిపుచ్చింది. బ్రిడ్జికి అవసరమైనప్పుడు మరమ్మతులు జరుగుతున్నాయని, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం దర్యాప్తులోనే బయటపడుతుందని గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి రిషికేష్ పటేల్ అంటున్నారు. తాజా గాంభీరా బ్రిడ్జి ప్రమాద నేపథ్యంలో.. మూడేళ్ల కిందట జరిగిన గుజరాత్ మోర్బీ బ్రిడ్జి ప్రమాదం తెర మీదకు వచ్చింది. మోర్బీ బ్రిడ్జ్ ప్రమాదం.. భారతదేశంలో అత్యంత ఘోరమైన ఘటనలలో ఒకటి. 2022 అక్టోబర్ 30వ తేదీన మోర్బీ జిల్లా కేంద్రంలో మచ్చు నదిపై ఉన్న జూల్తో పుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనలో 141 మంది మరణించారు. 19వ శతాబ్దంలో నిర్మించిన ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్.. మరమ్మత్తుల తర్వాత అక్టోబర్ 26న తిరిగి ప్రారంభమైంది, అయితే ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండానే ఈ బ్రిడ్జిని తెరిచినట్టు తేలింది. కేబుల్స్ తుప్పుపట్టినవి, బోల్టులు సడలిపోయినవి, అధిక బరువు ఉన్న ఫ్లోరింగ్ వేశారని ఫోరెన్సిక్ నివేదిక తెలిపింది. ఓరేవా గ్రూప్ అనే ప్రైవేట్ సంస్థ బ్రిడ్జ్ నిర్వహణ బాధ్యత తీసుకుంది, కానీ సరైన అనుమతులు లేకుండానే తెరిచినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. #Gujarat Sad news coming, of a Cable Bridge collapse in Morbi of Gujarat, reports of many injuries as per initial reports.PM @narendramodi ji seeks urgent mobilisation of teams for rescue ops after cable bridge collapse in Gujarat's Morbi#PMModi #Gujarat #Morbi #Cablebridge pic.twitter.com/RyTA7nXeVm— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) October 30, 2022 ప్రమాదం జరిగిన సమయంలో 500 మందికి పైగా బ్రిడ్జ్పై ఉన్నారు, కానీ దాని సామర్థ్యం 125 మంది మాత్రమే. బ్రిడ్జ్ సడెన్గా విరిగిపడి, ప్రజలు మచ్చ్ఛు నదిలో పడిపోయారు. మృతుల్లో చాలా మంది పిల్లలు, మహిళలు, వృద్ధులు ఉన్నారు. ఈ ఘటనపై గుజరాత్ ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీ వేయించి దర్యాప్తు చేయించింది. ఈ కేసులో ఓరేవా సంస్థ మేనేజర్లు, టికెట్ క్లర్కులు, కాంట్రాక్టర్లు, సెక్యూరిటీ గార్డులు.. మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు. ప్రధానమంత్రి మోదీ సంఘటన స్థలాన్ని సందర్శించి, బాధిత కుటుంబాలకు పరామర్శ తెలిపారు కూడా.

అత్త పాపిట తిలకం దిద్ది.. !
పాత పరిచయాలు.. వివాహేతర సంబంధాలతో భార్యలను భర్తలు, భర్తలను భార్యలు కడతేర్చడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ఈ క్రమంలో ఈ తరహా నేరాలపై జనాల్లోనూ ఆసక్తి పెరిగిపోతోంది. తాజాగా.. తన బార్యతో సంబంధం పెట్టుకున్నాడంటూ ఓ యువకుడిని చితకబాది వివాహం జరిపించిన ఘటన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ రాక్షస వివాహం జరిపించింది అతని మామే కావడం మరో విశేషం.బీహార్ సుపౌల్ జిల్లాలో దారుణం జరిగింది. తన అత్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడంటూ ఓ యువకుడ్ని చితకబాది.. అతనితో ఆమెకు బలవంతంగా వివాహం జరిపించారు. పైగా ఆ వివాహం జరిపించింది అతని మామనే కావడం గమనార్హం. ఈ ఘటనలో తీవ్రంగా గాయాలపాలైన యువకుడు.. చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు.. భీంపూర్ పీఎస్ పరిధిలో జీవ్ఛాపూర్ వార్డు నంబర్ 8కి చెందిన 24 ఏళ్ల మిథిలేష్ కుమార్ను జులై 2వ తేదీన కొందరు వ్యక్తులు బలవంతంగా ఇంట్లో నుంచి లాక్కెళ్లారు. మిథిలేష్ను తన ఇంటికి తీసుకెళ్లిన మామ శివ్చంద్ర తన ఇంట్లో పంచాయితీ పెట్టాడు. శివచంద్రకు భార్య రీటా దేవి, నాలుగేళ్ల కొడుకు ఉన్నారు. అయితే రీటాదేవితో వివాహేతర సంబంధం ఉందని చెబుతూ మిథిలేష్ను చితకబాదాడు. అదే సమయంలో ..అక్కడికొచ్చిన జనాలు రాడ్లు, కర్రలతో మిథిలేష్ను కొట్టారు. మరికొందరు గ్రామస్తులు ఇటు రీటాను చితకబాదారు. ఆపై బలవంతంగా మిథిలేష్తో రీటా నుదుట సిందూరం దిద్దించి.. వివాహం జరిగినట్లు శివ్చంద్ర ప్రకటించాడు. అడ్డొచ్చిన బాధితుడి తండ్రి రామచంద్రను, తల్లిని సైతం ఆ జనాలు కొట్టారు. ఈలోపు గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి రాగా.. శివ్చంద్ర అండ్ గ్యాంగ్ అక్కడి నుంచి పారిపోయింది. తీవ్ర గాయాలతో మిథిలేష్ అక్కడికక్కడే కుప్పకూలిపోగా.. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.बिहार के सुपौल जिले में रिश्तों को तार-तार करने वाली घटना सामने आई है. जिले के भीमपुर थाना क्षेत्र में एक भतीजे से जबरदस्ती उसकी चाची की मांग भरवाई गई और शादी कराई गई. दरअसल, परिजनों और ग्रामीणों का आरोप है कि दोनों के बीच अवैध संबंध थे, जिसके चलते गांव वालों ने पहले उनके साथ… pic.twitter.com/p5Md89BvkE— ABP News (@ABPNews) July 8, 2025

2025లో టాప్ సినిమా ఏదో తెలుసా? 500% లాభాలు తెచ్చిపెట్టిన మూవీ
కొత్త సంవత్సరం మొదలై ఆరు నెలలు గడిచిపోయాయి. ఈ ఫస్టాఫ్లో ఎన్నో సినిమాలు రిలీజయ్యాయి. బాక్సాఫీస్ మీద కనక వర్షం కురిపించిన సినిమాలు కొన్నయితే నిర్మాతల నెత్తిన గుదిబండ వేసిన చిత్రాలు మరికొన్ని. అయితే వీటన్నింటినీ జల్లెడపట్టిన ఐఎమ్డీబీ (IMDB).. 2025 ఫస్టాఫ్- మోస్ట్ పాపులర్ ఇండియన్ చిత్రాల జాబితాను రిలీజ్ చేసింది.ఫస్టాఫ్లో టాప్ 102025లో జనవరి 1 నుంచి జూలై 1 మధ్య విడుదలైన సినిమాలను పరిగణనలోకి తీసుకుంది. ఆరు, అంత కంటే ఎక్కువ రేటింగ్ వచ్చిన చిత్రాలను తన జాబితాలో పొందుపరిచింది. టాప్ 10లో అత్యధికంగా బాలీవుడ్ నుంచే ఆరు సినిమాలున్నాయి. అందరూ ఊహించినట్లుగానే విక్కీ కౌశల్ ఛావా సినిమా మొట్టమొదటి స్థానంలో ఉంది. రూ.130 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.809 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. టాప్ 5లో ఏమున్నాయ్?మరాఠా యోధుడు శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు 500% లాభాలను తెచ్చిపెట్టింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక మందన్నా, దివ్య దత్తా, వినీత్ కుమార్ సింగ్ కీలక పాత్రలు పోషించారు. 2025లో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్ మూవీగా ఛావా రికార్డు సృష్టించింది. తమిళ సినిమా డ్రాగన్ రెండో స్థానంలో ఉంది. కోలీవుడ్ నుంచి 3 సినిమాలుబాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన షాహిద్ కపూర్ దేవా మూడో స్థానంలో ఉండటం గమనార్హం. అజయ్ దేవ్గణ్ రైడ్ 2 నాలుగో స్థానంలో, సూర్య రెట్రో ఐదో స్థానంలో ఉన్నాయి. ద డిప్లొమాట్, ఎల్ 2: ఎంపురాన్, సితారే జమీన్ పర్, కేసరి చాప్టర్ 2, విడాముయర్చి టాప్ 6 నుంచి 10 స్థానాల్లో నిలిచాయి. టాప్ 10లో తమిళం నుంచి మూడు, మలయాళం నుంచి ఒక మూవీ జాబితాలో ఉంది. టాలీవుడ్ నుంచి ఏ సినిమా కూడా ఈ లిస్ట్లో చోటు దక్కించుకోలేకపోయింది. View this post on Instagram A post shared by IMDb India (@imdb_in) చదవండి: సినిమాలు మానేసి సెలూన్లో పని చేశా.. 10th ఫెయిలైనా..

ఏపీ యువకుడి టెక్ టాలెంట్కు హ్యాట్సాఫ్ .. టైంకు కాలేజీకి వెళ్లాలనే..
మనలో చాలామంది వ్యయప్రయాసలు ఓర్చి కాలేజీలకు వెళ్తుంటారు. అందరికీ ఏం కాలేజ్లు దగ్గరగా ఉండవు. బస్సు పాస్లు తీసుకోవడం లేక సైకిల్పైనో తిప్పలు పడి వెళ్తాం. కానీ టాలెంట్ ఉన్నోడు ఆ ఇబ్బందికే చెక్పెట్టేలా ఏదైనా చేయాలనుకుంటాడు. కాస్త టెక్నాలజీ తెలిస్తే..ఏ అత్యాధునిక సైకిల్నో లేక బైక్నో తయారు చేస్తాడు. అలాంటి సూపర్ టాలెంటెడ్ ఈ స్టూడెంట్. అతడే ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాకు చెందిన రాజపు సిద్ధు. అతడి తల్లిదండ్రులు వృత్తిరీత్యా చెన్నై ఉంటారు. అందువల్ల సిద్ధూ తన సోదరితో కలిసి అమ్మమ్మ ఇంటిలో ఉండి చదువుకుంటున్నాడు. ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న సిద్ధూకి తన గ్రామం నుంచి కాలేజ్కి దాదాపు 17 కిలోమీటర్లు దూరం ఉంటుంది. అందుకోసం సిద్ధు ప్రధాన రహదారికి సుమారు 3 కి.మీ దూరం నడిచి, ఆపై మరో 14 కిలోమీటర్లు బస్సు లేదా ఆటోపై ఆధారపడి వెళ్లాల్సిందే కాలేజ్కి. అందుకు రోజుకు దాదాపు రూ. 60ల దాక ఖర్చు అవుతుంది. పోనీ ఇంత వ్యయప్రయాసలు పడ్డా..సమయానికి కాలేజ్కి చేరుకోవడం దాదాపు అసాధ్యంగానే ఉండేది. ఎలా చేసినా సిద్ధుకి సమయాపాలన పాటించడం అస్సలు సాధ్యమయ్యేది కాదు. అప్పుడే బ్రెయిన్లో బ్యాటరీతో నడిచే సైకిల్ని తయారుచేస్తే అనే ఆలోచన తట్టింది. అందుకోసం వేసకి కాలం సెలవులే బెస్ట్ అని నిర్ణయించుకున్నాడు. తాను అనుకున్నట్లుగానే ఈ వేసవి సెలవుల్లో తన ఆలోచనకు రూపం ఇచ్చాడు. అందుకోసం తన పాకెట్ మనీ రూ. 35,000 ఖర్చు చేసి ఢిల్లీ, రాజస్థాన్ నుంచి విడి భాగాలు తెప్పించుకున్నాడు. తన పాఠశాల రోజుల్లో అటల్ టింకరింగ్ లాబొరేటరీ (ATL)లో నేర్చుకున్న రోబోటిక్స్ సాంకేతికతకు పదును పెట్టి మరి ఎలక్ట్రిక్ సైకిల్ని రూపొందించాలనుకున్నాడు. అందుకోసం తన ఏటీఎల్(ATL) గురువు వై ఈశ్వరరావు మార్గదర్శకత్వం, తన స్నేహితుడు జగ్గుపల్లి రాజేష్ల సాయం తీసుకుని మరీ చివరికి ఎలక్ట్రిక్ సైకిల్ని రూపొందించాడు. హబ్ మోటార్, యాక్సిలరేటర్, మూడు గేర్లు కలిగి ఉన్న ఈ-సైకిల్ని అసెంబుల్ చేశాడు. ఈ సైకిల్ దాదాపు 12 కిలోల బరువు మోయగలదు. అలాగే 25 నుంచి 50 కి.మీల స్పీడ్లో పోగల సామర్థ్యం ఉంది. పూర్తి ఛార్జ్తో దాదాపు 80 కిలోమీటర్ల వరకు మైలేజ్ వస్తుంది. అది కూడా మూడున్నర గంటల్లో తీసుకుపోగలదు. ఇప్పుడు ఈ-సైకిల్తో సిద్ధూకి కేవలం రూ. 6లే ఖర్చు అవుతోంది. పైగా కళాశాలకు టైంకి చేరుకుంటున్నా అని సగర్వంగా చెబుతున్నాడు సిద్ధు. అయితే ఈ సైకిల్లో పిలియన్ సీటు(రైడర్ వెనుక సీటు) కూడా ఉండటం విశేషం. అలాగే సిద్ధూ ఈ ఎలక్ట్రిక్ సైకిల్ని మరింత మెరుగైన డిజైన్లో రూపొందించే యత్నం చేస్తున్నట్లు వివరించాడు. నేర్చుకున్న విద్య అవసరానికి ఉపయోగపడటం అంటే ఇదే కదూ..!. ఏదో చదివేశామా..! మార్కులు వచ్చేశాయా.. అని కాదు..అది అప్లికేషన్లో కనిపించాలి. మన మనుగడకు లేదా రక్షణకు ఉపయోగపడాలి. అదే నిజమైన విద్య అని తన చేతల ద్వారా చూపించాడు ఈ విజయనగరం కుర్రాడు.(చదవండి: పానీపూరి అమ్మే వ్యక్తి కొడుకు ఘనత..! ఇంటర్ ఫెయిల్ నుంచి ఏకంగా ఐఐటీలో..)

కరెక్ట్ కాదు.. గైక్వాడ్ వీడియోపై ఫడ్నవిస్ స్పందన
శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ తీరుపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అసహనం వ్యక్తం చేశారు. పప్పు బాగోలేదంటూ క్యాంటీన్ ఆపరేటర్ను గైక్వాడ్ చితకబాదిన సంగతి తెలిసిందే. రాజకీయ విమర్శల నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఫడ్నవిస్ స్పందించారు. ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్(Sanjay Gaikwad) తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఇలాంటి ప్రవర్తనను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని అన్నారాయన. ‘‘ఆయన వీడియో చూశాను. ఇలాంటి ప్రవర్తన సరికాదు. ప్రజాప్రతినిధుల ప్రతిష్టను మసకబార్చేదిగా ఉంది. అధికార దుర్వినియోగం చేస్తున్నారని ప్రజలు భావించే అవకాశం ఉంది. ఈ తరహా ఘటనలు జరిగినప్పుడు ఫిర్యాదుల ద్వారా పరిష్కరించాలే తప్ప.. ఇలా దాడులతో కాదు’’ అని ఫడ్నవిస్ మీడియాతో అన్నారు. శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్.. ముంబైలోని ఆకాశవాణి ఎమ్మెల్యే హాస్టల్లో పప్పు బాగోలేదంటూ క్యాంటీన్ సిబ్బందిపై చేయి చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. దీంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే గైక్వాడ్ మాత్రం తన చర్యను సమర్థించుకుంటున్నారు. పాడైపోయిన ఆహారం పెడుతున్నారంటూ ఎన్నిసార్లు చెప్పినా వాళ్ల ప్రవర్తనలో మార్పు రావడం లేదని, అందుకే అలా చేయాల్సి వచ్చిందని అన్నారాయాన. అంతేకాదు.. వర్షాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తుతానని చెబుతున్నారాయన.Shiv Sena (Shinde group) MLA Sanjay Gaikwad allegedly assaulted staff at the MLA canteen near the State Secretariat in Mumbai. #SanjayGaikwad #MLACanteen #MaharashtraPolitics #Shivsena #bjp pic.twitter.com/NCXaf1rdgJ— YourDailyNews (@yourdailynews9) July 9, 2025మరోవైపు సంజయ్ గైక్వాడ్ దాడి వీడియోపై ఉద్దశ్ శివసేన వర్గం భగ్గుమంది. అయితే.. సంజయ్ గైక్వాడ్కు వివాదాలు కొత్తేం కాదు. కిందటి ఏడాది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బుల్దానా నియోజకవర్గం నుంచి షిండే శివసేన తరఫున కేవలం 841 ఓట్ల తేడాతో గైక్వాడ్ గెలుపొందారు.2024 సెప్టెంబర్లో.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, ఆయన నాలుక కోసిన వారికి ₹11 లక్షల బహుమతి ప్రకటించారు. రాహుల్ గాంధీ అమెరికాలో చేసిన వ్యాఖ్యలు బీసీలకు వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయంటూ గైక్వాడ్ ఈ ప్రకటన చేసి విమర్శలు ఎదుర్కొన్నారు.2024 ఏప్రిల్లో.. మహారాష్ట్ర పోలీసులను ప్రపంచంలోనే అత్యంత అసమర్థమైన అధికారులుగా అభివర్ణించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై ఫడ్నవిస్ అసహనం వ్యక్తం చేస్తూ ఏక్నాథ్ షిండేకు ఫోన్ చేశారు. ఆపైన గైక్వాడ్ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.2023 మార్చిలో.. ఒక యువకుడిని పోలీస్ లాఠీతో కొడుతున్న వీడియో వైరల్ అయింది.2021లో.. అప్పటి సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కరోనాను రాజకీయంగా వాడుకుంటున్నారని విమర్శిస్తూ.. కరోనా గనుక తన చేతికి దొరికితే ఫడ్నవిస్ నోట కుక్కి కథ ముగిస్తానంటూ వ్యాఖ్యానించి విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ వ్యాఖ్యలకుగానూ బీజేపీ ఆయనపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. 1987లో పులిని వేటాడానని చెబుతూ.. దాని పళ్లను లాకెట్గా ధరించానని చెప్పడంతో వన్యప్రాణుల చట్టం ఉల్లంఘన కింద సంజయ్ గైక్వాడ్ మీద కేసు నమోదైంది.తాజాగా: ముంబయిలోని ఎమ్మెల్యే హాస్టల్లో పాడైపోయిన పప్పు ఇచ్చారన్న కారణంతో కాంటీన్ సిబ్బందిని చెంపదెబ్బతో కొట్టిన వీడియో వైరల్ అయింది.

ఏం గుండె సామీ నీది..? కింగ్ కోబ్రా రియల్గా..
పాముల్లో రాజు..కాటేసిందో అంతే మటాష్ అంత భయంకరమైన పాయిజినస్ పాము కింగ్ కోబ్రా. దాన్ని చూస్తేనే భయం. అవి చాలా భయంకరమైన కారడవుల్లో ఉంటాయని విన్నాం, పలు వీడియోల్లో చూశాం. కానీ రియల్గా దాని సైజు ఎంత ఉంటుందన్నది ఎవ్వరికీ తెలియదు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే..వామ్మో అని ఆశ్చర్యపోవడం మాత్రం ఖాయం.ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్ అందుకు సంబంధించిన 11 సెకన్ల క్లిప్ని నెట్టింట షేర్ చేశారు. అందులో ఒక వ్యక్తి చాలా నిర్భయంగా భారీ కింగ్ కోబ్రాని ఉత్తిచేతులతో పట్టుకుని నిలబడినట్లు కనిపిస్తుంది. ఆ భారీ కింగ్ కోబ్రాని పట్టుకున్నానన్న భయం, బెరుకు లేకుండా చాలా ప్రశాంతంగా పట్టుకుని నిల్చున్న తీరు చూస్తే..వామ్మో ఏం గుండె రా నీది అని అనిపించక మానదు. ఈ వీడియోకి పర్వీన్ ఈ పాములు భారతదేశంలో ఎక్కడుంటాయో తెలుసా అనే క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి మరి..!.(చదవండి: చీర ధరించడం బాగానే ఉంది..! కానీ ఇలానా..?: వీడియో వైరల్)

వైఎస్సార్సీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్.. పోలీసులపై వైఎస్ జగన్ సీరియస్
సాక్షి, చిత్తూరు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన నేపథ్యంలో అభిమానులు, రైతులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బంగారుపాళ్యంకు తరలివచ్చారు. వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు అడ్డంకులు సృష్టించారు. అయినప్పటికీ అభిమానులు, కార్యకర్తలు తమ ప్రియతమ నాయకుడి కోసం తరలివచ్చారు. ఈ క్రమంలో వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈనేపథ్యంలో పోలీసుల ఓవరాక్షన్, లాఠీచార్జ్పై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారుపాళ్యంలో పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో వైఎస్సార్సీపీ నాయకుడు తీవ్రంగా గాయపడ్డారు. చంద్రగిరి యువజన విభాగం కార్యదర్శిపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో అతడి తలకు బలమైన గాయమై.. రక్తస్రావం జరిగింది. ఈ విషయం తెలిసి.. బంగారుపాళ్యం వద్ద కారు దిగేందుకు వైఎస్ జగన్ ప్రయత్నించారు. వైఎస్సార్సీపీ శ్రేణులను కొట్టారని కారు దిగేందుకు వైఎస్ జగన్కు తెలియడంతో కారును ఆపారు. లాఠీచార్జ్లో గాయపడిన కార్యకర్త వద్దకు వెళ్లేందుకు జగన్ ప్రయత్నించారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ను కారు దిగకుండా ఎస్పీ మణికంఠ అడ్డుకుని ఓవరాక్షన్ చేశారు. వైఎస్ జగన్ కారు దిగకుండా.. అక్కడి నుంచి పంపించేశారు.దీంతో, చిత్తూరు పోలీసులపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల లాఠీచార్జ్పై వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. గాయపడిన పార్టీ నేతను పరామర్శించనివ్వరా అంటూ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదెక్కడి న్యాయం అంటూ మండిపడ్డారు. మరోవైపు.. బంగారుపాళ్యంలో పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. పోలీసుల చెక్ పోస్టులు, వాహనాల తనిఖీలు చేస్తూ.. వైఎస్ జగన్ కాన్వాయ్ వాహనాలనూ లెక్కించి పంపుతున్నారు. హెలిప్యాడ్ నుండి మార్కెట్ యార్డు వరకు రోడ్డు పొడవునా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. తనిఖీల్లో భాగంగా ఒక ఎస్కాట్ వాహనాన్ని కూడా పోలీసులు ఆపేశారు. వైఎస్సార్సీపీ నేతల కార్లకూ అనుమతి లేదంటూ నిలిపివేశారు. హైవే మీద బారికేడ్లు పెట్టి ట్రాఫిక్కు అంతరాయం కలిగించారు.
గుర్తుపట్టలేని విధంగా స్టార్ హీరో.. ఎవరో కనిపెట్టారా?
తండ్రి కాబోతున్న స్త్రీ-2 నటుడు.. సోషల్ మీడియాలో పోస్ట్
ఏపీ యువకుడి టెక్ టాలెంట్కు హ్యాట్సాఫ్ .. టైంకు కాలేజీకి వెళ్లాలనే..
శ్రీలంకకు ఊహించని షాక్.. స్టార్ ప్లేయర్కు గాయం
సెలబ్రిటీల పెట్స్ : లైఫ్స్టైల్గా మారిన పెట్స్ పెంపకం
ముగ్గురు మూర్ఖులు.. జనం సొమ్ముతో సోకులు
ఎగిరే ఉడుతను చూశారా?
టీమిండియాతో మూడో టెస్టు.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన
టాలీవుడ్లో నెపోటిజం.. ఇక్కడ పనిచేయవు.. ఆ హీరోకు మంచు మనోజ్ కౌంటరిచ్చాడా!
Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!
పెరుగుతున్న కార్మిక కొరత.. జనాభా సంక్షోభం
'కన్పప్ప'లో వాళ్లను చూస్తుంటే ఇరిటేషన్ వచ్చింది: తమ్మారెడ్డి భరద్వాజ
Telangana: ఆదివారం మద్యం, మాంసం బంద్
'ఫిష్ వెంకట్' కోసం రూ. 2 లక్షలు పంపిన సినీ హీరో
ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్మన్ గిల్
ఈ రాశి వారికి వ్యాపారాలలో లాభాలు.. ఆకస్మిక ధనలాభం
తమాషాలు చేస్తున్నారా....సరెండర్ చేస్తా
అలాగే, తనకు నోబెల్ వచ్చేటట్లు అర్జంటుగా ఏదైనా ఒక చట్టం చేయమంటున్నారు!!
సర్కారు ఇప్పుడొద్దన్నవారికీ ఇందిరమ్మ ఇళ్లు!
టెక్సాస్లో వరదలొచ్చాయని, పుతిన్ మాట వినడం లేదనే కోపంతో ఇతర దేశాలపై సుంకాలు విధించడం కరెక్ట్ కాదేమో సార్!
శాంతించిన వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసం డోసు కాస్త తగ్గింది..!
ఈ రాశి వారికి నూతన ఉద్యోగప్రాప్తి.. భూలాభాలు
డేట్ ఫిక్స్?
సంగీత దర్శకుడు కీరవాణి ఇంట విషాదం
మస్క్ అమెరికా పార్టీ అమెరికన్ల స్వేచ్ఛ కోసమేనని వ్యాఖ్యలు
ఈ రాశి వారికి వ్యాపారాలలో మార్పులు
ఉద్యోగులు పూర్తిగా మోసపోయారు
సొంతంగా ఫ్లైఓవర్ కట్టుకుంటున్న రియల్ఎస్టేట్ కంపెనీ
ఒక్క నిమిషంలో నీ జబ్బేంటో ఇప్పుడే చెప్పేస్తా!
రెడ్బుక్కు రెడ్ సిగ్నల్!
గుర్తుపట్టలేని విధంగా స్టార్ హీరో.. ఎవరో కనిపెట్టారా?
తండ్రి కాబోతున్న స్త్రీ-2 నటుడు.. సోషల్ మీడియాలో పోస్ట్
ఏపీ యువకుడి టెక్ టాలెంట్కు హ్యాట్సాఫ్ .. టైంకు కాలేజీకి వెళ్లాలనే..
శ్రీలంకకు ఊహించని షాక్.. స్టార్ ప్లేయర్కు గాయం
సెలబ్రిటీల పెట్స్ : లైఫ్స్టైల్గా మారిన పెట్స్ పెంపకం
ముగ్గురు మూర్ఖులు.. జనం సొమ్ముతో సోకులు
ఎగిరే ఉడుతను చూశారా?
టీమిండియాతో మూడో టెస్టు.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన
టాలీవుడ్లో నెపోటిజం.. ఇక్కడ పనిచేయవు.. ఆ హీరోకు మంచు మనోజ్ కౌంటరిచ్చాడా!
Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!
పెరుగుతున్న కార్మిక కొరత.. జనాభా సంక్షోభం
'కన్పప్ప'లో వాళ్లను చూస్తుంటే ఇరిటేషన్ వచ్చింది: తమ్మారెడ్డి భరద్వాజ
Telangana: ఆదివారం మద్యం, మాంసం బంద్
'ఫిష్ వెంకట్' కోసం రూ. 2 లక్షలు పంపిన సినీ హీరో
ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్మన్ గిల్
ఈ రాశి వారికి వ్యాపారాలలో లాభాలు.. ఆకస్మిక ధనలాభం
తమాషాలు చేస్తున్నారా....సరెండర్ చేస్తా
అలాగే, తనకు నోబెల్ వచ్చేటట్లు అర్జంటుగా ఏదైనా ఒక చట్టం చేయమంటున్నారు!!
సర్కారు ఇప్పుడొద్దన్నవారికీ ఇందిరమ్మ ఇళ్లు!
టెక్సాస్లో వరదలొచ్చాయని, పుతిన్ మాట వినడం లేదనే కోపంతో ఇతర దేశాలపై సుంకాలు విధించడం కరెక్ట్ కాదేమో సార్!
శాంతించిన వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసం డోసు కాస్త తగ్గింది..!
ఈ రాశి వారికి నూతన ఉద్యోగప్రాప్తి.. భూలాభాలు
డేట్ ఫిక్స్?
సంగీత దర్శకుడు కీరవాణి ఇంట విషాదం
మస్క్ అమెరికా పార్టీ అమెరికన్ల స్వేచ్ఛ కోసమేనని వ్యాఖ్యలు
ఈ రాశి వారికి వ్యాపారాలలో మార్పులు
సొంతంగా ఫ్లైఓవర్ కట్టుకుంటున్న రియల్ఎస్టేట్ కంపెనీ
ఉద్యోగులు పూర్తిగా మోసపోయారు
ఒక్క నిమిషంలో నీ జబ్బేంటో ఇప్పుడే చెప్పేస్తా!
రెడ్బుక్కు రెడ్ సిగ్నల్!
సినిమా

బాలీవుడ్ ఫస్టాఫ్ రిపోర్ట్.. అభినయంతో ఆకట్టుకున్న స్టార్స్ వీళ్లే!
సాధారణంగా సినిమా జయాపజయాలను కలెక్షన్లతో ముడిపెడతారు. అలాగే ప్రతీ ఏటా కలెక్షన్లను అనుసరించి ఆ సంవత్సరపు క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ సినిమా ఫలితాలను స్టార్ల స్టార్ డమ్ను విశ్లేషించడం కూడా రివాజు. అయితే ఈ సంప్రదాయానికి విరుద్ధంగా.. నటీనటుల అభినయం పరంగా ఈ విశ్లేషణ మొదలైనట్టు కనిపిస్తోంది. బాలీవుడ్ మీడియా దీనికి శ్రీకారం చుట్టింది. తాజాగా ఈ ఏడాది అర్ధభాగంలో విడుదలైన సినిమాలను తీసుకుని వాటిలో అభినయం ద్వారా ప్రభావం చూపిన స్టార్స్ను గుర్తిస్తోంది. అందులో భాగంగా 8మంది తారల్ని ప్రకటించింది. అర్ధభాగంలో అభినయంతో ఆకట్టుకున్న ఆ నటీనటులు ఎవరంటే...అభిషేక్ బెనర్జీస్టోలెన్ సినిమాలో నటించిన అభిషేక్ బెనర్జీ ఆ సినిమాని అమాంతం ప్రేక్షకుల హృదయాల్లో కూర్చోబెట్టారు. ఈ చిత్రంలో ప్రతీ భావాన్ని నిజంగా అన్నట్టు ప్రతిబింబించాడాయన. అతని నటన ఆ చిత్ర ప్రేక్షకులు పొందిన అనుభూతిని ఆకాశానికి తాకించింది. తరచూ నిశ్శబ్ధాన్ని ఆశ్రయిస్తూ ప్రేక్షకుల మనసుల్లో నిశ్శబ్ధంగా నిలిచిపోయింది.సన్యా మల్హోత్రామిస్ట్రెస్ సినిమాలో నటించిన సన్యా మల్హోత్రా కూడా ఈ జాబితాలో స్థానాన్ని అందుకుంది. ఈ సినిమాలో ఆమె పాత్ర సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసింది. ఒక మహిళగా ఈక్వాలిటీ కోసం పోరాడటం, ఊహించని ఒత్తిడి ఎదుర్కోవడం – ఆమె వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడం, ఇలాంటి పాత్ర పోషించడం సులభం కాదు. కానీ ఆమె ఆ పాత్రకు జీవం పోసింది.ఆదర్శ్ గౌరవ్సూపర్ బాయ్స్ ఆఫ్ మాలెగావ్ సినిమాలో ఆదర్శ్ గౌరవ్ పాత్రను మరచిపోవడం అంత సులభం కాదు. అందుకే అంత సులభంగా అతను ఫేమస్ అయ్యాడు. చిన్న పట్టణపు యువత కలలను ప్రతిబింబించడంతో పాటు హాస్య–భావాలను మనసుతో పలికించడం ద్వారా అతను అందరికీ గుర్తుండి పోయాడు.వామికా గబ్బీబూల్ చుక్ మాఫ్ చిత్రంలో నటించిన వామికా గబ్బీ ప్రేమచుట్టూ అల్లుకునే అనేక సమస్యలను వాటిని ఎదుర్కున్న తీరును ఆమె పాత్ర కొత్తగా పరిచయం చేస్తుంది. తెరపై అద్భుతమైన భావాలను చూపెట్టిన వామికా గబ్బీ..ఈ ఏడాది గట్టి ప్రభావం చూపిన నటీమణుల్లో ఒకరుగా నిలిచింది.రణదీప్ హుడామంచి విజయాన్ని సాధించిన జాట్ సినిమాలో రణదీప్ హుడా వీరానురాగాన్ని చూపిస్తూ విలనిజాన్ని ప్రదర్శించాడు. అతని పాత్ర అంత భయంకరంగా కనిపించకపోతే ఆ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకునేది కాదేమో..రణదీప్ నటన జాట్ను ఒక సినిమాగా మాత్రమే కాదు ఒక అనుభవంగా మార్చింది. కాజోల్ఇప్పటికే అనేక పాత్రల ద్వారా తనను తాను నిరూపించుకున్న సీనియర్ నటి కాజోల్... మా సినిమాలో మరింతగా ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంది. మాతృత్వ బాధ్యతల్లో మునిగి పోయిన ఒక సగటు తల్లిగా కాజోల్, పటిష్టంగా పలికించిన భావోద్వేగాల లోతు అంతరంగాల్ని తాకుతుంది.విక్కీ కౌశల్చావా సినిమా సృష్టించిన సంచలనాల గురించి చెప్పుకోవడం ఎంత ముఖ్యమో ఆ సినిమాలో నటించిన విక్కీ కౌశల్ గురించి మాట్లాడడం అంతకన్నా ముఖ్యం. మరాఠా వీరుడు శంభూజీ మహరాజ్ ను ప్రేక్షకుల కళ్ల ముందు అతను ప్రతిష్టించిన తీరు అమోఘం. దేశంలో అత్యధిక శాతం మందికి అంతగా పరిచయం లేని ఓ వీరుని కధను పరిచయం చేయడం మాత్రమే కాదు వారి గుండెల్లో నిలిచిపోయేలా చేయడంలో విక్కీ...విజయం సాధించాడు.అమీర్ఖాన్...భావోద్వేగ భరిత సినిమాల ద్వారా భారీ విజయాల్ని అందుకోవడంలో తానెందుకు మిగిలిన హీరోల కన్నా ముందుంటాడో చాటి చెప్పడంలో అమీర్ఖాన్ మరోసారి విజయం సాధించాడు. సితారే జమీన్ పర్ లో అమీర్ ఖాన్ తన స్టార్ డమ్ ద్వారా కళ్ల ముందు మెరుపులు మెరిపించడం కన్నా... మన హృదయాలను స్పర్శించడానికే ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ పనిలో ఆయన విజయం సాధించాడు.

నేను చాలా సెల్ఫిష్.. ప్రజల కోసం జీవితం త్యాగం చేయలేను: కంగనా
సామాన్యులకు సేవ చేయడం కోసం రంగుల ప్రపంచాన్ని కాదనుకుని రాజకీయాల్లోకి వచ్చిన తారలు ఎంతోమంది. అందులో సక్సెస్ అయినవారు కొందరైతే విఫలమైన వారు మరికొందరు! కానీ, బాలీవుడ్ ఫైర్బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) తొలి ప్రయత్నంలోనే ఎంపీగా గెలిచి తన సత్తా చాటారు. ప్రజల కోసం పనిచేస్తానంటూ బింకాలు పలికారు. కానీ, ఏడాది తిరిగేసరికి రాజకీయ జీవితమే విసుగొచ్చిందంటున్నారు.ఈ పంచాయితీ ఏంది?కంగనా రనౌత్ మాట్లాడుతూ.. రాజకీయ జీవితాన్ని నేను ఎంజాయ్ చేయడం లేదు. ఎందుకంటే ఇక్కడ సామాజిక సేవ చేస్తున్నట్లే అనిపిస్తోంది. నేను మహిళల హక్కుల కోసం పోరాడాను, కానీ ప్రజలకు సేవ చేయాలని ఎన్నడూ అనుకోలేదు. కొందరు నాలా ధ్వంసమైందని నా దగ్గరకు వచ్చి చెప్తుంటారు. పంచాయతీ స్థాయిలోని సమస్యలను నా ముందు ఏకరువు పెడతారు. PM పదవి కోసం పోటీ?నేను ఎంపీనన్న విషయమే లెక్క చేయరు. రోడ్లు బాలేకపోయినా నాకే చెప్తారు. అది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందన్నా సరే.. నీ దగ్గర డబ్బులున్నాయిగా.. వాటితో బాగు చేయించమని డిమాండ్ చేస్తారు. రాజకీయంలో ఇంకా ముందుకు వెళ్లాలనైతే నేను అనుకోవడం లేదు. ప్రధానమంత్రి పదవికి పోటీపడేంత సమర్థురాలిని కాను. ఆ పోస్ట్ కోసం పోటీపడేంత అర్హత లేదు, ఆసక్తి అంతకన్నా లేదు. నేను సెల్ఫిష్సామాజిక సేవ అనేది నా లైఫ్లో లేదు. నేను చాలా సెల్ఫిష్ జీవితాన్ని గడిపాను. పెద్ద ఇల్లు, మంచి కారు, వజ్రాల ఆభరణాలు ఉండాలనుకున్నాను. అందంగా కనిపించాలనుకునేదాన్ని. నేను కోరుకున్నట్లే బతికాను. కానీ, దేవుడు నన్ను ఇటువైపు ఎందుకు నడిపించాడో తెలియడం లేదు. నా జీవితాన్ని ప్రజల కోసం త్యాగం చేయలేను. పూర్తిగా సామాజిక సేవకు అంకితం చేసే జీవితం నాకిష్టం లేదు. అలా జరగాలని కూడా నేను కోరుకోను అని కంగనా చెప్పుకొచ్చారు.సినిమాకంగనా.. 2024లో జరిగిన లోకసభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్.. మండి నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో ఏక్ నిరంజన్ మూవీలో హీరోయిన్గా నటించారు. బాలీవుడ్లో అనేక సినిమాలు చేసిన ఆమె చివరగా ఎమర్జెన్సీ చిత్రంలో ఇందిరా గాంధీ పాత్రలో మెప్పించారు. ఈ మూవీలో కంగనా నటించడంతో పాటు దర్శకురాలిగా, నిర్మాతగానూ వ్యవహరించారు. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అందుబాటులోంది.చదవండి: అమెరికాలో ప్రియుడితో సమంత చెట్టాపట్టాల్?!

సినిమాలు మానేసి సెలూన్లో పని చేశా.. 10th ఫెయిలైనా..
నమ్రత శిర్కోదర్ టాలీవుడ్లో హీరోయిన్గా రాణిస్తే చెల్లి శిల్ప శిరోద్కర్ (Shilpa Shirodkar) బాలీవుడ్లో కథానాయికగా అలరించింది. హమ్, ఆంఖెన్, పెంచన్ వంటి సినిమాలతో శిల్ప హిందీలో ఫుల్ బిజీ అయింది. అయితే 2000వ సంవత్సరంలో వచ్చిన గజగామిని మూవీ తర్వాత ఆమె వెండితెరకు విరామం ప్రకటించింది. అప్పుడే యూకేకి చెందిన బ్యాంకు ఉద్యోగి అపరేశ్ రంజిత్ను పెళ్లాడింది. మొదట్లో ఈ దంపతులు నెదర్లాండ్స్కు షిఫ్ట్ అయ్యారు. ఆ తర్వాత న్యూజిలాండ్లో సెటిలయ్యారు.కోర్సు నేర్చుకున్నా..ఇక హీరోయిన్గా స్టార్డమ్ చూసిన శిల్ప.. సినిమాలు మానేశాక ఏం పని చేసిందనే విషయాన్ని తాజాగా బయటపెట్టింది. ఆమె మాట్లాడుతూ.. నేను ఖాళీగా ఉండకుండా బిజీగా గడపాలని న్యూజిలాండ్లో హెయిర్డ్రెస్సింగ్ కోర్సు నేర్చుకున్నాను. ఇందులో మేకప్, బ్యూటీ గురించి ఉండటంతో యాక్టింగ్కు కనెక్ట్ అయి ఉన్నట్లే అనిపించేది. రెండునెలలపాటు సెలూన్లో కూడా పని చేశాను. పనిగంటలు సెట్టవకపోవడంతో మానేశాను. పదో తరగతి ఫెయిల్ అని రెజ్యూమ్కార్పొరేట్ సంస్థలో పని చేసిన అనుభవం లేదు కాబట్టి ఇంకేదైనా చేయాలనుకున్నాను. నా భర్తకు నా రెజ్యూమ్ సిద్ధం చేయమని చెప్పాను. అందుకాయన రెజ్యూమ్లో ఏమని రాయను? అన్నాడు. అబద్ధాలు చెప్పకుండా నా గురించి ఉన్నది ఉన్నట్లు రాయు. 10th ఫెయిల్ అని, అలాగే సినిమాల్లో పని చేశానని కూడా పేర్కొనమని చెప్పాను. ఆశ్చర్యంగా ఒక్కరోజే నాకు రెండు జాబ్ ఆఫర్స్ వచ్చాయి. డన్ అండ్ బ్రాడ్షీట్ కంపెనీలో క్రెడిట్ కంట్రోలర్గా ఉద్యోగంలో చేరాను.జోక్ కాస్తా నిజమైందికానీ ఉద్యోగంలో చేరిన కొంతకాలానికే నాకు అలసటగా అనిపించేది. ఇదే మాట నా స్నేహితురాలికి చెప్తే ప్రెగ్నెంట్ అయ్యావేమో అని జోక్ చేసింది. ఎందుకైనా మంచిదని టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ అని తేలింది. కానీ ఆ జర్నీ అంత ఈజీగా సాగలేదు. ఇన్సులిన్ ఇంజక్షన్లు, బరువు తగ్గేందుకు ప్రయత్నాలు.. ఇలా చాలా కష్టాలే పడాల్సి వచ్చింది. అలా నాకు కూతురు అనుష్క పుట్టింది. దాంతో సినిమాలకు మరింత దూరంగా ఉండాల్సి వచ్చింది అని శిల్ప శిరోద్కర్ చెప్పుకొచ్చింది.చదవండి: అమెరికాలో ప్రియుడితో చెట్టాపట్టాల్?!.. అతడితోనే సమంత విందు, విహారం

హీరోయిన్ పేరుతో 77 లక్షల మోసం.. మాజీ పీఏ అరెస్ట్!
బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్(Alia Bhatt ) మాజీ పర్సనల్ అసిస్టెంట్(పీఏ) వేదికా ప్రకాశ్ శెట్టిని పోలీసులు అరెస్ట్ చేశారు. హీరోయిన్ సంతకాలు ఫోర్జరీ చేసి రూ. 77 లక్షల మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆలియా తల్లి, దర్శకురాలు సోనీ సోనీ రజ్దాన్ ఇచ్చిన ఫిర్యాదుతో వేదిక ప్రకాశ్శెట్టిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2021 నుంచి 2024 వరకు అలియా వ్యక్తిగత సహాయకురాలిగా వేదిక పని చేసింది. ఆ సమయంలో ఆలియాకు సంబంధించిన ఫైనాన్షియల్ డాక్యుమెంట్లు, పేమెంట్స్, షెడ్యూల్ ప్లానింగ్లను వేదికనే చూసుకునేది. అదే సమయంలోనే వేదికా నకిలీ బిల్లులు సృష్టించి ఆలియా సంతకాన్నీ మార్ఫింగ్ చేసి ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఐదు నెలల క్రితమే వేదికపై ఆలియా తల్లి ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలిసిన వెంటనే సోనియా ముంబై నుంచి పారిపోయింది. రాజస్తాన్, కర్ణాటక, పుణెల్లో తిరుగుతూ.. చివరకు బెంగళూరులో పోలీసులకు చిక్కింది. ఆమెను అరెస్ట్ చేసి ముంబైకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

రోహిత్, కోహ్లి అభిమానులకు గుడ్ న్యూస్
దౌత్యపరమైన ఉద్రిక్తతల కారణంగా ఆగస్ట్లో జరగాల్సిన భారత్-బంగ్లాదేశ్ పరిమిత ఓవర్ల సిరీస్ ఏడాది పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో ఆగస్ట్లో టీమిండియా ఖాళీగా ఉండనుంది. ఈ ఖాళీని భర్తీ చేసేందుకు బీసీసీఐ శ్రీలంక క్రికెట్ బోర్డుతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఆగస్ట్లో భారత్, శ్రీలంక మధ్య పరిమిత ఓవర్ల సిరీస్లు (3 వన్డేలు, 3 టీ20లు) నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుంది.ఇందుకు శ్రీలంక బోర్డు ఒకే చెబితే మరికొద్ది రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఆగస్ట్లో జరగాల్సిన లంక ప్రీమియర్ లీగ్ కూడా వాయిదా పడటంతో భారత్తో సిరీస్ ఆడేందుకు శ్రీలంక బోర్డుకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకపోవచ్చు. ఆగస్ట్ చివర్లో శ్రీలంక జింబాబ్వేలో పర్యటించాల్సి ఉంది. ఆలోపే భారత్తో సిరీస్ జరిగే ఆస్కారం ఉంది. భారత్ చివరిసారిగా 2023లో శ్రీలంకలో పర్యటించింది. ఈ ఏడాది లంకలో టీమిండియా పర్యటన షెడ్యూల్ కాలేదు. అయితే అనుకోకుండా ఈ ప్రతిపాదన వచ్చింది.ఆగస్ట్లో బరిలోకి దిగనున్న దిగ్గజాలు..?భారత్, శ్రీలంక మధ్య ఆగస్ట్లో పరిమిత ఓవర్ల సిరీస్ల ప్రస్తావనకు రావడంతో టీమిండియా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఫ్యాన్స్ పట్టరాని సంతోషంతో తేలిపోతున్నారు. శ్రీలంక పర్యటనలో భారత్ మూడు వన్డేలు ఆడే అవకాశం ఉంది. ఇప్పటికే టీ20, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, కోహ్లి ఈ వన్డే సిరీస్లో తప్పక ఆడతారని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ సిరీస్ సాధాసాధ్యాలపై మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ సిరీస్లో రోహిత్, కోహ్లి పాల్గొనే దానిపై కూడా క్లారిటీ రానుంది.ఒకవేళ శ్రీలంకతో సిరీస్ సాధ్యపడకపోతే మాత్రం రోహిత్, కోహ్లి అభిమానులు వారి రాక కొరకు అక్టోబర్ వరకే వేచి చూడాల్సిందే. అక్టోబర్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ జరుగనుంది. ఆస్ట్రేలియాలో జరిగే ఈ సిరీస్లో భారత్ 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. ఈ సిరీస్లో రోహిత్, కోహ్లి తప్పక ఆడే అవకాశం ఉంది. రోహిత్, కోహ్లి చివరిగా ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో కలిసి ఆడారు. ఆ టోర్నీలో భారత్ విజేతగా నిలిచి 13 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించింది. ఆ టోర్నీ తర్వాతే రోహిత్, కోహ్లి రోజుల వ్యవధిలో టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. అంతకుముందు వీరిద్దరు ఒకేసారి (2024 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత) టీ20 ఫార్మాట్కు గుడ్బై చెప్పారు.

ENG VS IND 3rd Test: చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో రిషబ్ పంత్
టీమిండియా డాషింగ్ బ్యాటర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. రేపటి నుంచి ఇంగ్లండ్తో ప్రారంభమయ్యే మూడో టెస్ట్లో మరో 5 సిక్సర్లు బాదితే టెస్ట్ల్లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా అవతరిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. వీరూ 103 టెస్ట్ల్లో 90 సిక్సర్లు బాదాడు. వీరూ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. హిట్మ్యాన్ 67 టెస్ట్ల్లో 88 సిక్సర్లు కొట్టాడు. పంత్ విషయానికొస్తే.. ఇతగాడు కేవలం 45 మ్యాచ్ల్లోనే 86 సిక్సర్లు బాది చరిత్ర సృష్టించేందుకు మరో 5 సిక్సర్ల దూరంలో ఉన్నాడు. పంత్ ప్రస్తుత ఫామ్ను బట్టి చూస్తే రేపటి నుంచి ప్రారంభమయ్యే టెస్ట్లో ఈ రికార్డు సాధించడం ఖాయంగా కనినిస్తుంది.ఓవరాల్గా చూస్తే టెస్ట్ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో పంత్ 12వ స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్తో మూడో టెస్ట్లో పంత్ 5 సిక్సర్లు కొడితే భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డుతో పాటు టెస్ట్ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ఏడో స్థానానికి ఎగబాకుతాడు. టెస్ట్ల్లో అత్యధిక సిక్సర్ల రికార్డు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ పేరిట ఉంది. స్టోక్స్ 113 మ్యాచ్ల్లో 133 సిక్సర్లు బాదాడు. స్టోక్స్ తర్వాతి స్థానాల్లో బ్రెండన్ మెక్కల్లమ్ (107), గిల్క్రిస్ట్ (100), టిమ్ సౌథీ (98), గేల్ (98), కల్లిస్ (97), సెహ్వాగ్ (91), ఏంజెలో మాథ్యూస్ (90), రోహిత్ శర్మ (88), లారా (88) ఉన్నారు (టాప్-10లో).కొద్ది రోజుల కిందట మరో భారీ సిక్సర్ల రికార్డు బద్దలు కొద్ది రోజుల కిందట జరిగిన ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో పంత్ మరో భారీ సిక్సర్ల రికార్డు సాధించాడు. విదేశీ గడ్డపై టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్గా అవతరించాడు. ఈ క్రమంలో బెన్ స్టోక్స్ పేరిట ఉన్న ఆల్టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. పంత్ ఇంగ్లండ్లో (టెస్ట్ల్లో) 23 సిక్సర్లు బాదగా.. స్టోక్స్ సౌతాఫ్రికాలో 21 సిక్సర్లు కొట్టాడు. భీకర ఫామ్లో పంత్ఇంగ్లండ్తో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో పంత్ రెండు ఇన్నింగ్స్లో శతకాలతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్లో 178 బంతుల్లో 12 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్లో 140 బంతుల్లో 15 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 118 పరుగులు సాధించాడు.ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో పంత్ తొలి ఇన్నింగ్స్లో తక్కువ స్కోర్కే (25) ఔటైనా, రెండో ఇన్నింగ్స్లో తనదైన శైలిలో మెరుపు అర్ద సెంచరీ (65) చేశాడు. రేపటి నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభమయ్యే మూడో టెస్ట్లో భారీ అంచనాలు ఉన్నాయి. పంత్ మరోసారి చెలరేగాలని అంతా ఆశిస్తున్నారు. ఈ సిరీస్లో భారత్, ఇంగ్లండ్ తలో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. తొలి టెస్ట్లో ఇంగ్లండ్ గెలవగా.. రెండో టెస్ట్లో భారత్ భారీ విజయం సాధించింది.

Viral Video: నిప్పులు చెరిగిన ఆసీస్ పేసర్.. దెబ్బకు రెండుగా చీలిన వికెట్
ఇంగ్లండ్లో జరుగుతున్న టీ20 బ్లాస్లో ఆస్ట్రేలియా యువ ఫాస్ట్ బౌలర్ రిలే మెరిడిత్ చెలరేగిపోయాడు. నిప్పులు చెరిగే బౌలింగ్తో ప్రత్యర్థి బ్యాటర్లను భయభ్రాంతులకు గురి చేశాడు. ఈ టోర్నీలో సోమర్సెట్కు ఆడుతున్న మెరిడిత్.. నిన్న (జులై 8) ఎసెక్స్తో జరిగిన మ్యాచ్లో అరివీర భయంకరంగా బౌలింగ్ చేశాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్ నాలుగో బంతికి ఎసెక్స్ ఓపెనర్ కైల్ పెప్పర్ను క్లీన్ బౌల్డ్ చేయగా.. వికెట్ మధ్యలో రెండు ముక్కలుగా చీలింది. ఇది చూసి మెడిరిత్ చాలా ఆనందపడ్డాడు. సహజంగానే ఏ ఫాస్ట్ బౌలర్కు అయినా ఇది గర్వంచదగ్గ సందర్భం. మెరిడిత్ కూడా దీన్ని ఎంజాయ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది.RILEY SNAPS THE STUMP DOWN THE MIDDLE 🤯Have you ever seen this before?!?#SOMvESS#WeAreSomerset pic.twitter.com/VQ244pq8RR— Somerset Cricket (@SomersetCCC) July 8, 2025కాగా, ఈ మ్యాచ్లో మెరిడిత్ జట్టు సోమర్సెట్ ఎసెక్స్పై 95 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సోమర్సెట్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. టామ్ కోహ్లెర్ కాడ్మోర్ సుడిగాలి ఇన్నింగ్స్తో (39 బంతుల్లో 90; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) బీభత్సం సృష్టించాడు. మిగతా ఆటగాళ్లు నామమాత్రపు ప్రదర్శన చేశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఎసెక్స్.. సోమర్సెట్ ఫాస్ట్ బౌలర్లు మ్యాట్ హెన్రీ (4-0-21-4), రిలీ మెరిడిత్ (2-0-22-2), క్రెయిగ్ ఓవర్టన్ (3.1-0-32-2) ధాటికి 14.1 ఓవర్లలో 130 పరుగులకే కుప్పకూలింది. ఎసెక్స్ ఇన్నింగ్స్లో నోవా థైన్ (38) టాప్ స్కోరర్గా నిలిచాడు.

న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్
జులై 14 నుంచి జింబాబ్వేలో జరుగబోయే ముక్కోణపు టీ20 సిరీస్కు ముందు న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు విధ్వంసకర బ్యాటర్ ఫిన్ అలెన్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అలెన్ ప్రస్తుతం జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ సందర్భంగా శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్కు ఆడుతూ గాయపడ్డాడు (ఫుట్ ఇంజ్యూరి). అలెన్ గాయం తీవ్రతపై స్పష్టత లేదు. మరోసారి పరీక్షలు జరిపిన అనంతరం క్లారిటీ వస్తుందని వైద్యులు తెలిపారు. అలెన్కు ప్రత్యామ్నాయ ఆటగాడిగాని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఇంకా ప్రకటించలేదు. ముక్కోణపు టోర్నీలో జింబాబ్వే, న్యూజిలాండ్తో పాటు సౌతాఫ్రికా పాల్గొంటుంది.భీకర ఫామ్లో అలెన్ప్రస్తుతం జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్లో ఫిన్ అలెన్ భీకర ఫామ్లో ఉన్నాడు. ఈ లీగ్ తొలి మ్యాచ్లోనే అతను సుడిగాలి శతకం (51 బంతుల్లో 151) విరుచుకుపడ్డాడు. అనంతరం జరిగిన మ్యాచ్ల్లో మరో రెండు మెరుపు అర్ద సెంచరీలు చేశాడు. ఈ లీగ్లో అలెన్ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ల్లో సెంచరీ, 2 హాఫ్ సెంచరీల సాయంతో 333 పరుగులు చేశాడు. ఈ సీజన్లో అత్యధిక స్ట్రయిక్రేట్ (225) అలెన్దే.అలెన్ జట్టు శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ ఈ సీజన్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్కు చేరింది. రేపు (భారతకాలమానం ప్రకారం) జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో యూనికార్న్స్ ఎంఐ న్యూయార్క్తో అమీతుమీ తేల్చుకోనుంది.సౌతాఫ్రికా విషయానికొస్తే.. ముక్కోణపు టోర్నీలో న్యూజిలాండ్ తమ తొలి మ్యాచ్ను జులై 16న ఆడనుంది. ఆ మ్యాచ్లో కివీస్ సౌతాఫ్రికాతో తలపడనుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్లో అతిథ్య జింబాబ్వే, సౌతాఫ్రికా పోటీ పడతాయి. ఈ టోర్నీ ఫైనల్ జులై 26న జరుగనుంది. టోర్నీ మొత్తం హరారేలో జరుగనుంది.
బిజినెస్

కీలక ఉత్పత్తిపై ట్రంప్ 50 శాతం సుంకం
ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికాలు, పవర్ గ్రిడ్లలో విరివిగా ఉపయోగించే కాపర్ దేశీయ ఉత్పత్తిని పెంచేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. యూఎస్ దిగుమతి చేసుకునే కాపర్పై 50 శాతం సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ట్రంప్ కేబినెట్ సమావేశంలో వివరాలు వెల్లడించారు. టారిఫ్ రేటును ప్రకటించినప్పటికీ, ఇది ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారో మాత్రం తెలియజేయలేదు.ఉక్కు, అల్యూమినియం, ఆటో విడిభాగాలపై ఇదే విధమైన సుంకాలను ఇప్పటికే విధించారు. ట్రంప్ వ్యాఖ్యల తర్వాత కాపర్ ధరలు రికార్డు గరిష్టాలకు పెరిగాయి. కమోడిటీ ఎక్స్చేంజీ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ పౌండ్కు 10% పైగా పెరిగి 5.8955 డాలర్లకు చేరుకుంది. దిగుమతి సుంకం వల్ల యూఎస్లోని చిన్న పరిశ్రమలు ప్రయోజనం పొందుతాయనే అంచనాలతో యూఎస్ కాపర్ ఉత్పత్తిదారు ఫ్రీపోర్ట్ మెక్మోరాన్ షేర్లు 5% పెరిగాయి.ఫార్మాపై కూడా..అమెరికా ప్రస్తుతం తన కాపర్ వినియోగంలో దాదాపు సగం దిగుమతి చేసుకుంటుంది. వీటిలో ఎక్కువ భాగం చిలీ నుంచే సమకూరుతుంది. దాంతో రాబోయే రోజుల్లో ఈ దేశంలో తయారయ్యే కాపర్పై ప్రభావం పడనుందని నిపుణులు చెబుతున్నారు. కేబినెట్ సమావేశంలో ట్రంప్ అదనంగా మరిన్ని సుంకాల గురించి కూడా సంకేతాలు ఇచ్చారు. ఫార్మాస్యూటికల్ దిగుమతులపై 200% సుంకం రావచ్చని, అయితే కంపెనీలు తమ ఉత్పత్తిని తిరిగి అమెరికాకు తరలించడానికి 18 నెలల వరకు సమయం ఉండవచ్చని ఆయన సూచించారు.ఇదీ చదవండి: కుబేరులకు దేశాలు రెడ్కార్పెట్కాపర్పై సుంకాలతో కీలక రంగాలపై ప్రభావంఎలక్ట్రిక్ వాహనాలు: బ్యాటరీలు, మోటార్లు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలకు రాగి అవసరం.నిర్మాణం, విద్యుత్ రంగం: పవర్ గ్రిడ్, నిర్మాణ రంగం రాగి వైరింగ్, ట్యూబ్లపై ఎక్కువగా ఆధారపడుతాయి. ఇది భవన ఖర్చులను పెంచుతుంది.ఎలక్ట్రానిక్స్ అండ్ కన్జ్యూమర్ గూడ్స్: ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు, గృహోపకరణాల్లో గణనీయంగా రాగిని ఉపయోగిస్తారు.డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్: సైనిక పరికరాల్లో వైరింగ్, ఎలక్ట్రానిక్స్ కోసం రాగిని ఎక్కువగా వాడుతారు.

దేశాలు పిలుస్తున్నాయ్..
మనలో చాలామంది ఇతర దేశాల పౌరసత్వం పొంది అక్కడే స్థిరపడాలనుకుంటారు. అయితే ఇది మధ్యతరగతి వారికి కొంత కష్టం కావొచ్చుకానీ, ధనవంతులకు మాత్రం సులువే. అందుకు అనుగుణంగా ప్రస్తుతం చాలా దేశాలు వాటి సిటిజన్షిప్ నియమాల్లో మార్పులు తీసుకొస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికార పీఠాన్ని అధిరోహించిన తర్వాత మొన్నామధ్య ఆ దేశ పౌరసత్వం పొందాలంటే గోల్డ్కార్డు వీసా తీసుకోవాలని దాన్ని ప్రదర్శించారు. డబ్బు కడితే చాలా దేశాల పౌరసత్వం కార్డు మీ జేబులో ఉంటుంది. ఈ లిస్ట్లో కేవలం యూఎస్తోపాటు చాలా దేశాలే ఉన్నాయి. ప్రధానంగా ఏయే దేశాలు తమ పౌరసత్వం కోసం ఎలాంటి నిబంధనలు పెట్టాయో తెలుసుకుందాం.యూఎస్ఏఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఐదు మిలియన్ డాలర్ల(సుమారు రూ.44 కోట్లు) విలువైన కొత్త గోల్డ్ కార్డు వీసాలు ప్రారంభించింది. సంపన్న విదేశీయులకు గోల్డ్ కార్డులను అందించడానికి ట్రంప్ ఈ కొత్త ప్రణాళికను ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ప్రవేశపెట్టారు. ఇది వారికి యూఎస్ రెసిడెన్సీ, పౌరసత్వానికి అవకాశం కల్పిస్తుంది. దాంతోపాటు అమెరికా ఖజానాకు ట్రిలియన్ల ఆదాయాన్ని సృష్టించగలదని, ఇది దేశ రుణాన్ని తగ్గించడానికి దోహదం చేస్తుందని తెలిపారు. కొత్త గోల్డెన్ కార్డు కొంత వరకు గ్రీన్ కార్డు మాదిరి వెసులుబాటు అందిస్తున్నా ప్రధానంగా సంపన్నులపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తుంది.అమెరికాలో పెట్టుబడిదారుల కోసం 35 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన వీసా(ఈబీ-5 వీసా) పాలసీని ట్రంప్ మార్చాలని యోచించారు. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులకు ‘గోల్డ్ కార్డ్’ వీసాను మంజూరు చేశారు. ఈ వీసాను ఐదు మిలియన్ డాలర్ల(సుమారు రూ.44 కోట్లు)తో పొందాల్సి ఉంటుంది. యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) వెబ్సైట్ ప్రకారం, ఈబీ-5 వీసా విధానాన్ని ఉద్యోగ కల్పన-విదేశీ పెట్టుబడిదారుల మూలధన పెట్టుబడుల ద్వారా యూఎస్ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి 1990లో కాంగ్రెస్ ఆమోదించింది. 2021 సెప్టెంబరు నుంచి 2022 సెప్టెంబరు 30వ తేదీ వరకు దాదాపు 8వేల మంది ఈ వీసాలను పొందారు.జన్మతః పౌరసత్వాన్ని గుర్తించరు..ఈబీ-5 ద్వారా పెట్టుబడిదారులు, వారి జీవిత భాగస్వాములు.. 21 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న అవివాహిత పిల్లలు నాన్-టార్గెటెడ్ ఎంప్లాయిమెంట్ ఏరియా (టీఈఏ) ప్రాజెక్టులో 1.8 మిలియన్ డాలర్లు లేదా టీఈఏ ప్రాజెక్టులో కనీసం 8,00,000 డాలర్లు పెట్టుబడి పెడితే శాశ్వత నివాసానికి అర్హులు. అయితే, ఈ వీసా విధానంతో మోసాలు జరుగుతున్నాయని, కొందరు అక్రమంగా నిధులు పొందుతున్నారని అధికారులు గుర్తించారు. దాంతో రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత జన్మతః పౌరసత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అక్రమ వలసదారులకు, తాత్కాలిక వీసాపై అమెరికాకు వచ్చి వారికి పుట్టే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వాన్ని తమ ఫెడరల్ ప్రభుత్వం గుర్తించబోదని ట్రంప్ తెలిపారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం అప్పటి నుంచి ఈ జన్మతః పౌరసత్వ విధానం కొనసాగుతోంది.సింగపూర్ గోల్డెన్ వీసావ్యాపార అవకాశాలు, అధిక జీవన నాణ్యతను కోరుకునే అధిక నికర విలువ కలిగిన వ్యక్తులకు సింగపూర్ గమ్యస్థానంగా తోస్తుంది. సింగపూర్లో గ్లోబల్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్ (జీఐపీ) ద్వారా భారీ పెట్టుబడులు పెట్టేవారికి పౌరసత్వం కల్పిస్తున్నారు. దేశంలో శాశ్వత ఉనికిని చాటుకోవాలనుకునే అల్ట్రా-హైనెట్వర్త్ ఇండివిడ్యువల్స్ (యూహెచ్ఎన్డబ్ల్యూఐ) కోసం ఈ వీసా ప్రోగ్రామ్ రూపొందించారు. ఈ వీసా ప్రాసెసింగ్ సమయం సాధారణంగా 9–12 నెలలుగా ఉంటుంది. జీఐపీలో పౌరసత్వం పొందాలంటే కనీసం 10 మిలియన్ సింగపూర్ డాలర్లు(రూ.67 కోట్లు) పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. జీఐపీకు అర్హత పొందాలంటే దరఖాస్తుదారులు బిజినెస్ లేదా ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్లో నిరూపితమైన ట్రాక్ రికార్డ్ కలిగి ఉండాలి. టెక్, హెల్త్కేర్, లాజిస్టిక్స్ లేదా ఫైనాన్స్ వంటి ఆమోదించబడిన రంగాల్లో ఒకదానిలో బిజినెస్ చేస్తుండాలి.పౌరసత్వం ఎప్పుడు వస్తుందంటే..గ్లోబల్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్ కింద పర్మినెంట్ రెసిడెన్సీ (పీఆర్) హోదా పొందిన రెండేళ్ల తర్వాత, దరఖాస్తుదారులు ప్రత్యేకంగా సింగపూర్ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఈ ప్రక్రియలో కీలకమైన షరతు ఉంది. సింగపూర్ ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతించదు. అందువల్ల ఆ దేశ పౌరసత్వం పొందడానికి దరఖాస్తుదారులు తమ ప్రస్తుత పౌరసత్వాన్ని వదులుకోవాలి.ప్రయోజనాలుసింగపూర్ గ్లోబల్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్ పెట్టుబడిదారులకు అందించే వీసా ఉంటే 190కి పైగా దేశాలకు ప్రత్యేకంగా వీసా లేకుండా ప్రయాణించవచ్చు. సింగపూర్లో గరిష్టంగా 24% వరకు మాత్రమే వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రపంచ స్థాయి వైద్యం, విద్య, ఉన్నత జీవన ప్రమాణాలకు సింగపూర్ కీలకంగా మారింది.ఇదీ చదవండి: పెరుగుతున్న కార్మిక కొరత.. జనాభా సంక్షోభంయూకేయూకేలో ఈ గోల్డ్కార్డ్ వీసాను అధికారికంగా ఇన్నోవేటర్ ఫౌండర్ వీసాగా పిలుస్తారు. పెట్టుబడిదారులను, ప్రతిభావంతులైన ఆకర్షించడానికి, ఆర్థిక వ్యవస్థను పెంచడానికి యూకే ప్రయత్నాల్లో భాగంగా 2020లో ఈ వీసాను ప్రవేశపెట్టింది. ఇది యూకేలో వ్యాపారం చేయాలనుకునే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంది. ఈ వీసా 3 సంవత్సరాలు చెల్లుబాటు అవుతుంది. తర్వాత శాశ్వత నివాసానికి ఇండెఫినెట్ లీవ్ టు రిమేన్(ఐఎల్ఆర్) కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఐఎల్ఆర్ ప్రక్రియలో దరఖాస్తుదారులు కనీసం 5 సంవత్సరాలు (ఇన్నోవేటర్ ఫౌండర్ వీసాపై గడిపిన సమయంతో సహా) యూకేలో నివసించినట్లు రుజువు చేయాలి. ఇతర నివాస, ఆదాయ ప్రమాణాలను చేరుకోవాలి. వ్యాపారంలో కనీసం 50000 పౌండ్లు(రూ.58,29,000) పెట్టుబడి పెట్టాలి.ఈ వీసాకు అర్హతలు..ఇన్నోవేటర్ ఫౌండర్ వీసాకు అర్హత సాధించడానికి దరఖాస్తుదారులు గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఆమోదం పొందాలి. యూకే ప్రభుత్వం గుర్తించిన బిజినెస్ ఇంక్యుబేటర్, ఇన్వెస్టర్ ద్వారా ఆమోదం పొందాలి. మీ వ్యాపార ఆలోచన సృజనాత్మకమైనదని, ఆచరణీయమైనదని ఆ ఈ సంస్థ ధ్రువీకరించాలి. దరఖాస్తుదారులు బీ2 స్థాయి ఇంగ్లిష్ (సీఈఎఫ్ఆర్ స్కేల్) కలిగి ఉండాలి. ఇది అప్పర్ ఇంటర్మీడియట్ నైపుణ్యానికి సమానం. ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్ట్ ద్వారా దీన్ని నిరూపించవచ్చు.

ఊగిసలాడుతోన్న పసిడి ధరలు..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) నిన్నటి సెషన్లో పెరిగి తిరిగి ఈరోజు మళ్లీ ధరలు తగ్గుముఖం పట్టాయి. మంగళవారంతో పోలిస్తే బుధవారం పసిడి ధర పడిపోయింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)ఇదీ చదవండి: వయసు 34.. 10 ఏళ్లు ఉద్యోగం.. రూ.4 కోట్లు సంపద

నేడే టారిఫ్ డెడ్లైన్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:34 సమయానికి నిఫ్టీ(Nifty) 42 పాయింట్లు తగ్గి 25,481కు చేరింది. సెన్సెక్స్(Sensex) 177 ప్లాయింట్లు దిగజారి 83,522 వద్ద ట్రేడవుతోంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
ఫ్యామిలీ

'డిటెక్టివ్'.. బీ సెలెక్టివ్..!
ఒకప్పుడు సినిమాల్లో చాలా బాగా, బలంగా కనిపించిన డిటెక్టివ్ పాత్రలు.. ప్రస్తుతం తెరపై పెద్దగా కనిపించకపోవచ్చు.. కానీ ఆధునికుల నిజ జీవితంలో మాత్రం కీలకంగా మారాయి. వివాహ పూర్వపు దర్యాప్తుల నుంచి కార్పొరేట్ ఫ్రాడ్స్ వరకూ.. ఎన్నో రంగాల్లో వీరి కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే ప్రేమ, పెళ్లి, లివిన్ మొదలు ప్రతిదానికీ వీరిపై ఆధారపడుతున్నారు కొందరు.. అయితే అలాంటి ఏజెన్సీలను ఎన్నుకునే క్రమంలో తగిన జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.. దాదాపు మూడు దశాబ్దాల క్రితం ఆర్థిక సంస్కరణల ఫలితంగా పలు ప్రైవేటు రంగాలు పుంజుకున్నాయి. దీంతోపాటు వ్యక్తిగత గోప్యత, భద్రత, సత్వర న్యాయం కోసం స్వతంత్ర విచారణలు అవసరమయ్యాయి. అయితే అప్పటికే ముంబయి వంటి నగరాల్లో ఉన్నప్పటికీ.. ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లో ఒక్కసారిగా డిటెక్టివ్ ఏజెన్సీలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం మన నగరంలోనే దాదాపు 30కి పైగా ప్రైవేటు విచారణ సంస్థలు సేవలందిస్తున్నాయి. పెళ్లికి ముందు.. పరిశోధన.. ఇటీవలి కాలంలో పెళ్లిళ్లలో మోసాలు పెరిగిపోయాయి. దీంతో పాత సంబంధాల సమాచారం దాచిపెట్టడం వంటివి తెచ్చిపెట్టే సమస్యల పరిష్కారంగా డిటెక్టివ్ సేవలు బాగా అవసరం అవుతున్నాయి. కొన్ని మ్యాట్రిమోని సంస్థలు సైతం దీని కోసం డిటెక్టివ్స్ను ఆశ్రయిస్తున్నాయి. పెళ్లి తర్వాత భార్యాభర్తలు పరస్పరం అనుమానాలతో ఈ సంస్థల సేవల్ని కోరుకుంటున్నారు. నగరంలో ఇటీవలి కాలంలో విడాకుల సంఖ్య విపరీతంగా పెరగడానికి ఇలాంటి స్వతంత్ర విచారణలు కూడా ఓ కారణమేనని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. సదరు సంస్థలు చేసిన విచారణలో లోపం కారణంగా అందిన నివేదికలతో అనేకమంది విడిపోతున్నారని చెబుతున్నాయి అధ్యయనాలు. ప్రేమలు, లివిన్లలోనూ.. ఇక ప్రేమికులు కూడా ఈ విషయంలో తక్కువ తినలేదు. ‘పారీ్టలు, పిక్నిక్లు, కొలీగ్స్తో చనువుగా ఉండడం వంటి వన్నీ ప్రస్తుతం తప్పని అవసరం. అయితే ఇవే అనుమానాలకూ దోహదం చేస్తున్నాయి. తమ లవర్స్ మీద అనుమానాలతో మమ్మల్ని నెలకు కనీసం 25 మందైనా సంప్రదిస్తుంటారు’ అంటూ నగరంలో పేరున్న ఓ డిటెక్టివ్ సంస్థ ప్రతినిధి చెప్పారు. ప్రేమికులు కేవలం కబుర్లు, షికార్లతో కాలక్షేపం చేసే కాలం పోయి ఏకంగా లివిన్ రిలేషన్ షిప్స్లో ఉండడం సర్వసాధారణం అయ్యింది. ఇలాంటి ట్రెండ్ ఈ పరిస్థితికి దారి తీస్తోందని ఫ్యామిలీ కౌన్సిలర్ సుజాత అంటున్నారు.డివోర్స్కు ఫోర్స్.. ‘వివాహేతర సంబంధం కారణంగా విడాకులు ఇవ్వాలంటే మమ్మల్ని కలవాలి. ఆ తర్వాత విడాకులు ఇచి్చన మహిళకు ఆదాయం ఉందని భరణం ఇవ్వనక్కర్లేదని నిరూపించాల్సినప్పుడు కూడా మమ్మల్నే కలవాలి’ అంటూ చెప్పారు నగరంలోని లక్డీకాపూల్లో డిటెక్టివ్ ఏజెన్సీ నడుపుతున్న ఓ మహిళ. గతంలో ఈ తరహాలో తమ భార్య/భర్తల నేరాన్వేషణ సంపన్న కుటుంబాల్లోనే ఎక్కువ ఉండేదని, అయితే ప్రస్తుతం దాదాపుగా అన్ని రకాల ఆదాయవర్గాల్లోనూ కనిపిస్తోందని అన్నారామె. కార్పొరేట్ వెరిఫికేషన్ కోసం.. కార్పొరేట్ రంగంలో అవినీతి కార్యకలాపాలను గుర్తించేందుకు కూడా డిటెక్టివ్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. ఉద్యోగుల నియామకాల కోసం చేసే బ్యాక్గ్రౌండ్ చెకింగ్ నుంచి ఉద్యోగుల వర్గీకరణ, ఇంటర్నల్ లీకులు, మేనేజ్మెంట్ లెవెల్ మోసాల నిర్ధారణకు సంస్థలు ఈ సేవలను వినియోగిస్తున్నాయి. ఎస్సెట్ ట్రేసింగ్, ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ వంటివి వీరు చేస్తున్నారు. అంతే కాకుండా లోన్ రికవరీ/విత్హోల్డింగ్ కేసుల్లో ఆస్తుల వివరాల కోసం పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కూడా జై డిటెక్టివ్ అంటున్నారు. ఈజీ..టెక్నాలజీ.. ప్రస్తుతం డిటెక్టివ్ సేవల్లో టెక్నాలజీ కీలక భూమిక పోషిస్తోంది. వాహనాల పర్యవేక్షణ, వ్యక్తుల స్థల నిర్ధారణకు ఆధునిక పరికరాల సహాయంతో ట్రాకింగ్ సులభంగా మారింది. అలాగే సర్వైలెన్స్, డేటా అనాలసిస్ మరింత ప్రభావవంతంగా మారాయి. సోషల్ మీడియా మానిటరింగ్, డిజిటల్ ట్రెయిల్స్ ఆధారంగా వివరాల సేకరణ, ప్రత్యక్ష సాక్ష్యాల కోసం సీక్రెట్ కెమెరాలు, ఆడియో రికార్డర్లు ఉపకరిస్తున్నాయి. ఫోన్ కాల్స్, మెసేజ్లు, బ్యాంక్ లావాదేవీలను విశ్లేషించేందుకు డేటా అనలిటిక్స్, అనుమతి మేరకు హ్యాకింగ్, బగ్ డిటెక్షన్, మొబైల్ ట్రాకింగ్ వంటివీ చేస్తున్నారు. వ్యవస్థాపకులు వీరే.. చాలా వరకూ ఈ తరహా ఏజెన్సీల స్థాపకులు మాజీ భద్రతా విభాగాలకు చెందినవారే కావడం గమనార్హం. రిటైర్డ్ పోలీస్ అధికారులు, సైనిక లేదా నిఘా విభాగాల మాజీ ఉద్యోగులు, లాయర్లు, క్రిమినాలాజీ విద్యార్థులు ఈ సంస్థల స్థాపన, నిర్వహణల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. వీరికి న్యాయపరమైన అవగాహన, విచారణ పద్ధతులపై ట్రైనింగ్ ఉండటం కలిసొచ్చే అంశం. ప్రస్తుతం నగరంలో షార్ప్ డిటెక్టివ్, హైదరాబాద్ డిటెక్టివ్ ప్రై లిమిటెడ్, డీడీఎస్ డిటెక్టివ్, థర్డ్ ఐ ఇన్వెస్టిగేషన్స్, పారామౌంట్, లింక్స్, యారో, రియల్ ఐ, తదితర ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త..ఇలాంటి డిటెక్టివ్ ఏజెన్సీల సంస్థల్ని సేవల కోసం ఆశ్రయించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. కార్పొరేట్ సంస్థలు, న్యాయవాదులు, బ్యాంకులు వంటి ఆర్గనైజ్డ్ వ్యవస్థలకు ఫర్వాలేదు కానీ.. వ్యక్తిగత అవసరాలకు సంప్రదించేటప్పుడు ఒకటికి పదిసార్లు క్రాస్ చెక్ చేసుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. వ్యక్తిగత రహస్యాలను సేకరించిన అనంతరం బ్లాక్మెయిల్ చేసిన సందర్భాలూ నగరంలో లేకపోలేదని హెచ్చరిస్తున్నారు.

సీత్లా భవాని పండుగ : కాపాడే దేవత
లంబాడీ గిరిజనులు ఎంతో పవిత్రంగా జరుపుకొనే పండుగే... ‘సీత్లా భవాని’ వేడుక. గిరి జన సంప్రదా యంలో లంబాడీలు చేసుకునే తొలి పండుగ కూడా ఇదే. ప్రకృతిని ఆరాధిస్తూ... పంటలను, పశు సంపదను, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని వేడు కుంటారు. ఈ పండుగ, బోనాల వేడుకలు ఒకేకాలంలో రావడం గమనార్హం. వర్షాకాలంలో రక రకాల అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి అటు హిందువులూ, ఇటు లంబాడీ గిరిజ నులూ తమ తమ గ్రామదేవతలకు బోనాలు ఎత్తి పూజించి మొక్కులు చెల్లించుకుంటూ ఆ వ్యాధుల బారిన పడకుండా కాపాడమని వేడుకుంటారు. సీత్లా భవాని కలరా వంటి మహమ్మారులు ప్రబలకుండా కాపాడుతుందని బంజారాల నమ్మకం. తండాలో ఉన్న పశువులు, గొర్లు, మేకలు, కోళ్లు, పశు సంపద పెరగాలనీ; దూడలకు పాలు సరిపోనుఉండాలనీ, తమ పశువులకు గడ్డి బాగా దొరకాలనీ, క్రూర మృగాల బారిన పడకుండా వాటిని కాపాడా లనీ, అటవీ సంపద తరగకూడదనీ సీత్ల తల్లికి మొక్కులు తీర్చుకుంటారు. ఈ పండుగను వివిధతండాల్లో ఆ తండా ప్రజలు, పెద్ద మనుషులంతా కలిసి ఆషాఢ మాసంలో ఏదో ఒక మంగళవారంఎంచుకొని జరుపుతారు. ప్రతి సంవత్సరం కేవలం మంగళవారం మాత్రమే జరపడం ఆనవాయితీ.ఇదీ చదవండి: ట్విన్స్కు జన్మనివ్వబోతున్నా.. నా బిడ్డలకు తండ్రి లేడు : నటి భావోద్వేగ పోస్ట్తండాల సరిహద్దుల్లోని పొలిమేర, కూడలి వద్ద సీత్ల భవాని సాధారణంగా ప్రతిష్ఠితమై ఉంటుంది. పురుషులంతా డప్పు వాయిద్యాలు వాయిస్తూ కోళ్లు, మేకలతో; మహిళలు బోనాలు ఎత్తుకుని నృత్యాలు చేసుకుంటూ అక్కడికి వెళ్తారు. ఈ క్రమంలో అందరూ కలిసి పాటలు పాడుతారు. ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మవారికి నైవేద్యంగా గుగ్గిళ్లు, లాప్సి పాయసం సమర్పిస్తారు. కోళ్లు, మేకలను బలి ఇచ్చి వాటి పైనుంచి పశువులను దాటిస్తారు. దేవతను పూజించే ప్రక్రియలో తండా పెద్ద మనిషి పూజారిగా వ్యవహరించి పూజా కార్యక్రమాలు నిర్వహించడం గమనార్హం.– నరేష్ జాటోత్, నల్గొండ

వాటర్ స్కీయింగ్ పోటీల్లో పాల్గొన్న తొలి భారతీయ మహిళ ఆమె..!
అనూజ వైద్య మరో రికార్డు సాధించింది. పర్వతారోహకురాలైన అనూజ వైద్య ఇప్పుడు కొత్త రికార్డుల కోసం నీటి మీద దృష్టి పెట్టారు. ఇంటర్నేషనల్ వాటర్ స్కీయింగ్ పోటీల్లో పాల్గొన్న తొలి భారతీయ మహిళ ఆమె. గుజరాత్ రాష్ట్రం, సూరత్కు చెందిన అనూజవైద్య గత నెల (జూన్) 24 నుంచి 29 వరకు థాయ్లాండ్లో జరిగిన ఏషియన్ వాటర్ స్కీయింగ్ అండ్ వేక్ బోర్డింగ్ చాంపియన్షిప్లో పాల్గొన్నారు. బాల్యం నుంచి అనూజ స్పోర్ట్స్లో చురుగ్గా ఉండేవారు. ట్రెకింగ్, స్విమ్మింగ్తోపాటు తండ్రి ప్రోత్సాహంతో తాపి నదిలో వాటర్ స్పోర్ట్స్లో శిక్షణ పొందారు. ఆమె తల్లి సొంతరాష్ట్రం ఉత్తరాఖండ్. తల్లి ప్రోత్సాహంతో అనూజ ఆమె చెల్లి అదితి ఇద్దరూ పర్వతారోహణ చేశారు. ఎవరెస్ట్ పర్వతాన్ని 2019లో తొలి ప్రయత్నంలోనే అధిరోహించి ’ఎవరెస్ట్ సిస్టర్స్’ గా గుజరాత్ రాష్ట్రంలో పేరు తెచ్చుకున్నారు. ఈ సిస్టర్స్ ఉత్తరాఖండ్లో ‘గెట్ సెట్ అడ్వెంచర్స్’ పేరుతో అడ్వెంచర్ స్పోర్ట్స్ కంపెనీ స్థాపించారు. ఇదిలా ఉండగా 27 ఏళ్ల అనూజ వైద్య తాజాగా వాటర్ స్కీయింగ్ స్పోర్ట్స్లో భారత్ తరఫున పాల్గొన్నారు. రికార్డుల్లో శిఖరాగ్రాన్ని చేరిన అనూజ ప్రస్తుతం నీటి/మీద రికార్డుల బాట పట్టారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఈ క్రీడ మనదేశ మహిళల దృష్టిని పెద్దగా ఆకర్షించలేదు. వీరికంటే ముందు ఎవరెస్ట్ శిఖరాన్ని హరియాణకు చెందిన తాషి, నున్గ్షి మాలిక్లు ఎవరెస్ట్ను (2023)అధిరోహించారు. సెవెన్ సమ్మిట్స్ పూర్తి చేసిన తొలి సిస్టర్స్గా రికార్డు సొంతం చేసుకున్నారు. అనూజ వేసిన తొలి అడుగుతో కొత్తతరం క్రీడాకారిణులు ఆ దారిలో నడుస్తారని ఆశిద్దాం. (చదవండి: ఐరన్ సయామీ..! ఒకే ఏడాదిలో రెండుసార్లు..)

కూరగాయ పంటల్లో నెమటోడ్ల బాధలు, నిర్వహణ ఎలా?
టమాటోలు, మిరప తోటల్లో కొన్ని మొక్కలు వాడిపోయి, రంగుమారి ఉంటాయి. ఇతర మొక్కలు బాగున్నా ఇవి పసుపుపచ్చగా వడలినట్లు ఉంటాయి. అవి కొన్నాళ్లకు చని పోతాయి. వాటిని పీకి చూస్తే వాటి వేర్లపై బుడిపెల మాదిరిగా ఉంటాయి. అలా ఉండటానికి కారణం నెమటోడ్లు. నెమటోడ్లు అంటే? మట్టిలో ఉండే నెమటోడ్లు భయంకరమైన సూక్ష్మక్రిములు. అన్ని రకాల మట్టిలో, వివిధ పంటల వేర్లలో, కలుపులో దాగివుండి కూరగాయలు, మిరప తోటలను నాశనం చేస్తుంటాయి. వీటిని నియంత్రించటం కంటే నివారించటమెంతో సులభం. రసాయనిక పురుగుమందులు వాడటం వల్ల ప్రయోజనం కన్నా కీడు ఎక్కువ జరుగుతుంది. అందుకని వాటి నివారణ ఎలాగో తెలుసుకోవటం అవసరం. వేరుముళ్ల నెమటోడ్లు వేర్లలోకి దూరి బుడిపెలను కలిగిస్తాయి. మొక్కల వేర్ల ద్వారా పోషకాలను పీల్చుకుంటూ జీవనం సాగిస్తాయి. దీంతో నెమటోడ్లు సోకిన మొక్కలు పోషకాలు అందక మొక్క వాడి΄ోయి, ఎండిపోయి, క్రమంగా చనిపోతుంది. నెమటోడ్లు భూమిలో ఎలా ఎదుగుతాయి? నెమటోడ్లు పలు మొక్కల వేర్లలోను, మట్టిలోను జీవిస్తాయి. వీటిని సూక్ష్మదర్శినిలో మాత్రమే చూడగలం. వేర్ల పక్కనే ఆడ నెమటోడ్ వెయ్యి గుడ్ల వరకు పెడుతుంది. గుడ్లు చాలా చిన్నవిగా ఉంటాయి. గుడ్ల పక్కన ఉన్న వేర్ల నుంచి అనుకూల సూచనలు రాగానే గుడ్ల నుంచి పిల్లలు బయటకు వస్తాయి. వేర్లను చుట్టుకుంటాయి. ఈ చిన్న పురుగులు వేర్లను పొడిచి లోపలికి చేరి, వాటిని తిని కడుపు నింపుకుంటాయి. ఈ క్రమంలో వేర్లకు బుడిపెలు ఏర్పడతాయి. ఆ తర్వాత ఇక మొక్కలకు ఈ వేర్ల ద్వారా పోషకాలు అందవు. దాంతో మొక్కలు కళతప్పి, వాడిపోయి, ఎండి చనిపోతాయి. నెమటోడ్లు అన్ని రకాల మట్టిలోనూ పెరుగుతాయి. చదవండి: Recirculating aquaculture system ఆధునికి చేపల సాగు మిరప, కూరగాయ మొక్కల నారును తెచ్చి నాట్లు వేసే ముందు వాటి వేర్లకు ఏమైనా బుడిపెలు ఉన్నాయా అని పరీక్షించాలి. బుడిపెలు ఉన్న మొక్కల్ని నాటకూడదు. మీ పొలం పరిసరాల్లో మొక్కలకు బుడిపెలు ఉన్నాయేమో చూసి, ఉంటే వాటిని నాశనం చెయ్యండి. మొక్కలు నాటడానికి భూమిని సిద్ధం చేసినప్పుడే పాతమొక్కల వేర్లు పూర్తిగా ఏరేసి, మట్టిని ఎండబెట్టాలి. పోయిన ఏడాది మొక్కలకు నెమటోడ్లు సోకిన చోటే పొలంలో తగలబెట్టే అలవాటు కొన్ని ప్రాంతాల రైతుల్లో ఉంది.నెమటోడ్లను తట్టుకునే ఉపాయాలేమిటి?నెమటోడ్లు సోకిన టొమాటో, మిరప, కూరగాయ పొలాల్లో పంట మార్పిడి చెయ్యటం మంచిది. ఉల్లి, తోటకూర, తులసి, నిమ్మగడ్డి, కర్రపెండలం, పశుగ్రాస పంటలకు నెమటోడ్లు సోకవని చెబుతున్నారు. కాబట్టి, ఈ పంటలు సాగు చేయవచ్చు. ఆరోగ్యకరమైన నారు పెంచుకోవటం. చేనులో, వాటి దరిదాపుల్లో నెమటోడ్ల మూలాన్ని గుర్తించి నాశనం చెయ్యటం మేలు. నెమటోడ్ నిరోధక శక్తి కలిగిన మొక్కలను తెచ్చి నాటుకొని పండించటం ఉత్తమం. ఇతర చేలల్లో నుంచి నెమటోడ్లతో కూడిన మట్టిని, మొక్కల్ని తేకుండా జాగ్రత్తపడటం అవసరం. నెమటోడ్లతో కూడిన మట్టి నాగళ్లు, ట్రాక్టర్లు, పరికరాలు, కూలీల పాదాలకు, వారి చెప్పులకు కూడా అంటుకొని ఒక పొలం నుంచి వేరే పొలంలోకి వ్యాపిస్తాయి. అందుకని శుభ్రం చేసుకున్న తర్వాతే వారిని పొలాల్లోకి రానివ్వాలి. నెమటోడ్ల నిరోధకత కలిగిన నారును, విత్తనాలను వాడాలి. నెమటోడ్లు సోకిన పొలంలో మొక్కలు పీకేసి, వాటి వేర్లన్నిటినీ ఏరి, కాల్చివేయాలి. మట్టిని తిరగేసి బాగా ఎండనివ్వాలి. ఆ తర్వాతే వేరే పంట వేసుకోవాలి. ప్రవహించే నీటి ద్వారా చేనులోకి నెమటోడ్లు రాకుండా ఉండేలా చేను సరిహద్దుల్లో నిమ్మగడ్డిని కంచె పంటగా పెంచుకోవటం మేలట. ఈ విషయాలను దక్షిణ బెనిన్ రైతుల అనుభవాలను ఉటంకిస్తూ యాక్సెస్ అగ్రికల్చర్ అనే డిజిటల్ అగ్రికల్చర్ విస్తరణ సంస్థ వీడియోను విడుదల చేసింది.చదవండి: ట్విన్స్కు జన్మనివ్వబోతున్నా.. నా బిడ్డలకు తండ్రి లేడు : నటి భావోద్వేగ పోస్ట్
ఫొటోలు
అంతర్జాతీయం

జపాన్, దక్షిణకొరియాపై 25 శాతం సుంకాలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్ రగడకు తెర తీశారు. జపాన్, దక్షిణ కొరియా ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధించనున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుందని ట్రూత్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అంతేగాక జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్కు ఈ మేరకు స్వయంగా లేఖలు కూడా రాశారు. ప్రతీకార సుంకాలకు దిగితే ఆ దేశాలపై టారిఫ్లు ఆ మేరకు పెరుగుతాయని అందులో ట్రంప్ హెచ్చరించారు! ఆ లేఖల స్క్రీన్షాట్లను ట్రూత్ సోషల్లో షేర్ చేశారు. జపాన్, దక్షిణకొరియాపై 25 శాతం టారిఫ్ నిజానికి చాలా తక్కువేనంటూ వాపోయారు. ‘‘ఇవి తుది టారిఫ్లు కావు. మీ దేశంతో మా సంబంధాలను బట్టి అంతిమంగా పెరగవచ్చు, తగ్గనూ వచ్చు’’ అన్నారు. టారిఫ్ పెంపుపై భారత్తో పాటు పలు ఇతర దేశాలకు కూడా ట్రంప్ లేఖాస్త్రాలు సంధిస్తున్నట్టు సమాచారం. మస్క్ కొత్త పార్టీ ప్రకటనపై ట్రంప్ ఎద్దేవా న్యూయార్క్: ‘అమెరికన్ పార్టీ’ పేరిట కొత్త పార్టీ పెడతానన్న ఎలాన్ మస్క్ ప్రకటనను హాస్యాస్పదంగా ట్రంప్ సోమవారం అభివర్ణించారు. ‘‘అమెరికాలో ఎన్నో ఏళ్లుగా రెండు పారీ్టలతోనే రాజకీయ వ్యవస్థ నడుస్తోంది. ఇప్పుడు మూడో పార్టీని తీసుకురావడమంటే గందరగోళాన్ని సృష్టించడమే’’ అని అన్నారు. తర్వాత తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లోనూ మస్్కను విమర్శిస్తూ ట్రంప్ పోస్ట్లు పెట్టారు. ‘‘కొన్ని వారాల క్రితం మా స్నేహ రైలుబండ్లు ఢీకొన్నాయి. ఇప్పుడు మస్క్ పూర్తిగా పట్టాలు తప్పారు. అమెరికాలో మూడో పార్టీ ఏదీ అద్భుతాలు చేయలేదన్న చేదు నిజం తెల్సికూడా మస్క్ కొత్త పార్టీ పెడతానంటున్నాడు. సక్రమంగా ఉన్న రాజకీయ వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికి తప్ప మూడోపార్టీ ఎందుకూ పనికిరాదు’’ అని వ్యాఖ్యానించారు.

ప్రపంచానికి బ్రిక్స్ ఆశాదీపం
రియో డి జనిరో: ‘‘అంతర్జాతీయ సహకారానికి, ఆదర్శ బహుళ ధ్రువ ప్రపంచానికి బ్రిక్స్ కూటమి చక్కని ఉదాహరణగా, విశ్వసనీయతకు మారుపేరుగా నిలవాలి. రానున్న రోజుల్లో ఇతర ప్రపంచ దేశాలకు అన్ని విషయాల్లోనూ దిశానిర్దేశం చేసే దారిదీపం కావాలి’’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ‘‘బ్రిక్స్పై దక్షిణార్ధ గోళ దేశాలు (గ్లోబల్ సౌత్) ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. వాటిని నెరవేర్చి నమ్మకాన్ని నిలబెట్టుకుందాం. పాలన, అభివృద్ధి, పరస్పర సహకారం తదితరాల్లో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పుదాం’’ అని సభ్య దేశాల అధినేతలకు పిలుపునిచ్చారు. ఈ విషయంలో సభ్య దేశాలన్నింటితోనూ భుజం భుజం కలిపి ముందుకు సాగేందుకు భారత్ పూర్తిగా కట్టుబడి ఉందని వక్కాణించారు. బ్రెజిల్లోని రియో డి జనిరోలో బ్రిక్స్ 17వ శిఖరాగ్ర సదస్సులో సోమవారం రెండో రోజు ‘భిన్నత్వానికి దన్ను, ఆర్థిక వ్యవహారాలు, ఏఐ’, ‘పర్యావరణం, కాప్–30, ప్రపంచ ఆరోగ్యం’ వంటి అంశాలపై జరిగిన సెషన్లలో మోదీ ప్రసంగించారు. బ్రిక్స్ కూటమి బలం దాని భిన్నత్వంలోనే దాగుందని నొక్కిచెప్పారు. కృత్రిమ మేధకు నానాటికీ అపారంగా పెరిగిపోతున్న ప్రాధాన్యాన్ని ప్రస్తావించారు. ‘ఏఐ’ ఆందోళనలకు అలా చెక్ ‘‘విద్య నుంచి వ్యవసాయం దాకా అన్ని రంగాల్లోనూ ఏఐని భారత్ చురుగ్గా, విస్తృతంగా ఉపయోగిస్తోంది. ఏఐపై నెలకొన్న ఆందోళనలకు సమర్థంగా చెక్ పెట్టాలంటే ఇటు పాలనకు, అటు ఇన్నొవేషన్లకు సమ ప్రాధాన్యమివ్వడమే మార్గం. బాధ్యతాయుతమైన ఏఐ మనందరి లక్ష్యం కావాలి’’ అని మోదీ సూచించారు. ఏఐ ప్రభావంపై వచ్చే ఏడాది భారత్ నిర్వహించనున్న శిఖరాగ్ర భేటీలో పాల్గొనాల్సిందిగా బ్రిక్స్ సభ్య దేశాలన్నింటినీ ఈ సందర్భంగా ఆహా్వనించారు. కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింతగా పెంపొందించుకునేందుకు వీలుగా బ్రిక్స్ సైన్స్ అండ్ రీసెర్చ్ రిపోజిటరీ (బీఎస్ఆర్ఆర్) ఏర్పాటును ప్రతిపాదించారు. అంతర్జాతీయ స్థాయిలో కీలక ఖనిజాలు సరఫరాకు ఆటంకం లేకుండా చూడటంలో కూటమి కీలకపాత్ర పోషించాలని అభిలíÙంచారు. ఆ వనరులను ఏ దేశమూ స్వీయ స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి, ఇతర దేశాలపై ఆయుధంగా వాడకుండా చూడాలన్నారు. 18 రకాల కీలక ఖనిజ వనరులకు నిలయమైన చైనా ఇటీవల వాటి ఎగుమతులను బాగా తగ్గించడం తెలిసిందే. పరోక్షంగా దాన్ని ఉద్దేశించి మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా ప్రధాని లీ కియాంగ్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో కీలక పాలన సంస్కరణలకు బ్రిక్స్ బాటలు పరవాలని సూచించారు. ప్రపంచ శాంతిని కాపాడటంలో, విభేదాలను శాంతియుతంగా పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించాలన్నారు. అధినేతలతో భేటీలు బ్రిక్స్ సదస్సు సందర్భంగా సోమవారం పలువురు దేశాధినేతలతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. 10 దేశాలతో కూడిన ఆసియాన్ కూటమితో భారత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై మలేసియా ప్రధాని అన్వర్ బిన్ ఇబ్రహీంతో చర్చించారు. వర్తకం, పెట్టబడులు, రక్షణ, విద్య, ఆరోగ్యం, పర్యాటకం తదితరాలపై లోతైన సమీక్ష జరిపారు. బొలీవియా అధ్యక్షుడు లూయిస్ ఆల్బర్టో ఆర్స్ కాటకొరా, ఉరుగ్వే అధ్యక్షుడు యమంద్ ఒర్సీతో ద్వైపాక్షిక అంశాలను గురించి మోదీ చర్చలు జరిపారు. యోగాకు ఉరుగ్వేలో నానాటికీ ఆదరణ పెరగుతుండటంపై హర్షం వెలిబుచ్చారు. పర్యావరణ న్యాయం... మాకు పవిత్ర నైతిక విధి పర్యావరణ న్యాయం భారత్ దృష్టిలో పవిత్రమైన నైతిక విధి అని మోదీ ఉద్ఘాటించారు. పారిస్ పర్యావరణ ఒప్పంద ప్రతిజ్ఞలను గడువుకు ముందే నెరవేర్చిన తొలి దేశం భారతేనని గుర్తు చేశారు. ‘‘భూమి ఆరోగ్యంపైనే ప్రజారోగ్యం ఆధారపడి ఉంది. ఈ విషయంలో సంపన్న దేశాలపై గురుతర బాధ్యత ఉంది’’అన్నారు. ‘‘బ్రిక్స్ సారథిగా మానవత్వం, పర్యావరణ న్యాయం తదితరాలకు భారత్ పెద్దపీట వేస్తుంది. సమర్థ కూటమిగా బ్రిక్స్పనితీరుకే సరికొత్త నిర్వచనమిస్తుంది’’ అని మోదీ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది భారత్ బ్రిక్స్ సారథ్య పగ్గాలు చేపట్టనున్న విషయం తెలిసిందే. ఎలాంటి విపత్తులనైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్నివేళలా సిద్ధంగా ఉండాల్సిన అవసరం చాలా ఉందంటూ కరోనా మహమ్మారిని ప్రధాని ఉటంకించారు. ‘‘వైరస్లు వీసాలు తీసుకుని రావని కరోనా నిరూపించింది. వాటి పరిష్కారాలు కూడా పాస్పోర్టులను చూసి ఎంపిక చేసుకునేవి కావు’’ అంటూ చమత్కరించారు. వర్ధమాన దేశాలు ఆత్మవిశ్వాసం విషయంలో సంపన్న దేశాలకు ఏ మాత్రమూ తీసిపోవద్దని సూచించారు.

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్కి చెందిన కుటుంబం సజీవ దహనం
కుత్బుల్లాపూర్: అమెరికాలోని డాలస్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనమయ్యారు. ఆదివారం రాంగ్ రూట్లో వచ్చిన ట్రక్కు కారును ఢీకొట్టింది. దీంతో కారులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి అందులో ప్రయాణిస్తున్న శ్రీ వెంకట్, తేజస్విని దంపతులతోపాటు కొడుకు సిద్ధార్థ, కూతురు మృద కాలిపోయారు. తిరుమలగిరికి చెందిన పశుపతినాథ్–గిరిజ దంపతుల కుమారుడు శ్రీ వెంకట్కు జీడిమెట్లకు చెందిన తేజస్వినితో 2013లో వివాహం జరిగింది.పశుపతినాథ్ కొంపల్లి ఎన్సీఎల్లో నివాసముంటున్నారు. ఉద్యోగ నిమిత్తం మూడేళ్ల క్రితం కుటుంబంతో సహా శ్రీ వెంకట్–తేజస్విని దంపతులు డాలస్కు వెళ్లారు. శ్రీ వెంకట్ సోదరి దీపిక అట్లాంటాలో ఉండగా, మూడు రోజుల క్రితం తల్లిదండ్రులతో కలిసి అక్కడకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వీరు ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొట్టగా మంటలు చెలరేగి నలుగురూ అక్కడికక్కడే మృతి చెందారు. అయితే వీరితో పాటు ప్రయాణించాల్సిన శ్రీవెంకట్ తల్లిదండ్రులు విమానంలో డాలస్కు వచ్చారు. తమ కొడుకు ఇంటికి రాలేదంటూ ఆరా తీయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Indonesia: అదృశ్యమైన రైతు.. భారీ కొండచిలువ కడుపులో..
జకార్తా: ప్రపంచంలో జరిగే కొన్ని ఘటనలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. ఇండోనేషియాలో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. పొలంలో అదృశ్యమైన ఒక రైతు 26 అడుగుల భారీ కొండచిలువకు చిక్కి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఆగ్నేయ సులవేసిలోని దక్షిణ బుటన్ జిల్లాలో చోటుచేసుకుంది.ఈ ఘటనపై సౌత్ బుటన్ ప్రాంతీయ విపత్తు నిర్వహణ సంస్థ (బీపీబీడీ) అత్యవసర, లాజిస్టిక్స్ విభాగం హెడ్ లావోడ్ రిసావల్ మాట్లాడుతూ ఒక రైతు శుక్రవారం ఉదయం తన తోటకు వెళ్లి తిరిగి రాలేదు. తరువాత అతనిని భారీ కొండచిలువ మింగినట్లు స్థానికులు గుర్తించారని తెలిపారు. తోటలో ఆ కొండచిలువ ఇబ్బంది పడటాన్ని చూసి, ఏదో భారీ జంతువును మింగి ఉంటుందని భావించి, దానిని చీల్చివేశారన్నారు. అప్పుడు వారు దాని కడుపులో రైతు మృతదేహాన్ని చూసి షాకయ్యారన్నారు.ఈ ప్రాంతంలో ఒక కొండచిలువ మనిషిని మింగడం ఇదే మొదటిసారని లావోడ్ రిసావల్ తెలిపారు.కాగా 2017లోనూ ఇండోనేషియాలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. అప్పట్లో 23 అడుగుల కొండచిలువ ఉబ్బిపోయి కనిపించడంతో, స్థానికులు దానిని చీల్చి చూడగా, దానిలో 25 ఏళ్ల యువకుని మృతదేహం ఉంది. ఈ తరహా భారీ కొండచిలువలు ఇండోనేషియా, ఫిలిప్పీన్స్లలో కనిపిస్తుంటాయి. ఇవి చిన్నచిన్న జంతువులపై దాడి చేస్తుంటాయి. మనుషులను మింగేందుకు అరుదుగా ప్రయత్నిస్తాయని సంబంధిత అధికారులు తెలిపారు.
జాతీయం

పుల్వామా దాడికి ‘ఈ-కామర్స్’ సాయం.. సంచలన వివరాలు వెల్లడి
న్యూఢిల్లీ: పుల్వామా దాడి(2019)కి పాల్పడిన ఉగ్రవాదులు ఈ-కామర్స్ ప్లాట్ఫారం ద్వారా పేలుడు పదార్థాలను సేకరించడం, తరలించడం చేశారని మనీలాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్ను పర్యవేక్షించే అంతర్ ప్రభుత్వ సంస్థ (ఎఫ్ఏటీఎఫ్) తెలిపింది. ఉగ్రవాద సంస్థలు ఇటీవలి కాలంలో డిజిటల్ సాధనాలను, ఆర్థిక సాంకేతిక పరిజ్ఞానాలను విరివిగా వినియోగిస్తున్నాయని, నిధులను సేకరించడం, తరలించడం, నిర్వహించడం మొదలైనవాటికి ఈ-కామర్స్ ప్లాట్ఫారంలను ఉపయోగించుకుంటున్నాయని ఎఫ్ఏటీఎఫ్ వెల్లడించింది.2019 నాటి పుల్వామా దాడి, 2022 నాటి గోరఖ్ నాథ్ ఆలయ సంఘటనలు దీనికి ఉదాహరణలుగా నిలిచాయని ఎఫ్ఏటీఎఫ్ పేర్కొంది. 2019 పుల్వామా దాడిలో ఈ-కామర్స్ సాయంతో పేలుడు పదార్థాలను సేకరించారని, 2022లో గోరఖ్నాథ్ ఆలయంపై జరిగిన దాడి ఘటనలో ఐఎస్ఎస్ నిధులు సమకూర్చడానికి ‘పేపాల్’, వీపీఎన్లను ఉపయోగించారని ఎఫ్ఏటీఎఫ్ తన రిపోర్టులో వెల్లడించింది. ఫుల్వామా ఉగ్రదాడిలో ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైసెస్ (ఐఈడీ)ల పేలుడు శక్తిని పెంచడానికి ఉపయోగించే కీలకమైన పదార్థాలను ఉగ్రవాద సంస్థలు ఈ కామర్స్ ప్లాట్ఫారం అమెజాన్ నుంచి తెప్పించుకున్నాయని తేలింది.పుల్వామా దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణించారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ ఈ దాడికి పాల్పడింది.ఈ దాడిలో లాజిస్టిక్స్ కోసం ఆన్లైన్ ప్లాట్ఫారమ్లు ప్రత్యేక పాత్ర పోషించాయని పరిశోధకులు చెబుతున్నారు. 2022లో గోరఖ్ నాథ్ ఆలయంపై ఐఎస్ఎస్ ప్రేరేపిత వ్యక్తి దాడి చేశాడు. ఈ ఘటనలో పాల్గొన్న నిందితుడు ‘పే పాల్’ సాయంతో రూ. 6.7 లక్షలను విదేశాలకు బదిలీ చేశాడని ఎఫ్ఏటీఎఫ్ తెలిపింది. అలాగే నిందితుడు తాను రహస్యంగా ఉండేందుకు వీపీఎన్ సేవలను వినియోగించుకున్నాడని పేర్కొంది.

భగ్గుమన్న బీహార్.. ఒకవైపు బంద్.. మరోవైపు ‘ఇండియా’ నిరసనలు
పట్నా: ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో బీహార్ భగ్గుమంటోంది. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణతో పాటు నూతన కార్మిక నియమావళికి వ్యతిరేకంగా రాష్ట్రంలో నిరసనలు ఏకకాలంలో జరుగుతున్నాయి. 10 కేంద్ర కార్మిక సంఘాలు భారత్ బంద్లో యాక్టివ్గా పాల్గొంటున్నాయి. భారత ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) రూపొందించిన ఎన్నికల జాబితాకు వ్యతిరేకంగా పట్నాలో నిరసనలు మొదలయ్యాయి. VIDEO | Bihar Bandh: Congress workers stage protest on railway tracks at Sachiwalay Halt in Patna.RJD, Congress, and other Mahagathbandhan opposition parties have called for a bandh in protest against the special intensive revision of electoral rolls in the state.(Full video… pic.twitter.com/s2Klx5nyvt— Press Trust of India (@PTI_News) July 9, 2025ఉదయం 10 గంటలకు రాహుల్ గాంధీ ఈ నిరసనల్లో పాల్గొననున్నారు. లంబార్లోని ఆదాయపు పన్ను కార్యాలయం నుంచి ఎన్నికల కమిషన్ కార్యాలయం వరకు జరిగే నిరసన ప్రదర్శనల్లో రాహుల్ పాల్గొననున్నారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కూడా ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొంటారు. రాష్ట్రంలోని హాజీపూర్, సోన్పూర్లలో పోలీసుల సమక్షంలో నిరసనలు జరిగాయి. రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కు వ్యతిరేకంగా ఆర్జేడీ, ఇతర మహాఘటబంధన్ మిత్రపక్షాలు బీహార్లోని రోడ్లపై నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఆందోళనకారులు రోడ్లపై టైర్లను కాలుస్తూ, రహదారులను దిగ్బంధనం చేస్తున్నారు. జెహానాబాద్లో ఆర్జేడీ విద్యార్థి విభాగం రైల్వే పట్టాలపై నిరసనలకు దిగింది.VIDEO | Bihar Bandh: Barricades installed and security heightened at the Election Commission Office in Patna in view of a protest by the opposition parties against the special intensive revision of electoral rolls in the state. RJD leader Tejashwi Yadav and Congress MP Rahul… pic.twitter.com/l24KTT9PtO— Press Trust of India (@PTI_News) July 9, 2025లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్లు సంయుక్తంగా బీహార్లో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలను సవరించాలన్న నిర్ణయంపై నిరసన వ్యక్తంచేస్తున్నారు. అలాగే ఈ ఇరువురు నేతలు నూతన కార్మిక నియమావళిని అమలు చేయాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ నిరసనలకు ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, వికాస్షీల్ ఇన్సాన్ పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ మాట్లాడుతూ బీహార్ అంతటా నిరసనలు కొనసాగుతున్నాయని తెలిపారు.

Bharat Bandh: సమ్మెకు దిగిన 25 కోట్ల కార్మికులు.. ప్రజాసేవలకు విఘాతం
న్యూఢిల్లీ: ఈరోజు(బుధవారం) దేశవ్యాప్తంగా 25 కోట్లకు పైగా ప్రభుత్వ రంగ కార్మికులు సమ్మెకు దిగనున్నారు. బ్యాంకులు, పోస్టల్, బొగ్గు గనులు, ప్రజా రవాణా, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడనున్నారు. రైళ్ల రాకపోకల్లో ఆలస్యంతో పాటు విద్యుత్ సరఫరా అంతరాయాలు సంభవించే అవకాశం ఉంది.కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ, వివిధ ప్రభుత్వ రంగాలకు చెందిన 25 కోట్లకు పైగా కార్మికులు దేశవ్యాప్త భారీ సమ్మెకు సిద్ధమయ్యారు. రైతు సంఘాలు, గ్రామీణ కార్మిక సంఘాల మద్దతుతో 10 కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక భారత్ బంద్కు పిలుపునిచ్చింది.ఈ రంగాల్లో తీవ్ర ప్రభావంబ్యాంకింగ్,బీమా సేవలుపోస్టల్ కార్యకలాపాలుబొగ్గు గనులు, పారిశ్రామిక ఉత్పత్తిప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రజా రవాణాప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ యూనిట్లుగ్రామీణ ప్రాంతాల్లో రైతుల నిరసనలుస్వల్ప ప్రభావంపాఠశాలలు, కళాశాలలుప్రైవేట్ కార్యాలయాలురైలు సేవల్లో స్వల్ప ఆటకందేశవ్యాప్తంగా రైతులు, గ్రామీణ కార్మికులు కూడా ఈ నిరసనల్లో పాల్గొంటారని ఏఐటీయూసీ నేత అమర్జీత్ కౌర్ తెలిపారు. ప్రభుత్వం తమ 17 అంశాల డిమాండ్ జాబితాను విస్మరించిందని, గత పదేళ్లలో ఒక్క వార్షిక కార్మిక సమావేశాన్ని కూడా నిర్వహించలేదని కౌర్ పేర్కొన్నారు. భారత్ బంద్ దేశవ్యాప్తంగా పలు సేవలకు అంతరాయం కలిగిస్తుందని, ముఖ్యంగా బ్యాంకింగ్, పోస్టల్, బొగ్గు గనులు, కర్మాగారాలు, రాష్ట్ర రవాణా సేవలు సమ్మె కారణంగా ప్రభావితమవుతాయని హింద్ మజ్దూర్ సభ నేత హర్భజన్ సింగ్ సిద్ధూ మీడియాకు తెలిపారు.సమ్మెలో పాల్గొంటున్న యూనియన్లుఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (AITUC)ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (INTUC)ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ సెంటర్ (CITU)హింద్ మజ్దూర్ సభ (HMS)స్వయం ఉపాధి మహిళా సంఘం (SEWA)లేబర్ ప్రోగ్రెసివ్ ఫెడరేషన్ (LPF)యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (UTUC)మద్దతు పలుకుతున్న సంఘాలుసంయుక్త కిసాన్ మోర్చా తదితర రైతు సంఘాలుగ్రామీణ కార్మిక సంఘాలురైల్వేలు, ఎన్ఎండీసీ లిమిటెడ్, ఉక్కు పరిశ్రమల ప్రభుత్వ రంగ సిబ్బందిపార్లమెంట్ ఆమోదించిన నాలుగు కొత్త కార్మిక కోడ్లను కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ కోడ్ల కారణంగా కార్మికుల హక్కులు దెబ్బతింటాయని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ప్రభుత్వ రంగ యూనిట్ల ప్రైవేటీకరణ, ఉద్యోగాల అవుట్సోర్సింగ్ మొదలైన విధానాలను కార్మిక సంఘాలు ప్రతిఘటిస్తున్నాయి. 2020, 2022, 2024లలో జరిగిన ఈ తరహా దేశవ్యాప్త సమ్మెలలో లక్షలాది మంది కార్మికులు రోడ్లపైకి వచ్చి తమ నిరసన తెలిపారు.

‘మీడియాను టచ్ చేయొద్దు’: రాజ్థాక్రే కీలక ఆదేశాలు
ముంబై: మహారాష్ట్రలోని థానేలో మరాఠీలో మాట్లాడేందుకు నిరాకరించిన ఫుడ్ స్టాల్ యజమానిపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) దాడి చేసిన దరిమిలా రాష్ర్టంలో బాషా వివాదం మరింతగా ముదిరింది. ఈ నేపధ్యంలో పార్టీ చీఫ్ రాజ్థాక్రే.. పార్టీ నేతలకు, కార్యకర్తలకు కీలక ఆదేశాలు జారీచేశారు. తన అనుమతి లేకుండా పార్టీలోని ఎవరూ కూడా మీడియాతో మాట్లాడవద్దని సూచించారు. అలాగే సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేయవద్దని కోరారు.మీడియాతో మాట్లాడే బాధ్యత కలిగిన పార్టీ నేతలు, సభ్యులు ఏదైనా కమ్యూనికేట్ చేసేముందు తన అనుమతి తీసుకోవాలని రాజ్థాక్రే సూచించారు. అయితే వారు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేయకూడదన్నారు. ఈ విషయాన్ని ఆయన ‘ఎక్స్’లో ఒక పోస్టులో తెలియజేశారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేష్మా తపసే బాషా వివాదంపై వ్యాఖ్యలు చేసిన దరిమిలా.. రాజ్థాక్రే ఈ విధమైన ఆదేశాలు జారీచేశారు. మరాఠీని గౌరవించని ఎవరిపైన అయినా పార్టీ దేశద్రోహం కేసులు నమోదు చేస్తుందని రేష్మా తపసే పేర్కొన్నారు. "Do Not Talk To Media": Raj Thackeray's Message To MNS Leaders https://t.co/dU1pAWiIkb pic.twitter.com/xEgDwN0e4e— NDTV (@ndtv) July 8, 2025భాష పేరుతో పోరాటం చేస్తున్న తమ నేతలు, కార్యకర్తలు పలు కేసులు ఎదుర్కొంటున్నారని తపసే పేర్కొన్నారు. తనపై కూడా ఇటువంటి కేసులు ఉన్నాయని, ఇది పెద్ద విషయం కాదన్నారు. ఇక్కడికి వచ్చి, స్థిపడిపడివారు మరాఠీలో మాట్లాడాలా వద్దా అనేది నిర్ణయించుకోవాలన్నారు. కాగా విలేకరి ఆమెను మీరు కర్నాటక వెళితే కన్నడ మాట్లాడుతారా? అని అడగగా, ఆమె తనకు కన్నడ బాష రాదని, కర్నాటకకు ఎప్పుడూ వెళ్లలేదని అన్నారు.
ఎన్ఆర్ఐ

మోదీకి 'హలో' చెప్పేందుకు వచ్చా..! భారత సంతతి వ్యక్తి
పధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల పర్యటనలో ఉన్న సంగతి తెలిసింది. అందులో భాగంగా ఈ రోజు (శనివారం) ఉదయం అర్జెంటినాకు చేరుకున్నారు. ఆయనకు బ్యూనస్ ఎయర్లోని భారత సంతతి ప్రజలు ఘన స్వాగతం పలికారు. అక్కడ ఆయన అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీతో చర్చలు జరపనున్నారు. ఈ నేపథ్యంలో విజయగుప్తా అనే భారత సంతతి వ్యక్తి మోదీని కలిసినందుకు సంతోషం వ్యక్తం చేశాడు. తాను ప్రధాని మోదీకి హలో చెప్పేందుకే 400 కి.మీ ప్రయాణించి మరి వచ్చానని అన్నారు. ఆయనకు జస్ట్ హలో చెప్పాలనుకున్నా..కానీ నాకు మోదీకే కరచలనం(షేక్హ్యాండ్) ఇచ్చే అవకాశం లభించిందంటూ ఉబ్బితబ్బిబవుతున్నాడు. ఇదిలా ఉండగా మోదీ ఒక ట్వీట్లో అర్జెంటీనా పర్యటన గురించి పంచుకున్నారు. "నేను ఈరోజు అర్జెంటీనాతో సంబంధాలను పెంపొందించుకోవడంపై దృష్టి సారించే ద్వైపాక్షిక పర్యటన కోసం బ్యూనస్ ఎయిర్స్లో అడుగుపెట్టాను. ప్రస్తుతం అర్జెంటినా అధ్యక్షుడు జేవియర్ మిలీని కలిసి చర్చలు జరిపేందుకు చాలా ఆసక్తిగా ఉన్నాను" అని ట్వీట్ చేశారు.అలాగే విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కూడా ఈ 57 ఏళ్లలో భారత ప్రధాని అర్జెంటీనాలో చేసిన తొలి ద్వైపాక్షిక పర్యటన ఇదే అని ట్వీట్ చేశారు. కాగా, మోదీ బ్యూనస్ ఎయిర్స్లోని హోటల్కు చేరుకోగానే 'భారత్ మాతా కీ జై', 'జై శ్రీ రామ్' అనే నినాదాలతో ఘన స్వాగతం పలికారు ప్రవాస భారతీయులు. ఆయన ఇప్పటికే ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగోలను సందర్శించారు. ఇక ఈ అర్జెంటీనా పర్యటన తదనంతరం బ్రెజిల్, నమీబియాలను సందర్శించనున్నారు.#WATCH | Buenos Aires, Argentina: Vijay Kumar Gupta, a member of the Indian diaspora, says, "I have come here from Rosario, which is 400 kilometres from here, just to say hello to Prime Minister Narendra Modi. I got the opportunity to shake hands with him..." https://t.co/7yZBOqwXFT pic.twitter.com/jS0uoHPGUn— ANI (@ANI) July 5, 2025 (చదవండి: ఎవరా 'బీహార్ కీ భేటీ'?.. మోదీ మనసులో కరేబియన్ ప్రధానికి ప్రత్యేక స్థానం)

ట్రంప్ మెగా బిల్లు: ఎన్నారైలకు బిగ్ అలర్ట్
ట్రంప్ కలల బిల్లు.. బిగ్ బ్యూటిఫుల్ బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. గురువారం సుదీర్ఘ చర్చ అనంతరం జరిగిన ఓటింగులో బిల్లు ఆమోదం పొందింది. అంతకుముందు ఈ బిల్లుకు సెనెట్లో ఆమోదం లభించింది. ట్రంప్ సంతకం తర్వాతనీ ఈ బిల్లు చట్టంగా మారనుంది. అటు అమెరికా రాజకీయాల్లో, ఇటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అంశంగా నిపుణులు ఈ బిల్లును భావిస్తున్నారు. అయితే ఇది ఎన్నారైలపై ఎంతంగా ప్రభావం చూపించనుందో ఓ లుక్కేద్దాం.. నగదు బదిలీలపై 1% రెమిటెన్స్ పన్ను2026 జనవరి 1 నుంచి, అమెరికా నుంచి భారత్కు పంపే నగదు ఆధారిత బదిలీలపై 1% పన్ను విధించనున్నారు.నగదు, మనీ ఆర్డర్, చెక్కుల రూపేణా పంపేవాటికి ఇది వర్తిస్తుంది. మొదట ఇది 5%గా ప్రతిపాదించబడింది. తర్వాత 3.5%కి తగ్గించి చివరకు 1 శాతంగా నిర్ణయించారు. ఇది చిన్న మొత్తంగా అనిపించినా.. తరచూ డబ్బు పంపే కుటుంబాలకు ఇది లక్షల్లో అదనపు భారం కానుంది.అయితే డిజిటల్ మార్గాలు ఉపయోగించే వారు పన్ను నుంచి తప్పించుకోవచ్చు. అయితే.. భారత్లో గ్రామీణ ప్రాంతాల్లో, అలాగే వయసు పైబడినవాళ్లు ఇంకా నగదు మార్గాన్నే నమ్ముకుంటున్నారనేది గుర్తించాల్సిన విషయం. ఉదాహరణకు.. నెలకు $500 పంపే వ్యక్తి.. ఏడాదికి $6,000 పంపుతాడు. బిగ్ బ్యూటీఫుల్ బిల్లు అమల్లోకి వస్తే.. $60 అదనపు పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఇది చిన్న మొత్తంగా అనిపించినా.. గణనీయమైన భారంగానే మారనుంది.భారత్కు వచ్చే రెమిటెన్స్లో తగ్గుదలబిగ్ బ్యూటిఫుల్ బిల్ (Big Beautiful Bill) ద్వారా అమెరికా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 1% రెమిటెన్స్ పన్ను ప్రభావం కేవలం ప్రవాస భారతీయులకే కాదు, భారత ఆర్థిక వ్యవస్థ మొత్తానికే గణనీయంగా ఉండనుంది. రెమిటెన్స్ (Remittance) అంటే ఒక వ్యక్తి విదేశంలో పని చేసి, అక్కడి నుంచీ తన స్వదేశంలోని కుటుంబానికి లేదా ఖాతాకు డబ్బు పంపడం.2023–24లో భారత్కు వచ్చిన మొత్తం రెమిటెన్స్ 135.46 బిలియన్ డాలర్లు. అందులో 32 బిలియన్ డాలర్లు అమెరికా నుంచే వచ్చింది. అయితే1% పన్ను విధానం వల్ల 10–15% తగ్గుదల నమోదయ్యే అవకాశం ఉంది. అంటే.. 12–18 బిలియన్ డాలర్ల వరకు నష్టం జరగవచ్చు. రెమిటెన్స్లు భారతదేశానికి విదేశీ కరెన్సీ ప్రవాహంలో ప్రధాన భాగం. కాబట్టి ఈ తగ్గుదల వల్ల విదేశీ మారక నిల్వలపై ప్రభావం పడుతుంది. డాలర్ నిల్వలు తగ్గి, రూపాయి విలువపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది ద్రవ్యోల్బణం (inflation) పెరగడానికి దారితీయవచ్చు. అదే సమయంలో..రెమిటెన్స్లు అనేక కుటుంబాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. ముఖ్యంగా కేరళ, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో అనేక కుటుంబాలకు. అయితే.. డబ్బు తక్కువగా రావడం వల్ల విద్య, వైద్యం, పెళ్లిళ్లు, గృహ నిర్మాణం వంటి అవసరాలపై ప్రభావం పడుతుంది.ఇంకోవైపు.. బ్యాంకింగ్ వ్యవస్థపై ఇది ప్రభావం చూపించనుంది. రెమిటెన్స్ తగ్గితే బ్యాంకుల డిపాజిట్లు తగ్గుతాయి, ఇది వడ్డీ రేట్ల పెరుగుదలకు దారితీయవచ్చు.మరీ ముఖ్యంగా గ్రామీణ బ్యాంకింగ్ సేవలపై ప్రభావం ఉండే అవకాశం ఉంది. వలసలకు ఇక గడ్డు కాలమే?ఈ బిల్లుతో వలస నియంత్రణ మరింత కఠినతరం కాబోతోంది. వీసా ఫీజులు పెరిగాయి. H-1B, L-1 వీసాలతో పాటు ఆశ్రయం దరఖాస్తులకు(Asylum Applications) భారీ రుసుములు విధించబడ్డాయి. అక్రమంగా వచ్చినవారిపై ఓ రేంజ్లో జరిమానాలు విధించాలని నిర్ణయించారు. డిపోర్టేషన్ బలగాల విస్తరణ వంటి చర్యలు ప్రవేశపెట్టబడ్డాయి. అక్రమ వలసదారులను తనిఖీలు చేయడం.. అవసరమైతే అక్కడికక్కడే అరెస్టులు చేసే అవకాశాలు ఉంటాయి. ఇది అమెరికాలో ఉన్న ఎన్నారైలకు మాత్రమే కాదు.. అక్కడ చదువుతున్న విద్యార్థులకు, ఉద్యోగార్థుల్లో కూడా భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. మొత్తంగా.. అమెరికాలో శాశ్వత నివాసం అనే కలకు బిగ్ బ్యూటీఫుల్ బిల్ ఒక శరాఘాతంగా పరిణమించబోతోందనే చెప్పొచ్చు.పెట్టుబడి ప్రణాళికల్లో మలుపులు!కార్పొరేట్ సంస్థలు, పెద్ద స్థాయి పెట్టుబడిదారులకు ఈ బిల్లుతో పన్ను మినహాయింపులు ఉన్నా.. ఎన్నారైల వాస్తవ ప్రయోజనాలు మాత్రం పరిమితంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ప్రత్యేకంగా పన్ను రీఫండ్లు U.S. పౌరులకు మాత్రమే వర్తించడంతో, ఎన్నారైల ఆసరా మరింత దెబ్బతినే అవకాశమే కనిపిస్తోంది.సాధారణంగా రియల్ ఎస్టేట్ అనేది ప్రవాస భారతీయులకు కేవలం పెట్టుబడి కాదు.. భారత్తో అనుబంధానికి ఆధారం కూడా. ఈ పన్ను వల్ల భారత్లో ఆస్తుల కొనుగోలు లేదా అమ్మకానికి సంబంధించిన పెద్ద మొత్తాల బదిలీలపై అదనపు ఖర్చు వస్తుంది. అలాంటి సందర్భంలో ఈ పన్ను వారి ఆర్థిక ప్రయోజనాలపై కాదు, భావోద్వేగాలపై కూడా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.ఈ క్రమంలో.. దీర్ఘకాలికంగా ఆస్తులు కొనాలని భావించిన వారు, ఇప్పుడు పన్ను అమలుకు ముందు ముందుగా డబ్బు పంపించి కొనుగోలు పూర్తిచేయాలని చూస్తున్నారు. ఇది ఒక రకంగా బిల్లు అమలుకు ముందు ఆస్తి రద్దీ(Rush) అనే పరిస్థితిని తెచ్చింది. దీంతో పన్ను అమలుకు ముందు తాత్కాలికంగా బదిలీల పెరుగుదల జరిగే అవకాశం నిపుణులు అంచనా వేస్తున్నారు. రియల్ ఎస్టేట్తో పాటు విద్య, ఆరోగ్య ఖర్చులపై కూడా ఇది ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. కంప్లయన్స్ భారముఎన్నారైలు బిగ్ బ్యూటీఫుల్ బిల్లును క్షుణ్ణంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్నారైలు తమ ఆర్థిక ప్రణాళికలను మరింత జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరాన్ని తెచ్చి పెట్టింది. ఎటువంటి మార్గంలో డబ్బు పంపుతున్నారో జాగ్రత్తగా గమనించాలి. లేకపోతే అనవసర పన్నులు పడే అవకాశం ఉంది. కఠినమైన KYC నిబంధనలతో పాటు NRE/NRO ఖాతాలపై నియంత్రణ ఉంటుంది. తద్వారా పాస్పోర్ట్, వీసా, నివాస ధృవీకరణ వంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం పెరుగుతుంది. డబ్బు ఎలా అమెరికా దాటి పోతుంది అనే దానిపై మరింత పర్యవేక్షణ ఉంటుంది. పన్ను రీఫండ్లు కేవలం అమెరికా పౌరులకు మాత్రమే వర్తిస్తాయి — NRIs కు కాదు. అంటే, గ్రీన్ కార్డు హోల్డర్లు, H-1B వీసాదారులు, ఇతర ఎన్నారైలు ఈ ప్రయోజనాలను పొందలేరు.కాబట్టి ఈ బిల్లు ప్రవాస భారతీయులపై (NRIs) కేవలం పన్ను భారం మాత్రమే కాదు, నియంత్రణ (compliance) భారాన్ని కూడా పెంచుతోంది. ఇది పెద్ద మొత్తంలో డబ్బు పంపే వారికి మాత్రమే కాదు, చిన్న మొత్తాల్లో తరచూ పంపే వారికి కూడా అదనపు కాగితాలు, సమయం, ఖర్చు పెరుగుతాయి.ఎన్నారైలు డబ్బు పంపడాన్ని తగ్గిస్తే, భారత్లోని కుటుంబాల ఆదాయం తగ్గుతుంది. ఇది వారి వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలతో పాటు కుటుంబాలపై, చివరికి భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపేలా ఉంది. ఏంటీ బిగ్ బ్యూటీఫుల్ బిల్లు?అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఒక విస్తృత ఆర్థిక, పన్ను, వలస విధానాల చట్టం. పన్నుల్లో కోతలు, వ్యయ నియంత్రణే లక్ష్యంగా తెస్తున్నట్లు చెబుతున్నారాయన.పన్ను కోతలు2017లో అమలైన పన్ను కోతలను శాశ్వతం చేస్తుంది.కార్పొరేట్ కంపెనీలు, ఉన్నత ఆదాయ వర్గాలకు పన్ను మినహాయింపులు కల్పిస్తుంది.టిప్పులు, ఓవర్టైమ్పై పన్ను మినహాయింపుటిప్ ఆదాయం పై పన్ను రద్దు, ఓవర్టైమ్ ఆదాయంపై $12,500 వరకు మినహాయింపు.చైల్డ్ టాక్స్ క్రెడిట్ పెంపుపిల్లలపై టాక్స్ క్రెడిట్ $2,000 నుంచి $2,200కి పెంపు.కానీ తక్కువ ఆదాయ కుటుంబాలకు ఇది పూర్తిగా వర్తించదు.1% రెమిటెన్స్ పన్నుఅమెరికా నుంచి భారత్ వంటి దేశాలకు నగదు బదిలీలపై 1% పన్ను విధించబడుతుంది.బ్యాంక్, డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా(డిజిటల్ లావాదేవీలు) పంపిన డబ్బుకు మినహాయింపు ఉంది.వలస నియంత్రణ కఠినతరంICE అధికారుల నియామకం, డిపోర్టేషన్ కేంద్రాల విస్తరణ, వీసా ఫీజుల పెంపు వంటి చర్యలు ఉన్నాయి.మెడికేడ్, ఫుడ్ స్టాంపులపై కోతలుతక్కువ ఆదాయ గల అమెరికన్లకు ఆరోగ్య, ఆహార సహాయ కార్యక్రమాల్లో కోతలు విధించబడ్డాయి.పునరుత్పాదక శక్తికి ఎదురుదెబ్బసౌర, గాలి శక్తి పథకాలపై పన్ను రాయితీలు తగ్గించబడ్డాయి, ఇది గ్రీన్ ఎనర్జీ రంగానికి నష్టంగా మారుతుంది.లాభాలు ఎవరికీ?కార్పొరేట్ కంపెనీలు, ఉన్నత ఆదాయ వర్గాలు, టిప్/ఓవర్టైమ్ వేతనదారులు లాభపడతారు. కానీ తక్కువ ఆదాయ గల కుటుంబాలు, వలసదారులు, పునరుత్పాదక శక్తి రంగం నష్టపోతాయి.ప్రతిపక్షాల అభ్యంతరాలుడెమొక్రాట్లు, సామాజిక కార్యకర్తలు ఈ బిల్లును "సంపన్నులకు లాభం, సామాన్యులకు నష్టం" అని విమర్శిస్తున్నారు. హకీం జెఫ్రీస్ అనే నేత 8 గంటల పాటు బిల్లుకు వ్యతిరేకంగా ప్రసంగించారు.

ఎవరా 'బీహార్ కీ భేటీ'?.. మోదీ మనసులో కరేబియన్ ప్రధానికి ప్రత్యేక స్థానం
ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ట్రినిడాడ్ అండ్ టొబాగోకి చేరుకున్నారు. అక్కడ పోర్ట్ ఆప్ స్పెయిన్లోని పియార్కో అంతర్జాతీయ విమానశ్రయంలో ఆయనకు ఆ దేశ మిలటరీ సైనికులచే గౌరవ వందనం లభించింది. అంతేగాదు కరేబియన్ దేశ ప్రధాన మంత్రి కమలా పెర్సాద్-బిస్సేసర్(Kamla Persad-Bissessar)తో సహా 38 మంత్రులు, నలుగురు పార్లమెంట్ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆ స్వాగత సమయంలో ట్రినిడాడ్ అండ్ టొబాగొ మంత్రి కమలా పెర్సాద్ భారతీయ దుస్తుల్లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. కానీ మన మోదీ ఆ దేశ ప్రధాని కమ్లా పెర్సాద్ను 'బిహారీకా బేటి' అని పిలవడం విశేషం. అంతేగాదు ఆ దేశ ప్రజలను ఉద్దేశిస్తూ..భారత్కి ట్రినిడాడ్ అండ్ టొబాగోకి ఉన్న సంబంధబాంధవ్యాలతో సహా ఆ దేశ ప్రధాని భారత మూలాలకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మరి ఆ విశేషంలేంటో సవివరంగా చూద్దామా..!.ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ.. ఈ కరేబియన్ దేశ ప్రధాని కమలా పెర్సాద్- మా బిహార్ కా భేటి అని సగర్వంగా చెప్పారు. ఆ ప్రధాని పూర్వీకులు బిహార్లోని బక్సర్కు చెందినవారని, ఆమె కూడా భారతదేశంలోని ఆ ప్రాంతాన్ని సందర్శించారని తెలిపారు. మాకు ఈ దేశంతో కేవలం రక్త సంబంధం లేదా ఇంటి పేరుతోనో బంధం ఏర్పడలేదని అంతకుమించిన బాంధవ్యం ఇరు దేశాల నడుమ ఉందని అన్నారు. స్నేహం చిగురించింది ఇలా..అలాగే ఇరు దేశాల మధ్య స్నేహం ఎలా చిగురించిందో కూడా గుర్తు చేసుకున్నారు. బనారస్, పాట్నా, కోల్కతా, ఢిల్లీ వంటి నగరాలు భారతదేశంలోనే కాకుండా ట్రినిడాడ్లో వీధి పేర్లుగా కూడా ఉన్నాయని చెప్పారు. అలా ఈ రెండు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు అత్యంత బలంగా ఉన్నాయన్నారు. అందుకు నిదర్శనం ఇక్కడ జరుపుకునే నవరాత్రులు, మహాశివరాత్రి, జన్మాష్టమి వంటి పండుగలేనని అన్నారు. ఈ దేశ పురాతన చౌతల్(సంగీతం), భైతక్(వ్యాయామం) ఎంత ప్రాచుర్యం పొందాయో తెలుసనని అన్నారు. ఇక ఇక్కడ సుమారు 5 లక్షల మందికి పైనే భారత సంతతికి చెందినవారు నివసిస్తున్నారని, వారిలో దాదాపు 1800 మంది ప్రవాస భారతీయులని, మిగిలినివారు 1845, 1917ల మధ్య భారతదేశం నుంచి ఒప్పంద కార్మికులుగా వలస వచ్చిన స్థానిక పౌరులేనని గుర్తుచేశారు. అందువల్ల మిమ్మల్ని భారత్ జాగ్రత్తగా చూసుకుంటుందని హామీ ఇచ్చారు. అంతేగాదు మా దేశం మీకు సదా ఆహ్వానం పలుకుతుందని చెప్పారు. అలాగే బిహార్ కూడా శతాబ్దాలుగా వివిధ రంగాలలో ప్రపంచానికి మార్గం చూపించదని చెప్పారు. 21వ శతాబ్దంలో కూడా బీహార్ నుంచి కొత్త అవకాశాలు ఉద్భవిస్తాయని అన్నారు.ఎవరీ కమలా పెర్సాద్..కమలా పెర్సాద్ బిస్సేసర్ 1987లో రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. అనేక చారిత్రక నిర్ణయాలతో పేరుతెచ్చుకున్న మంత్రి. అంతేగాదు ఆమె కరేబియన్ దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రి, అటార్నీ జనరల్, ప్రతిపక్ష నాయకురాలు కూడా. అలాగే కామన్వెల్త్ దేశాలకు అధ్యక్షత వహించిన తొలి మహిళ. అదీగాక తొలి భారత సంతతి మహిళా ప్రధానిగా కూడా ఘనత దక్కించుకున్నారామె.ఇక ఈ ట్రినిడాడ్ అండ్ టొబాగో భారతదేశంలోని జోధ్పూర్ కంటే చిన్నదేశమే అయినా..మాన భారతదేశ సంస్కృతి, ఆర్థికవ్యవస్థలో కీలక పాత్ర పోషించడం విశేషం. కాగా, ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని నివశిస్తున్న ఆరవతరం భారతీయ ప్రవాసులకు ఓసీఐ(ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా(OCI)) కార్డులు అదిస్తామని ప్రకటించారు మోదీ.#WATCH | Trinidad and Tobago | Addressing the Indian community, PM Modi says, "OCI cards will now be given to the 6th generation of the Indian diaspora in Trinidad and Tobago... We are not just connected by blood or surname, we are connected by belonging. India looks out to you… pic.twitter.com/hBU8tqCb9c— ANI (@ANI) July 4, 2025 (చదవండి: అమెరికా ఆఫీసులో భారతీయ మహిళ ఆకలి తిప్పలు..! పాపం ఆ రీజన్తో..)

గాల్లో ఉన్న విమానంలో టెన్షన్.. ప్రయాణికుడిపై ఇషాన్ శర్మ దాడి
వాషింగ్టన్: భారత సంతతి ఇషాన్ శర్మ విమానంలో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడి మధ్య వాగ్వాదం జరిగింది. మాటా మాట పెరిగి చివరకు తన్నుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలో ఇషాన్ తీవ్రంగా గాయపడ్డాడు. విమానం ల్యాండింగ్ అయిన తర్వాత ఇషాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. భారత సంతతి వ్యక్తి ఇషాన్ శర్మ(21) అమెరికాలోని న్యూవార్క్లో నివసిస్తున్నాడు. జూలై 1న ఫిలడెల్ఫియా నుంచి ఫ్రాంటియర్ ఎయిర్లైన్స్ విమానంలో ప్రయాణించాడు. ఆ విమానం గాలిలో ఉన్న సమయంలో ఇషాన్ శర్మ నవ్వడం, ఏదో మాట్లాడటంపై ముందు సీటులో కూర్చొన్న కీన్ ఎవాన్స్ ఆందోళన చెందాడు. అనంతరం, క్యాబిన్ సిబ్బంది సహాయం కోరే బటన్ నొక్కాడు. అది గమనించిన ఇషాన్ శర్మ.. ఎవాన్స్ను అడ్డుకుని అతడి గొంతుపట్టుకుని కొట్టాడు. దీంతో, వారి మధ్య వాగ్వాదం పీక్ స్టేజ్కు చేరుకుంది.ఆగ్రహంతో ఎవాన్స్ కూడా తిరిగి శర్మను కొట్టడంతో అతడి కంటికి గాయమైంది. గొడవ పెద్దది కావడంతో విమాన సిబ్బంది వారిద్దరిని నిలువరించారు. ఆ విమానం మయామిలో ల్యాండ్ కాగానే భారత సంతతి వ్యక్తి ఇషాన్ శర్మను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇషాన్ శర్మ తనపై దాడికి ముందు ‘హా హ హ హ హ హ’ అంటూ నవ్వాడని, తనను కించపర్చడంతోపాటు చస్తావని బెదిరించినట్లు ఎవాన్స్ ఆరోపించాడు. అనంతరం, ఇషాన్ తరుఫు న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ.. ఇషాన్ శర్మ విమానంలో ధ్యానం చేస్తున్నాడని తెలిపారు. అయితే తనను ఎగతాళి చేస్తున్నట్లు, బెదిరిస్తున్నట్లుగా ఎవాన్స్ భావించడంతో వారిద్దరి మధ్య ఘర్షణ జరిగిందని చెప్పారు. అంతేగానీ, ఉద్దేశపూర్వకంగా ఎవాన్స్ను కొట్టలేదని క్లారిటీ ఇచ్చాడు. No more vacation…🫣| #ONLYinDADE * Man gets kicked off of Frontier flight after getting into altercation pic.twitter.com/us6ipoW5E7— ONLY in DADE (@ONLYinDADE) July 1, 2025
క్రైమ్

ఆరుగురిపై న్యూసెన్స్ కేసు నమోదు
కుత్బుల్లాపూర్: ప్రధాన చౌరస్తాల వద్ద భిక్షాటన చేసే వారితో పాటు హిజ్రాల ఆగడాలపై వచ్చిన కథనానికి పోలీసులు స్పందించారు. పేట్షిరాబాద్ సీఐ విజయవర్ధన్ సుచిత్ర చౌరస్తాలో ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు భిక్షాటన చేస్తూ వాహనదారులను ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న విషయాన్ని గుర్తించి సుమారు ఆరుగురిని అదుపులో తీసుకున్నారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి కోర్టులో ప్రవేశపెట్టారు. న్యూసెన్స్ కేసు కింద ఫైన్ వేశారు. ఇక మీదట రోడ్లపై అడుక్కోరాదని తేల్చి చెప్పారు.

జీవితంపై విరక్తితో నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు..!
హైదరాబాద్: జీవితంపై విరక్తి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వడిగినేని చైతన్య (35) సాఫ్ట్వేర్ ఉద్యోగి. గత ఏప్రిల్ 23న నాగ మౌనికతో వివాహమైంది. ఈ దంపతులు కేపీహెచ్బీ, 7వ ఫేజ్లోని ఎల్ఐజీ–43లో నివాసం ఉంటున్నారు. ఆషాఢ మాసం నేపథ్యంలో జూన్ 21న నాగ మౌనిక పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట గ్రామంలోని తల్లిగారింటికి వెళ్లింది. ప్రతిరోజూ ఆమె ఫోన్లో భర్తతో మాట్లాడుతూ ఉండేది. సోమవారం రాత్రి 10 గంటలకు ఫోన్లో అతనితో మాట్లాడింది. అప్పటికే తన భర్త దిగులుగా మాట్లాడటంతో కొద్ది సేపటి తర్వాత ఫోన్ కట్ అయింది. అనంతరం రాత్రి 11 గంటల ప్రాంతంలో చైతన్యకు ఫోన్ చేయగా ఎత్తలేదు. పలుమార్లు ప్రయత్నించినా స్పందన లేకపోవంతో వెంటనే తన మామకి సమాచారం అందించింది. వెంటనే కింది అంతస్తులోకి వెళ్లి చైతన్యను పిలవగా ఎంతకీ స్పందించకపోవడంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా.. చైతన్య సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించాడు. వెంటనే విషయాన్ని మౌనికకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఈ మేరకు మౌనిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో.. తన భర్త జీవితం పట్ల విసిగిపోయి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పేర్కొంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కేపీహెచ్బీ పోలీసులు చెప్పారు.

మాజీ మంత్రి ప్రసన్నకుమార్ హత్యకు పక్కా స్కెచ్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిని హత్య చేసేందుకు పక్కా ప్రణాళిక ప్రకారమే టీడీపీ మూకలు బరి తెగించాయి. దాడి దృశ్యాలు, వ్యూహాలను చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. నెల్లూరు నగరం నడిబొడ్డున గల నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇంట్లోకి సోమవారం రాత్రి మారణాయుధాలతో టీడీపీ మూకలు, రౌడీలు, పాత నేరస్తులు అక్రమంగా ప్రవేశించి విధ్వంసానికి పాల్పడ్డారు. తొలుత సీసీ కెమెరాలను ధ్వంసం చేసి ప్రసన్నకుమార్రెడ్డిని చంపేస్తామని కేకలు వేస్తూ బీభత్సం సృష్టించారు. ఈ ఘటనకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోలు దాడి ఎంత భయంకరంగా జరిగిందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి ఆదేశాలతో ప్రసన్నకుమార్రెడ్డి ఇంటికి వెళ్లిన టీడీపీ మూకలు, రౌడీలు ఆయన ఇంట్లో లేకపోవడంతో ధ్వంసరచనకు పాల్పడ్డారు. అంతా కుట్ర ప్రకారమే ప్రసన్నకుమార్రెడ్డి ఇంటికి సమీపంలోపి బారాషహీద్ దర్గా వద్ద రొట్టెల పండగ జరుగుతోంది. జనసందోహం భారీగా ఉండటంతో ఆ సమయంలో తాము ఏం చేసినా ఎవరూ గుర్తు పట్టే అవకాశం ఉండదని భావించిన టీడీపీ గూండాలు వాహనాల్లో పెద్దఎత్తున సుజాతమ్మ కాలనీకి చేరుకున్నారు. వాహనాలను దూరంగా పెట్టి అక్కడి నుంచి నడుచుకుంటూ ప్రసన్నకుమార్రెడ్డి ఇంటికి వచ్చారు. ఆయన ఇంట్లో లేరనే విషయం తెలిసి బీభత్సం సృష్టించారు. తొలుత దుండగులు ఇంటి ప్రధాన ద్వారంతోపాటు వెనుక వైపు ద్వారాల నుంచి లోపలికి ప్రవేశించారు. కొందరు ఇంట్లోకి ప్రవేశించగా.. మిగిలిన వారు ఇంట్లోని వారిని బయటకు వెళ్లనివ్వకుండా అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు.దీనిని బట్టి చూస్తే ప్రసన్నకుమార్రెడ్డిని హతమార్చేందుకు పక్కా స్కెచ్ వేసినట్టు స్పష్టమవుతోంది. దాడి ఘటనపై ప్రసన్నకుమార్రెడ్డి సోమవారం అర్ధరాత్రి అనుమానితుల పేర్లు ఉటంకిస్తూ.. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి తనను హత్య చేయించేందుకు పథకం పన్నారని ఫిర్యాదు చేశారు. అనుమానితుల పేర్లు కూడా పోలీసులకు ఇచ్చారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుని.. తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరారు. ఫిర్యాదు చేసి 24 గంటలు గడిచినా పోలీసులు కేసు నమోదు చేయకుండా తాత్సారం చేస్తున్నారు. పోలీసులొచ్చినా బెదరని మూకలు ప్రసన్నకుమార్రెడ్డి ఇంటిపై దాడి విషయం తెలుసుకున్న దర్గామిట్ట పోలీసులతోపాటు స్పెషల్ పార్టీ పోలీసులు పదుల సంఖ్యలో ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంటిబయట ఉన్న దుండగులు పరుగులు తీయగా.. ఇంట్లో విధ్వంసం చేస్తున్న రౌడీమూకలు ఏ మాత్రం బెదరలేదు. దాడి పూర్తయ్యాక తాపీగా నడుచుకుంటూ బయటకు వెళ్లారు. పోలీసులు వారిని పట్టుకునే అవకాశం ఉన్నా.. ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకోలేదు. దాడిని ఆపేందుకు అవకాశం ఉన్నా ఆ పని కూడా చేయలేదు. పోలీసులు అక్కడే ఉన్నా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి ఆదేశాల మేరకే దాడి పూర్తయ్యే వరకూ కిమ్మనకుండా ఉండిపోయారు. ఘటనను తప్పుదోవ పట్టించేందుకు మరో కుట్ర దాడి ఘటనను టీడీపీ నేతలు తప్పుదోవ పట్టించే కుట్రకు తెరలేపారు. ఆయన ఇంటిపై మహిళలు దాడి చేశారని, అభిమానులు దాడులు చేశారని, వారే దాడి చేసుకుని ఉండొచ్చనే ప్రచారానికి టీడీపీ నేతలు తెరతీశారు. తద్వారా ప్రజల్లో అనుమానాలు రేకెత్తించి.. అసలు వాస్తవాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానికులు కొందరు దాడి దృశ్యాలను వీడియోలు తీసి.. సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయడంతో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికీ పోలీసులు మాత్రం తమకేమీ తెలియదన్నట్టు, ప్రసన్నకుమార్రెడ్డి ఇంటిపై అసలు దాడే జరగలేదు అన్నట్టు ఇప్పటికీ వ్యవహరిస్తున్నారు. ప్రసన్నకుమార్ హత్యకు టీడీపీ భారీ కుట్రటీడీపీ రౌడీమూకలు మారణాయుధాలతో బీభత్సం సృష్టించారు మాజీ మంత్రి అనిల్కుమార్సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మాజీమంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిని హత్య చేసేందుకు టీడీపీ రౌడీమూకలు భారీ కుట్ర పన్ని మారణాయుధాలతో ఆయన ఇంట్లోకి రాత్రివేళ చొరబడ్డారని మాజీ మంత్రి కె.అనిల్కుమార్ యాదవ్ అన్నారు. ఆ సమయంలో ప్రసన్నకుమార్రెడ్డి ఇంట్లో లేకపోవడంతో రెచ్చిపోయిన టీడీపీ మూకలు జిల్లాలో ఎన్నడూ లేనివిధంగా బీభత్సం సృష్టించారన్నారు. సోమవారం రాత్రి ప్రసన్నకుమార్ ఇంటిపై జరిగిన దాడిపై ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన మాజీమంత్రులు అనిల్, ప్రసన్నకుమార్రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఆనం విజయ్కుమార్రెడ్డి, పార్టీ నేత వీరి చలపతిరావు ఏఎస్పీ సౌజన్యకు ఫిర్యాదు అందజేశారు. అనంతరం మీడియాతో అనిల్కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో పచ్చమూకలు దారుణ ఘటనకు శ్రీకారం చుట్టారని ధ్వజమెత్తారు. దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన నల్లపరెడ్డి కుటుంబంపై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం హేయమైన చర్య అన్నారు. టీడీపీ మూకలు వెళ్లిన సమయంలో ప్రసన్నకుమార్రెడ్డి తల్లి షాక్కు గురయ్యారని.. ఆమెకు జరగరానిది ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత అని నిలదీశారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, దాడికి పాల్పడిన వారి అనుచరులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఎవరి ప్రోద్బలం ఉందో, ఎవరు పంపించారో అందరికీ తెలుసన్నారు. ప్రనన్నకుమార్ ద్వారా ఇంకేమి నిజాలు బయటకు వస్తాయోనని భయపడి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారన్నారు. డబ్బుందన్న మదంతో డాన్లు కావాలని ఇలాంటి ఆగడాలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పోలీసుల తీరుకు అద్దం పడుతోందని దుయ్యబట్టారు. ఘటన జరుగుతున్న సమయంలో పోలీసులు పక్కనే ఉన్నా ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.నిజమే చెప్పాను.. వెనక్కి తగ్గను: ప్రసన్నకుమార్రెడ్డి మాజీ మంత్రి ప్రసన్నకుమార్రెడ్డి మాట్లాడుతూ.. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గురించి అంతా నిజమే చెప్పానని.. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. ఏడాది కాలంలో ఇప్పటివరకు ఆమె చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. ఆమె తనపై వ్యక్తిగత విమర్శ చేయడంతోనే నిజాన్ని ప్రజల ముందుంచానని చెప్పారు. మహిళలంటే తమకెంతో గౌరవం ఉందని, ఆమె తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం వల్లే తాను ఆమె గురించి ఉన్నది ఉన్నట్టుగా చెప్పానన్నారు. గంజాయి మత్తులో దాడి చేసిన వారిని, ఈ దాడులకు పురిగొల్పిన వారిపై వెంటనే చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేశారు.

'కాల్'కేయులు!
సాక్షి, హైదరాబాద్: ‘నాన్నా పులి..’సామెతను గుర్తుచేస్తున్నాయి కొందరి చేష్టలు. బాంబులు పెట్టారంటూ బెదిరింపు ఫోన్కాల్స్, ఈ–మెయిల్స్తో బెదరగొట్టడం.. పోలీసులు, బాంబ్ స్క్వాడ్ ఆఘమేఘాల మీద ఉరుకులు, పరుగులు పెట్టడం ఇటీవలి కాలంలో పెరిగిపోతోంది. వీటిల్లో చాలావరకు ఆకతాయితనంతోనో, శాడిజంతోనో చేసే కాల్స్ అయినా సరే..ప్రజా భద్రత దృష్ట్యా ఈ తరహా ఏ ఒక్క ఫోన్కాల్ను కానీ, ఈ–మెయిల్ను కానీ పట్టించుకోకుండా వదిలేసే పరిస్థితి ఉండదు. ఒకవేళ నిజంగానే బాంబు పేలుడు లాంటివి సంభవిస్తే ప్రాణ నష్టం భారీగా జరిగేందుకు అవకాశం ఉంటుంది. ప్రధానంగా విమానాశ్రయాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఈ తరహా నకిలీ బాంబు బెదిరింపు కాల్స్ పెరుగుతున్నాయి. తాజాగా మంగళవారం హైదరాబాద్లోని రాజ్భవన్, పాతబస్తీలోని సిటీ సివిల్ కోర్టు, జింఖానా క్లబ్, సికింద్రాబాద్ సివిల్ కోర్టుల్లో బాంబు పెట్టినట్టు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఈ–మెయిల్ రావడంతో కాసేపు గందరగోళం నెలకొంది. నిందితులు తాము చిక్కకుండా సాంకేతికతను ఉపయోగించి ఈ తరహా ఫోన్కాల్స్, ఈ–మెయిల్ చేస్తున్నట్టు పోలీసులు దర్యాప్తులో తేలుతోంది. ఐదేళ్లలో పెరిగిన కాల్స్, ఈ–మెయిల్స్ గత ఐదేళ్లలో (2020–2025) దేశంలో బాంబు బెదిరింపు కాల్స్ సంఖ్య గణనీయంగా పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ తరహా ఘటనల్లో ఎక్కువగా వీపీఎన్ (వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్) ఉపయోగించి విదేశాల నుంచి ఈ–మెయిల్స్ పంపుతున్నట్టు తెలుస్తోంది. గతంలో ఇలాంటి వారు ఫోన్కాల్స్ చేసేవారు, కానీ ఇటీవల ఈ–మెయిల్లు సోషల్ మీడియాకు మారడం, వీపీఎన్ వాడకంతో నేరస్థులను గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది. 2024లో దేశవ్యాప్తంగా ఇలాంటి బెదిరింపు కాల్స్ చేసిన వారిలో 13 మందిని అరెస్టు చేయగా.. అందులో తెలంగాణలో ఒకరిని అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపు కాల్స్ ఇలా.. » 2020–2021లో కోవిడ్ మహమ్మారి, లాక్డౌన్ కారణంగా ఇలాంటి కాల్స్ సంఖ్య తక్కువగా ఉంది. » 2022లో దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలకు సుమారు 100కు పైగా బాంబు బెదిరింపు కాల్స్ వచి్చనట్లు అధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. వీటిలో చాలావరకు నకిలీవిగా గుర్తించారు. హైదరాబాద్ సహా పలు నగరాల్లోని సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలకు ఈ తరహా బెదిరింపు కాల్స్ వచ్చాయి. » 2023లో బాంబు బెదిరింపుల సంఖ్య మరింత పెరిగింది. ఢిల్లీలోని స్కూళ్లు, ఆసుపత్రులు, మెట్రో స్టేషన్లకు బెదిరింపు కాల్స్, ఈ–మెయిల్స్ వచ్చాయి. ఈ ఏడాదిలో 500కు పైగా బెదిరింపు కాల్స్, ఈ–మెయిల్స్ నమోదయ్యాయి. వీటిల్లోనూ చాలావరకు ఉత్తుత్తివిగా తేలాయి. » 2024లో 997 బాంబు బెదిరింపు కాల్స్ నమోదయ్యాయి. 2024 జూన్లో ఒక్క రోజులోనే ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లో కలిపి 50కి పైగా విమానాశ్రయాలు, 40కి పైగా ఆసుపత్రులకు బెదిరింపు ఈ–మెయిల్స్ వచ్చాయి. అక్టోబర్లో రెండు వారాల్లోనే 500 విమానాలకు ఈ తరహా బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. » 2025 మొదటి ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా వందలాది బెదిరింపు కాల్స్, ఈ–ఇమెయిల్స్ నమోదయ్యాయి. జనవరిలో ఢిల్లీలోని 15కి పైగా ఆసుపత్రులు, పలు విమానాశ్రయాలకు బెదిరింపు ఈ–మెయిల్స్ వచ్చాయి. తెలంగాణలో ఇలా.. » 2022లో హైదరాబాద్లోని కొన్ని షాపింగ్ మాల్స్, స్కూళ్లకు బెదిరింపు ఈ–మెయిల్స్ వచ్చాయి. దర్యాప్తు తర్వాత ఇవి నకిలీవిగా తేలాయి.» 2023లో హైదరాబాద్లోని పలు స్కూళ్లు, కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు బెదిరింపు ఈ–మెయిల్స్ వచ్చాయి. వీటిల్లో ఎక్కువగా విదేశీ సర్వర్ల నుంచి వచ్చిన ఈ–మెయిల్స్ ఉన్నాయి. » 2024లో హైదరాబాద్లోని స్కూళ్లు, కాలేజీలు, రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బెదిరింపు ఈ–మెయిల్స్ వచ్చాయి. అక్టోబర్ 22న హైదరాబాద్లోని ఒక సీఆర్పీఎఫ్ స్కూల్కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. అదేవిధంగా మేలో ప్రజాభవన్, నాంపల్లి కోర్టులో బాంబు పెట్టినట్టు నకిలీ బెదిరింపు కాల్ చేసిన ఒక వ్యక్తిని హైదరాబాద్ సిటీ పోలీసులు అరెస్టు చేశారు. »2025లో మంగళవారం సిటీ సివిల్ కోర్టు సహా పలు చోట్ల బాంబులు పెట్టినట్టు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది.